గిరిజన ముంగిట విద్యావనం

సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి సీఎం జగన్‌, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శంకుస్థాపన చేశారు.దశాబ్దాలుగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి, ఎందరో గిరిజనుల జీవితాల్లో విద్యా కాంతులు వెలిగేలా సీఎం జగన్‌ ప్రత్యేక చొరవతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటవుతుంది.సాలూరులో మెం టాడ,దత్తిరాజేరు మండలాల్లో సుమారు రూ.834 కోట్లతో,561.88ఎకరాల్లో కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయానికి కేంద్రమంత్రి ప్రధాన్‌, సీఎం జగన్‌ ఆగష్టు 25వ తేదీన శంకు స్థాపన చేశారు. అంతకు ముందు సెంట్రల్‌ ట్క్రెబల్‌ యూనివర్సిటీ లేఅవుట్‌ నమూనాను పరిశీలించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎంజగన్‌ మాట్లాడుతూ గిరిజన విశ్వ విద్యాలయం గిరిజన ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనే సత్సంకల్పంతో దత్తిరాజేరు మండలం మర్రివలసలో, మెంటాడ మండలం చినమేడపల్లి పరిధిలో భూసేకరణ, ప్రభుత్వ భూమి కేటాయిం చడంతో పాటు, ఇప్పటికే ఆయా గ్రామాల్లో యూనివర్సిటీకి భూము లిచ్చిన రైతులకు రూ.25. 90 కోట్ల పరిహారం అందిచామని, వర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు మరో రూ.28.49 కోట్లు చెల్లించి నట్లు తెలిపారు. విశాఖపట్నం-రాయగడ జాతీయ రహదారికి సమీపంలో,భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి,విజయ నగరం, గజపతినగరం, బొబ్బిలి రైల్వే స్టేషన్లకు అందు బాటులో ఉండేలా స్థలాన్ని ఎంపిక చేసి నట్లు వివరించారు.ఉత్తరాంధ్రకు కిరీటంగా సెంట్రల్‌ ట్రైబల్‌ వర్సిటీ ఉత్తరాంధ్రకు కిరీటంగా నిలుస్తుం దని,మన ప్రాంతం ఉన్నత చదువు లకు నెలవుగా మారుతోందని సీఎం జగన్‌ పేర్కోన్నారు.గత టీడీపీ ప్రభుత్వం విభజన హామీలో భాగమైన సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ ఏర్పాటును గాలికొదిలేస్తే, మన ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యంత అనుకూల పరిస్థితులు ఉండేలా విశాఖ పట్నం-రాయగడ జాతీయ రహదారికి సమీపంలో, విశాఖ-హౌరా రైల్వేలైన్‌ లోని విజయనగరం, గజపతి నగరం, బొబ్బిలి రైల్వేస్టేషన్లకు అందు బాటులోఉండేలా, భోగాపురం అంతర్జాతీయఎయిర్‌ పోర్టుకు సమీప ప్రాంతలో యూనివర్సిటీకి భూకేటా యింపులు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే వర్సిటీకి అవసరమైన భూమి,విద్యుత్‌,నీటి సరఫరా మరియు రోడ్డు కనెక్టివిటీని సమకూర్చినట్లు వివరించారు. దీంతో పాటు వర్సిటీ నిర్మాణ పనులకు చర్యలు తీసుకోను న్నట్లు తెలిపారు.సెంట్రల్‌ ట్రైబల్‌ యూని వర్సిటీలో ప్రస్తుతం పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఇంగ్లీష్‌, సోషియాలజీ,ట్రైబల్‌ స్టడీస్‌, బయో టెక్నా లజీ, కెమెస్ట్రీ,జర్నలిజం,ఎంబీఏ,ఎంఎస్‌డబ్ల్యూ, డిగ్రీ స్థాయిలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలీజెన్స్‌,బోటనీ కెమిస్ట్రీ, జియాలజీ,టూరిజమ్‌ అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌ మెంట్‌,బి.కామ్‌లో ఒకేషనల్‌ తదితర 14అకాడ మిక్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయని,స్కిల్‌ డెవలప్‌ మెంట్‌,ఒకేషనల్‌,జాబ్‌ ఓరియెంటెడ్‌ షార్ట్‌ టర్మ్‌ కోర్సులను యూనివర్సిటీ అందిస్తోందన్నారు. 2019 నుంచి విజయనగరం జిల్లా కొండ కారకం లోని ఆంధ్రా యూనివర్సిటీ పీజీ పాత క్యాంపస్‌ భవనాల్లో నిర్వహిస్తున్న వర్సిటీలో 385 మంది విద్యార్థులు ఉన్నారు.
గిరిపుత్రుల జీవితాల్లో విద్యా కాంతులు
మన గిరిపుత్రులు రాబోయే రోజుల్లో ప్రపంచస్థాయిలో పోటీ పడే పరిస్థితి వస్తుందని సీఎం జగన్‌ తెలిపారు. గిరిజన ప్రాంతంలో ఈ నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి జరిగిందని ఈ ప్రాం తాంలో ఎటు చూసిన కొత్త కాలేజీలు, యూనివ ర్సీటీలు కనిపిస్తున్నాయని గిరిపుత్రుల జీవీతాల్లో విద్యా కాంతులు వెలుగుతాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ నాలుగేళ్ల మన పాలనలో వైద్యా, విద్యకి ప్రాధాన్యత ఇచ్చామని వాటికి సంబంధించి అనేక సంక్షేమ పథకాలు,అభివృద్ధి పనులు చేపట్టా మని సీఎం జగన్‌ వివరించారు.
1.54లక్షల మంది గిరిజనులకు3.23లక్షల ఎకరాల భూములు
వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన 50 నెలల్లో గిరిజన సంక్షేమం కోసం సమున్నత చర్యలు తీసుకుంటూ గిరిజన సంక్షేమం కోసం మన ప్రభుత్వం రూ. 16,805.77కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం జగన్‌ తెలిపారు. అర్హులైన ఎస్టీ కుటుంబాలకు 2ఎకరాల భూమి అందిస్తామని ఇచ్చిన మాట ప్రకారం గిరి భూమి పోర్టల్‌ ద్వారా డిజిటలైజేషన్‌ చేసి1.54 లక్షల మంది గిరిజనులకు 3.23 లక్షల ఎకరాలను అన్ని హక్కులతో కూడిన RశీఖీRపత్రాలు పంపిణీ చేసినట్లు వివరించారు. 4.58లక్షల మంది ఎస్టీ కుటుంబాలకు జులై, 2019నుంచి రూ.410.11 కోట్ల ఖర్చుతో నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నట్లు వివరించారు.పార్వతీపురం,పాడేరులో రూ.1000 కోట్లతో మెడికల్‌ కాలేజీలు, 300 మెడికల్‌ సీట్లతో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తెస్తూ.. గిరిజనుల ఆరోగ్య సమస్యలపై పరిశోధనలకు పెద్ద పీట వస్తున్నట్లు సీఎంజగన్‌ పేర్కొన్నారు. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం పలాసలో రూ.50 కోట్లతో 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌, డయాలసిస్‌ యూనిట్ల నిర్మా ణం చేపట్టినట్లు వివరించారు.105.32 ఎకరాల్లో రూ.153.85కోట్లతో కురుపాంలో ట్రైబల్‌ ఇంజనీ రింగ్‌ కళాశాల, 500 జనాభా ఉన్న ప్రతి తండా/ గూడెంను పంచాయతీగా వర్గీకరిస్తామన్న మాటను నిలుపుకుంటూ గిరిజన ప్రాంతాల్లో 165 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినట్లు సీఎం జగన్‌ వివరించారు. గిరిజన ప్రాంతాల్లోని 497 సచివాల యాల్లో అన్ని ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకే 100 శాతం రిజర్వేషన్‌ కల్పించినట్లు సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌,రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ,గిరిజన సంక్షేమశాఖ మంత్రి పి.రాజన్న,తదితరలు పాల్గొన్నారు.
ఆహ్లాదకరం..ఏపీ కేంద్రియ గిరిజన విద్యాలయం
ఆహ్లాదకరమైన వాతావరణంలో, సువి శాల భవనాల్లో ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యా లయం సాకారం కానుంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం 2014లో కేంద్రం మన రాష్ట్రానికి 13 కేంద్రీయ విద్యా సంస్థలను మంజూరు చేసింది. అందులో భాగంగా ఉమ్మడి విజయనగరం జిల్లాకు ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (సీటీ యూఏపీ)ను కేటాయించింది.2019 వరకూ అధికా రంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం..దీనిని పట్టించు కోలేదు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి గ్రామం వద్ద భూమి కేటాయించినా అది ఏ మాత్రం భవనాల నిర్మాణానికి అనుకూలంగా లేని పరిస్థితి.
పూర్తిగా కొండప్రాంతం.
పరిసరాల్లో టీడీపీ నాయకుల స్థిరాస్తి వ్యాపారాన్ని పెంచుకోవడానికి తప్ప మరెందుకూ ఉపయోగపడలేదు.తమ పదవీకాలం ముగిసే వరకూ చంద్రబాబు ప్రభుత్వం తాత్సారం చేసింది. చివరకు సీటీయూఏపీ తరగతులను తప్పనిసరిగా ప్రారంభించాల్సి రావడంతో విజయనగ­రం పట్టణ శివారు కొండకరకాం వద్దనున్న ఏయూ పీజీ క్యాంపస్‌ పాత భవనంలోనే 2019ఆగస్టు 5న తరగతులు ప్రారంభమయ్యాయి.
గిరిజనులకు చేరువగా..
ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ లక్ష్యం సార్థకమయ్యేలా గిరిజన ప్రాంతంలోనే దీన్ని ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంక ల్పించింది. విశాఖపట్నం-రాయగడ జాతీయ రహ దారికి సమీపంలో, విశాఖ-హౌరా రైల్వేలైన్‌లోని విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి రైల్వేస్టేషన్ల కు అందుబాటులో ఉండేలా భూమి కేటాయిం చింది.భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా స మీ­పంలోనే ఉంటుంది. మెంటాడ మండలం చినమేడపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో 224.01ఎకరాలు,దత్తిరాజేరు మండలం మర్రి వలస రెవెన్యూ గ్రామ పరిధిలో 337.87ఎక రాలు..మొత్తం561.88ఎకరాల భూసేకరణ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. దాదాపు 480 మంది రైతులకు పరిహారం ఇవ్వాలని అధికారులు గుర్తిం చారు. ఇప్పటికే దాదాపు రూ.30.58కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
మౌలిక సదుపాయాలకు పెద్దపీట
సీటీయూఏపీకి కేటాయించిన భూమిని గతేడాది కేంద్ర బృందం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. వర్సిటీ భవనాల నిర్మాణమంతా కేంద్ర ప్రజా పనుల విభాగం చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తోంది. ఇందుకోసం రూ.23.60కోట్లను గతే­డాది విడు దల చేసింది. విశాఖ-రాయ్‌పూర్‌ జాతీయ రహ దారి నుంచి సీటీయూఏపీ ప్రాంగణం వరకూ రూ.16 కోట్లతో 100 అడుగు­ల వెడల్పున ఆరు లైన్ల అప్రోచ్‌ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతు న్నాయి.తాగునీటి వసతి కల్పనకు రూ.7కోట్లు, విద్యుత్‌ సౌకర్యా­నికి దాదాపు రూ.60లక్షలను ప్రభుత్వం కేటాయించింది.కాగా,విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యంగా ఉపాధి విద్యా కోర్సులను ప్రవేశపెట్టడంలో సీటీయూఏపీ ముందుంది. వారికి ఆసక్తి ఉన్న రంగంలోనే ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా 6గ్రాడ్యుయేట్‌(యూజీ), 8 పోస్టు గ్రాడ్యుయేట్‌(పీజీ) కోర్సుల్లో బోధన జరుగుతోంది.
అంతర్జాతీయ మార్కెటింగ్‌ నైపుణ్యాల కోర్సులను ప్రవేశపెడుతున్నారు.ఇప్పటికే పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి కూడా నైపుణ్యాలను, మెలకువలను అందించేలా సాంకేతిక మాధ్యమా లనూ సీటీయూఏపీ రూపొందిస్తోంది. అందుకు సిలబస్‌ను కూర్పు చేసేందుకు కార్యాచర ణ సిద్ధం చేసింది.ఏటా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పర్యవేక్షణలో ప్రవేశపరీక్షలు నిర్వహించి.. ప్రతిభ ఆధారంగానే సీట్లు కేటాయిస్తున్నారు.- జిఎన్‌వి సతీష్‌

జయహో భారత్‌..ఇస్రోకి జేజేలు

నిరీక్షణ ఫలించింది. కోట్లాదిమంది భారతీయుల పూజలు ఫలించాయి. చందమామ చేతికి అందింది. జాబిల్లిపై త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది. భారత్‌.. నింగిని జయించింది. ఇస్రో చేపట్టిన చంద్ర మండల యాత్ర.. విజయ తీరాలకు చేరింది. దిగ్విజయమైంది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌ 3 జాబిల్లి మీద అడుగు మోపింది. ఈ సువర్ణాధ్యాయం కోసం దేశం మొత్తం ఉత్కంఠ భరితంగా ఎదురు చూసిన క్షణాలు ఫలించాయి. కలలు సాకారం అయ్యాయి. గతంలో ఎదురైన చేదు సంఘటనలు అధిగమించి.. మరీ జాబిల్లిని అందుకుంది.
యావత్‌ భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఎదురుచూస్తున్న చంద్రయాన్‌ 3 ప్రయోగం విజయవంతమైంది. ఇప్పటివరకు జరిగిన అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేసు కున్న చంద్రయాన్‌ 3..చివరి అంకానికి చేరుకుంది. తాజాగా ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విడిపోయిన విక్రమ్‌ ల్యాండర్‌..చంద్రుడి ఫోటోలు తీసింది.వాటిని పంపించడంతో ఇస్రో ట్విటర్‌లో పంచు కుంది. ఆగస్టు 23వ తేదీ చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద సుమారు 70డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద విక్రమ్‌ ల్యాండర్‌ దిగనుంది.
ఆగష్టు 26 ఉదయం బెంగళూరులోని ఇస్రో నెట్‌వర్క్‌ కమాండ్‌ సెంటర్‌ చేరుకున్న ప్రధాని అక్కడ శాస్త్రవేత్తలను కలిశారు.ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండ్‌ అయిన విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి దిగిన ప్రజ్ఞాన్‌ రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా తన పని ప్రారంభించడంతో ప్రధాని శాస్త్రవేత్తల నుంచి దాని సమాచారం తెలుసుకున్నారు. చంద్రయాన్‌ 3 ల్యాండిరగ్‌ ఎలా జరుగుతుందో ల్యాండర్‌ నుంచి రోవర్‌ బయటకు ఎలా వస్తుందో వీడియోల ద్వారా ఇస్రో సైంటిస్టులు ఆయనకు వివరించారు.
‘‘ఆగస్ట్‌ 23న భారత్‌ చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగింది. ఇక ఇప్పటి నుంచి, ఈ రోజుని భారత్‌లో జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వ హించుకుందాం’’అని ప్రధానమంత్రి ప్రకటిం చారు. శాస్త్రవేత్తలు మేకిన్‌ ఇండియా కార్యక్రమాన్ని చంద్రుడిపైకి తీసుకెళ్లారని అభినందించారు.తన ప్రసంగం మధ్యమధ్యలో ప్రధాని ఇస్రో శాస్త్రవేత్తల విజయాన్ని తలుచుకుని భావోద్వేగానికి గుర య్యారు. భారత్‌ చంద్రయాన్‌ 3మిషన్‌ భూమి ఎదుర్కుంటున్న సవాళ్లను పరిష్కరించడానికి కూడా సాయం చేస్తుందని ప్రధాని ఆకాంక్షించారు. మోదీ ఇస్రో కమాండ్‌ సెంటర్‌లో దాదాపు 50 నిమిషాల పాటు ప్రసంగం చేశారు. 21వ శతాబ్దంలో ప్రపం చంలోని పెద్ద పెద్ద సమస్యలను భారత్‌ పరిష్కరి స్తుందని, మన సాంకేతిక, శాస్త్రీయ ఆలోచలను ప్రపంచమంతా అంగీకరిస్తుందని మోదీ అన్నారు. చంద్రయాన్‌ మహాభియాన్‌ అనేది కేవలం భారత్‌ విజయవంతం మాత్రమే కాదని, మొత్తం మానవాళి సాధించిన విజయంగా అభివర్ణించారు. మన మిషన్‌ చేపట్టే అన్వేషణ చంద్రుడిపైకి వెళ్లేందుకు అన్ని దేశాలకు సరికొత్త ద్వారాలు తెరుస్తుం దన్నారు. కేవలం చంద్రుడి రహస్యాలు తెలుసు కోవడమే కాకుండా,భూమిపై ఉన్న సమస్యల పరి ష్కారానికి ఇది సాయం చేస్తుందని మోదీ తెలిపారు. ‘‘ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌, ఈజ్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ అనేవి అంతరిక్ష రంగంలో ఉన్నతమైన బలం. నేడు దేశ పాలనకి ముడిపడి ఉన్న ప్రతి అంశానికి స్పేస్‌ అప్లికేషన్‌ను అనుసంధానించే కార్యక్రమం పూర్త యింది. నేను ప్రధానమంత్రి అయిన తర్వాత, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో, అంతరిక్ష శాస్త్ర వేత్తలతో నేను వర్క్‌షాపు నిర్వహించాను. పరి పాలనలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు స్పేస్‌ రంగాన్ని గరిష్టంగా వాడుకోవాలన్నది ఈ వర్క్‌ షాపు ఉద్దేశ్యం’’ అని మోదీ తెలిపారు.
చంద్రయాన్‌-3 ల్యాండర్‌ ఫొటోలు తీసిన చంద్ర యాన్‌-2 ఆర్బిటర్‌
చంద్రయాన్‌-3ల్యాండర్‌ను చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ తీసిన చిత్రాలను ఇస్రో విడుదల చేసిం ది.‘‘నేను నీకు గూఢచారిని!’’ అంటూ చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ చంద్రయాన్‌-3ల్యాండర్‌ను ఫొటో షూట్‌ చేసిందంటూ ఇస్రో ట్వీట్‌ చేసిం ది.చంద్ర యాన్‌-2లో ఆర్బిటర్‌ హై రెజల్యూషన్‌ కెమెరా (ఓహెచ్‌ఆర్‌సీ) ఉంది.చంద్రుడి చుట్టూ ఏది ఉన్నా ఈ కెమెరా ఫొటోలు తీసి పంపుతుంది. చంద్ర యాన్‌-3 అక్కడ ల్యాండ్‌ అయిన తర్వాత, దీన్ని కూడా అది గుర్తించి, ఫొటోలు తీసింది. ‘‘ఇస్రో సాధించిన విజయం చాలా గర్వకారణం. చంద్ర యాన్‌-3సాఫ్ట్‌ ల్యాండిరగ్‌ సమయంలో దక్షిణా ఫ్రికాలో ఉన్నా. నా మనసంతా చంద్రయాన్‌ -3 విజయంపైనే ఉంది. విజయంపట్ల శాస్త్రవేత్త లను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది అసాధా రణ విజయం. చంద్రుడిపై భారత్‌ అడుగుపెట్టింది. అంతరిక్ష చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించాం. ఇప్పుడు భారత్‌ చంద్రుడిపై ఉంది. మన సత్తా ఏమిటో ప్రపంచానికి చాటాం. గతంలో ఎవరూ చేయలేనిది ఇప్పుడు ఇస్రో చేసింది చంద్రయాన్‌ -3 దిగిన ప్రదేశానికి శివశక్తి పేరు పెట్టుకుందాం. ’’ అని ప్రధాని మోదీ అన్నారు.
కక్ష్యలో సొంతంగా పరిభ్రమించి
ఆబిలాల పేర్లనుకూడా ఇస్రో వెల్లడిరచింది. ఫ్యాబ్రీ, గియార్డనో బ్రునో,హర్కేబి జే తదితర వాటి పొటోలను ల్యాం డర్‌ తీసింది.ఇందులో గియార్డనో బ్రునో జాబిల్లిపై ఇటీవలే గుర్తించిన అతిపెద్ద బిలాల్లో ఒకటి. ఇక హర్కేబి జే బిలం వ్యాసం దాదాపు 43 కి.మీలు ఉన్నట్టు తెలుస్తోంది.చంద్రడి కక్ష్యలో తిరుగుతున్న ల్యాండర్‌ మాడ్యూల్‌ జాబిల్లికి మరింత చేరువైంది. ఆగష్టు 23న చేపట్టిన డిబూస్టింగ్‌(వేగాన్ని తగ్గించే) ప్రక్రియ విజయవంతమైనట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వెల్లడిరచింది. ల్యాండర్‌ (విక్రమ్‌),రోవర్‌(ప్రజ్ఞాన్‌)తో కూడిన ల్యాండర్‌ మాడ్యూల్‌ ఆరోగ్యంగానే ఉందని తెలిపింది.
గురు తప్పని ప్రయోగం..
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ హరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్ర యాన్‌-3ప్రయోగం విజయవంతం అయ్యిం ది. జూలై 14,2023 చంద్రయాన్‌-3 మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రయోగించారు శాస్త్రవేత్తలు.. చంద్రయాన్‌-3లోని ల్యాండర్‌కు విక్రమ్‌ అని పేరు పెట్టారు. దీనికి భారత అంతరిక్ష కార్యక్రమ పితా మహుడు విక్రమ్‌ సారాభాయ్‌ పేరు పెట్టారు. రోవర్‌కు ‘ప్రజ్ఞాన్‌’అని పేరు పెట్టారు. దీనిని సంస్కృ తంలో జ్ఞానం అంటారు. చంద్రయాన్‌-2 సమ యంలో ల్యాండ్‌ రోవర్‌కు అదే పేరు ఉండేది. రోవర్‌ అనేది వాహనం లేదా రోబోట్‌, ఇది వివిధ ప్రదేశాల నుంచి డేటాను సేకరించి ఆర్బిటర్‌కి పంపడానికి గ్రహం ఉపరితలం చుట్టూ తిరుగు తుంది.ల్యాండర్‌ అనేది లోపల రోవర్‌ ఉన్న ఒక రకమైన క్యారియర్‌. దాని సహా యంతో రోవర్‌ ఉపరితలంపై ల్యాండ్‌ చేయబడు తుంది. రోవర్‌ను ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్‌ చేయ డానికి ల్యాండర్‌ కీలక పాత్ర పోషిస్తుంది. రోవర్‌ ల్యాండ్‌ అయిన గ్రహం చుట్టూ ఒక ఆర్బిటర్‌ తిరుగుతుంది. రోవర్‌ గ్రహం ఉపరితలం నుంచి గ్రహం చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్‌కు డేటాను పంపుతుంది. అలాగే భూమిపై ఉన్న ఇస్రో-నాసా వంటి అంతరిక్ష సంస్థలకు ఆ సమాచారాన్ని ప్రసారం చేయడానికి ఆర్బిటర్‌ పనిచేస్తుంది…
భారత్‌ గుప్పిట చిక్కిన జాబిల్లి..
ఇండియా ఈజ్‌ ఆన్‌ ది మూన్‌.. ఇదీ ఇస్రో వారి సగర్వ ప్రకటన. జాబిలి మీద కాలు మోపిన తమ చంద్రయాన్‌3 ప్రాజెక్ట్‌ సూపర్‌ సక్సెస్‌ కొట్టిందన్న వార్తను ప్రపంచానికి చాటిచెప్పుకుంది ఇస్రో. అగ్రరాజ్యాల్ని సైతం నోరెళ్లబెట్టేలా చేసిన ఈ ఘన విజయాన్ని దేశం మొత్తం ఆస్వాదిస్తోం దన్నారు ప్రధాని మోదీ. మూన్‌ మిషన్లను చాలా దేశాలు విజయవంతం చేసుకున్నాయి. కానీ.. ఇన్నాళ్లు అందని జాబిలి..
ఇప్పుడు గుప్పిట చిక్కింది. చంద్రుడి మీద ప్రయోగంలో సంపూర్ణ విజయం సాధించి మళ్లీ మీసం మెలేసింది ఇస్రో. చంద్రుడి దక్షిణ ధ్రువం మీద రోవర్‌ని దింపిన తొలి దేశంగా అవతరించింది భారత్‌. ఇస్రో అంచ నాలు ఏమా త్రం తప్పలేదు. అంగుళమైనా పక్కకు జరగలేదు. గీసిన గీత మీద సరిగ్గా వాలింది చంద్ర యాన్‌`3. విక్రమ్‌ ల్యాండర్‌ నెలరేడుని ముద్దా డిరదన్న శుభవార్త యావత్‌ దేశాన్నీ పులకింప జేసింది.ఈ అపూర్వమైన.. సాటిలేనివిజయంతో, భారతదేశం చరిత్ర సృష్టించింది. ఇస్రో శాస్త్రవేత్త లను దేశప్రజలు అభినందిస్తూ వారి కృషిని అభినం దిస్తున్నారు.సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
దేశాల నుంచి ప్రపంచ సంస్థల దాకా ఇదే మాట
చంద్రుని దక్షిణ ధ్రువంపైకి భారత్‌ అడుగుపెట్టగానే ప్రపంచవ్యాప్తంగా మొదలైన జయ జయధ్వానాలు ఇంకా కొనసాగుతున్నాయి. శిఖ రాగ్ర సమావేశాల కోసం కలుసుకున్న ప్రపంచ దేశాల అధినేతల సంభాషణల్లోనూ, అంతర్జాతీయ వార్తా పత్రికలు, ప్రముఖ న్యూస్‌ చానళ్ల కథనాల్లో నూ ఇదేఅంశం ప్రధానంగా కనిపించింది. చంద్రు నిపై విక్రమ్‌ ల్యాండ్‌ కాగానే క్షణాల్లో తీవ్ర ఉద్వే గానికి గురయ్యానని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా, అమెరికాకు చెందిన న్యూయార్క్‌ టైమ్స్‌ మొదలు బ్రిటన్‌ ‘బీబీసీ’ వరకు భారత్‌కు జయహోలు పలికాయి. దాయాది దేశం పాకిస్థా న్‌కు చెందిన పత్రికలు సైతం అంతరిక్ష రంగంలో భారత్‌ తిరుగులేని విజయాన్ని ప్రస్తుతించాయి. జయహో భారత్‌.. సాహో ఇస్రో..అంటూ దేశం మొత్తం సంబరాలు చేసుకుంటోంది. ప్రతి భారతీ యుడు సగర్వంగా తన జయహో అంటూ సంబ రాలు మొదలు పెట్టింది.భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రయాన్‌-3 ‘చంద్ర యాన్‌-3’చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయ వంతంగా ‘సాఫ్ట్‌ ల్యాండ్‌’ అయింది.
ఈఅపూర్వమైన..సాటిలేని విజయం తో,భారతదేశం చరిత్ర సృష్టించింది.భూమిసహజ ఉపగ్రహం (చంద్రుడు)ఈ భాగంలో దిగిన ప్రపం చంలో భారత దేశం మొదటి దేశంగా అవతరిం చింది. ఎందు కంటే ఇప్పటివరకు చంద్రునిపైకి వెళ్ళిన అన్ని మిషన్లు చంద్ర భూమధ్యరేఖకు ఉత్తరం లేదా దక్షిణంగా కొన్ని డిగ్రీల అక్షాంశంలో దిగాయి. భారత దేశ పతాకాన్ని ఎగురవేయడం వల్ల శాస్త్రవేత్తలలోనే కాదు, దేశంలోని సాధారణ ప్రజలలో కూడా అపారమైన ఉత్సాహం కనిపి స్తోంది.‘సాఫ్ట్‌ ల్యాండిరగ్‌’ గురించి తెలిసిన ప్రతి భారతీయుడి ముఖం ఆనందంతో వెలిగిపోతోంది.– గునపర్తి సైమన్‌

భారత స్వాతంత్య్ర పోరాటం అవలోకం

ఎందరో  త్యాగమూర్తుల పోరాట ఫలితంగా భారత ప్రజలు నేడు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో కొత్త తరం ముందుకు వచ్చింది. భారత ఉపఖండం లో స్వాతంత్య్రం కోసం జరిగిన అనేక ఉద్యమాలనన్నిటినీ కలిపి ‘‘భారత స్వాతంత్య్రోద్యమం’’గా చెబుతున్నారు. అనేక సాయుధ పోరాటాలు, అహింసాయుత పద్ధతిలో జరిగిన ఉద్యమాలు భారత స్వాతంత్య్రోద్యమంలో భాగాలు. భారత ఉపఖండంలోని బ్రిటిష్‌, ఇతర వలసపాలకుల పాలనను అంతమొందంచటానికి వివిధ సిద్దాంతాలను అనుసరించే అనేక రాజకీయపక్షాలు ఉద్యమించాయి.
16వ శతాబ్దంలో పోర్చుగీసు ఆక్రమణలకు వ్యతిరేకంగా అబ్బక్కరాణి చేసిన పోరాటాలను, 17వ శతాబ్దం మధ్యలో బెంగాల్‌ లో ఈస్ట్‌ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటాలను వలస పాలనపై వ్యతిరేకతకు మొదటి అడుగులుగా చెప్పవచ్చు. మొదటి సంఘటిత సాయుధ పోరాటం బెంగాల్‌ లో ప్రారంభమై తర్వాత రాజకీయ పోరాటంగా పరిణామం చెంది భారత జాతీయ కాంగ్రెస్‌ గా ఆవిర్భవించింది. కాంగ్రెసులో అతివాదులైన లాలా లజపతిరాయ్‌, బాలగంగాధర తిలక్‌, బిపిన్‌ చంద్ర పాల్‌, (లాల్‌ బాల్‌ పాల్‌) విదేశీవస్తు బహిష్కరణ, సమ్మె, స్వావలంబన మొదలైన పద్ధతులను అవలంబిస్తే, అరబిందో వంటివారు తీవ్రవాద మార్గాలను అవలంబిచారు. మెదటి దశకాలలో సాయుధ విప్లవ పోరాటాలు ముందుకు వచ్చాయి. మొదటి ప్రపంచయుద్ధ సమయంలో జర్మనీ, అమెరికాల్లోని భారత స్వాతంత్రయోధులు ప్రారంభించిన గదర్‌ పార్టీ సహకారంతో జరిగిన సంఘటిత భారతసిపాయిల తిరుగుబాటు జాతీయోద్యమంలో వచ్చిన మౌలిక మార్పుగా చెప్పవచ్చు.
జాతీయోద్యమం చివరి దశలో జాతీయ కాంగ్రెస్‌ మహాత్మాగాంధీ నాయకత్వంలో అహింసాయుత మార్గాలలో ఉద్యమించింది. ప్రముఖ విద్యావేత్త రాంజీ సింగ్‌ మహాత్మాగాంధీని 20వ శతాబ్దంలో అవతరించిన బోధిసత్వునిగా కీర్తించాడు. అయితే ఇతర నాయకులు సాయుధ పోరాటాలను అవలంబించారు. సుభాష్‌ చంద్ర బోస్‌ సాయుధ సంగ్రామమే సరైనదిగా భావిస్తే, స్వామి సహజానంద సరస్వతి సన్నకారు రైతులు, శ్రామికుల సంపూర్ణ ఆర్ధిక స్వాతంత్రా నికై పిలుపునిచ్చాడు. రెండవ ప్రపంచయుద్ధ కాలానికి ఈ ఉద్యమాలు ఉధృతరూపం దాల్చాయి. నేతాజీ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ పేరుతో భారత జాతీయసైన్యాన్ని స్థాపించి తూర్పు ఆసియా నుండి పోరాడగా భారత జాతీయ కాంగ్రెస్‌ క్విట్‌ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చింది. మహాత్మా గాంధీ నాయకత్వంలోని 1947 ఆగష్టు 15న భారత దేశం స్వతంత్ర దేశంగా ఆవిర్బవించింది. 1950 జనవరి 26 న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అయితే అప్పటివరకూ బ్రిటీష్‌ వారి పాక్షిక పాలలోనే సాగింది. భారత రాజ్యాంగం భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఆవిర్బవింపజేసింది.
సుసంపన్న భారత్‌ దిశగా సుస్థిర ప్రయాణం..!
స్వతంత్ర భారతం 75 ఏళ్లు పూర్తి చేసుకుని 76వ ఏట అడుగు పెడుతోంది. ఈ సందర్భం గా పుణ్యభూమి ప్రస్థానాన్ని సింహావలోకనం చేసుకుంటే సవ్యదిశలోనే పురోగమిస్తున్నామని అంచనా వేసుకోవచ్చు.
‘‘ప్రపంచం అంతా నిద్రిస్తున్న వేళ ..అర్థరాత్రి భారత్‌ కొత్త జీవితం, స్వేచ్చల కోసం మేలు కుంది..! ‘‘ అని 75 ఏళ్ల క్రితం భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన క్షణాన జవహర్‌లాల్‌ నెహ్రూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆ మాటల వెనుక ఎంతో అర్థం ఉంది. స్వాతంత్రం వస్తేనే సమస్యలు పరిష్కారం కావు. అప్పట్నుంచే అసలు సమరం ప్రారంభమవు తుంది. దేశానికి ప్రజలందరూ కలిసి ఓ దశ.. దిశ తీసుకు రావాల్సిన అవసరం అప్పుడు ఉంది. అప్పట్నుంచి ఇప్పటికి 75ఏళ్లు పూర్త య్యాయి. 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇన్నేళ్ల కాలంలో భారత్‌ ఏం సాధించింది..?ప్రపంచంతో పోటీ పడి ఎంత ముందుకెళ్లాం..?
ప్రథమ స్వతంత్ర సంగ్రామం
జ్యోతిబసు 1857లో జరిగిన మహా తిరుగుబాటు ఆధునిక భారత చరిత్రకు పరీవాహక ప్రాంతం లాంటిది.భారతదేశంలో ఆంగ్లేయులను మొట్ట మొదటి సారిగా సవాలు చేసినది…భారత జాతీయ రాజకీయాలు జీవం పోసుకోవడానికి స్ఫూర్తి రగిలించినది…దేశం లోని బ్రిటిష్‌ ప్రభుత్వం తన రాజ్యాంగంలో కీలక సవరణలు చేయాల్సి రావడానికి దోహదం చేసినది.ఈ రోజు…నూట యాభై సంవత్సరాల తర్వాత ఆమహత్తర ఘటనను మనం గుర్తు చేసుకుంటున్నాం. జాతి నిర్మాణం పూర్తి చేయడానికి ఆవిప్లవం మనకు కొత్త స్ఫూర్తిగా నిలుస్తూనే ఉంటుంది. పంతొమ్మిదవ శతాబ్దంలో అనేక సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలు చోటు చేసుకున్నాయి. ఇందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సినవాటిలో లాటిన్‌ అమెరికాలో సైమన్‌ బోలివార్‌ స్పానిష్‌ వలసవాదానికి వ్యతిరేకంగా జరిపిన పోరాటం, విప్లవ మత గురువు హిడాలో నాయకత్వాన జరిగిన పోరాటం. అయితే, సామాజికంగానూ భౌతికంగానూ అత్యంత శక్తివంతమైనది. 1857లో భారతదేశంలో జరిగిన తిరుగు బాటు,కొవ్వు పూత పూసిన తూటాలు ఉప యోగించడానికి వ్యతిరేకంగా ఈ సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది. అయితే, భారత దేశంలో ఈస్టిండియా కంపెనీ అమలు చేస్తున్న రాజకీయ వ్యవస్థ మూలంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలోని పౌర ప సమాజపు విశాల సెక్షన్లతో సిపాయిలు భాగస్వాములయ్యారు. సిపాయిల తిరుగుబాటు,జనంలో వచ్చిన తిరుగుబాటు- రెండిరటి కలయిక వల.
వెనక్కి తిరిగి చూసుకుంటే గర్వపడే విజయాలు.!
రెండు శతాబ్దాల బానిసత్వం..త్యాగధనుల పోరు ఫలితం..స్వేచ్చా గీతికతో మువ్వన్నెల స్వాతంత్య్ర భారతం. రెండు వందల సంవత్స రాలు భారత్‌ను తమ కబంధ హస్తాల్లో బిగించిన ఆంగ్ల పాలకుల్ని తరిమేయడానికి చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి పౌరుడూ ఓ యోధుడయ్యాడు. స్వాతంత్య్ర సంగ్రామంలో సామాన్యుడు సైతం దేశం కోసం సర్వం త్యాగం చేశాడు.జెండా పట్టుకుని భరతమాత దాస్య శృంఖలాలు తెంచేందుకు వజ్రాయుధమే అయ్యాడు. అలా అందరి రక్తం,కష్టం,త్యాగం సమ్మిళితంగా మన చేతికందిన స్వాతంత్య్రానికి 76వ ఏడు వచ్చింది. ఏమి సాధించామన్న విష యాన్ని ఆత్మపరిశీలన చేసుకోవడానికి.. సాధిం చాల్సిందేమిటని నిర్దేశించుకోవడానికి ఇది అరుదైన అవకాశం.75 ఏళ్ల కిందటి ప్రజల జీవన ప్రమాణాలతో పోలిస్తే ఇప్పుడు దేశం ఎంతో పురోగమించింది. మన పూర్వికుల వరకూ ఎందుకు… ఈ నాటి యువత తల్లిదండ్రుల్ని అడిగితేనే తాము ఎలాంటి మౌలిక వసతులు లేని పరిస్థితుల్లో పెరిగామో చెబుతారు. ఓ పాతికేళ్ల ఏళ్ల క్రితం వరకూ సగం జనాభాకు కరెంట్‌ అంటే తెలియదు. ఇంటర్నెట్‌ అనే పదం కూడా తెలియదు. ఇక రోడ్లు,మంచినీరు,గ్యాస్‌ వంటి సౌకర్యాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అలాంటి పరిస్థితుల్ని …ప్రస్తుత పరిస్థితుల్ని పోల్చి చూసుకుంటే దేశం ఎంతో పురోగమించిందని అర్థం చేసుకోవచ్చు. దేశంలో కరెంట్‌ అందని గ్రామం లేదని ఇటీవలే కేంద్రం ప్రకటించింది. చిట్ట చివరి గ్రామానికీ విద్యుత్‌ వెలుగులు అందించామని తెలిపింది. ఇక విద్య, వైద్య సౌకర్యాలు ఎంతో మెరుగుపడ్డాయి. అందరికీ సరిపడా అందుతున్నాయా అంటే.. సంతృప్తికరం అని చెప్పలేం కానీ.., నిన్నటి కంటే ఈ రోజు మెరుగు అని మాత్రం చెప్ప గలిగే స్థితిలో భారత్‌ ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు.
ప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశమే అయినా పురోగమనమే..!
స్వాతంత్య్రం వచ్చిన 75ఏళ్లకు కూడా భారత్‌ను అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెబుతున్నారు. దేశ జనాభాలో ఇప్పటికీ సగం మందికిపైగా పేదరికంలోనే ఉన్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేరొం దిన భారత్‌లో ఇంతమంది పేదలు ఉండటం ఖచ్చితంగా వైఫల్యమే. ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు. కానీ పేదలు మాత్రం పైకి రావడం లేదు. పేదరికం తగ్గిపోయిందని ప్రభుత్వం లెక్కలు చెబుతూ ఉండవచ్చు. కానీ ప్రభుత్వం నిర్దేశించుకున్న మొత్తం కన్నా ఒక్క పైసా సంపాదించుకున్నా వాళ్లు పేదలు కాదనడం…మనల్ని మనం మోసం చేసు కోవడమే. దేశంలో విద్య, వైద్యం అందని వారంతా పేదలుగానే భావించాల్సి ఉంటుంది. ఇటీవలి కరోనా మహమ్మారి సమయంలో ఆ వైరస్‌ బారిన పడి ఎంత మంది.ఎన్ని లక్షల కుటుంబాలు అప్పులపాలయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ధనిక..పేద తేడా లేదు. అందరూ ఆస్తులు కోల్పోయారు. అప్పుల పాల య్యారు. కేవలం రేషన్‌ కార్డు ఉన్న వారే పేదవాళ్లు..మిగతా వాళ్లెవరూ కాదనడం ఎంత మూర్ఖత్వమో.. ప్రభుత్వాలు కూడా అర్థం చేసు కున్న రోజునే నిజమైన పేదరిక నిర్మూలనకు బీజాలు పడతాయి.ఈ 75 ఏళ్ల భారతావనిలో ప్రభుత్వాలు అంత విశాలంగా ఆలోచించక పోవడమే ఇప్పటి వరకూ చోటు చేసుకున్న విషాదం.
ఇప్పటికీ వదలని జాడ్యాల వల్లే వెనుకబడుతున్నాం…!
శతాబ్దానికి మూడు వంతులు గడిచి పోయింది.టెక్నికల్‌గా మనం ఎక్కడకో పోయాం. చంద్రుడ్ని అదుకుంటున్నాం. ఆకాశానికి నిచ్చెనలేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు వైద్య రంగంలో సంచలనాలు సృష్టిస్తున్నారు. టెక్నాలజీ రంగంలో భారతీయులే గ్రేట్‌ అన్న పేరు తెచ్చుకుంటున్నారు. కానీ..అదే సమయంలో కాస్త వెనక్కి తిరిగి చూస్తే ..మన నలుపు మనకే అసహ్యమేస్తూ ఉంటుంది. దేశ సమగ్రతను కాపాడుకోవాలన్నా, అభివృద్ధిలో ముందుకు సాగిపోవాలన్నా అది ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుంది. కానీ ప్రజలు వదిలించుకోలేని సమస్య కులం,మతం .దేశం తరపున ఎవరైనా ఓగొప్ప విజయం సాధిస్తే ముందుగా అతని కులం ఏమిటి అని వెదికే వారి సంఖ్య ఇండియాలో ఎక్కువ.ఓమ తం వారు విజయం సాధిస్తే ఆమతం కనుక ప్రశంసించేవారూ తగ్గిపోతారు. దీనికి సాక్ష్యం హాకీ క్రీడాకారిణి వందన కటారియా ఉదంతం. ఆమె ఒలింపిక్స్‌లో సర్వశక్తులు ఒడ్డి దేశానికిప తకం తెచ్చేందుకు ప్రయత్నిస్తూంటే… ఇండి యాలో ఆమెఇంటిపై కులపరమైన దాడి జరిగింది. దీనికి స్వతంత్ర భారతావని మొత్తం సిగ్గుపడాల్సిందే. ఇక్కడ తప్పు..వందనా కటారియా కుటుబంపై కులపరమైన దాడి చేసిన వారిది కాదు..అలాంటి మనస్థత్వాన్ని వదిలించుకోలేకపోయిన భారతీయులది. ఆ విష యంలో 75 ఏళ్లలో మనం సాధించింది చాలా స్వల్పం. ఇంకా విశాలం చేసుకోవాల్సిన అభిప్రా యాలు అనంతం ఉన్నాయి. కానీ రాను రాను దేశంలో కులాల పరిస్థితి దుర్భరంగా మారుతోంది. సామాజికంగా,ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వర్గాలు సైతం తమకూ రిజర్వేషన్లు కావాలని డిమాండు చేస్తున్న పరిస్థితి నెలకొంది.
రాజకీయ వ్యవస్థ సంయమనం పాటిస్తే అంతా మంచే..!
భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం.అయితే ఆ ప్రజాస్వామ్య పునాదులు ఈ 75ఏళ్లలో బలపడ్డాయా… బలహీనపడ్డాయా అని విశ్లేషించుకుంటే.. రెండోదే నిజం అని అంగీకరించక తప్పని పరిస్థితి. ప్రజాస్వామ్యం బలంగా ఉండా లంటే… వ్యవస్థలన్నీ సక్రమంగా పని చేయాలి. కానీ దేశంలో ప్రతి వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంది. న్యాయవ్యవస్థ సహా.. రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలు అన్నీ ఏదో ఓ సందర్భంలో సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంది. దీనికి కారణం రాజకీయ వ్యవస్థే. ప్రజలు ఇచ్చిన అధికారంతో మిగతా వ్యవస్థలను అదుపు చేయాలని రాజకీయ వ్యవస్థ అంతకంతకూ భావిస్తూ పోతూండటమే సమస్యలకు మూలం అవుతోంది. అదే ప్రజాస్వామ్యానికి పెను సవాల్‌గా మారే అవకాశం కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొనే అతి క్లిష్టమైనసమస్య కూడా ఇదే కావొచ్చు.
భవిష్యత్‌ అంతా భారత్‌దే..!
సమస్యలు అంటూ లేని మనిషి ఎలా ఉండడో.. అలాగే సమస్య అంటూ లేని దేశం కూడా ఉం డదు. ఆ సమస్యలను ఎంత పకడ్బందీగా అధిగమిస్తారో… ప్రజలు ఎంత వివేకంగా ఉం టారో…వాళ్లని పాలించే వాళ్లు దేశం పట్ల ఎంత నిబద్ధతగా ఉంటారో అన్నదానిపైనే దేశం పురోభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అదృష్టవ శాత్తూ ఈ విషయంలో భారత్‌కు అన్నీ మంచి సూచనలే ఉన్నాయి..ఈ 75వ స్వాతంత్య్ర వేడుకల్ని…తిరంగా రెపరెపలతో.. ఘనమైన వారసత్వ సంపదతో..మొక్కవోని భవిష్యత్‌ సంకల్పంతో భారతావని మున్ముందుకు దూసుకుపోయేలా ఉంటుందని ఆశిద్దాం.!
`హ్యాపీ ఇండిపెండెన్స్‌ డే

మూలవాసులం..మేము ఆదివాసులం

దేశంలో తమ హక్కుల సాధన కోసం ఆదిఆసీ సమాజాలు ఉద్యమించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. బ్రిటీష్‌ చట్టాలకు వ్యతిరేకంగా బిర్జాముండా,సంతాల్‌లు,తిరుగుబాటు చేశారు.జిల్‌,జంగల్‌,జమీన్‌ కోసం సాయుధ పోరాటాలు సాగాయి. తమపై సాగుతున్న అన్ని రకాల దోపిడీ,పీడనలను ఎదరించారు. అనేకసార్లు ఓటమి చెందినా తమ ఉనికే ప్రశ్నార్ధకంగా మారుతున్న పరిస్థితుల్లో,తమ అస్తిత్వం కోసం అలుపెరుగని పోరాటాలు నేటికీ కొనసాగి స్తూనే ఉన్నారు. జీవన పోరాటంలో ఆరితేని వారు ఆదివాసీలు. వారు నివసించే ప్రాంతాలు పుష్కలమైన సహజ వనరులతో కళకళలాడుతుండేవి. సాటి మానవులుగా అనేక దేశాలలో వారికి తగిన గుర్తింపు,రక్షణ నేటీకీ లేదు.. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నివాసముండే గిరిజనులు అనేక సమస్య లతో కొట్టిమిట్టులాడుతునే ఉన్నారు. గునపర్తి సైమన్‌
ఆదివాసీలు తమ అస్తిత్వం కోసం ఎన్నో అలుపెరుగని పోరాటాలు చేస్తున్నా..అభివృద్ధికి మాత్రం నోచుకోవడమే లేదు. ప్రభుత్వాలు, పాలకులు మారినా ఆదివాసీల తలరాతలు మారినట్లు కనిపించడం లేదు. తమ హక్కుల కోసం నిరంతరంగా గళం విప్పుతూనే ఉన్నారు. ప్రధానంగా ఆదివాసీలను నిరక్షరాస్యత, ఆరోగ్య సమస్యలు,పేదరికం వెంటాడుతునే ఉన్నాయి. స్వాతంత్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ జిల్లాలో రవాణా సౌకర్యం, విద్యుత్‌ లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రంలోనే జిల్లాలో ఆదివాసీలు అధికంగా నివసిస్తున్నారు. విద్య, వైద్యం అందని ద్రాక్షగానే మారడంతో ఆదివాసీల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. తమ వెనుకబాటుతనానికి మరో గిరిజన తెగనే కారణ మంటూ గత కొంత కాలంగా ఆందోళ న బాట పట్టిన ఆదివాసీలు, ఆధిపత్య పోరు కొనసాగిస్తున్నారు. ఆదివాసీలకు రక్షణగా ప్రత్యేక చట్టాలు ఉన్నా.. వాటి అమలుల్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపడం లేదంటూ,హక్కుల కోసం నిరంతర పోరాటాలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసీల ఉద్యమాన్ని రగిలించిన ఎంపీ సోయం బాపురావు గత పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపొందడంతో ఆదివాసీలు ఎంతో సంబరపడ్డారు.కాని మూడేళ్లు గడిచిపోతున్నా.. తమ కల సాకారానికి అడుగు ముందుకు పడకపోవడంతో మెజార్టీ ఆదివాసీల్లో నిరాశానే కనిపిస్తోంది. అడవుల్లో విసిరిపారేసినట్లు కనిపించే ఆదివాసీల జీవనాన్ని మరింత మెరుగుపరిచేందుకు 1982 ఆగస్టు 9న ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆదివాసీల దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీ.
పోడు భూములకు పరిష్కారం ఏదీ?!
ఎన్నో ఏళ్లుగా పోడు భూముల సమస్యను పరిష్కరించాలంటూ పోరాటాలు చేస్తున్నా.. ప్రభుత్వం, పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత యేడాది క్రితం స్వయాన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆరే అర్హులైన గిరిజ రైతులందరికీ హక్కు పత్రాలు ఇస్తామని ప్రకటించి రైతుల నుంచి దరఖాస్తులను కూడా స్వీకరించారు. అయినా ఇప్పటి వరకు హక్కుపత్రాలు ఇవ్వకపోగా..పరిష్కారమే చూపడం లేదు. దీంతో వానాకాల సీజన్‌ మొదలైందంటే చాలు ఏజెన్సీ గిరిజన గ్రామాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. అటవీ శాఖ అధికారులతో ఆదివాసీలు చిన్నపాటి యుద్ధాన్నే చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతు న్నాయి. పోడు భూములను సాగు చేసుకుంటున్న క్రమంలో హద్దులు దాటారంటూ అటవీ శాఖాధికారులు ఆదివాసీ మహిళలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయం భయంగా పోడు సాగు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోందని వారు ఆవేదనకు గురవు తున్నారు. ప్రభుత్వ ప్రకటనతో వేల మంది గిరిజన రైతులు హక్కుపత్రాల కోసం దరఖా స్తులు చేసుకున్నా.. అమలుకు నోచుకోక పోవడంతో ఎదురుచూపులు తప్పడం లేదు.
వణుకు పుట్టిస్తున్న వానాకాలం
రెండు తెలుగు రాష్ట్రాల్లో నివాసముంటున్న గిరిజనుల సమస్య ఏదైనా అమాయక ఆది వాసీల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. వానాకాలం వచ్చిం దంటే చాలు ఆదివాసీ గ్రామాలకు వణుకు పుట్టిస్తోంది. చిన్నపాటి వర్షాలకే వాగులు, వంకలు పొంగి ప్రవహిం చడంతో ఊరుదాటే పరిస్థితు లు కనిపించడం లేదు. దీంతో అత్య వసర సమయంలో వైద్యం అందక, వరద నీటి ఉధృతిని దాటేక్రమంలో ప్రమాదాల భారీన పడి ప్రాణాలు కోల్పో తున్నారు. ముఖ్యంగా ఆదివాసీ మహిళలకు ప్రసవమంటే పునర్‌ జన్మగా మారింది. సకాలంలో వైద్యం అందక మాతాశిశు మరణా లు ఏటా జరుగుతూనే ఉన్నాయి. ఆదివాసీలు ఆచార సంప్రదాయాలకు కట్టుబడి మూడ విశ్వాసాలతో జీవనం గడుపుతున్నారు. అలాగే తరతరాలుగా వెంటాడుతున్న రక్తహీనత, పౌష్టికాహార లోపంతో ఆదివాసీలు బక్కచిక్కిపోయి బలహీన పడుతూ..మరీ దయనీ యంగా కనిపిస్తున్నారు. దీని కారణంగా ఆదివా సీలను భయంకర వ్యాధులు చుట్టుముట్టి ఏటా ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. అంతే కాకుండా వెంటాడుతున్న పేదరికం,అనా రోగ్య సమస్యలతో ఆర్థికంగా,సామాజికంగా వెనుకబడి పోతున్నారు. మెరుగైన వైద్య సౌకర్యాలు అందు బాటులోఉన్నా..సకాలంలో వైద్యం అందకపో వడంతో ప్రాణనష్టం జరుగుతూనే ఉంది.
ఉద్యోగం, ఉపాధికి దూరమే..
ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీలకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు దూరమవుతునే ఉన్నాయి. ఆదివాసీలకు ఉద్యోగ భద్రత కల్పిం చేందుకు గత ప్రభుత్వం జీవో నెం.3 తీసు కొచ్చింది. కానీ గత రెండేళ్ల క్రితమే సుప్రీంకోర్టు ఈ జీవోను రద్దు చేయడంతో ఉద్యోగ అవకాశ ాలు కరువవుతున్నాయి.ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యా య పోస్టుల్లో గిరిజనేతరులకు కూడా అవకా శాలు కల్పించాలంటూ దేశ అత్యున్నత న్యాయ స్థానం తీర్పును ఇవ్వడంతో ఆదివాసీల ఆశలు ఆవి రయ్యాయి. దీంతో ఏజెన్సీలో స్పెషల్‌ డీఎస్సీకి అవకాశమే లేకుండా పోయింది. అసలే అంతంత మాత్రంగా చదువుకుంటున్న ఆదివాసీలకు ప్రభుత్వ ఉద్యోగం గగనంగా మారింది. ప్రభుత్వం జీవో నెం.3మళ్లీ పునరు ద్ధరించక పోవడంతో ఎంతో మంది నిరుద్యో గులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూ డాల్సి వస్తోంది. ఇకనైనా ప్రభుత్వం జీవో నెం.3 తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంత ఉద్యోగా లను స్థానికులకే కేటాయించాలంటూ డిమాండ్‌ చేస్తున్నా.. ప్రభుత్వాలు పట్టించుకున్నట్లే కనిపిం చడం లేదు. నిరంతరంగా ఆదివాసీలు తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నా..పాలకుల నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నారు.
ఉద్యమాలతోనే హక్కులు సాధించుకుంటాం
ఆదివాసీలకు ఉద్యమాలు చేయడం కొత్తేమీ కాదు. నిరంతర పోరాటాలతోనే హక్కులు సాధించుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం కల్పిం చుకుని జీవో నెం.3 పునరుద్ధరించాలి. అలాగే ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన రైతులందరికీ పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని గిరిజనులు డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజనుల పట్ల చిన్నచూపు చూస్తోంది. ఆదివాసీల సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలకు ఇచ్చిన హామీలన్నీ మరిచి పోయింది. ఎన్నికల సమయంలోనే ఆదివాసీలు గుర్తుకొస్తున్నారు. ఏదిఏమైనా ఆదివాసీలకు అధికారం వస్తేనే హక్కుల సాధనకు అవకాశం ఉంటుంది.
ఆధునిక సమాజ గత కాలపు ఆనవాళ్లు ఆదివాసీ ప్రజలు
సమిష్టి జీవన పద్ధతులు,సహజీవనం,పారదర్శ కతకు నిలువెత్తు సాక్షులు వారు.వ్యష్టి జీవన పద్ధతులు,పరస్పర అసహనం,కనిపించని కుట్ర లు నేటి పారి శ్రామిక సమాజలక్షణాలు. బ్రెజిల్‌,పెరూ దేశాలలో వంద కుపైగా ఆదివాసి తెగలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నారు. పెరూ లోని‘ముచి-పిచి’పర్యావరణ పార్కుకు కేవలం100కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఈ తెగలు ఇప్పటికీ జంతు ప్రాయమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు.50-60 వేల సంవత్స రాల నుంచి అటవీ దుంపలు ప్రధానఆహార వన రుగా జీవిస్తూ మొక్క జొన్న,బంగాళాదుంప సాగుకు ఈ తెగలు ఎంతో తోడ్పడ్డాయి.తాము వేటాడే జంతువులకు ఎరగావేసే క్యురారే మొక్క నేడు ఓపెన్‌ హార్ట్‌ శస్త్రచికిత్సకు ఔషధంగా మారింది. గత సునా మీలో అండమాన్‌ తెగలలో ఆదివాసి తెగలు ఎవ రూ చనిపోలేదు. కారణం సముద్రం వెనక్కి వెళ్లగానే వారు ఎత్తైన కొండలపైకి వేగంగా కదిలి వెళ్లారు. జారవా, సెంటినిల్‌ తెగల ఆదివాసీల్లో కళ్లుతెరచి సముద్రపు నీటిలో చేపలవేటకు అనువుగా 50 శాతం మంది కళ్లు రూపాంతరం చెందాయి.ప్రపంచంలో సుమారు ఏడు వేల భాషలు ఉంటే అందులో ఆదివాసీ తెగలు మాట్లాడే బాషలే నాలు గువేలు ఉన్నా యి. నేడు అత్యధికులు మాట్లాడే, వాడే ఆరు భాషలు (ఇంగ్లీషుతో సహా) గతంలో అంత రించిపోయిన ఆదివాసీ తెగలు వాడినవే. బ్రతుకు పోరాటంలో ఆరితేరిన వారు ఆదివాసీలే. వారు నివసించే ప్రాంతాలు పుష్కలమైన సహజ వనరులతో కళకళలా డుతుండేవి. ఈ పదేళ్లపాటు ఆదివాసీ తెగలను మానవులుగా గుర్తించడం, వారి జీవన పరిస్థితు లను మెరుగు పర్చడం, వారి నివాస ప్రాంతా లలోని సహజవన రులన్నింటినీ వారే సమిష్టిగా వినియోగించుకునే చట్టాలు చేయవలసి ఉన్నది. ప్రపంచవ్యాప్తం గానే తొలుత ఈతీర్మానాన్ని అమలు చేయాలని ప్రయత్నించిన వారు ప్రపంచ స్థాయి ఎన్‌జిఒలు మాత్రమే. మన దేశంలో ఇప్పటికీ అంత ర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వాలు జరప డం లేదు. ఎన్‌జిఒలు చేసే కార్యకలాపాలకు కొన్ని రాష్ట్రాలలో కేవలం ఆర్థిక తోడ్పాటును మాత్రమే ప్రభుత్వాలు అందిస్తున్నాయి. మన దేశంలో సుమా రు 600 ఆదివాసీ తెగలు గుర్తించ బడ్డాయి. భారత రాజ్యాంగం వీరికి చట్టపర మైన రక్షణలు కల్పిం చింది. అవే 5వ,6వ షెడ్యూల్‌గా ప్రాంతీయ, పరిమిత స్వయం పాలనా హక్కు ఇవ్వబడిరది.ఆచరణకు వీలుగా పీసాచట్టం (పి.ఇ.ఎస్‌.ఎ-1996) చేయ బడిరది. అయినా బూర్జువా పాలక వర్గాలు మనదేశంలో గిరిజన తెగలకు స్వయం పాలనా హక్కులు ఇవ్వలేదు.
ఆదివాసీలు-హక్కులు
వలస కాలం నుంచి మనదేశంలో ఆదివాసీ తెగలు బూర్జువా,భూస్వామ్యవర్గాలకు వ్యతి రేకంగా పోరా టాలు చేస్తున్నాయి.ఒక రాజీగా అనేక రక్షణ చట్టాలు వచ్చాయి. ముఖ్యం గా1874లోనే ప్రత్యేక షెడ్యూల్డ్‌ జిల్లాల చట్టం చేయబడిరది.1917లో ఆదివాసీ తెగల నివాస ప్రాంతాలలో ఉమ్మడి భూమి హక్కులు ఇవ్వ బడ్డాయి.అవేభారత రాజ్యాంగంలో పొందు పరిచారు. అనేక పోరాటాల అనంతరం ఆది వాసీ తెగలకు అటవీ భూములపై హక్కులు కల్పిస్తూ 2006లోచట్టం చేయబడిరది. చట్టం ప్రకా రం అటవీ భూమిపై ఆధారపడి జీవిస్తున్న ప్రతి గిరిజన కుటుంబానికీ 10ఎకరాల వరకూ పట్టా ఇవ్వవచ్చు. వారిపై గల కేసులను ఎత్తివే యాల్సి ఉంది. మన రాష్ట్రంలో దీని అమలు అరకొరగా జరిగింది. సుమారు 25లక్షల ఎకరాలకు పట్టాలి వ్వవలసిన భూమిని గుర్తించినప్పటికీ కేవలం 9 లక్షల ఎకరాలకు మాత్రమే పట్టాలిచ్చారు. దీనిలో లక్షా యాబై ఆరు వేల మందికి 3లక్షల ఎకరాలు మాత్రమే దక్కింది.మిగతా 6లక్షల ఎకరాలు 2 వేల విఎస్‌ఎస్‌ల పేర (వన సంరక్షణ సమితులు) పట్టా లిచ్చి అటవీశాఖ ఆధీనంలోనే ఉంచుకు న్నారు. ఇన్ని చట్టాలు ఉన్నా, స్వాతంత్య్రం వచ్చి 68 ఏళ్లు అయి నా ఆదివాసీ తెగలు తమ సంప్రదాయపు భూముల నుంచి,అటవీ ప్రాంతంనుంచి నెట్టివేయబడు తున్నా రు.మనరాష్ట్రంలో 1/70చట్టం అమలులో ఉన్నది. గిరిజనుల సాంప్రదాయక భూములు గిరిజన తెగ లకే దక్కాలి. గిరిజనేతరులకు షెడ్యూల్డ్‌ భూమిపై ఎట్టి హక్కూ లేదు. కానీ మన రాష్ట్రంలో షెడ్యూల్డ్‌ ప్రాంతంలో 48శాతం సంప్రదాయక గిరిజన భూములను గిరిజనేతరులు ఆక్రమించు కున్నారు. గిరిజన విద్యపేరుతో ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలకు ఐటిడిఎలు దోచిపెడుతున్నాయి.ఈసొమ్ముతో ఐటిడిఎనే జూనియర్‌ కాలేజీలను పెట్టవచ్చు లేదా తాము నడుపుతున్న రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీ ల్లో చేర్పించవచ్చు.
ఆదివాసీ చట్టాలు-అక్కరకురాని చుట్టాలు
ఆదివాసీ చట్టాలు అక్కరకురాని చుట్టా లుగా మారాయి. పోలవరం ప్రాజెక్టు వద్దని గ్రామ సభలు, పంచాయతీలు,మండల పరిషత్తులు (ఇవన్నీ షెడ్యూల్డ్‌ ఏరియాలో, పీసా చట్టం పరిధి లో ఉన్నవి) చేసిన తీర్మానాలకు రాష్ట్ర ప్రభుత్వం విలువే ఇవ్వలేదు.బాక్సైట్‌ త్రవ్వకాలు వద్దని విశాఖ జిల్లాలోని గ్రామసభలు, పంచాయతీలు, మండల పరిషత్తులు చేసిన తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రక్కనపెట్టి ఐటిడిఎల ద్వారా బాక్సైట్‌ త్రవ్వకాలు జరుపుతామని చెబుతున్న మా టలు సుప్రీంకోర్టు ‘సమతా తీర్పును’ వెక్కిరించడం కాదా? ఆదివాసీ హక్కులను కాలరాయడానికి రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడడం లేదు.షెడ్యూల్డ్‌ ప్రాంతంలో జీవో 3ప్రకా రం అన్ని ప్రభుత్వ శాఖలలోని ఉద్యోగాలన్నింటినీ స్థానిక గిరిజన అభ్యర్థులతో నింపవలసి ఉన్నది. ప్రతి కార్యాలయంలో గుమస్తా నుంచి అధికారి వరకు ప్రతి స్కూలు, ఆసుపత్రి, వివిధ కార్యాలయా లలో నేడుస్థానిక అభ్యర్థులు10శాతం కూడా లేరు. స్థానికేతరులు, గిరిజనేతరులు, తాత్కాలిక ప్రాతిపది కపై గతంలో నియామకాలు జరిగాయి. ఈ జీవో ప్రకారం వారిని తొలగించి స్థానిక గిరిజన అభ్యర్థు లతో నింపవలసి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం స్కీం వర్కర్లలో ఎక్కువమంది గిరిజనేతరులనే నియమి స్తున్నది. అర్హులైన గిరిజన అభ్యర్థులు నిరుద్యోగులుగా ఉన్నారు. ప్రభుత్వం జీవో 3ను పటిష్టంగా అమ లుచేసి స్థానిక గిరిజన అభ్యర్థులకే ఉద్యోగ అవకాశం కల్పించాలనే డిమాండ్‌ ముందుకు వస్తున్నది. ఆదివాసీ తెగలు ప్రత్యేక భాషలు, విశిష్టమైన సంస్క ృతిని కలిగి ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనేతర భాషలను వారిపై బలవంతంగా రుద్దు తున్నాయి. మన రాష్ట్రంలో ప్రతి గిరిజన కుటుంబం ఇంట్లో తమ తెగ భాష మాట్లాడుతున్నారు.స్కూలుకు వెళ్తే తెలుగు,ఇంగ్లీషులో బోధన జరుగుతున్నది. భాషా పరిజ్ఞానమేకాక సాధారణ విషయాలను కూడా అవగాహన చేసు కోవడం గిరిజన విద్యా ర్థులకు కష్టంగా ఉన్నది. ఫలితంగా స్కూల్‌ డ్రాపవుట్స్‌ ఎక్కువ అవుతు న్నాయి. యునెస్కో సూచన మేరకు 10వేల మంది మాట్లాడే ప్రతి భాషకూ లిపి కనిపెట్టాలని, వాడుక లో దానికి రక్షణనివ్వాలని ఉన్నది. అయినా లక్షల మంది మాట్లాడుతున్న ఆదివాసీ భాషలకు లిపి కని పెట్టకపోవడం దారుణం.భాషా పరిశోధన సంస్కృతి రక్షణలోభాగం. ఆదివాసీ తెగల వాయిద్య పరికరాలు, వారి నృత్యాలు ప్రభుత్వం ప్రోత్సాహం లేక అంతరించిపోతున్నాయి. ఆదివాసీ ప్రాంతాలలోకి టూరిజం ప్రవేశించాక ఆదివాసీ కళలు వ్యాపార సరుకులుగా మారి పోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికా రికంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పాటించాలి. నేడు జరుగు తున్న ఉత్సవాలు పాలకవర్గాల అవసరాల కోసమే తప్ప ఆదివాసీలను కాపాడడానికి కాదు. నిజమైన ఆదివాసీ దినోత్సవం, ఆదివాసుల ‘అవసరాలు- ఆకాంక్షలు’ నెరవేర్చేదిగా ఉండాలి.

జగనన్న సురక్ష

ప్రజా సమస్యలను సంతృప్తికర స్థాయిలో పరిష్కరించడం,అర్హులందరికీ పథకాలు అందిం చడం లక్ష్యంగా జూన్‌ 23 నుంచి జూలై 23 వరకు నెల రోజులపాటు జగనన్న సురక్ష కార్య క్రమం విజయవంతంగా కొనసాగిస్తున్నారు. దీనికి ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. ప్రతి సచివాలయ పరిధిలో విస్త్రతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ సమస్యకు పరిష్కారం చూపుతున్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా మరో కొత్త కార్యక్రమైన జగనన్న సురక్ష కార్యక్రమం అనే శ్రీకారం చుట్టబోతోంది.ఇది ఎప్పట్నించి ప్రారంభమౌతుందనేది పరిశీలిద్దాం.!
వైసీపీ ప్రభుత్వం జగనన్న సురక్ష పేరుతో మరో కొత్త కార్యక్రమాన్ని తలపెట్టింది.ఇది జూన్‌ 23 నుంచి ప్రారంభం కానుంది.. ప్రతి ఇంట్లో ఏసమస్యలు ఉన్నా వెంటనే వాటిని పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి జగనన్న సురక్ష కార్యక్రమం కొనసాగింపుగా ఉంటుంది. ప్రతి సామాన్యుడి ముఖంలో చిరునవ్వు చూడటమే ఈ కార్యక్ర మం ఉద్దేశ్యమం.
ఇదో బృహత్తర కార్యక్రమం
ప్రభుత్వం చేపడుతున్న వివిధకార్య క్రమాలు,సంక్షేమపథకాలు, గడపగడపకూ ప్రభుత్వం,ఉపాధిహామీ పనులు, రెవెన్యూ, హౌసింగ్‌, వ్యవసాయం,సాగునీటి విడుదల, జగనన్న భూహక్కు కార్యక్రమాలపై సచివాలయ స్థాయి నుంచి జిల్లా కలెక్టరేట్‌ స్థాయివరకు ఎప్పటికప్పడు సమీక్ష చేసుకొని అర్హుల్కెన లబ్దిదారులకు సంక్షేమ ఫలాలు అందించడం ప్రధాన లక్ష్యం.ఈబృహాత్తర క్యాక్రమం నెల రోజుల పాటు నిర్వరామంగా కొనసాగుతుంది. సచివాలయ సిబ్బందికి సైతం శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలకు సంబంధించిన జనన,మరణ,కుల,మత, నివాస పత్రాలు,సర్టిఫికేట్లు జారీ,ప్రభుత్వపథకాల సమస్యలుంటే వెంటనే పరిష్కరిస్తారు.ఈపనుల నిర్వహణ కోసం మండలాధికారులు స్థానికంగా ఎక్కడికక్కడ క్యాంపులు నిర్వహించి తక్షణం పరిష్కరిస్తారు.ఎవరి సమస్యైనా తిరస్కరించ బడితే ఎందుకు తిరస్కరించారనేది ఆఫిర్యాదు దారుడి ఇంటికెళ్లి వివరిస్తారు.అప్పటి వరకూ పరిశీలనకు నోచుకోని సమస్యను 24గంటల్లోగా పరిష్కరమయ్యే అవకాశం ఉంది. అర్హత ఉండీ ప్రభుత్వపథకాలు అందనివారిని గుర్తించి తక్షణం వారికి ఆపధకాల లబ్ది పొందేలా చేస్తారు.
సమస్యలపై మండలాధికారులు క్యాంపులు
సర్టిఫికెట్లకు సంబంధించి,అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నా యా? లేవా?అన్నదానిపై ఈ కార్యక్ర మంలో జల్లెడపడపట్టనున్నారు.నగర/పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్‌ కమిషనర్‌,జోనల్‌ కమిషనర్లు,సిబ్బంది ఒక టీమగా ఏర్పాటు చేసుకుని వివిధ వార్డుల్లో పర్యటిస్తారు.మండల స్థాయిలో ఎంపీడీఓ,డిప్యూటీ తహాసీల్దార్‌ ఒక బృందం,తహాసీల్దార్‌ ఈఓ పంచాయితీ రాజ్‌ కలసి రెండు బృందాలుగా గ్రామాలకు వెళ్తారు. సచివాలయానికి వస్తున్న తేదీ వివరాలను ముందే నిర్ణయించి,ఆ రోజు వాటికి గ్రామంలో ఉన్న క్షేస్థ్రాయి సిబ్బంది ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తారు.నెల రోజులపాటు జరిగే ఈక్రార్యక్రమంలో ప్రతిరోజుఒక టీమ్‌ ఒక్కో సచివాలయాన్ని మాత్రమే సందర్శిస్తారు.
వాలంటీర్ల గుర్తించుకోవాల్సిన విషయాలు
పనిని సమర్ధవంతంగా అర్ధం చేసుకోవడానికి ఎంఎల్‌ఓ,మండల ఇన్‌చార్జిలు,కలసి ఏర్పాఉ చేసిన శిక్షణా సమావేశానికి హాజరుకావాలి. గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందితో సమన్వ యం చేసుకోవాలి. ప్రజల సమస్యలకు సంబంధించిన పత్రాలను గుర్తించి పౌరుల నుంచి తీసుకొని సచివాలయంలో సమర్పించాలి.ప్రతి ఇంటిని సందర్శించి వాలంటీర్‌ యాప్‌లో సర్వేని పూర్తి చేయాలి.ఇంటికి తాలం వేసి ఉంటే..వేరే సమయంలో మళ్లీ సందర్శించాలి. ఆయా సచివాలయ పరిథిలో క్యాంపు జరిగే తేదీని ప్రతి ఇంట్లో పలుమార్లు చెప్పాలి.ఆవ్యక్తి అనుమతితో వారి జియో`ట్యాగ్‌ చేయబడిన చిత్రాలను క్లిక్‌ చేయాలి.అదే రోజున యాప్‌,వాట్సాప్‌ గ్రూపుల్లో పోటోలు, అప్‌టడేట్‌ను షేర్‌ చేయాలి.పథకాలు లేదా డాక్యుమెంట్‌ సంబంధింత సమస్యలు ఉన్న వ్యక్తులందరినీ క్యాంప్‌కు రావడానికి ప్రొత్సహించాఇ. క్యాంపుకు ముందు ఫిర్యాదు చేయని వ్యక్తులను కూడా తమ సమస్య పరిష్కారం కోసం క్యాంప్‌ రోజు సందర్శించ వచ్చు. దీనికి సంబంధించి ఆయా వార్డు/గ్రామ సచివాలయంలో ప్రత్యేక డెస్కలు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి శనివారం నుంచే మండలస్థాయిలో శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఆగస్టు 1వతేదీన అర్హత పత్రాలు అందించే కార్యక్రమం
జగనన్న సురక్షలో వివిధ పథకాల కిందఅర్హు లుగా గుర్తించినవారికి ఆగస్టు1వతేదీన అర్హత పత్రాలు అందిస్తారు.ఇందులో సమస్యల పరిష్కారంలో క్వాలిటీ అనేది చాలా ముఖ్యమని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికా రులకు ఆదేశించారు. ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారం కావడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉం డాని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు సేవలు అందించడంలో ఉన్నత ప్రమాణాలు పాటించాలని సూచించారు.. గ్రీవెన్స్‌రిజెక్ట్‌ చేస్తే ఎందుకు తిరస్కరించారో ఫిర్యాదుదారుడు ఇంటికెళ్లి వివరిస్తున్నారు. ప్రజలకు అన్నిరకాలసేవలు అందించాలని సీఎం ఆదేశించారు.
కల్తీ విత్తనాల పట్ల అలర్ట్‌..
అదే విధంగా వర్షాకాలం ప్రారంభమైనందున విత్తనాలు,ఎరువులు,పురుగుమందుల కొరత రాకుండా రైతు భరోసా కేంద్రాలను పర్యవేక్షించాల్సి ఉంది.కల్తీవిత్తనాలపట్ల అలర్ట్‌గా ఉండటం,ఎక్కడ్కెనా కల్తీ కనిపిస్తే కలెక్టర్లు, ఎస్పీలను బాధ్యులుగా చేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టంగా హెచ్చరించారు. జుల్కె1నుంచి ఇ-క్రాప్‌ బుకింగ్స్‌ ప్రారంభించి,సెప్టెంబరు మొదటి వారానికి పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. సెప్టెంబరు నెలాఖరులోగా తుది జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి.సీసీఆర్సీ కార్డులపై అవగాహన కల్పించి కౌలు రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. మొదటి ఫేజ్‌లో2వేల గ్రామాల్లో జగనన్న భూహక్కు,భగరక్షకార్యక్రమం పూర్తయ్యిందని సచివాలయాల స్థాయిలోనే రిజిస్ట్రేషన్‌ సహా అన్నిరకాల సేవలు వీరికి అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు.ఈ గ్రామాల నుంచి రైతులు ఎవ్వరూకూడా తహశీల్దార్‌,రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం రాకూడదనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం.
రాష్ట్రవ్యాప్తంగా జగనన్న సురక్ష క్యాంపులు ప్రారంభం..
ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ సంక్షేమ పథకాలను ఇప్పటి వరకు 99శాతం మంది అర్హులందరికి అందజేసి.. అర్హత ఉండి సాంకేతిక కారణాలతో మిగిలిపోయిన 1 శాతం లబ్ధిదా రులను కూడా కవర్‌ చేస్తూ 100 శాతం సంక్షేమం అందిచాలనే దిశగా జగనన్న ప్రభుత్వం అడుగులు వేస్తోందని సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సందర్బంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తొలి రోజు క్యాంపుల నిర్వహణ తీరును వివరించారు. ఈ సందర్బంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల పథకాలు అందని వారు ఎవరైనా ఉంటే.. వారికి లబ్ది చేకూర్చడం, ప్రజలకు అవసరమైన సర్టిఫికేట్లు, వారి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న సురక్ష పథకాలన్ని ప్రారంభించినట్లు మంత్రి మేరుగ తెలిపారు. సంక్షేమం, అభివృద్ది రెండు కళ్లుగా భావించి..సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.. దేశ చరిత్రలో ఏముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రంలో అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఒక్క రోజులోనే సర్టిఫికేట్లను అందిస్తున్న ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది
జగనన్న సురక్ష క్యాంపులను ఏర్పాటు చేసి.. అక్కడే ప్రజల సమస్యకు పరిష్కారం చూపు తూ.. అదేవిధంగా అర్హులైన వారికి పథకాలు వచ్చేలా సాంకేతిక సమస్యలను కూడా వెంటనే పరిష్కారం చూపుతున్నామన్నారు. ఇక అవసర మైన వారికి ఉచితంగా సర్టిఫికేట్లను అందిస్తున్న ఘనత సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికే దక్కుతుం దని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. వాలం టీర్లు, సచివాలయ గృహసార థులు ప్రతి ఒక్కరి ఇళ్లకు వచ్చి వారి సమస్య లను తెలుసుకుని టోకెన్లు ఇస్తారని.. ఇక జులై 1 నుంచి 30 వరకు సచివాలయాల పరిధిలో క్యాంపులు పెట్టి.. ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్స్‌, పథ కాల లబ్ది, సమస్యలను మండల, సచివాల య అధికారులు దగ్గరుండి పరిష్కరి స్తారని ఈ అవ కాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వి నియోగం చేసు కోవాలని మంత్రి మేరుగ అన్నారు. టీడీపీ హయాంలో చేసిన ఒక్క మంచిపని కూడా లేదని.. సీఎం జగన్‌ సంక్షేమ పథకాలు ఇస్తుంటే.. ముసలి కన్నీరు కార్చిన చంద్రబాబు రాష్ట్రం శ్రీలంక అవుతుందని.. అప్పులపాలు అవుతుందని ప్రచారం చేయిం చారని, ఇప్పుడు అవే సంక్షేమ పథకాలు తానూ ఇస్తానని కళ్లబొల్లి మాటలు చెబుతున్నారని మంత్రి మండిపడ్డారు.
పారదర్శక పాలనకు నిదర్శనంగా జగనన్న ప్రభుత్వం: ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌
సంక్షేమ పథకాల అమలులో పార్టీ, కులం, మతం, ప్రాంతం చూడకుండా..అర్హతే ప్రామాణికంగా ఉందని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ తెలిపారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో దాదాపు 2.16లక్షల మంది వాలంటీర్లు, 1.5 లక్షల మంది సచివాలయ సిబ్బంది మండల అధికారులు,జిల్లా అధికారులు పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ‘’జగనన్న సురక్ష పథకాన్ని జులై నెలలో ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం.. ఈ నెల లోనే విద్యార్థులు కళాశాలలకు వెళ్తారు కాబట్టి వారికి కావాల్సిన సర్టిఫికెట్లను ముందుగానే ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది, దీంతో పాటు సంక్షేమ పథకాలు కూడా ఆగస్టు నుంచే పథకాల క్యాలెండర్‌ అమలవుతుంది..అందు కని ఈ నెలలో పథకాలకు లింక్‌ చేయా ల్సిన సర్టిఫికెట్లను ప్రభుత్వం అందిస్తోంది’’ అని ఎమ్మె ల్సీ మర్రి రాజశేఖర్‌ చెప్పుకొచ్చారు. గత టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీ సిఫార్సు లు,టీడీ పీ నాయకుల సూచనల మేరకు పథకాలు ఇచ్చే వారని, కానీ సీఎం జగన్‌ నాయకత్వంలో అర్హతే ప్రామాణికంగా పథకాలు అందిస్తు న్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే వాలంటీర్లు అందరూ ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారని..ఇక వారి సచివాలయ పరిధిలో క్యాంపులు పెట్టి వాటిని పరిష్కరి స్తారని ఎమ్మెల్సీ రాజశేఖర్‌ చెప్పారు. ప్రజల వద్దకే పాలనను ఆచరించి చూపాం
‘’జగనన్న సురక్ష వంటి కార్యక్రమం అమలు చేయాలంటే దమ్ము, ధైర్యం ఉండాలి, ఆ లక్షణా లు మా నాయకుడు సీఎం జగన్‌లో పుష్కలంగా ఉన్నాయి. ఎక్కడైనా మాకు ఈ సమస్యలు ఉన్నాయని ప్రజలు అధికారుల వద్దకు వస్తారని, కానీ సీఎం జగన్‌ మాత్రం అధికారులనే ప్రజల వద్దకు పంపి మీ సమస్య లు ఏంటి అని తెలుసుకుని..వాటిని పరిష్కరిం చేందుకు క్యాంపులు ఏర్పాటు చేయడం ఇది సుపరిపా లనకు నాంది పలకడమేనని’’ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మండలానికి 2 చొప్పున 1,305 సచివాలయాల పరిధిలో ‘జగనన్న సురక్ష’ క్యాంపులు విజయవంతంగా నిర్వహించి లబ్ధిదారులకు అవసరమైన ద్నృవపత్రాలు, ప్రభు త్వ సేవలను అక్కడికక్కడే అందించినట్లు ఎమ్మె ల్సీ పేర్కన్నారు. దీనికి సంబంధించి ఆయా సచి వాలయాల పరిధిలోని వాలంటీర్లు జూన్‌ 24వ తేదీనే ఇంటింటికీ వెళ్లి క్యాంపుల సమాచారాన్ని తెలియజేయడంతో పాటు ఆయా కుటుంబాల నుంచి వ్యక్తిగత వినతులను సేకరిం చి జగనన్న సురక్ష యాప్‌ లో నమోదు చేశారని తెలిపారు. రద్దీగా ఉన్న జగనన్న సురక్ష క్యాంపుల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండావారి భోజన, త్రాగునీరు సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది.-జిఎన్‌వి సతీష్‌

ఫ్టాస్టిక్‌పై పోరు బాట

‘‘ ప్లాస్టిక్‌ మహ మ్మారిపై పోరును ఒకఅత్యవసర ఉద్యమంగా చేపట్టాలి. పర్యావరణం, ప్రజారోగ్య పరిరక్షణ కోసం, భావితరాలకు సురక్షితమైన జీవితం కోసం…ప్లాస్టిక్‌ బ్యాగులు,బాటిల్స్‌ తదితర వస్తువులను బహిష్క రించాలి. క్లాత్‌ బ్యాగులను వాడకాన్ని ప్రారంభించాలి. ఇందుకు అన్ని వర్గాల ప్రజలూ స్వచ్ఛందంగా పూనుకుంటేనే సాధ్యం.నిత్య జీవితంలో ప్లాస్టిక్‌వినియోగం విడదీయలేని స్ధాయికి చేరుకున్నది. ప్రతి నిత్యం మనకు నిత్యావసరాలైన కూరగాయలకు,కిరాణా సామాన్లకు, ఫ్యాన్సీ వస్తువులకూ మందులకు, ఎలక్ట్రానిక్స్‌ వస్తువులకు కూడా ప్లాస్టిక్‌ బ్యాగుల వాడడం మనకు అలవాటై పోయింది. తెలీకుండానే మన పరిసరాలు,భూమి,పర్యావరణం,ఆరోగ్యాలను తీవ్రంగా నష్టపరచుకుంటున్నాం.ఈ నేపథ్యంలో ముందుగా పర్యావరణాన్నీ, ప్రజారోగ్యాన్నీ తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ప్లాస్టిక్‌ మహమ్మారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం! ’’
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నిమిషానికి 20లక్షల ప్లాస్టిక్‌ బ్యాగులు వినియోగించ బడుతున్నాయి.మన దేశంలో ప్రతి పౌరుడు సగటున ఒక్క సంవత్సరకాలంలో11కేజీల ప్లాస్టిక్‌(బ్యాగులు, బాటిల్స్‌, స్ట్రావంటివి) వాడటం జరుగుతున్నది.ప్లాస్టిక్‌ బాటిల్స్‌ భూమిలో కరిగి పోవడానికి 450ఏళ్లు,సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌బ్యాగులు కరిగిపోవడానికి వెయ్యి సంవత్స రాలు పడుతుంది.మొత్తంఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్‌లో కేవలం 9శాతం మాత్రమే రీసైకిల్‌ చేయబడుతున్నది. దాదాపు గా14ప్లాస్టిక్‌ బ్యాగుల ఉత్పత్తికి అవసరమయ్యే పెట్రోలియం నుండి ఒకమైలు దూరం వాహనం నడపటానికి అవసరమయ్యే గ్యాసును ఉత్పత్తి చేయవచ్చు. ప్రతి ఏటా పెద్దసంఖ్యలో పక్షులు,చేపలు,జంతువులు ప్లాస్టిక్‌వల్లచనిపోతున్నాయి.అంతరించి పోతున్న ప్రాణుల్లో దాదా పు700జాతులు ప్లాస్టిక్‌వల్ల ప్రభావితమైనట్లు గుర్తించారు.మనం తినే జలచరాల్లో(చేపలు,రొయ్యలువంటివి) మైక్రోప్లాస్టిక్‌ అవశేషాలు ఉం టున్నట్లు శాస్త్రజ్ఞుల పరిశోధనల్లో ఇప్పటికే వెల్లడైంది.ప్లాస్టిక్‌ కాల్చి నప్పుడు విడుదలయ్యే డయాక్సిన్స్‌,ఫ్యురాన్స్‌, మెర్క్యురి,పాలిక్లోరినేటెడ్‌ బైఫినైల్స్‌,పాలిసైక్లిక్‌ ఆరోమాటిక్‌ హైడ్రోకార్బన్స్‌ వంటి హానికరమైన రసాయనాలు మానవ ఆరోగ్యాన్నీ,మనం నివసించే భూమినీ,తాగే నీటిని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలను పోసి కాల్చడం మూలంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతిఏటా 20మిలియన్‌ టన్నుల కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉత్పత్తి అవుతోంది. దీని ఫలితంగా 60లక్షల మంది మరణిస్తున్నారని తెలుస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో కాల్చడంవల్ల దగ్గు,ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. మనం తినే ఆహారం,తాగే నీటిలో సూక్ష్మస్ధాయిలో ఉంటున్న ప్లాస్టిక్‌ పాలిమర్‌ అవశేషాల వలన క్యాన్సర్‌, చర్మవ్యాధులు,హార్మోన్లకు సంబంధించిన వ్యాధులు, సంతానలేమి,గుండెపోటు వంటి వ్యాధులు సోకుతు న్నాయి.ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఉల్లాసంగా, ఆహ్లాదంగా గడపడానికి సందర్శించే సముద్ర తీరాలలో(బీచ్‌లలో)పడవేసే వ్యర్థపదార్ధాలలో 73శాతం ప్లాస్టిక్‌ ఉంటున్నది.ప్లాస్టిక్‌ బ్యాగులు, బాటిల్స్‌ వంటి ఉత్పత్తుల నుండి విడుదలయ్యే వ్యర్ధాలతో కలుషి తమైన సముద్ర జలాల వలన సముద్రంలో విస్తారంగాఉండి,ప్రపంచంలో పది శాతం ఆక్సిజన్‌ను కిరణ జన్య సంయోగక క్రియ ద్వారా అందిస్తున్న ప్రోక్లోరో కోకస్‌ అనబడే బ్యాక్టీరియా తీవ్రంగా దెబ్బతింటున్న ట్లు శాస్త్రజ్ఞులు గుర్తించారు.శాస్త్రజ్ఞుల అధ్యయనం ప్రకారం 2050 సంవత్సరం నాటికి సముద్రా లలో చేపలకంటే ప్లాస్టిక్‌ పరిమాణం ఎక్కువగా ఉంటుందని తెలు స్తోంది. ప్రస్తుతానికి నదుల్లోనూ, సముద్రా ల్లోనూ మన ఆహారం నిమిత్తం సేకరించే చేపల్లో ప్రతి మూడు చేపలలో ఒక్క చేప ప్లాస్టిక్‌ అవశేషాలు కల్గిఉన్నట్లు తెలుస్తోంది.నేడు ప్రపంచ వ్యాప్తంగా సగటు మనిషి తినేఆహారంలో ఒకవారానికి 5గ్రాముల మైక్రోప్లాస్టిక్స్‌ కణాలను తింటున్నట్లు శాస్త్రజ్ఞుల అంచనా.ప్రపంచ వ్యాప్తం గా 1974సంవత్సరం నాటికిప్లాస్టిక్‌ తలసరి విని యోగం 2కేజీలు ఉండగా 2023నాటికి 43 కేజీ లకు చేరుకున్నది.ఈవినియోగం నానాటికీ ఆందోళన కరంగా పెరుగుతున్నది.2060నాటికి ప్లాస్టిక్‌ తల సరి వినియోగం123కేజీలకు చేరనున్నట్లు అంచనా. ఇంత ప్రమాదకరంగా పరిణమించి గాలి, నీరు, నేల,మానవ ఆరోగ్యాలను కబళిస్తున్న ప్లాస్టిక్‌ విని యోగాన్ని ప్రభుత్వాల స్ధాయిలోనే కాకుండా ప్రజ లందరూ వ్యక్తిగత స్ధాయిలో దీని ప్రాధాన్యతను అర్ధం చేసుకుని సరైన దృక్పథంతో స్పందించకపోతే రానున్న తరాలకు మనం మిగిల్చేది క్యాన్సర్లు, ఆస్తమా,గుండెపోటువంటి అనారోగ్యమూ, కలుషిత మైన నేల,నీరు,గాలి మాత్రమే. రామేశ్వరం పోయి నా శనీశ్వరం వదలదన్న సామెతలాగా మన దృక్ప థం మార్చుకోకపోతే భూమిని వదిలి చంద్ర మం డలం పోయినా మనకు తిప్పలు తప్పవు.
వ్యక్తిగతంగా మనమేం చేయవచ్చు?
టీ,కాఫీ తాగడానికి ప్లాస్టిక్‌ కప్పులు కాకుండా మట్టి,సిరామిక్‌, స్టీల్‌ కప్పులు వాడాలి. కూరగాయలు,పండ్లు, కిరాణా సరుకులు తెచ్చుకునే ప్రతిసారీ క్లాత్‌ బ్యాగును తీసుకు వెళ్లాలి.చికన్‌, మటన్‌, పాలు వంటి పదార్ధాలు కొనుక్కురావడానికి స్టీల్‌ క్యాన్‌,బాక్స్‌ వాడాలి.బయటకు వెళ్లే ప్రతి సందర్భంలోనూ,ప్రయాణాలలోనూ మంచినీళ్ల కోసం స్టీల్‌ బాటిల్‌ తీసుకువెళ్లాలి.బర్త్‌ డేలు,శారీ ఫంక్షన్లు,వివాహాలు,గృహప్రవేశాలు వంటి పలు సందర్భాలలో స్టీల్‌ గ్లాసులు మాత్రమే వాడాలి. ఫంక్షన్లలో ఇచ్చే రిటన్‌ గిఫ్ట్‌లు ప్లాస్టిక్‌వి కాకుండా పర్యావరణానికి మేలు చేసే…మొక్కలు,క్లాత్‌, జ్యూట్‌ బ్యాగులు వంటివి ఇవ్వాలి. ఇప్పటికే అనేక దేశా లలో ప్లాస్టిక్‌ బ్యాగులను నిషేధించడం జరిగింది. మన దేశంలో కొన్ని రాష్ట్రాలలో ప్లాస్టిక్‌ వినియో గంపై జరిమానాలు కూడా విధిస్తున్నారు. అధికా రికంగా తెలుగు రాష్ట్రాలలో కూడా 120 మైక్రాన్ల సైజు కంటే తక్కువ మందం కల్గిన ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులను మరియు సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించారు.
జులై 3 అంతర్జాతీయ ప్లాస్టిక్‌ బ్యాగు రహిత దినం సందర్భంగా…పర్యావరణ ప్రేమి కులు, ప్రజారోగ్య ఉద్యమకారులు, అభ్యుదయ వాదులు ప్లాస్టిక్‌ మహమ్మారిపై పోరును ఒక అత్య వసర ఉద్యమంగా చేపట్టాలి.పర్యావరణం, ప్రజా రోగ్య పరిరక్షణ కోసం,భావితరాలకు సురక్షిత మైన జీవితం కోసం…ప్లాస్టిక్‌ బ్యాగులు,బాటిల్స్‌ తదితర వస్తువులను బహిష్కరించాలి.క్లాత్‌ బ్యాగుల వాడ కాన్ని ప్రారంభించాలి. ఇందుకు అన్ని వర్గాల ప్రజ లూ స్వచ్ఛందంగా పూనుకుంటేనే సాధ్యం.
ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని పరిష్కరించడానికి పర్యాటకాన్ని పునర్నిర్మించడం
కోవిడ్‌-19 మహమ్మారికి ప్రతిస్పందన గా 2020లో పెరిగిన వ్యక్తిగత రక్షణ పరికరాల ఉత్పతి,వినియోగం బీచ్‌లు,ఇతర ప్రాంతాలలో ప్లాస్టిక్‌ కాలుష్యానికి గణనీయంగా దోహదపడిరదని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ప్లాస్టిక్‌ కాలు ష్యం పెరగడానికి దారితీసే కోవిడ్‌-19మహ మ్మారి మాత్రమేకాదు.కొత్త ఐక్యరాజ్యసమితి పర్యావ రణ కార్యక్రమం (ఖచీజుూ) నివేదిక,కాలుష్యం నుండి పరిష్కారం వరకు: సముద్రపు చెత్త మరియు ప్లాస్టిక్‌ కాలుష్యం యొక్క ప్రపంచ అంచనా, మహ మ్మారి కంటే ముందు కూడా ప్లాస్టిక్‌ కాలుష్యం సంవత్సరానికి పెరుగుతోందని చూపిస్తుంది. సము ద్రంలో ప్రస్తుతం75-199మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉన్నాయి మరియు 2016లో 9-14 టన్నుల వ్యర్థాలు జల జీవావరణ వ్యవస్థలోకి ప్రవేశించాయి. కానీ2040 నాటికి, ఇది దాదాపు మూడు రెట్లు పెరిగి సంవత్సరానికి 23-37 మిలి యన్‌ టన్నులకు చేరుకుంటుందని అంచనా. సముద్రపు చెత్తలో ప్లాస్టిక్‌లు అతిపెద్దవి, అత్యంత హానికరమైనవి మరియు అత్యంత నిరంతరాయంగా ఉంటాయి, మొత్తం సముద్ర వ్యర్థాల్లో కనీసం 85 శాతం వాటా కలిగి ఉంది. ప్లాస్టిక్‌ సంక్షోభాన్ని పరిష్కరించడానికి మరియు మానవ మరియు పర్యావరణ ఆరోగ్యాన్ని రక్షించడానికి ప్రయాణి కులు, ప్రభుత్వం ,సంస్థాగత విధానాలకు మార్పులు అవసరం.
ప్రయాణీకుల ఎంపికలు
సింగిల్‌-యూజ్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తుల విని యోగాన్ని తగ్గించడం మరియు కోవిడ్‌-19 ఇతర వ్యాధుల నుండి రక్షించడానికి ప్రజారోగ్యం మరియు పారిశుద్ధ్య చర్యలకు కట్టుబడి ఉండటం పరస్పర విరుద్ధం కాదని నిపుణులు అంటున్నారు. ‘‘మహ మ్మారి సమయంలో, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌ కంటే స్టీల్‌ వాటర్‌ బాటిల్స్‌ తక్కువ సురక్షి తమైనవి వంటి పునర్వినియోగ ఉత్పత్తులపై మేము అపోహను చూశాము’’అని యూనిస్కో ప్రోగ్రామ్‌ మేనేజర్‌ హెలెనా రేడిఅసిస్‌ చెప్పారు. ‘‘ఈ తప్పుడు అవగాహన వినియోగదారులచే సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచింది మరియు ప్రభుత్వ మరియు టూరిజం ఆపరేటర్ల నిబంధన లను ప్రభావితం చేసింది. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులు మరియు ప్యాకేజింగ్‌ స్వతహాగా శానిటై జేషన్‌ చర్యలు కాదు. వైరస్‌ వీటిపై జీవించగలదు వాటి రవాణా లేదా నిర్వహణ సమయంలో అవి కలుషితమవుతాయి. సెలవుదినం ప్రయాణీకులు ఖర్చులను ఆదా చేస్తూ వారు ఉత్పత్తి చేసే వ్యర్థాల మొత్తాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవచ్చని రే డి అసిస్‌ చెప్పారు. సొంతంగా బ్యాగులు, వాటర్‌ బాటిళ్లు,టాయిలెట్లను తీసుకురావడం వల్ల స్థానిక వ్యర్థాలు మరియు రీసైక్లింగ్‌ మౌలిక సదుపాయా లపై భారం తగ్గుతుంది.ఇది సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తులపై స్థానిక ఆర్థిక వ్యవస్థల ఆధారప డటా న్ని కూడా క్రమంగా తగ్గిస్తుంది.కోవిడ్‌ యొక్క క్లీన్‌ సీస్‌ ప్లాట్‌ఫారమ్‌ -సముద్ర ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని అంతం చేయడానికి అంకితమైన అతిపెద్ద ప్రపంచ కూటమి-‘‘మీ బాత్రూంలో ఏముంది?’’అనే పేరుతో ఒక ఇంటరాక్టివ్‌ ప్రాజెక్ట్‌ను రూపొందించింది. సాధారణ వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులలో ప్లాస్టిక్‌ వ్యాప్తిని హైలైట్‌ చేస్తుంది. ఈఉత్పత్తులు చాలా వరకు పర్యాటక వసతి గృహాలలో అందుబాటులో ఉన్నందున,ఆచరణీయ ప్రత్యామ్నాయాలకు మార డం ప్లాస్టిక్‌ ముప్పును తగ్గించడంలో సహాయపడు తుంది.
ప్రభుత్వ చట్టం
బీచ్‌లు,సముద్ర పర్యావరణ వ్యవస్థలపై ప్లాస్టిక్‌ కాలుష్యం ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయా ణికులు వసతి గృహాలు పునర్వినియోగ ఉత్పత్తులను ఉపయోగించవచ్చు. అన్‌స్ప్లాష్‌/ జాన్‌ కామెరాన్‌ ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని తగ్గించడంలో ప్రేరణ కేవలం వ్యక్తులకు మాత్రమే కాదు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించడానికి, తగ్గించడానికి లేదా దశలవారీగా తొలగించడానికి బలమైన చట్టం ప్రభావవంతమైన మార్గంగా చూపబడిరది. నిషేధాలు స్థానిక పర్యా టక రంగాన్ని ఆవిష్కరించడానికి, సందర్శకు లకు పర్యావరణ అనుకూల ఎంపికలను అందించ డానికి మరియు వినియోగదారులకు అవగాహన కల్పించడానికి ప్రేరేపించగలవు. కెన్యాలో, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌లపై నిషేధం దాని ‘‘ప్లాస్టిక్‌ కాలుష్య విపత్తు’’ను పరిష్కరించింది, కెన్యా యొక్క పర్యాటక మరియు వన్యప్రాణుల మంత్రిత్వశాఖ క్యాబినెట్‌ సెక్రటరీ నజీబ్‌ బలాలా తెలిపారు. ‘‘నిషేధం తగ్గిన ప్లాస్టిక్‌ కాలుష్యంతో కెన్యా బీచ్‌లు మరియు జాతీయ పార్కుల స్థితిని మెరుగుపరిచింది’’అని బలాలా చెప్పారు.‘‘ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా ఉండాలి ఎందుకంటే మనం మన దేశాన్ని శుభ్రం చేసినప్ప టికీ,ఎత్తైన సముద్రాలలోని ఓడల నుండి విసిరి వేయబడే ప్లాస్టిక్‌లు మన బీచ్‌లకు తుడిచివేయ బడతాయి. అందువల్ల, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ల వినియోగాన్ని తగ్గించి,చివరకు పూర్తిగా రద్దు చేయా లని ప్రజలకు ప్రపంచవ్యాప్త విజ్ఞప్తిని చేయాలను కుంటున్నాను.
సంస్థాగత ప్రోత్సాహకాలు
టూరిజం ఆపరేటర్లు, వ్యాపారాలు సంస్థలు కూడా పరిశ్రమ ప్లాస్టిక్‌పై ఆధారపడ కుండా స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వడానికి చొరవ తీసుకోవచ్చు. స్వచ్ఛందంగా ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించడంలో ముందుంటే వాణిజ్య ప్రయోజ నాలను పొందవచ్చు. తక్కువ చెత్త, ఉదాహరణకు, మరింత సుందరమైన వీక్షణలు మరియు ఎక్కువ మంది సందర్శకులకు దారి తీస్తుంది. కోవిడ్‌ నేతృ త్వంలోని గ్లోబల్‌ టూరిజం ప్లాస్టిక్స్‌ ఇనిషియే టివ్‌ (జీటీపీఐ),జాతీయ,స్థానిక ప్రభుత్వాలు, ప్రైవేట్‌ కంపెనీలు మరియు పర్యాటక రంగంలోని సహాయ క సంస్థలు ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని తగ్గించడానికి 2025 నాటికి సర్క్యులారిటీకి మారడానికి కట్టుబడి ఉం డాలి.ఆన్‌లైన్‌ ట్రావెల్‌ ప్లాట్‌ఫారమ్‌ దీశీశీసఱఅస్త్ర. షశీఎ ప్లాస్టిక్‌ల వృత్తాకార ఆర్థిక వ్యవస్థను రూపొం దించడానికి కట్టుబడి ఉన్న జీటీపీఐకి సంతకం చేసిన 100మందికి పైగా ఒకటి.ఈ నిబద్ధతలో ఆరోగ్య ప్రోటోకాల్‌లను కొనసాగిస్తూ సింగిల్‌ యూ జ్‌ ప్లాస్టిక్‌లను తొలగించే దశలుఉన్నాయి. ‘‘ఆరోగ్యం మరియు భద్రత చాలా ముఖ్యమైనదని మేము అంగీకరిస్తున్నప్పటికీ, మా భాగస్వాములలో చాలా మందికి వారి ప్రాపర్టీలలో అధిక స్థాయి పరిశుభ్రత,పరిశుభ్రతను అందించే ప్రత్యామ్నాయ, ప్లాస్టిక్‌ రహిత మార్గాల గురించి తెలియదని మేము చూశా ము’’ అని సస్టైనబుల్‌ సప్లై,థామస్‌ లౌగ్లిన్‌ అన్నారు. బుకింగ్‌ డాట్‌.కామ్‌లో లీడ్‌ చేయండి. ‘‘అందుకే మేము జీటీపీఐ భాగస్వామ్యంతో రూపొం దించిన మా స్వంత మార్గదర్శకాలను ప్రచురించా ము. మాభాగస్వాములు విశ్వసనీయమైన, ఆచర ణాత్మక సమాచారం యొక్క విస్తృత శ్రేణికి ప్రాప్యత కలిగి ఉన్నారని మేము నిర్ధారించుకోవాలను కుంటు న్నాము,కాబట్టి వారు ఈ సవాళ్లను స్థిరమైన మార్గం లో ఎలా ఎదుర్కోవాలనే దాని గురించి మరింత సమాచారంతో నిర్ణయాలు తీసుకోగలరు. ఖచీజుూ తూర్పు ఆఫ్రికాలో ఉన్న ఒక సర్క్యులర్‌ ఎకానమీ ఉద్యమం అయిన ఫ్లిప్‌ఫ్లోపి మరియు రూట్స్‌ అడ్వెం చర్‌తో భాగస్వామ్యమై, కెన్యాలోని లాము పర్యాటక ప్రదేశంలో సెట్‌ చేయబడిన ‘‘పీసెస్‌ ఆఫ్‌ అస్‌’’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ను విడుదల చేసింది. పర్యాటక ఆధారిత ఉత్పత్తులపై ఆధారపడే దిశగా స్థానిక ఆర్థిక వ్యవస్థను మార్చడంలో సందర్శకులు పోషిం చిన పాత్రను ఈ చిత్రం హైలైట్‌ చేస్తుంది. మహ మ్మారి-అమలు చేయబడిన మూసివేతలను అను సరించి,పర్యాటకులు, ప్రభుత్వాలు మరియు సంస్థలు పర్యాటక పరిశ్రమను దాని హృదయంలో స్థిర త్వంతో పునర్నిర్మించడానికి ఒకప్రత్యేకమైన అవకా శాన్ని కలిగి ఉన్నాయి. ఇప్పుడు ప్లాస్టిక్‌ కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి మరియు పరిశుభ్రమైన, మరింత స్థితిస్థాపకంగా మరింత ఆర్థికంగా లాభ దాయకమైన భవిష్యత్తును నిర్ధారించడానికి సమయం ఆసన్నమైంది.-(డా.కె.శివబాబు)

పరిశ్రమల్లో ప్రమాదాలు రక్షణ లేని జీవితాలు

పరిశ్రమల్లో విధులకు వెళ్లిన కార్మికులు క్షేమంగా ఇల్లు చేరడం కష్టంగా మారింది. ముఖ్యంగా మండలంలోని పలు రసాయన పరిశ్రమల్లో కనీస రక్షణ చర్యలు లేకపోవడం, నైపుణ్యం గల కార్మికులను తీసుకోకపోవడం అధిక ప్రమాదాలకు కారణంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రమాదాలకు అధిక కారణంగా నిలిచే రియాక్టర్లు బాంబుల్లా పేలుతున్నాయి. ఇక్కడ నిపుణులైన కార్మికులు పనులు చేయాల్సి ఉండగా కనీస అవగాహన లేని టెంపరరీ, కాంట్రాక్ట్‌ కార్మికుల చేత పనులు చేయిస్తున్నారు. వారు రియాక్టర్ల ఒత్తిడిని సరైన సమయంలో గుర్తించకపోవడం, కెమికల్‌ రియాక్షన్‌ను నివారించడంలో విఫలం కావడంతో పేలుళ్లు జరుగుతున్నాయి. ఇక ప్రమాదం జరిగిన వెంటనే పరిశ్రమ వర్గాలు చికిత్స కోసం క్షతగాత్రులను తరలించక పోవడంతో పాటు కొన్నిమార్లు వారు ఏమయ్యారో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికంగా విధులు నిర్వహించే వారిలో అధికంగా స్థానికేతరులే ఉండడంతో వారి తరఫున పరిశ్రమలపై పోరాటం చేసే వారు లేక కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. కాగా చాలా పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగిన వెంటనే చికిత్స కోసం తరలించేందుకు అంబులెన్స్‌ లాంటి వాహన సౌకర్యాలు లేక నగరానికి చేరేలోపు మరణించిన ఘటనలు కోకొల్లలు. – గునపర్తి సైమన్‌
ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పేరుతో పరిశ్రమాధిపతులకు ప్రభుత్వాలు పలు మినహా యింపులు, రాయితీలు ఇచ్చాయి. దాంతో పరిశ్రమలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి,లోపాలను గుర్తించి, వాటిని సరిచేయించే సమున్నత ప్రభుత్వ పర్యవేక్షణ వ్యవస్థ నిర్వీర్యమైంది. అందుకే పరిశ్రమల్లో ప్రమాదాలు పెరుగుతున్నాయి. కార్మిక భద్రత, ప్రమాణాలు పాటించడానికి, ప్రమాద సమయంలో కార్మికులు చనిపో కుండా బయటపడే పరికరాలు సరఫరా చేయడానికి యాజమాన్యాలు ముందుకు రావడంలేదు. చట్టపరంగా పరిశ్రమల్లో కార్మికులభద్రతకు అధికప్రాధాన్యత ఇవ్వాల్సిన యాజమాన్యాలు, వాటినిఖర్చుగా చూస్తున్నాయి.తమ లాభాలశాతం తగ్గిపోతున్నట్లుగా భావిస్తు న్నాయి. పరిశ్రమకు విస్తృతార్ధం వుంది.ఓ పరిశ్రమ ఉత్పత్తి ప్రక్రియ మానవుని శ్రమపై ఆధారపడినట్లే,ఓపరిశ్రమ ఏర్పాటులో మానవుని త్యాగాలు ఎన్నో వున్నాయి.ఎంతోమంది రైతులు తమ జీవనాధారమైన వ్యవసాయ భూములను కోల్పోతారు.కొన్నేళ్ల నుంచి కలిసిమెలిసి బతికే మనుషులు నిర్వాసితులై చెల్లాచెదురవుతారు. వ్యవసాయాధారిత చేతివృత్తుల కుటుంబాల జీవనోపాధి దెబ్బ తింటోంది. ఎన్నో కుటుంబాలు,ఎంతో మంది జీవితాలు శిథిలమైతే తప్ప,నష్టాన్ని చవిచూస్తే తప్ప పారిశ్రామిక ప్రగతికి పునాదులు పడవు. పారిశ్రామికోత్పత్తి ప్రక్రియ జరగడానికి ముందు,తరువాత మనిషి త్యాగం, శ్రమ వుందన్న విషయం పెట్టుబడిదారీ వ్యవస్థ ఉద్దేశపూర్వకంగా విస్మరి స్తోంది.లాభం కోసం అమానవీయ అంశాలను ముందుకు తెచ్చి మానవీయ విలువలను, శ్రమను, మనిషి ప్రాణాలను అప్రధానమైనవిగా భావిస్తోంది.ఈ చులకన,హేయమైన భావనలో నుంచి మనిషిని మనిషిగా చూడ్డం, గౌరవిం చడం,ప్రేమించడం అనే నైతికత నశించి…తానెదగడానికి, లాభాలు పోగేసు కోవడానికి ఎంతటి నీచానికైనా దిగజారుతున్న పరిస్థితులను తరచూ చూస్తు న్నాం.చట్టపరమైన ఉల్లంఘనలు,యాజమాన్య నిర్లక్ష్యమే పరిశ్ర మల్లో ప్రమా దాలు జరిగి కార్మికుల ప్రాణాలు పోవడానికి,గాయాల పాలు కావడానికి దారితీస్తున్నదన్న వాస్తవాన్ని అర్ధంచేసుకోవాలి.పారిశ్రామికాభి వృద్ధి పేరుతో కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు పరిశ్రమాధిపతులకు కల్పిస్తున్న వెసులుబాట్లు ప్రమాదాలు పెరగడానికి ఒక హేతువుగా మారాయి.ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పేరుతో పరిశ్రమాధిపతులకు ప్రభుత్వాలు పలు మినహాయింపులు,రాయితీలు ఇచ్చాయి.దాంతో పరిశ్రమలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి,లోపాలను గుర్తించి,వాటిని సరిచేయించే సమున్నత ప్రభుత్వ పర్యవేక్షణవ్యవస్థ నిర్వీర్యమైంది. అందుకే పరిశ్రమల్లో ప్రమాదాలు పెరుగుతున్నాయి.కార్మిక భద్రత,ప్రమాణాలు పాటించడానికి, ప్రమాద సమయంలో కార్మికులు చనిపోకుండా బయటపడే పరికరాలు సరఫరా చేయడానికి యాజమాన్యాలు ముందుకు రావడం లేదు.చట్టపరంగా పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన యాజమాన్యాలు, వాటిని ఖర్చుగా చూస్తున్నాయి.తమ లాభాల శాతం తగ్గిపోతున్నట్లుగా భావిస్తున్నాయి. తమ లాభాలకు మూలం కార్మికుల శ్రమన్న వాస్తవాన్ని గ్రహించ నిరాకరిస్తున్నాయి.
పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఐదేళ్లలో జరిగిన119 ప్రమాదాల్లో 120 మంది కార్మికులు చనిపోయారు.68మంది గాయపడ్డారు.గతేడాది 24కంపెనీల్లో జరిగిన ప్రమాదాల్లో 20మంది మృతి చెందారు.18 మంది వికలాంగులయ్యారు.పరిశ్రమల్లో జరిగిన ప్రమా దాల తీవ్రతకు ఇవి అద్దం పడుతున్నాయి. ప్రమా దాలు జరిగినప్పుడు మృతిచెందిన కార్మిక కుటుం బాలకు పరిహారం చెల్లించే ఒక పద్ధతిని యాజమా న్యాలు అనుసరిస్తున్నాయి గానీ పరిశ్రమల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడంలేదు. ఖర్చు చేయడానికి ఇష్ట పడ్డంలేదు. పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలకు యాజమాన్యాలు విలువ ఇవ్వడంలేదు. విశాఖనగరంలో 2020 మే 7న ఎల్‌.జి పాలిమ ర్స్‌లో జరిగిన ప్రమాదంలో 15మంది మరణిం చారు.దక్షిణ కొరియాకు చెందిన బహుళజాతి సంస్థ ఎల్‌.జి పాలిమర్స్‌ యాజమాన్యం నుంచి మృతుల కుటుంబానికి కోటి రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషి యో ఇప్పించింది. ఎంత డబ్బు ఇచ్చినా పోయిన ప్రాణాలు తిరిగిరావు.ప్రాణాలు కోల్పోయిన కుటుం బాల బాధలు తీరవు. కుటుంబాలకు పెద్దదిక్కుగా వున్న వారు,విద్యార్థులు,ప్రమాదం నుంచి తప్పించు కోలేక ఊపిరాడక చనిపోయిన వృద్ధులు ఇలా వివిధ వయస్సుల వారు చనిపోయారు. ఈ మరణాలకు, అనేక మంది అస్వస్థతకు గురై ఆస్పత్రులపాలై ఆరో గ్యాలు కోల్పోవడానికి కారణమైన యాజమాన్యంపై చర్యల్లేవు. మనిషి తలకు విలువ కట్టే ఈ వ్యవస్థలో బహుశా ఇంతకంటే మెరుగైన, ప్రగతిదాయక ఆలోచనలు పరిశ్రమాధిపతుల బుర్రల్లో మొలకెత్తు తాయని ఆశించలేము. పరిశ్రమ అనగానే డబ్బులు పోగు చేసుకొనే యంత్రాంగంగా యాజమాన్యం భావించినంత కాలం మనిషి శ్రమకు, ప్రాణాలకు విలువ వుండదు. ప్రమాదాలు ఎల్‌.జి పాలిమర్స్‌, పరవాడ ఫార్మా కంపెనీల్లోనూ, అచ్యుతాపురం సెజ్‌లోని పరిశ్రమలకే పరిమితం కాలేదు. రాష్ట్రం లోని రసాయన, మందుల పరిశ్రమల్లోనూ ప్రమా దాలు చోటు చేసుకుంటున్నాయి. మరణాలు సంభవిస్తున్నాయి.హెచ్‌పిసిఎల్‌లో జరిగిన ప్రమా దంలో 12 మంది, స్టీల్‌ప్లాంట్‌ లోని ఎస్‌ఎంఎస్‌2 లోని ఆక్సిజన్‌ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో 12 మంది చనిపోయారు. ప్రమాదం ఏ పరిశ్ర మలో ఎప్పుడు జరిగినా కార్మికులు చనిపోతూనే వున్నారు. ఈ చావులకు కారణం యాజమాన్యాల నిర్లక్ష్యమేనని ప్రమాదనంతరం జరిగిన నివేదికల్లో బట్టబయలవుతున్నాయి.పరిశ్రమలో భద్రత, కార్మి కులకు రక్షణ పరికరాలు ఇవ్వడంలో చూపుతున్న అలసత్వాన్ని నివేదికలు ఎత్తిచూపుతున్నాయి. అయినా పరిశ్రమాధిపతుల వైఖరిలో మార్పు రావడంలేదు.భద్రతను పట్టించుకోవడంలేదు. పైగా ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులపై నెపం నెట్టి తప్పించుకొనే ప్రయత్నాలు యాజమాన్యాలు చేస్తు న్నాయి.తన నిర్లక్ష్యంవల్ల జరిగిన ప్రమాదానికి కార్మి కులు చనిపోయారన్న అసలు విషయాన్ని దాచిపెట్టి, చనిపోయిన కార్మిక కుటుంబానికి ఎక్స్‌గ్రేషియో చెల్లించడాన్ని గొప్ప ఉదారతగా యాజమాన్యాలు ప్రచారం చేసుకుంటున్నాయి. నాణ్యమైన రియాక్టర్లు ఏర్పాటు చేయడంలేదు. ప్రమాదం జరిగినప్పుడు కార్మికులు ప్రమాద స్థలం నుంచి తప్పించుకొని పారిపోయి ప్రాణాలు కాపాడుకొనేందుకు అనువైన వాతావరణాన్ని పని ప్రదేశంలో యాజమాన్యాలు కల్పించడంలేదు. పరిశ్రమలో ప్రమాదం ముందు గానే గుర్తించి హెచ్చరించే ఆధునిక అలారం వ్యవస్థ లేదు.ఫైర్‌ సిస్టమ్‌ సరిగాలేదు.విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరగకుండా పటిష్టమైన నియంత్రణ వ్యవస్థ లేదు. పరిశ్రమల్లో అంతర్గత ప్రమాదాలకు ఇవి కారణ మౌతుండగా,పర్యావరణ సమస్యలతో పరిసర ప్రాంత ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే వరకు సమీప ప్రాంత ప్రజలను సొంత మనుషుల్లా చూసు కుంటామని చెప్పిన యాజమాన్యాలు, హామీ ఇచ్చిన ప్రభుత్వాలు తరువాత ఆప్రజల బాధలు వినడంలేదు.పర వాడ ఫార్మా సిటీకి ఆనుకొనివున్న తాడిని తరలి స్తామని ఎన్నికలహామీ ఇవ్వడం తప్ప తరలించి వారి బాగోగులను పట్టించుకోవడంలేదు. కంపెనీల వల్ల కలుషితమైన భూగర్భ జలాలను తాగలేక… పరవాడ, లంకెలపాలెం నుంచి వాటర్‌ క్యాన్లు కొనుక్కోవాల్సిన దుస్థితి తాడి వాసులకు ఏర్పడిరది. రసాయన, ఔషధ పరిశ్రమ వున్న ప్రతీ చోటా ప్రజలు వ్యాధుల బారినపడుతున్నారు. పరిశ్రమలను ప్రోత్సహించే పేరిట మానవ,పర్యావరణ విధ్వం సాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి.తనకు కంపె నీలో జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్న యాజమాన్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహించడంతో కనీస వేతనాలు అమలు కావడంలేదు. వారి భద్రతను పట్టించు కోవడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు బర్నింగ్‌వార్డు సహా అత్యవసర వైద్య సేవలు అందించేలా పారిశ్రా మిక ప్రాంతంలో సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మిం చాలి.కార్మికుల ప్రాణాలు కాపాడే చర్యలు చేప ట్టాలి.గతేడాది అచ్యుతాపురం సెజ్‌ లోని బ్రాండిక్స్‌ అపెరల్‌ సిటీ లోని సీడ్స్‌ వస్త్ర పరిశ్రమలో రెండు నెలల వ్యవధిలో రెండుసార్లు విషవాయువులు లీక యిన ఘటనలో వందలాది మంది మహిళా కార్మి కులు ఆస్పత్రుల పాలయ్యారు. పత్రికల్లో వచ్చిన వార్తలను సుమోటోగా తీసుకున్న నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి)…ఆస్పత్రుల్లో చికిత్స పొందిన కార్మికునికి లక్ష రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని, పర్యావరణ పరిరక్షణకు రూ.10కోట్లు కాలుష్య నియంత్రణ మండలి ఖాతాలో జమ చేయాలని ఇచ్చిన తీర్పును యాజమాన్యం పట్టించు కోని పరిస్థితి వుంది. కోర్టు తీర్పులు అమలు చేయా ల్సిన ప్రభుత్వ యంత్రాంగం చేతులు కట్టుకొని యాజమాన్యం వద్ద నిలబడేలా ప్రభుత్వ విధాన నిర్ణయాలున్నాయి. పరిశ్రమల్లో కార్మికుల భద్రత, సమీప ప్రజల ఆరోగ్య బాధ్యత యాజమాన్యాలు తీసుకొనేలా కార్మికులు, ప్రజలు ఐక్యంగా పోరా డాలి.నిర్వాసిత కుటుంబ సభ్యుల విద్యార్హత ఆధా రంగా ఉపాధి కల్పించేలా ఒత్తిడి తేవాలి. భద్రత పాటించని కంపెనీల జాబితాను బహిర్గత పర్చాలి. నిర్దిష్ట కాలపరిమితిలో లోపాలను సరిచేయని కంపె నీల రిజస్ట్రేషన్‌ రద్దు చేయాలి.
ప్రమాదాల నివారణకు ఇలా..
ఇటీవల కాలంలో పరిశ్రమల్లో భద్రతా వైఫల్యాల కారణంగా ప్రమాదాలు వాటిల్లుతున్న నేపథ్యంలో.. వాటిని కట్టడి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక నుంచి పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నది లేనిది తనిఖీ చేసేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని నిర్ణయించింది. పరిశ్ర మలు-భద్రతా ప్రమాణాలపై రాష్ట్రపర్యవేక్షణ కమిటీ సమావేశం అమరావతి సచివాలయంలో జరిగింది.ఈసమావేశంలో రాష్ట్రమంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మనూరు జయరాం, గుడివాడ అమర్‌నాథ్‌ పాల్గొన్నారు. వివిధ శాఖల అధికా రులతో మంత్రులు పరిశ్రమల్లో భద్రతా ప్రమా ణాలపై సమీక్షించారు. వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పరిశ్రమల్లో భద్రతా వైఫల్యాల కారణంగా జరుగుతున్న ప్రమా దాలను పూర్తిగా కట్టడిచేయాలని మంత్రులు ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో అన్ని పరిశ్రమల్లో పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలను తనిఖీ చేసేందు కు మూడునెలల్లో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని సూచించారు. విశాఖపట్టణంలోని ఎల్జీ పాలిమ ర్స్‌లో జరిగిన ప్రమాదాన్ని హెచ్చరికగా తీసుకోవా లన్నారు.భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలూ జరగ కుండా కట్టుదిట్టంగా భద్రతా నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు.పరిశ్రమలు,కాలుష్య నియంత్రణ మండలి, కార్మిక శాఖల అధికారులు సంయుక్తంగా ప్రతి ఆరు నెలలకోసారి తనిఖీలు నిర్వహించాలని మంత్రులు సూచించారు. కలెక్టర్లు ఛైర్మన్‌గా ఏర్పడిన జిల్లా కమిటీలు స్వయంగా ఈ తనిఖీలు చేయాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా పెద్ద సంఖ్యలో పరిశ్రమలు రానున్నట్లు వెల్లడిరచారు. రెడ్‌ కేటగిరీ పరిశ్రమలకు సమీపంలో జనావా సాలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఇప్పటికే ఉన్నపరిశ్రమల చుట్టూ పట్టణీకరణ పెరిగితే.. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిచ్చి ప్రత్యా మ్నాయ మార్గాలను పరిశీలించాలని మంత్రులు ఆదేశించారు. ప్రజలకు హాని కలిగించే పరిశ్రమ లపై ప్రత్యేక నిఘా పెట్టి.. పరిశ్రమల చుట్టూపక్కల ప్రజలు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. భవిష్యత్తుల్లో భద్రతా వైఫల్యాల కారణంగా పరిశ్రమల్లో ప్రమాదాలు జరగడానికి వీలులేదన్నారు. సీఏం జగన్మోహన్‌ రెడ్డి ఈవిషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారని మంత్రులు తెలిపారు. నిబంధనలు పాటించని పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.
దేశవ్యాప్తంగా ఎంత మంది మృతి చెందారు..?
దేశంలో కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) మహమ్మారి కట్టడికి విధించిన దేశవ్యాప్త లాక్‌ డౌన్‌ కు రెండు నెలల అనంతరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలిం పులతో పరిశ్రమలు తెరుచుకున్నాయి. దీంతో పరిశ్ర మల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్యాస్‌ లీకేజీ, పేలుళ్లు వంటి ప్రమాదాలు చోటు చేసుకుంటు న్నాయి. ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రజలు, కార్మికులు మృతి చెందారు.ఈ రెండు నెలల్లో దేశ వ్యాప్తంగా ఎన్నిపరిశ్రమల్లో ప్రమాదాలు జరిగా యంటే..?ఈ ఏడాది మే నుండి పరిశ్రమ లలో కనీసం 33 ప్రమాదాలు జరిగాయి.76మంది మృతి చెందారు.195 మంది తీవ్రంగా గాయ పడ్డారు. మే 3 నుంచి జూలై 14మధ్య జరిగిన 33 ప్రమాద ఘటనల్లో ఛత్తీస్‌గఢ్‌ నుండి గరిష్టంగా ఏడు ఘట నలు జరిగాయి. గుజరాత్‌లో ఆరు, మహారాష్ట్రలో నాలుగు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ అన్ని ప్రమాదాలు జరిగిన సంద ర్భాల్లో పరిశ్రమల్లో కార్మికులు, పరిశ్రమలకు సమీప దూరంలో ఉన్న నివాసితులు విషపూరిత రసాయ నాలకు గురయ్యే కనీసం అవకాశం ఉంది.ఈప్రమాదాలవల్ల రాబో యే నెలలు లేదా సంవత్స రాల్లో ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయనేది హెచ్చరిక సంకేతం.
చత్తీస్‌గఢ్‌ లోని బొకారో స్టీల్‌ ప్లాంట్‌లో నాలుగు ప్రమాదాలు జరిగాయి.ఈ కాలంలో ఒకే పరిశ్రమలో అత్యధికంగా ప్రమాదాలు ఇక్కడే జరి గాయి.ఈ ప్రమాదాల్లోఒకవ్యక్తి మృతి చెందగా,మరో ఏడుగురు గాయపడ్డారు.మే,జూన్‌నెలల్లో తమిళ నాడులోని నెవేలి లిగ్నైట్‌ కార్పొరేషన్‌లో జరిగిన రెండు అగ్ని ప్రమాదాలలో 20 మంది కార్మికులు మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఎల్‌జి పాలిమర్స్‌లోగ్యాస్‌ లీక్‌ కావడం వల్ల కనీసం 11 మంది మృతి చెందగా,100 మంది గాయ పడ్డారు. ఇటీవలి కాలంలో ఇది అతిపెద్ద ఘట నలలో ఒకటి నమోదైంది.దీని తరువాత కోవిడ్‌ -19సమయంలోనూ,తరువాత కర్మాగారాలు తిరిగి తెరవడానికి జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్‌డిఎంఎ) తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. మొదటి వారంలోనే ఉత్పత్తిని పెంచ వద్దని,బదులుగా ట్రయల్‌ ప్రాతిపదికన అమలు చేయమని వారికి సలహా ఇస్తుంది. ఉత్పాదక విభా గాలలో గ్యాస్‌లీకేజీల కారణంగా ఐదుసంఘ టన లు జరిగాయి. ఇందులో 17మంది ప్రాణాలు కోల్పోయారు. కనీసం 111మంది గాయపడ్డారు. బాయిలర్‌ పేలుడు జరిగిన మూడు సంఘటనలలో 22 మంది ప్రాణాలు కోల్పోగా,49మంది గాయ పడ్డారు.ఈ కాలంలో తయారీ యూనిట్లలో ఎని మిది అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇందులో 14 మంది మరణించారు. ఏడుగురు గాయపడ్డారు. మే నుండి లాక్‌ డౌన్‌ సమయంలో పరిమితులతో పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతించింది. జూన్‌ నుండి ప్రభుత్వం‘అన్‌లాక్‌’ప్రక్రియను ప్రారంభ మైనప్పుడు నుంచి పరిశ్రమలకు పూర్తిగా స్వేచ్ఛ వచ్చింది.గత నెలలోప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో ఇండస్ట్రియల్‌ గ్లోబల్‌ యూనియన్‌ జనరల్‌ సెక్రటరీ వాల్టర్‌ సాంచెస్‌ ‘‘భయంకరమైన వాస్తవం ఏమిటంటే..ఈ తీవ్రమైన ప్రమాదాల జరగడానికి పరిశ్రమల వైఫల్య నమూనాను సూచిస్తుంది. ఇంకా ఎక్కువ ప్రమాదాలుసంభవించే అవకాశం ఉంది’’ అని పేర్కొన్నారు.‘‘భద్రతా నియంత్రణలో ఈ రక మైన నిర్లక్ష్యం గమనించినప్పుడు. 1984 భోపాల్‌ విపత్తు స్థాయిలోపెద్ద విపత్తు సంభవించే అవకా శాన్ని తోసిపుచ్చలేము’’ అని సాంచెస్‌ రాశారు.

ఉపాధి హామీకి రక్షణ చట్టం` ఆవశ్యం

ఒకే ఏడాది సుమారు 6 కోట్లకు పైగా పని దినాలు తగ్గిపోయాయి. అంతే కాకుండా చట్టంలోని మౌలిక అంశాలను, కనీస సౌకర్యాలను రద్దు చేసింది. రెండు పూటలా పని చేయాలని నిర్ణ యించింది. ఎండాకాలంలో ఇస్తున్న 20శాతం నుండి 30 శాతం అలవెన్స్‌ను తొలగించింది. చివరకు గుక్కెడు మంచినీళ్ళ కోసం ఇస్తున్న డబ్బులను సైతం రద్దు చేసింది. పొమ్మనకుండా పొగబెట్టి, పేదలే ఈ పథకం వద్దనేలా కేంద్ర ప్రభుత్వం కుట్రకు పూను కున్నది. దీనికి తందాన అంటూ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వాటా 10శాతం నిధులను విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నది. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో30 శాతం సమ్మర్‌ అలవెన్స్‌ ఇచ్చే వారు. ఒకా నొక సందర్భంగా 50 శాతం కూడా ఇచ్చారు. చట్టం ప్రారంభం అయినప్పటి నుండి వున్న ఈ అలవెన్స్‌ను ఈసంవత్సరం కేంద్ర ప్రభుత్వం కావాలనే రద్దు చేసింది.దీనివల్ల ఎర్రటి ఎండలో చేతులు బొబ్బ లెక్కే లా పని చేసినా గిట్టుబాటు కూలి రావడం లేదు. పేదలు ఈపని మానుకుంటే తప్పుడు మస్టర్లు సృష్టించి కాంట్రాక్టర్లు,దళారులకు కట్ట బెట్టేందుకు ప్రయత్ని స్తున్నారు.
కూటి కోసం..కూలి కోసం..పనులు చేసుకుని బతు కుదామని బయల్దేరిన శ్రమజీవులు మార్గ మధ్యంలోనే ప్రమాదాల బారినపడి బలవుతు న్నారు. ఇటీవల మనరాష్ట్రంలో జరిగిన భారీ ప్రమాదాలన్నింటిలోనూ ప్రాణాలు కోల్పోయింది బడుగుజీవులే కావడం విషాదం.ఈ వారంలో మన రాష్ట్రంలో మూడు భారీ ప్రమాదాలు జరగ్గా, వాటిలో మరణించిన వారిలో 17 మంది మహిళలే కావడం విషాదం. వీటిలో రెండు ప్రమాదాల్లో మరణించిన వారంతా రెక్కాడితేగాని డొక్కాడని మహిళలు. అందువల్లే సెవెన్‌ సీటర్‌ ఆటోలో ఒక ఘటనలో 23 మంది, మరో ఘటనలో 14 మంది ప్రయాణించారు.తెలంగాణ నార్కట్‌పల్లి-మన రాష్ట్రంలోని అద్దంకిని కలిపే ఆ రహదారిలో అంతవరకూ నాలుగు రోడ్ల లైనులో వేగంగా వచ్చిన వాహనాలు సింగిల్‌లైనులోనూ అదే స్పీడులో రావ డంవల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. 2010లో నాలుగులైన్లరోడ్డు పూర్తయినా..వివాదాలు పరి ష్కారం కాకపోవడంతో ఆ ప్రాంతం ప్రమాదాలకు హాట్‌ స్పాట్‌గా మారింది. గత మూడేళ్లలో 12 ప్రమాదాలు ఆ ప్రాంతంలో జరిగాయంటేనే పరిస్థి తి అర్థం చేసుకోవచ్చు. మిరపకాయల పని కోసం తెలంగాణ నుంచి బయల్దేరిన 23మందిలో ఆరు గురు మరణించడం, ఏడుగురు తీవ్రంగా గాయ పడటంతో ఆగిరిజన కుటుంబాల జీవనం చిన్నా భిన్నమైంది. రొయ్యల శుద్ధి పరిశ్రమలో పనిచేసి తిరిగివస్తున్న యానాం ప్రాంతానికి చెందిన ఏడు గురు మహిళలు కాకినాడ జిల్లాలో జరిగిన ప్రమా దంలో మరణించగా, మరో ఏడుగురు తీవ్ర గాయా ల పాలయ్యారు. ప్రైవేటు ట్రావెల్‌ బస్సును క్లీనర్‌ నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
రహదారులు రక్తసిక్తం కావడం వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలవల్ల మరణిస్తున్న వారి సంఖ్య 13 లక్షల కు పైమాటే. మరో రెండుకోట్ల నుంచి ఐదు కోట్ల మంది వరకూ తీవ్ర గాయాల పాలవు తున్నారు.ఈ గాయాలవల్ల వికలాంగులై జీవచ్ఛ వాల్లా బతుకు తున్న వారి సంఖ్యే ఎక్కువ. మృతుల సంఖ్యలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండటం, క్షతగాత్రుల సంఖ్యలో మూడోస్థానంలో ఉండ టం…మన దేశంలో రహదారుల భద్రత దుస్థితిని చాటిచెబుతోంది. 2020 లెక్కల ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కులే 69.80 శాతమని కేంద్ర మంత్రి పార్లమెంటులో వెల్లడిరచారు. 2020లో దేశంలో 3,74,397 మంది మరణిస్తే, 2021లో 3,97,530 మంది బలయ్యారు. బిజెపి పాలిత మధ్యప్రదేశ్‌ 40,510 మరణాలతో..10.2 శాతం, ఉత్తర ప్రదేశ్‌ 36,521 మరణాలతో.. 9.2 శాతం ప్రమాదాలతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో ఏటా నాలుగు శాతం మరణాలు సంభవిస్తున్నాయి. 2021 లెక్కల ప్రకారం 16,044 మంది బలయ్యారు. రోడ్డు రవాణా, హైవేల మంత్రి త్వశాఖ ఇచ్చిన వివరాల ప్రకారం ప్రమాదాలకు ఐదు ప్రధాన కారణాలున్నాయి. వాటిలో పరధ్యానంగా నడపటం, అత్యధిక వేగంతో నడప టం, మద్యం సేవించి నడపడం, ట్రాఫిక్‌ నిబంధ నలు పాటించకపోవడం, రహదారులు ఛిద్రమై ప్రమాదకరంగా ఉండటం.నూతన సాంకేతిక నైపు ణ్యంతో అతివేగంగా దూసుకెళ్లే వాహనాలు మార్కెట్‌లోకి వస్తుండగా, అందుకు అనుగుణంగా రహదారులు మెరుగుపడటం లేదు. దీంతో, వాహ న వేగం ఎందరి ప్రాణాలనో బలిగొంటోంది.
మరోవైపు… రోజురోజుకూ ఉపాధి మార్గాలు కుంచించుకుపోవడం,ఉపాధి హామీకి సైతం సవాలక్ష కొర్రీలు ఉండటం…తదితర కారణాలవల్ల దూర ప్రాంతానికైనా వెళ్లి పనులు చేసేవారి సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో పెరుగు తోంది.రోజూ పనులు దొరక్కపోవడంతో కుటుం బం గడవడం కష్టమవుతోంది. దీంతో, భర్తలకు చేదోడువాదోడుగా ఉండేందుకు మహిళలు సైతం పనులకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలోనే అధిక ఛార్జీలు భరించలేక ఆటోల్లో కిక్కిరిసి ప్రయా ణిస్తూ జీవితాలను బలిపెట్టుకుంటున్నారు. ‘బేటీ బచావో.. బేటీ పఢావో..’ అని నినాదమిచ్చిన మోడీ ప్రభుత్వం గానీ, అక్కచెల్లమ్మలు అంటూ నిత్యం జపం చేసే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గానీ ఉపాధి,ఉద్యోగ కల్పనకు శ్రద్ధపెట్టింది లేదు. దీంతో, రొయ్యల శుద్ది లాంటి కష్టమైన పనులు చేస్తూ… ఎటువంటి భద్రత లేని ప్రయాణం చేస్తూ బలవు తున్న వ్యవసాయ కార్మికులు, మహిళలు రాష్ట్రంలో పెరుగుతున్నారు.ప్రమాదాలు జరిగినప్పుడు నష్టప రిహారం ప్రకటించి చేతులు దులుపుకోవడం కాకుం డా ప్రమాదాల నివారణకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వా లు చిత్తశుద్ధితో కృషి చేయాలి. మృతుల కుటుంబా లను, క్షతగాత్రులను ఆదుకునేందుకు అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.- (వి.వెంకటేశ్వర్లు)

చరిత్ర పాఠాల తొలగింపు

జాతి నిర్మాణానికి విలువలు కలిగిన విద్యార్థు లను తయారు చేయడమే విద్యావ్యవస్థ లక్ష్యం. కాని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ నూతన విద్యా విధానం (ఎన్‌ఇపి) జాతిలక్ష్యాలకు, రాజ్యాంగ సూత్రాలకు భిన్నం గా నిర్ణయాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటికే క్లస్టరైజేషన్‌, డిజిటలైజేషన్‌, విలీన ప్రక్రియలు, వృత్తి విద్యా కోర్సులలో ఎన్‌ఇపి అమలు వలన ఎటువంటి దుష్ఫరిణామాలను చవిచూస్తున్నామో అనుభవాలు రుజువు చేస్తున్నాయి. ఇదిలావుండగా సిలబస్‌లో, పాఠ్యాంశాలలో కూడా కేంద్రం జోక్యం పెరుగుతున్నది. తాజాగా 2023-24 విద్యా సంవత్సరానికి సంబం ధించి పన్నెండవ తరగతి పాఠ్యపుస్తకాలలో చరిత్రకు సంబంధించిన చాప్టర్లను తొలగించారు.
భావి పౌరులకు దేశచరిత్ర తెలియ కూడదనే సరిగ్గా కోవిడ్‌ విపత్తు సమయంలో, వ్యవస్థ లేవీ పని చేయలేని విపత్కాల పరిస్థితులతో కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఇపి అమలుకు పూనుకుంది. విద్యా సంస్థలు కోల్పోయిన పనిదినాలను దృష్టిలో పెట్టు కుని విద్యార్థులపై భారం తగ్గించాలని 30 శాతం సిలబస్‌ను తగ్గించాలని ఎన్‌సిఇఆర్‌టి కూడా సూచిం చింది. ‘వేటిని తొలగించాలి? ఎవరి అభిప్రాయా లు తీసుకోవాలనే ప్రక్రియగాని, పారదర్శకతగాని లేదు.2021లోని సిలబస్‌ను తగ్గించేటపుడు విద్యా ర్థులపై భారాన్ని తగ్గించే విధంగా లేదు. పాలకుల భావజాల వ్యాప్తికి అడ్డంకిగా వున్న పాఠ్యాంశాలను తొలగించారు.కోవిడ్‌ విపత్తును అవకాశంగా మలు చుకుని, వారి ఎజెండా అమలుకు పూనుకున్నది. ఎన్‌ఇపి ముసాయిదాను విడుదల చేసినపుడు అది అమలైతే ఎటువంటి ప్రమాదాలు వస్తాయని ఊహించామో అవి నేడు విద్యారంగంలో జరిగి పోతున్నాయి.
నాడు తొలగించిన వాటిలో ముఖ్యమైనవి
లౌకికవాదం, ప్రజాస్వామ్యం,హక్కు లు,పౌరసత్వం,ఉద్యమాలు,జాతీయవాదం,ప్రాంతీ య అవసరాలు,స్థానిక సంస్థలు,ప్రభుత్వాలు,ఆహార భద్రత,పర్యావరణం,పంచవర్ష ప్రణాళికలు ఇతర దేశాలతో సంబంధాలు,అలీన విధానం,పర్యావ రణం,సహజవనరులు,భిన్నత్వంలో ఏకత్వం వంటి అంశాలకు సంబంధించిన పాఠ్యాంశాలను తొల గించారు.ఇవన్నీ మనదేశచరిత్ర,వారసత్వ సంపదకు సంబంధించిన అంశాలు. ఒక్క మాటలో చెప్పా లంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు, రాజ్యాంగ లక్ష్యాల సాధన, దేశ చరిత్రను పూర్తిగా కనుమరుగు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ కాలంలో పాలకుల వైఫల్యాలకు సంబంధించిన ప్రపంచీకరణ విధానా లు,లింగ వివక్ష, పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి వంటివి తొలగించారు.
నేడు తొలగిస్తున్న పాఠ్యాంశాలు …
ఎన్‌ఇపి అమలు నేపథ్యంలో ఎన్‌సిఇ ఆర్‌టి రూపొందించిన కొత్త పుస్తకాలలో మహాత్మా గాంధీకి సంబంధించిన పలు పాఠ్యాంశాలను తొలగించారు. ప్రధానంగా తొలగించిన అంశా లివి.

థీమ్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ హిస్టరీ పార్ట్‌-2 (16వ,17వ శతాబ్దాలకు సంబంధించినది)

  1. పదకొండవ తరగతిలో సెంట్రల్‌ ఇస్లామిక్‌ ల్యాండ్స్‌, సంస్కృతుల ఘర్షణ
  2. పన్నెండవ తరగతి పౌరశాస్త్రంలో స్వాతంత్య్రం నుండి భారత రాజకీ యాలలో ప్రసిద్ధ ఉద్యమాల వరకు
  3. పన్నెండవ తరగతి పొలిటికల్‌ సైన్స్‌ పాఠ్యపుస్తకం నుంచి గాంధీజీ హత్యానంతరం ఆర్‌ఎస్‌ఎస్‌ పై విధించిన నిషేధానికి సంబంధిం చిన కొన్ని పేరాలనూ, అలాగే హిందూ-ముస్లిం ఐక్యతకు గాంధీ చేపట్టిన కృషికి సంబంధించిన కొన్ని పేరాలను కూడా తొలగించారు.
  4. గతేడాది కర్ణాటక పాఠ్యపుస్త కాలతో ప్రముఖస్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌ సింగ్‌ పాఠ్యాంశాన్ని తొలగించారు.
  5. సంఘసం స్కర్తలు పెరియార్‌, నారాయణ గురు,బసవడు వంటి ప్రముఖుల పాఠాలను తొలగించారు.
  6. పాఠ్యాంశాలే కాదు. సిబిఎస్‌ఇ సిలబస్‌కు సంబంధించిన ప్రశ్నాపత్రాలలో ‘గుజరాత్‌లో ముస్లింలపై దాడులు ఎవరు చేశారు?’ వంటి ప్రశ్నలు దేనికి సంకేతాలు?
    జాతీయోద్యమ స్ఫూర్తి అవసరం లేదా?
    జాతీయోద్యమ కాలంలోలౌకిక, ప్రజా స్వామ్యం,సార్వత్రిక విద్యకు డిమాండ్‌ పెరిగింది. కులమతాలకు అతీతంగా జాతిని ఐక్యం చేసే విద్య ను కోరుకున్నారు. సామాజిక దురాచారాలకు వ్యతి రేకంగా సంఘ సంస్కరణల ఉద్యమాలు ప్రారంభం అయ్యాయి. ఈ ఉద్యమాలు సామాజిక మార్పులుకు దారితీశాయి.ఈ క్రమంలో ప్రగతిశీల శక్తులు, సం ఘాలు,వ్యక్తులు,సంస్కర్తలు ఏకమై బ్రిటిష్‌ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడిన మన దేశ చరిత్ర మన బాలలకు, భావి పౌరులకు అవస రం లేదా?
    ప్రాణాలకు వెరవకుండా భగత్‌సింగ్‌ చేసిన అద్భుతమైన పోరాటం,త్యాగం దేశ ప్రజ లను కదిలించింది.క్విట్‌ ఇండియా, సహాయ నిరా కరణ ఉద్యమం వంటివి లక్షోపలక్షలుగా యువ తను,లాయర్లను,ప్రజలను, విద్యార్థులను జాతీయో ద్యమం లోకి ఆకర్షించాయి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశవిభజనకు కుట్ర పన్నిన ఆర్‌ఎస్‌ఎస్‌ లాంటి మతసంస్థల చర్యలను అంగీకరించని గాంధీజీ మత సామరస్యం కోసం హిందూ-ముస్లిం భాయిభాయి అంటూ విస్తృతంగా పర్యటించాడు. ఇవి నచ్చని హిందూత్వ శశ్తులకు ప్రతినిధి అయిన గాడ్సే…మహాత్ముడిని హత్య చేశాడు.
    మత రాజ్యం కోసం అవసరమైన ప్రయ త్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం విద్య కాషాయీ కరణలో భాగంగా ఉద్దేశ పూర్వకంగానే ఎన్‌ఇపి ద్వారా గాంధీజీకి సంబంధించిన చరిత్ర ఘట్టాలను తొలగిస్తున్నది.ఎన్‌ఇపి అమలు కాకముందు పరిస్థితికి, అమలవుతున్న తరువాత పరిస్థితికి స్పష్టమైన తేడా కనిపిస్తుంది.- (కె.విజయ గౌరీ/కె.శేషగిరి)

బాల సాహిత్యం..వికాసం..విజ్ఞానం

అనగనగా కథలు.. బాల్యంలో సృజనను పెంచే మాలికలు.. అమ్మమ్మ, బామ్మా.. తాతయ్యలు లేని చిన్న కుటుంబాల్లో చిన్నారుల చింత తీర్చేది బాలసాహిత్యమే. చిన్ననాడు చందమామ, బాలమిత్ర సాహిత్య పఠనంతో పెద్దయ్యాక సృజనాత్మక రచన చేస్తున్న వారెందరో.. పిల్లల పట్ల ప్రేమతో రాసినవే నాడూ నేడూ మేలైన కథలు.. భాషపై మమకారం పెంచేది బాల సాహిత్యమే.. కథనం ఎంత ముఖ్యమో.. బాలసాహిత్యంలో చిత్రానికీ సమప్రా ధాన్యం.. పిల్లల్ని ఆకట్టుకునేది కంటికింపైన బొమ్మలే! ఈ విషయంలో ప్రపంచ బాల సాహిత్యంపై సోవియట్‌ ప్రచురణలు చేసిన కృషి అద్వితీయం..
మనం ఎలాంటి విత్తనాలు నాటితే అలాంటి చెట్లే వస్తాయి.బాల్యం నుండే మంచి సాహిత్యం అందిస్తే అలాంటి మంచి వ్యక్తిత్వం గల బాలలు తయార వుతారు. చందమామ అలాంటి సాహితీ సేద్యం చేసింది. దానివల్ల మన భాష, సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు బతికాయి. ఇప్పుడు చందమామ లేదు. బాలసాహితీ వేత్తలే ఆ బాధ్యత తీసుకోవాలి. బాల సాహిత్యంలో భాషా సం కరం లేని రచనలు వస్తాయి. తల్లిభాష తలెత్తుకుని తిరుగుతుంది.బాల సాహి త్యాన్ని ముందు పెద్దలు చదివి, పిల్లలతో చదివించాలి.బాలసాహితీ వేత్తలు రాసినంత మాత్రాన సరిపోదు.తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పనిగట్టు కుని బాలసాహిత్యాన్ని ప్రోత్సహించాలి.అలాచేస్తే పుస్తక పఠనం తగ్గదు. కొత్త విష యాలు,మంచి సంగతులు,జీవితానికి, భవిష్యత్తుకి పనికొచ్చే సూత్రాలు తెలుసు కుంటున్నామన్న అభిప్రాయం కలిగితేనే ఎవర్క్కెనా పుస్తకాలు చదువు తారు. బాల సాహితీవేత్తలు ఈ రహస్యం దృష్టిలో ఉంచుకుని,రచనలు చేయాలి.అప్పుడే ఆ రచనలు పంచతంత్రం, ఈసఫ్‌ కథల్లా దశాబ్దాల తరబడి నిలిచి పోతాయి. ఆధునిక విజ్ఞాన విషయాలనూ అతి సరళంగా, ఆసక్తికరంగా రాయాలి.అలా రాయాలంటే పిల్లల రచనలు చేసే వారికి నిబద్ధత ఉండాలి. పిల్లలపట్ల, వారి భవిష్యత్తు పట్ల ప్రేమ ఉండాలి.వారే చరిత్రలో నిలిచిపోతారు. వారి రచనలు చిరంజీవులవుతాయి.- చొక్కాపు వెంకట రమణ,కేంద్ర బాల సాహిత్య,అకాడమీ పురస్కార గ్రహీత,
నేటి బాల సాహిత్యం
తెలుగు బాలసాహిత్యం తొలి నుంచి నీతులు ప్రధానంగా నడిచింది.కుమార శతకం, కుమారీ శతకం…నీతి కథా మంజరి వంటివి ప్రధానంగా చాలాకాలం బాల పఠనీయ సాహిత్యంగా ఉన్నాయి. నేటికీ పిల్లల కోసం చేసే రచనలు పిల్లల నడవడికను ప్రభావితం చేసేవి. నీతి ప్రధానంగా ఉండాలనే రచయితలే ఎక్కువశాతం. వినోద ప్రధానంగా పరమానందయ్య శిష్యులు, తెనాలి రామకృష్ణ కథలు మాత్రమే మిగిలాయి. అనువాద రచనల్లోనూ పిల్లల అద్భుత సాహస గాథలు ఎక్కువభాగం లేకపోవడం శోచనీయం. నేటి పిల్లలకు భాష ఒక సమస్య. కాగా వారి పాఠ్యాంశాల బరువు మరో సమస్యగా తయా రైంది. బాల సాహిత్యం చదివే పిల్లల సంఖ్య చాలా తగ్గిపోయింది. బడిలోని కథల పుస్తకాలను పిల్లల చేత చదివించే టీచర్లు మృగ్యమయ్యారు. బడి పిల్లల చేత కథలు రాయించి, సంకలనాలు తేవడం మంచి చొరవ అయినా ఆ కథలలో కొత్తదనం, ఊహలు లేకపోవడం పెద్దల సృజన లేమిని ప్రతిఫలి స్తోంది. చరవాణిలో పాఠాలు నేర్చుకునే స్థితిలో పిల్లలకు అద్భుత ఊహాలోకం పరిచయం చేయాల్సిన పని రచయితలది. మాట్లాడే పక్షులు, జంతువులు, నది, ఆకాశం, కొండ అన్నీ బాలలకు నచ్చేవే. వాటిని ఎలా అల్లగల మనేది రచయితల మేధకు పరీక్ష. అంత సమాచారాన్ని అందంగా అద్భుతంగా సాహ సాలతో తీర్చిదిద్దడం నేటి రచయితల బాధ్యత. పర్యావరణం, ప్రకృతి సంరక్షణ వంటివే నేటి అవసరం. ఏడో గదిలోకి తీసుకెళ్దాం!
చాలామందిలాగే నా బాల్యం ‘చందమామ’ బాలల పత్రికతో ముడిపడి ఉండేది. అప్పట్లో జానపద సీరియల్స్‌కి ‘చిత్రా’గారు, పౌరాణిక సీరియల్స్‌కి ‘శంకర్‌’గారు, చందమామ ముఖ చిత్రాలు వడ్డాది పాపయ్యగారు వేసేవారు. కథలో పాత్రలకు దీటుగా చిత్రాగారు తన కుంచెను రaళిపించేవారు. పిల్లల కథల పుస్త కాలలో కథల్నీ బొమ్మల్నీ విడివిడిగా చూడ లేము. ఉదాహరణకు రష్యన్‌, చైనా పిల్లల కథల పుస్తకాలలో పేజీ నిండుగా పెద్ద బొమ్మ ఉండి,దాని కింద రెండు లైన్ల కథ ఉంటుంది. దీనిని బట్టి బాలసాహిత్యంలో చిత్రకారుల పాత్ర ఎంత ఉందో అర్థమవుతోంది. బొమ్మలు చూస్తూ కథ చదవడం పిల్లలకు ఒక అద్భుత మైన అనుభూతి.పిల్లల కోసం బాలసాహిత్యం విరివిగా రావాలి.బాల సాహిత్యంలో ఎవరి పాత్ర ఎంత అనే ప్రశ్నే లేదు. చిత్రకారుడు, రచయిత తలుచుకుంటే ఎన్ని అద్భుతాలైనా సృష్టించవచ్చు. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో పిల్లల సాహసగాథలు ఇంగ్లీష్‌ సాహిత్యంలో ఉన్నాయి. తెలుగు పిల్లలు అడ్వెంచర్స్‌ కావాలంటే ఇంగ్లీష్‌ సాహిత్యం మీద ఆధారప డాలా? మన వాళ్ళకి మనం సాహస కథలు ఇవ్వలేమా?తిప్పి తిప్పి కొడితే మనకు ‘బుడుగు’ తప్ప వేరే క్యారెక్టర్‌ కనిపించదు.రకరకాల విచిత్ర జంతువులు,ఒంటి కన్ను రాక్షసులు, మాంత్రికులే కాదు రెక్కల గుర్రాలూ మనవే. ఏడు తలల నాగేంద్రుడు ఏగుహలో పడుకు న్నాడో అతనిని నిద్ర లేపండి. ఏనుగుని సైతం ఎత్తుకుపోయే గండ బేరుండాలు మనకు ఉండనే ఉన్నాయి. దీనివల్ల పిల్లలు పాడైపొ యేదేమీ ఉండదు. మహా అయితే వారిలో సృజనశక్తి పెరుగుతుంది. తమ ఊహల్లో కొత్త లోకాలను చూడగలుగుతారు. ఇప్పుడు రాయక పోతే ఇకముందు పిల్లల కోసం ఏమీ ఉండదు. చెప్పినంత కాలం నీతి కథలు చెప్పాము. మన జానపద హీరోలను ఏడోగది లోకి మాత్రం వెళ్ళకు అంటే..ఏడో గదికే వెళ్ళి సాహసాలు చేయడమేకాక, రాకుమారినీ దక్కించుకొనేవారు. ఇప్పుడా రాకుమారుడికి ఏడోగది కరువైంది. మీరు చేయవలసిందల్లా ఆ ఏడోగది చూపిం చటమే.- చైతన్య పైరపు, ప్రసిద్ధ చిత్రకారులు
సామాజిక మాధ్యమంలోనూ..
బాలసాహిత్య విస్తృతికి, వికాసానికి సామాజిక మాధ్యమాలు ఎంతో దోహదపడు తున్నాయి. అందులో వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇ-బుక్స్‌, యూ ట్యూబ్‌ ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో బాలల వ్యక్తిత్వ వికాసాన్ని, విజ్ఞా నాన్ని అందించే అనేక కథలు, గేయాలు, పాట లను స్వయంగా రచయితలే ప్రచురించు కుంటు న్నారు. బాలసాహిత్యం కోసం గతం లోలా కష్ట పడాల్సిన అవసరం లేదు.కొన్ని బాల పత్రికలు ఆన్‌లైన్‌లో లింక్‌ ఓపెన్‌ చేసి, చదువు కునే అవకాశాన్ని కల్పించాయి. నేడు పిల్లలకు ఎలాగూ ఆన్‌లైన్‌ క్లాసులు జరుగుతున్నాయి. అందువల్ల సెల్‌ఫోన్‌, కంప్యూటర్ల మీద విద్యార్థులకు అవగాహన కలిగింది. ప్రతి బడిలోనూ కంప్యూటర్‌ ఉంది. యానిమేషన్‌ ద్వారా కథలు పిల్లలకు అందించాలి. కాకుంటే పిల్లలకు ఊహా ప్రపంచానికి దూరం చేస్తాం. వాట్సాప్‌ గ్రూపులు నడిపే రచయితలు బాలసాహిత్యం పిల్లలకు చేరువయ్యేలా చూడాలి.- సైమన్ గునపర్తి  

1 3 4 5 6 7 11