మూలవాసులం..మేము ఆదివాసులం

దేశంలో తమ హక్కుల సాధన కోసం ఆదిఆసీ సమాజాలు ఉద్యమించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. బ్రిటీష్‌ చట్టాలకు వ్యతిరేకంగా బిర్జాముండా,సంతాల్‌లు,తిరుగుబాటు చేశారు.జిల్‌,జంగల్‌,జమీన్‌ కోసం సాయుధ పోరాటాలు సాగాయి. తమపై సాగుతున్న అన్ని రకాల దోపిడీ,పీడనలను ఎదరించారు. అనేకసార్లు ఓటమి చెందినా తమ ఉనికే ప్రశ్నార్ధకంగా మారుతున్న పరిస్థితుల్లో,తమ అస్తిత్వం కోసం అలుపెరుగని పోరాటాలు నేటికీ కొనసాగి స్తూనే ఉన్నారు. జీవన పోరాటంలో ఆరితేని వారు ఆదివాసీలు. వారు నివసించే ప్రాంతాలు పుష్కలమైన సహజ వనరులతో కళకళలాడుతుండేవి. సాటి మానవులుగా అనేక దేశాలలో వారికి తగిన గుర్తింపు,రక్షణ నేటీకీ లేదు.. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నివాసముండే గిరిజనులు అనేక సమస్య లతో కొట్టిమిట్టులాడుతునే ఉన్నారు. గునపర్తి సైమన్‌
ఆదివాసీలు తమ అస్తిత్వం కోసం ఎన్నో అలుపెరుగని పోరాటాలు చేస్తున్నా..అభివృద్ధికి మాత్రం నోచుకోవడమే లేదు. ప్రభుత్వాలు, పాలకులు మారినా ఆదివాసీల తలరాతలు మారినట్లు కనిపించడం లేదు. తమ హక్కుల కోసం నిరంతరంగా గళం విప్పుతూనే ఉన్నారు. ప్రధానంగా ఆదివాసీలను నిరక్షరాస్యత, ఆరోగ్య సమస్యలు,పేదరికం వెంటాడుతునే ఉన్నాయి. స్వాతంత్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ జిల్లాలో రవాణా సౌకర్యం, విద్యుత్‌ లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రంలోనే జిల్లాలో ఆదివాసీలు అధికంగా నివసిస్తున్నారు. విద్య, వైద్యం అందని ద్రాక్షగానే మారడంతో ఆదివాసీల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. తమ వెనుకబాటుతనానికి మరో గిరిజన తెగనే కారణ మంటూ గత కొంత కాలంగా ఆందోళ న బాట పట్టిన ఆదివాసీలు, ఆధిపత్య పోరు కొనసాగిస్తున్నారు. ఆదివాసీలకు రక్షణగా ప్రత్యేక చట్టాలు ఉన్నా.. వాటి అమలుల్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపడం లేదంటూ,హక్కుల కోసం నిరంతర పోరాటాలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసీల ఉద్యమాన్ని రగిలించిన ఎంపీ సోయం బాపురావు గత పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపొందడంతో ఆదివాసీలు ఎంతో సంబరపడ్డారు.కాని మూడేళ్లు గడిచిపోతున్నా.. తమ కల సాకారానికి అడుగు ముందుకు పడకపోవడంతో మెజార్టీ ఆదివాసీల్లో నిరాశానే కనిపిస్తోంది. అడవుల్లో విసిరిపారేసినట్లు కనిపించే ఆదివాసీల జీవనాన్ని మరింత మెరుగుపరిచేందుకు 1982 ఆగస్టు 9న ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆదివాసీల దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీ.
పోడు భూములకు పరిష్కారం ఏదీ?!
ఎన్నో ఏళ్లుగా పోడు భూముల సమస్యను పరిష్కరించాలంటూ పోరాటాలు చేస్తున్నా.. ప్రభుత్వం, పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత యేడాది క్రితం స్వయాన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆరే అర్హులైన గిరిజ రైతులందరికీ హక్కు పత్రాలు ఇస్తామని ప్రకటించి రైతుల నుంచి దరఖాస్తులను కూడా స్వీకరించారు. అయినా ఇప్పటి వరకు హక్కుపత్రాలు ఇవ్వకపోగా..పరిష్కారమే చూపడం లేదు. దీంతో వానాకాల సీజన్‌ మొదలైందంటే చాలు ఏజెన్సీ గిరిజన గ్రామాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. అటవీ శాఖ అధికారులతో ఆదివాసీలు చిన్నపాటి యుద్ధాన్నే చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతు న్నాయి. పోడు భూములను సాగు చేసుకుంటున్న క్రమంలో హద్దులు దాటారంటూ అటవీ శాఖాధికారులు ఆదివాసీ మహిళలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయం భయంగా పోడు సాగు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోందని వారు ఆవేదనకు గురవు తున్నారు. ప్రభుత్వ ప్రకటనతో వేల మంది గిరిజన రైతులు హక్కుపత్రాల కోసం దరఖా స్తులు చేసుకున్నా.. అమలుకు నోచుకోక పోవడంతో ఎదురుచూపులు తప్పడం లేదు.
వణుకు పుట్టిస్తున్న వానాకాలం
రెండు తెలుగు రాష్ట్రాల్లో నివాసముంటున్న గిరిజనుల సమస్య ఏదైనా అమాయక ఆది వాసీల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. వానాకాలం వచ్చిం దంటే చాలు ఆదివాసీ గ్రామాలకు వణుకు పుట్టిస్తోంది. చిన్నపాటి వర్షాలకే వాగులు, వంకలు పొంగి ప్రవహిం చడంతో ఊరుదాటే పరిస్థితు లు కనిపించడం లేదు. దీంతో అత్య వసర సమయంలో వైద్యం అందక, వరద నీటి ఉధృతిని దాటేక్రమంలో ప్రమాదాల భారీన పడి ప్రాణాలు కోల్పో తున్నారు. ముఖ్యంగా ఆదివాసీ మహిళలకు ప్రసవమంటే పునర్‌ జన్మగా మారింది. సకాలంలో వైద్యం అందక మాతాశిశు మరణా లు ఏటా జరుగుతూనే ఉన్నాయి. ఆదివాసీలు ఆచార సంప్రదాయాలకు కట్టుబడి మూడ విశ్వాసాలతో జీవనం గడుపుతున్నారు. అలాగే తరతరాలుగా వెంటాడుతున్న రక్తహీనత, పౌష్టికాహార లోపంతో ఆదివాసీలు బక్కచిక్కిపోయి బలహీన పడుతూ..మరీ దయనీ యంగా కనిపిస్తున్నారు. దీని కారణంగా ఆదివా సీలను భయంకర వ్యాధులు చుట్టుముట్టి ఏటా ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. అంతే కాకుండా వెంటాడుతున్న పేదరికం,అనా రోగ్య సమస్యలతో ఆర్థికంగా,సామాజికంగా వెనుకబడి పోతున్నారు. మెరుగైన వైద్య సౌకర్యాలు అందు బాటులోఉన్నా..సకాలంలో వైద్యం అందకపో వడంతో ప్రాణనష్టం జరుగుతూనే ఉంది.
ఉద్యోగం, ఉపాధికి దూరమే..
ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీలకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు దూరమవుతునే ఉన్నాయి. ఆదివాసీలకు ఉద్యోగ భద్రత కల్పిం చేందుకు గత ప్రభుత్వం జీవో నెం.3 తీసు కొచ్చింది. కానీ గత రెండేళ్ల క్రితమే సుప్రీంకోర్టు ఈ జీవోను రద్దు చేయడంతో ఉద్యోగ అవకాశ ాలు కరువవుతున్నాయి.ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యా య పోస్టుల్లో గిరిజనేతరులకు కూడా అవకా శాలు కల్పించాలంటూ దేశ అత్యున్నత న్యాయ స్థానం తీర్పును ఇవ్వడంతో ఆదివాసీల ఆశలు ఆవి రయ్యాయి. దీంతో ఏజెన్సీలో స్పెషల్‌ డీఎస్సీకి అవకాశమే లేకుండా పోయింది. అసలే అంతంత మాత్రంగా చదువుకుంటున్న ఆదివాసీలకు ప్రభుత్వ ఉద్యోగం గగనంగా మారింది. ప్రభుత్వం జీవో నెం.3మళ్లీ పునరు ద్ధరించక పోవడంతో ఎంతో మంది నిరుద్యో గులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూ డాల్సి వస్తోంది. ఇకనైనా ప్రభుత్వం జీవో నెం.3 తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంత ఉద్యోగా లను స్థానికులకే కేటాయించాలంటూ డిమాండ్‌ చేస్తున్నా.. ప్రభుత్వాలు పట్టించుకున్నట్లే కనిపిం చడం లేదు. నిరంతరంగా ఆదివాసీలు తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నా..పాలకుల నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నారు.
ఉద్యమాలతోనే హక్కులు సాధించుకుంటాం
ఆదివాసీలకు ఉద్యమాలు చేయడం కొత్తేమీ కాదు. నిరంతర పోరాటాలతోనే హక్కులు సాధించుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం కల్పిం చుకుని జీవో నెం.3 పునరుద్ధరించాలి. అలాగే ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన రైతులందరికీ పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని గిరిజనులు డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజనుల పట్ల చిన్నచూపు చూస్తోంది. ఆదివాసీల సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలకు ఇచ్చిన హామీలన్నీ మరిచి పోయింది. ఎన్నికల సమయంలోనే ఆదివాసీలు గుర్తుకొస్తున్నారు. ఏదిఏమైనా ఆదివాసీలకు అధికారం వస్తేనే హక్కుల సాధనకు అవకాశం ఉంటుంది.
ఆధునిక సమాజ గత కాలపు ఆనవాళ్లు ఆదివాసీ ప్రజలు
సమిష్టి జీవన పద్ధతులు,సహజీవనం,పారదర్శ కతకు నిలువెత్తు సాక్షులు వారు.వ్యష్టి జీవన పద్ధతులు,పరస్పర అసహనం,కనిపించని కుట్ర లు నేటి పారి శ్రామిక సమాజలక్షణాలు. బ్రెజిల్‌,పెరూ దేశాలలో వంద కుపైగా ఆదివాసి తెగలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నారు. పెరూ లోని‘ముచి-పిచి’పర్యావరణ పార్కుకు కేవలం100కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఈ తెగలు ఇప్పటికీ జంతు ప్రాయమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు.50-60 వేల సంవత్స రాల నుంచి అటవీ దుంపలు ప్రధానఆహార వన రుగా జీవిస్తూ మొక్క జొన్న,బంగాళాదుంప సాగుకు ఈ తెగలు ఎంతో తోడ్పడ్డాయి.తాము వేటాడే జంతువులకు ఎరగావేసే క్యురారే మొక్క నేడు ఓపెన్‌ హార్ట్‌ శస్త్రచికిత్సకు ఔషధంగా మారింది. గత సునా మీలో అండమాన్‌ తెగలలో ఆదివాసి తెగలు ఎవ రూ చనిపోలేదు. కారణం సముద్రం వెనక్కి వెళ్లగానే వారు ఎత్తైన కొండలపైకి వేగంగా కదిలి వెళ్లారు. జారవా, సెంటినిల్‌ తెగల ఆదివాసీల్లో కళ్లుతెరచి సముద్రపు నీటిలో చేపలవేటకు అనువుగా 50 శాతం మంది కళ్లు రూపాంతరం చెందాయి.ప్రపంచంలో సుమారు ఏడు వేల భాషలు ఉంటే అందులో ఆదివాసీ తెగలు మాట్లాడే బాషలే నాలు గువేలు ఉన్నా యి. నేడు అత్యధికులు మాట్లాడే, వాడే ఆరు భాషలు (ఇంగ్లీషుతో సహా) గతంలో అంత రించిపోయిన ఆదివాసీ తెగలు వాడినవే. బ్రతుకు పోరాటంలో ఆరితేరిన వారు ఆదివాసీలే. వారు నివసించే ప్రాంతాలు పుష్కలమైన సహజ వనరులతో కళకళలా డుతుండేవి. ఈ పదేళ్లపాటు ఆదివాసీ తెగలను మానవులుగా గుర్తించడం, వారి జీవన పరిస్థితు లను మెరుగు పర్చడం, వారి నివాస ప్రాంతా లలోని సహజవన రులన్నింటినీ వారే సమిష్టిగా వినియోగించుకునే చట్టాలు చేయవలసి ఉన్నది. ప్రపంచవ్యాప్తం గానే తొలుత ఈతీర్మానాన్ని అమలు చేయాలని ప్రయత్నించిన వారు ప్రపంచ స్థాయి ఎన్‌జిఒలు మాత్రమే. మన దేశంలో ఇప్పటికీ అంత ర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వాలు జరప డం లేదు. ఎన్‌జిఒలు చేసే కార్యకలాపాలకు కొన్ని రాష్ట్రాలలో కేవలం ఆర్థిక తోడ్పాటును మాత్రమే ప్రభుత్వాలు అందిస్తున్నాయి. మన దేశంలో సుమా రు 600 ఆదివాసీ తెగలు గుర్తించ బడ్డాయి. భారత రాజ్యాంగం వీరికి చట్టపర మైన రక్షణలు కల్పిం చింది. అవే 5వ,6వ షెడ్యూల్‌గా ప్రాంతీయ, పరిమిత స్వయం పాలనా హక్కు ఇవ్వబడిరది.ఆచరణకు వీలుగా పీసాచట్టం (పి.ఇ.ఎస్‌.ఎ-1996) చేయ బడిరది. అయినా బూర్జువా పాలక వర్గాలు మనదేశంలో గిరిజన తెగలకు స్వయం పాలనా హక్కులు ఇవ్వలేదు.
ఆదివాసీలు-హక్కులు
వలస కాలం నుంచి మనదేశంలో ఆదివాసీ తెగలు బూర్జువా,భూస్వామ్యవర్గాలకు వ్యతి రేకంగా పోరా టాలు చేస్తున్నాయి.ఒక రాజీగా అనేక రక్షణ చట్టాలు వచ్చాయి. ముఖ్యం గా1874లోనే ప్రత్యేక షెడ్యూల్డ్‌ జిల్లాల చట్టం చేయబడిరది.1917లో ఆదివాసీ తెగల నివాస ప్రాంతాలలో ఉమ్మడి భూమి హక్కులు ఇవ్వ బడ్డాయి.అవేభారత రాజ్యాంగంలో పొందు పరిచారు. అనేక పోరాటాల అనంతరం ఆది వాసీ తెగలకు అటవీ భూములపై హక్కులు కల్పిస్తూ 2006లోచట్టం చేయబడిరది. చట్టం ప్రకా రం అటవీ భూమిపై ఆధారపడి జీవిస్తున్న ప్రతి గిరిజన కుటుంబానికీ 10ఎకరాల వరకూ పట్టా ఇవ్వవచ్చు. వారిపై గల కేసులను ఎత్తివే యాల్సి ఉంది. మన రాష్ట్రంలో దీని అమలు అరకొరగా జరిగింది. సుమారు 25లక్షల ఎకరాలకు పట్టాలి వ్వవలసిన భూమిని గుర్తించినప్పటికీ కేవలం 9 లక్షల ఎకరాలకు మాత్రమే పట్టాలిచ్చారు. దీనిలో లక్షా యాబై ఆరు వేల మందికి 3లక్షల ఎకరాలు మాత్రమే దక్కింది.మిగతా 6లక్షల ఎకరాలు 2 వేల విఎస్‌ఎస్‌ల పేర (వన సంరక్షణ సమితులు) పట్టా లిచ్చి అటవీశాఖ ఆధీనంలోనే ఉంచుకు న్నారు. ఇన్ని చట్టాలు ఉన్నా, స్వాతంత్య్రం వచ్చి 68 ఏళ్లు అయి నా ఆదివాసీ తెగలు తమ సంప్రదాయపు భూముల నుంచి,అటవీ ప్రాంతంనుంచి నెట్టివేయబడు తున్నా రు.మనరాష్ట్రంలో 1/70చట్టం అమలులో ఉన్నది. గిరిజనుల సాంప్రదాయక భూములు గిరిజన తెగ లకే దక్కాలి. గిరిజనేతరులకు షెడ్యూల్డ్‌ భూమిపై ఎట్టి హక్కూ లేదు. కానీ మన రాష్ట్రంలో షెడ్యూల్డ్‌ ప్రాంతంలో 48శాతం సంప్రదాయక గిరిజన భూములను గిరిజనేతరులు ఆక్రమించు కున్నారు. గిరిజన విద్యపేరుతో ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలకు ఐటిడిఎలు దోచిపెడుతున్నాయి.ఈసొమ్ముతో ఐటిడిఎనే జూనియర్‌ కాలేజీలను పెట్టవచ్చు లేదా తాము నడుపుతున్న రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీ ల్లో చేర్పించవచ్చు.
ఆదివాసీ చట్టాలు-అక్కరకురాని చుట్టాలు
ఆదివాసీ చట్టాలు అక్కరకురాని చుట్టా లుగా మారాయి. పోలవరం ప్రాజెక్టు వద్దని గ్రామ సభలు, పంచాయతీలు,మండల పరిషత్తులు (ఇవన్నీ షెడ్యూల్డ్‌ ఏరియాలో, పీసా చట్టం పరిధి లో ఉన్నవి) చేసిన తీర్మానాలకు రాష్ట్ర ప్రభుత్వం విలువే ఇవ్వలేదు.బాక్సైట్‌ త్రవ్వకాలు వద్దని విశాఖ జిల్లాలోని గ్రామసభలు, పంచాయతీలు, మండల పరిషత్తులు చేసిన తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రక్కనపెట్టి ఐటిడిఎల ద్వారా బాక్సైట్‌ త్రవ్వకాలు జరుపుతామని చెబుతున్న మా టలు సుప్రీంకోర్టు ‘సమతా తీర్పును’ వెక్కిరించడం కాదా? ఆదివాసీ హక్కులను కాలరాయడానికి రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడడం లేదు.షెడ్యూల్డ్‌ ప్రాంతంలో జీవో 3ప్రకా రం అన్ని ప్రభుత్వ శాఖలలోని ఉద్యోగాలన్నింటినీ స్థానిక గిరిజన అభ్యర్థులతో నింపవలసి ఉన్నది. ప్రతి కార్యాలయంలో గుమస్తా నుంచి అధికారి వరకు ప్రతి స్కూలు, ఆసుపత్రి, వివిధ కార్యాలయా లలో నేడుస్థానిక అభ్యర్థులు10శాతం కూడా లేరు. స్థానికేతరులు, గిరిజనేతరులు, తాత్కాలిక ప్రాతిపది కపై గతంలో నియామకాలు జరిగాయి. ఈ జీవో ప్రకారం వారిని తొలగించి స్థానిక గిరిజన అభ్యర్థు లతో నింపవలసి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం స్కీం వర్కర్లలో ఎక్కువమంది గిరిజనేతరులనే నియమి స్తున్నది. అర్హులైన గిరిజన అభ్యర్థులు నిరుద్యోగులుగా ఉన్నారు. ప్రభుత్వం జీవో 3ను పటిష్టంగా అమ లుచేసి స్థానిక గిరిజన అభ్యర్థులకే ఉద్యోగ అవకాశం కల్పించాలనే డిమాండ్‌ ముందుకు వస్తున్నది. ఆదివాసీ తెగలు ప్రత్యేక భాషలు, విశిష్టమైన సంస్క ృతిని కలిగి ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనేతర భాషలను వారిపై బలవంతంగా రుద్దు తున్నాయి. మన రాష్ట్రంలో ప్రతి గిరిజన కుటుంబం ఇంట్లో తమ తెగ భాష మాట్లాడుతున్నారు.స్కూలుకు వెళ్తే తెలుగు,ఇంగ్లీషులో బోధన జరుగుతున్నది. భాషా పరిజ్ఞానమేకాక సాధారణ విషయాలను కూడా అవగాహన చేసు కోవడం గిరిజన విద్యా ర్థులకు కష్టంగా ఉన్నది. ఫలితంగా స్కూల్‌ డ్రాపవుట్స్‌ ఎక్కువ అవుతు న్నాయి. యునెస్కో సూచన మేరకు 10వేల మంది మాట్లాడే ప్రతి భాషకూ లిపి కనిపెట్టాలని, వాడుక లో దానికి రక్షణనివ్వాలని ఉన్నది. అయినా లక్షల మంది మాట్లాడుతున్న ఆదివాసీ భాషలకు లిపి కని పెట్టకపోవడం దారుణం.భాషా పరిశోధన సంస్కృతి రక్షణలోభాగం. ఆదివాసీ తెగల వాయిద్య పరికరాలు, వారి నృత్యాలు ప్రభుత్వం ప్రోత్సాహం లేక అంతరించిపోతున్నాయి. ఆదివాసీ ప్రాంతాలలోకి టూరిజం ప్రవేశించాక ఆదివాసీ కళలు వ్యాపార సరుకులుగా మారి పోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికా రికంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పాటించాలి. నేడు జరుగు తున్న ఉత్సవాలు పాలకవర్గాల అవసరాల కోసమే తప్ప ఆదివాసీలను కాపాడడానికి కాదు. నిజమైన ఆదివాసీ దినోత్సవం, ఆదివాసుల ‘అవసరాలు- ఆకాంక్షలు’ నెరవేర్చేదిగా ఉండాలి.