ఓటే ఆయుధం..ఒకటై సాగుదాం!

అన్ని అంశాలు పాఠాలు చెప్తాయి. చారిత్రక అంశాలు గుణపాఠాలు నేర్పిస్తాయి’ ఇది తెలంగాణ ప్రజలను చైతన్యపరచిన మేధావి డాక్టర్‌ జయశంకర్‌ ఒక సందర్భంలో చెప్పిన, చాలా విలు వైన మాట. ఆ చరిత్ర లను అర్థం చేసుకున్న పాలకులు పాఠాలు నేర్చుకొని చిరంజీవులుగా మానవ జాతి ఉన్నన్నాళ్లూ కీర్తింపబడు తారు. ఆ విధంగా పాఠాలు నేర్చుకోక కొందరు నియం తలుగా మారి ప్రజా కంటకులుగా గుర్తింపబడు తారు. వారిని తలచుకున్నప్పుడల్లా జనాలకు ఏవగింపు తప్ప ఇంకో భావం కలగదు. అంటే వారు జీవించిలేక పోయినా సామాన్య జనాలు తిట్టుకుంటారు. ఇప్పుడు నడుస్తున్న భారత రాజకీయా ల్లో ఈ దేశ చరిత్రలోంచి నాయకులు నేర్చుకోవలసిన పాఠాలేమిటో చూద్దాం!
గత వెయ్యేండ్లలో అత్యంత అధికారం కలిగి,ఎక్కువకాలం పాలించిన మొఘ లు సామ్రాజ్య చరిత్రను గమనిస్తే ఒక విస్మయం కలిగే విషయం తెలుస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? రాహుల్‌ గాంధీని జైల్లో పెట్టినా, బెయిల్‌ మీద విడిచి పెట్టినా, ప్రియాంకా గాంధీ సహించి ఊరుకుంటుందా? హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైంది? పైగా ప్రజలందరూ ప్రభుత్వాలు ఏమి చేసినా భజన చేసేవాళ్లే ఉండరు కదా! ఆలోచన పెరుగు తుంది. దానితోటే ఆవేశం కలుగుతుంది. వారికి ఉన్న ఒకే ఒక్క ఆయుధమైన ఓటుతో సరైన పాఠం చెప్తారు. అలా చేయటానికి కాంగ్రెస్‌ మీద ప్రేమ ఉండక్కరలేదు.నియంతృత్వ పోకడల పట్ల విముఖత చాలు. మొదటి పాలకుడు బాబర్‌, తర్వాత హుమాయూన్‌, అక్బర్‌,జహంగీర్‌, షాజహాన్‌లకంటే ఎక్కువ భూభాగాన్ని 55ఏండ్లు ఔరంగజేబు పాలించాడు. మరి ఆయన మరణం తర్వాత కొన్నేండ్లలోనే మొఘల్‌ సామ్రాజ్యం చిన్నాభిన్న మైంది.ఏపాలకుడూ నిల దొక్కుకోలేక పోయాడు. దీనికి చాలా బలమైన కారణాలున్నాయి.

  1. ప్రజాభిమానం పాలకుడికి అతిముఖ్యమైన బలం అని ఔరంగజేబు గుర్తించకపోవటం. 2. ఆయన మత మౌఢ్యం,ఇతర మతాల పట్ల ద్వేషం, ఆలోచనాపరులైన ప్రజలను ఆవంశానికే శత్రువులుగా చేయటం.
  2. దేశ చరిత్ర బట్టి ఐక్యత కోసం అందరినీ సమ దృష్టితో చూడాలన్న అంశం ఔరంగజేబు గుర్తించక పోవడం.
  3. దాదాపు ఆరు దశాబ్దాలు తన పరిపాలనే ఉన్నా, అత్యాశతో యుద్ధాలు చేసి,కోశా గారం లోని ధనాన్ని ప్రజల సౌకర్యాల కోసం, దేశ ప్రగతి కోసం కాకుండా, తాను శత్రువు లనుకున్న వారిని అణచివేయటానికి ఖర్చు చేయటం.
    ఈ నాలుగు బలమైన కారణాలతో,శతాబ్దాలు పాలించినా, మొఘలు సామ్రాజ్య పతనం కేవలం ఐదు దశాబ్దాలలో జరిగిపోయింది. అంటే దేశాన్ని, ప్రజలను ప్రేమతో కాకుండా ద్వేషంతో,మౌఢ్యంతో ఎంతకాలం పాలించినా ఆ నియంతలకు ఓటమి తప్పదన్నది చారిత్రక సత్యం.
    ఇప్పుడు మన దేశాన్ని కేంద్రం నుంచి పాలిస్తున్న బీజేపీ విధానాలతో పైన చెప్పిన అంశా లు పోలిక కలిగి ఉండటం సుస్పష్టంగా కనిపి స్తుంది. రెండుసార్లు కేంద్రంలో మెజారిటీ సాధించి పరిపాలిస్తున్నా, అధినాయకులిద్దరూ కడుపు నిండా అన్నం తిని కంటినిండా నిద్రపోతున్నారా అన్నది అనుమానాస్పదమే! ఇన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏవో ఒకఎన్నికలు ప్రతిఏడాదీ, రెండేం డ్లకు జరుగుతూనే ఉంటాయి. మరి ఒక రాష్ట్రంలో గెలవగానే,ఇక తర్వాత వేరే రాష్ట్రంలో వచ్చే ఎన్ని కల సన్నాహాలతో, ప్రత్యర్థులను ఓడిరచాలనే పట్టుద లతో 24గంటలూ అదే ఆలోచనాధోరణితో, ఆచర ణతో ఉండే వీరికి మరిదేశ పరిపాలనకు సమయం చిక్కటం లేదు. మనది ప్రజాస్వామ్యం కాబట్టి,ఓట్ల ద్వారా గెలుపోటములు నిర్ణయింపబడుతాయి కాబట్టి,రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు ఇప్పు డు ఆలోచనలో పడుతున్నారు, తొమ్మిదేండ్ల సమ యం ఒక్క రంగాన్నైనా ఉద్ధరించటానికి సరిపోదా అని. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా గతంలో దేశ ప్రజలకు ఎంత చేయాలో అంత చేయలేదన్నది కఠిన సత్యం. కానీ వారు ఈ విధంగా ప్రజా జీవి తాన్ని అతలాకుతలం చేయలేదన్నది కూడా నిజం. అక్బర్‌,షాజహాన్‌,జహంగీర్‌ కూడా పరిపాలించినా, వారు జన జీవనానికి అడ్డుపడలేదు.కాంగ్రెస్‌ ప్రభు త్వం అంతే.మరి వారి కంటే ఎక్కువ కాలం పరిపా లించిన ఔరంగజేబు ఎందుకు ప్రజాగ్రహాన్ని మూట కట్టుకున్నాడు? సరిగ్గా ప్రస్తుత ప్రధానమంత్రి ఇలాగే శృతి మించి ప్రవర్తిస్తున్నాడు. ఒక తప్పు కప్పుకో వటానికి ఇంకొకటి, ఒక సంచలనాన్ని మరుగు పరచటానికి ఇంకొకటి! ప్రజాగ్రహాన్ని మరల్చత తటానికి పుల్వామా దాడులు, ఆత్మీయ మిత్రుడి కష్టాన్ని కుంభకోణాన్ని దాచటానికి విపక్ష నాయకుడి బహిష్కరణ! నిజానికి నరేంద్ర మోదీ గారి ప్రసం గాలు ఒకసారి టీవీలల్లో ప్రసారం చేస్తే, ఆయన మంత్రులు,అనుయాయులు కాంగ్రెస్‌ నేతలని, ముఖ్యంగా నెహ్రూ కుటుంబసభ్యులని, దేశంలోని మహిళలను ఎంత అవమానించారో ప్రజలకు తెలు స్తుంది. మరి వారి మాటలను కూడా విచారించి శిక్షలు వేయాలి కదా! మాటలే కాదు, వారి అత్యా చారాలు, హత్యలకు కూడా రాజ్యాంగంలో శిక్షలే లేవు. మరి విపక్ష నాయకుడు అన్న దాంట్లో తప్పే ముంది? నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీ నిన్న బయట పడ్డారు. మన ప్రధాని అదానీని రక్షిస్తూ, ఇవాళ బయటపడ్డారు. చేసే పనుల మీద సీబీఐ విచారణ వేస్తే తేలిపోతుంది కదా! అయితే, విపక్ష నాయకుడి రాజకీయ ఎన్నికల బహిష్కరణను ఇంకో కోణం నుంచి కూడా పరిశీ లించవచ్చు. ఆధునిక చరిత్రలో గుర్తుకొచ్చే ఇద్దరు నియంతల ప్రవర్తన, అనుసరిం చిన విధానాలు గమ నిస్తే వాటిలో దగ్గరి పోలికలు కనిపిస్తాయి. ఇటలీని పరిపాలించిన నియంత బెనిటో ముస్సోలినీ, జర్మనీని ఏలిన అధినేత అడాల్ఫ్‌ హిట్లర్‌ సమకాలీ కులు,29 జూలై 1883లో పుట్టిన ముస్సోలినీ తన అరాచక పాలనను 1925 నుంచి 1945 దాకా సాగించాడు. తన10వ ఏటనే స్కూలులో ఒక బాలుడిని కత్తితో పొడవటంతో మొదలైన అతడి క్రూరత్వం,ఫాసిస్టు పార్టీ పెట్టి చివరిదాకా దాష్టీకాలు సాగించాడు. అలాగే, 1883 ఏప్రిల్‌ 20న పుట్టిన అడాల్ఫ్‌ హిట్లర్‌ నాజీ పార్టీ అధినేతగా 1933 నుంచీ 1945 దాకా నియంతృత్వ పాలన సాగించాడు. లక్షల మందిని క్రూరంగా చంపిం చాడు. అయితే వీరిద్దరి ఉదాహరణల నుంచి నేర్చుకునే పాఠం ఒక్కటే. పాలితుల పట్ల ప్రేమఉండి వారిలో ఒకడిగా చరిం చి దేశానికి ప్రగతి సాధించేవాడికి ఉన్న ప్రశాంత జీవనం నియంతగా మారి,క్రూరమైన రీతుల్లో ప్రవర్తించి,ముఖ్యంగా తనను విమర్శించే వాళ్లు బతికి ఉండొద్దనే పద్ధతులు పాటించినవారికి ఉండదు. వారు పులి మీద స్వారీ చేస్తున్నట్టే! కొద్దిగా పరిస్థితి మారితే వారు సృష్టించు కున్న విధానాలే వారిని అధఃపాతా ళానికి తొక్కేస్తా యి.మహా ఘోరమైన జీవితం చూడవలసి వస్తుంది. అసహ నం,అధికారదాహం, విపక్షాల పట్ల కక్ష, విపరీత మైన వివక్ష, పక్షపాత ధోరణి ఉన్న నియం తలు చాలాకాలం మనలేరు. పదవిలో కొనసాగ లేరు. అంతేకాదు, తమ అధికార బలం, ప్రజాభి మానం తగ్గుతున్నదన్న అనుమానం కలిగిన కొద్దీ ఒకదాని మీద ఒకటి తప్పులు చేస్తారు. అవే వారిని పదవీచ్యుతులను చేసే ఆయుధాలు. ఇప్పుడు రాహుల్‌గాంధీ బహిష్కరణ,శిక్ష, ఎన్నికలకు దూరం చేయడం-ప్రధాని చేసిన అన్ని తప్పుల్లోకి పెద్దది. ఇది అదానీ వ్యవహారం నుంచి దృష్టి మరల్చటానికి చేసిన పని కాదు. ప్రధానిలో ఒకరకమైన భయం మొదలైందన్న నిజానికి నిదర్శనం. ఎందుకంటే ఎంత బీజేపీ రెండు సార్వత్రిక ఎన్నికలు గెలిచినా, కాంగ్రెస్‌ ఓటుబ్యాంకు ఒకటి నికరంగా దేశంలో ఉన్నది. ఇప్పుడు మోదీ భయం ప్రతిపక్షాలు తప్పిదారి కాంగ్రెస్‌తో కలిశాయంటే, బీజేపీ పని ఖతమైపోతుంది. ప్రజలు ఈ విషయం ఆలోచిం చాలి.ఇప్పుడు ఏంజరుగుతుంది?రాహుల్‌ గాంధీ ని జైల్లో పెట్టినా,బెయిల్‌ మీదవిడిచి పెట్టినా, ప్రియాంకా గాంధీ సహించి ఊరుకుంటుందా? హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైంది? పైగా ప్రజలందరూ ప్రభుత్వాలు ఏమి చేసినా భజన చేసేవాళ్లే ఉండరు కదా! ఆలోచన పెరుగు తుంది. దానితోటే ఆవేశం కలుగుతుంది. వారికి ఉన్న ఒకే ఒక్క ఆయుధమైన ఓటుతో సరైన పాఠం చెప్తారు. అలా చేయటానికి కాంగ్రె స్‌ మీద ప్రేమ ఉండక్కరలేదు.నియంతృత్వ పోకడల పట్ల విముఖత చాలు. ఇదే జరిగిన రోజు బీజేపీ చరిత్ర ముగిసి నట్టే! ఆధునిక నియంతలు ముస్సోలినీ,హిట్లర్‌ రెండురోజుల తేడాతో జీవితం చాలించడం చారి త్రక సత్యం. మోదీ-షా ద్వయం తప్పు మీద తప్పు చేసి అధికారం కోల్పోవటం దానిని చరిత్రలో లిఖిం చటం మన కండ్ల ముందే జరుగుతుంది. – (కనకదుర్గ దంటు)