మెరిసిన మొద‌టి అక్ష‌రం

స్త్రీ సాధికారత కోసం, వారి హక్కుల కోసం కృషి చేసిన సావిత్రిబాయి జీవితం ఆదర్శప్రాయం. వారు చూపిన మార్గాన్ని అనుసరించడమే వారికి మనం ఇచ్చే నివాళి. సావిత్రిబాయి పూలే దేశంలో సామాజిక చైతన్యాన్ని, స్త్రీ చైతన్యాన్ని కలిగించిన వారిలో ముఖ్యలు. ఆరోజుల్లో అణగారిన వర్గాలకు, స్త్రీలకు చదువుకోవడానికి పాఠశాలలు ఉండేవి కావు. అందుకే సావిత్రిబాయి పెళ్లికి ముందు మూడవ తరగతి వరకే చదివారు. పెళ్లి తర్వాత జ్యోతిబా పూలే చొరవతో తిరిగి చదువుకొనసాగించారు. అంతేకాదు. పూలే ఆమె చదువుకునే అవకాశం కల్పిండమే కాదు ఆమె చదువు పదిమందికి ఉపయోగపడేలా టీచర్‌ ట్రైనింగ్‌ కూడా ఇచ్చారు. అలా సావిత్రిబాయి తాను విద్య నేర్చుకుని, పదిమందికి నేర్పించారు. ఈ విధంగా సావిత్రిబాయి ఈ దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు అయ్యారు. సమాజంలో స్త్రీలు అన్ని రంగాల్లో ముందుండాలని, స్త్రీలు చదవగలరు, రాయగలరు, పోరాటం చేయగలరని నిరూపించిన దార్శనికురాలు సావిత్రిబాయి పూలే. అట్టడుగు వర్గాలకు చదువు చెప్పడానికి వెళ్లేటప్పుడు ఆమె ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. – గునపర్తి సైమన్‌
పూలే దంపతులు మహారాష్ట్రలో బలమైన సామాజిక ఉద్యమాలను నిర్మించారు. మహారాష్ట్రంలో అణగారిన వర్గాల వారు నివసించే ప్రాంతాల్లో మొదట పాఠశాలు ప్రారంభించారు. తర్వాత ఆడపిల్లల కోసం కూడా ప్రత్యేక పాఠశాలలను పూలే దంపతులు ఏర్పాటు చేశారు. వారు స్థాపించిన పాఠశాలలో నాడు విద్యకు నోచుకోని స్త్రీలు, అణగారిన వర్గాల విద్యార్థులు ఎంతో మంది చదువుకున్నారు. సావిత్రిబాయి అట్టడుగు వర్గాలకు విద్య నేర్పించడానికి అగ్రకులాల వారు సహించలేకపోయారు. ఆమెను అనేక అవమానాలకు గురిచేశారు. ఆమెపై కోడిగుడ్లు, టమాటాలు, బురద, రాళ్లు విసిరేవారు. వారి చర్యలతో విసుగు చెందిన సావిత్రి ఉద్యోగం మానాలని భావించారు. అయితే భర్త ఇచ్చిన ప్రోత్సహంతో సావిత్రిబాయి పోరాటాన్ని వదిలిపెట్టలేదు. ఏ సమాజం సంకెళ్లు విధించిందో వాటిని తెంపి స్త్రీ విద్య, వారి హక్కుల కోసం నిరంతరం ఉద్యమించారు. సావిత్రి బాయి అణగారిని వర్గాల వారినేకాకుండా బ్రహ్మణ స్త్రీలకు కూడా ఆదరించారు. అగ్రవర్ణాల్లోని వితంతువలను చేరదీశారు. వారికి కొత్త జీవితాలను ప్రసాదించారు. వితంతువుల కోసం, వారి పిల్లల కోసం జ్యోతిరావు శరణాలయాలను స్థాపించారు. ఇందులో కూడా సావిత్రిబాయి తన సేవలను అందించారు. జ్యోతిరావు పూలే 1837లో సత్యశోధక సమాజం ఏర్పాటు చేశారు. అందులో భర్తతోపాటు సావిత్రిబాయి క్రీయాశీలయంగా పాల్గొన్నారు.187677,189697లో మహారాష్ట్రంలో కరువు కాటకాలు సంభవించాయి. అప్పుడు ఉచిత భోజన వసతి హాస్టళ్లను ఏర్పాటు చేయాలని, కరువు నివారణ కోసం తక్షణ చర్యలు చేపట్టాలని బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆసమయంలో సత్యశోధక సమాజ్‌ చేసిన సేవ, ముఖ్యంగా సావిత్రిబాయి చేసిన సేవ చిరస్మరణీయం.
బాల్యం :
శ్రీమతి సావిత్రి బాయి పూలే మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్‌ అనే గ్రామంలో 1831 జనవరి 3న జన్మించింది. ఆమెది రైతుకుటుంబం. సావిత్రి బాయి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధు త్వం ఉంది. వీరి బంధువులు నిజామాబాద్‌ జిల్లాలో బోధన్‌ నాందేడ్‌ కొండల్‌ వాడి ప్రాంతంలో , అదిలాబాద్‌ చుట్టుపక్కల ఉన్నారు. బోధన్‌ ప్రాంతపు మున్నూరుకాపులు వీరికి బంధువులు. శ్రీమతి సావిత్రి బాయి తన 9వ యేట 12 యేండ్ల జ్యోతిరావు ఫూలెను 1840లో వివాహమాడారు. ఆదంపతులకు పిల్లలు లేరు. వీరు యశ్వంతరావు (బ్రాహ్మణ వితంతువు కుమారుడు)ను దత్తత తీసుకున్నారు. ‘‘జ్యోతీరావు ఫూలె’’ ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది. అహ్మద్‌ నగర్‌లోఉపాధ్యాయునిగా శిక్షణ పొంది 1848లో భర్త జ్యోతిరావుతో కలిసి క్రింది కులాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించారు. అట్టడుగువర్గాలు, మహిళలకు చదువు సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, బ్రాహ్మణవాద సంప్రదాయాలను, ఆధిపత్యవర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పాఠశాలలు ప్రారంభించి,12 మే 1848న దేశంలో బహుజనులకు మ్నెట్టమ్నెదటి పాఠశాల ప్రారంభించారు. సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధీశాలి ఆమె. కేవలం 4సంవత్సరాలలోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశా లలను ప్రారంభించి ఉచితవిద్యనం దించారు. 1848 లోనే దేశంలొ విద్యా ఉద్యమం ప్రారంభించిన మ్నెదటి మహిళ ఉపాద్యాయురాలు, దళితుల, స్త్రీల విద్యా ్య్ష వ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు 18 ఏళ్ళు మాత్రమే. వారి జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య కులాల వారి నుంచి అనేక దాడులను, అవమానాలను ఎదుర్కొంది.ఈ నేపథ్యంలోనే 1849లో పూలే, సావిత్రీబాయి దంపతులు గృహ బహిష్కారానికి గురిచేశారు.
సామాజిక విప్లవకారిణి :
ఆమె మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్త్రీలను చైతన్యపరచడానికి 1852లో మహిళా సేవామండల్‌ అనే మహిళా సంఘన్ని కూడా స్థాపించింది. జెండర్‌ సమస్యలకు తోడుగా, కుల పితృస్వామ్య వ్యవస్థల అణచివేతకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారిత కోసం ఈ సంస్థ కృషిచేసింది. మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించినది సావిత్రిబాయి అసత్యాలతో, అగ్రవర్ణ దురహంకారపు నిచ్చెనమెట్ల కులవ్యవస్థగా నిర్మాణమైన సమాజంలో ‘‘సత్యాన్ని’’ శోధించడానికి 1873 లో తన భర్త మహత్మా పూలేతో కలసి ‘‘సత్యశోధక్‌ సమాజ్‌ ‘‘ను ప్రారంభించి బాల్యవివాహలకు, మూడనమ్మకాలకు, సతీసహగమనానికి వ్యతిరేఖంగా మరియు వితంతువు పునఃర్వివాహల కొరకు అసమాన బ్రాహ్మనిజ వ్యవస్థకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడిపారు. బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభవించే ఎంతో మంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. గర్భవతులైన వారికి పురుళ్లు పోసి వారి కళ్లల్లో వెలుగు చూసారు. అలా పురుడు పోసుకుని తన వద్దేవదిలేసి పోయిన ఓ బిడ్డను అక్కున చేర్చుకున్నారు.యశ్వంత్‌ గా నామకరణం చేసి తమ ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పెంచి పెద్ద చేసారు. వితంతువులకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండిరచి, క్షురకులను చైతన్యపర్చి, వితంతువులకు శిరోముండనం చేయబోమంటూ క్షురకుల చేత 1860లో సమ్మె చేయించారు సావిత్రీబాయి. తరువాత 1873 సెప్టెంబరు 24న ‘‘సత్యసోధక్‌ సమాజ్‌’’ అనే సామాజిక, ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించి, సత్యసోధన కోసం ఉద్యమాన్ని నడిపారు పూలే. ఈ సత్యసోధక్‌ సమాజ్‌ మహిళా విభాగం సావిత్రీబాయి నేత ృత్వంలో నడిచేది. వివాహాలు వంటి శుభ కార్యాలను పురోహితులు లేకుండా నిర్వహించే విధానాన్ని ఈ సంస్థ ప్రారంభించింది. 1873 డిసెంబరు 25న భార్యను కోల్పోయిన ఒక యువకునికి తన స్నేహితురాలి కుమార్తెతో సత్యసోధక్‌ సమాజ్‌ ఆధ్వర్యన సావిత్రీబాయి వివాహం జరిపించారు.1868 నుంచి సావిత్రీబాయి అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. 1870లో ఒకసారి 1896లో మరోసారి దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినప్పుడు ఫూలే దంపతులు చేసిన క ృషి అనన్య సామాన్యం. కరువు వాతపడిన కుటుంబాలలోని అనాధ బాలలను దాదాపు 2,000 మందిని అక్కున చేర్చుకున్నారు. తమ పాటశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించినారు. సావిత్రిబాయి సంఘ సంస్కర్తగానే గాదు, రచయిత్రిగా కూడా వేగుచుక్కగా నిలిచారు. 1854లోనే ఆమె తన కవితా ంసపుటి ‘కావ్యఫూలే’ను ప్రచురించారు. ప్రతీ భారతీయ మహిళ మూడాచారాలకు,మూఢనమ్మకాలు వ్యతిరేకంగా శ్రీమతి సావిత్రి బాయి పూలే స్ఫూర్తితో ప్రజలలో చైతన్యం తీసుకురావాలి.
యుద్ధ వితంతువు పిల్లలతో జీవనం.
హిందూ సమాజంలో భర్త చనిపోయిన స్త్రీని వితంతువు అంటారు. వీరిని వ్యవహారంలో ముండమోపి , విధవ అని కూడా వ్యవహరిస్తారు. గతంలో వీరు సమాజంలో అనేక అవమానాలను ఎదుర్కొనేవారు. ఇప్పటికీ అక్కడక్కడా వీరికి ఇలాంటి అనుభవాలు ఎదురు అవుతూనే ఉంటాయి. కందుకూరి వీరేశలింగం పంతులు, రాజా రామ్మోహనరాయ్‌ వంటి సంఘ సంస్కర్తల కారణంగా ప్రస్తుతము వీరు గౌరవ ప్రథమైన జీవితమును గడుపుతున్నారు. వితంతు కుమార్తె ,విడాకులు పొందిన కూతురూ కుటుంబ పింఛనుకు అర్హులే పింఛను పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆయనపై ఆధారపడిన వితంతు, విడాకులు పొందిన కుమార్తె కుటుంబ పింఛను పొందవచ్చు. ఈవిషయంలో ఇప్పటివరకు ఉన్న అడ్డంకులు తొలగి పోయాయి.గతంలో ఉద్యోగి బతికి ఉండగానే కూతురు వితంతువై లేదా విడాకులు పొంది ఉంటేనే పింఛను అందేది. 25 ఏళ్ల వయోపరిమితి వరకే వర్తింపజేయాలనే నిబంధన ఉండేది. తాజా ఉత్తర్వుల ప్రకారం వితంతు, విడాకులు పొందిన కూతురు మళ్లీ వివాహం చేసుకున్నా, మరణించినా ,ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి లేదా స్వయంఉపాధి ద్వారా నెలకు రూ.2440 పొందుతున్నా పింఛను ఆగిపోతుంది. మానవ హక్కులు అనేవి ‘‘మానవులకు సంక్రమించే హక్కులు మరియు స్వేచ్ఛలు.’’ ఈ భావనను ప్రతిపాదించిన వారు సాధారణంగా ప్రతి ఒక్కరు వారు కేవలం మానవులు అయిన కారణంగానే కొన్ని హక్కులకు అర్హులని పేర్కొన్నారు. కాబట్టి మానవ హక్కులు అనేవి ఒక సార్వత్రిక మరియు సమసమాజ శైలికి చెందినవి. వాస్తవ మానవ నైతికత యొక్క భాగంగా మాత్రమే అటువంటి హక్కులు ఉంటాయి, ఎందుకంటే న్యాయబద్ధ నైతిక సూత్రాలు లేదా సహజ హక్కులు బలమైన కారణాలచే లభిస్తాయి, లేదా అంతర్జాతీయ చట్టం పరిధిలో లేదా జాతీయ స్థాయిలో చట్టబద్ధమైన హక్కులుగానో లభిస్తాయి. కానీ, పైన చెప్పిన భావనలలో ఎందులోనూ దేనిని మానవహక్కుగా పరిగణించాలో, పరిగణించ కూడదో అనే విషయంపై ఏకాభిప్రాయం లేదు మరియు మానవ హక్కుల అమూర్త భావన అనేది ఎప్పుడూ తీవ్ర వేదాంత చర్చ మరియు విమర్శకు దారితీస్తూనే ఉంది.