పరిశ్రమల్లో ప్రమాదాలు రక్షణ లేని జీవితాలు

పరిశ్రమల్లో విధులకు వెళ్లిన కార్మికులు క్షేమంగా ఇల్లు చేరడం కష్టంగా మారింది. ముఖ్యంగా మండలంలోని పలు రసాయన పరిశ్రమల్లో కనీస రక్షణ చర్యలు లేకపోవడం, నైపుణ్యం గల కార్మికులను తీసుకోకపోవడం అధిక ప్రమాదాలకు కారణంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రమాదాలకు అధిక కారణంగా నిలిచే రియాక్టర్లు బాంబుల్లా పేలుతున్నాయి. ఇక్కడ నిపుణులైన కార్మికులు పనులు చేయాల్సి ఉండగా కనీస అవగాహన లేని టెంపరరీ, కాంట్రాక్ట్‌ కార్మికుల చేత పనులు చేయిస్తున్నారు. వారు రియాక్టర్ల ఒత్తిడిని సరైన సమయంలో గుర్తించకపోవడం, కెమికల్‌ రియాక్షన్‌ను నివారించడంలో విఫలం కావడంతో పేలుళ్లు జరుగుతున్నాయి. ఇక ప్రమాదం జరిగిన వెంటనే పరిశ్రమ వర్గాలు చికిత్స కోసం క్షతగాత్రులను తరలించక పోవడంతో పాటు కొన్నిమార్లు వారు ఏమయ్యారో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికంగా విధులు నిర్వహించే వారిలో అధికంగా స్థానికేతరులే ఉండడంతో వారి తరఫున పరిశ్రమలపై పోరాటం చేసే వారు లేక కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. కాగా చాలా పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగిన వెంటనే చికిత్స కోసం తరలించేందుకు అంబులెన్స్‌ లాంటి వాహన సౌకర్యాలు లేక నగరానికి చేరేలోపు మరణించిన ఘటనలు కోకొల్లలు. – గునపర్తి సైమన్‌
ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పేరుతో పరిశ్రమాధిపతులకు ప్రభుత్వాలు పలు మినహా యింపులు, రాయితీలు ఇచ్చాయి. దాంతో పరిశ్రమలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి,లోపాలను గుర్తించి, వాటిని సరిచేయించే సమున్నత ప్రభుత్వ పర్యవేక్షణ వ్యవస్థ నిర్వీర్యమైంది. అందుకే పరిశ్రమల్లో ప్రమాదాలు పెరుగుతున్నాయి. కార్మిక భద్రత, ప్రమాణాలు పాటించడానికి, ప్రమాద సమయంలో కార్మికులు చనిపో కుండా బయటపడే పరికరాలు సరఫరా చేయడానికి యాజమాన్యాలు ముందుకు రావడంలేదు. చట్టపరంగా పరిశ్రమల్లో కార్మికులభద్రతకు అధికప్రాధాన్యత ఇవ్వాల్సిన యాజమాన్యాలు, వాటినిఖర్చుగా చూస్తున్నాయి.తమ లాభాలశాతం తగ్గిపోతున్నట్లుగా భావిస్తు న్నాయి. పరిశ్రమకు విస్తృతార్ధం వుంది.ఓ పరిశ్రమ ఉత్పత్తి ప్రక్రియ మానవుని శ్రమపై ఆధారపడినట్లే,ఓపరిశ్రమ ఏర్పాటులో మానవుని త్యాగాలు ఎన్నో వున్నాయి.ఎంతోమంది రైతులు తమ జీవనాధారమైన వ్యవసాయ భూములను కోల్పోతారు.కొన్నేళ్ల నుంచి కలిసిమెలిసి బతికే మనుషులు నిర్వాసితులై చెల్లాచెదురవుతారు. వ్యవసాయాధారిత చేతివృత్తుల కుటుంబాల జీవనోపాధి దెబ్బ తింటోంది. ఎన్నో కుటుంబాలు,ఎంతో మంది జీవితాలు శిథిలమైతే తప్ప,నష్టాన్ని చవిచూస్తే తప్ప పారిశ్రామిక ప్రగతికి పునాదులు పడవు. పారిశ్రామికోత్పత్తి ప్రక్రియ జరగడానికి ముందు,తరువాత మనిషి త్యాగం, శ్రమ వుందన్న విషయం పెట్టుబడిదారీ వ్యవస్థ ఉద్దేశపూర్వకంగా విస్మరి స్తోంది.లాభం కోసం అమానవీయ అంశాలను ముందుకు తెచ్చి మానవీయ విలువలను, శ్రమను, మనిషి ప్రాణాలను అప్రధానమైనవిగా భావిస్తోంది.ఈ చులకన,హేయమైన భావనలో నుంచి మనిషిని మనిషిగా చూడ్డం, గౌరవిం చడం,ప్రేమించడం అనే నైతికత నశించి…తానెదగడానికి, లాభాలు పోగేసు కోవడానికి ఎంతటి నీచానికైనా దిగజారుతున్న పరిస్థితులను తరచూ చూస్తు న్నాం.చట్టపరమైన ఉల్లంఘనలు,యాజమాన్య నిర్లక్ష్యమే పరిశ్ర మల్లో ప్రమా దాలు జరిగి కార్మికుల ప్రాణాలు పోవడానికి,గాయాల పాలు కావడానికి దారితీస్తున్నదన్న వాస్తవాన్ని అర్ధంచేసుకోవాలి.పారిశ్రామికాభి వృద్ధి పేరుతో కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు పరిశ్రమాధిపతులకు కల్పిస్తున్న వెసులుబాట్లు ప్రమాదాలు పెరగడానికి ఒక హేతువుగా మారాయి.ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పేరుతో పరిశ్రమాధిపతులకు ప్రభుత్వాలు పలు మినహాయింపులు,రాయితీలు ఇచ్చాయి.దాంతో పరిశ్రమలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి,లోపాలను గుర్తించి,వాటిని సరిచేయించే సమున్నత ప్రభుత్వ పర్యవేక్షణవ్యవస్థ నిర్వీర్యమైంది. అందుకే పరిశ్రమల్లో ప్రమాదాలు పెరుగుతున్నాయి.కార్మిక భద్రత,ప్రమాణాలు పాటించడానికి, ప్రమాద సమయంలో కార్మికులు చనిపోకుండా బయటపడే పరికరాలు సరఫరా చేయడానికి యాజమాన్యాలు ముందుకు రావడం లేదు.చట్టపరంగా పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన యాజమాన్యాలు, వాటిని ఖర్చుగా చూస్తున్నాయి.తమ లాభాల శాతం తగ్గిపోతున్నట్లుగా భావిస్తున్నాయి. తమ లాభాలకు మూలం కార్మికుల శ్రమన్న వాస్తవాన్ని గ్రహించ నిరాకరిస్తున్నాయి.
పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఐదేళ్లలో జరిగిన119 ప్రమాదాల్లో 120 మంది కార్మికులు చనిపోయారు.68మంది గాయపడ్డారు.గతేడాది 24కంపెనీల్లో జరిగిన ప్రమాదాల్లో 20మంది మృతి చెందారు.18 మంది వికలాంగులయ్యారు.పరిశ్రమల్లో జరిగిన ప్రమా దాల తీవ్రతకు ఇవి అద్దం పడుతున్నాయి. ప్రమా దాలు జరిగినప్పుడు మృతిచెందిన కార్మిక కుటుం బాలకు పరిహారం చెల్లించే ఒక పద్ధతిని యాజమా న్యాలు అనుసరిస్తున్నాయి గానీ పరిశ్రమల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడంలేదు. ఖర్చు చేయడానికి ఇష్ట పడ్డంలేదు. పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలకు యాజమాన్యాలు విలువ ఇవ్వడంలేదు. విశాఖనగరంలో 2020 మే 7న ఎల్‌.జి పాలిమ ర్స్‌లో జరిగిన ప్రమాదంలో 15మంది మరణిం చారు.దక్షిణ కొరియాకు చెందిన బహుళజాతి సంస్థ ఎల్‌.జి పాలిమర్స్‌ యాజమాన్యం నుంచి మృతుల కుటుంబానికి కోటి రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషి యో ఇప్పించింది. ఎంత డబ్బు ఇచ్చినా పోయిన ప్రాణాలు తిరిగిరావు.ప్రాణాలు కోల్పోయిన కుటుం బాల బాధలు తీరవు. కుటుంబాలకు పెద్దదిక్కుగా వున్న వారు,విద్యార్థులు,ప్రమాదం నుంచి తప్పించు కోలేక ఊపిరాడక చనిపోయిన వృద్ధులు ఇలా వివిధ వయస్సుల వారు చనిపోయారు. ఈ మరణాలకు, అనేక మంది అస్వస్థతకు గురై ఆస్పత్రులపాలై ఆరో గ్యాలు కోల్పోవడానికి కారణమైన యాజమాన్యంపై చర్యల్లేవు. మనిషి తలకు విలువ కట్టే ఈ వ్యవస్థలో బహుశా ఇంతకంటే మెరుగైన, ప్రగతిదాయక ఆలోచనలు పరిశ్రమాధిపతుల బుర్రల్లో మొలకెత్తు తాయని ఆశించలేము. పరిశ్రమ అనగానే డబ్బులు పోగు చేసుకొనే యంత్రాంగంగా యాజమాన్యం భావించినంత కాలం మనిషి శ్రమకు, ప్రాణాలకు విలువ వుండదు. ప్రమాదాలు ఎల్‌.జి పాలిమర్స్‌, పరవాడ ఫార్మా కంపెనీల్లోనూ, అచ్యుతాపురం సెజ్‌లోని పరిశ్రమలకే పరిమితం కాలేదు. రాష్ట్రం లోని రసాయన, మందుల పరిశ్రమల్లోనూ ప్రమా దాలు చోటు చేసుకుంటున్నాయి. మరణాలు సంభవిస్తున్నాయి.హెచ్‌పిసిఎల్‌లో జరిగిన ప్రమా దంలో 12 మంది, స్టీల్‌ప్లాంట్‌ లోని ఎస్‌ఎంఎస్‌2 లోని ఆక్సిజన్‌ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో 12 మంది చనిపోయారు. ప్రమాదం ఏ పరిశ్ర మలో ఎప్పుడు జరిగినా కార్మికులు చనిపోతూనే వున్నారు. ఈ చావులకు కారణం యాజమాన్యాల నిర్లక్ష్యమేనని ప్రమాదనంతరం జరిగిన నివేదికల్లో బట్టబయలవుతున్నాయి.పరిశ్రమలో భద్రత, కార్మి కులకు రక్షణ పరికరాలు ఇవ్వడంలో చూపుతున్న అలసత్వాన్ని నివేదికలు ఎత్తిచూపుతున్నాయి. అయినా పరిశ్రమాధిపతుల వైఖరిలో మార్పు రావడంలేదు.భద్రతను పట్టించుకోవడంలేదు. పైగా ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులపై నెపం నెట్టి తప్పించుకొనే ప్రయత్నాలు యాజమాన్యాలు చేస్తు న్నాయి.తన నిర్లక్ష్యంవల్ల జరిగిన ప్రమాదానికి కార్మి కులు చనిపోయారన్న అసలు విషయాన్ని దాచిపెట్టి, చనిపోయిన కార్మిక కుటుంబానికి ఎక్స్‌గ్రేషియో చెల్లించడాన్ని గొప్ప ఉదారతగా యాజమాన్యాలు ప్రచారం చేసుకుంటున్నాయి. నాణ్యమైన రియాక్టర్లు ఏర్పాటు చేయడంలేదు. ప్రమాదం జరిగినప్పుడు కార్మికులు ప్రమాద స్థలం నుంచి తప్పించుకొని పారిపోయి ప్రాణాలు కాపాడుకొనేందుకు అనువైన వాతావరణాన్ని పని ప్రదేశంలో యాజమాన్యాలు కల్పించడంలేదు. పరిశ్రమలో ప్రమాదం ముందు గానే గుర్తించి హెచ్చరించే ఆధునిక అలారం వ్యవస్థ లేదు.ఫైర్‌ సిస్టమ్‌ సరిగాలేదు.విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరగకుండా పటిష్టమైన నియంత్రణ వ్యవస్థ లేదు. పరిశ్రమల్లో అంతర్గత ప్రమాదాలకు ఇవి కారణ మౌతుండగా,పర్యావరణ సమస్యలతో పరిసర ప్రాంత ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే వరకు సమీప ప్రాంత ప్రజలను సొంత మనుషుల్లా చూసు కుంటామని చెప్పిన యాజమాన్యాలు, హామీ ఇచ్చిన ప్రభుత్వాలు తరువాత ఆప్రజల బాధలు వినడంలేదు.పర వాడ ఫార్మా సిటీకి ఆనుకొనివున్న తాడిని తరలి స్తామని ఎన్నికలహామీ ఇవ్వడం తప్ప తరలించి వారి బాగోగులను పట్టించుకోవడంలేదు. కంపెనీల వల్ల కలుషితమైన భూగర్భ జలాలను తాగలేక… పరవాడ, లంకెలపాలెం నుంచి వాటర్‌ క్యాన్లు కొనుక్కోవాల్సిన దుస్థితి తాడి వాసులకు ఏర్పడిరది. రసాయన, ఔషధ పరిశ్రమ వున్న ప్రతీ చోటా ప్రజలు వ్యాధుల బారినపడుతున్నారు. పరిశ్రమలను ప్రోత్సహించే పేరిట మానవ,పర్యావరణ విధ్వం సాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి.తనకు కంపె నీలో జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్న యాజమాన్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహించడంతో కనీస వేతనాలు అమలు కావడంలేదు. వారి భద్రతను పట్టించు కోవడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు బర్నింగ్‌వార్డు సహా అత్యవసర వైద్య సేవలు అందించేలా పారిశ్రా మిక ప్రాంతంలో సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మిం చాలి.కార్మికుల ప్రాణాలు కాపాడే చర్యలు చేప ట్టాలి.గతేడాది అచ్యుతాపురం సెజ్‌ లోని బ్రాండిక్స్‌ అపెరల్‌ సిటీ లోని సీడ్స్‌ వస్త్ర పరిశ్రమలో రెండు నెలల వ్యవధిలో రెండుసార్లు విషవాయువులు లీక యిన ఘటనలో వందలాది మంది మహిళా కార్మి కులు ఆస్పత్రుల పాలయ్యారు. పత్రికల్లో వచ్చిన వార్తలను సుమోటోగా తీసుకున్న నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి)…ఆస్పత్రుల్లో చికిత్స పొందిన కార్మికునికి లక్ష రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని, పర్యావరణ పరిరక్షణకు రూ.10కోట్లు కాలుష్య నియంత్రణ మండలి ఖాతాలో జమ చేయాలని ఇచ్చిన తీర్పును యాజమాన్యం పట్టించు కోని పరిస్థితి వుంది. కోర్టు తీర్పులు అమలు చేయా ల్సిన ప్రభుత్వ యంత్రాంగం చేతులు కట్టుకొని యాజమాన్యం వద్ద నిలబడేలా ప్రభుత్వ విధాన నిర్ణయాలున్నాయి. పరిశ్రమల్లో కార్మికుల భద్రత, సమీప ప్రజల ఆరోగ్య బాధ్యత యాజమాన్యాలు తీసుకొనేలా కార్మికులు, ప్రజలు ఐక్యంగా పోరా డాలి.నిర్వాసిత కుటుంబ సభ్యుల విద్యార్హత ఆధా రంగా ఉపాధి కల్పించేలా ఒత్తిడి తేవాలి. భద్రత పాటించని కంపెనీల జాబితాను బహిర్గత పర్చాలి. నిర్దిష్ట కాలపరిమితిలో లోపాలను సరిచేయని కంపె నీల రిజస్ట్రేషన్‌ రద్దు చేయాలి.
ప్రమాదాల నివారణకు ఇలా..
ఇటీవల కాలంలో పరిశ్రమల్లో భద్రతా వైఫల్యాల కారణంగా ప్రమాదాలు వాటిల్లుతున్న నేపథ్యంలో.. వాటిని కట్టడి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక నుంచి పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నది లేనిది తనిఖీ చేసేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని నిర్ణయించింది. పరిశ్ర మలు-భద్రతా ప్రమాణాలపై రాష్ట్రపర్యవేక్షణ కమిటీ సమావేశం అమరావతి సచివాలయంలో జరిగింది.ఈసమావేశంలో రాష్ట్రమంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మనూరు జయరాం, గుడివాడ అమర్‌నాథ్‌ పాల్గొన్నారు. వివిధ శాఖల అధికా రులతో మంత్రులు పరిశ్రమల్లో భద్రతా ప్రమా ణాలపై సమీక్షించారు. వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పరిశ్రమల్లో భద్రతా వైఫల్యాల కారణంగా జరుగుతున్న ప్రమా దాలను పూర్తిగా కట్టడిచేయాలని మంత్రులు ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో అన్ని పరిశ్రమల్లో పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలను తనిఖీ చేసేందు కు మూడునెలల్లో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని సూచించారు. విశాఖపట్టణంలోని ఎల్జీ పాలిమ ర్స్‌లో జరిగిన ప్రమాదాన్ని హెచ్చరికగా తీసుకోవా లన్నారు.భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలూ జరగ కుండా కట్టుదిట్టంగా భద్రతా నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు.పరిశ్రమలు,కాలుష్య నియంత్రణ మండలి, కార్మిక శాఖల అధికారులు సంయుక్తంగా ప్రతి ఆరు నెలలకోసారి తనిఖీలు నిర్వహించాలని మంత్రులు సూచించారు. కలెక్టర్లు ఛైర్మన్‌గా ఏర్పడిన జిల్లా కమిటీలు స్వయంగా ఈ తనిఖీలు చేయాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా పెద్ద సంఖ్యలో పరిశ్రమలు రానున్నట్లు వెల్లడిరచారు. రెడ్‌ కేటగిరీ పరిశ్రమలకు సమీపంలో జనావా సాలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఇప్పటికే ఉన్నపరిశ్రమల చుట్టూ పట్టణీకరణ పెరిగితే.. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిచ్చి ప్రత్యా మ్నాయ మార్గాలను పరిశీలించాలని మంత్రులు ఆదేశించారు. ప్రజలకు హాని కలిగించే పరిశ్రమ లపై ప్రత్యేక నిఘా పెట్టి.. పరిశ్రమల చుట్టూపక్కల ప్రజలు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. భవిష్యత్తుల్లో భద్రతా వైఫల్యాల కారణంగా పరిశ్రమల్లో ప్రమాదాలు జరగడానికి వీలులేదన్నారు. సీఏం జగన్మోహన్‌ రెడ్డి ఈవిషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారని మంత్రులు తెలిపారు. నిబంధనలు పాటించని పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.
దేశవ్యాప్తంగా ఎంత మంది మృతి చెందారు..?
దేశంలో కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) మహమ్మారి కట్టడికి విధించిన దేశవ్యాప్త లాక్‌ డౌన్‌ కు రెండు నెలల అనంతరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలిం పులతో పరిశ్రమలు తెరుచుకున్నాయి. దీంతో పరిశ్ర మల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్యాస్‌ లీకేజీ, పేలుళ్లు వంటి ప్రమాదాలు చోటు చేసుకుంటు న్నాయి. ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రజలు, కార్మికులు మృతి చెందారు.ఈ రెండు నెలల్లో దేశ వ్యాప్తంగా ఎన్నిపరిశ్రమల్లో ప్రమాదాలు జరిగా యంటే..?ఈ ఏడాది మే నుండి పరిశ్రమ లలో కనీసం 33 ప్రమాదాలు జరిగాయి.76మంది మృతి చెందారు.195 మంది తీవ్రంగా గాయ పడ్డారు. మే 3 నుంచి జూలై 14మధ్య జరిగిన 33 ప్రమాద ఘటనల్లో ఛత్తీస్‌గఢ్‌ నుండి గరిష్టంగా ఏడు ఘట నలు జరిగాయి. గుజరాత్‌లో ఆరు, మహారాష్ట్రలో నాలుగు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ అన్ని ప్రమాదాలు జరిగిన సంద ర్భాల్లో పరిశ్రమల్లో కార్మికులు, పరిశ్రమలకు సమీప దూరంలో ఉన్న నివాసితులు విషపూరిత రసాయ నాలకు గురయ్యే కనీసం అవకాశం ఉంది.ఈప్రమాదాలవల్ల రాబో యే నెలలు లేదా సంవత్స రాల్లో ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయనేది హెచ్చరిక సంకేతం.
చత్తీస్‌గఢ్‌ లోని బొకారో స్టీల్‌ ప్లాంట్‌లో నాలుగు ప్రమాదాలు జరిగాయి.ఈ కాలంలో ఒకే పరిశ్రమలో అత్యధికంగా ప్రమాదాలు ఇక్కడే జరి గాయి.ఈ ప్రమాదాల్లోఒకవ్యక్తి మృతి చెందగా,మరో ఏడుగురు గాయపడ్డారు.మే,జూన్‌నెలల్లో తమిళ నాడులోని నెవేలి లిగ్నైట్‌ కార్పొరేషన్‌లో జరిగిన రెండు అగ్ని ప్రమాదాలలో 20 మంది కార్మికులు మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఎల్‌జి పాలిమర్స్‌లోగ్యాస్‌ లీక్‌ కావడం వల్ల కనీసం 11 మంది మృతి చెందగా,100 మంది గాయ పడ్డారు. ఇటీవలి కాలంలో ఇది అతిపెద్ద ఘట నలలో ఒకటి నమోదైంది.దీని తరువాత కోవిడ్‌ -19సమయంలోనూ,తరువాత కర్మాగారాలు తిరిగి తెరవడానికి జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్‌డిఎంఎ) తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. మొదటి వారంలోనే ఉత్పత్తిని పెంచ వద్దని,బదులుగా ట్రయల్‌ ప్రాతిపదికన అమలు చేయమని వారికి సలహా ఇస్తుంది. ఉత్పాదక విభా గాలలో గ్యాస్‌లీకేజీల కారణంగా ఐదుసంఘ టన లు జరిగాయి. ఇందులో 17మంది ప్రాణాలు కోల్పోయారు. కనీసం 111మంది గాయపడ్డారు. బాయిలర్‌ పేలుడు జరిగిన మూడు సంఘటనలలో 22 మంది ప్రాణాలు కోల్పోగా,49మంది గాయ పడ్డారు.ఈ కాలంలో తయారీ యూనిట్లలో ఎని మిది అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇందులో 14 మంది మరణించారు. ఏడుగురు గాయపడ్డారు. మే నుండి లాక్‌ డౌన్‌ సమయంలో పరిమితులతో పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతించింది. జూన్‌ నుండి ప్రభుత్వం‘అన్‌లాక్‌’ప్రక్రియను ప్రారంభ మైనప్పుడు నుంచి పరిశ్రమలకు పూర్తిగా స్వేచ్ఛ వచ్చింది.గత నెలలోప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో ఇండస్ట్రియల్‌ గ్లోబల్‌ యూనియన్‌ జనరల్‌ సెక్రటరీ వాల్టర్‌ సాంచెస్‌ ‘‘భయంకరమైన వాస్తవం ఏమిటంటే..ఈ తీవ్రమైన ప్రమాదాల జరగడానికి పరిశ్రమల వైఫల్య నమూనాను సూచిస్తుంది. ఇంకా ఎక్కువ ప్రమాదాలుసంభవించే అవకాశం ఉంది’’ అని పేర్కొన్నారు.‘‘భద్రతా నియంత్రణలో ఈ రక మైన నిర్లక్ష్యం గమనించినప్పుడు. 1984 భోపాల్‌ విపత్తు స్థాయిలోపెద్ద విపత్తు సంభవించే అవకా శాన్ని తోసిపుచ్చలేము’’ అని సాంచెస్‌ రాశారు.