విశాఖ ఉత్సవ్‌

పర్యాటక అభివృద్ధిలో విశాఖను ప్రధమశ్రేణిలో తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో ప్రభుత్వం నాలుగు ఏళ్ల నుంచి నిర్వహిస్తున్న ‘విశాఖ ఉత్సవ్‌’’ ఈసంవత్సరం కూడా అంగరంగ వైభంగా నిర్వహించారు. డిసెంబరు 28,29,30 తేదీల్లో ఏర్పాటు చేసిన ఉత్సవాలు అంతర్జాతీయ ఖ్యాతిని ఇనుముడిరప చేశాయి. రామకృష్ణాబీచ్‌లో నిర్వహించిన ఉత్సవాలను రాష్ట్రముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా హజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలను విశాఖనగరం ఆకర్షించే విధంగా పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. విశాఖను మించిన పర్యాటకనగరం దేశంలో మరొకటి లేదన్నారు. ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధికి పర్యాటక రంగం దోహదపడు తుంద న్నారు. సేవల రంగంలో పర్యాటక రంగం ముఖ్యమని చెప్పారు. వ్యవసాయ అనుబంధరంగాల కంటే పర్యాటకరంగంలో ఉపాధి అవకా శాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.
విశాఖనగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్తుతామని పేర్కొన్నారు. రానున్న కాలంలో విద్యుత్తు వాహనాలు అందుబాటులోకి వస్తాయన్నారు. నాలుగుయేళ్లలో 20వేల రూమ్‌లు నిర్మించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రతినెల నగరంలో ఒక ఉత్సవాన్ని నిర్వహించాలని సూచించారు. విశాఖపట్నంలో ఏమ్యూజిమెంట్‌ పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. స్కూభా డైవింగ్‌ ఏర్పాటు చేసుకోవచ్చునని చెప్పారు. వచ్చే జూన్‌ నాటికి విశాఖపట్నానికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా గోదావరి జలాలను అందిస్తామన్నారు. తొందరలో భోగాపురం ఎయిర్‌ పోర్టుకు టెండర్లు పిలుస్తామన్నారు. కాకినాడకు బీచ్‌లను ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయని తెలిపారు. విశాఖనగరం ప్రశాంత నగరమని, భూకబ్జాలకు, నేరాలకు అవకాశం ఉండకూడదన్నారు. బుద్దిజం అభివృద్ధికి అవకాశాలున్నాయన్నారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి లేపాక్షిలను పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తామన్నారు. అరకువేలి, లంబసింగిలో సమ్మర్‌ రిసార్ట్స్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖపట్నంలో పారిశుద్ద్యం బాగుందని జీవీఎంసీ కమిషన్‌ను అభినందించారు. ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి, నగరావాయిద్యాన్ని వాయించి ఉత్సవాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ విశాఖ ఉత్సవ్‌ నిర్వహణపై ప్రారంభోపన్యాసం చేశారు. విశాఖ ఉత్సవ విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివా సరావు, కార్మికశాఖ మంత్రి కె.అచ్చెయ్య నాయుడు, ఎంపీఎం. శ్రీనివా సరావు, ఈస్ట్రన్‌ నేవిల్‌ కమెండ్‌ చీఫ్‌ కరంభీర్‌సింగ్‌, శాసనసభ్యులు పంచకర్ల రమేష్‌బాబు, వెలగపూడి రామకృష్ణబాబు, బండారు సత్యనారాయణమూర్తి, వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ బసంత్‌ కుమార్‌, జీవీఎంసీ కమిషనర్‌ ఎం.హరి నారాయణన్‌,జాయింట్‌ కలెక్టర్‌ జి. సృజన,సిపీ మహేంద్ర లడ్డా తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాలు సందర్భంగా నగరంలోని సిటీ సెంట్రల్‌ పార్కు లోను, వుడా పార్కులోఏర్పాటు చేసిన పుష్పప్రదర్శనలు, ఆర్కేబీచ్‌కు కేంద్రంగా నిర్వహించిన పలుసాంస్కృతిక కార్యక్రమాలు మూడు రోజుల పాటు నగరప్రజల్ని మైమరిపించాయి.
ఆకట్టుకున్న పుష్పప్రదర్శన :
విశాఖపట్నం మెట్రో రీజియన్‌ డవలప్‌మెంట్‌ ఆధారిటీ (వీఎం ఆర్‌డీఏ) ఏర్పాటు చేసిన పుష్పప్రదర్శన నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది. వివిధ రకాల పూల ఆకృతులతో సుమారు 130 ఆకుల పుష్పాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ప్రజను ఆకట్టుకునేలా థాయలాండ్‌, కోల్‌కొత్తా, బెంగళూరు, కడియం నుంచి ఆకర్షణీయమైన పుష్పాలను తెప్పించి ప్రదర్శనలో ఉంచారు. పుష్పఆకృతులతోపాటు డ్రై ప్లవర్స్‌, వెజిటబుల్‌ కార్వింగ్‌ తదితర ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి -స‌తీష్‌.