ఉద్దానం ప్రజల కల..నెరవేరిన వేళ..

ఇది శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి 140 కిలోమీటర్ల దూరంలోని సము ద్రపు ఒడ్డునున్న కళింగపట్నంలో మహిళల ఆవేదన. తరచుగా మీడియావాళ్లు ఈ గ్రామా న్ని సందర్శిస్తుండటంతో వారి స్పందన ఇది.
ఉద్దానం అంటే ఉద్యానవనం!
పేరుకు తగ్గట్టుగానే ఈ ప్రాంతం ఒక వైపున సముద్ర తీరం, మరో పక్క కొబ్బరి, జీడి మామిడి, పనస, మామిడి తోటలు, మరో వైపున నాగావళి, వంశధార, మహేంద్ర తనయ వంటి జీవ నదులు పారుతూ నిత్యం సస్యశ్యామలంగా ఉండ టంతో ఈ ప్రాంతా నికి ఉద్దానం అనే పేరొచ్చింది.అయితే ఆకుపచ్చని ఉద్దానం, ఇప్పుడు కిడ్నీ వ్యాధు లతో వణికిపోతోంది. అంతుపట్టని సమస్య లతో ఈ ప్రాంత ప్రజలు అల్లాడు తున్నారు. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల సరిహద్దున ఉన్న శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్ఛాపురం, వజ్రపు కొత్తూరు, పలాస, మందస మండ లాలను కలిపి ఉద్దానం ప్రాంతం గా పిలుస్తారు.ఈ ప్రాంతంలోని సోంపేట, కవిటి, కుసుంపురం, కుత్తుమ, కళింగ పట్నం సహా ఏ గ్రామానికి వెళ్లినా, ప్రతి ఇంటిలోనూ ఎవరో ఒకరు కిడ్నీ వ్యాధులతో బాధపడుతు న్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకో వచ్చు.ప్రభుత్వ అంచనాల ప్రకారం గత రెండు దశాబ్దాలలో ఇప్పటి వరకు 15,623 మంది ఇలా తీవ్రమైన కిడ్నీ జబ్బుల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 13, 093 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు.
ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం: సీఎం జగన్‌
‘ఉద్దానం అంటే ఉద్యానాలవనం అటువంటి ఈ పచ్చని ప్రాంతాన్ని కిడ్నీ మహమ్మారి రూపంలో ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసింది.ఈ పరిస్థితిని నా పాదయాత్రలో కళ్లారా చూశా.‘‘నేను చూశాను. నేను విన్నాను. నేను ఉన్నాను’’ అన్న మాట నాకు గుర్తుంది. ఇచ్చిన మాట ప్రకారం 200 పడకల ఆసుపత్రి నిర్మిస్తానని చెప్పి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించినందుకు గర్వపడు తున్నా.’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఉద్దా నం కిడ్నీ సమస్య పరిష్కారం కోసం రూ.85 కోట్లతో నిర్మించిన డా. వైఎ స్సార్‌ కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌, రూ.700 కోట్ల ఖర్చుతో నిర్మించిన వైఎస్సార్‌ సుజలధార ప్రాజెక్టను సీఎం జగన్‌ ప్రారంభించారు. సీఎం జగన్‌ మాట్లా డుతూ ఉద్దానం ప్రాంతంలో ఈ సమ స్య ఉందని తెలిసినా గతంలో ఏ పాల కుడూ ఆలోచన చేయని సమస్యను రూ.785 కోట్లు ఖర్చు చేసి పరిష్కరిం చామని పేర్కొన్నారు.
కిడ్నీ బాధితులకు నిరంతర వైద్యసహాయం
ఉద్ధానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సేవలు అందించేందుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలిసి మెరుగైన వైద్యం అందుతోం దని సీఎం జగన్‌ గుర్తు చేశారు. వైఎస్సార్‌ కిడ్సీ రీసెర్చ్‌ సెంటర్లో ఫిబ్రవరి నాటికి కిడ్నీ ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ కూడా చేసి దేశానికే తలమానికంగా నిలుస్తుందన్నారు. రీసెర్చ్‌ సెంటర్లో కిడ్నీ వ్యాధిగ్రస్తుల ట్రీట్మెంట్‌ కోసం అన్ని విభాగాలతో పాటు డయాలసిస్‌ సెంటర్లు, ఆపరేషన్‌ థియేటర్లు మెరుగైన ప్రమాణాలతో ఏర్పాటు చేశామని, ఇక మీ ఆరోగ్య అవసరాలకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదంటూ సీఎం జగన్‌ భరోసా ఇచ్చారు. ఈ ఆసుపత్రిలో స్పెషలిస్ట్‌ డాక్టర్లు మొదలు ఇతర సిబ్బంది 375 మంది ఉద్ధానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సేవలు అందిం చనున్నట్లు తెలిపారు. జిల్లాలోని కిడ్నీ వ్యాధు లను గుర్తించేందుకు ఏడు మండలాల్లో స్క్రీనింగ్‌ చేయిస్తామని పేర్కొన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అవసరమైన 37 రకాల ఔషదాలను స్థానికంగా ఉన్న అన్ని పీహెచ్‌ సీల మొదలు, రీసెర్చ్‌ సెంటర్‌ వరకు అందు బాటులో ఉంచి ప్రతి పేదవాడికి ఉచితంగా ఇంటి వద్దకే అందిస్తామని పేర్కొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా మందుల అందజేత కొనసాగుతుందంటూ భరోసా ఇచ్చారు. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 2,500గా ఉన్న కిడ్నీ వ్యాధిగ్రస్తుల పెన్షన్‌ ను ఏకంగా రూ. 10,000 వేలకు పెంచామన్నారు. గత ప్రభుత్వంలో కిడ్నీ పేషెంట్ల కింద పెన్షన్‌ అందుకున్న వాళ్లు 3,076 మంది ఉండగా వారి కోసం గత ప్రభుత్వం నెలకు కేవలం రూ.76లక్షలు ఖర్చు చేసేవాళ్లని, మీ బిడ్డ ప్రభుత్వంలో ఏకంగా 13,140 మందిని పెన్షన్ల జాబితాలో చేర్చా మని కేవలం పెన్షన్ల కోసమే నెలకు రూ.12. 54 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం జగన్‌ ప్రజలకు వివరించారు. ఉద్ధానంలో అసలు ఈ సమస్య ఎందుకు వచ్చిందో మన ప్రభు త్వం కేంద్ర సంస్థలు ఐసీఎంఆర్‌తో కలిసి సమగ్ర ఆధ్యయనం చేసిందని వివరించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో తీవ్రత ఎక్కువ ఉన్న వారిని గుర్తించి మెరుగైన ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. హార్వర్డ్‌, నార్త్‌ కరోలినా యూనివర్సిటీతో మన ప్రభుత్వం ఈ అంశంపై కలిసి పనిచేసిందన్నారు. ఇలాంటి సమస్యే ఉన్న మార్కాపురం ప్రాంతంలో మెడికల్‌ కాలేజీ స్థాపించి కిడ్నీ వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం నెఫ్రాలజీ, యూరాలజీ విభాగా లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
నా కమిట్మెంట్‌ ఇదీ..
ఉద్దానం కిడ్నీ సమస్య శాశ్విత పరిష్కారం కోసం ఏ నాయకుడూ ఊహించని విధంగా రూ.700 కోట్లు ఖర్చు చేసి హీరమండలం రిజర్వాయర్‌ నుంచి 130 కిలోమీటర్ల మేర పైప్‌ లైన్‌ నిర్మించామని సీఎం జగన్‌ అన్నారు. ఇదీ తమకున్న కమిట్మెంట్‌ అని పేర్కొన్నారు. 7 మండలాల్లోని 807 గ్రామాలకు సురక్షిత నీరు అందించే వైఎస్సార్‌ సుజలధార ప్రాజెక్టు ద్వారా సురక్షిత నీరు అందిస్తున్నట్లు తెలిపారు. రెండో దశ కింద ప్రాజెక్టు ద్వారా మరిన్ని గ్రామాలకు నీరు అందిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో కూడా ఉద్దానం సమస్య ఉండేదని. కానీ సమస్య పరిష్కారం మాత్రం ఈ ప్రభుత్వంలో జరిగిందని గుర్తుంచుకోవాలని విజ్ణప్తి చేశారు. చంద్ర బాబుకు పేదల ప్రాణాలంటే లెక్కేలేదని విమర్శించారు. తన సొంత నియోజకవర్గం కుప్పం ప్రాంతానికి కూడా నీళ్లివ్వలేదన్నారు.
పొత్తులు, ఎత్తులు, చిత్తులు, కుయుక్తులు మాత్రమే..14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్ర బాబు తన వల్ల ప్రజలకు జరిగిన మంచి ఇది అని చెప్పుకునే ఒక్క పథకమైనా.. పనైనా ఉందా అని సీఎం జగన్‌ ప్రశ్నించారు. ఇలాంటి చంద్రబాబు ఎన్నికలు వచ్చేసరికి పొత్తుల మీద, ఎత్తుల మీద, చిత్తుల మీద, కుయుక్తుల మీద ఆధారపడతారని విమర్శించారు. 2014 నుంచి 2019 వరకు కలిసి పొత్తు లతో సాగిన టీడీపీ ప్రభుత్వంలో ఉద్దానం కిడ్నీ సమస్య ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. విశాఖను పరిపాలనా రాజ ధానిగా చేస్తామని మీ బిడ్డ అంటూ ప్రతి పక్షంలో ఉంటూనే అడ్డుకుంటున్నారని, ఉత్తరాంధ్రలో ఓబిల్డింగ్‌ కట్టినా, అభివృద్ధి చేసినా.. సీఎంగా ఇక్కడే వచ్చి ఉంటానన్నా మెడికల్‌ కాలేజీలు, పోర్టులు,ఎయిర్‌ పోర్టులు కడతామంటే ఏడుస్తారని విమర్శించారు. పక్క రాష్ట్ర నాన్‌ లోకల్స్‌ మన సీఎం ఏం చేయాలి, మన రాజధాని ఎక్కడ ఉండాలో ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు.
కదిలిస్తే కన్నీళ్లే…
‘’అయిదేళ్లుగా నేను,నా భర్త సీతారాం కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నాం. ఏడాది క్రితం ఆ జబ్బు ముదిరి ఆయన మాకు దూరమయ్యాడు. ఇపుడు నా కొడుకే కూలీ పనులు చేస్తూ నన్ను పోషిస్తున్నాడు. మందులకు నెలకు రూ. రెండు వేలకు పైగా ఖర్చవుతుంది. వాటికోసం అప్పులు చేయాల్సి వస్తోంది’’ అంటూ దీనంగా చెప్పారు కుసుంపురం గ్రామానికి చెందిన బత్తిన మాలక్ష్మి.
‘’ఏడాది నుంచి ఈ రోగంతో కుదేలయిపోతున్నాను. కొడుకు తప్ప మాకు ఏ దిక్కూ లేదు. సముద్రంపై వేటకు వెళ్లి నాలుగు డబ్బులు తెచ్చేవాడు. ఈ మధ్య యాక్సిడెంట్‌లో చేయి కోల్పోయి వాడు మూలనపడ్డాడు. ఇపుడు మందులు కొనుక్కునే స్తోమత లేదు, ఎవరూ ఆదుకునే దిక్కులేదు’’ అంటూ కళింగపట్నంకు చెందిన శివకోటి దానమ్మ విలపించారు. ఇదే గ్రామానికి చెందిన ఈగ కోమలమ్మ మూడేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. కూలీనాలీ చేసుకొని బతుకుతూ, సగం ఆదాయం డాక్టర్ల చుట్టూ తిరగడానికే ఖర్చు పెట్టాల్సి వస్తోంది.
డాక్టర్లు బలవర్ధకమైన ఆహారం, క్రమం తప్పకుండా మందులు వాడమన్నారు. కానీ ఆర్థిక స్తోమతలేక డబ్బులున్నపుడే మందులు వాడుతున్నారు కోమలమ్మ. సోంపేటలో కర్రి గణపతి, కాసమ్మ, కవిటిలో అర్జి శశి, తెప్పల తులసమ్మ, కంచిలిలో నారాయణ…ఇలా ఎవరిని కదిలించినా హృదయాన్ని పిండేసే దీన గాథలే వినిపిస్తాయి.పేదరికం కారణంగా కొందరు ఈ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించలేకపోతున్నారు. ఒకవేళ గుర్తించిన ప్పటికీ నాటు వైద్యుల వద్దకు వెళ్లి, తాత్కాలి కంగా నొప్పి నివారణకు మందులు వేసుకో వడంతో ఈ జబ్బు మరింత తీవ్రమైపో తోంది.ఆ సమస్య ఏమిటో.. అది ఎందు కొచ్చిందో వీళ్లకే కాదు, పరిశోధకులకు, ప్రభుత్వాలకు కూడా అంతుపట్టడం లేదు.
సామాజిక కోణం
ఉద్దానం ప్రాంతంలో సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో లేవు. డయాలసిస్‌ చేయించుకునే రోగికి మరొకరు తోడు ఉం డాలి. రోజుకూలీతో పొట్ట నింపుకునే పేదలకి అది పెద్ద భారమే. ఈ కారణంగా డయా లసిస్‌ వాయిదా వేసుకునేవారు, మందుల ఖర్చు భరించలేక క్రమ పద్ధతిలో వాడనివారు అనేకమంది ఉన్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో తక్షణం వ్యాధి లక్షణాలు తగ్గితే చాలు అనుకుంటారు. పైపెచ్చు నాటు వైద్యులు మిడిమిడి జ్ఞానంతో ఇచ్చే మందులు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.చదువులు, పెళ్లిళ్లు, కుటుంబ సంబంధాలపై ‘ఉద్దానం సమస్య’ ప్రభావం తీవ్రంగా ఉంది.‘’కిడ్నీ సమస్య వెలుగులోకి వచ్చాక మా ప్రాంతపు వారితో చుట్టరికం కలుపుకోవడానికి వెనకాడుతున్నారు. కొబ్బరి, మామిడి పంటలకు గిట్టుబాటు ధరలు రావడం లేదు’’ అని కుత్తుమ(కంచిలి మండలం) రైతులు చెప్పారు.
ఒక్క గ్రామంలో 500 రోగులు
కవిటి మండలం, కుసుంపురం గ్రామం కొబ్బరి, జీడిమామిడి తోటలతో పచ్చగా ఉం టుంది. కానీ ఇక్కడి మనుషుల్లో ‘జీవం’ కనిపించదు. ఈ గ్రామంలోకి అడుగు పెట్టిన మమ్మల్ని కిడ్నీబాధితులంతా చుట్టుముట్టారు.
‘’మా ఊరి జనాభా 4 వేలు. ఐదొందలకు పైగా కిడ్నీ రోగులున్నారు. అపుడపుడు అధికారులు వచ్చి మా వివరాలు అడిగి పోతుంటారు. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందలేదు. అందరం ఉపాధి హామీ పనుల మీద ఆధారపడి బతుకుతున్నాం. కిడ్నీ సమస్యలున్న మాకు ఉపాధి కూలీ రెట్టింపు చేస్తే, మందులు కొనుక్కొని ప్రాణాలు నిలుపు కుంటాం’’ అని అన్నారు డ్వాక్రా పొదుపు సంఘం నాయకురాలు సిందుల ఇంధిర.
సమస్యను గుర్తించిన డాక్టర్లు వీళ్లే
ఇక్కడి ప్రజలు విచిత్రమైన కిడ్నీ వ్యాధికి గురవుతున్నారని సోంపేటలోని ప్రముఖ వైద్యులు డాక్టర్‌ వై. కృష్ణమూర్తి, డాక్డర్‌ శివాజీ 1993లోనే అనుమానం వ్యక్తం చేశారు. ‘’సాధారణంగా వచ్చే కిడ్నీ వ్యాధికి భిన్నంగా ఇక్కడి ప్రజలకు ఈ వ్యాధులు ఉండడం మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా బీపీ, షుగర్‌ వ్యాధులు ఉన్నవారికి కిడ్నీ వ్యాధి వస్తుంది. కానీ ఈ ప్రాంతంలో ఆ రెండూ లేనివారికి కూడా రావడం అంతుపట్టని విషయం. రోజూ మా ఆసుపత్రికి ఆరవై మందికి పైగా పేషెంట్లు వస్తారు. వారిలో కనీసం 3 నుంచి ఐదుగురు వరకు కిడ్నీ రోగులు ఉంటారు’’ అని డాక్టర్‌ కృష్ణ మూర్తి చెప్పారు. ఈ ప్రాంత ప్రజల్లో 37% మందికి కిడ్నీ వ్యాధి ఉందని ఇండి యన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ లెక్కలు చెబుతున్నాయి. కానీ, ఇప్పుడా సంఖ్య 40 శాతానికి చేరిందని ఆయన వివరించారు. సోంపేట పవర్‌ ప్లాంట్‌ వ్యతిరేక ఉద్యమంలో డాక్టర్‌ కృష్ణ మూర్తి కీలక పాత్ర వహించారు.
ఏడు మండలాలకు రెండే డయాలసిస్‌ కేంద్రాలు!
ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఈ ప్రత్యేక వ్యాధికి ‘క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌’ అని పేరు పెట్టింది.‘’ఉద్దానం నెఫ్రోపతి’’ అని కూడా దీనిని పిలుస్తున్నారు.ప్రస్తుతం ఉద్దానం ప్రాంతంలో 13,093 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉండగా..కొత్తగా రోజుకు 9 నుంచి 12 కేసులు నమోదు అవుతున్నాయని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 5 ప్రభుత్వ డయాలసిస్‌ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో ఉద్దానం ప్రాంతం మొత్తంలో.. అంటే 7 మండలాలకు కలిపి 2 కేంద్రాలు ఉన్నాయి.కిడ్నీ వ్యాధి స్క్రీనింగ్‌ కేంద్రాలు రెండు ఉన్నాయి. 361 మంది కిడ్నీ బాధితులు ప్రభుత్వం నుంచి పెన్షన్‌ అందుకుంటున్నారు. ‘’మేం 2017లో లక్ష మందికి పరీక్షలు చేయగా 13,900 మందికి కిడ్నీ వ్యాధులున్నట్టు తేలింది. ప్రభుత్వ అసు పత్రుల్లో డయాల్సిస్‌ చేయించుకునే వారికి మాత్రమే రూ. 2,500 పెన్షన్‌ ఇస్తున్నాం. ఉద్దానం ప్రాంతంలోని ఏడు మండలాలకు కలిపి రెండు డయాల్సిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఒకటి పలాసలో, రెండోది సోం పేటలో ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రెండు, టెక్కలిలో మరోటి ఉన్నా యి. ఉద్దానం ప్రాంతానికి సమీపంలోనే టెక్కలి ఉంది. కాబట్టి బాధితులు అక్కడికి కూడా వెళ్లి డయాలసిస్‌ చేయించుకోవచ్చు’’ అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డా.ఎస్‌.తిరు పతిరావు చెప్పారు.
పుష్కరాలకు ఖర్చు చేస్తారు కానీ ఇది పట్టదా?
‘’ఇరవై ఏళ్లుగా ఒకే ప్రాంతంలో విస్తరించిన కిడ్నీవ్యాధి, కేవలం వైద్యరంగ సమస్య మాత్రమే కాదు, ఇది ఆందోళనకరమైన సామాజిక సమస్య. పుష్కరాలకూ, ఇతర కార్యక్రమాలకూ కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఒలింపిక్‌ విజేతలకు కోట్ల రూపాయలు నజరానాలు ఇస్తున్నారు. ప్రజల ప్రాణాల మీదకు వచ్చిన సమస్య పట్ల మాత్రం ఎందుకు ఇంత అలక్ష్యం?’’ అని ప్రశ్నిస్తున్నారు తిరుపతిలోని ఇండియన్‌ మెడికల్‌ అసోసి యేషన్‌ అధ్యక్షురాలు,డాక్టర్‌ పి. కృష్ణ ప్రశాంతి.‘’న్యూదిల్లీలోని ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, చంఢీగడ్‌ లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన అండ్‌ రీసెర్చ్‌ సంస్థల్లో 40సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధుల మీద విలువైన పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ సంస్థల సేవలను ఉద్దానంలో వినియోగించు కోవచ్చు’’ అని కృష్ణ ప్రశాంతి అన్నారు.
మొదలైన పరిశోధన
కిడ్నీ వ్యాధి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేందుకు విశాఖ విమ్స్‌ ఆసుపత్రిలో జార్జ్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌ ఆధ్వ ర్యంలో పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు. కిడ్నీ సమస్యలు పెరుగుదలకు కారణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు, చుట్టు పక్కల ప్రాంతాలకు, ఉద్దానం ప్రాంతా నికి గల తేడాలను పరిశీలిస్తామని పరిశోధ కులు అంటున్నారు.ముఖ్యంగా ఫ్లోరైడ్‌, జీడితోటలకు ఉపయోగించే రసాయనాలు సమీపంలోని నీటిలోకి చేరడం తదితర కారణాలతో కిడ్నీ వ్యాధుల సంఖ్య పెరుగుతు న్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు.
పరిష్కార మార్గాలు
ఈ సమస్య పరిష్కారానికి వైద్యులు, పరిశోధ కులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్ధానిక సర్పంచ్‌లు, పాత్రికేయులు తమ సూచనలను పంచుకున్నారు. అవి..మైక్రోబయాలజీ, పాథా లజీ, బయోకెమిస్టీ, పీడియాట్రిక్స్‌, గైనకాలజీ, జనరల్‌ మెడిసిన్‌ విభాగాల పీజీ విద్యార్ధుల సేవలను ఆ ప్రాంతంలో వినియోగించు కోవాలి.వంశధార, మహేంద్రతనయ నదీ జలాలను పైపు లైన్ల ద్వారా ఉద్దానం ప్రాంత వాసులకు అందించాలి. రసాయనాలు లేని సేంద్రీయ పంటలను రైతులు పండిరచాలి. జంతువులలో కూడా కిడ్నీ సమస్యలు వస్తున్నాయా?, ఆవులు, గేదెలు, వాటి పాలద్వారా సంక్రమిస్తున్న రోగాల గురించీ పరిశోధనలు చేయాలి. కోళ్ళు, చేపలు, మేకలు వాటి మాంసం మీద పరిశోధనలు జరగాలి. ఉద్దానం ప్రాంతంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ డయాలసిస్‌ యంత్రాలు ఏర్పాటు చేసి, నిపుణులను నియమించాలి. కోటి రూపాయల ఖర్చుతో పది డయాలసిస్‌ యంత్రాలు ఏర్పాటు చేయవచ్చని వైద్యులంటున్నారు.పౌష్టికాహార నిపుణుల పర్యవేక్షణలో ఉద్దానంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకి మధ్యాహ్న భోజన పథకం కింద ప్రత్యేక ఆహారం అందే ఏర్పాటు చేయాలి.కిడ్నీ రోగులకు ఉచిత బస్‌పాస్‌లు ఇవ్వాలి.
-(జి.ఎ.సునీల్‌ కుమార్‌)

కాలుష్యకోరల్లో ఢల్లీి..

ఇప్పటికే చుట్టుముట్టిన వాయు కాలుష్యం, ఇంతలోనే దీపావళి పండుగ, సుప్రీంకోర్టు వద్దని చెప్పిన వినకుండా స్థానికులు భారీ స్థాయిలో పటాసులు పేల్చారు. ఇంకేముంది ఢల్లీి వ్యాప్తంగా తీవ్ర వాయు కాలుష్యం అలుముకుంది. పండుగ మరుసటి రోజు, మంగళవారం ఉదయం కాలుష్యం తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. మంగళవారం ఉదయమైతే విషపూరిత పొగమంచు దేశ రాజధానిని పూర్తిగా కమ్మేసింది. దీపావళి రోజున సుప్రీంకోర్టు విధించిన పటాకుల నిషేధాన్ని నివాసితులు ఉల్లంఘించిన రెండు రోజుల తర్వాత ఢల్లీిలో గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (%జజదీ%) తెలిపిన వివరాల ప్రకారం దేశ రాజధానిని విషపూరి పొగమంచు చుట్టుముట్టింది. చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక తీవ్రమైన కేటగిరీగా నమోదైంది. చాలా చోట్ల ఏక్యూఐ 400 దాటింది. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో బవానాలో గాలి నాణ్యత సూచిక(ఏక్యూఐ) 434, ద్వారకా సెక్టార్‌ 8లో 404, ఐటీఓలో 430, ముండ్కాలో 418, నరేలాలో 418, ఓఖ్లాలో 402, రోహిణి, ఆర్కేపురంలలో 417గా నమోదైంది.
ఢల్లీిలో పెరిగిన విషవాయువుల తీవ్రత
ఢల్లీిని కాలుష్యం వెంటాడుతూనే ఉంది. అసలే చలికాలం దట్టమైన పొగమంచు కమ్మేస్తుంది. దీనికి తోడూ చుట్టు పక్కల నుంచి వస్తున్న విషవాయువులు ఢల్లీి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరో మూడు, నాలుగు రోజులు పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ నిపుణులు. మన్నటి వరకూ వాయువుల వేగంతో పాటూ గాలి దిశ మార్పుతో కొంత వరకూ ఉపశ మనం లభించింది. దీంతో కాలుష్యతీవ్రత కొంత మేర తగ్గిందని భావించారు స్థానికులు. దీంతో అధికారులు కొన్నింటిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు.
ప్రస్తుతం గాలిలో ఉధృతి ఏర్పడి అది కాలుష్యానికి కారణం అవుతోంది. తద్వారా విజిబులిటీ సమస్య తీవ్రంగా మారింది. మంగళవారం ఢల్లీిలోని ఐదు ప్రాంతాల్లో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 400కు పైగా నమోదైంది. మధ్యాహ్నం 2గంటలకే రహదారులు కనిపించకుండా మసగగా మారిపోయాయి. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో సూర్యరశ్మి బలహీనంగా మారింది. సాధారణంగా 2వేల మీటర్ల వరకూ కనిపించే రహదారి.. ప్రస్తుతం 1000 నుంచి 1500 మీటర్ల పరిధిలోనే కనిపిస్తోంది. దీనిపై స్పందించిన సెంట్రల్‌ పొల్యూషన్‌ బోర్డు కొన్ని కీలక అంశాలను వెల్లడిరచింది. సాధారణం కంటే ఒకడిగ్రీ ఉష్ణోగ్రత తక్కువగా నమోదైనట్లు ప్రకటించింది. నిన్న దేశ రాజధాని ఢల్లీిలో గరిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీలు కాగా కనిష్ట ఉష్ణోగ్రత 11.5గా నమోదైనట్లు వెల్లడిర చింది. గాలిలో తేమ భారీగా పడిపోయింది. రెండు రోజుల క్రితం 95శాతం ఉండగా నిన్న 56శాతం ఉన్నట్లు పేర్కొంది. చుట్టు పక్కల నెలకొన్న పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం, దట్టమైన పొగ కారణంగా మరిన్ని రోజులు పరిస్థితి ఇలాగే కొనసాగవచ్చని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలని సూచిస్తు న్నారు. అప్పుడప్పుడూ వేడి నీళ్లతో ఆవిరి పట్టుకొవడం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు తలెత్తకుండా కాపాడు కోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఎన్సీఆర్‌లో చలి పంజా..
దేశ రాజధాని ఢల్లీి సహా ఉత్తరభారతదేశాన్ని చలి వణికిస్తున్నది. పలు రాష్ట్రాల్లో భారీగా చలిగాలులు వీస్తున్నాయి. దీంతో కొన్ని రోజుల నుంచి ఢల్లీిలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపో తున్నాయి. చలిగాలులు మరో రెండు రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం సైతం ఢల్లీిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే ఆరు డిగ్రీలు తక్కువగా 15.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు డిగ్రీలు తగ్గి.. 5 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 16.2, కనిష్ట ఉష్ణోగ్రత 5.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రెండు మూడు రోజుల పాటు చలిగాలులు, చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.పొగ మంచు కారణంగా ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జమ్మూ కశ్మీర్‌లో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకంటే తక్కువగా నమోదవుతున్నాయి. పర్వతాల నుంచి వీస్తున్న చలిగాలుల కారణంగా ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాల ప్రజలు చలితో వణుకుతున్నారు. పంజాబ్‌, హర్యానా, చండీగఢ్‌లో ఢల్లీిలోని చాలా ప్రాంతాలు, ఉత్తరాఖండ్‌, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌, రాజ స్థాన్‌లోని చాలా చోట్ల చలితీవ్రత పెరిగింది. ఢల్లీి నగర శివారుల్లోని ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలోని సెక్టార్‌ 62,సెక్టార్‌ 1,సెక్టార్‌ 116వద్దగాలి నాణ్యత పరిస్థితి తీవ్రంగా ఉన్న ట్లు అధికారులు వ్లెడిరచారు. అనవసరమైన నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.‘శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడే వారి సంఖ్య గణనీ యంగా పెరిగింది.చాలా మంది దగ్గు, జలు బు, కళ్లనుంచి నీరు కారడం,కళ్లు మండడం వంటి సమస్యలతో బాధపడతున్నారు’ అని ఓ వైద్యుడు చెప్పారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాజధానిలో అయిదు రోజుల పాటు నిర్మాణ కార్యక లాపాలు చేపట్టరాదని ఢల్లీి పర్యావ రణ మంత్రి గోపాల్‌ రాయ్‌ ఆదేశాలు జారీ చేశారు. వాహనాలనుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించేందుకు నగరంలో రెడ్‌ సిగ్నల్‌ పడగానే వాహనాల ఇంజిన్‌ను అపేసే కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే కాలుష్యాన్ని వెదజల్లే పాతకాలపు వాహనాలు, కమర్షియల్‌ వాహ నాలపైనా నిషేధం విధించారు. దీంతో పాటు గా వెయ్యి సిఎన్‌జి బస్పులను ప్రవేశ పెట్టేం దుకు యత్నాలు చేస్తున్నారు. మరో వైపు ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలకు ఇదివరకే రెండు రోజులు సెలవులు ప్రకటిం చారు.అయితే వాయుకాలుష్యం బెడద ఒక్క ఢల్లీి నగరానికి పరిమితం కాలేదు. పొరుగు రాష్ట్రాలయిన హర్యానా, రాజస్థాన్‌, యుపిల లోని పలు నగరాల్లో పరిస్థితి కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి.
తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఢల్లీి వాసులు
దేశ రాజధానిని మంచు దుప్పటి కప్పేసింది. ఢల్లీిలో దట్టమైన పొగమంచు అలుముకుంది. పట్టపగలే రహదారులన్నీ రాత్రిని తలపిస్తుం డటంతో లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు వాహనదారులు.దేశ రాజధానిలో 7డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఒకవైపు పొగమంచు..మరోవైపు కాలుష్యంతో ఢల్లీి వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
-(బి.సూర్య ప్రకాష్‌ యాదవ్‌)

ఆంధ్ర వైద్య కళాశాలకు వందేళ్లు

‘తెలుగు వారి కోసం ఏర్పాటైన వైద్య కళాశాల’ వందేళ్ల కిందట తెలుగువారి కోసం ప్రత్యేకం గా ఒక వైద్య కళాశాల ఉండాలంటూ అప్పటి మద్రాస్‌ ప్రభుత్వానికి తెలుగు ప్రజలు చేసిన విన్నపాలతో 1920లో తెలుగువారి కోసం మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అంతకు ముందు వరకు తెలుగు ప్రాంతాల్లో మద్రాస్‌ స్టాన్లీ మెడికల్‌ కాలేజ్‌ అనుబంధంగా లైసెన్సీయేట్‌ మెడికల్‌ సర్టిఫికేట్‌ అనే కోర్సులు మాత్రమే ఉండేవి. వాటిని మెడికల్‌ స్కూల్స్‌ అనే వారు.‘‘1902లో విశాఖలో మద్రాసు ప్రభు త్వం ప్రారంభించిన మెడికల్‌ స్కూల్‌కు కొంత కాలంతర్వాత గోడె సంస్థాన జమీందార్లు సొంత భవనం నిర్మించి ఇచ్చారు. అయితే ఇందులో కొన్ని కారణాలు వల్ల ఎటువంటి కార్యకలాపాలు జరగక పోవడంతో దానిని…దానిని తాత్కాలిక ఆరోగ్య కేంద్రంగా మార్చారు. కొంత కాలానికి కొత్త సివిల్‌ హాస్పిటల్‌ భవనం నిర్మాణం కావడంతో,ఈ తాత్కాలిక ఆరోగ్య కేంద్ర భవనంలోనే 32 మంది విద్యార్థులతో 1923 జూలై 19న మెడికల్‌ కళాశాలను అప్పటి మద్రాసు స్థానిక సంస్థల మంత్రి పానుగంటి రామఅయ్యంగర్‌ ప్రారంభించారు. ఈ కళాశాలకు తొలి ప్రిన్సిపాల్‌ గా లెప్టినెంట్‌ కర్నల్‌ ఫెడ్రిక్‌ జాస్పర్‌ అండ్రూసన్‌ పని చేశారు’’ అని విశాఖకు చెందిన చరిత్రకారులు ఎడ్వర్డ్‌ విజ్జేశ్వరం పాల్‌ చెప్పారు.మద్రాసు యూని వర్సిటీకి అనుబంధంగా పని చేసిన ఈ వైద్య కళాశాలకు ముందుగా వైజాగపటం వైద్య కళాశాల అని పేరు పెట్టారు. అప్పట్లో విశాఖపట్నాన్ని ఆంగ్లేయులు వైజాగపటం అని పిలిచేవారు.1926లో ఆంధ్ర యూని వర్సిటీ ప్రారంభమైన తర్వాత వైజాగపటం వైద్య కళాశాల ఏయూకి అనుబంధ కళాశాల గా మారింది. ఆ సమయంలో వైస్‌ ఛాన్స లర్‌గా ఉన్న సీఆర్‌ రెడ్డి దీని పేరును ఆంధ్రా మెడికల్‌ కాలేజ్‌గా మార్చాలని మద్రాస్‌ ప్రభుత్వాన్ని కోరడంతో,1940లో పేరు మారుస్తూ గెజిట్‌ విడుదల చేశారు. ఆ తర్వా త నుంచి ఈ కళాశాల ఆంధ్ర మెడికల్‌ కాలేజ్‌గానే ప్రసిద్ధి చెందింది.32 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ మెడికల్‌ కళాశాల…ప్రస్తుతం ఏటా 250 మంది వైద్య విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే స్థాయికి చేరిందని ఏఎంసీ పూర్వ విద్యార్థి, నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ రవిరాజ్‌ అన్నారు.
‘మహిళల దరఖాస్తులు తిరస్కరించేవారు’
అనాటమీ, ఫిజియాలజీ, బయోలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ విభాగాలతో ప్రారంభమైన ఈ కళా శాలలో తొలి సంవత్సరం 50మంది విద్యా ర్థులకు అవకాశం కల్పిస్తే…32 మందే ప్రవే శాలు పొందారు. ఇందులో తెలుగు జిల్లాలకు చెందిన విద్యార్థులకే ప్రాధాన్యం ఇచ్చారు. ప్రవేశాలు పొందిన వారిలో తొలి ఏడాది 59 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఏఎంసీ రికార్డులు చెప్తున్నాయి.రెండో ఏడాది ఒక మహిళ దరఖాస్తు చేసుకున్నారు. కానీ విమెన్‌ కోసం ప్రత్యేక గదులు, బాత్రూం వంటి సదుపాయాలు లేకపోవడంతో ఆమె దరఖా స్తును తిరస్కరించారు.ఆ తర్వాత కూడా సౌకర్యాల లేమి కారణంగా ఇక్కడ మహి ళలకు ప్రవేశాలు కల్పించేవారు కాదని పూర్వ విద్యార్థిని డాక్టర్‌ రాధ కుమారి తెలిపారు. 1942లో 175 మందికి సరిపడే విధంగా విద్యార్థినుల కోసం విమెన్‌ హాస్టల్‌ని నిర్మిం చారు. ప్రస్తుతం ఇక్కడ ఏటా ప్రవేశాలు పొందుతున్న వారిలో అబ్బాయిల కంటే అమ్మాయిలే అధికంగా ఉంటారని ఏఎంసీ పూర్వ విద్యార్థిని, అనాటమీ విభాగంలో పని చేస్తున్న డాక్టర్‌ సురేఖ తెలిపారు. 202 మందికి సరిపోయే విధంగా మెన్స్‌ హాస్టల్స్‌ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ‘‘నేను కళాశాలలో చదువుకున్న విద్యార్థినినే. నాలాగే ఇక్కడ చాలా మంది పూర్వ విద్యార్థు లే ఉద్యోగులుగా కూడా ఉన్నాం.వందేళ్ల ఉత్స వాలు జరుపుకుంటున్న ఈ కళాశాలలో వైద్య రంగంలో ఎంతో పేరుపొందిన కాకర్ల సుబ్బా రావు,ఉలిమిరి రామ లింగస్వామి,శ్రీపాద పినాకపాణి,డాక్టర్‌ వ్యాఘ్రేశ్వరుడు,డాక్టర్‌ బ్రహ్మయ్యశాస్త్రి,డాక్టర్‌ రాజారామ్మెహన రెడ్డి,డాక్టర్‌ రామలింగస్వామి వంటి వైద్యులు చదువుకున్న చోటే మేం చదువుకోవడం… ఇక్కడే ఉద్యోగాలు పొందడం, ఇప్పుడు వందేళ్ల సంబరాల్లో పాలుపంచుకోవడం చాలా సంతోషంగా ఉంది’’అని సురేఖ చెప్పారు. పినాకపాణి వంటి వారు వైద్యం లోనే కాకుండా సంగీతంలో కూడా నిష్ణాతు లుగా పేరు పొందారు. అనటమీ,బయో కెమిస్ట్రీ, కార్డి యాలజీ…ఇలా 34విభాగాల్లో ఆంధ్ర మెడికల్‌ కళాశాల ప్రస్తుతం వైద్య విద్యను అంది స్తోంది.‘ఏఎంసీలో సీటు వస్తే గర్వపడతారు’ దేశంలో ఉన్న పురాతన వైద్య కళాశాలలో ఏఎంసీ ఒకటి.అలాగే దీనికి ఉన్న చరిత్ర, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ప్రపం చం నలుమూలలా వైద్యరంగంలో ఎంతో కీర్తి ప్రతిష్టలు పొందడం వంటి అంశాలు వైద్య విద్యని అభ్యసించాలనుకునే వారిని ఆకర్షిస్తుం టాయి. దాంతో వారంతా ఇక్కడే సీటు పొం దాలని కోరుకుంటారు. ఇక్కడ సీటు పొందిం తే అది చాలా గర్వంగా చెప్పుకుంటారు అని ప్రస్తుతం ఆంధ్ర మెడికల్‌ కళాశాల విద్యార్థి నిగా ఉన్న జనిషా అన్నారు.‘‘నాకు ఆంధ్ర మెడికల్‌ కళాశాలలో సీటు రావడంతో మా కుటుంబ సభ్యులు ఆ విషయాన్ని అందరికి గర్వంగా చెప్పుకున్నారు. మేం చదువుకునే రోజుల్లోనే ఏఎంసీలోనే చదవాలనే అనుకునే వాళ్లం. వందేళ్ల చరిత్ర ఉన్న కళాశాలలో మేం చదువుకున్నమంటే అదొక గొప్ప విష యంగా అనిపిస్తుంది.’’ అని జనిషా చెప్పారు. ఆంధ్ర మెడికల్‌ కాలేజ్‌కు దేశ వ్యాప్తంగా మంచి పేరుందని ఏఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బుచ్చిరాజు చెప్పారు. అందుకే దేశంలోని అని రాష్ట్రాల నుంచి ఇక్కడ విద్యార్థులు ప్రవేశాలు పొందాలని తాపత్రయపడతారని తెలిపారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు,తమిళనాడు, కేరళ,రాజస్థాన్‌ ఇలా అన్ని ప్రాంతాలకు చెందిన వైద్య విద్యార్థులు ఉన్నారని ఆయన చెప్పారు. ఇలా దేశవ్యాప్తంగా అందరూ విద్యార్థులు ఇక్కడే చదవాలని పోటి పడుతుండటమే ఆంధ్ర మెడికల్‌ కాలేజ్‌ విశిష్టతను చెప్తుందన్నారు.
‘ప్రారంభంలో 32, 2017 నాటికి 250’
ప్రారంభంలో మెడికల్‌ స్కూల్‌ భవనంలో ప్రారంభమైన వైద్య కళాశాలకు క్రమంగా అనుబంధ బోధన ఆసుపత్రులు వచ్చాయి. తొలి రోజుల్లో ఈ కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆరోగ్య కేంద్రం కింగ్‌ జార్జ్‌ ఆసుపత్రి (కేజీహెచ్‌)గా మారింది.132 పడకలతో ఏర్పాటైన కేజీహెచ్‌ ప్రస్తుతం1600 పడకల ఆసుపత్రి స్థాయికి ఎదిగింది. అలాగే విశాఖ లో ఉన్న విక్టోరియా ఆసుపత్రి, మానసిక ఆరోగ్య వైద్యశాల, ఛాతి అంటువ్యాధుల ఆసుపత్రి, ప్రాంతీయ కంటి ఆసుపత్రి,ఈఎన్టీ ఆసుపత్రి వంటివి ఆంధ్ర వైద్య కళాశాలకు అనుబంధ బోధనాసుపత్రులుగా వచ్చాయి. వీటన్నింటిలో 2500వరకు పడకలుఉన్నాయి. 1923లో 32 మంది విద్యార్థులతో ప్రారం భమైన వైద్య కళాశాల,1990 సమ యానికి 150 మందికి,2017నాటికి 250 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే స్థాయికి పెరిగింది. ఇక్కడ అనాటమీ,ఫిజి యాలజీ,ఫార్మకాలజీ,వంటి విభాగాల్లో పురాతన మ్యూజియాలు ఉన్నాయి.అవయవ దానం చేయాలంటూ ఏఎంసీ చాలా కాలంగా ప్రజల్లో అవగాహన తెచ్చే కార్యక్రమాలు విస్తృతంగా చేస్తోంది.
పూర్వ విద్యార్థుల ‘వందేళ్ల’ కానుక
తొలి రోజుల్లో పెద్ద సౌకర్యాలు కూడా ఉం డేవి కాదని పూర్వ విద్యార్థులు తెలిపారు. 1938 సమయంలో రూ.3 రూపాయలు హాస్టల్‌ అద్దె ఉండేదని, అలాగే మెస్‌ ఛార్జీలు నెలకు రూ.18ఉండేవని తమకు పాఠాలు చెప్పిన ప్రొఫెసర్లు చెప్పేవారని డాక్టర్‌ రవి రాజ్‌ అన్నారు. తాము చదువుకునే సమ యానికి హాస్టల్‌ వసతి వంటివి ఏర్పాడ్డాయని, ఇక్కడ చదువుకుని వైద్యరంగంలో ఎదిగిన తాము చదువుకున్న కళాశాలకు వందేళ్లు నిండుతున్న సందర్భంగా ఒక భవనాన్ని నిర్మించి ఆంధ్ర మెడికల్‌ కాలేజికు బహుమ తిగా అందించబోతున్నామని ఆయన చెప్పారు. ‘‘1.2 ఎకరాల్లో కళాశాల సమీపంలోనే ఒక భవనాన్ని నిర్మించి అందులో స్టూడెంట్‌ సెంటర్‌, లెక్చర్‌ హాల్‌, లెబ్రరీ, రీడిరగ్‌ రూం, రీక్రియేషన్‌ రూం, ఇండోర్‌ గేమ్స్‌ వంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం రూ. 45 కోట్లను పూర్వ విద్యార్థులంతా విరాళాలుగా వేసుకుని నిర్మిస్తున్నాం. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏఎంసీ పూర్వ విద్యార్థులు తమ కళాశాలకు ఏదో ఒకటి చేయాలనే తపనతో వందేళ్ల సందర్భంగా ఈ భవనాన్ని నిర్మించి, కళాశాలకు అందిస్తాం. అలాగే దీని మెయింటెనెన్స్‌ ఖర్చులను పూర్వ విద్యార్థుల సంఘమే చెల్లించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని డాక్టర్‌ రవిరాజ్‌ చెప్పారు. ఆంధ్ర వైద్య కళాశాల గొప్పదనాన్ని చాటి చెప్పేలా శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పూర్వ విద్యార్థిని, గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ రాధ కుమారి చెప్పారు. పూర్వ విద్యార్థులు నిర్మించే భవనంలో ఏడాది పొడవునా విద్యా, వైజ్ఞానిక కార్యక్రమాలు క్రమం తప్పకుండా చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె తెలిపారు. (బీబీసీ సౌజన్యంతో..)

విద్యార్థుల చూపు ఉన్నత విద్య వైపు

విద్యారంగంపై ఏపీ ప్రభుత్వం కనబరుస్తున్న ప్రత్యేక శ్రద్ధతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నాడు- నేడు మొదలుకొని విదేశీ విద్యాదీవెన వరకు తెచ్చిన పథకాలు విద్యారంగాన్ని సమూలంగా మార్చివేశాయి. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రాస్‌ ఎన్‌ రోల్‌ మెంట్‌ రేషియో(జీఈఆర్‌) గణనీయంగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఉన్నత విద్యలో దాదాపు 12.5 శాతం చేరికలు అదనంగా నమోదయ్యాయి. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి విద్యారంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించి, పలు చర్యలు చేపడుతుం డటంతో అక్షరాస్యతలో దేశ సగటును మించి ఆంధ్రప్రదేశ్‌ వృద్ధి రేటును నమోదు చేసింది.
విద్యారంగంలో ఏపీకి అరుదైన స్థానం
ఆంధ్రప్రదేశ్‌లో 2020-21లో 19,87,618 మంది ఉన్నత విద్యాభ్యాసం కోసం కళా శాలల్లో తమ పేర్లు నమోదు చేసుకు న్నారు. 2014-15లో 17,67,086 మంది మాత్రమే ఉన్నత విద్యనభ్యసించగా, 2020- 21 నాటికి ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. పార్లమెంట్‌ సమావేశాల్లో వైఎస్సార్‌సీ ఎంపీ పరిమళ్‌ నత్వానీ ఏపీలో ఉన్నత విద్య గురించి ప్రశ్న అడిగారు. దీనికి కేంద్ర విద్యాశాఖ మంత్రి సుభాష్‌ సర్కార్‌ రాజ్యసభలో సమాధానమిస్తూ ఏపీలో విద్యారంగం ప్రగతిపథంలో ఉందని వివరించారు.
దేశవ్యాప్తంగా మహిళలే ముందంజలో
2022లో నిర్వహించిన ఆలిండియా సర్వే ఆన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఆధారంగా, రాష్ట్రంలో ఉన్నత విద్యలో నమోదు 12.5% పెరిగిందని మంత్రి సూచించారు. ఇంకా, సర్వే ప్రకారం, %Aూ%లో ఉన్నత విద్యలో మహిళల నమోదు 2014-15లో 7,73,650 నుండి 2020-21లో 9,31,553కి పెరిగింది, ఇది 20.4% పెరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యలో చేరిన వారి సంఖ్య మొదటిసారిగా నాలుగు కోట్ల మార్కును దాటిందని మరియు 2014లో 3.42 కోట్ల నుండి 2020-21లో దాదాపు 4.14కోట్లకు పెరిగిందని కేంద్ర మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు, 2014-15లో1.57 కోట్లుగా ఉన్న మహిళా నమోదులు 2020-21లో 2.01కోట్లకు పెరిగాయి.
నూతన కళాశాలల పెరుగుదలకు తోడ్పాటు
జాతీయ స్థాయిలో, షెడ్యూల్డ్‌ కులాల విద్యార్థుల నమోదు 2014-15లో 46.06 లక్షల నుండి 2020-21లో 58.94 లక్షలకు పెరిగిందని, ఇది 28% పెరిగిందని సర్వేలో తేలింది. దేశంలో ఎస్టీ (షెడ్యూల్డ్‌ ట్రైబ్‌) విద్యార్థుల నమోదు కూడా 2014-15లో 16.40 లక్షల నుండి 47% పెరిగి 24.12 లక్షలకు చేరుకుంది. దేశంలో ఇతర వెనుక బడిన కులాల విద్యార్థుల నమోదు 2014-15లో 1.13 కోట్ల నుండి 1.48 కోట్లకు పెరిగింది, ఇది 32% పెరుగుదలను సూచిస్తుంది. 2014-15 మరియు 2020-21 మధ్య దేశంలో 353 విశ్వవిద్యాలయాలు మరియు 5,298 కళాశాలలు అదనంగా పెరిగాయి.
కళాశాలల రీ మోడలింగ్‌ తోనే సాథ్యం..!
రాష్ట్రీయ ఉచ్ఛతర్‌ శిక్షా అభియాన్‌ పథకం (రాసు) కింద, ఆర్థికంగా వెనుకబడిన జిల్లాలు మరియు ఆశావహ జిల్లాలు వంటి అన్‌సర్వ్‌డ్‌ మరియు అండర్‌సర్వ్‌డ్‌ ఏరియాల్లో 130 మోడల్‌ డిగ్రీ కాలేజీల స్థాపనకు కేంద్ర మద్దతును ఆమోదించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.రాసు ద్వారా, కళాశాలలకు మౌలిక సదుపాయాల గ్రాంట్లు, ఎంపిక చేసిన స్వయంప్రతిపత్త కళాశాలల్లో నాణ్యత మరియు శ్రేష్ఠతను పెంపొందించడం మరియు ఇప్పటికే ఉన్న డిగ్రీ కళాశాలలను మోడల్‌ డిగ్రీ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేయడం వంటి సేవలందించని మరియు తక్కువ సేవలం దించే ప్రాంతాలలో ఉన్నత విద్యను మెరుగు పరచడానికి కూడా కేంద్ర మద్దతు అందించ బడుతుంది.
విద్యా రంగంలో నవశకం
విద్యా రంగాన్ని సమూలంగా మార్చేం దుకు కమిషన్ల ఏర్పాటురాష్ట్ర విద్యారంగంలో నవశకం ఆరంభమైంది.విద్యా వ్యవస్థలో సమూల మార్పుల దిశగా ప్రభుత్వం నాంది పలికింది.ఇందుకు సంబంధించి చరిత్రాత్మ కమైన రెండు కీలకబిల్లులను శాసనసభ ఆమోదించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాఠశాల విద్యా నియంత్రణ,పర్యవేక్షణ కమిషన్‌ బిల్లు..ఉన్నత విద్యానియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందాయి. దీంతో ఇంత కాలం విద్యార్థులు,తల్లిదండ్రులను ఫీజుల పేరిట పీల్చిపిప్పి చేస్తున్న ప్రైవేట్‌,కార్పొరేట్‌ విద్యా వ్యాపారానికి అడ్డుకట్ట పడనుంది.ఎన్నికలకు ముందు తనసుదీర్ఘ పాదయాత్రలో రాష్ట్రం లోని విద్యారంగ పరిస్థితిని, పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు పడుతున్న అవస్థలను కళ్లారా చూసి చలించిన ముఖ్యమంత్రి ఈ రెండు బిల్లులకు రూపకల్పన చేసి,తొలి అసెంబ్లీ సమావేశంలోనే ఆమోదింపజేశారు.
ఎల్‌కేజీ మొదలు ఇంజనీరింగ్‌ వంటి ఉన్నత చదువుల వరకు పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అనేక అవస్థలు పడుతున్నారు. ఆస్తులు సైతం అమ్ముకోవడమే కాకుండా ఆచదువులు పూర్తయ్యేసరికి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు విద్యను వ్యాపారమయం చేయడంతో పేదలే కాకుండా సామాన్య, మధ్యతరగతి ప్రజలకు సైతం విద్య పెనుభారంగా మారింది. గత ప్రభుత్వం ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహిం చడంతో పాటు ఇష్టానుసారం ఫీజులు దండుకొనే స్వేచ్ఛను సైతం ఇచ్చేసింది. కనీస సదుపాయాలు, బోధకులు లేకుండానే కాలేజీలు, స్కూళ్లను నిర్వహిస్తున్నాయి. పిల్లలను జైళ్ల వంటి హాస్టళ్లలో ఉంచి వారిపై విపరీతమైన ఒత్తిడి పెడుతూ వారి బలవన్మరణాలకు కారణమవుతున్నాయి. సరైన బోధన లేకుండా బట్టీ పద్ధతులను పాటిస్తూ విద్యార్థులను యంత్రాలుగా మార్చేస్తున్నాయి.
రాష్ట్ర చరిత్రలో కీలక మలుపు
పాఠశాల, ఉన్నత విద్యా నియంత్రణ, పర్య వేక్షణ కమిషన్‌ బిల్లులు ఆమోదం పొంద డంతో ఇకపై రాష్ట్రంలో విద్యా రంగ రూపు రేఖలే పూర్తిగా మారిపోనున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలే ప్రామాణికం గా విద్యా రంగం పయనిస్తుందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ బిల్లు లు రాష్ట్ర చరిత్రలో కీలక మలుపుగా పలు వురు అభివర్ణిస్తున్నారు. ఈ కమిషన్లకు ప్రభు త్వం అనేక అధికారాలు కల్పించింది. ఫీజులు, ప్రమాణాలు, విద్యార్థులు.. టీచర్ల సంక్షేమం ఇలా అన్ని కోణాల్లోనూ ఈ కమిషన్లు విద్యారం గాన్ని పర్యవేక్షిస్తాయి. హైకోర్టు రిటైర్డ్‌ జడ్జిలు ఛైర్మన్లుగా ఉండడంతో పాటు ఆయా రంగాల్లో నిపుణులు, మేధావులను సభ్యులుగా నియమించనుండడంతో విద్యారం గం పగడ్బందీగా మారుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వీటికి సివిల్‌ కోర్టు అధికారాలను కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ అధికారం విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌కు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పాఠశాలలు మినహా తక్కిన అన్ని సంస్థలు ఈ కమిషన్‌ పరిధిలోకి వస్తాయి.ప్రైవేటు విద్యా సంస్థల్లోని టీచర్ల సర్వీసు కండిషన్లు, వారికి ఇస్తున్న వేతనాలు, ఇతర అంశాలను కూడా కమిషన్‌ పరిశీలి స్తుంది. ఫీజుల నిర్ణయానికి సంబంధించి స్వతంత్ర ప్రతిపత్తిగల అక్రిడిటేషన్‌ ఏజెన్సీని ఏర్పాటు చేస్తుంది. నిబంధనలు అసలు పాటిం చని సంస్థల గుర్తింపు రద్దుకు కూడా చేసే అధికారం ఉంటుంది.సివిల్‌ కోర్టు అధికారాలు కల్పిస్తున్నందున ఎవరినైనా పిలిపించి విచారిం చే అధికారం కమిషన్‌కు ఉంటుంది.ఇంటర్‌లో దోపిడీకి బ్రేకులు.ప్రస్తుతం పాఠశాల విద్య ఒక ఎత్తు అయితే ఇంటర్మీడియెట్‌ విద్య మరో ఎత్తు. రెండేళ్ల ఈ కోర్సు పేరిట ప్రవేట్‌, కార్పొరేట్‌ సంస్థలు నిలువు దోపిడీ చేస్తున్నా యి. ఇప్పుడీ కోర్సును ఉన్నత విద్యా నియం త్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఈ కాలేజీల వ్యవహరాలను పరిశీలిస్తుంది. ఇప్పటి వరకు ఇంటర్మీడియెట్‌ కాలేజీలపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో ఆయా యాజ మాన్యాల ఇష్టానుసారం అయ్యింది. అలాగే ప్రైవేటు వర్సిటీలు కూడా ఈ రాష్ట్రంతో, ప్రభుత్వంతో సంబంధం లేనట్లు ఇష్టాను సారంగా ఫీజులు, ప్రవేశాలను కొనసాగిస్తు న్నాయి. ఈ కమిషన్‌ ఏర్పాటుతో వాటికీ అడ్డుకట్ట పడనుంది. ఉన్నత విద్యా సంస్థల్లో అత్యున్నత ప్రమాణాల సాధనకు కమిషన్‌ చర్యలు చేపడుతుంది.ప్రవేశాలు,బోధన, పరీక్షలు,పరిశోధన,బోధనా సిబ్బంది అర్హతలు, మౌలిక సదుపాయాలు, కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఆయా సంస్థల నిర్వహణ ఉందా? లేదా అన్న అంశాల పరిశీలన. జూనియర్‌,డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌ కాలేజీలతో పాటు అన్ని ప్రైవేటు యూనివర్సిటీలు (రాష్ట్ర చట్టాలకు లోబడి ఏర్పాటైనవి) కూడా ఈ కమిషన్‌ పరిధిలోకి వస్తాయి. ఆయా సంస్థలపై చర్యలకు కమిష న్‌కు అధికారం ఉంటుంది. విద్యార్థులకు సమస్యలు తలెత్తకుండా ఆయా సంస్థల మూతకు చర్యలు తీసుకొనే అధికారం కమిషన్‌కు ఉంది. నిబంధనలు పాటించని ఉన్నత విద్యా సంస్థలకు పెనాల్టీల విధింపు అధికారం ఉంది. నిబందనలు ఉల్లంఘించే సంస్థల గుర్తింపు రద్దుకు వర్సిటీలను ఆదేశించే అధికారం. చైర్మన్‌, సభ్యులపై లేదా కమిషన ్‌పై న్యాయపరమైన కేసులు దాఖలు చేసేందుకు వీలులేదు. నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారం నడిచే విద్యా సంస్థలను మూత వేసే అధికారం ఉంటుంది. పెనాల్టీలను విధిస్తుంది. వాటిని కట్టకుంటే వాటి నిధులను, లేదా స్థలాలను స్వాధీనం చేసుకొనే అధికారం కూడా ఉంది. కాగా, కమిషన్‌ నిర్ణయాలను పరిశీలించే, సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది.- జీఎన్‌వి సతీష్‌

యూపీకి ఆదర్శంగా ఏపీ

ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ విధానాలు, పని తీరు బాగున్నాయని, సాంకే తికత అత్యున్నతంగా ఉందని, వాటిని తమ రాష్ట్రంలోనూ అమలు చేస్తామని ఉత్తర ప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రాజెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌ చంద్రకాంత్‌ చెప్పారు. యూపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఐటీ నిపుణుడు ప్రశాంత్‌ షాహి తదితరులతో కలిసి ఆయన తాడేపల్లి లోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని సందర్శించారు. యూపీ విపత్తుల నిర్వహణ సంస్థను ఆధునికీరిస్తున్న క్రమంలో దేశానికే రోల్‌ మోడల్‌గా ఉన్న ఏపీ విధానాలను అధ్యయనం చేసేందుకు ఈ బృందం ఇక్కడకు వచ్చింది.
ఏపీలో అధునాతన టెక్నాలజీ
ఉత్తరప్రదేశ్‌ ప్రాజెక్ట్‌ ఎక్సపర్ట్‌ చందర్‌ కాంత్‌ మాట్లాడుతూ..ఏపీ స్టేట్‌ ఎమర్జన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ అనుసరిస్తున్న నూతన విధివిధానాలు, కార్యచరణ తెలుసుకునేందుకు వచ్చినట్లు చెప్పారు. వాతావరణ పరిశోధన విభాగా లలోని వివిధ అంశాలను అడిగి తెలుసు కున్నారు. ఏపీలో అత్యున్నత టెక్నాలజీ వినియోగిస్తుందని తమ రాష్ట్రంలో ఇక్కడ సాంకేతికతను అమలు చేస్తామని తెలిపారు. విపత్తులను ఎదుర్కోడానికి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పాటిస్తున్న ఉత్తమ విధానాలు, కార్యచరణ ప్రణాళికలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థల గురించి విపత్తుల సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా.బిఆర్‌ అంబేద్కర్‌ ఉత్తరప్రదేశ్‌ అధికారులకు వివరించారు. తుఫానులు, వరదలు, పిడుగులపై అప్రమత్తం స్టేట్‌ ఎమర్జెన్సీ సెంటర్‌లోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సాంకేతికతను, దాన్ని వినియో గిస్తున్న తీరును నిశితంగా పరిశీలించింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వారికి స్టేట్‌ ఎమర్జెన్సీ సెంటర్‌లోని అన్ని విభాగాలను చూపించి, పని విధానాన్ని వివరించారు. రాష్ట్రంలో తుఫా­నులు, వరదలతోపాటు పిడుగుపాట్లు ఎక్కువగా ఉంటాయని, అందువల్ల తమ ప్రభుత్వం విపత్తుల నిర్వహణ ప్రణాళికను పక్కాగా సిద్ధం చేసిందని తెలిపారు.
నష్టనివారణపై ముందస్తు ప్రణాళికలు
తుపాను, వరద వచ్చే అవకాశం ఉందని తెలిసిన వెంటనే రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ, వార్డు సచివాలయ స్థాయి వరకు ఉన్న విపత్తుల నిర్వహణ బృందాలు క్షేత్ర స్థాయిలో పని ప్రారంభిస్తాయని వివరించారు. ఈ అప్ర మత్తత వల్లే నాలుగేళ్లలో తుపానులు, వరదలొచ్చినా ప్రాణ నష్టాన్ని నివారించగలి గామన్నారు. వాతావరణ పరిశోధన విభా­గాలు, వివిధ వాతావరణ మోడల్స్‌, కార్యాచరణ ప్ర­ణాళికలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థల గురించి అంబేడ్క­ర్‌ వారికి వివరించారు.
ఒడిశా,అసోం,తెలంగాణ,ఢల్లీి సైతం
గతంలో ఒడిశా,అసోం,ఉత్తరాఖండ్‌, తమిళ నాడు, తెలంగాణ, ఢల్లీి రాష్ట్రాల అధికారులు ఇక్కడకు వచ్చి విపత్తుల్లో ఏపీ అవలంబిస్తున్న విధివిధానాలు తెలుసుకున్నారు. ఏపీలో 44% తుపాను, 15% వరదలు, 68% కరువు, పిడుగులు, వడగాల్పులు 100శాతం ప్రభావితం చేస్తున్నట్లు బృందానికి అంబేద్కర్‌ తెలిపారు. స్టేట్‌ ఎమర్జన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ నుంచి 24 గంటలు పర్యవేక్షించే విధానం, వాతావరణం గురించి వివిధ మోడల్స్‌ క్రోడికరించి హెచ్చరికలు జిల్లాలకు చేరవేస్తున్నట్లు తెలిపారు. విపత్తుల సమ యంలో నిరంతరం పర్యవేక్షిస్తూ అలర్ట్స్‌ పంపే విధానాన్ని చూపించారు. కామన్‌ అలెర్ట్‌ ప్రోటోకాల్‌, ఏపీ అలెర్ట్‌ద్వారా ప్రజలకు హెచ్చరిక మేసేజ్లు పంపించే విధానం చూపించారు. స్టేట్‌ ఎమర్జన్సీ ఆపరేషన్‌ సెంటర్లో కమ్యూనికేషన్‌ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు వినియోగించే శాటిలైట్‌ ఫోన్స్‌, శాటిలైట్‌ బేస్డ్‌ మొబైల్‌ డేటా వాయిస్‌ టెర్మినల్‌, వాకీటాకీ, వి-శాట్‌ కమ్యూనికేషన్‌ పరికరాలను ఉత్తర ప్రదేశ్‌ అధికారులకు చూపించారు. వెబ్‌ ఎమర్జన్సీ ఆపరేషన్‌ సెంటర్‌, జియోగ్రఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌, ముందస్తు హెచ్చరికల వ్యవస్థ గురించి విపత్తుల సంస్థ అధికారులు వివరించారు.
విపత్తు -నిర్వహణ
మానవ దైనందిన జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ అధిక ప్రాణనష్టం, ఆస్తినష్టం కలిగించే వైపరీత్య సంఘటనను ‘విపత్తు’ అంటారు. విపత్తులు సంభవించడానికి భౌగోళిక, వాతావరణం వంటి ప్రత్యేక పరిస్థితు లతోపాటు మానవుడి చర్యలు, కార్యకలాపాలు కారణమవుతున్నాయి. ప్రపంచంలో ప్రతిరోజు ఎక్కడో ఓచోట ఏదో ఒక విపత్తు సంభవి స్తుంది. దీనికి భారత్‌ అతీతం కాదు.ప్రత్యేక భౌగోళిక పరిస్థితులైన ఎత్తయిన పర్వత శ్రేణులు, విశాలమైన ద్వీపకల్ప పీఠభూమి, వేల కిలోమీటర్లు ప్రవహించే జీవనదీ వ్యవస్థ వల్ల భారత్‌ విపత్తుల బారిన పడుతుంది. ఒకరకంగా చెప్పాలంటే ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల విపత్తులు సంభవిస్తున్నాయి. ఈ మార్పులకు కారణం అడవులను నిర్మూలించడం, కాలుష్యం పెరిగిపోవడం, జీవవైవిధ్యం దెబ్బతినడం, వాతావరణం వేడెక్కడం మొదలైనవి. చీa్‌బతీవ ూతీశ్‌ీవష్‌ం ఱట ంష్ట్రవ ఱం ూతీశ్‌ీవష్‌వస అంటే మనం ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది. ‘ప్రకృతిని అనుసరించాలేకాని శాసించకూడదు’ అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మన కార్యకలాపాలను కొనసాగిస్తే ఈ విపత్తుల తీవ్రతను చాలా వరకు తగ్గించే అవకాశం ఉంది.
విపత్తు -నిర్వచనాలు
విపత్తు నిర్వహణ చట్టం-2005

1 నిర్వచనం.. ఏదైనా భౌగోళిక ప్రాంతం ప్రకృతి లేదా మానవ తప్పిదాలు లేదా ప్రమాదవశాత్తు లేదా నిర్లక్షం వల్ల తనంతట తాను కోలుకోలేని విధంగా పెద్దఎత్తున ప్రాణ నష్టానికి, ఆస్తి నష్టానికి, పర్యావరణ నష్టానికి లేదా విధ్వంసానికి కారణమయ్యే ఉపద్రవాలు లేదా ప్రమాదాలు లేదా దుర్ఘటనలను ‘విపత్తు’ అంటారు. 2.నిర్వచనం..సమాజపు సాధారణ నిర్మాణానికి, సాధారణ లేదా కమ్యూనిటీ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తూ అకస్మాత్తుగా, తీవ్రంగా సంభవించే ఆపదనే ‘విపత్తు’ అంటారు.పపంచ ఆరోగ్యసంస్థ) 3.నిర్వచనం..ఏదైనా ప్రదేశంలోని సమూహానికి వెలుపల నుంచి సాయం పొందవలసినంత తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టాన్ని, పర్యావరణ నష్టాన్ని, ఆర్థిక విధ్వం సాన్ని, ఆరోగ్య సమస్యలను కలుగజేసే సంఘటననే ‘విపత్తు’ అంటారు. 4. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్వచనం..సాధారణ జీవితానికి లేదా పర్యావరణ వ్యవస్థకు అంతరాయం కలిగినప్పుడు ప్రాణాలను లేదా పర్యావరణాన్ని రక్షించి, సంరక్షించడానికి.. అసాధార ణ, అత్యవసర చర్యలు అవసర మయ్యే ఉపవూదవ పరిస్థితినే ‘విపత్తు’ అని నిర్వచించారు.
విపత్తు సంస్థాగత చట్రం
1900,1905,1907,1947లలో వచ్చిన వరుస దుర్భిక్షాలు, 937లో సంభవించిన బీహార్‌-నేపాల్‌ భూకంపం మొదలైన వాటి నేపథ్యంలో భారతదేశ విపత్తు నిర్వహణ వ్యవస్థాగత నిర్మాణం బ్రిటిష్‌వారికాలంలో ప్రారంభమైంది.బ్రిటిష్‌ పరిపాలనలో విపత్తువల్ల వచ్చే అత్యవసర పరిస్థితులను ఎదుర్కునేందుకు పునరావాస విభాగాలను ఏర్పాటు చేశారు. ఈ విభాగాలు విపత్తు అనంతర పరిస్థితుల్లో మాత్రమే సహాయక చర్యలు చేపట్టేవి. స్వాతంత్య్రం అనంతరం విపత్తుల నిర్వహణ బాధ్యతను ప్రతి రాష్ట్రం లో ఉండే పునరావాస కమిషనర్లు, కేంద్రంలో కేంద్ర పునరావాస కమిషనర్లు నిర్వహించేవారు. ప్రపంచవ్యాప్తంగా ఐక్యారాజ్యసమితి సాధారణసభ 1990వ దశాబ్దాన్ని ‘అంతర్జాతీయ సహజ విపత్తుల కుదింపు దశాబ్దంగా ప్రకటించింది. దేశంలో 1990 అనంతరం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ కింద విపత్తు నిర్వహణ సెల్‌ను ఏర్పాటు చేయడంతో ఒక శాశ్వత, వ్యవస్థాగతమైన ఏర్పాటు ప్రారంభమైంది. తదనంతరం దేశంలో సంభవించిన విపత్తులను అనుసరించి అప్పటి వ్యవసాయ మంత్రిత్వశాఖ కార్యదర్శి జేసీ పంత్‌ చైర్మన్‌గా విపత్తుల నిర్వహణపై సమగ్ర విధానాన్ని రూపొందించడానికి అత్యున్నతాధికార కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ నిర్ణయం ప్రకారం 2002లో కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలోకి మార్చారు. దీన్ని అనుసరించి దేశంలో విపత్తు నిర్వహణకు ఒక అధికార క్రమ నిర్మాణం ఏర్పడిరది.
దేశంలో విపత్తు నిర్వహణ నిర్మాణం
విపత్తు నిర్వహణ కోసం జాతీయస్థాయిలో శాసననిర్మాణ అవసరాన్ని ప్రధానంగా పేర్కొన్న అన్ని పార్టీల సమావేశం 2005 జనవరి 9న జరిగింది. విపత్తు నిర్వహణ బిల్లును రాజ్యసభలో మొదటిసారిగా 2005 మే 11న ప్రవేశపెట్టారు.- జిఎన్‌వి సతీష్‌

పేదలకు శ్రీరామరక్ష జగనన్న సురక్ష

రాష్ట్రంలోని ప్రజలందరికీ వంద శాతం సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా సీఎం జగన్‌ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మక జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఒక్క మాట లో చెప్పాలంటే సంక్షేమ పథకాలకు అర్హులై ఉన్న ఏఒక్కరూ లబ్ధి అందకుండా మిగిలి పోకూడదన్న తపనతో..వారికి ఏచిన్న సమస్య ఉన్నా దానిని పరిష్కరించాలన్న చిత్తశుద్ధితో ప్రారం భించిన జగనన్న సురక్ష పథకానికి విశేష స్పందన లభించింది.గత నెలాఖరువరకు ఇంటిం టికీ నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో కొన్ని లక్షల మంది రోగులకు లబ్ది చేకూరింది.ఎంతో బృహత్తర రమైన జగనన్న సురక్ష పథకంపై ప్రత్యేక కథనం..!
అర్హులకు పథకాల లబ్ది చేకూర్చడమే లక్ష్యంగా జులై 1వ తేదీ నుంచి సమస్యల పరిష్కా రానికి క్యాంపుల ప్రారంభం. ఇందులో భాగంగా 11రకాల ధ్రువ పత్రాల సేవలు ఉచితంగా అందించనున్నారు.ఇప్పటికే తొలిదశలో ప్రజల సమస్యలు సిబ్బంది నమోదు చేశారు. ఈ కార్య క్రమం తొలిదశలో గ్రామ, వార్డు సచివాల యాల పరిధిలోని సిబ్బంది, ప్రజా­ప్రతినిధులు, వాలం టీర్లు, గృహసారథులు ప్రతి ఇంటికీ వెళ్లి జగనన్న సురక్ష గురించి వివరించడం జరిగింది. ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి అక్కడ ఇంకా ఎవరికైనా అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలు అందడం లేదా? ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా? వివిధరకాల సర్టిఫికెట్లను పొందడంలో ఏమైనా ఇబ్బందులున్నాయా? అనే అంశాలను నిశితంగా పరిశీలించి..ఆ వివరాలను నమోదు చేసుకున్నారు.
ప్రతి ఇంటిని కవర్‌ చేసేలా కార్యక్రమం
‘‘ఈ కార్యక్రమంపై సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి వైద్యఆరోగ్యశాఖాధికారులకు దిశ నిర్ధేశాలు ఆదేశించారు.ప్రతి ఇంట్లో ఆరోగ్య సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కారించే గొప్ప బాధ్యతను మనం తీసుకుంటున్నాం.మనం చేసే ఈ కార్యక్ర మం ద్వారా గ్రామంలో ఒక పర్టిక్యులర్‌ రోజు నాడు హెల్త్‌ క్యాంపు నిర్వహిస్తాం. అందులో ప్రజలకు అవసరమైన పరీక్షలు చేయడం పాటు, మందులు,కళ్లద్దాలు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుం టున్నాం.హెల్త్‌ క్యాంపు నిర్వహించిన గ్రామాన్ని మ్యాపింగ్‌ చేసి, ఏ సమస్యలున్నాయన్నది తెలుసు కుని ఫ్యామిలీ డాక్టర్‌ విలేజ్‌ క్లినిక్‌ ద్వారా వాటిని పరిష్కరిస్తారు.ఆ తర్వాత గ్రామంలో ప్రతి ఇంట్లో ఎవరికి ఎలాంటి ట్రీట్‌మెంట్‌ జరగాలి, ఎలాంటి మందులు కావాలో తెలుస్తుంది. ఇంట్లో ఫెరా లసిస్‌, మరేదైనా సమస్య ఉంటే వారికి రెగ్యులర్‌గా మెడిసిన్‌ ఇవ్వడంతో పాటు వైద్యుడు వారిని పరీక్షించి…వారికి అవసరమైన మందులతో పాటు చికిత్స కూడా అందించే కార్యక్రమం చేపడుతున్నాం.ఒకవైపు తనిఖీలు చేస్తూనే మందు లు కూడా ఇవ్వబోతున్నాం. ఇది చాలా పెద్ద మార్పు.దీనికి సంబంధించిన బాధ్యత కలెక్టర్లు తీసుకోవడం అభినందనీయమని సీఎం జగన్‌ అభినందించారు. సీఎం ఆదేశాలు మేరకు రాష్ట్రంలోని ఆయా గ్రామంలో ప్రతి ఇల్లు తిరిగారు. క్రానిక్‌ పేషెంట్లు ఉన్న ఇళ్లపై ప్రత్యేక శ్రద్ధచూపారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతల తోపాటు రక్తహీనత ఉన్నవాళ్లను గుర్తించారు. అదేరకంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతు న్నవారు,నియోనేటల్‌ కేసులతో పాటు బీపీ, షుగర్‌ వంటి వాటితో బాధపడుతున్న వారికి కూడా చికిత్స అందించారు.ఆయా వ్యాధులు రాకుండా నివారణ చర్యలపై కూడా గ్రామాల్లో అవగాహన కలిగించారు.ప్రతి గ్రామాన్ని మేపింగ్‌ చేసి,45 రోజుల పీరియడ్‌తో ఈ కార్యక్రమాన్ని సర్ధవం తంగా నిర్వర్తించారు. సీఎం ఆదేశించిన మేరకు ప్రతి మండలంలో నెలకు 4 గ్రామాల్లో హెల్త్‌ క్యాంపులు నిర్వహించాలని ఆయా జిల్లా కలెక్టర్ల కిందస్థాయి సిబ్బందికిచ్చిన ఆదేశాలు మేరకు పరీక్షలు నిర్వహించారు. దీనివల్ల ప్రతి 6 నెలలకొకసారి ఆమండలంలో ఉన్న ప్రతి గ్రామంలోనూ హెల్త్‌ క్యాంపు నిర్వహించినట్లవు తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
నాలుగు దశల్లో ఆరోగ్య సురక్ష కార్యక్రమం
తొలిదశలో వలంటీర్లు, గృహసారధులు, ప్రజా ప్రతినిధులు ఈ ముగ్గురూ కలిసి ప్రతి ఇంటినీ సందర్శించారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేయ బోయే రోజు, తేదీతోపాటు ఏయే కార్యక్రమాలు చేపడతామో వివరించారు. ఆరోగ్యశ్రీ పథకంలో ఉన్న ఆసుపత్రుల వివరాలు,పథకాన్ని ఎలా విని యోగించుకోవాలన్న అంశాలపై అవగాహన కల్పించారు. తర్వాత దశలో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, ఆ ఏరియా వాలంటీర్లతో కలిసి వెళ్లి 7 రకాల టెస్టులకు సంబంధించిన వివరాలను ప్రజ లకు తెలిపారు. రెండో టీం ఆశావర్కర్‌, ఏఎన్‌ఎం తో సీహెచ్‌ఓ వచ్చారు. ఇక్కడితో రెండో దశ పూర్తవుతుంది.7రకాల టెస్టులు చేసే విధంగా.. బీపీ,షుగర్‌, హిమోగ్లోబిన్‌, యూరిన్‌ టెస్టుతో పాటు (ఉమ్మి)స్పూటమ్‌ టెస్ట్‌,మలేరియా, డెంగ్యూ పరీక్షలు కూడా నిర్వహిస్తారు.ప్రతి ఇంటికి వెళ్లి ఈ పరీక్ష లు నిర్వహిస్తారు.మొబైల్‌ యాప్‌లో ఇలా సేకరిం చిన డేటాను అప్‌డేట్‌ చేస్తారు. ప్రతి ఇంటికి, పేషెంట్‌కి ఒక కేస్‌ షీట్‌ కూడా జనరేట్‌ అవు తుంది. ఫేజ్‌-3లో మరోసారి ఓరియెంటేషన్‌ కార్యక్రమం ఉంటుంది.హెల్త్‌ క్యాంప్‌ జరగబో యే 3 రోజుల ముందు మరోసారి వాలంటీర్‌, ఏఎన్‌ఎం,ప్రజా ప్రతినిధులు ప్రజలు ఆ గ్రామం లో మరోసారి గుర్తు చేస్తారు. ఫేజ్‌ 4లో హెల్త్‌ క్యాంపు నిర్వహిస్తారు. ప్రతి మండలంలో ఒక రోజు హెల్త్‌ క్యాంపు ఉంటుంది.45రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో..రూరల్‌,అర్బన్‌ ఏరియా లోనూ ఈ హెల్త్‌ క్యాంపులు నిర్వహిస్తారు.
ఖాళీలుంటే వెంటనే భర్తీ చేయాలి
వైద్యారోగ్యశాఖలో నాలుగేళ్లలో 53,126 పోస్టు లు భర్తీ చేశామని సీఎం జగన్‌ అన్నారు. అన్ని ఆసుపత్రులను జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేశామన్నారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌స ీలు, టీచింగ్‌ ఆసుపత్రుల వరకు నాడు-నేడుతో అప్‌గ్రేడ్‌ చేస్తున్నామన్నారు.2356 సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. ప్రతి పేషెంట్‌ ఈ సేవలను ఉచితంగా అందుకోవాల న్నదే లక్ష్యమన్నారు. ప్రతి పేషెంట్‌ డబ్బులు ఖర్చు లేకుండా..అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా చికిత్స అందుకోవాలన్నదే మన తాపత్రయం అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఎక్కడైనా ఖాళీలుంటే మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు వాటిని తక్షణమే భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇదో మంచి నిర్ణయం
జగనన్న ఆరోగ్య సురక్ష పథకం కింద 30 రోజుల పాటు ప్రత్యేకంగా వైద్య శిబిరాలు నిర్వహించను న్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు.వచ్చే నెలాఖరు నాటికి రాష్ట్రంలో శిబిరాల నిర్వహణ పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మండలానికి ఒక గ్రామం చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజూ వైద్య శిబి రాలు జరుగుతాయని..శిబిరంలో 105 రకాల మందులు అందుబాటులో ఉంచుతాం. రోగులకు భోజన సదుపాయం కల్పిస్తామని.. ఇద్దరు స్పెష లిస్టు డాక్టర్లు, ఇద్దరు పీహెచ్‌సీ వైద్యులు పాల్గొం టారన్నారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల నుంచి కూడా ఒక స్పెషలిస్టు వైద్యుడు హాజరవుతారని తెలిపారు.
రాష్ట్రంలోని పేదలందరికీ ఆరోగ్య భరోసా కల్పిం చాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు మంత్రి విడదల రజిని.వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ఆరోగ్యశ్రీ సేవల వివరాలు, అనుబంధ ఆసుపత్రుల జాబితాతో కూడిన కిట్‌లు అందజేస్తారని మంత్రి చెప్పారు. ఇంటిలో ఆరోగ్య సమస్యలున్న వారిని గుర్తించి,స్థానికఏఎన్‌ఎంలకు తెలియజేస్తారన్నారు.మరుసటి రోజు నుంచి ఏఎన్‌ఎంలు, సీహెచ్‌వోలు ఇంటింటికీ వెళ్లి అవస రమైన వారికి షుగర్‌, బీపీ, రక్త పరీక్షలు చేస్తార న్నారు. శిబిరాల నిర్వహణ సమయానికి వారి హెల్త్‌ రిపోర్ట్‌ సిద్ధం చేస్తారని పేర్కోన్నారు.
ప్రజల ఆరోగ్య సమస్యలకు స్థానికం గానే స్పెషలిస్ట్‌ డాక్టర్లద్వారా చికిత్స అందిం చడమే ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమ ధ్యేయ మని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో భాగంగా ఈనెల 15 నుంచి గ్రామ, వార్డు వలం టీర్లు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య రక్షణపై అవగాహన కల్పిస్తారన్నారు. ఆరోగ్యశ్రీ కరపత్రాన్ని పంపిణీ చేసి.. సేవలను వివరిస్తారన్నారు. ఈనెల 16 నుంచి వైఎస్సార్‌ విలేజ్‌ క్లీనిక్‌, వైఎస్సార్‌ అర్బన్‌ క్లీనిక్‌ల పరిధిలోని గృహాలను ఏఎన్‌ఎంలు, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు(సీహెచ్‌వోలు) సందర్శి స్తారన్నారు.ప్రజలకు ప్రాథమిక వైద్య పరీక్షలు చేసి.. ఆరోగ్య సమస్యలను గుర్తిస్తారు. ఆ ఫలితా లను డాక్టర్లకు అందుబాటులో ఉంచుతారు. ఆరోగ్య సమస్యలున్న వారు వైద్య శిబిరాలకు హాజరయ్యేందుకు వీలుగా ఏఎన్‌ఎంలు, కమ్యూ నిటీ హెల్త్‌ ఆఫీసర్లు టోకెన్‌ నంబర్లు ఇస్తారు. ఈనెల 30నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ శిబిరాలను వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాటు చేయనుంది. ప్రతిరోజూ.. ప్రతి మండ లంలోనూ ఏదో ఒక వైఎస్సార్‌ విలేజ్‌ క్లీనిక్‌తో పాటు ప్రతి పట్టణంలోనూ ఏదో ఒక వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో ఈ వైద్య శిబి రాన్ని నిర్వహిస్తారు. నెల రోజుల పాటు ఈ శిబిరాల నిర్వహణ కొనసాగుతుంది. ఈ వైద్య శిబిరాల్లో మొత్తం 342 మంది స్పెషలిస్ట్‌ డాక్టర్లు సేవలందిస్తారు. అలాగే ఆయా మండలాల్లోని ఇద్దరు పీహెచ్‌సీ వైద్యులతో పాటు ఫ్యామిలీ డాక్టర్‌, ఇతర వైద్య సిబ్బంది పాల్గొంటారు. 162 రకాల మందులతో పాటు 18 రకాల శస్త్రచి కిత్సల వస్తువులు, 14రకాల ఎమర్జెన్సీ కిట్లు తదిత రాలను అందుబాటులో ఉంచుతారు. ఆరోగ్య సమస్యలున్న వారిని వైద్యులు పరీక్షిస్తారు. అవసర మైన వారికి ఈసీజీ వంటి వైద్య పరీక్షలు కూడా చేసి.. ఉచితంగా మందులిస్తారు. ఎవరికైనా పెద్ద చికిత్సలు అవసరమైతే డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద రిఫర్‌ చేస్తారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం అమలులో ఆయా శాఖల మధ్య సమన్వ యం అవసరమని సీఎస్‌ జవహర్‌రెడ్డి అన్నారు. వివిధ శాఖల అధికా రులతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఇంటింటి సర్వే నిర్వహణ సమయంలో సాధారణ వాటితోపాటు దీర్ఘకాలిక వ్యాధులు, గర్భిణులు, బాలింతలు, తగిన బరువు లేని పిల్లలు,క్షయ, కుష్ఠు వ్యాధులు కలిగిన వారు ఉంటే.. ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా ‘‘జగనన్న ఆరోగ్య సురక్ష’’.
ప్రజల ఆరోగ్య అవసరాలు గుర్తించేందుకు, పరీక్షలు నిర్వహించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా నిర్వహించిన ‘‘జగనన్న ఆరోగ్య సురక్ష’’ కార్యక్రమ సమావేశంలో పేర్కొ న్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి.ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ గా రాష్ట్రాన్ని తీర్చి దిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహించనున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని సిఎం క్యాంప్‌ కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు,జాయింట్‌ కలెక్టర్లు ,మున్సి పల్‌ కమిషనర్లు,వైద్య,విద్యాశాఖ అధికా రులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశం నిర్వ హించి,ఈ కార్యక్రమ నిర్వహ ణకుశాఖల వారీగా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను సమీక్షించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నెలరోజుల పాటు చేపట్టిన జగనన్న సురక్ష పథకం ప్రజల్లో మంచి గుర్తింపు లభించింది.– జి.ఎన్‌.వి.సతీష్‌

జమిలి ఎన్నికలు

కేంద్ర,రాష్ట్రచట్టసభలకు,ఇంకా అవస రమైతే స్థానిక సంస్థలకు జమిలి ఎన్నికలు నిర్వహిం చాలన్న ఆలోచన పైకి మంచిగానే కనబడుతున్న ప్పటికీ, లోతుగా విశ్లేషిస్తే, ప్రజాస్వామ్య విలువలు, సమాఖ్యస్ఫూర్తికి పమాదం వాటిల్లే అవకాశాలు ఉన్నట్టు పలువురు రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.‘ఐదేండ్ల కాలానికి ఎన్నికైన ఏదైనా ప్రభుత్వం మధ్యలో కూలిపోతే ఏమిటి చేయడం? అక్కడ మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే కొత్త ప్రభుత్వం ఐదేండ్ల కాలానికి అధికారం చేపడుతుంది. అప్పుడు ఉమ్మడి ఎన్నికల వ్యవస్థ (జమిలి) లక్ష్యం దెబ్బతిం టుంది.ఇలా జరుగకుండా ఉండాలంటే, కొత్త ప్రభుత్వం కాల పరిమితిని కుదించాల్సి ఉంటుంది. ఇది పజాతీర్పుకు, సమాఖ్యస్ఫూర్తికి, ప్రజా స్వామ్య విలువలకు గొడ్డలి పెట్టులాంటిదే’ అని వాళ్లు వాదిస్తున్నారు.
లా కమిషన్‌ సిఫారసు అలా..
రాజ్యాంగంలో అవిశ్వాస తీర్మానం ప్రస్తావన కచ్చితత్వంతో లేదు. లోక్‌సభ విధివిధా నాల్లోని198వ నిబంధనలో మాత్రమే దాన్ని ప్రస్తావించారు. 50 లేదా అంతకంటే ఎక్కువమంది చట్టసభ సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్ట వచ్చని నిబంధనలు చెబుతున్నాయి.అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం గద్దె దిగాల్సిఉంటుంది. ఏ వర్గమూ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థితిలో లేన ప్పుడు సభను రద్దుచేసి మధ్యంతర ఎన్నికలు జరు పడమే మార్గం. మరి అలాంటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఏంచేయాలి? దీనిపై 1999లో లా కమిషన్‌ ఓ సిఫారసు చేసింది. ఈ మేరకు జర్మనీ రాజ్యాంగాన్ని ఉదహరించింది. దాని ప్రకారం.. జర్మనీలో అవిశ్వాస తీర్మానంతో పాటు విశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెడతారు. అంటే, ప్రభుత్వం పై అవిశ్వాసం ప్రకటించేవారు ఎవరు నెగ్గుతారో కూడా చెప్పాలి.ఈరెండు తీర్మానాలను సభ ఆమో దించిన తర్వాత అధ్యక్షుడు కొత్త చాన్సలర్‌ను నియ మిస్తారు. ప్రభుత్వాలు మారినా ఐదేండ్లపాటు సభ కొనసాగుతుంది. అయితే, జర్మనీలో అధ్యక్ష పాలన అమల్లో ఉన్నది.మనది ప్రజాస్వామ్య దేశం. దీంతో ఈ సిఫారసును పక్కనబెట్టారు. అవిశ్వాస తీర్మానం తో రాష్ట్రప్రభుత్వాలు కూలిపోతే, జమిలి ఎన్నికల నెపంతో రాష్ట్రపతి పాలన విధించే అవకాశమూలేక పోలేదని..పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ఏకకాలంలో ఎలక్షన్స్‌ నిర్వహించాలంటే ఏయే ప్రొసీడిరగ్స్‌ అనుసరించాలి..?
జమిలి ఎన్నికల అంశాన్ని మోదీ సర్కారు విడిచిపెట్టడం లేదు. లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిం చాలని బీజేపీ ఏండ్లుగా ప్రతిపాదిస్తూనే ఉన్నది. అయితే, ఇప్పటికే రెండు మూడుసార్లు దీనికి సంబం ధించి ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ, కార్య రూపం మాత్రం దాల్చలేదు. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు మొదలుకానున్న నేపథ్యంలో ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ (జమిలి ఎన్నికలు)సాధ్యాసాధ్యాల పరిశీలన నిమిత్తం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఓకమిటీని ఏర్పాటు చేయడం గమనా ర్హం. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో జమిలి ఎన్నికలు సాధ్యమా? ఒకవేళ ఈ ఎన్నికలు నిర్వహించాలంటే ఏయే ప్రొసీడిరగ్స్‌ను అనుసరించాల్సి ఉంటుందన్న దానిపై పెద్దయెత్తున చర్చ జరుగుతున్నది.
ఏమిటీ జమిలి ఎన్నికలు?
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ లకు, లోక్‌ సభకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించ డమే జమిలి ఎన్నికల ప్రధాన ఉద్దేశం.
గతంలో జరిగినా.. ఆ తర్వాత వాస్తవానికి మన దేశంలో జమిలి ఎన్ని కల నిర్వహణ కొత్తదేమీ కాదు.1952లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని,1967 వరకు లోక్‌సభకు,రాష్ట్రాల అసెంబ్లీలకు చాలావరకు ఒకే సారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతర కాలం లో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ట్రాల శాసనసభలను బర్తరఫ్‌ చేయడం తదితర కారణాలతో జమిలి ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్‌సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరుపడం మొదలైంది.
ప్రక్రియ చాలా పెద్దదే
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలంటే చాలా రాష్ట్రాల చట్టసభలను గడువు కంటే ముందే రద్దుచేయాల్సి ఉంటుంది. మరికొన్నింటి కాలవ్యవధిని పొడగిం చాల్సిన అవసరమూ ఉండొచ్చు. కాబట్టి, జమిలి ఎన్నికలను నిర్వహించాలంటే దానికి సంబంధిం చిన బిల్లు తొలుత పార్లమెంట్‌ ఆమోదం పొందాల్సి ఉంటుంది. జమిలి ఎన్నికలు జరుగాలంటే దాదా పు ఐదు రాజ్యాంగ సవరణలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని 2018లో లా కమిషన్‌ అభిప్రాయపడిరది. ఆర్టికల్‌ 356,ఆర్టికల్‌324,ఆర్టికల్‌ 83(2),ఆర్టికల్‌ 172 (1),ఆర్టికల్‌ 83కు సంబంధించి పలు సవరణలకు సూచించింది.
ఆమోదం లభించడం సులభమేమీ కాదు
జమిలి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణలతో కూడిన బిల్లును పార్లమెంట్‌ ఉభయ సభలు కనీసం 67శాతం సానుకూల ఓట్ల తో ఆమోదించాల్సి ఉంటుంది. అంతే కాకుండా.. ఎన్నికల అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యం లో ఈ బిల్లుకు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోద ముద్రవేయాలి. అంటే 543 స్థానాలున్న లోక్‌సభలో కనీసం 67శాతం (362 ఎంపీలు) మంది ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి. దీంతోపాటు రాజ్యసభలో 245 సీట్లలో 67శాతం (164 ఎంపీలు) ఈ బిల్లును సమర్థిం చాలి. దీనికి తోడు కనీసం 14రాష్ట్ర అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉన్నది.
ఏ ఆర్టికల్‌/నిబంధన ఏం చెబుతున్నది?
ఆర్టికల్‌ 356: రాష్ట్రాల అసెంబ్లీలను రద్దుచేసే అధికారం కేంద్రానికి ఉన్నది. రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధ యంత్రాంగం విఫలమైనప్పుడు మాత్రమే ఈ ఆర్టికల్‌ను ఉపయోగించి కేంద్రం ఈ చర్యకు దిగాల్సి ఉంటుంది.ఒకవేళ, వేరే సందర్భంలో చట్ట సభ రద్దుకు నిర్ణయిస్తే,అది రాజ్యాంగ విరుద్ధమే అనిపించుకొంటుంది.
ఆర్టికల్‌ 172 (1): అసెంబ్లీ కాలవ్యవధి ఐదేండ్లుగా కొనసాగుతుంది. అత్యయిక స్థితిలో తప్పించి అసెంబ్లీ కాలవ్యవధిని మరే ఇతర సందర్భాల్లో పొడిగించకూడదు. సభ తొలిసారిగా సమావేశమైన నాటినుంచి కాలపరిమితి మొదలౌతుంది.
ఆర్టికల్‌ 324: రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి,లోక్‌సభ, రాజ్యసభ,శాసనసభ,శాసనమండలి ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరుగుతాయి. సమ యానుసారం,రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఈ ఎన్నికలు జరుగుతాయి.పార్లమెంట్‌,శాసనసభ ఎన్ని కలు ఒకేసారి నిర్వహించాలంటే చట్టసభ కాల వ్యవధిని సహేతుక కారణాలతో సవరించాల్సి ఉంటుంది.
ఆర్టికల్‌ 83(2): ప్రజాతీర్పుతో కొలువుదీరిన లోక్‌ సభ కాలవ్యవధి ఐదేండ్లు. ప్రత్యేక సందర్భాల్లో మినహాయించి దిగువ సభను రద్దు చేయడానికి వీలులేదు.
ఆర్టికల్‌ 83: పెద్దల సభ కాలపరిమితికి సంబం ధించి ఆర్టికల్‌ 83 సూచిస్తుంది. దీంతో పాటు రాజ్యాంగంలోని 2,3చాప్టర్స్‌, పార్ట్‌-15లోని పలు అంశాలను, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని కొన్ని నిబంధనలను జమిలి బిల్లు కోసం సవరించాల్సి ఉంటుంది.
దేశంలో జమిలి ఎన్నికలు సాగాయిలా..
2019 15 శాతం
1967 67 శాతం
1951-52 90 శాతం
1957 76 శాతం
ఉభయ సభల్లో ఎన్డీయే బలాబలాలు
ó లోక్‌సభలో ఎన్డీయే బలం 61శాతం
ó జమిలి బిల్లు ఆమోదానికి కావాల్సిన బలం 67 శాతం
ó రాజ్యసభలో ఎన్డీయే బలం 38శాతం
ó జమిలి బిల్లు ఆమోదానికి కావాల్సిన బలం 67 శాతం
ó ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాలు 16శాతం
ó బిల్లు ఆమోదానికి ఎన్ని రాష్ట్రాల ఆమోదం అవసరం 14శాతం
సమైక్య వ్యూహంతో ‘ఇండియా’- జమిలి ఆత్రంలో మోడీ
బిజెపి మత రాజకీయాలనూ కేంద్రం నిరంకుశత్వాన్ని ఓడిరచడానికి మరింత సమిష్టి గానూ సమర్థంగానూ సత్వర వ్యూహాలు రూపొం దించుకోవాలని ప్రతిపక్షాల నాయకులు గుర్తిం చారు. కీలక నేతలందరూ హాజరైనారు కూడా. దేశంలోని 450నియోజక వర్గాలలో బిజెపికి వ్యతి రేకంగా ఒకేఅభ్యర్థిని నిలబెట్టి ఓడిరచాలని అందుకే తొలి అంశంగా నిర్ణయించుకున్నారు. అయితే ఇది విశాల ప్రతిపక్ష వేదిక మాత్రమే గనక వీలైనంత వరకూ కలసి పోటీ చేస్తామని ప్రకటించాయి. అందుకే జాతీయస్థాయి సమావేశంలో గాక రాష్ట్రా ల స్థాయిలోనే సమన్వయ కమిటీల ద్వారా ఎవరు ఎలా పోటీ చేయాలన్నది ఖరారు చేయాలని నిర్ణయించారు.ఆనిర్ణయం వాస్తవికతను ప్రతిబింబి స్తుంది.
కోవింద్‌ కమిటీ గురించి ప్రహ్లాద్‌ చెప్ప డమే గాని ఇంతవరకూ అధికారిక ప్రకటన వెలువ రించలేదు. పైగా రాజ్యాంగం గురించిన చర్చను అనధికార కమిటీ ఎలా చేస్తుంది? ఆ అధికారం పార్లమెంటుకు మాత్రమే వుంది.గతంలో వాజ్‌పేయి హయాంలోనూ రాజ్యాంగ సంస్కర ణలకై జస్టిస్‌ వెంకటాచలయ్య కమిటీని ఇలాగే ఏర్పాటు చేసి తర్వాత… సూచనల కోసం అని వెనక్కు తగ్గారు. ఇప్పుడైనా ఏకపక్షంగా రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేయడం చెల్లదు.
2023 జులైలో బెంగళూరులో ప్రతి పక్షాల కూటమి సమావేశమై ‘ఇండియా’గా ముందు కు వస్తున్న తరుణంలోనే కేంద్ర పాలక పక్షమైన బిజెపి హడావుడిగా ఎన్‌డిఎను పునరుద్ధరించి విస్తరించి ఢల్లీిలో సమావేశపర్చింది.26 పార్టీలు ఇక్కడ కలుస్తుంటే అక్కడ ఏకంగా 38పార్టీలు హాజ రైనాయి గాని వాటి సీట్లబలం నామకార్థమని మీడి యా విశ్లేషించింది. తాజాగా ముంబయిలో ఇండి యా సమావేశమవుతుందంటే ఎన్‌డిఎ సమావేశం కాకుండా ఏకంగా పార్లమెంటు ప్రత్యేక సమావే శాలనే పిలవాలని మోడీ ప్రభుత్వం నిర్ణయిం చింది.లౌకిక ప్రతిపక్షాల ఐక్యవేదిక ఏర్పాటు పట్ల ప్రధాని మోడీ ఎంతగా ఉలిక్కిపడుతున్నారో దీన్ని బట్టే చెప్పొచ్చు. నవంబరు, డిసెంబరులో అయిదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలలో తన పరిస్థితి ప్రతికూలంగా వుంటుందని భయపడుతున్న బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం ముందస్తు ఎన్నికలకు వెళ్ల వచ్చుననే సంకేతాలు గతం నుంచి వున్నాయి. కానీ ముంబయి సమావేశ సన్నాహాలు, ప్రతిపక్షాల వ్యూ హాల ఉధృతి చూసిన తర్వాత కేంద్రం దాదాపు ముందస్తును మరింత ముందుకు జరపాలని నిర్ణయించుకోవలసి వచ్చిందని ఇప్పుడు అందరూ భావిస్తున్నారు. ఈ నెల 18 నుంచి 22 వరకూ లోక్‌సభ అమృతోత్సవ్‌ ప్రత్యేక సమావేశాలు జరిపి కీలకమైన బిల్లులు, సవరణలు ఆమోదింప చేసు కోవాలని మోడీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు జాతీయ మీడియా ఏకకంఠంతో చెబుతున్నది. ఇందుకు తగినట్టే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నాయకత్వంలో జమిలి ఎన్నికల గురించి అధ్యయ నం చేసేందుకు ఒక కమిటీనే నియమించారు. 2018లో కోవింద్‌ ఆపదవిలో వున్నప్పుడు ఉభ య సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో లోక్‌ సభకూ శాసనసభలకూ ఒకేసారి ఎన్నికలు జరిగితే మంచిదన్న సూచన చేశారు. అంటే కేంద్రం ఆలోచ నను వినిపించారు. ఆయన నాయకత్వంలో కమిటీ ఇక ఏమి చెబుతుందో ఊహించడం కష్టమేమీ కాదు. అసలు రాజ్యాంగ అధినేతగా పనిచేసిన ఒక మాజీ రాష్ట్రపతికి ఈ విధంగా రాజకీయ బాధ్యత అప్పగించడం దేశ రాజకీయాలలో ఇదే తొలిసారి కావచ్చు.
కోవింద్‌ కమిటీ, కోటి కౌటిల్యాలు
ఏమైనా ఈ సమావేశ ప్రభావం అప్పుడే బిజెపిపై పడిరదని సీతారాం ఏచూరి చేసిన వ్యాఖ్య అర్థవంతమైంది. ముంబయి సమావేశం ఒకవైపున ఇంకా జరుగుతుండగానే ఏకకాల ఎన్నికల ముచ్చట ఊపందుకోవడంలో అది కనిపిస్తుంది. పార్లమెం టరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ను కలిశారు. ‘ఇండియా’ అనే పేరు మార్చి భారత్‌నే వాడాలని భగవత్‌ రెండు చోట్ల వేర్వేరు సమావేశాల్లో ప్రవచించారు. ఈ దేశం హిందూ రాష్ట్రమేనని, భారతీయు లందరూ హిందువులేనని మత భాష్యాన్ని మరింత తీవ్రంగా వినిపించారు. రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా కొంత కాలం కిందట భగవత్‌తో సమావేశమైనారని ఇక్కడ గుర్తు చేయాలి. అంటే మోడీ అమిత్‌ షా ఒకవైపు ఎన్‌డిఎ విస్తరణ కోసం తంటాలు పడు తుంటే మరోవైపు మోహన్‌ భగవత్‌ హిందూత్వ మతతత్వ సిద్ధాంతం వ్యాప్తి బీజాలు వేస్తున్నారన్న మాట. కోవింద్‌ కమిటీ గురించి ప్రహ్లాద్‌ చెప్పడమే గాని ఇంతవరకూ అధికారిక ప్రకటన వెలువరించ లేదు. పైగా రాజ్యాంగం గురించిన చర్చను అనధి కార కమిటీ ఎలా చేస్తుంది? ఆ అధికారం పార్ల మెంటుకు మాత్రమే వుంది. గతంలో వాజ్‌పేయి హయాంలోనూ రాజ్యాంగ సంస్కరణలకై జస్టిస్‌ వెంకటాచలయ్య కమిటీని ఇలాగే ఏర్పాటు చేసి తర్వాత…సూచనల కోసం అని వెనక్కు తగ్గారు. ఇప్పుడైనా ఏకపక్షంగా రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేయడం చెల్లదు. ఆ అంశాన్ని తెరపైకి తేవడం, ప్రజల్లో అనుకూలత పెంచడం లక్ష్యంగా పెట్టుకు న్నట్టు కనిపిస్తుంది. పార్టీలు, వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలతో ఈ కమిటీ సంప్రదిస్తుందంటున్నారు. కానీ ఇతర పార్టీలు, ప్రభుత్వాలు ఒక అనధికార కమిటీకి సహకరిస్తాయని చెప్పడం కష్టం. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా పదవీ విరమణ తర్వాత మామూలు పౌరుడేనని ఇటీవల జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ స్పష్టంగా చెప్పారు. అధికార లాంఛనాలు కొన్ని వుండవచ్చు గాని మాజీ రాష్ట్రపతి అయినా ప్రత్యేక రాజ్యాంగ ప్రతిపత్తి ఏమీ వుండదు. ఈ కమిటీ సిఫార్సులు చేసినా వాటిని కేంద్ర క్యాబినెట్‌ తీర్మానం ముందుకు తెస్తారన్న మాట. ఎన్నికల సంఘం కూడా కేంద్రం ఒత్తిడితో గతంలోనే దీనిపై స్పందించింది. ఒకేసారి ఎన్నిక లు జరపగల సత్తావుందని, కాకపోతే అదనంగా సహాయం అవసరమని వెల్లడిరచింది.తన వంతుగా అయిదు సూచనలు చేసింది.1.కొత్త లోక్‌సభ ప్రారంభానికి తేదీ నిర్ణయించాలి.2.అవిశ్వాస తీర్మానం తెచ్చేవారు ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి నాయకత్వం వహించే వ్యక్తి పేరు అందులో సూచించాలి. 3.పదవీ కాలం కొద్దిగానే మిగిలి వుండగా ప్రభుత్వం పడిపోతే రాష్ట్రపతి పాలన పెట్టాలి. ఎక్కువ వుంటేనే ఎన్నికలు. 4.శాసనసభల విషయంలోనూ ఇదే జరగాలి.5.లేదంటే అన్ని ఎన్నికలకూ నిర్ణీత తేదీలలో జరిగేలా నిర్ణయిం చాలి.
రాజ్యాంగానికే ఎసరు, దేశానికే ప్రమాదం
భారత రాజ్యాంగం ఏకకాల ఎన్నికలు జరగాలని చెప్పడం లేదు. లోక్‌సభ, శాసనసభల నియమ నిబంధనలు కాలపరిమితి అన్నీ వేర్వేరుగా వున్నాయి. మొదటి మూడు ఎన్నికలు కలిసే జరిగా యంటే కాంగ్రెస్‌ గుత్తాధిపత్యమే కారణం, 1967 నుంచి క్రమంగా ఈ పరిస్థితి మారుతూ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టడం, రద్దు చేయడం, పడిపోవడం చాలా చూశాం. కేంద్రంలోనూ కనీసం మూడు సార్లు ప్రభుత్వాలు ముందే పడిపోయాయి. వాటిపై ఏవో కొత్త షరతులు రుద్దాలనేది ఇక్కడ ఆంతర్యం. అంటే పదవీ కాలం ముగిసినా కొనసా గించడం లేక ఇంకా వున్నా ఎన్నికలకు వెళ్లకుండా పరోక్ష పాలన సాగించడం వంటివి రాజ్యాంగ నిర్దేశానికి విరుద్ధం. అప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అనే మౌలిక సూత్రమే మంటగలిసి పోతుంది. ఎమర్జన్సీలో రాష్ట్రాల శాసనసభల కాల పరిమితిని ఆరేళ్లకు పెంచితే తర్వాత కత్తిరించాల్సి వచ్చింది. వాస్తవానికి శ్రీలంక, బంగ్లాదేశ్‌ వంటి చోట్ల కూడా గతంలో నిరంకుశ ప్రభుత్వాలు పాలనా వ్యవస్థను ఇష్టానుసారం మార్చినా తర్వాత అవి నిలబడలేదు. వి.పి.సింగ్‌ ప్రభుత్వ కూల్చివేత తర్వాత అప్పటి రాష్ట్రపతి వెంకట్రామన్‌ జాతీయ ప్రభుత్వం అంటూ ఒక ప్రహసనం నడిపించి వెనక్కు తగ్గాల్సి వచ్చింది. బిజెపి ఎప్పుడూ అధ్యక్ష తరహా పాలన కోరుకుంటుంది. దేశంలో రాజకీయ సామాజిక బహుళత్వం కారణంగా అది చేయలేక పోయింది. మోడీ హయాంలో దాదాపు ప్రధాని కేంద్రంగా చేయడం అధ్యక్ష తరహా ప్రతిబింబమే. నోట్ల రద్దుతో సహా కీలక నిర్ణయాలు మోడీ ఒక్కరే తీసుకున్నారు. ఆర్టికల్‌ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వంటి వాటిని కూడా ఎవరితో చర్చించలేదు. ఈ నిర్ణయాలు సుప్రీం కోర్టు సమీక్షలో వుండటమే గాక తీవ్ర ప్రశ్నలకు కారణమవుతున్నాయి. లోక్‌సభ పదవీ కాలానికి సంబంధించిన 83వ అధికరణం రద్దుకు సంబంధించిన 85 అధికరణం, అసెంబ్లీల పదవీ కాలానికి సంబంధించిన 172 రద్దు పైన 174,రాష్ట్రపతి పాలనపై 356 అయిదు రాజ్యాం గ సవరణలు చేయవలసి వుంటుంది. శాశ్వత మార్పులైతే సగం శాసనసభల ఆమోదం కూడా అవసరమవుతుంది.లక్షల కోట్లు బడాబాబుల పరం చేయడమే గాక రాయితీల రూపంలో మరిన్ని లక్షల కోట్లు కట్టబెడుతున్న ఈసర్కారు ఎన్నికల ఖర్చు తగ్గించాలని పొదుపు కబుర్లు చెప్పడం హాస్యా స్పదం. ఇది వాస్తవానికి అధికార దాహం, అప్రజా స్వామిక రాజ్యాంగ కుట్ర. మోహన్‌ భగవత్‌, మోడీల మాటల వెనక వున్న రాజకీయ దురుద్దే శాలు, మతతత్వ వ్యూహాల పట్ల ప్రజల అప్రమత్తత చాలా అవసరం. దురదృష్టమేమంటే తెలుగు రాష్ట్రాలలో రెండు పాలక పార్టీలైన వైసిపి, బిఆర్‌ ఎస్‌, ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఏవీ ఈ పోరాటం లో పాలుపంచుకోవడం లేదు, బిజెపికి వత్తాసుగా నిలవడానికే పోటీ పడుతున్నాయి. ‘ఇండియా’ ఈ నిరంకుశత్వాన్ని నిలవరించేందుకు పోరాడటమే గాక ఎన్నికలలోనూ బిజెపి కూటమిని ఓడిరచడం ద్వారా ఆకుటిల ప్రయత్నాలు శాశ్వతంగా అడ్డు కోవడం మరింత ముఖ్యం.
(వ్యాసకర్త : సీనియర్‌ పాత్రికేయులు,న్యూఢల్లీి)-(ఢల్లీి నుంచి ప్రకాశ్‌ యాదవ్‌)

ఐక్యరాజ్యసమితి పేదరికపు అంచనాలు

మనం ఇంతవరకూ గ్రామీణ పేదరికం గురించి చర్చించాం. కరోనా మహమ్మారి విరుచుకు పడకముందు 2019-20లో మన దేశంలో నిరుద్యోగం అప్పటికి 45 ఏళ్ళకు పూర్వం ఏనాడూ లేనంత ఎక్కువ స్థాయికిచేరు కుంది. దీనిని బట్టి మన దేశంలో పేదరికం తగ్గలే దని స్పష్టంగా చెప్పవచ్చు. వాస్తవానికి అది మరింత పెరిగింది.కాని యుఎన్‌డిపి లెక్కలు దాని కి భిన్నంగా చెప్తున్నాయి.కేంద్ర ప్లానింగ్‌ మంత్రి రావుఇంద్రజిత్‌ సింగ్‌రాజ్యసభలో మాట్లాడుతూ ‘మన దేశంలోపేదరికాన్ని అంచనా వేయడానికి 2011-12తర్వాత ఏవిధమైన గణాంకాలూ అందు బాటులో లేవు’అని ప్రకటించారు. అందుచేత ఆ ఏడాది తర్వాత ఎంతమంది పేదరికస్థాయి నుండి బైట పడ్డారో చెప్పలేమని అన్నారు. అయితే ఐక్యరాజ్య సమితికి (ఐరాస) చెందిన యుఎన్‌డిపి (యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం) జులై 18న ఒక ప్రకటన చేసింది. దాని ప్రకారం 2005 నుండి 2019 మధ్య కాలంలో భారతదేశంలో 41 కోట్ల 50లక్షల మంది పేదరికపు స్థాయిని అధిగమిం చారు. కరోనా అనంతర కాలపు పరిస్థితి గురించిన అంచనాలను యుఎన్‌డిపి చెప్పలేదు. కాని అంతకు ముందరి కాలానికి సంబంధించి యుఎన్‌డిపి చెప్పినది విపరీతంగా ప్రచారం అయ్యింది. గొప్పలు చెప్పుకోడానికి అదిదారి తీసింది.కాని, ఇక్కడ గమనించని వాస్తవం ఏమంటే యుఎన్‌డిపి పేదరి కానికి సంబంధించి అంచనాలు వేసే పద్ధతి, అది తీసుకున్న కొలబద్దలు వేరు, మన దేశంలో పేదరి కాన్ని అధ్యయనం చేయడానికి తీసుకునే కొలబద్దలు వేరు. యుఎన్‌డిపి అంచనాలు సైద్ధాం తికంగా సమర్ధించుకోగలిగినవి కావు.ఆ అంచనా లకు రావ డానికి అది ఉపయోగించిన గణాంకాలు కూడా సరైనవి కావు.
మన దేశంలో పేదరికాన్ని అంచనా వేయడానికి ఒక ప్రధానమైన కొలబద్ద పౌష్టికా హారం.అది అందనివారు పేదలుగా పరిగణింప బడతారు.అంతే కాదు. మన జాతీయ శాంపిల్‌ సర్వే చాలా పెద్దది. ఆ సర్వే చాలా పెద్ద సంఖ్యలో ప్రజలను కలిసి వివరాలు సేకరిస్తుంది. ఐతే 2011-12 తర్వాత మన ప్రభుత్వం దగ్గర ఏ గణాంక వివరాలూ లేవని ఎందుకు ప్రకటించారు? ఆ తర్వాత 2017-18 సంవత్సరంలో చేసిన సర్వేలో బైటపడ్డ చేదు వాస్తవాలను వెల్లడిరచే సాహసం కేంద్ర ప్రభుత్వానికి లేకుండాపోయింది. ఆ తర్వాత మోడీ ప్రభుత్వం ఎటువంటి సర్వేనూ చేపట్టనే లేదు.అందుచేత తమ వద్ద 2011-12 తర్వాత వివరాలు లేవంటూ బుకాయిస్తున్నారు.
ఇక యుఎన్‌డిపి సర్వే విధానం చూస్తే అది పూర్తిగా భిన్నమైనది. పేదరికపు అంచనాల కోసం అది తీసుకునే సూచికలు కొన్ని ఉన్నాయి. వాటన్నింటినీ బట్టి ఒకఅంచనాకి వస్తారు. ఉదాహ రణకి: ఒక వ్యక్తి ఎంత ఎత్తు ఉన్నాడు అన్నది కొలిచి దానివర్గాన్ని లెక్కిస్తారు.అలా వచ్చిన అంకెను 18.5తో గుణిస్తారు. అప్పుడు వచ్చిన అంకె కన్నా ఆ వ్యక్తి తక్కువ కిలోల బరువు ఉంటే అతడు పేదవాడిగాలెక్క (ఉదా: ఎత్తు 1.5 మీటర్లు అయితే దాని వర్గం 2.25.దానిని 18.5తో గుణిస్తే 41. 625 కిలోలు వస్తుంది. ఆ వ్యక్తి బరువు అంతకన్నా తక్కువ ఉంటేనే అతడిని పేదవాడుగా గుర్తిస్తారు). ఇంకొక కొలబద్ద: ఆ ఇంట్లో గత ఐదేళ్ళలో 18 సంవత్సరాల వయస్సు లోపు ఉన్నవారు ఎవరైనా మరణించారా? అన్నది. ఇంకొకటి: ఆఇంట్లో 12 ఏళ్ళ వయస్సుకు పైబడిన పిల్లలు ఉంటే వారు కనీసం 6సంవత్సరాల స్కూలు చదువు పూర్తి చేశా రా? లేదా? అన్నది. స్కూలుకు పోయే వయస్సు ఉన్న పిల్లల్లో 8వ తరగతి వరకూ చదవకుండా మధ్యలోనే ఆపివేశారా? అన్నది ఇంకొకటి.
‘ఆధునిక’ సమాజాలుగా పరివర్తన జరు గుతున్న ఏసమాజంలోనైనా పైన తెలిపిన కొల బద్దల ప్రాతిపదికన చూస్తే అభివృద్ధి తప్పనిసరిగా జరుగుతున్నట్టే అనిపిస్తుంది. ఉదాహరణకి: 18ఏళ్ళ లోపు వయస్సు ఉండే పిల్లల్లో మరణాల రేటు ఆ సమాజాల్లో తగ్గుతూనే వుంటుంది. అదేమాదిరిగా స్కూలుకి పోయే పిల్లల సంఖ్య పెరుగుతూనే వుం టుంది. ముఖ్యంగా మంచి చదువు ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నభావన అప్పో,సప్పో చేసై నా పిల్లల్ని చదివించాలనే తాపత్రయం ఉండే తల్లిదండ్రులు పెరుగుతున్నకొద్దీ స్కూళ్ళకి పోయే పిల్లల సంఖ్య పెరుగుతుంది. మధ్యాహ్న భోజన పథకం వంటివి కూడా స్కూలు హాజరు రేటును మెరుగుపరుస్తాయి. ఐతే, ఆకుటుంబపు ఆదాయం తగ్గిపోతున్నా,ఈ కొలబద్దలన్నీ అందుకోవచ్చు. ఆకు టుంబం ఇతరత్రా వినియోగించే సరుకుల మొత్తం అంతకంతకూ తగ్గించుకుంటూ బిడ్డల్ని చదివించు కోవడం జరుగుతుంది.అంటే ఆకుటుంబంలో ఒకవైపు పేదరికం పెరుగుతున్నా, యుఎన్‌డిపి కొల బద్దలను బట్టి చూస్తే, ఆ కుటుంబం పేదరికంలో లేనట్టే లెక్క.యుఎన్‌డిపి తన కొలబద్దలు పేదరి కాన్ని బహుముఖంగా పరిశీలించడానికి తోడ్పడతా యని చెప్తుంది. ఈ బహుముఖపు పేదరికం అంటే ఏమిటి?ఈపెట్టుబడిదారీ వ్యవస్థ సమాజపు ఆధునీకరణ ఏవిధంగా జరగాలని కోరుకుం టుం దో ఆదిశకు అనుగుణంగా ఇది ఉంటుంది. మరి ఈ ఆధునీకరణ జరగడానికి మూల్యం ఎవరు చెల్లిస్తున్నారు? శ్రామిక ప్రజలా? లేక సంపన్నులా? యుఎన్‌డిపికి ఈప్రశ్న అసలు ఉదయించదు. ఆధు నీకరణ జరిగిందా లేదా అన్నదే దానికి ముఖ్యం (వ్యవసాయంలో యంత్రాల వినియోగం పెరిగి కూలీలకు పనులు దక్కకుండా పోయినా అది అభివృద్ధికిందే లెక్క. రెగ్యులర్‌ కార్మికుల స్థానంలో కాంట్రాక్టు కార్మికులను పెట్టుకుని నడిపే పరిశ్ర మలు పెరిగితే అదీ అభివృద్ధి కిందే లెక్క). ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో మన దేశంలో ఈ తరహా ఆధునీకరణ వేగంగా జరుగుతోంది. అందుకే యుఎన్‌డిపి లెక్కల్లో మనదేశంలో పేదరికం తగ్గి నట్టు కనిపిస్తోంది.కాని ఈ ఆధునీకరణకు మూల్యం చెల్లిస్తున్నది శ్రామిక ప్రజలే. వారి వినిమయ శక్తి (లేదా కొనుగోలు శక్తి) పడిపోతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా కుటుంబం చేసే ఖర్చులలో ప్రాధాన్యతలు కూడా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఆహారం కోసం చేసే ఖర్చు తగ్గుతోంది. అందువల్ల పేదరికాన్ని అంచనా వేయడానికి ఆ యా కుటుం బాల ఆహారపు పౌష్టిక విలువలను (ఎన్ని క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకుంటున్నారు అన్నది) ప్రాతిపదికగా తీసుకోవడం అవసరం. పేదరికపు తీరు తెన్నులకు అద్దం పట్టే ప్రమాణం ఇదే. అంతే కాదు, కుటుంబపు వాస్తవ ఆదాయం పెరుగుతోం దా లేక తగ్గుతోందా అన్నది కూడా ఈ ప్రమాణాన్ని బట్టి నిర్ధారించగలుగుతాం.రూపాయి లెక్కల్లో ఆదాయం పెరిగినట్టు కనిపించినా, ఆ రూపాయి విలువ నిగ్గు తేల్చేది ఒకానొక కుటుంబం పౌష్టికా హారాన్ని పొందగలుగుతోందా లేదా అన్న పరి శీలనే.ఇటువంటి ముఖ్యమైన కొలబద్ద-పౌష్టికా హారం పొందగలగడం-యుఎన్‌డిపి పెట్టుకున్న ప్రమాణాలలో ఆరో వంతు ప్రాధాన్యత మాత్రమే కలిగివుంది. పైగా పౌష్టికాహార లభ్యతకు వాళ్ళు ఇచ్చే నిర్వచనమే వేరుగా ఉంది. శరీరానికి తగ్గట్టు బరువు ఉందా లేదా అన్నది (బాడీ-మాస్‌ ఇం డెక్స్‌),వారి ప్రమాణం. పౌష్టికాహారం పొందలే నప్పుడే బరువు తగ్గుతుంది. ఒక్కోసారి బరువులో తేడా కనిపించకపోవచ్చు కాని రోగాలబారిన పడే అవకాశాలు పెరుగుతాయి.అంటే శరీరపు బరువును బట్టి పేదరికాన్ని లెక్క వేయడం శాస్త్రీ యం కాదు. నిజానికి పౌష్టికాహారం తీసుకోలేకపోతే ఆ వెంటనే శరీరపు బరువు తగ్గిపోదు. దానికి కొంత కాలం పడుతుంది. అందుచేత యుఎన్‌డిపి పెట్టుకున్న కొలబద్దలకు వాస్తవ పౌష్టికాహార సమస్య దొరకదు. పైగా దీనికి ఆరో వంతు ప్రాధాన్యత మాత్రమే ఇవ్వడంబట్టి యుఎన్‌డిపి దృక్కోణం ఏమిటో తెలుస్తూనే వుంది.యుఎన్‌డిపి ప్రమాణా లకు, మన జాతీయ శాంపిల్‌ సర్వే ప్రమాణాలకు ఎంత తేడా ఉందో తెలియాలంటే ఈ ఉదాహరణ చూడాలి: 2005-2006 నాటికి భారతదేశంలో 64 కోట్ల 50లక్షల మంది పేదలు ఉన్నారని, 2015-16నాటికి ఈ సంఖ్య 37 కోట్లకు పడిపో యిందని యుఎన్‌డిపి లెక్కలు తెలుపుతున్నాయి. అంటే అప్పటికి 27కోట్ల 50లక్షల మంది పేదరికం నుండి బైటపడినట్లు ఔతుంది. అదే జాతీయ శాంపిల్‌ సర్వే 75వ రౌండ్‌ సర్వేలో (2017-18)గ్రామీణ ప్రాంతంలో ప్రజల వినియోగం (అన్ని సరుకుల, సేవలనూ కలుపుకుని) 9శాతం పడిపోయిందని తేల్చింది.(ఈ నిర్ధారణ మోడీ ప్రభుత్వాన్ని ఎంత వణికించిందంటే ఆ గణాంకా లను విడుదల చేసిన కొద్ది గంటలలోపే వాటిని తొలగించివేసి,ప్రజానీకానికి దొరక్కుండా దాచి పెట్టింది. ఆకొద్ది గంటల వ్యవధి లోపలనే కొందరు వ్యక్తుల ఆ గణాంకాలను వీలైన మేరకు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.అప్పటి మీడియాలో కూడా ఆ గణాం కాల ఆధారంగా కొంత చర్చ జరిగింది.) భారత ప్రణాళికా సంఘం మొదట్లో గ్రామీణ ప్రజలకు కనీసం 2200 క్యాలరీల శక్తి రోజుకు ఒక్కొక్కరికి అందాలన్నది ప్రమాణంగా నిర్ణయించింది. ఆ లెక్క చూస్తే 1993-94లో కనీస పౌష్టికాహారం పొంద లేని గ్రామీణులు 58శాతం ఉన్నారు. 2011-12నాటికి వాళ్ళు 68 శాతానికి పెరిగారు. 2017-18 నాటికి వాళ్ళు అమాంతం 77శాతానికి పెరి గారు! కాని యుఎన్‌డిపి లెక్కల్లో మన దేశంలో కోట్లాది మంది పేదరికం లోంచి బైటపడ్డారు!
మనం ఇంతవరకూ గ్రామీణ పేదరికం గురించి చర్చించాం. కరోనా మహమ్మారి విరుచుకు పడకముందు 2019-20లో మన దేశంలో నిరుద్యోగం అప్పటికి 45 ఏళ్ళకు పూర్వం ఏనాడూ లేనంత ఎక్కువ స్థాయికి చేరుకుంది. దీనిని బట్టి మన దేశంలో పేదరికం తగ్గలేదని స్పష్టంగా చెప్ప వచ్చు. వాస్తవానికి అది మరింత పెరిగింది. కాని యుఎన్‌డిపి లెక్కలు దానికి భిన్నంగా చెప్తున్నాయి. యుఎన్‌డిపి పెట్టుకున్న కొలబద్దలను ఇక్కడ మనం విమర్శించడం ప్రధానాంశం కాదు. ఆ కొలబద్దల ఆధారంగా పేదరికం పెరిగిందా లేక తగ్గిందా అన్న నిర్ధారణకు రావడాన్ని మనం విమర్శిస్తున్నాం. దేశంలో పేదరికంపై జరుగుతున్న చర్చ కాస్తా యుఎన్‌డిపి గణాంకాలతో పూర్తిగా దారి తప్పింది. మన దేశం పెట్టుకున్న కొలబద్దలకు, యుఎన్‌డిపి కొలబద్దలకు మధ్య తేడాను గమనించకపోతే చర్చను మళ్ళీ గాడిలో పెట్టడం సాధ్యం కాదు. మొత్తం 121దేశాలకుగాను ప్రపంచ ఆకలి సూచి కలో 107 వస్థానానికి దిగజారిన మన దేశంలో మరోవైపు కోట్లాదిమంది ప్రజలు పేదరిక స్థాయి నుండి బైట పడ్డారని చెప్పుకుంటే దానిని ఏ విధం గా ప్రజలు విశ్వసిస్తారు?.
గ్రామీణ పేదరికం తగ్గుతుంది, కానీ జీవనశైలి సమస్యలు తలెత్తుతున్నాయి
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పైకి చూస్తోంది, అయితే మాదకద్రవ్యాల దుర్వినియోగం, సోషల్‌ మీడియాకు వ్యసనం మరియు వ్యర్థాల తొలగింపు ఆందోళన కలిగించే అంశాలు ఆయోగ్‌ భారతదేశం కోసం నవీకరించబడిన మల్టీడైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌ ని విడుదల చేసింది. ఇది దేశం యొక్క పురోగతిని మూడు సమానమైన పరిమాణాలలో సంగ్రహి స్తుంది-ఆరోగ్యం, విద్య మరియు జీవన ప్రమాణం.పబ్లిక్‌ పాలసీ థింక్‌ ట్యాంక్‌ యొక్క ప్రోగ్రెస్‌ రివ్యూ2023 2015-16 మరియు 2019-21 మధ్య బహుమితీయ పేదరికంలో జనాభా నిష్పత్తిలో 24.85శాతం నుండి 14.96 శాతానికి బాగా తగ్గుముఖం పట్టింది. అంటే 2015-16 మరియు 2019-21 మధ్య దాదాపు 135.5 మిలియన్ల మంది పేదరికం నుండి బయటపడ్డారు.అదే సమ యంలో పేదరికం తీవ్రత (సాధారణ పరిభాషలో విపరీతమైన పేదరికం) కూడా47.14 శాతం నుంచి 44.39 శాతానికి తగ్గింది. ఇది స్వాగతించే వార్త. ఇతర వాటాదా రులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న వివిధ లక్ష్య అభివృద్ధి కార్యక్ర మాలకు ఆపాదించ బడవచ్చు.
గ్రామీణ ప్రాంతాల్లో ‘పక్కా’ లేదా సెమీ పక్కా ఇళ్ల సంఖ్య అనేక రెట్లు పెరిగింది.
దాదాపు ప్రతి ఒక్కరి దగ్గర సెల్‌ఫోన్‌ ఉంటుంది, ఎక్కువగా స్మార్ట్‌ ఫోన్లు ఉంటాయి. మోటారుబైక్‌, మరియు సైకిల్‌ కాదు, అత్యంత సాధారణ రవాణా సాధనం.విలేజ్‌ షాపులు వివిధ బ్రాండ్ల వినియోగ వస్తువులతో బాగా నిల్వ చేయ బడతాయి.బాలికలు పాఠశాలలకు వెళుతున్నారు .వ్యవస్థలు మరియు వీడియోగ్రఫీ లేకుండా వివా హాలు జరగవు.ఈ దృశ్యాలు ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ ఖండ్‌ ప్రాం తంలోని ఆకాంక్ష గ్రామాల నుండి వచ్చాయి. నిస్సం దేహంగా,గ్రామీణ ఆర్థిక వ్యవస్థ క్రమంగా మెరుగు పడటం వల్ల ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది.ఈ మార్పులు స్వాగతించదగినవి మరియు 2015-16 మరియు 2019-21 మధ్య గ్రామీణ ప్రాం తాల్లో పేదరికం సంభవం 32.59 శాతం నుండి 19.28 శాతానికి తగ్గిందని సమీక్షలో ఎత్తిచూపిన వాస్తవాలను ధృవీ కరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, వృద్ధి కథనానికి సంబంధించిన ఈ టెల్‌-టేల్‌ సంకే తాలతోపాటు, చర్చలు అవసరమయ్యే కొన్ని ఆందోళ నలు కూడా ఉన్నాయి.
తాళం వేసిన ఇళ్లు
మొదటిది,గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ/అర్బన్‌ ప్రాంతాలకు వలసలు.గ్రామాల చుట్టూ తిరిగితే ఎక్కువ సంఖ్యలో ఇళ్లకు తాళాలు వేసి ఉన్నట్లు తెలుస్తుంది.కార్మికుల కొరత తీవ్రంగా ఉంది కొన్నిసార్లు వ్యవసాయం, ముఖ్యంగా కూరగాయల సాగు దెబ్బతింటుంది.రైతులు వ్యవ సాయంపై ఆసక్తిని కోల్పోతున్నట్లు కనిపిస్తోంది మరియు ఎక్కువ భూమి ‘లీజు’ అమరిక క్రిందకు వస్తోంది,ఇది తరచుగా తక్కువ పెట్టుబడిని మరియు తక్కువ ఉత్పాదకతను కలిగిస్తుంది. రెండవది, పొగాకు/గుట్కా/మద్యానికి వ్యసనం పెరుగుతోంది.దురదృష్టవశాత్తు, చట్ట బద్ధంగా లేదా చట్టవిరుద్ధంగా మద్యం అందు బాటులో లేని గ్రామాలు ఏవీ లేవు.ఇది ప్రజల పని సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపు తోంది.
మూడవది, ‘ఫోన్‌’కి వ్యసనం.
అన్ని వయసుల వారు తమ రోజులో ఎక్కువ భాగాన్ని వివిధ సోషల్‌ మీడియా యాప్‌ లలో గడుపుతున్నారు. ఇది గ్రామీణ ప్రజల శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీ స్తోంది, గ్రామాల్లో సామాజిక నిర్మాణాన్ని దెబ్బతీ స్తుంది మరియు మహిళలు మరియు షెడ్యూల్డ్‌ కులాలపై నేరాలకు దారి తీస్తోంది.ఇది వివిధ తప్పుడు ప్రచారాలకు మరియు కొన్ని సమయాల్లో ‘అఫ్వా’ వ్యాప్తికి దారి తీస్తోంది.
మరొక ప్రధాన సమస్య పరిశుభ్రత మరియు పరిశుభ్రత.స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ఫలితం గా ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించబడ్డాయి, అయితే గ్రామాల్లోని సాధారణ ప్రాంతాలలో అపరిశుభ్రత మరియు అపరిశుభ్రత సమస్యగా కొనసాగుతోంది. గ్రామాల్లో చెత్తాచెదారం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది.గ్రామాలకు సమీపంలో ఎక్కువ ఉపాధి అవకాశాలు, పొగాకు ఉత్పత్తులు మరియు మద్యం లభ్యతను అరికట్టడం, ఇంటర్నెట్‌లో ఎక్కువ సమ యం గడపడం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగా హన ప్రచారాలు మరియు గ్రామ స్థాయిలో వ్యర్థాల నిర్వహణపై దృష్టి సారించి స్వచ్ఛ అభియాన్‌ 2.0 ప్రారంభించడం మార్గం. ముందుకు.
ఆయోగ్‌ అనేది ఈ సమస్యలను పరిష్క రించడానికి క్రియాశీల వాటాదారుల సంప్రదింపు లతో బ్లూప్రింట్‌ను రూపొందించడానికి అవసరమైన ‘ఏజెన్సీ’. సామాజికంగా కూడా ముం దుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది మరియు ఆర్థిక పురోభివృద్ధిని మరింత ఆరోగ్యవంతంగా మరియు అర్థవంతంగా చేయడానికి ప్రజల వ్యక్తిగత జీవనశైలి అంశాలపై పని చేయాలి. (స్వేచ్చా Ûనుసరణ).

మా గ్రామాలను షెడ్యూల్డు ప్రాంతాలుగా గుర్తించాలి

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం శంఖవరం మండలంలోని ఉప ప్రణాళికా ప్రాంతం పెదమల్లాపురం గిరిజన గ్రామంలో ఆది వాసీల సదస్సును జూలై 25న నిర్వహించారు. స్థానిక సామాజిక భవనం నుంచి రామాలయం వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అల్లూరి విగ్రహా నికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పిం చారు. అల్లారికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంత రం గిరిజన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు 5వ షెడ్యూల్‌ సాధన సమితి సమన్వయకర్త పీ.ఎస్‌. అజయ్‌ కమార్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగిం చారు.1950లో భారతదేశంలోని షెడ్యూల్డ్‌ ప్రాం తాలను నాటిరాష్ట్రపతి ప్రకటించినపుడు అందులో చాలా ఆదీవాసీ గ్రామాలను చేర్చలేదని, ఆ కార ణంగా నాన్‌ షెడ్యూల్డ్‌ గ్రామాల ఆదివాసీలు సుమా రు 73సంవత్సరాలుగ వివక్షతకు, దోపిడీకి గురౌతు న్నారని అజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు.ఈ అన్యాయా న్ని1976లోని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని 805 గ్రామాల్నీ కలపి షెడ్యూ ల్డు ప్రాంతాలుగా గుర్తించమని తీర్మానించి, ఆ ప్రతిపాదనను కేంద్ర మంత్రి మండలికి నివేదిం చిందని అజయ్‌ కుమార్‌ వెల్లడిరచారు. 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖరరెడ్డి నాన్‌ షెడ్యూల్డు గిరిజన గ్రామాల ప్రజలకు న్యాయం చేస్తామని శాసన సభలో హామినిచ్చి ఇప్పటికి 16 సంవత్సరాలు గడుస్తున్నాయని అజయ్‌ కుమార్‌ గుర్తు చేసారు. తండ్రి రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీని ఆయన తనయుడైన ముఖ్యమంత్రి జగన్‌ ఇప్పటికైనా సరే నెరవేర్చాలని అజయ్‌ కుమార్‌ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
జూలై 30న శంఖవరం తహాసిల్దార్‌ కార్యాలయం వద్ద ధర్న
గిరిజన సమస్యలకూ పరిష్కారాన్ని కోరుతూ జూలై30న శంఖవరం తహాసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.ధర్నాలో అఖిల భారత ఆదివాసీ సంఘం గౌరవ అధ్యక్షులు రేచుకట్ల సింహాచలం రంప చోడవరంలోని సమగ్ర గిరిజనా భివృద్ధి సంస్థ తన సేవలను కాకినాడ జిల్లాలోని ఉపప్రణాళికా ప్రాంత గిరిజన సమాఖ్య ప్రతినిధి బాలరాజు,జర్తా ముసలయ్య తదితర్లు పాల్గొన్నారు. పెదమల్లాపురం కేంద్రంగా గిరిజన మండలాన్ని ఏర్పాటు చేయా లని, గిరిజన గ్రామాల ప్రజల సమస్యలు అన్నింటినీ పరిష్కరించాలనే అజెండాతో అధికారులకు మెమోరాండం అందజేశారు.
ఆగస్టు 14న విజయవాడలో ధర్నా
విజయవాడలోని ధర్నా చౌక్‌ వద్ద ఆగస్టు 14 న ఒక్క రోజు నిరసన ధర్నా చేపడుతున్నామని ఘాట్స్‌ సంస్థ డైరెక్టర్‌ జర్తా ముసలయ్య తెల్పారు. కాకినాడ జిల్లాతో బాటు మన్యం శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లా నాన్‌- షెడ్యుల్డు ఆదివాసీలు పాల్గొంటారని ఆయన తెల్పారు. కాగా నేటి గిరిజన సదస్సులో మహిళా సంఘాల ప్రతినిధి కించి అప్పలకొండ, అలాగే గిరిజన సంఘాల ప్రతినిధులు బూసరి బాలరాజు, ధారజగన్నాధపురం, జల్దాం పంచాయతీ ఉప సర్పంచ్‌ కాకూరి రాము, గిరిజన పెద్దలు, ఆమూరి చంద్రయ్య, కొపూరు చిన్నప్ప, కించి తమ్మారావు, ముద్ర దొంగబ్బాయి తోపాటు శంఖవరం మండలంలోని ఆరు ఆదివాసీ పంచా యితీల నుంచి గిరిజనులు హాజరయ్యారు.-(జనాస)

డబ్బు చెట్లను పెంచదు..?

మొట్టమొదట, సుప్రీంకోర్టు నియమించిన కమిటీ భారతదేశంలో ఒక చెట్టు ధరను దాని వయస్సుతో గుణించి రూ.74,500గా నిర్ణయించింది.చెట్ల మదింపుపై మార్గదర్శకాలను రూపొందించడానికి ఒక నివేదికలో ఒక చెట్టు యొక్క ద్రవ్య విలువను ప్యానెల్‌ పేర్కొంది. ఒక వారసత్వ వృక్షం పౌర సమాజానికి మరియు పర్యావరణానికి సేవ చేస్తుందని మరియు ఆక్సిజన్‌, సూక్ష్మ పోషకాలు, కంపోస్ట్‌ మరియు బయో-ఎరువులతో సహా వివిధ గణనలపై దాని విలువను చేరుకోవచ్చని నిపుణుల కమిటీ చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఎ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపింది.
వారసత్వ వృక్షం అనేది పెద్ద చెట్టు, ఇది పరిపక్వం చెందడానికి దశాబ్దాలు లేదా శతాబ్దాలు పడుతుంది.100 సంవత్సరాలకు పైగా జీవితకాలంఉన్న వారసత్వ వృక్షం విలువ రూ.1కోటి కంటే ఎక్కువ ఉంటుందని, వందలాదిచెట్లను నరికివేయడానికి ప్రతిపాదించబడిన ప్రాజెక్ట్‌యొక్క ద్రవ్య విలువ చాలా తక్కువఅని కమిటీ తననివేదికలో జోడిరచింది.ప్రాజెక్ట్‌ కారణంగా నరికి వేయ బడుతున్న ఈచెట్ల ఆర్థిక,పర్యావరణ విలువ కంటే.ఫిబ్రవరిలో దాఖలు చేసిన నివేదిక బహిరంగపరచబడిరది.అన్ని ఖర్చులను చెట్టు యొక్క మిగిలిన వయస్సుతో కలిపి మరియు గుణిస్తే..ప్రస్తుత సందర్భంలో 100 సంవత్సరాలలో, మొత్తం చెట్టు సంవత్సరానికి రూ.74,500అవుతుంది. ఇందులో ఒక్క ఆక్సిజన్‌కే ఏడాదికి రూ.45వేలు, ఆ తర్వాత బయోఫెర్టిలైజర్ల ధరరూ.20వేలు.సూక్ష్మ పోషకాలు,కంపోస్ట్‌ ఖర్చులను జోడిరచడం ద్వారా, జీవించే చెట్లు వాటిని నరికివేయబడుతున్న ప్రాజెక్టుల ప్రయోజనాల కంటే ఎక్కువగా ఉంటాయని నివేదిక పేర్కొంది.హైవే ప్రాజెక్టుల కోసం చెట్లను నరికివేయ డానికి బదులు, ట్రాఫిక్‌,రవాణా మౌలిక సదుపాయా లను సులభతరం చేయడానికి ఇప్పటికే ఉన్న జలమా ర్గాలు మరియు రైలు మార్గాలను ఉపయోగించడం వంటి ఈప్రాజెక్టులకోసం ప్రభుత్వాలు మొదట ప్రత్యామ్నాయ ఎంపికలను అన్వేషించాలని కూడా కమిటీ సూచించింది.చెట్లను నరికితే మొదటి ప్రయత్నంగా ఆధునికసాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వాటిని తరలించడమే కాకుండా చెట్లను నరికివేస్తే ఆ స్థలంలో ఐదు మొక్కలు నాటితే సరిపోదని కమిటీ స్పష్టం చేసింది.100ఏళ్ల వృక్షాన్ని,అటువంటి చెట్టును కొన్ని తాజా మొక్కలతో పోల్చలేము. ఒక కిరీటం పరి మాణం ఉన్న చెట్టు కోసం,10మొక్కలు నాటాలని కూడా సూచించిందిబీ మధ్యస్థ కిరీటం పరిమాణంకలిగిన చెట్టుకు 25మొక్కలు మరియు పెద్ద కిరీటం పరిమాణం ఉన్న చెట్టుకు 50 మొక్క లు.కమిటీ నివేదికను భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు సమర్పించింది,ఇది జనవరి 2020లో కమిటీ సభ్యుడిని చెట్ల ద్రవ్య విలువను, అవి విడు దల చేసే ఆక్సిజన్‌ ధర మరియు ఇతర ప్రయోజ నాల ఆధారంగా నిర్ణయించాలని పర్యావరణ శాఖను కోరింది. పశ్చిమ బెంగాల్‌లో ఐదు రైల్వే ఓవర్‌బ్రిడ్జిల నిర్మాణం కోసం 356చెట్లను నరికి వేసిన కేసును విచారించిన కోర్టు,నిషికాంత్‌ ముఖర్జీ (టైగర్‌ ఎన్విరాన్‌మెంట్‌ సెంటర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌), సోహం పాండ్యా (కార్యదర్శి) ఐదుగురు నిపుణు లతో కూడిన కమిటీని నియమించింది.సెంటర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఫర్‌ విలేజెస్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, సునీతా నరైన్‌ (డైరెక్టర్‌,సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌),బికాష్‌ కుమార్‌ మాజి (అసిస్టెంట్‌ చీఫ్‌ ఇంజనీర్‌, Rూదీయూనిట్‌, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం)మరియు నిరంజితమిత్ర (డివిజన్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌,నార్త్‌ 24 పరగణాలు) నివేదిక ఆధారంగా, సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం,పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం మరియు కేసులో ప్రమేయం ఉన్న ఎన్జీ వోల ప్రతిస్పందనలను కోరింది.‘‘కమిటీ సిఫార్సు ప్రతి ప్రభుత్వాన్ని దివాళా తీస్తుంది.కాబట్టి, మేము కొన్ని సూచనలను చక్కదిద్దాలి,’’అని సుప్రీంకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది.
ట్రీ వాల్యుయేషన్‌పై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఆశాకిరణాన్ని అందిస్తున్నాయి
ఇది భారతదేశంలోమొదటిసారి జరి గింది. సుప్రీంకోర్టు నియమించిన సాంకేతిక కమిటీ ఒక చెట్టు విలువను దానివయస్సుతో గుణిస్తే 74,500 రూపాయలుగా అంచనా వేసింది. చెట్టు యొక్క ఈ ద్రవ్య మదింపును నిపుణుల బృందం ఇటీవల సుప్రీంకోర్టుకు సమర్పించింది. భూసేకరణ ప్రక్రియల సమయంలో గొడ్డలిపెట్టిన చెట్ల అంచనా మరియు మదింపుపై మార్గదర్శకాలను రూపొం దించడానికి నివేదిక సహాయం చేస్తుంది. ఒక వార సత్వ వృక్షం సమాజంతో పాటు పర్యావరణానికి కూడా ఉపయోగపడుతుందని, ఆక్సిజన్‌, సూక్ష్మ పోషకాలు, కంపోస్ట్‌ మరియు బయో ఫెర్టిలైజర్‌లతో సహా వివిధ గణనలపై దాని విలువను చేరుకో వచ్చని నిపుణుల బృందం ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బోబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనా నికి తెలిపింది. హెరిటేజ్‌ ట్రీ అనేది పెద్ద చెట్టు, ఇది పరిపక్వం చెందడానికి దశాబ్దాలు లేదా శతా బ్దాలు పడుతుంది మరియు మర్రి,పినస్‌,చినార్‌ మరియు అనేక ఇతరరకాల చెట్ల జాతులను కలిగి ఉంటుంది. భారతదేశంలో వివిధ భూసేక రణ ప్రక్రియల సమయంలో ఫలాలు లేదా ఫలాలు లేని చెట్లను గొడ్డలితో నరకడం వల్ల ప్రభావితమైన ప్రజలకు ముఖ్యంగా రైతులు,తోటల పెంపకందా రులకు ఈ నివేదిక సహాయం చేస్తుంది. కాశ్మీర్‌లోని బాధిత రైతులు-ముఖ్యంగా బుద్గామ్‌ మరియు శ్రీనగర్‌లలో-ఇప్పుడు శ్రీనగర్‌ రింగ్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌ అలైన్‌మెంట్‌లో వచ్చే చెట్లకు న్యాయమైన పరిహారం లభిస్తుందని భావిస్తున్నారు. సుప్రీంకోర్టు ప్యానెల్‌ ముందు సమర్పించిన నివేదిక బాధిత రైతులకు భూమి మరియు చెట్లకు ముఖ్యంగా ఫలాలను ఇచ్చే చెట్లకు న్యాయమైన నష్టపరిహారాన్ని కోల్పోయి నందున వారికి సహాయకరంగా ఉండవచ్చు. సుప్రీం కోర్టు నియమించిన ప్యానెల్‌ రూపొందించిన ద్రవ్య మదింపు బాధిత పండ్ల పెంపకందారులకు లేదా ఈ ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణానికి మార్గం సుగమం చేయడానికి పాప్లర్‌, విల్లోలు, కిక్కర్లు మొదలైన పండ్లను పండిరచని వారికి కూడా సహాయం చేస్తుంది’’అని శ్రీనగర్‌ కేంద్రంగా ఉన్న పర్యావరణ విధాన గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు సయ్యద్‌ నసరుల్లా అన్నారు. ‘‘భూమికి సంబంధించి నంతవరకు, ఇప్పటికీ అనేక గ్రామాలలో రైతుల ఆధీనంలో ఉంది, ముఖ్యంగా వత్తూరు ప్రాంతంలో పరిహారం చెల్లించలేదు. రద్దు చేయబడిన జె.కె భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం భూమిని లాక్కోవాలనుకుంటోంది.ఇది ఆమోదయోగ్యం కాదు. 31 అక్టోబర్‌ 2019 నుండి జెకెలో వర్తించే న్యాయమైన పరిహారం చట్టంప్రకారం తాజా నోటిఫికేషన్‌ జారీ చేయవలసి ఉందని నస్రుల్లా చెప్పారు. జమ్మూ మరియు కాశ్మీర్‌ హైకోర్టు కూడా ఈ విషయంలో ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులో ఒక దిశానిర్దేశం చేసింది ‘‘కానీ గత నాలుగు నెలలుగా,జెకె పరిపాలన దాని ప్రతిస్పందనను సమ ర్పించడంలో విఫలమైంది’’ అని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తన నివేదికలో 100 సంవత్సరాలకు పైగా జీవితకాలం ఉన్న వారసత్వ వృక్షం విలువ 1 కోటి కంటే ఎక్కువ ఉంటుందని మరియు వందలాది చెట్లను నరికి వేయడానికి ప్రతిపాదించబడిన ప్రాజెక్ట్‌ యొక్క ద్రవ్య విలువను కూడా పేర్కొంది.ప్రాజెక్ట్‌ కారణంగా నరికివేయబడుతున్న ఈచెట్ల ఆర్థిక మరియు పర్యా వరణ విలువ కంటే చాలా తక్కువ. సోనామార్గ్‌ అడవుల్లో కొనసాగుతున్న జోజిలా టన్నెల్‌ ప్రాజెక్ట్‌ కోసం ముందస్తు అనుమతి లేదా సమాచారం లేకుండానే ఓ ప్రైవేట్‌ కంపెనీ ఇటీవల వందలాది చెట్లను నరికివేయడం గమనార్హం. గైడ్‌లైన్స్‌ ప్రకారం, కంపెనీ మరియు అటవీ అధికారుల నుండి ఖర్చులను పరిపాలన ఇప్పుడు గుర్తించ గలదా? కమిటీ నివేదిక ప్రకారం, అన్ని ఖర్చులను కలపడం మరియు ఒకచెట్టు యొక్క మిగిలిన వయస్సుతో గుణిస్తే, ప్రస్తుత సందర్భంలో 100 సంవత్సరాలలో,మొత్తం చెట్టు సంవత్సరానికి 74,500 రూపాయలు అవుతుంది. ఇందులో ఒక్క ఆక్సిజన్‌కే ఏడాదికి 45,000రూపాయలు, ఆ తర్వాత బయోఫెర్టిలైజర్‌ల ధర 20,000 రూపా యలు. సూక్ష్మపోషకాలు మరియు కంపోస్ట్‌ ఖర్చులను జోడిరచడం ద్వారా, జీవించే చెట్లు వాటిని తగ్గించే ప్రాజెక్ట్‌ల ప్రయోజనాల కంటేఎక్కువగా ఉంటాయని నివేదిక పేర్కొంది. బుద్గాం,శ్రీనగర్‌ జిల్లాల్లోని వథూరా,గుడ్‌సథూ,ఇచ్‌గాం,రణ్‌బీర్‌గ్రాప్‌ా గ్రామా ల రైతులు యాపిల్‌, రేగు,పియర్‌ తదితర పండ్ల చెట్లను ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం అంచనా వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.కానీ బాధిత రైతు లకు కొన్ని సంవత్సరాల క్రితం 1995 నాటి రేట్ల ప్రకారం చాలా తక్కువ పరిహారం చెల్లించబడిరది -కిలోఆపిల్‌కు 16రూపాయలు మరియు కిలోగ్రాము ప్లంకు 13రూపాయలు. వాల్యుయేషన్‌ సమయంలో ఒక్కోచెట్టుకు పండిన పండ్ల పరిమా ణాన్ని కూడా సరిగ్గా లెక్కించలేదని కొందరు రైతులు ఆరోపించారు.జెకెపరిపాలన సుప్రీంకోర్టు మార్గ దర్శకాలను అమలు చేయడంలో ముందుండాలి. ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించాలి. (ద న్యూ మినిట్స్‌ డాట్‌ కమ్‌ సౌజన్యంతో..)-గునపర్తి సైమన్‌

1 2 3 4 5 6 11