వైవిధ్యం వారి జీవనం

‘‘ స్వచ్ఛమైన సెలయేళ్లు. దట్టమైన అడవులు. గంభీరమైన కొండలు. పక్షుల కిలకిలారావాలు. పచ్చని ప్రకృతి అందాలు. వీటి మధ్య శతాబ్దాల సంస్కృతులకు గుర్తుగా, వెనకబాటుతనానికి సజీవ సాక్ష్యంగా.. పాలకుల ఆలనకోసం ఎదురు చూస్తూ అమాయక ఆదివాసీ జనం నివసిస్తోంది. అడవితల్లి బిడ్డలుగా.. ప్రకృతి ఒడే ఆవాసంగా.. దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుని.. ప్రకృతి ప్రసాదిత ఫలాలతో సహవాసం చేస్తోంది. విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలకు నోచుకోని గూడేలెన్నో కనిపిస్తాయి. దశాబ్దాలుగా గిరిజనులు సమస్యలతోనే సహవాసం చేస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యానికి బలైపోయారు. కానీ ఇప్పుడిప్పుడే వారి సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. వారి జీవితాల్లో మార్పు కోసం తాజా సర్కారు నడుం బిగించింది. గిరిజనులకు పాలనలో పెద్దపీట వేసింది. ఏకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టి సముచిత గౌరవం కల్పించింది. కట్టు, బొట్టు, ఆచార వ్యవహారాలు, తినే ఆహారం ఇలా.. ఆదివాసీలవన్నీ ప్రత్యేకంగానే ఉంటాయి. ఏళ్ల తరబడి అడవిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. రాజ్యాంగంలో నిర్దేశించిన నిబంధనల ప్రకారం అటవీప్రాంతంలో స్థిర నివాసం కలిగిన 33 తెగల సమూహాలను ఆదివాసీలుగా గుర్తించారు. ఎక్కువమంది అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గిరిజన జీవనం విభిన్నంగా ఉంటుంది. సంబరాలు, వివాహ వేడుకలు, ఆరాధనల ఆచారాలు, మనిషి మూలాలను తేటతెల్లం చేస్తుంటాయి. తరాలు మారినా వారి అలవాట్లు, కట్టుబాట్లు ఇప్పటికీ మారలేదు. ఇక్కడ జరిగే వివాహ వేడుకల్లోని సంప్రదాయాల్లో భాగంగా చెట్టును ఆరాధిం చే విధానాలు ప్రపంచ శాంతి సౌభాగ్యానికి సందేశాన్ని పంపుతుం టాయి. ఏ పల్లెకు వెళ్లినా గిరిజనుల సంబరాలు, పండుగ సందడులన్నీ ఒకే రకంగా కొనసాగితే పెళ్లిళ్లు మాత్రం ప్రకృతి ఆరాధనతో ముడిపడి ఉంటాయి. ప్రాణాధారమైన నీరు, అది లభించడానికి అవసరమైన చెట్టు చుట్టూనే వారి తంతు తిరుగుతుంది. పాటలు, థింసా నృత్యాలు ఇక్కడి గిరిజనుల పండుగలు, శుభకార్యాల్లో భాగం.’’

Read more

అరణ్యపర్వం

‘బూర్జగూడా’’ అనే సవరగిరిజన గూడెంలోని,ఇస్రు,బొంతు, కొయ్యం,అనే ముగ్గురు అడవి బిడ్డలు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, చెప్పిన ‘‘కామ దేను పాడి పథకం’’మాయలో పడి ఎలా మోస పోయి కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది..అక్కడ మెజిస్ట్రేట్‌ ముందు’’కొయ్యం’’ తమ తప్పిదానికి గల నేపథ్యం చెప్పి వేడుకోవడంతో ఈ ‘‘అరణ్య పర్వం’’ కథ ముగుస్తుంది. ఈకథ జరిగిన కాలం 1976 సంవత్సరం కాగా,రచనాకాలం1987 వ సంవత్సరం, అరుణ తార త్రై మాస పత్రిక (ఆగస్టు-అక్టో బరు 1987 సంచిక)లో తొలిసారి ప్రచురించ బడిరది.
తొలి తెలుగు కథానిక జన్మభూమి ఉత్తరాంధ్రకు చెందిన ఉత్తమ కథా రచయితల్లో ఒకరు ‘‘అట్టాడ అప్పలనాయుడు.’’ అనేక జీవన పోరాటాలను అరణ్యజీవుల సాక్షిగా అనుభవించి అంచెలంచెలుగా ఎదిగిన అక్షర శిఖరం ఆయన. అనేక చిరు ఉద్యోగాల పిదప చేతికందిన బ్యాంకు ఉద్యోగి గిరి చేస్తూనే తన అనుభవాలతో మదిలో మెదిలిన ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చి అనేక కధలు నవలలు రచించిన సాహితీ నాయకుడు తను. జీవనం రీత్యా, ఉద్యోగరీత్యా, తన ప్రాంతంలో నిత్యం చూసే సవర జాతి గిరిజనుల జీవిత గాధలే అప్పలనాయుడు రాసిన కథలు. అరణ్య వాసుల అభివృద్ధి మీద,వారి ఎదుగుదల గురించి,ప్రభుత్వాలు అధికారులు చేస్తున్న స్వార్ధపు ఆలోచనవల్ల వారి ఎదుగుదల కన్నా నష్టాలతో కూడిన నష్టాలే అధికం అనే కొత్త ఆలోచనను,ఉదాహరణ పూర్వకంగా వివరిం చారు రచయిత తన ‘‘అరణ్యపర్వం’’ ద్వారా. ఈకథ జరిగిన కాలం 1976 సంవత్సరం కాగా,రచనాకాలం1987వ సంవత్సరం, అరుణ తారత్రై మాస పత్రిక (ఆగస్టు-అక్టో బరు 1987 సంచిక)లో తొలిసారి ప్రచురించ బడిరది. ఇక కథ విషయానికొస్తే ‘‘బూర్జగూడా’’ అనే సవరగిరిజన గూడెంలోని,ఇస్రు,బొంతు, కొయ్యం,అనే ముగ్గురు అడవి బిడ్డలు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, చెప్పిన ‘‘కామ దేను పాడి పథకం’’మాయలో పడి ఎలా మోస పోయి కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది.అక్కడ మెజిస్ట్రేట్‌ ముందు’’కొయ్యం’’ తమ తప్పిదానికి గల నేపథ్యం చెప్పి వేడుకోవడంతో ఈ ‘‘అరణ్య పర్వం’’కథ ముగుస్తుంది. వాస్తవంగా కథలోని ఈ కొందరు గిరిజనులే కాదు..ఈదేశంలోని సమస్త అడవిబిడ్డల గోస,గోడుకు,ఈకథ అద్దం పడుతుంది.‘‘నమ్మకానికి ప్రతిరూపాలైన అడవి బిడ్డలు,తేడా వస్తే తిరుగుబాటుకు చిరునామాలుగా మారి పోతారు’’ అనే నిండు నిజం రచయిత ఈకథ ద్వారా చక్కగా చెప్పారు. కథలోని ప్రతి సంఘటననూ పలుకుబడులను గిరిజన సామాజిక చిత్రణ చేయడంలో నాయుడు శత శాతం విజయం సాధించారు.
సాధారణంగా అడవిలోని గిరిజనులు ఎవరిని నమ్మరు.నమ్మితే సర్వస్వం అర్పిస్తారు. ఆడిన మాట అస్సలు తప్పరు. తమ గూడెంలోకి కాకిబట్టల వారు వచ్చిన.. తెల్లబట్టల వారువచ్చిన… వారిని గూడెంలోకి రానివ్వరు. సరికదా వారు అడిగిన సమాచారం కూడా చెప్పారు. దానికి నిరూపణ కథ ప్రారంభంలో పోస్ట్‌ మేన్‌ కథకు కారకులైన ఇస్రూ,బొంతు, కొయ్యం,ల చిరునామాలు దొరికించు కోవడంలో పడ్డ ఇబ్బంది. చివరకు ఆగిరిజనులు తమకు వచ్చిన బ్యాంకు బాకీల బాపతు కోర్టు నోటీసులు చదువుకునే శక్తిలేక పోస్ట్‌ మేన్‌ను, బ్రటిమిలాడుకోవడం, నోటీసులు చదివి పెట్టినందుకు అతనికి ఇస్తామన్నా జీలుగకల్లు, కందులు,చిన్నకోడి,మాట తప్పకుండా అతనికి ఇవ్వడంలో అడవి బిడ్డల నీతి నిజాయితీ కళ్లకు కట్టారు రచయిత. కోర్టు నోటీసులు సారాంశం తెలుసుకున్న ఆఅడవి బిడ్డలు, రాబోయే ప్రమాదం తలుచుకుని దానికి గల కారణాలను,గతంలోకెళ్లి ఆలోచనలగుండా వెతుకులాట ద్వారా విషయాన్ని పాఠకులకు పరిచయం చేస్తారు రచయిత. గిరిజనులు ఆరుగాలం పడ్డ కష్టాన్ని బాకీలు,వడ్డీలు,రూపంలో దోచుకునే ‘‘వడ్డీ వ్యాపారులు’’ తక్కువ తూకాలు,నాసిరకం వస్తువులతో మోసం చేసే చిల్లర వ్యాపారులతో ఒకపక్క, నానా యాతనలు పడి అనేక విధాల నష్టం పోతుంటే అదిచాలదు అన్నట్లు.. మరోపక్క ప్రభుత్వ పథకాలు, ఉచితాలు,సబ్సిడీలపేరుతో బ్యాంకులు,గిరిజన అభివృద్ధిశాఖ వారు, గిరిజనుల అభివృద్ధి పేరుతో చేస్తున్న కార్యకలాపాల ద్వారా, ‘‘వారి వికాసం కన్నా వినాశనమే అధికంగా ఎలా జరుగుతుందో’’ రచయిత చెప్పే ప్రయత్నంలో ఈ కథ నడుస్తుంది. గిరిజనులకు జరుగుతున్న అన్యాయాల నుంచి వారిని రక్షించే నెపంతో వారిని సంఘ విద్రోహ శక్తులైన నక్సలైట్లు ఎలా ఆకర్షిస్తారు. వారిద్వారా గిరిజనులు పొందిన ఊరట తాలూకు విషయాలు కూడా ఇందులో ప్రస్తావించబడతాయి. ఒకరోజు బూర్జగూడెంకు అడవిదారి గుండా అష్టకష్టాలుపడి ప్రజా ప్రతి నిధి ఆప్రాంత రిజర్వుడు ఎమ్మెల్యే, సీతంపేట బ్యాంక్‌ అధికారులు,వచ్చి అక్కడి గిరిజనుల అందరినీ సమావేశపరిచి,వారు అనవసరంగా పని పాట లేక నక్సలైట్లు, అభ్యుదయ సంఘాల చెంతచేరి విలువైన సంసా రాలు నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం గిరిజనుల మేలు కోరి వారి ఆర్థికఅభివృద్ధి ఆశించి పెట్టిన’’కామధేనుపథకం’’ గురించి వారికి నమ్మకం కుదిరేట్టు,ఒక్కొక్కరు వివరిస్తారు. తమ జాతి వాడే అయిన ఎమ్మెల్యే కూడా ప్రభుత్వం వారి ‘‘కామదేను పథకం’’కు అను కూలం అంటే ఇక ఆఅడవి బిడ్డలు మారు ఆలోచన చేయరు, గూడెం మొత్తం వారి అనుమానాలు పక్కనపెట్టి ఆ పధకంలో చేరిపోతారు. అధికంగా పాలు ఇచ్చే మేలు జాతి గేదెలు కొనుగోలు మొదలు ఆఖరికి ఆ పాలను కొనే పాలకేంద్రం వరకు, అందరి చేతుల్లో ఘోరంగా మోసపోయిన ఆడబిడ్డలు,చివరికి తమ ప్రాంతపు ఆహారం వాతావరణం పడక మేలుజాతి అనుకున్న గేదలు కూడా చనిపోవడంతో వారికి ఆదాయం బదులు అప్పులు మిగిలాయి,సరికదా అన్నకాలానికి అప్పు కట్టనినేరానికి కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది. పోస్ట్‌ మేన్‌అందించిన బ్యాంకు నోటీసు వల్ల వాళ్ళల్లో కలిగిన అలజడి ఆలోచనల ద్వారా గత నేపథ్యం తెలుసుకున్న పాఠకులు,వర్ధమానం లోకి వచ్చాక చివరి ఘట్టం కోర్టు భవంతిలోకి ప్రవేశిస్తారు. రుణ గ్రస్తులైన గిరిజనులను‘‘బ్యాంకు బాకీ ఎందుకు తీర్చలేదు? పథకంలో వచ్చిన గేదెలు ఏమయ్యాయి?’’ అని ప్రశ్నించిన న్యాయమూర్తి ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి ధైర్యం కూడా తీసుకుని తనదైన బాణిలో భాషలో ‘‘కుయ్యం’’ చెప్పుకు పోతాడు. గత నలభై ఏళ్ల నుంచి తాము మోసపోతున్న తీరు ఎవరు ఎలా మోసం చేసి తమ శరీర కష్టాలను దోచుకుంటున్నారు కొయ్య న్యాయమూర్తి కళ్లకు కట్టినట్టు ఒక్కొక్కటి చెప్పుకు పోతాడు. ఇలాంటి కష్టకాలంలో తమ కుల దేవత కనికరించి తమ గుండెలకు సంగాన్ని పంపిందని,దేవతల జెండాలు పక్కన సంగపు జెండాలు ఎగరే సామని, చెబుతూ షావుకార్లునుంచి అక్రమ బాకీల కోసం గుంజుకున్న భూములు విడిపించుకోవడం, వ్యాపారులు చేసే మోసాలను, ఎదుర్కొన్న తీరు. మొదలైనవి చెబుతూ సంగం వాళ్లబతుకుల్లో చీకటినితుడిచి వెలుతురు నింపిన తీరును అంత భయం లోనూ అంతమంది లోనూ ధైర్యంగా చెప్పుకు పోతాడు కొయ్యం.
‘‘ఇంత చేసినా లాభం ఏముంది? పాలకులు కన్నెర్ర చేసి సంఘ వ్యతిరేకులుగా ముద్ర వేసి గుడిసెలుతగలబెట్టి, మా గూడేల మీద తుపాకి గురి పెట్టారు, ఎందరినో నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపి నక్సలైట్ల ఖాతాలో జమ చేశారు, ఏసం ఘాల ఆదరువులేక దిక్కులేని పక్షులుగ మిగిలి పోయివలసలు పోయినం,ఆఖరికి ఏదో చేస్తామని ఆశ చూపి పథకాలని,సబ్సిడీలని, మాయమాటలు చెప్పి చివరికి మమ్ములను నేరగాళ్లను చేసి ఇక్కడకు రప్పించారు ‘‘…. అంటూ గుండెల్లో పొంగిపొర్లుతున్న బాధనంతా న్యాయమూర్తి ముందు చెప్పు పోయినాడు తను. తమకు పాలకేంద్రం వాళ్లు పాలు పోసినందుకు ఇచ్చిన రశీదు ముక్కలు తప్ప తమ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని, ప్రతినెల బ్యాంకు బాకీ పాలకేంద్రంవారే చెల్లిస్తామని చెప్పిన మాటలు నమ్ముకొని చివరికి అన్నీ కోల్పోయి తమ బతుకులు కోర్టుపాలయ్యాయి అని ఆవేదనతో చెపుతాడు. చివరికి ఈ ఆధునిక సమాజం తమకు వద్దని, తమదైన అడవి సమాజమే చాలని, ఈ కుట్రలు మోసాలను, పడలేమని ఇది తమ జాతి అందరి గోస అని గోడు పెట్టుకోవడంతో…… న్యాయమూర్తి ఆలోచనలో పడి, న్యాయశాస్త్రానికి చిక్కని జన జీవితం గురించి చెప్పిన గిరిజనుడి బాధ అర్థం చేసుకున్న న్యాయమూర్తి చలించినా….. కేసు వాయిదా వేయడంతప్ప, ప్రస్తుతానికి ఏమీ చేయలేని ఆయన అక్కడనుండి నిష్క్రమించడంతో…కధ ముగుస్తుంది .గిరిజనుల అభివృద్ధి లక్ష్యంతో ప్రభుత్వ పెద్దలు, అధికారులు, ప్రవేశపెడుతున్న పథకాలు ప్రయోజనకరమైనవి అయినా, స్వార్థపు బుద్ధిగల మధ్యవర్తుల ఆచరణ లోపాల కారణంగా, అభివృద్ధి పథకాలు నిర్వీర్యంఅయ్యి తద్వారా అడవి బిడ్డలు అనేక కష్టాలపాలై ఆర్థికంగా నష్టాల పాలవుతున్నారు, అనే ఇతివృత్తంతో చెప్పబడ్డ ఈ‘‘అరణ్యపర్వం’’ కథకు,.పేరు పెట్టడం మొదలు ముగింపు వరకు రచయిత ‘అట్టాడ అప్పలనాయుడు’ గారు తీసుకున్న శ్రద్ధ ఆచరణీయంగా సముచితంగాఉంది. ప్రతి సందర్భం విషయం కూడా కథకు అన్వయించడం, సందర్భోచితమైన నానుడులు ఉపయోగించడం… రచయితలోని పరిణితి, ప్రతిభకు, నిదర్శనాలుగా నిలిచాయి. మహాభారత కథ లోని పాండవులు అన్యాయంగా శిక్షించ బడి అరణ్యవాసం చేసిన సంఘటన మాదిరి అడవి బిడ్డలు కూడా అన్యాయాలకు గురైన అనవసరపు శిక్షలు అనుభవిస్తున్నారనే భావనతోనే రచయిత ఈ కథకు ‘‘అరణ్యపర్వం’’ అని పేరు పెట్టారు అనిపిస్తుంది. కథా లక్ష్యంలో …విషయాన్ని వివరించడమే తప్ప పరిష్కార మార్గం కానీ, చైతన్యం ఇవ్వడం కానీ కనిపించవు. కథ ముగింపు పాఠకుల ఆలోచనకే వదిలి వేయబడిరది. ఇది ఒక రకంగా ‘‘ఆరణ్య వాసుల జీవన చిత్రణ’’ను నూతనకోణంలో నమోదు చేయడం కోసమే వ్రాయబడిరది అనిపిస్తుంది. ఒక ప్రత్యేక జీవనంతో జీవించే అడవిబిడ్డల జీవనశైలిలోని భాగాలను ఇలా కథల రూపంలో నమోదు చేయడంవల్ల భావి కథ చరిత్ర పరిపుష్ఠం చెందడానికి ఎంతో దోహదం అవుతుంది.
(వచ్చే మాసం మీ కోసం జీవన్‌ కథ ‘‘పోటెత్తిన జన సంద్రం’’ విశ్లేషణ- డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు, ఫోను: 77298 83223

ప్రజల సిరులు ప్రైవేటు పాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన దరిమిలా లాభాలు ఆర్జిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం లేక అమ్మివేసే (దీనినే -వ్యూహా త్మక పెట్టుబడుల ఉపసంహరణ అంటారు) ప్రక్రి యను ప్రత్యేక శ్రద్ధాసక్తులతో అమలు చేసేందుకు కృషి చేస్తూ ఉంది. దేశ ప్రజానీకానికి పలు విధాలుగా సేవలందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలు భార తీయ రైల్వేలు, ఎయిర్‌పోర్టులు, సీపోర్టులు, పవర్‌గ్రిడ్‌, ట్రాన్స్‌మిషన్‌ లైన్లు, జాతీయ రహదార్లు మున్నగువాటిని దేశీయ, విదేశీ బడా కార్పోరేట్‌ కంపెనీలకు అప్పగిం చడం కోసం ‘మానిటైజేషన్‌ పైప్‌ లైన్‌’ విధానాన్ని శరవేగంగా అమలుచేసేందుకు పూనుకున్నది. గతంలో నష్టాలతో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలలో కొంత వాటాను కానీ, సంస్థను పూర్తిగా కానీ అమ్మివేసే ప్రక్రియ ఆర్థిక సంస్కరణలలో భాగంగా కొనసాగుతూ వస్తోంది. 2014కి పూర్వం పదేండ్లు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వాల హయాంలో ఆ ప్రైవేటైజేషన్‌ ప్రక్రియ నిదానంగా కొనసాగుతూ వచ్చింది. కొన్ని సంస్థలలో 25శాతం లోపు పబ్లిక్‌ ఇష్యూ ద్వారా కొంతమేరకు ప్రైవేటీకరణ జరిగింది.
2019 సార్వత్రిక ఎన్నికలలో లోక్‌సభ లో తిరుగులేని మెజారిటీ సాధించిన బిజెపి ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ ఆస్తుల (ప్రజా ఆస్తులు)ను కారుచౌకగా బడా పెట్టుబడిదారులకు అప్పజెప్పేం దుకు దృఢనిశ్చయంతో ముందుకు సాగుతోంది. ఈ అమ్మకాలను సదరు ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేస్తున్న కార్మికులు,ఉద్యోగులకు మాత్రమే సంబంధించిన వ్యవహారంగా ప్రజలు భావించ కూడదు. స్వాతంత్య్రం పొందిన తొలినాళ్ళలో టాటా,బిర్లా లాంటి కొద్దిమంది బడా పారిశ్రామిక వేత్తలు తప్ప, దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన పెట్టుబడులు పెట్టగల స్థోమత ప్రైవేట్‌రంగానికి లేకపోయింది. తత్కార ణంగా విద్యుదుత్పత్తి,ట్రాన్స్‌మిషన్‌,రైల్వేలు, జాతీయ రహదారులు,పెట్రోలియం,ఫార్మాస్యూటికల్‌, నౌకా శ్రయాలు,ఎయిర్‌పోర్టులు,వంటి వాటిలో ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటయ్యాయి. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన ధనం,బ్యాంకుల నుంచి రుణా లు,కార్మికులు,ఉద్యోగుల శ్రమవగైరాలతో ఈ సంస్థ లు అభివృద్ధి చెందాయి. వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు వల్ల కొంతమేరకు అభివృద్ధి వికేంద్రీకరణ జరగడంతోపాటు, వాటికి అనుబం ధంగా ప్రైవేట్‌ రంగంలో కొన్ని పరిశ్రమలు ఏర్పాట య్యాయి. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఐడిపి ఎల్‌ ఏర్పాటు కావడంతో అనంతరకాలంలో పలు ఫార్మాస్యూటికల్‌ సంస్థలు ఏర్పాటయ్యాయి. దీనితో హైదరాబాదుకు విశిష్టస్థానం లభించింది. ప్రభుత్వ రంగ సంస్థలయినందున రిజర్వేషన్‌ సూత్రాన్నను సరించి ఎస్‌సి,ఎస్‌టి వర్గాలకు చెందిన వారికి ఉపాధి లభించి, కొంతమేరకు సామాజిక న్యాయం జరిగింది. మోదీ సర్కార్‌ కొద్ది సంవత్సరాలుగా ప్రభుత్వరంగ సంస్థలకు ఉన్న రిజర్వ్‌ను, మిగులు మొత్తాలను వ్యూహాత్మకంగా ఉపసంహరిస్తూ వాటి విలువ తగ్గేందుకు పావులు కదిపింది. ప్లానింగ్‌ కమిషన్‌ స్థానంలో ఏర్పాటైన ‘నీతి ఆయోగ్‌’కు ఏఏ సంస్థలను ప్రైవేటీకరించాలో సూచించాల్సిన బాధ్య తను అప్పగించింది. 38సంస్థలను ప్రైవేటీకరిం చాలని,26సంస్థలను మూసివేయాలని,10 సంస్థ లను అమ్మివేయాలని నీతి ఆయోగ్‌ సూచించింది. 50శాతం షేర్‌ హోల్డింగ్‌ కన్నా తక్కువ శాతాన్ని ప్రైవేటీకరించినప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సంస్థ కొనసాగుతుంది. సదరు సంస్థకు మార్కెట్‌లో షేర్‌ వాల్యూ ప్రకారం కొంత ధనం చేకూరుతుంది. ప్రభుత్వరంగ సంస్థను అమ్మినపుడు, మేనేజ్‌మెంట్‌ మార్పిడి జరిగినపుడు సదరు సంస్థ రిజర్వ్‌ ప్రైస్‌ లెక్కించేటప్పుడు,ఆసంస్థకు ఉన్నభూమి, ఇతర భౌతిక ఆస్తుల మార్కెట్‌ విలువను కూడా జోడిరచాలని డిజిన్వెస్ట్‌మెంట్‌ కమిషన్‌ సూచించింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తి కాంత దాస్‌ 2016 మార్చి4నచేసిన ఒక ప్రకటనలో పిఎస్‌యుని అమ్మేస్తున్నప్పుడు సందర్భంలో, యాజ మాన్యం ప్రభుత్వం నుంచి కొనుగోలుదారునికి మారిన సందర్భంలో భూమి విలువను కూడా రిజర్వ్‌ప్రైస్‌లో చేర్చుతామని స్పష్టంగా చెప్పారు. అయితే మోదీ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌, బిపిసిఎల్‌ వంటి పలు సంస్థల స్ట్రాటజిక్‌ అమ్మకాల విషయంలో ఈసూత్రాన్ని విస్మరించడం పలు అను మానాలకు తావిస్తోంది. విమానాశ్రయాల ప్రైవేటీకరణ సందర్భంగా ఒకే సంస్థకు రెండిరటిని మించి ఇవ్వరాదని ఉన్నతస్థాయి కమిటీ చేసిన సిఫారసును ప్రక్కనపెట్టి గౌతమ్‌ అదానీకి 6 ఎయిర్‌ పోర్టులను కట్టబెట్టడం, సిబిఐతో దాడులు నిర్వ హించి ప్రైవేట్‌ సంస్థ యాజమాన్యాలను భయపెట్టి సదరు సంస్థలను అదానీ ఖాతాలోకి వెళ్ళేట్లు కృషిచేయడం వంటి కారణాలవల్ల ఆ రెండు సంస్థ లను గౌతమ్‌అదానీ,ముఖేష్‌అంబానీ,అనిల్‌ అంబా నీలకు కట్టబెట్టేందుకే మోదీ ప్రభుత్వం కృతనిశ్చ యంతో ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారు.
ప్రజల సుదీర్ఘ పోరాటం, ఎంపీలు, ఎంఎల్‌ఎల రాజీనామాలు,32మంది ఆంధ్రుల ప్రాణత్యాగం ఫలితంగా ఏర్పాటైన ఉక్కు ఫ్యాక్టరీని ఈనాడు నూటికి నూరుశాతం అమ్మివేయడం గానీ, మూసివేయడం గానీ జరుగుతుందని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ పదేపదే ప్రకటిస్తున్నారు. దాదాపు 30వేలఎకరాలు స్టీల్‌ప్లాంట్‌ కిందఉంది. ఆభూమి బుక్‌వాల్యూను రూ.56 కోట్లుగా ప్రభుత్వం లెక్కవేస్తోంది.మార్కెట్‌ విలువ కనీసం రూ.60 వేల కోట్లు ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నప్పటికీ వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ రిజర్వ్‌ప్రైస్‌ గురించి సమా చారాన్ని కేంద్రం ప్రకటించకపోవటం దుర్మార్గం. అలాగే లక్షలకోట్లు రూపాయల ఆస్తులతో వేలకోట్లు లాభాలను ఆర్జిస్తున్న 2వ అతి పెద్ద చమురు సంస్థ బిపిసిఎల్‌ను కొద్ది వేలకోట్ల రూపాయలకే అమ్మి వేయాలనుకోవడం అత్యంత దురదృష్టకరం. ప్రభుత్వ ఆస్తుల అమ్మకం ద్వారా లభించే ధనాన్ని తిరిగి నూతనంగా మౌలిక వసతులు కల్పించేందు కు, విద్యా,వైద్యరంగాలలో ఖర్చుచేయడానికి విని యోగిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీర్ఘకాలం కిందట అత్యంత తక్కువ ధరలలో భూములను, పరిశ్రమలను,మౌలిక వసతులను ఏర్పాటు చేసుకుని, అభివృద్ధి చేసినవాటిని 25 నుంచి 50 సంవత్సరాల కాలవ్యవధితో కారుచౌకగా బదలాయిస్తూ, ఇప్పుడు కొత్తగా మౌలిక వసతులను పెంపొందిస్తామని చెప్పడం కంటే నయవంచన మరొకటి ఉండదు. మోదీ ప్రభుత్వం ఇంతవేగంగా ప్రభుత్వరంగ సంస్థలను అమ్మాలనుకోవడం,‘మానిటైజేషన్‌ పై ప్‌లైన్‌’ అమలుచేయాలనుకోవడానికి బలమైన కారణం ఉంది. యుపిఎ ప్రభుత్వంలో కంటే మోదీ ప్రభుత్వంలో బడా కార్పొరేట్‌ సంస్థలకు చాలా హెచ్చుస్థాయిలో రుణాల మంజూరు ప్రక్రియ కొనసాగడమే కాక మొండిబాకీల పరిమాణం చాలా అధిక స్థాయికి చేరింది. 2013-14నాటికి బ్యాం కులకు తిరిగి రాకపోవచ్చని భావించిన రుణాల మొత్తంరూ.2.05 లక్షల కోట్లు ఉండగా 2018–19 నాటికి ఆ మొత్తం 11.73లక్షల కోట్లకు పెరిగింది. మనదేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ ద్వారా బట్వాడా అవుతున్న రూ.100రుణంలో రూ.16లు కేవలం 20 అధిక స్థాయి రుణగ్రహీతల ఖాతాలకు వెళ్తోంది. 2018-19లో కూడా ఈ 20 ఖాతాల మొత్తం రుణాల పరిమాణం రూ10.94 లక్షల కోట్ల నుంచి రూ.13.55 లక్షల కోట్లకు పెరిగింది. మొత్తం పారిశ్రామిక రంగంలో ఉన్న10కోట్ల చిన్న, సూక్ష్మ,మధ్య తరహా పరిశ్రమలలో 30 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. భారీపరిశ్రమల రంగం లో కేవలం 1 కోటి మందికి ఉపాధి లభిస్తోంది. భారీ పారిశ్రామికరంగానికి రూ.24 లక్షల కోట్లు, సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు 3.75 లక్షల కోట్లు, మధ్యతరహా పరిశ్రమలకు రూ 1.06 లక్షల కోట్లు రుణం లభించింది. మొత్తం పారిశ్రామికరంగానికి అందిన రుణ సదుపాయంలో 50శాతం పైన ఈ 20అధికస్థాయి రుణగ్రహీతలకు లభించడం ఆశ్చర్యకరం. కార్పొరేట్లు లక్షల కోట్ల రూపాయలు తిరిగి చెల్లించనందున కేంద్రప్రభుత్వం రిజర్వ్‌ బ్యాంకు ద్వారా బ్యాంకులకు ‘క్యాపిటల్‌ ఇన్‌ఫ్యూ జన్‌’ చేస్తూ ఉంటుంది. యుపిఎ ప్రభుత్వం ఏడేళ్ల లో రూ.68,000 కోట్లు బ్యాంకులకు అందచేయగా మోదీ సర్కార్‌ కేవలం ఐదేళ్లలో రూ 3,20,000 కోట్లు ‘క్యాపిటల్‌ ఇన్‌ఫ్యూజన్‌’ కింద అందజేసింది. ప్రస్తుతం కేంద్రప్రభుత్వ రుణభారం జూన్‌ 2019లో రూ 88లక్షల కోట్లు ఉండగా, జూన్‌ 2020 నాటికి రూ.101లక్షల కోట్లకు పెరిగింది. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం అడ్డగోలుగా లక్షలాది కోట్ల రూపాయల ప్రభుత్వరంగ ఆస్తులను, రిటైల్‌ ఫుడ్‌ రంగాన్ని బడా కార్పోరేట్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోంది.బ్రిటీష్‌ హయాంలో పలు రూపా లలో భారతీయ సంపదను తరలించుకు పోయిన కారణంగానే, కొద్దిశతాబ్దాల క్రితం ప్రపం చంలోనే అత్యధిక జిడిపిగల భారత్‌, స్వాతంత్య్రం పొందే నాటికి ఆర్థికంగా క్షీణదశకు చేరుకుంది. ఒకవైపు రైతులకు, మరొక వైపున సంఘటితశక్తి ద్వారా దీర్ఘకాల పోరాటాల ద్వారా శ్రామికవర్గం సాధించు కున్న ప్రయోజనాలకు భంగం కలిగిస్తూ నాలుగు లేబర్‌కోడ్‌లను తీసుకురావడం, మరొకవంక అత్యధికస్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొ రేట్లకు కట్టబెట్టడం వంటి దుర్విధానాల వల్ల కోట్లాది ప్రజానీకం ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఎంతైనా ఉంది. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుని, ఇప్పుడు రైతులు, పారిశ్రామిక కార్మికులు, ప్రజాసంఘాలు యావన్మంది ఏకమై, మానిటైజేషన్‌ ప్రక్రియకు అడ్డుకట్ట వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. (వ్యాసకర్త:మాజీ వ్యవ సాయశాఖ మంత్రి, మాజీ లోక్‌ సభ సభ్యులు)
‘సామాన్యులపై ప్రభావం ఏమిటో చెప్పడం లేదు’
` ప్రొ.బిశ్వజిత్‌ ధర్‌
విలువైన ఆస్తులను మానిటైజ్‌ చేస్తే దాని పర్యవసానాలు ఏవిధంగా వుండబోతు న్నాయో సామాన్య ప్రజానీకానికి తెలియజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. వీటిని ప్రైవేటు రంగానికి అప్పజెప్తే వాళ్ళు వీటినితమ లాభాల కోసం నడుపు తారే తప్ప ప్రజల ప్రయోజనాల కోసంకాదు. అంటే వీటి చార్జీలు గణనీయంగా పెరుగుతాయి. ఈ ఆస్తులను నిర్మించడం కోసం గతంలో ప్రజలు పన్నుల రూపంలో అదనపు భారం మో శారు. ఇకముందు ప్రైవేటు వ్యక్తుల లాభాల కోసం మరోసారి అదనపు భారాన్ని మోయవలసి వస్తుంది.
మానిటైజేషన్‌ అనే పదాన్ని వాడడం ప్రభు త్వానికి ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో ఎయిర్‌ ఇండియా, తదితర ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడులను ఉపసంహరించే ప్రతిపాదనలను చేసినప్పుడు కూడా ఈ పదాన్ని ఉపయోగించారు. అందుచేత ఆస్తుల మానిటైజేషన్‌ అంటే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరించడానికి పెట్టిన మరో పేరు మాత్రమే.
‘’పని చేస్తున్న’’ (పెర్‌ఫార్మింగ్‌) ఆస్తులను బద లాయించడం ద్వారా ‘’నిరర్ధకంగా’’ (ఐడిల్‌) వున్న పెట్టుబడిని విడుదల చేసి ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి వినియోగించి ‘’అదనపు ప్రయోజనా లను పొందుతాం’’- ఇది నీతి ఆయోగ్‌ నివేదిక మానిటైజేషన్‌ గురించి ఇచ్చిన వివరణ. ఇక్కడ మొదటి సందేహం : పని చేస్తున్న ఆస్తులైతే నిరర్ధకం గా ఎలా ఉంటాయి? ఒకవేళ నిరర్ధకంగా ఉంటే పని చేస్తున్నట్టు ఎలా ఔతుంది? ఈ రెండిరట్లో ఏదో ఒకటే సాధ్యం. రెండు పరస్పర విరుద్ధమైన పదాలను- ‘’పని చేస్తున్న’’, ‘’నిరర్ధక’’ ఒకే వాక్యంలో కలిపి చెప్పడం తప్పుదోవ పట్టించడం కాదా?
రెండో సందేహం : ఈ ‘’అదనపు ప్రయోజనాలు’’ సామాన్య ప్రజలకు అందుతాయని ఆశించగలమా? మూడవది : ఇలా టాక్స్‌ పేయర్ల సొమ్ముతో సమ కూరిన ఆస్తులను ప్రైవేటువారికి అప్పజెప్పే బదులు ఇతర మార్గాల ద్వారా వనరులను సమీకరించడం సాధ్యం కాదా ? మానిటైజేషన్‌ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ‘’పని చేస్తున్న’’ ఆస్తులలో 26,700 కి.మీ. జాతీయ రహదారులు,400 రైల్వే స్టేషన్లు, 90పాసింజర్‌ రైళ్ళు, డార్జిలింగ్‌ హిమా లయన్‌ రైల్వే తో సహా నాలుగు పర్వత ప్రాంత రైల్వేలు ఉన్నాయి. ఇవిగాక ప్రభుత్వ రంగంలోని టెలికాం, విద్యుత్‌ ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌, పెట్రోలియం, పెట్రో ఉత్పత్తులు, సహజవాయువు పైప్‌ లైన్లు ఉన్నాయి. ఇటువంటి అత్యంత విలువైన జాతి సంపదను ఆ జాబితాలో చేర్చకుంటే ప్రైవేటు కార్పొరేట్లు మానిటైజేషన్‌ వైపు కన్నెత్తి కూడా చూడరు.
ఇవన్నీ ‘’నిరర్ధక ఆస్తులు’’ కానే కావు.
ఇటువంటి విలువైన ఆస్తులను మానిటై జ్‌ చేస్తే దాని పర్యవసానాలు ఏవిధంగా వుండ బోతు న్నాయో సామాన్య ప్రజానీకానికి తెలియ జేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా చెల్లిస్తున్న పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఈ ఆస్తులను ప్రభుత్వం సమకూర్చింది. వీటి నిర్వహణలో ప్రజల ప్రయోజ నాలు చాలా ఉన్నాయి. ఇక ఇంతవరకూ వీటిని ప్రభుత్వం నిర్వహించింది గనుక ప్రజల ప్రయోజ నాలను దృష్టిలో వుంచుకుని వీటిని నిర్వహించింది. అందుకే వీటి ద్వారా వసూలు చేసే చార్జీలు ప్రజ లకు అందుబాటులో వుండేటట్లున్నాయి. ఇక ముం దు వీటిని ప్రైవేటు రంగానికి అప్పజెప్తే వాళ్ళు వీటిని తమ లాభాలకోసం నడుపుతారే తప్ప ప్రజల ప్రయోజనాల కోసంకాదు. అంటే వీటి చార్జీలు గణనీయంగా పెరుగుతాయి. ఈ ఆస్తులను నిర్మించడం కోసం గతంలో ప్రజలు పన్నుల రూపంలో అదనపు భారం మోశారు. ఇకముందు ప్రైవేటు వ్యక్తుల లాభాల కోసం మరోసారి అదనపు భారాన్ని మోయవలసి వస్తుంది. ఒకసారి ప్రైవేటు పరం అయ్యాక వీటిధరలను నియంత్రించే అధి కారాన్ని ప్రభుత్వం కోల్పోతుంది. అలా కాకుండా వీటి ధరలను ప్రభుత్వం అప్పుడు కూడా నియంత్రిం చాలనుకుంటే ఆ మేరకు ప్రభుత్వమే ఆ కంపెనీలకు సబ్సిడీ రూపంలో ముట్టజెప్పవలసి వుంటుంది.
ఢల్లీి అనుభవం ఏమిటి ?
దేశ రాజధాని ఢల్లీి లో విద్యుత్‌ పంపి ణీని గతంలో కాంగ్రెస్‌ హయాంలో ప్రైవేటీకరిం చారు. ఆ తర్వాత పెరిగిన విద్యుత్‌ చార్జీలు పేదలే కాకుండా మధ్య తరగతి సైతం మోయలేనంతగా గుదిబండగా మారాయి. అప్పుడు ప్రజలకు చౌకగా విద్యుత్‌ అందిస్తామని హామీ ఇచ్చి ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారం లోకి వచ్చింది. విద్యుత్‌ చార్జీలను తగ్గించింది. ఆ తగ్గించిన మేరకు ప్రైవేటు విద్యుత పంపిణీ సంస్థలకు సబ్సిడీ ఇస్తోంది. ఆ సబ్సిడీని ప్రజల నుండివసూలు చేసిన పన్నుల ద్వారా చెల్లిస్తోంది. ఢల్లీి ప్రజలు పెరిగిన విద్యుత్‌ చార్జీల రూపంలోనో,కాకుంటే అదనపు పన్నుల రూపం లోనో భారాం అదనంగా మోయక తప్పడం లేదు. ప్రైవేటు కంపెనీలు మాత్రం దర్జాగా లాభాలు పోగేసుకుంటున్నాయి.
ఆదాయం సమకూర్చుకునే మార్గాలు వేరే లేవా ?
మన దేశ జిడిపికి,వసూలు చేసే పన్నులకు మధ్య నిష్పత్తి 2019-20లో17.4 శాతంగా ఉంది. ఇది ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే చాలా తక్కువ. అందుచేత అదనంగా సంపన్నుల మీద పన్ను పెంచవచ్చు. అంతే కాదు, ఈ ప్రైవేటు కంపెనీలు ఎగవేస్తున్న పన్నుల మాటేమిటి?కంపెనీలకు వస్తున్న లాభాలను, అవి చెల్లిస్తున్న పన్నులను ప్రభుత్వం ప్రచురిస్తున్న గణాంకాల ద్వారా తెలుసుకోవచ్చు. 2005-2006 లో40శాతం ప్రైవేటు కంపెనీలు తమకు ఎటు వంటి లాభాలూ రాలేదని ప్రకటించాయి. అదే 2018-19 నాటికి ఏకంగా 51 శాతం కంపెనీలు తమకు ఏలాభాలూ రావడం లేదని ప్రకటించాయి. ఒక కోటి రూ., లేదా అంతకన్నా తక్కువ లాభాలు వచ్చే కంపెనీల శాతం 2005-2006లో 55గా ఉంది. అదికాస్తా 2018-19 నాటికి 43 శాతానికి పడిపోయింది. అంటే దేశంలోని బడా ప్రైవేటు కంపెనీలు చట్టాలలోని లొసుగులను ఉపయోగించు కుని తక్కువ లాభాలను చూపిస్తూ పన్నులు చెల్లించ కుండా తప్పించుకుంటున్నాయి. ప్రభుత్వం పక్కాగా చట్టాలను రూపొందించి పన్నులను వసూలు చేస్తే అదనపు ఆదాయం సమకూరుతుంది.ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారు ? అంతే కాదు, ప్రభుత్వ రంగ సంస్థల అసమర్ధత గురించి నీతిఆయోగ్‌ పదే పదే మాట్లాడుతూ వుంటుంది. కాని వాస్తవం వేరు.బడా ప్రైవేటు కంపెనీల్లో నష్టాల్లో నడుస్తున్నవి 51 శాతం. అదే ప్రభుత్వ రంగ సంస్థల్లో నష్టాల్లో నడుస్తున్నవి 28 శాతం. ఎవరి సామర్ధ్యం ఎక్కువ? ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు పరం చేస్తే పెరిగేవి లాభాలా?లేకనష్టాలా?ఈమాత్రం ఆలోచించ లేకపోతోందా ఈ ప్రభుత్వం?
( వ్యాసకర్త – జెఎన్‌ యు ‘సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ స్టడీస్‌’ లో ప్రొఫెసర్‌)/ ‘ది హిందూ’ సౌజన్యంతో
వడ్డే శోభనాద్రీశ్వరరావు

ఆమెకేది రక్షణ

దేశంలో వివిధ రకాల నేరాలకు సంబంధించి జాతీయ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) తాజాగా 2019 సంవత్సరానికి సంబంధించిన నివేదికను వెలువరిం చింది. అందులో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి వెల్లడైన పలు సంచలన గణాంకాలు పరిస్థితి తీవ్రతను తెలియజేసేలా ఉన్నాయి. ఓవరాల్‌గా నేరాల్లో ఏపీ దేశంలోనే ఎనిమిదో స్థానంలో నిలవగా.. కీలకమైన ఆర్థిక నేరాల్లో మాత్రం టాప్‌లో ఉండటం, మహిళల అక్రమ రవాణాలో రెండో స్థానంలో నిలవడం కలకలం రేపుతున్నది.
2019 చివరి నాటికి ఇలా..
ఎన్‌సీఆర్‌బీ తాజా రిపోర్టులో 1995 నుంచి 2019 డిసెంబర్‌ చివరి నాటికి నమోదైన నేరాలను పరిగణలోకి తీసుకున్నారు. 2019 మేలో ఏపీలో జగన్‌ అధికారంలోకి రాగా, ఆ ఏడాది మొత్తంగా రాష్ట్రం ఆర్థిక నేరాల్లో అగ్రగామిగా నిలిచింది. గతేడాది ఏపీలో రూ.50 కోట్ల నుంచి 100కోట్లు మోసానికి పాల్పడిన కేసులు ఏకంగా 30 నమోదయ్యాయి. ఇది దేశంలోనే ఇది అత్యధికమని ఎన్‌సీఆర్‌బీ తెలిపింది. నమ్మకద్రోహం, ఫోర్జరీ, చీటింగ్‌, ఫ్రాడ్‌ తదితర మోసాలకు సంబంధించి నిందితులు, బాధితుల సంఖ్య ఏటా పెరు గుతూనే ఉంది.
జనాభా తక్కువే అయినా..
ఆర్థిక, పారిశ్రామిక వృద్ధిలో అగ్రరాజ్యాలైన మహారాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడును తోసిరాజని.. ఆంధ్రప్రదేశ్‌ లో ఆర్థిక నేరాలు విస్తృతంగా చోటుచేసుకుకోవడం గమనార్హం. మహారాష్ట్రతో పోల్చుకుంటే సగం జనాభా కూడా లేని ఏపీలో.. ప్రజలకు కుచ్చుటోపీ పెడుతోన్న నేరాలు ఎక్కువగా నమోదయ్యాయి. మధ్య తరగతి ప్రజలకు అత్యాశ చూపి మోసం చేస్తున్న వైనాలు భారీగా బయటపడ్డాయి. వాటిలో అగ్రిగోల్డ్‌ కేసు ప్రధానమైనది కాగా, డబ్బులు రెట్టింపు చేస్తామంటూ మోసాలకు పాల్పడిన ‘వెల్‌ పే’లాంటి సంస్థల పాత్ర కూడా ఉంది. రూ.50కోట్ల నుంచి 100కోట్లు మోసం చేసిన కేసులు.. గతేడాది మహారాష్ట్రలో ఐదు మాత్రమే నమోదు కాగా,ఏపీలో వాటి సంఖ్య 30గా ఉండటం గమనార్హం. అదే సమ యంలో…పెరిగిన మహిళల అక్రమ రవాణా ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం ఏపీలో మహిళ లను అంగడి సరుకులుగా విక్రయించే ముఠాల కార్యకలాపాలు పెరిగాయి. మహిళల అక్రమ రవాణా, విక్రయాల్లో మహారాష్ట్ర టాప్‌లో ఉండగా,అక్కడి గ్యాంగుల కార్య కలాపాలు ఏపీకి సైతం విస్తరించినట్లు నివేదికలో వెల్లడైం ది. ఏపీలో మూడేళ్లుగా మానవ అక్రమరవాణా క్రమంగా పెరుగుతూ,2019లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. మహిళలు,మానవ అక్రమరవాణాలో మహా రాష్ట్ర 12.5శాతంతో అగ్రస్థానంలో ఉండగా10.8శాతంతో ఏపీ తర్వాత స్థానంలోఉంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 398 మంది మహిళలు, యువతులు గతేడాది అక్రమ రవాణాకు గురి కాగా వారిలో 316మంది వ్యభిచార గృహాలకు అమ్ముడు పోయారని, వీటికి సంబంధించి కేసు ల నిరూపణ శాతం తక్కువగా ఉందని, కేవలం 21.8శాతం కేసుల్లోనే శిక్షలు పడ్డాయని ఎన్‌సీ ఆర్‌బీ వెల్లడిరచింది. మహిళలపై అఘాయిత్యాల్లో ఏపీ ఎనిమిదో స్థానం..
రాష్ట్రంలో మహిళలపై, లైంగిక వేధింపులు, అత్యాచారాలు..పునరావృతం అవుతున్నాయి. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనల్లో ఏపీ దేశంలో మొదటి స్థానంలో ఉంది. గతేడాది దేశవ్యాప్తంగా జరిగిన ఈతర హా ఘటనల్లో 33.14% మనరాష్ట్రంలోనే నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడు తోంది.
ా రాష్ట్రంలో మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు,వారి ఆత్మ గౌరవానికి భంగం కలిగించే ఘటనలు పెరిగాయి.
ా స్త్రీలపై జరిగిన మొత్తం నేరాల్లో స్వల్ప తగ్గుదల ఉన్నా, వారిపై భౌతిక దాడుల నేరాలు అదుపులోకి రాకపోవడం కలవరపరుస్తోంది.
ా మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనల్లో ఏపీ దేశంలో మొదటి స్థానంలో ఉండటం,గతేడాది దేశ వ్యాప్తంగా జరిగిన ఈతరహా ఘటనల్లో 33.14% మన రాష్ట్రంలోనే నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ా ఈ కేసులు 2019లో 1,892 నమోదు కాగా..2020లో ఆ సంఖ్య 2,342కు పెరిగింది.
ా ఏడాది వ్యవధిలో 23.78 శాతం మేర అధికమయ్యాయి.
ా పని ప్రదేశాల్లో మహిళలను లైంగికంగా వేధించడం, స్త్రీలను రహస్యంగా చిత్రీకరించటం (వోయిరిజం) నేరాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో రెండో స్థానంలో ఉంది. 2020 సంవత్సరానికి సంబంధించి జాతీయ నేర గణాంక సంస్థ తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక ఈ వివరాలు వెల్లడిరచింది.
ా ఏపీలో మహిళలపై 2019లో 17,746, 2020లో 17,089 నేరాలు జరిగాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే గతేడాది 3.70 శాతం మేర తగ్గాయి. ఈ తరహా నేరాలు అత్యధికంగా జరిగిన రాష్ట్రాల జాబితాలో 2019లో పదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ 2020లో ఎనిమిదో స్థానానికి వెళ్లింది.
ా పని ప్రదేశాల్లో మహిళల్ని లైంగికంగా వేధించిన ఘటనల్లో హిమాచల్‌ప్రదేశ్‌ (72 కేసులు) దేశంలో మొదటిస్థానంలో ఉండగా..70 కేసులతో ఏపీ రెండో స్థానంలో ఉంది.
ా స్త్రీలను రహస్యంగా చిత్రీకరించిన ఘటనలు అత్యధికంగా చోటుచేసుకున్న రాష్ట్రాల జాబితాలో ఏపీది రెండో స్థానం. మహారాష్ట్రలో ఈ తరహా కేసులు 201 నమోదు కాగా.. ఏపీలో 124 కేసులు పెట్టారు.
పరిచయస్తులే అత్యాచార నిందితులు
ా రాష్ట్రంలో 1,095 అత్యాచార ఘటనలు జరగ్గా.. అందులో 1,088 ఘటనల్లో ఈ నేరాలకు పాల్పడ్డది బాధితులకు పరిచ యస్తులే.
ా 91 ఘటనల్లో బాధితుల కుటుంబసభ్యులే నిందితులు.997 ఘటనల్లో స్నేహితులు, ఆన్‌లైన్‌ ఫ్రెండ్స్‌, ఇరుగుపొరుగువారి ప్రమేయం ఉంది.
ా అత్యాచారాలు 0.82% పెరిగాయి.
ా సైబర్‌, చిన్నారులపై నేరాల్లో పెరుగుదలలిబి
ా రాష్ట్రంలో 2019తో పోలిస్తే 2020లో సైబర్‌ నేరాలు, చిన్నారులపై జరిగిన నేరాలు కొంత పెరిగాయి.
ా రోడ్డుప్రమాదాలు 14,700 నుంచి 12,830కు తగ్గాయి.
ా అపహరణ కేసులు 902 నుంచి 737కు తగ్గాయి.
పోలీసులపై కేసుల్లో మూడోస్థానం
ా పోలీసులే పలు కేసుల్లో నింది తులవుతున్నారు.
ా దేశవ్యాప్తంగా వారిపై అత్యధికంగా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ది మూడో స్థానం.
ా అస్సాం (2,179),మహారాష్ట్ర (407) తర్వాత 261 కేసులతో ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది.
ా ఆయా ఘటనలపై అభియోగపత్రాల దాఖలులో దర్యాప్తు అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.
ా ఏపీలో 70 (26.81%) కేసుల్లోనే అభియోగపత్రాలు దాఖలుచేశారు. మరో 10 కేసుల్ని ప్రాథమిక దశలోనే న్యాయస్థానాలు కొట్టేశాయి.
ా 17 కేసుల్లో తుది నివేదికలు దాఖలు చేశారు.
దేశద్రోహం కేసులు 2019లో 93 నమోదు కాగా గతేడాదితగ్గి 73కి చేరాయి. మణి పూర్‌లో15,అస్సాంలో 12,కర్నాటకలో 8, ఉత్తరప్రదేశ్‌లో 7,హర్యానాలో 6,ఢల్లీిలో 5, కాశ్మీర్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. 2019లో మొత్తంగా 51,56,158 కేసులు నమోదు కాగా గతేడాది 28.8శాతం అంటే 14,45,127 కేసులు పెరిగాయి. అంటే లక్ష మంది జనాభాకు నమోదైన నేరాల రేటు 2019లో 385.5 వుండగా, 2020లో 487.8కి పెరిగిందని ఆనివేదిక పేర్కొంది. 2020లో భారతీయ శిక్షాస్మృతి కింద నమోదైన కేసులు 31.9శాతంగా వున్నాయి. మొత్తంగా 66,01,285 నేరాలు నమోదు కాగా, వీటిల్లో 42.54లక్షలు కేసులు ఐపిసి కింద దాఖల య్యాయి. 23.46లక్షలకు పైగా కేసులు ప్రత్యేక, స్థానిక చట్టాల (ఎస్‌ఐఎల్‌) కింద నమోద య్యాయని నివేదిక పేర్కొంది. సాంప్రదాయ రీతిలో సాగే నేరాలు రెండు లక్షల వరకు తగ్గా యని తెలిపింది. 2020లో 55.84లక్షల కేసులు దర్యాప్తు దశలో వున్నాయి. వాటిల్లో 34.47లక్షల కేసులను పరిష్కరించారు. దాదాపు 26.12లక్షల కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేశారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే చార్జిషీట్లు దాఖలు చేసిన రేటు కూడా 12.5శాతం పెరిగింది.
లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ !
గతేడాది మార్చి 25 నుండి మే 31వరకు కోవిడ్‌ లాక్‌డౌన్‌ వుండడంతో మహిళలు, పిల్లలు, వృద్ధులపై జరిగే నేరాలు, దొంగ తనాలు, దోపిడీలు తగ్గాయని నివేదిక పేర్కొంది. హత్య కేసులు మాత్రం ఒక శాతం పెరిగాయి. ఈ హత్యలకు ప్రేరేపించిన కారణాల్లో వ్యక్తిగత కక్షలు లేదా శతృత్వం, లాభాల కోసం జరిగినవి ఇలా పలు రీతుల్లో వున్నాయి. కిడ్నాప్‌ లేదా అపహరణ కేసులు 19.3శాతం మేర తగ్గాయి. వీరిలో 73,721మంది మహిళలు కిడ్నాప్‌ కాగా, పురుషులు 14,869గా వున్నారు. ఎస్‌సిఆర్‌బి డేటా ప్రకారం వీరిలో మైనర్లు 56,591మంది (8,175మంది బాలురు, 47,876మంది బాలికలు)గా వున్నారు. పెద్దవారు 31,999మందిగా వున్నారు. మొత్తంగా 91,458మంది కిడ్నాప్‌ అవగా,281మంది చనిపోయి శవంగా తేలారు. ప్రజల శాంతి భద్రతలకు సంబంధించి 71,107 కేసులు నమోదయ్యాయి. అంటే 2019తో పోలిస్తే ఈ నేరాలు 12.40శాతం ఎక్కువ. వీటిల్లో 51,606 కేసులు ఘర్షణలకు సంబంధించినవే. మహిళలపై నమోదైన నేరాలు 8.30శాతం తగ్గాయి. నమోదైన కేసుల్లో భర్త లేదా బంధు వుల దాష్టీకానికి సంబంధించిన కేసులే మెజారి టీగా వున్నాయి. ఆతర్వాత అత్యాచార ఉద్దేశ్యం తో దాడి జరిపిన కేసులు 23శాతంగావుండగా, కిడ్నాప్‌ (16.8శాతం), అత్యాచారం (7.5 శాతం) కేసులు నమోదయ్యాయి. 2020లో బాలలపై మొత్తంగా 29,768 కేసులు నమోద య్యాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 7.8శాతం కేసులు తగ్గాయి.1,45,754 ఆర్థిక నేరాలు నమోదయ్యాయి.
మహిళలపై అఘాయిత్యాలు ఆగాలంటే..
దేశ రాజధాని ఢల్లీిలో మహిళలపై అకృత్యాలు గతంలోనూ జరిగాయి.. ఇప్పుడూ జరుగు తున్నాయి.. భవిష్యత్తలోనూ జరుగుతాయి. పాలకులు మారినా, మహిళలపై అకృత్యాలు తగ్గడంలేదు. బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోనో, ఆన్‌లైన్‌ క్యాబ్‌లను బ్యాన్‌ చేస్తేనో మహిళలపై అఘాయిత్యాల అగిపోతాయను కోవడం హాస్యాస్పదం. మొత్తంగా సమాజంలోనే మార్పు రావాల్సి వుంది. ఆమార్పు ఇంటి నుంచే మొదలవ్వాలి. దానికి తగ్గ చర్యలు అధికారంలో వున్నవారు తమ స్థాయిలో చేపడితే, సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ, విచిత్రంగా అలాంటి చర్యల్ని తీసుకోవడంలో పాలకులు చిత్తశుద్ధి ప్రదర్శించడంలేదు.
చట్టాలు.. నిఘా టీమ్‌లు.. విచిత్రాలు.!
ఢల్లీి నుంచి హైద్రాబాద్‌ దాకా.. ఆమాటకొస్తే ఆర్థిక రాజధాని ముంబై నుంచి గల్లీ దాకా.. నిత్యం ఎక్కడో ఓచోట మహిళలపై అఘాయి త్యాలు జరుగుతూనే వున్నాయి. చట్టాలు లేకనేం, నిందితుల్ని శిక్షించడానికి చాలానే వున్నాయి. కానీ, ఆ చట్టాలే బూజుపట్టిపోయాయి. అనేకా నేక కారణాలతో దోషులు తప్పించు కుంటు న్నారు. దాంతో చట్టాలంటే భయపడే పరిస్థితి లేదు తప్పు చేసేవారికి. అందుకే తప్పు మీద తప్పు.. తప్పు మీద తప్పు జరిగిపోతూనే వుంది. కొన్ని చట్టాలు విచిత్రంగా తెరపె ౖకొస్తుంటాయి. వరకట్న వేధింపుల వ్యవహారమే వుంది.. ఓమహిళ కేసు పెడితే చాలు, అత్తిం టోవారి పనైపోయినట్టే.
దేశానికి దిశా నిర్దేశనం చేయాల్సినవాళ్ళే…
చట్ట సభలు వ్యవస్థల్ని దిశా నిర్దేశనం చేస్తాయి. అందులోని ప్రజా ప్రతినిథులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కానీ, అందరూ అలా వుంటున్నారా.? కొందరు చట్టసభల్లోనే అసాంఫీుక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఆమధ్య ఓరాష్ట్ర అసెంబ్లీలో అధికార పార్టీ నేతలే (ఇందులో అమాత్యులూ వున్నారు) మొబైల్‌ ఫోన్లలో నీలి చిత్రాలు తిల కించారు. అలాంటి ఘటనే మరోటి ఇటీవలే వెలుగు చూసింది. ఇవన్నీ రాజకీయ వివాదా లుగా మారుతున్నాయి తప్ప, ఇంకోసారి ఇలాం టి ఘటనలు వెలుగు చూడకుండా,దోషులకు చట్ట సభలనుంచి సాగనంపడం లాంటి చర్య లేమీ తీసుకుంటున్న దాఖలాలు కన్పించడం లేదు. చట్ట సభల్లో ప్రజా ప్రతినిథులే ఇలా వ్యవహరిస్తోంటే, వారిని రోల్‌ మోడల్స్‌గా తీసు కునే వారి అనుచరులు ఎలా వ్యవహరిస్తారో ఊహించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు– సింధు

స్వర్ణయుగ చక్రవర్తి

‘‘స్వర్ణయుగ చక్రవర్తి (ఏకపాత్రాభినయం) ఆంధ్ర ` తెలంగాణ రాష్ట్రాలలో ప్రప్రధమంగా ఏకపాత్రకు విద్యార్థుల విభాగంలో 14 నవంబరు 2018లో 30మంది విద్యార్ధు లచే ప్రదర్శించినందుకు గాను తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కింది.’’

నరసనాయకునికి,నాగాంబకు జన్మించిన వారి ఆలనా పాలనములు అంతంతమాత్రమే. నేను విద్యాప్రియుడిని, వీరుడను, లలితకళాభిమానిని, విజయనగర సామ్రాజ్య స్వర్ణయుగ కర్తను చక్రవర్తిని ఔతానని ఏనాడూ వూహించలేదు. ఊహించని ఊహకందని ఎన్నో మలుపులు నా జీవితంలో కలిగాయంటే అవి విధివిలాసమే. తిమ్మరుసు మహామంత్రి నా యందు కనబరచిన వాత్సల్యము ఇంత అని చెప్పలేని, మాటలకు అందని అనిర్వచనీయమైన బంధము. రాజన్న కృష్ణదేవరాయలు, మంత్రి అన్నచో తిమ్మరుసు అన్నంతగా పెనవైచుకున్నది మా బంధము. తండ్రి దగ్గరలేని చనువు అప్పాజీవద్ద పొందిన ధన్యజీవి నేనే.
అప్పాజీ పర్యవేక్షణలో పదునారేండ్ల వయస్సు నిండుసరికే సమస్తాయుధ యుద్ధ విద్యాకౌ శలము, వ్యూహ నిర్మాణము,ప్రత్యర్థి వ్యూహచ్చేదనము,దుర్గరక్షణ,తదాక్రమణ మొదలగు సకల యుధ్ధ విద్యలయందు ఆరితేరాను. గుర్రపు స్వారి,కత్తిసాములో మల్ల యుద్ధములో ప్రత్యేక మెళకువలు నేర్పించాడు అప్పాజీ! సద్గుణ సంపన్నునిగా అప్పాజీ నన్ను తీర్చిదిద్దాడు. ప్రజలకందరికీ ప్రీతిపాత్రుడన య్యేలా చేశాడు. నా పినతల్లి తిప్పాంబికకు మాత్రము నా ఈ ఎదుగుదల మాత్సర్య మనస్కురాల్ని చేసింది. నాపై అసూయ ద్వేషములు పెరిగాయి. తన కుమారుని పై ఆతని పట్టాభిషేకముపై వాత్సల్యము దినదిన ప్రవర్థమానమయ్యెను. తిప్పాంబ కుటిల ప్రవర్తన ఎరిగి యున్న అప్పాజీ నన్ను కంటికి రెప్పలా వెన్నంటి యుండి కాపాడారు. లేకున్నచో పినతల్లి యిచ్చిన విషప్రసాదము తిని ఏనాడో ఈ దేహమును చాలించి యుండెడివాడను. విరూపాక్షస్వామి ఆశీస్సులతో అప్పాజీ రాజనీత్నిత,అండదండలతో బతికి బట్టకట్ట గలిగాను. నాఅన్నగారు వీరనరసింహరాయల వారి ఆగ్రహమునకు నా నేత్రములు రెండు ఏనాడో కోల్పోవలసినవాడిని. అప్పాజీ తన్నననేత్రముతో నా నేత్రములు పోకుండ కాపాడగలిగాడు. అప్పాజీయే లేకున్న అష్టదిగ్గజకవులెక్కడ? ఈ సాహితీసమరాంగణ బిరుదాంకితుడెక్కడ?
అవును. అపాజీ సాక్షాత్తు దైవస్వరూపుడు. లేకున్న భూత భవిష్యత్‌ వర్తమానములు ఆతని మస్థిష్కములో గురితప్పక ఏలగోచరించును? చిన్ననాట అన్నపానాదులకు అల్లలాడిన ఆ కర్మయోగి అలసిసొలసి సొమ్మసిల్లి పడిపోగా ఆ అరణ్యములో ఆతనికి నీరెండపడకుండ నాగుపాము పడగవిప్పి ఆమహనీయుని శిరస్సున ఛత్రమువలే నిలచునా? దైవస్వరూపుడో దైవానుగ్రహస్వరూపుడో ఐన అప్పాజీ అడుగుజాడలో నడచినందుననే నేను తెలుగు సామ్రాజ్యమును అందునా హిందూ సామ్రాజ్యమును ఏకఛత్రాధిపత్యముగా ఏలగల్గి యుండెడివాడనా?
కుమార వీరశ్యామల రాయుడు,ఆర్వీటిశ్రీ రంగ రాజు,ఆకువీటి యిమ్మరాజు,పిమ్మసాని రామలింగ భూపతి,నంద్యాల నాపరాజుల ముందు సలకము తిమ్మయ గారు ఆరోపించిన ఆరోపణలు కారుకూతలను అప్పాజీ సభా ప్రాంగణములో నోరు మెదపక ఎదుటివారి నోరెట్లు నొక్కెచో ….ఆ….అదికదా ప్రతివారు నేర్వదగిన రాజనీత్నిత, నిష్కళంక దేశభక్తి. రామలింగ భూపతి శ్రీ రంగరాయార్యన్య సామంతుల ఎదుట నన్ను నిలిపి…..
వీరులు,శూరులు,చతురంగబల ససైన్యా ధిపతులు, రాజులు, అందరూ కొలువుదీరి యున్నపుడు ఈ రత్నసింహాసనమును అధిష్టించు అధికారము ఈ యువకిశోరం రాయలుకు గాక మరెవ్వరికి కలదు? అని ప్రశ్నించుట ఎవరికి సాధ్యము? పట్టాభిషేక మునకు ముందు సభాభవన అంతర్గృ హములోనికి నన్ను పిలువుకొని వెళ్ళి ఏకాన్తముగ రా నాయనా! అని చేరబిలిచి చెంపపై పెట్టుపెట్టిన ఆ చెంపదెబ్బ ఎట్లు మరతును? ‘‘వత్సా! ఈ క్షణముతో నీపై నాయధికారము ముగియుచున్నది. ఇక నీవు రాజువు. నేను నీ కింకరుడను. అధికారము మహామోహస్థానము. నీ తీర్పునకు తిరుగుండదు. నాఈ చెంపదెబ్బ నీకెంతటి వేదన కల్గించినదో ్నప్తియందుంచుకొని అపరాధులను శిక్షించుయెడ మనస్సెట్లుం డవలెనో నీ మనస్సున నాటుకొనుటకే నిరపరాధివగు నిన్నిట్లు బాధించితిని’’ అని పలికిన అమృతపుపలుకుల మర్మము రాజనీతి ఎట్లుమరతును? నూటయేబది సంవత్సరములకు ముందే స్థాపింపబడిన విజయనగర సామ్రాజ్య మును హిందూ సామ్రాజ్యముగా తీర్చిదిద్దాను. తూర్పున కటకము వరకు తెలుగువారి యధికా రము విస్తరింపజేశాను. దక్షిణమున సేతువు వరకు నాయ్నాకు తిరుగులేదు. పశ్చిమమున బీజాపురమే నా రాజ్యసరిహద్దు. తురుష్కులకు మనమన్న సింహస్వప్నము.ఉత్కళులు విధేయు లుగా నిలిచిరి. చోళులు,పాండ్యులు నామ మాత్రావశిష్ఠులు. పొట్నూరు,సింహాచల మందలి దిగ్విజయస్తంభములు చారిత్రక సత్యములకు తార్కాణములు. నాయేలుబడిలో రక్షణలో ప్రజలకు యుద్ధభయము గాని,చోరభయము గానీ లేకుండా నిశ్చింతగా జీవించునట్లు చేయ గల్గితిని. పాడిపంటలు ద్విగుణములు, త్రిగుణములుగా వృద్ధి చెందినవి. అందుకే విజయనగర వీధులలో వాణిజ్యము మూడు పువ్వులు ఆరుకాలుగా వర్ధిల్లుచున్నది. లేకున్న రత్నములు,మణులు,మాణిక్యములు, వజ్రవైఢూర్యములు పురవీధులలో ఆరుబయట రాసులుపోసి అమ్మగలరా? కత్తికేకాక ఘంటమునకూ పదునుపెట్టి భువన విజయసాహితీ సభయందు ఎన్నెన్నో సాహిత్య కుసుమాలు విరగబూయునట్లు చేయగల్గితిని. ఆ కావ్యసంపద, కవులు నభూతో నభవిష్యత్తి అన్నట్లు వేయిసంవత్సరములైననూ తరగని సాహిత్యసంపద ఉద్భవించినది కదా! ఒకపక్క సాహిత్యము, మరొకపక్క సంగీతము, ఇంకొకపక్క రాజకీయముల….అష్టావధానము చేయుచునే ఆముక్తమాల్యద గ్రంథము పూర్తి చేయగల్గితిని. దేశభాషలందు తెలుగులెస్స కాకున్న నా ఈ బృహద్గ్రంధము రచియింపబడియుండెడిదా? విజయపరంపరలతో నేను కట్టించిన దేవాలయప్రాంగణములు, ఆకాశహర్మ్యములైన గాలిగోపురములు కూలిన కూలుగాక నా విజయపరంపరలతో నెలకొల్పిన విజయస్తంభాలు పవిత్రతుంగభద్రమ్మ తరంగాలలో తళతళలాడుచున్న విఠలాలయ గోపురకాంతి దీప్తులు, గగనమును తాకునట్లు మెరుపుతీగల మాపుచేసిన ఆంధ్రవీరుల ఖడ్గకాంతులు,సహృదయలోకమునకు సుధాధారవలె,పానీయములుగా పెదవికం దించిన భువనవిజయ కవితా గోష్టులు తలచితలచి తెలుగువాడు తన్మయుడు కాకుండునా?పెద్దనగారి మనుచరిత్ర, తిమ్మనగారి పారిజాతాపహరణము, తెనాలి రామలింగని పాండురంగ మహత్మ్యము….. ఒకటేమిటి…..
మున్ముందు నా ఈ సామ్రాజ్యమేమగునో? మరల శత్రురాజులు పుంజుకొనిన- రాజుల మధ్య ఐక్యత లోపించిన -ఆంధ్ర సామ్రాజ్య మందలి విజయస్తంభములను వారు విరుగగొట్టిన గొట్టునేమో! విఠలాలయ, దేవాలయ ప్రాంగణములు చెల్లాచెదురు చేసిన చేయునేమో! ఆకాశహర్మ్యములుగా నే నిర్మించిన గాలిగోపురములు కూలిన కూలుగాక. ఆంధ్రవీరుల ఖడ్గకాంతులు అంతమొనర్చిన ఒనర్చునేమో! కానీ నా భువనవిజయ ప్రాభవమును యిసుమంతయు కదల్చలేరు. భువనవిజయమనగానే అపజయమెట్టిదో ఎరుగని ఆంధ్రజాతి పౌరుషప్రతాపములు ్నప్తికి రాగలవు. సాహితీ సదస్సుచే సాధించిన విజయములు ఆంధ్రజాతి మరువదు. సంస్కృతభాష నుండి సాగిన అనువాద ప్రక్రియకు అడ్డుకట్టవైచి ప్రబంధ ప్రక్రియకు నాందీ పలికి పరిపుష్టి గూర్చి వయసుతోపాటు పొంగివచ్చు అవయవ సౌష్టవముల దర్పముతో మంత్రముగ్ధులను చేయు ప్రబంధసుందరి అష్టాదశ వర్ణనాలంకృత కాంతులతో సాహిత్యమున్నంత కాలము నిలిచియుండును కదా!
తెలుగదేలయన్న దేశంబు తెలుగు
దేశభాశలందు తెలుగులెస్స
శ్రీ గోమఠం రంగా చార్యులు

ప్రకృతి వైఫరిత్యాలు`పెరుగుతున్న మార్పులు

భూకంపం,తుఫాను,వరదలు,సునామీ మొదలైన ప్రకృతి వైపరీత్యాలు మానవ నియంత్రణా పరిధికి ఆవల ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు,అనేక ప్రకృతి వైపరీత్యాలతో విధ్వంసానికి గురౌతున్నాయి. తీవ్రమైణ ఆస్తి,ప్రాణనష్టాలు జరు గుతున్నాయి. కొన్ని రకాల వైపరీత్యాలను ఎదుర్కొన డానికి,ముందుగా సిద్ధం కావటానికి మానవ చైత న్యం అవసరం.పునరావాస పనులు,ప్రథమ చికిత్స, ఆహారం,బట్ట్‌లు,మందులు,రక్షణ చర్యలు, ఆశ్రయం, మొదలైన అంశాల గురించి ప్రజలు తగినంత అవగాహన కలిగివుండాలి.

ప్రకృతి వైపరిత్యాలను మనం ఆపలేం. అయితే వరదలు, తుఫానులు, అగ్నిప్రమాదాలు, భూకంపాలవంటి ప్రకృతివైపరీత్యాలు సంభ వించ డంవల్ల పర్యావరణం కలుషితమవుతుంది. అనేక రకాల రోగాలు ప్రబలుతాయి. మనుషులతో సహా జంతువులన్నీ కూడా రోగాలబారిన పడ తాయి. కాబట్టి ఇలాంటి సందర్భాలలో మనం అప్ర మత్తంగా ఉండడంతోపాటు ఇతరులకు సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉండాలి. బట్టలు,ఆహారపదార్థాలు సేకరించి పంపడం, సేవాక్యాంపులలో పాల్గొనడం చేయాలి. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినపుడు తీసుకో వలసిన జాగ్రత్తలపట్ల అవగాహన కలిగించడానికి ప్రయ త్నం చేయాలి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించి నప్పుడు 12 నుండి 15 సంవత్సరాల వయస్సుగల పిల్లలు చేపట్టగల సహాయ కార్యక్రమాలకు ప్రాధా న్యత ఇవ్వాలి. ఓవైపు కరోనా వైరస్‌ కల్లోలం..
మరోవైపు భారీగా కురుస్తున్న వర్షాలతో ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొం టున్నారు. ఇక వర్షాలు, వరదలతో సీజనల్‌ వ్యాధు లు కూడా విరజంభించే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో ఏపీప్రభుతం చర్యలు చేపట్టింది. తాజాగా ఏపీరాష్ట్రవిపత్తుల నిర్వహణశాఖ ప్రభుత్వ కోవిడ్‌-19 నియమాలు పాటిస్తూ సహాయక చర్యల్లోని అధికారులకు సహకరించండని సూచిస్తూ ప్రజలకు ఓ లేఖను రిలీజ్‌ చేసింది. అంతేకాదు.. ప్రజలు వరదల సమయంలో ఏమి చేయాలి.. వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఏ విధమైన చర్యలు తీసుకోవాలి..ఒకవేళ వరదలు లోతట్టు ప్రాంతాలకు వస్తే.. అక్కడ ప్రజలు ఏ విధమైన సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లి అనే అంశాలను వివరిస్తూ రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్‌ కె. కన్న బాబు ఓలేఖను రిలీజ్‌ చేశారు
వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ా వరదనీటిలోకి ప్రవేశించవద్దు.
ా మురుగునీటి కాలువలు, కల్వర్టులకు దూరంగా ఉండండి.
ా విద్యుదాఘాతానికి గురికాకుండా విద్యుత్‌ స్తంభాలతో పాటు, పడిపోయిన విద్యుత్‌ లైన్ల కు దూరంగా ఉండండి.
ా ఓపెన్‌ డ్రెయిన్స్‌ లేదా మ్యాన్‌హూల్స్‌ను గుర్తించి ఆప్రదేశంలో కనిపించే విదంగా చిహ్నాలు,ఎర్ర జెండాలు లేదా బారికేడ్లు ఉంచండి.
ా వరదనీటిలో నడవకండి లేదా డ్రైవ్‌ చేయవద్దు
ా రెండు అడుగుల మేర ప్రవహించే వరద నీరు పెద్ద కార్లను కూడా తోసుకుపోగలవు
ా తాజాగా వండిన లేదా పొడి ఆహారాన్ని తినండి.
ా తినే ఆహార పదార్ధాలపై ఎల్లపుడూ మూతలు వేసి ఉంచండి
ా వేడిచేసిన లేదా క్లోరినేటెడ్‌ నీరు త్రాగాలి.
ా మీ పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి పెద్ద కార్లను కూడా తోసుకుపోగలవు
వరదల వచ్చిన తర్వాత చేయాల్సిన / చేయకూడని పనులు
్చ మీ పిల్లలను వరద నీటిలో ఆడనివ్వకండి
్చ రిపేర్‌కు వచ్చిన విద్యుత్‌ వస్తువులను ఉపయోగించవద్దు
్చ అధికారులు సూచించిన వెంటనే కరెంట్‌కు సంబందించిన ప్రధాన స్విచ్లులను,ఎలక్ట్రిక్‌ ఉపకరణాలను వాడడం మానెయ్యాలి
్చ తడిగా ఉంటే విద్యుత్‌ పరికరాలను తాకవద్దు.
్చ విరిగిన విద్యుత్‌ స్తంభాలు,తీగలు,పదునైన వస్తువులను పరిశీలించండి
్చ వరద నీటిలో కలిసిన ఆహారం తినవద్దు.
్చ మలేరియావంటి వ్యాధులను నివారించడానికి దోమతెరలను వాడండి.
్చ వరద సమయంలో పాము కాటు సాధారణం కాబట్టి పాముల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
్చ నీటి మార్గాలు/మురుగునీటిపైపులు దెబ్బతి న్నట్లయితే టాయిలెట్‌ లేదా కుళాయి నీటిని వాడకండి.
్చ నీరు త్రాగడానికి సురక్షితమని ఆరోగ్య శాఖ సలహా ఇచ్చే వరకు పంపు నీరు తాగవద్దు.
్చ మీ ప్రాంతంలో వరదలు సంభవించి ఖాళీ చేయవలసివస్తే మంచం,టేబుళ్లపై మీ ఫర్నిచర్‌ ఇతర ఉపకరణాలను పెట్టండి.
్చ టాయిలెట్‌ గిన్నెపై ఇసుక సంచులను ఉంచండి మరియు మురుగునీటి తిరిగిరాకుండా నివారించడానికి అన్ని కాలువ రంధ్రాలను మూసివేయండి
్చ మీ కరెంట్‌,గ్యాస్‌ కనెక్షన్‌ ను ఆపివేయండి
్చ ఎత్తైన భూ ప్రదేశం లేదా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళండి.
్చ మీ వద్ద ఉన్నఅత్యవసర వస్తు సామగ్రి, ప్రథమ చికిత్స పెట్టె,విలువైన వస్తువులు,ముఖ్యమైన పత్రాలను తీసుకొని వెళ్ళండి.
్చ నీటి లోతును తెలుసుకొనుటకు కర్రను ఉపయోగించండి.
్చ తడిసిన ప్రతిదాన్ని శుభ్రపరచండి మరియు క్రిమిసంహారకం చేయండి.
భూమి వేడెక్కితే ఏం జరుగుతుంది?
గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రపంచానికి పెను విపత్తుగా మారబోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరి స్తున్నారు. మనుషుల చర్యల వల్ల వాతవరణంలోకి కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉద్గారాలు భారీగా పెరిగాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు కూడా మండుతున్నాయి. ధ్రువాల్లో మంచు కరుగుతోంది.ప్రతికూల వాతా వరణ పరిస్థితులు పెరుగుతున్నాయి. భూమి సగటు ఉష్ణోగ్రత15డిగ్రీసెంటీగ్రేడ్లు.గతంలో ఇది ఇంత కన్నా ఎక్కువగా,తక్కువగా కూడా ఉంది.ఈ ఉష్ణోగ్రతలో మార్పులు సహజమే. అయితే, మునుపటి కన్నా చాలా వేగంతో ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగు తున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌ దీనికి కారణమని వారు చెబుతున్నారు.
గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌ అంటే సూర్యుడి నుంచి భూమిపైకి వచ్చే శక్తిలో కొంత భూమిపైనే నిలిచిపోవడం. భూమిపై నుంచి పరావర్తనం చెంది అంతరిక్షంలోకి వెళ్లాల్సిన సౌరశక్తిని గ్రీన్‌హౌజ్‌వాయువులు గ్రహిం చుకుని తిరిగి భూమిపైకి చేరేలా చేస్తున్నాయి. ఫలి తంగా వాతావరణం,భూ ఉపరితంల వేడెక్కు తున్నాయి. ఈఎఫెక్ట్‌ లేకపోతే భూమి ఇంకో 30డిగ్రీ సెంటీగ్రేడ్స్‌ చల్లగా ఉండేది. జీవం మనుగడ కష్టమ య్యేది.అయితే ఈ గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌కు పరిశ్రమలు, వ్యవసాయంవల్ల వెలువడే వాయువులుతోడై మరిం త శక్తిని గ్రహించి, ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీన్నే గ్లోబల్‌ వార్మింగ్‌ (భూమి వేడెక్కడం),వాతావరణ మార్పులు అంటారు.
గ్రీన్‌ హౌజ్‌ వాయువులు ఇవే…
గ్రీన్‌హౌజ్‌ వాయువుల్లో అత్యంత ప్రభా వవంతమైంది నీటిఆవిరి.కానీ,అది వాతా వర ణంలో కొన్ని రోజులపాటే ఉంటుంది. కార్బన్‌ డై ఆక్సైడ్‌ చాలా కాలం ఉంటుంది. అది పారిశ్రా మికీకరణ కన్నా ముందుఉన్న స్థాయిలకు వెళ్లాలంటే కొన్ని వందల ఏళ్లు పడుతుంది. సముద్రాల్లాంటి సహజ జలవనరులు దాన్ని పీల్చుకోగలవు. శిలాజ ఇంధనాలను మండిరచడంవల్లే అత్యధికంగా కార్బన్‌ డై ఆక్సైడ్‌ విడుదలవుతోంది. కార్బన్‌ డై ఆక్సైడ్‌ను పీల్చుకునే అడవులను నరికి,కాల్చేయడంవల్ల కూడా కార్బన్‌ వెలువడుతోంది.గ్లోబల్‌వార్మింగ్‌ ఎక్కువవు తోంది.1750లో పారిశ్రామిక విప్లవం మొదలై నప్పటితో పోలిస్తే కార్బన్‌ డై ఆక్సైడ్‌ స్థాయిలు 30శాతం పెరిగాయి.అయితే,కార్బన్‌డైఆక్సైడ్‌ అం తటి స్థాయిలో అవి లేవు.
గ్లోబల్‌ వార్మింగ్‌కు ఆధారాలు ఉన్నాయా?
పారిశ్రామిక విప్లవం కన్నా ముందు నాళ్లతో పోల్చితే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఇప్పుడు ఒక సెంటీగ్రేడ్‌ పెరిగినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) చెబుతోంది.అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు నమోదైన 20ఏళ్లు.. గత 22 ఏళ్లలోనే ఉన్నాయి. 2005-2015 మధ్య సగటు సముద్ర మట్టం 3.6 మిల్లీమీటర్లు పెరిగింది. ఉష్ణోగ్రత పెరగడం వల్ల నీరు వ్యాకోచించి ఇది ఎక్కువగా జరిగింది. కరుగుతున్న మంచు కూడా సముద్ర మట్టాలు పెరగడానికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉష్ణోగ్రత పెరుగుతున్న ప్రాంతాల్లో హిమనీనదాలు కరుగుతున్నాయి. ఆర్కిటిక్‌ సముద్ర మంచు 1979కి ఇప్పటికీ చాలా తగ్గిపోయిందని ఉపగ్రహాలు తీసిన ఫొటోలు సూచిస్తున్నాయి. మొక్కల్లో పూలుపూసే, పండ్లు కాసే సమయాలు ముందుకు జరుగుతున్నాయి. ఉష్ణోగ్రత పెరుగుదలను1.5డిగ్రీ సెంటీగ్రేడ్‌లకు కట్టడి చేసు కోగలిగితే క్షేమంగానే ఉండొచ్చని ఇటీవలికాలంలో శాస్త్రవేత్తలు,నాయకులు అంటున్నారు. గ్రీన్‌ హౌజ్‌ ఉద్గారాల కట్టడి విషయంలో రాజకీయంగా జరుగు తున్న కృషికి ఐరాసనేతృత్వం వహిస్తోంది. ఇప్పటి కిప్పుడు గ్రీన్‌ హౌజ్‌ వాయువుల ఉద్గారాలు గణనీ యంగా తగ్గించుకున్నా, వాతావరణంపై ప్రభావం తప్పదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ప్రభావం ఎలా ఉంటుంది?
వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉంటుదన్నదానిపై స్పష్టత లేదు.ప్రతికూల వాతా వరణ పరిస్థితులు పెరుగతాయి. దీంతో మంచినీటి కొరత ఏర్పడొచ్చు. ఆహారఉత్పత్తిపైనా తీవ్ర ప్రభా వం పడొచ్చు. వరదలు, తుఫానులు, వడగాలుల వల్ల మరణాల సంఖ్య పెరగొచ్చు. భూతాపం పెరగడంవల్ల ఎక్కువ నీరు ఆవిరవుతుంది. సముద్ర మట్టాలు పెరుగు తాయి కాబట్టి వరదలు కూడా పెరగొచ్చు. ఈ మార్పులను తట్టుకునే సామ ర్థ్యం లేని పేద దేశాలపై ప్రభావం విపరీతంగా ఉండొచ్చు. పరిస్థితులకు అంత త్వరగా అలవాటు పడలేవు కాబట్టి కొన్ని రకాల మొక్కలు, జంతువులు అంతరించిపోవచ్చు. మలేరియా లాంటి వ్యాధులు, పోషకాహార లోపాల బారిన కోట్ల మంది పడొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)అంచనా వేసింది. వాతావరణంలో పెరిగిన కార్బన్‌ డై ఆక్సైడ్‌ను సముద్రాలు ఎక్కువగా పీల్చుకోవడంవల్ల వాటి ఆమ్లత్వం ఇంకా పెరగొచ్చు. కోరల్‌ రీవ్స్‌కు ముప్పు ఏర్పడొచ్చు. వాతావరణ మార్పులపై స్పందించడమే ఈశతాబ్దంలో మానవాళికి అతి పెద్ద సవాలు కాబోతోంది.
`వ్యాసకర్త : వాతావరణ మార్పుల పరిశోధకుడు,సెంట్రల్‌ యూనివర్శిటీ,హైదరాబాద్‌
మల్లేష్‌ నాయక్‌


కుదుపేసిన గులాబ్‌ తుఫాన్‌

గులాబ్‌ తుఫాను గజగజా వణికిచింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ లోను ఆరు జిల్లాలను అతలాకుతలం చేసింది. శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు భయపడేలా చేసింది. లోతట్టు కాలనీలను ముంచేసింది. అక్కడి ప్రజలకు నిలువ నీడ లేకుండా చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. చాలాచోట్ల గల్లంతైన వారి కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఏపీ వ్యాప్తంగా 1.64 లక్షల ఎకరాల్లో పంటలకు భారీగా నష్టం వాటిల్లింది.

ఆంధ్రప్రదేశ్‌ను గులాబ్‌ తుఫాను వణి కించింది. ఆనాటి1990తుఫాన్‌ను తలపిం చింది. శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు ఆరు జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. జోరుమని వీచే గాలులు.. హోరుమని జోరు వాన..ఇళ్ల నుంచి జనంబయకు రావాలంటనే భయపెట్టింది. కళింగపట్నానికి సమీపంలో తీరం దాటిన ‘గులాబ్‌’ తుపాను రెండు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. ఒడిశాతో పోల్చితే ఆంధ్ర ప్రదేశ్‌కు ఎక్కువ నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం నుంచి కృష్ణా దాకా కుండపోతగా కురిసిన వర్షాలకు ఆర్గురు బలయ్యారు. అపార ఆస్తినష్టం సంభవించింది. 1.6 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగినట్లు ప్రాథమిక అంచనా. తుపానుధాటికి ఉత్తరాంధ్రలో విద్యుత్‌, కమ్యూ నికేషన్‌ వ్యవస్థ చిన్నాభిన్నమైంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 70-85 కి.మీ వేగం తో వీచిన ఈదురుగాలులకు విద్యుత్‌ స్తంభాలు, మొబైల్‌ సిగల్‌ టవర్లు పడిపోయాయి. చెట్లు కూలి పోయాయి. జలమయమైన పలుగ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కరెంటు లేక, ఫోన్లు పనిచేయక, సురక్షితమైన మంచినీరు దొరక్క ప్రజలు పడిన అవస్థలు వర్ణనా తీతం. నాగావళి,వంశధార,వేదావతి నదులు పొంగుతుండడంతో వరదలు పొటెత్తే ప్రమాద ముంది.గులాబ్‌ ధాటికి ఒడిశాను అనుకుని ఉన్న ప్రాంతాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. శ్రీకాకుళంలో వజ్రపు కొత్తూరు, సంత బొమ్మాళి బాగా దెబ్బతి న్నాయి. కోవిడ్‌-19మహమ్మారి నుంచి ఇప్పు డిప్పుడే తేరుకుంటున్న ప్రజలను ఇది కోలుకోలేని దెబ్బతీసింది. లక్షకు పైగా ఎకరాల్లో వరి, వేల ఎకరాల్లో మొక్కజొన్న నీట మునిగింది. వేరు శనగ, మిరప, ఉద్యాన పంటలకు కూడా నష్టం వాటి ల్లింది. విద్యుత్‌ వ్యవస్థకు భారీగా నష్టం వాటిల్లింది. అసలే అంతంతమాత్రంగా ఉన్న రోడ్లు ఈ తుపాను దెబ్బకు మరింత అధ్వానంగా తయారయ్యాయి. పారిశుధ్యం,నీటి సరఫరా వ్యవస్థస్తంభించి పోయిం ది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదముంది. గులాబ్‌ విపత్తు సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోనే లేదు, మరో తుపాను పొంచి ఉందన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. అత్యధిక జనాభా, అంతంతమాత్రమే మౌలిక సదుపాయాలు కలిగిన మన దేశంలో చిన్న విపత్తు కూడా పెద్ద నష్టం కలిగించే అవకాశముంది. దీనికి తోడు తుపానుల స్వభావంలోనూ పెనుమార్పులు చోటుచేసుకుం టున్నాయి.
భూగోళం వేడెక్కడం వల్ల వాతావరణంలో చోటుచేసుకునే మార్పుల ప్రభావం భయంకర తుపా నుల రూపంలో వ్యక్తమవుతుందని వాతావరణ మార్పుల సదస్సు (ఐపిసిసి) చేసిన హెచ్చరిక సరైన దేనని తాజా తుపాను నిరూపించింది. 2020లో బెంగాల్‌ను కుదిపేసిన ‘అంఫని’, అంతకుముందు గుజరాత్‌ను కకావికలం చేసిన ‘తౌకే’్టలతో పోల్చితే గులాబ్‌ తీవ్రత తక్కువే కావచ్చు. కానీ,ఈ ఉష్ణ మండల తుపాను లక్షణాలు చాలా ప్రమాదక రమైనవి. తేమ, అధిక పీడనాశక్తి కలిగి వుండడం వల్ల ఇవి ఒక్కసారిగా కుంభవృష్టిని కురిపిస్తాయి. గత 30ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విశాఖలో కురిసిన కుంభవృష్టి ఇందుకొక ఉదాహరణ. 2019లో ఎనిమిది ప్రమాదకర తుపానులు సంభవిస్తే 2020లో అయిదు ప్రమాదకర తుపానులు చోటుచేసుకున్నాయి. వీటి నుంచి పాఠాలు తీసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత శ్రద్ధ పెట్టడం లేదు. విపత్తు సంభవించిన తరువాత అరకొర పరిహారం ప్రకటించి చేతులు దులిపేసుకుంటున్నాయి. ఇటువంటి విపత్తుల సమయంలో ఉదారంగా సాయం అందించాల్సిన కేంద్రం ఇది తన బాధ్యత కాదన్నట్టుగా వ్యవహరి స్తోంది. గతంలో హుదూద్‌ తుపాను సందర్భంగా వెయ్యి కోట్ల సాయం ప్రకటించిన మోడీ ప్రభుత్వం ఆచరణలో రాష్ట్రానికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇప్పుడు గులాబ్‌ తుపాను గురించి ప్రధాని ఆరా తీశారే తప్ప బాధితులను ఆదుకునేందుకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. కార్పొరేట్లకు లక్షల కోట్ల రుణా లను మాఫీ చేయడానికి వెంటనే సిద్ధపడే మోడీ ప్రభుత్వం ప్రజలను ఆదుకునే విషయంలో కనీస మానవత్వ స్పందననైనా కనపరచకపోవడం దుర్మార్గం. తుపాను మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, శిబిరాల నుంచి ఇళ్లకువచ్చినవారికి వెయ్యి రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సాయం ఏమూలకూ చాలదు. తుపా నులు వంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి ఆర్థికంగా, సంస్థాగతంగా గట్టి చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. అలాగే బీమా వ్యవస్థను పటిష్ట పరచడం,పాలనాపరమైన సన్న ద్ధత పెంచుకో వడం,ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం గావించ డం వంటివి చేపట్టాలి. తక్షణం గులాబ్‌ నష్టాలను సమగ్రంగా అంచనా వేసి బాధితులకు ప్రభుత్వం తగు పరిహారం చెల్లించాలి.
కుదిపేసిన గులాబ్‌ :తుపాను ముప్పు తప్పిందని ఊపిరి పీల్చుకుంటుండగా ఆ తర్వాత అర్ధరాత్రి నుంచే విశాఖ,విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. మరుచటి రోజు తెల్లవారుజాము నుంచి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి,కృష్ణాజిల్లాల్లోనూ పలుచోట్ల కుంభ వృష్టి కురిసింది. ఈతుఫాను కారణంగా 277 మండ లాల్లోనూ వానలు పడ్డాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 98మండలాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వానలు పడ్డాయి.
ముఖ్యంగా ఉత్తరాంధ్రలో గంటకు 79 కిలోమీటర్ల నుంచి100కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో ఉత్తరాంధ్రలో వేల సంఖ్యలో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో రాకపో కలకు,విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. విజయనగరం,విశాఖపట్నం జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి చెందారు. నదుల్లో ప్రవాహ ఉద్ధృతి పెరిగింది. రోడ్లు, వంతె నల మీదుగా నీరు పారడంతో వందలాది గ్రామా లకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతంలోని ఇళ్లతోపాటు విద్యుత్తు సబ్‌స్టేషన్లు, పోలీస్‌స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వా సుపత్రుల్లోకి వరద నీరుచేరింది. తుపాను నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు. వరద ముంచెత్తడంతో విశాఖపట్నంలో వాహనాలు నీట మునిగాయి. భారీవర్షాలకు విశాఖ పట్నంలో వేల ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. రహదారులపై నీరు ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. సుమారు 10వేల మంది ని పునరావాస కేంద్రాలకు తరలించారు. మన్యంలో గెడ్డలు పొంగిపొర్లాయి. జిల్లాలో147విద్యుత్తు సబ్‌స్టేషన్లపై తుపాను ప్రభావం చూపడంతో వందల గ్రామాలు అంధ కారంలో చిక్కుకున్నాయి. రైవాడ, కోనాం మినహా మిగతా అన్ని డ్యామ్‌ల గేట్లు ఎత్తి నీరు కిందకు విడుదల చేస్తున్నారు. ఈదురుగాలులకు గార, శ్రీకా కుళం సహా తీర ప్రాంత మండలాల్లో భారీ సంఖ్య లో వృక్షాలు నేలకొరిగాయి. చాలాచెట్లు విద్యుత్తు తీగల పై పడడంతో విద్యుత్తు స్తంభాలు నేలకూ లాయి. గిరిజనగ్రామాలు జలది గ్బంధంలో ఉన్నాయి. సాలూరు మండలం మామి డిపల్లి ప్రాథ మిక ఆరోగ్య కేంద్రం పూర్తిగా నీట మునిగి మం దులు,పరికరాలుఅన్నీ తడిచి పోయాయి. ఈదురు గాలులకు గార, శ్రీకాకుళం సహా తీర ప్రాంత మండలాల్లో భారీ సంఖ్యలోవృక్షాలు నేలకొరిగాయి. చాలా చెట్లు విద్యుత్తు తీగలపై పడడంతో విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. విజయనగరం జిల్లా నెల్లి మర్ల,గజపతినగరం,పూసపాటిరేగ ప్రాంతాల్లో గరిష్ఠంగా 23.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. వందలాది వృక్షాలు నేలకూలాయి.
తూర్పుగోదావరి జిల్లా రాయవరం, తాళ్లరేవు,కాజులూరు,కడియం,రామచంద్రా పురం, అమలాపురం,పి.గన్నవరం,కాకినాడ, రాజమహేం ద్రవరం,మండపేట, అంబాజీపేట ప్రాంతాల్లో 10 సెం.మీ నుంచి 16 సెం.మీ వానలు పడ్డాయి. రంపచోడవరం- గోకవరం ప్రధాన రహదారిలో జాగరంవల్లి వద్ద భారీవృక్షం నేలకూలడంతో రాక పోకలు స్తంభించాయి. మారేడుమిల్లి మండలంలో పెళ్లిరేవు వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో గర్భిణిని తీసుకెళ్తున్న అంబులెన్స్‌ నీటిలో నిలిచి పోయింది. స్థానికులు వాగు దాటించారు. తూర్పు గోదావరి జిల్లా రాయవరం, తాళ్లరేవు, కాజులూరు, కడియం,రామచంద్రాపురం,అమలాపురం, పి.గన్న వరం,కాకినాడ,రాజమహేంద్రవరం,మండపేట, అంబాజీపేట ప్రాంతాల్లో 10సెం.మీ నుంచి 16 సెం.మీవానలుపడ్డాయి. రంపచోడవరం- గోకవ రం ప్రధాన రహదారిలో జాగరంవల్లి వద్ద భారీ వృక్షం నేలకూలడంతో రాకపోకలు స్తంభిం చాయి. మారేడుమిల్లి మండలంలో పెళ్లిరేవు వాగు ఉద్ధృ తంగా ప్రవహించడంతో గర్భిణిని తీసుకెళ్తున్న అంబులెన్స్‌ నీటిలో నిలిచిపోయింది. స్థానికులు వాగు దాటించారు. భారీ వర్షాల ధాటికి విజయ నగరం జిల్లా బొండపల్లి మండలం గదబపేటలో చెట్టుకూలి ఒకరు,తమటాడలో గోడ కూలి మరొ కరు చనిపోయారు. గుర్ల మండలం కోట గండ్రేడు లో ప్రమాదవశాత్తు చెరువులోపడి ఒకరు మృత్యు వాతపడ్డారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి అప్పల నరసయ్య కాలనీలో ఏళ్ల భావన అనే మహిళ మరుగుదొడ్డిలో ఉండగా మరో ఇంటి గోడ కూలి మరుగుదొడ్డిపై పడటంతో ఆమె అక్కడికక్కడే మర ణించింది. సుజాతనగర్‌లో వర్షంతో విద్యుదాఘా తానికి గురై నక్కా కుశ్వంత్‌ కుమార్‌ అనే ఏడేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. తుఫాను కారణంగా విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. భారీ వర్షాలతో చెరువులను తలపిస్తోంది. మోకాళ్ల లోతు నీరులోనే ప్రయాణి కులు ఇబ్బంది పడుతూ ఎయిర్‌ పోర్టులోకి చేరుకోవాల్సి వచ్చింది. విశాఖ పట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 750 కి.మీ. మేర ఆర్‌అండ్‌బీ రహదారులు, 50 కల్వర్టు లు దెబ్బతిన్నాయి. బొర్రా- చిమిడిపల్లి మార్గంలోని కేకేలైన్‌లో రైలు పట్టాలపైకి బురద కొట్టుకొచ్చింది. కొత్తవలసలో రైలు పట్టాలపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. ఎల్‌కోట సమీపంలో కొత్తవలస-కిరండోల్‌ మార్గంలో ఒక లైన్‌ దెబ్బతింది. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో 1.64 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో 1.57 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 6,465 ఎకరాల్లో ఉద్యాన పంటలు ఉన్నాయి. చాలా మండలల్లో పైర్లు బాగా పండాయి..
ఈ ఏడాది మంచి పంట వస్తుందని ఆశించిన సమయంలో గులాబ్‌ కన్నీరే మిగి ల్చింది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజ లకు ఆపన్న హస్తం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుం టామని రాష్ట్ర పోలీసు యంత్రాంగం మరోసారి నిరూపించింది. ఉత్తరాంధ్ర,ఉభయగో దావరి జిల్లాల్లో సహాయ,పునరావాస కార్యక్రమాల్లో పోలీసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేలకొరి గిన వృక్షాలు తొలగించడం, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు చేర్చడంలో శక్తివంచన లేకుండా పనిచేశారు. ఉత్తరాంధ్రలో గులాబ్‌ తుపాన్‌ బీభత్సం, ఐదుగురు మృతి,ఇద్దరు గల్లంతు
మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు
గులాబ్‌ తుపాను వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5లక్షల రూపాయల పరిహా రాన్ని తక్షణం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, ఇతర అధికారులతో ఆయన అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాధితులను ఆదుకు నేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బంది పడ్డ బాధితులకు రూ. 1000, సహాయ శిబిరాల నుంచి ఇంటికి తిరిగి వెళ్లే బాధితులకూ రూ.1000 తక్షణమే ఇవ్వాలని చెప్పారు. బాధితుల పట్ల మాన వతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన ఎన్యుమరేషన్‌ చేయాలని నష్టం అంచనాలు వేసి రైతులను ఆదుకో వాలని ఆదేశించారు.
పంట నష్ట పరిహారాన్ని కూడా సాధ్య మైనంత త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకోవా లన్నారు. శ్రీకాకుళం నుంచి సిఎస్‌ ఆదిత్య నాధ్‌ దాస్‌ తుపాను అనంతర పరిస్థితులను సిఎంకు వివరించారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని మిగిలిన చోట్ల అంత తీవ్రత లేదని చెప్పారు. అక్కడక్కడా చెట్లు విరిగిపడ్డాయని వాటిని తొలగిం చామని అన్నారు. విశాఖ నగరంలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రాంతంలో సహయ కార్యక్రమాలు ముమ్మరం చేశామని లోతట్టు ప్రాంతాల్లోని వారిని శిబిరాలకు తరలించామని చెప్పారు. ఈ సమీక్షలో విజయనగరం నుంచి మంత్రి బొత్స,శ్రీకాకుళం నుంచి ధర్మాన కృష్ణదాస్‌, విశాఖ నుంచి అవంతి శ్రీనివాస్‌ పాల్గొని తుపాను పరిస్థితులను సిఎంకు వివరించారు.
ధూళి తుఫాన్‌ :
వాతావరణ మార్పుల నేపథ్యంలో కొత్తగా రూపొందించుకుంటున్నారు. ప్రకృతి బీభత్సాలకు తట్టుకుని నిలిచే రీతిలో సదుపాయాల కల్పన ఉండాలనే స్పృహ పెరిగింది. కానీ మన దేశంలోని నగరాలు మాత్రం వాతావరణ మార్పు వల్ల కలిగే బీభత్సాలకు తట్టుకుని నిలిచే విధంగా లేవు. ఇటీవల ఉత్తరాదిని తుఫాను అల్లల్లాడిరచిన సందర్భంగా ఈ విషయం మరింత స్పష్టమైంది. మన విధాన కర్తలు దృష్టి సారించవలసిన మరో ముఖ్యమైన అంశం వ్యవసాయ రంగం. ప్రకృతి బీభత్సం వల్ల పంట చేను దెబ్బ తినడాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోకూడదు. వాతావరణ మార్పు వల్ల రుతువులు గతి తప్పుతున్నాయి. మన దేశాన్ని వాతావరణ మార్పు వల్ల కలిగే ప్రకృతి బీభత్సాలు వెంటాడుతున్నాయనేది తాజా వైపరీత్యాలను బట్టి వీటిని తట్టుకొనే విధంగా మనం సిద్ధపడి లేమని కూడా స్పష్టమైంది. ఈ నెల మొదటి వారంలోనే ధూళి తుఫాను ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాలలో బీభత్సాన్ని సృష్టించింది. దీని నుంచి దేశం తేరు కోక ముందే మళ్ళా గులాబ్‌ తుఫాన్‌ అకాల వర్షం కకావికలు చేసింది. పిడుగులతో కూడిన రాళ్ళ వాన, పెనుగాలలు కలిసి అనేకమంది ప్రాణాలు బలిగొన్నాయి. ఇటీవల చోటుచేసుకున్న ప్రకృతి వైపరీత్యం మూలంగా వివిధ రాష్ట్రాలలో భారీగా ప్రాణనష్టం జరిగింది.
ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే రాళ్ళవాన, పిడు గులు పడి 50మందికి పైగా మరణించారు. ఎనభై మందికిపైగా గాయపడ్డారు. చెట్లు విరిగిపడ్డాయి, ఇండ్లు కూలిపోయాయి. ఢల్లీిలోనైతే ధూళి తుఫా నుకు,భారీవర్షం తోడైంది. రాకపోకలు నిలిచి పోయాయి. ఇద్దరు మరణించారు. డ్బ్భై విమానా లను దారి మళ్ళించవలసివచ్చింది. పశ్చిమ బెంగా ల్‌లో పన్నెండు మంది మరణించారు. ధూళి తుఫాను మూలంగా ఉత్తర, పశ్చిమ భారతమంతా ఉక్కిరిబిక్కిరయింది.ఉత్తరప్రదేశ్‌,రాజస్థాన్‌,ఉత్త రాఖండ్‌,మధ్యప్రదేశ్‌,పంజాబ్‌,హర్యానా రాష్ట్రా లలో వంద మందికిపైగా మరణించారు. వంద లాది మంది గాయపడ్డారు. పెనుగాలులు సృష్టిం చిన విలయానికి ఇళ్లు కూలిపోయాయి, చెట్లు పెకిలించుకుపోయాయి, పంటలు దెబ్బతిన్నాయి. రవాణా, విద్యుత్‌ వ్యవస్థలు ఛిన్నాభిన్నమైనయి.
-జిఎన్‌వి సతీష్‌

విఫత్తుల సమయం అప్ర‌మ‌త్తం అవశ్యం


ఈనేపథ్యంలో ఇటీవల సంభవించిన గులాబ్‌ తుఫాన్‌ రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణ,ఉత్తర ఒడిశా,ఛత్తీస్‌గఢ్‌లలో భారీ నష్టానికి గురిచేసింది.నాటి1990తుఫాన్లు మాదిరిగా తీవ్రమైన నష్టాన్ని చూపించింది. తెలుగు రాష్ట్రాలకు ఎప్పఉడు తుఫాన్లు వచ్చినా కేంద్రప్రభుత్వం సకాలంలో ఆదుకోవడం ప్రశంసనీయం. దేశంలో అధిక విపత్తుకు గుర య్యే ప్రాంతలు హిమాలయ ప్రాంతాలు,ఒండ్రుమైదానాలు,తీరప్రాంతాలు,ఎడారి ప్రాంతం.ప్రస్తుతం తీరప్రాంతాల్లో సంభవించే తుఫాన్లు,గాలివానలు ఎక్కవగా ఉన్నాయి. దక్షిణ ఒడిశా,ఉత్తర ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణ,ఉత్తర ఒడిశా,ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలలో తుఫాన్లు పరిస్థితులు పరిశీలిస్తే 19902021వరకు ప్రమాదకరమైన14తుఫాన్లు సంభవించాయి.20112021 మధ్యలో మూడు భయం కరమైన తుఫాన్లు ప్రజలు ఎదుర్కొన్నారు. ఇవీ పర్యావరణం,సమాజం,సామాన్యప్రజలకు ఆర్ధికంగా అధిక నష్టం కలిగించాయి.సాధారణ కార్యకలాపాలను కూడా అడ్డుకునే తీవ్రమైన పరిస్థితి ఏర్పడిరది. ఈప్రకృతి వైపరీత్యాలవల్ల అధిక మొత్తంలో ఆస్తి,ప్రాణ నష్టాలు జరిగాయి. గతనెలాఖరున సంభవించిన గులాబ్‌ తుఫాను బీభత్సం తెలిసిందే. ప్రజలకు హానికలిగే పరిస్థితి ఉన్నప్పుడు,వైపరీత్యాలను ఎదుర్కొనే ముందుస్తు సమర్ధచర్యలు లేనప్పుడు విఫత్తు తీవ్రత అధికంగా ఉంటుంది. కానీ గులాబ్‌ తుఫాన్‌ ప్రభుత్వం,ప్రభుత్వ అధికార యంత్రాంగం సకాలంలో ఆదుకోని సహాయక చర్యలు చేపట్టడం అభినందనీయం.


ప్రపంచవ్యాప్తంగా వరదలకారణంగా మరణిస్తున్నవారిలో 20శాతం భారతదేశంలోనే ఉన్నారు. ఇక్కడ వరద ముంపునకు గురయ్యే ప్రదేశాలు కూడా ఎక్కువే.ఇక్కడ దాదాపు అన్ని నదీ పరీవాహక ప్రదేశాల్లోనూ వరదులు సంభవిస్తున్నాయి.తెలుగు రాష్ట్రా ల్లో గోదావరి,కృష్ణా నదులు ప్రధానంగా వరదలకు కారణమవుతున్నాయి. ఉత్తరాంధ్రలో నాగావళి,వంశధార నదులు,దక్షిణాంధ్రలో పెన్నా నదీ ప్రాంతం వరదలకు కారణమవుతున్నాయి.2009లో కృష్ణానది వచ్చిన వరదలవల్ల మహాబూబ్‌నగర్‌,కర్నూలు,నల్గోండ, కృష్ణా,గుంటూరుజిల్లాలకు అపారనష్టం వాటిల్లింది. 2005లో ముంబాయిలో ఒకేరోజు10సెంటీమీర్ల వర్షం కారణంగా ఆ మహానగరాన్ని వరదులు ముంచెత్తాయి. అలాగే2014లో సంభవించిన హూదూద్‌ తుఫాన్‌ కారణంగా విశాఖనగరం అతలాకుతలమైంది. ఆస్తి నష్టం,ప్రాణనష్టం సంభవించింది. దేశంలో వరద ఉధృక్తిని తెలుసుకోవడానికి శాటిలైట్‌,రిమోట్‌ సెన్సఇంగ్‌ పరికరాలు లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. వరదల హెచ్చరికలను కేంద్ర జలసంఘం లేదా సాగునీరు,వరద నియంత్రణశాఖ లేదా జలవనరులశాఖ జారీచేస్తాయి. సహజ వైపరీత్యమైన వరదలను ఎదుర్కొనేందుకు సన్నద్దంగాఉండాలి. అప్పుడే అవి విఫత్తులుగా మారకుండా ఉంటాయి. తద్వారా విలువైన సంపదను కాపాడుకోవచ్చు.


తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏటానవంబరు,డిశంబరు నెలల్లో తుఫాన్లు,భారీవర్షాలు సంభవిస్తున్నాయి. దానికి అనుగుణంగానే ప్రభుత్వాలు కూడా అప్రమత్తమై ముందుస్తు జాగ్రత్త చర్యలతో ప్రజలకు ప్రాణ,ఆస్తినష్టం కలుగకుండా నియంత్రిస్తోంది. వాతావరణశాఖ సూచన జారీచేసిన నేపథ్యంలో విపత్తుల నియంత్రణ అధికారులు,రక్షణశాఖ,రెవెన్యూ అధికారయంత్రాంగం అప్రమత్తంగానే వ్యవహరిస్తోంది. ముంపునకు గురయ్యే ప్రాంతవాలసులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం,తుఫాన్లు షెల్టర్లు ఏర్పాటు,పునరావాస కేంద్రాలకుతరలించి వారికి నిత్యావసర వస్తువులు,ఆహారం,వైద్య సదుపాయాలు కల్పించే సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వాలు ముందుడటం విశేషం.అయితే ఇలాంటి విఫత్తులు సంభవించినప్పుడు సకాలంలో ఆదుకోవడానికి యువతకు శిక్షణలు ఇవ్వాలి.స్వచ్చంధ సంస్థల సేవలను ప్రభుత్వాలు వినియోగించుకోవడానికి తోడ్పడాలి. లోతట్టు ప్రాంతవాసులకు కూడా అవగాహన కల్పించి అక్కడ యువతకు శిక్షణ ఇవ్వాలి. పర్యావరణం కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలి.- ర‌వి రెబ్బా ప్ర‌గ‌డ‌,ఎడిట‌ర్‌- థింసా

పగడ్బందీగా పీసా చట్టం

ఐదో షెడ్యూలు ప్రాంత పరిరక్షణకు ప్రాముఖ్యమైన పీసా చట్టం1996(పంచాయతీస్‌ ఎక్స్‌టెన్షన్‌ టూ షెడ్యూల్‌ ఏరియా) వచ్చి ఈ ఏడాది డిసెంబరు నాటికి 25 వసంతాలు పూర్తికానున్నాయి. చట్టం రావడానికి ఎంతో మంది మేథావులు,ప్రజల ఉద్యమం ఫలితంగా పీసా చట్టాన్ని సాధించారు. ముఖ్యంగా ఐఏఎస్‌ ఉన్నతాధికారులైన బి.డి.శర్మ,ఎస్‌.ఆర్‌.శంకరన్‌,దిలీఫ్‌ సింగ్‌ భూరియా,ప్రొఫెసర్‌ జయప్రకాశ్‌రావు వంటి గిరిజనతెగల స్పూర్తిదాతల సహకారం కూడా మరవలేనిది.73వ రాజ్యాంగ సవరణలో1991లో అమలులోకి వచ్చిన పంచాయితీరాజ్‌ చట్టాన్ని దేశమంతటా ఒకేరీతిన అమలు చేయడంతో గిరిజనుల్లో తీవ్ర నిరసన మొదలైంది. వారు ఉద్యమబాట పట్టారు. దీంతో కేంద్రప్రభుత్వం దిలీఫ్‌సింగ్‌ భూరియా నేతృత్వంలోని ఓకమిటీని నియమించింది. కమిటి సీపార్సులతో 1996 డిసెంబరులో పీసా చట్టాన్ని అమలులోకి తీసుకు వచ్చారు. దీన్నీ రెండు భాగాలు చేశారు.1) పంచాయతీస్‌ ఎక్స్‌టెన్షన్‌ టూ షెడ్యూల్‌ ఏరియా(పీసా)2) మున్సిపల్‌ పీసా విస్తరణ షెడ్యూల్‌ ఏరియా(మీసా) చట్టాలుగా రూపొందించారు.

Read more

ఆకలి భారతం`సత్య సూత్రాలు

ఆకలి మహమ్మారిని తరిమివేయాలి అంటే, లోపాలమీద పోరాటంలో ప్రజల భాగస్వా ములు కావడం కూడా తప్పనిసరి. భారతదేశం ‘ప్రపంచ ఆకలి లెక్కల్లో, గత సంవత్సరం కంటే 45 స్థానాలు కిందకు పడిపోయి, 100వ స్థానానికి దిగజా రింది.అని ‘అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ’ (వాషింగ్టన్‌) తాజా నివేదిక వెల్ల డిరచింది. వెంటనే, భారత్‌ ప్రజలు ఆకలిదప్పు లతో మలమల మాడిపోతున్నారని మేధావులు, మీడియాల వాళ్ళు రాసేసారు. అసలు ఈ నివేదిక లో పేర్కొన్నది నిజమేనా? భారత్‌ అంత ఘోర స్థితిలో వుందా? ఒకటి రెండు సంవత్సరాల్లో ఆన్ని స్థానాలు పడిపోయేంత ఆకలి తీవ్రత భారతలో పెచ్చుమీరిందా? నివేదికను, అందులోని అంశా లను, గత నివేదికలను సాధికారికంగా పరిశీలిస్తే వాస్తవం మరోలా వున్నది. భారత్‌లో ఆకలి వుండ డం అయితే నిజం. కానీ ఆ ఆకలి లెక్కలు మాత్రం పూర్తి వాస్తవం కాదు.
అసలు వాస్తవం ఏమిటంటే 100వ స్థానానికి పడిపోవడం కరెక్టే. కానీ నిరుడు 55వ స్థానంలో ఉన్నప్పుడు,ఈ సంవత్సరం 100వ స్థానానికి దిగజారడం ఏమిటి అని పరిశీలించి నప్పుడు ఈసారి దేశాలకు ర్యాంకులు ఇచ్చే విధానంలో మార్పు చేసారు. 2016వ సంవత్సరం దాకా ఆ వాషింగ్టన్‌ సంస్థ రెండు వేర్వేరు ర్యాంకుల లిస్టు ఇచ్చేది. ఆకలి సమస్య మరీ ఎక్కువ వున్న దేశాలకు వేరుగా, అభివ ృద్ధి చెందిన దేశాలకు వేరుగా ఇచ్చేది. ఆకలి రూపుమాపే దిశగా ఇంకా ఎంతో వృద్ధి చెందాల్సిన లిస్టులో మన భారత దేశాన్ని పెట్టేది. అప్పుడు మనకు 55ర్యాంకు వచ్చింది. ఈసారి 2016 సంవత్సరానికి గానూ ర్యాంకులను ప్రకటించే విధానంలో మార్పులు చేసి, రెండు లిస్టులు కాకుండా అన్ని దేశాలకు కలిపి ఒకే లిస్టు ఇచ్చింది. సహజంగానే భారత్‌ ర్యాంకు 55వ స్థానం నుంచి 100కు పడిపోయింది. పూర్తి వాస్తవం కాని మన ర్యాంకును చూసి సోషల్‌ మీడియా మొదలుకొని అందరమూ గుండెలు బాదుకున్నాము! సరే, 45స్థానాలు తగ్గిన మాట తప్పే అనుకొందాము. మరి ప్రపంచంలో 100వ స్థానంలో ఉండడం నిజమే కదా అనే ప్రశ్నకు , ఆర్యాంకులను విమర్శిస్తున్నప్పుడు, జవాబు చెప్పాలి. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ పేరిట వాషింగ్టన్‌ సంస్థ ఇచ్చిన లెక్కలను బాగా పరిశీలిస్తే, ఈ ర్యాం కులు స్థూలంగా పోషకాహారలోపం ఆధారంగా ఇస్తూ అయిదు సంవత్సరాల వయస్సు లోపు పిల్లలకు మూడు ఆరోగ్య సూచికలను పునాదిగా చేసుకొన్నారు. వేస్టింగ్‌ (ఎత్తుకు తగినంత బరువు లేకపోవడం), స్టంటింగ్‌ (వయసుకి తగినంత ఎత్తు లేకపోవడం), మరణాల రేటు అనే మూడు ప్రామా ణిక విలువల సగటుని తీసుకొని ర్యాంకులను ఇచ్చారు. పోషకాహారలోపం, అయిదు సంవత్సరాల వయస్సు లోపు శిశువుల మరణాలకి 1/3 వంతు సగటు ఇచ్చి, ఎత్తు, బరువులకు 1/6 వంతు వెయి టేజీ ఇచ్చారు. ఈ సగటుల ప్రామాణిక విలువలను, శాతాల్లోకి మార్చి, 1983-2012 మధ్య సంవ త్సరాల్లో వచ్చిన అత్యధిక శాతంలో నుంచి మైనస్‌ చేసారు. ఈసంవత్సరాల మధ్యకాలంలో ఈ అంశాల ఆధారంగా అత్యధిక పోషకహార లోపం విలువ 76.5%గా తేలింది. అందువలన భారత్‌లో ఆకలిని, ఆయా సంవత్సరాల్లో వచ్చిన సగటులను ‘80’లోనుంచి తీసేసి, ఫలానా శాతం గా చెప్తారు. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ విలువలను 1-100 మధ్యలో చూపిస్తారు. ఒకటి అంటే, పైన చె ప్పిన నాలుగు సూచికలు అసలు కనిపించవు. 100 అంటే ఆకలితో ప్రజలు అలమ టించడం. ఇలాంటి పద్ధతిని మొదటిసారి 2017 సంవత్సరంలోనే వాడారు. ఈ పద్ధతి ప్రకారం, ఈ సంస్థ భారత్‌కు 2016కు మాత్రమే కాకుండా, గడచిన సంవత్సరాలైన 1992, 2000, 2008 సంవత్సరాలకు కూడా విలువలను ఇచ్చింది. వాషింగ్టన్‌ సంస్థ ఇచ్చిన అంచనాల ప్రకారమే భారత్‌ గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ స్కోరును 1992లో 46.2 నుంచి 2017లో 31.4కు తగ్గించు కోగలి గింది. అంటే, కొన్ని సంవత్సరాలుగా భారత్‌లో పోషకాహార లోపం తగ్గుతూ వస్తోంది అని ఆ సంస్థే చెప్తోంది. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో మన ఆకలి సూచిక ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ సర్వే, మన దేశపు జాతీయ కుటుంభ ఆరోగ్య సర్వేలో కూడా తగ్గింది. పోషకాహార లోపం వల్లే తగ్గుతున్నట్లుగా తేలింది. సరే, వీటితో కూడా సంతృప్తి చెందమూ అంటే, జాతీయ నమూనా సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ)లో బాగంగా మీరు ఎప్పుడైనా ఏదేనీ కారణం చేత ఆహారం దొరక్కుండా వున్నారా అని తమ డేటా సేకరణలో బాగంగా అడిగితే 1983లో 16%మంది తాము ఒక్కసారైనా ఆకలి తో ఉన్నాము అని చెప్పగా, 2004-05 నమూనా సర్వేలో కేవలం1.9% మంది మాత్రం తాము ఎప్పుడో ఒకప్పుడు ఆకలితో అన్నం లేకుండా ఉన్నామని చెప్పారు. అంత తక్కువ శాతం వున్నార నేమో అని కాబోలు, ఎన్‌ఎస్‌ఎస్‌ఓ తరువాతి సంవత్సరాల్లో అసలా ‘ఆకలి’ అనే కాలమ్‌ తీసే సింది! కొందరు విమర్శకులు, పేదలు తాము ఆకలితో ఉన్నాము అని చెప్పుకోవడానికి ఇష్టపడరు అని వాదించారు. తమ వాదనకి మద్దత్తుగా ‘ఐక్య రాజ్యసమితి అభివృద్ధి పధకం’ (యుఎన్‌ డిపి) సర్వేలో దేశంలోని అతిపేద జిల్లాల్లో ఆకలితో అల్లాడే వాళ్ళు7.5% అని, కొద్దిగా ఆహారం వుండే వాళ్ళు 29% అని వచ్చిన లెక్కలు చూపించారు. అంటే, ఎన్‌ఎస్‌ఎస్‌ఓ లెక్కల్లో చెప్పుకోలేని వారు, యుఎన్‌డిపి సర్వేలో మాత్రం చెప్పుకోన్నారన్న మాట! సరే, యుఎన్‌డిపి లెక్కలే కరెక్టు అనుకొంటే, భారత్‌ లో జరుగుతున్న అతిపెద్ద సంక్షేమ పధకం, 2013 లో ప్రవేశ పెట్టబడిన జాతీయ ఆహార భద్రతా చట్టం సంగతేమిటి అనే ప్రశ్న వస్తుంది.
భారత్‌ లోని ప్రజలకు ఆహారం ఒక సంక్షేమపథకంగా కాకుండా ‘హక్కుగా’ అందిం చాలనే ఉద్దేశంతో పెట్టబడిన ఈ చట్టంద్వారా 75%గ్రామీణ ప్రజ లకు,50%,పట్టణ ప్రజలకు కవరేజ్‌ వచ్చే విధంగా డిజైన్‌ చెయ్యబడి, లక్ష్యిత ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా దేశంలోని2/3వంతు ప్రజలకి,మనిషికి, నెలకి 5కేజీల వంతున, కేజీరూ.1/2-/1-వంతు న బియ్యం/గోధుమలు/తృణధాన్యాలు ఇవ్వబడు తోంది. అతిపేదలుగా అంచనా వేయబడినవారికి ‘అంత్యోదయ అన్న యోజన’ ద్వారా ఉచితంగా నెలకు 35కేజీల వంతున ఇవ్వబడుతోంది. ఇది కాకుండా, జాతీయ ఆహార భద్రతా చట్టం ద్వారానే గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు, పోషకాహార పధకం కింద, బాలింతలకు పూర్తి భోజనం పెట్టడమే కాకుండా, రూ. 6000 వరకూ మెటర్నటీ బెనిఫిట్‌ కింద ధనసహాయం చెయ్యబడుతోంది. 14 సంవ త్సరాల లోపు పిల్లలకు పోషకాహార విలువల ప్రకారము భోజనం ఇవ్వబడుతోంది.పలు రాష్ట్రాలు ప్రత్యేక పధకాల కింద, అన్న అమ ృతహస్తం లాంటి పధకాలు చేపడుతున్నాయి. ఇక చాలా సంవత్స రాల నుంచి నడుస్తున్న మధ్యాహ్న బోజన పథకం గురించి చెప్పక్కరలేదు. అన్నీ ఇంత బాగా వుంటే అసలు పేదరికం ఎందుకు వుంటుంది అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. ప్రతి పధకంలో ఉన్నట్టే ఈ పధకంలో కూడా లోపాలు వున్నాయి. అవినీతి, డెలివరీ వ్యవస్థ లోపాలు, అమలు యంత్రాగం నిర్లక్ష్యం, ప్రతి రాష్ట్రంలో కొన్ని వేల సంఖ్యలో వున్న ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరు నియంత్రణ లోపాలు, ప్రజల ఆహార అలవాట్లు మారడం.. ఇలా పలు కారణాలుతో మనము ‘ఆకలి’ అనే భూతాన్ని ఇంకా తరిమి వేయలేకున్నాము. ప్రతి రాష్ట్రప్రభుత్వం వందల కోట్ల డబ్బు ప్రజా పంపిణీవ్యవస్థ ద్వారా ఆహార సరఫరా కొరకు ఖర్చు పెడుతోంది. ఇంతమంది ప్రజలు దీని మీద ఆధార పడేటప్పుడు, ప్రభుత్వం, దాని యంత్రాం గంతో పాటుగా తమకు దీనిద్వారా లబ్ధి జరిగే టట్లు చేసుకొనే బాధ్యత ప్రజల మీద కూడా ఉందేమో. తమకు రేషన్‌ సరుకులు దొరక్కపోతేనో, సమయానికి ఇవ్వకపోతేనో, ధర ఎక్కువ చార్జ్‌ చేస్తేనో, లేక అసలు చౌక ధరల దుకాణాలు తెరవక పోతేనో, బరువు సరిగ్గా లేకపోతేనో, అంగన్‌వాడీల్లో తమకు, పిల్లలకు సరైన సేవలు, పోషకాహార విలు వలు కలిగిన భోజనం లేదని భావిస్తేనో, ఇలా తనకు ప్రభుత్వం ఇచ్చిన ఈ సౌలభ్యం అందాల్సిన రీతిలో అందలేదు అని భావిస్తే ఏమి చెయ్యాలి? మండల అధికారులకి రిపోర్టు చెయ్యాలి. వాళ్ళు సరైన లేదా సంత ృప్తికరమైన చర్య తీసుకోలేదని భావిస్తే, జిల్లా స్థాయిలో, రేషన్‌ విషయం అయితే తెలుగు రాష్ట్రాల్లో జేసి-2కి,అంగన్‌వాడీల విష యంలో ప్రాజెక్టు డైరెక్టర్‌ (ఐసిడీఎస్‌)లకు రిపోర్ట్‌ చెయ్యాలి. వీళ్ళేవ్వరి దగ్గర కూడా న్యాయం జరుగ లేదు అని భావిస్తే, పార్లమెంటు ఆమోదించిన ఈ ఆహార భద్రతా చట్టంలో బాగంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, క్వాసీ జ్యుడిషియల్‌ అధికా రాలు కలిగిన ‘ రాష్ట్ర ఆహార కమీషన్‌’లను ప్రతి రాష్ట్రంలోనూ ఏర్పాటు చేసారు. విస్తృత అధికా రాలు కలిగిన ఈ ‘కమీషన్‌’ కు రిపోర్ట్‌ చెయ్యడం అంటే నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ద ృష్టికి తీసుకోచ్చినట్టే! మన రాష్ట్రంలో కూడా ఇటీవల ‘రాష్ట్ర ఆహార కమీషన్‌’ ను ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం ఒక చైర్మన్‌, అయిదుగురు సభ్యులు, ఒక ఐఏఎస్‌ అధికారి మెంబర్‌ సెక్రటరీగా ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ కమీషన్‌ తనకు వచ్చిన ఫిర్యాదులనే కాకుండా, సుమోటోగా, అంటే తనకు తానుగా కూడా చర్యలు తీసుకొని, క్రైం కాని వాటిలో జరీమానాలను శిక్షలుగా వేస్తుంది. నేర చరిత్ర వుంటే, కేసు నమోదు చేసి కోర్టుకు బదిలీ చేస్తుంది. ఆకలి వున్నది అన్నది నిజం. అది ఎంత శాతమైనా సరే. అలాంటి ఆకలిని పారద్రోలాల్సిన అవసరం బాధ్యత అందరిమీద వుంది. ఏ ప్రభుత్వ మైనా పధకాలు తెస్తుంది, నిధులు ఇస్తుంది. పధకాలు ఆశించిన విజయం సాధించి ఆకలి మహమ్మారిని తరిమివేయాలి అంటే, లోపాల మీద పోరాటంలో ప్రజల బాధ్యత కూడా తప్పనిసరి. అప్పుడే ప్రజలు ఆనందంగా వుంటారు.
ఆంధ్ర దేశంలో ఆకలి కేకలు
విద్య, భూమి కలిగి వుండటం, పారి శ్రామీకరణలో భాగం కావడం అంబేద్కర్‌ ఆలోచ నలో ప్రధాన మైనవి. సమాజంలో అణగారిన ప్రజలు ఆకలితో బాధ పడకూడదు. వారి బిడ్డలు ఆకలితో అలమటించకూడదనే సదాÄవేన ముఖ్యమంత్రికి చాలా అవసరం. సులభంగా ప్రజ లకు ఏదో ఒక పేరుతో డబ్బు ఇచ్చివేస్తే మన బాధ్యత తీరిపోతుందని అనుకోవడం సొంత ఎజెండా అవుతుందే కానీ రాజ్యాంగబద్ధ ఎజెండా కాదు. రాష్ట్రంలో ఎటుచూసినా ఆకలి కేకలు విని పి స్తున్నాయి. ప్రభుత్వం ప్రజా సమస్యల పైన ప్రజల ఆకలి తీర్చడం పైన దృష్టి సారించడం లేదు.‘అన్ని విషయాలు నాకు తెలిసాయి’ అని ముఖ్యమంత్రి అనుకోవడమే దీనికంతటికి కారణం. కానీ ఆయనకు తెలియని ఆవేదన తెలుగు నేలలో వుంది. ఈ ఆకలి కేకలకు కారణం ముఖ్యమంత్రికి అంబేద్కర్‌ రాజ్యాంగ సూార్తిే లేకపోవడం. రాజ్యాంగం ప్రధానంగా నిర్దేశిస్తున్న అంశం విద్యాభివ ృద్ధి. కానీ నేడు విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా వుంది. పాఠ్యపుస్తకాలు లేక, బోధించడానికి ఉపాధ్యాయులు లేక త్రైమాసిక పరీక్షలకు విద్యార్థులు సంసిద్ధులు కాలేక పోతున్నారు. ‘అమ్మ ఒడి’ ప్రచారం మోగిపోతోంది. మధ్యాహ్న భోజనంలో నీళ్ళ చారు, బుల్లి గుడ్డుతో అన్నం తినలేక పిల్లలు పస్తులుంటున్నారు. ఒక్కొక్క టాయిలెట్‌ దగ్గర ఇరవై మంది పిల్లలు క్యూలో నిలబడుతున్నారు. బాత్‌ రూమ్‌లు దుర్గంధం కొడుతున్నాయి. రుతుక్రమం సమయంలో ప్యాడ్స్‌ కోసం హెచ్‌.యం ఆఫీసు దగ్గర బాలికలు క్యూ కడుతున్నారు. ఈ దృశ్యాల న్నింటిని పాదయాత్రలో ముఖ్యమంత్రి వర్ణించినవే. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక అటు వంటి పరిస్థితి ఉండదని వాగ్ధానం కూడా చేశారు. కాని ఆస్థితి యథాతథంగానే గాక ఇంకా అధ్వాన్న దశకు చేరుకుంది. విద్య సామాజిక పరిణామానికి మూ లం. సమాజ భవితవ్యానికి సోపానం.
ప్రధానంగా భారత రాజ్యాంగం విద్యా వ్యాప్తినే ప్రభుత్వా లకు ఆదేశిస్తున్నది. ప్రతి విద్యార్థికి విద్యను అందించే ప్రక్రియే ముఖ్యం. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ రూ.రెండు లక్షల 20 వేల కోట్లు కాగా మరి స్కూళ్ళు ఎందుకు ఇంత అధ్వాన్న స్థితిలో వున్నాయి? బడ్జెట్లో కొత్త ప్రభుత్వం మధ్యాహ్న భోజనానికి 16,17 పైసలే పెంచింది. మరి రూ.6,7లకు నాసిరకం భోజనమే కదా వచ్చేది. ఇటువంటి భోజనం చేయలేక ఎంతో మంది హాస్టలు విద్యార్థులు ఉదయం నుండి సాయంత్రం వరకూ ఖాళీ కడుపుతో ఉంటున్నారు. పౌష్టికాహారం అంటే ఏంటో పాలకులకు తెలి యదా? అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ఎటువంటి ఆహా రం వడ్డిస్తున్నారు? ప్రభుత్వానికి మానవతా స్పూర్తే కావాలి. అది లేని ప్రభుత్వం ఎండు కట్టె వంటిం ది. ప్రభుత్వ ప్రతినిధులెందుకు మధ్యాహ్న భోజనం లో సహ పంక్తికి రావడం లేదు. ప్రజా ప్రతినిధుల్లో కోట్లకు పడగలెత్తిన వారున్నారు. ప్రతి ప్రజాప్రతి నిధికి మూడు లేక నాలుగు మండలాలే ఉంటాయి. కొందరి పరిధిలో ఒకమున్సిపాలిటీ కూడా ఉంటుంది. ప్రతి నియోజక వర్గంలో ప్రభుత్వ స్కూళ్ళు వుంటాయి. వారంలో ఏదో ఒకరోజు ఆ స్కూళ్ళ ప్రజాప్రతినిధి పిల్లలకు మంచి భోజనం పెట్టించవచ్చు. అసలు ప్రజాప్రతినిధులను సామా జిక కార్యకర్త్తలుగా ఎందుకు మార్చడం లేదు? పదో తరగతి ఉత్తీర్ణులైన వారిలో 50శాతం మంది ఇంటర్మీయట్‌లో చేరడం లేదు. ఈ విషయం మీద ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించడం లేదు? ‘మీ పిల్లల భవిష్యత్తు నాచేతుల్లో పెట్టండ’ని పాద యాత్రలో భరోసా ఇచ్చారు. మరి ఇప్పటి పరిస్థితి ఏంటి? ఇంటర్మీయట్‌, బి.ఎచదువుతున్న విద్యా ర్థులకు మధ్యాహ్న భోజనం లేదు. స్కూళ్ళలో, కాలేజీల్లో మంచినీళ్ళు లేక విద్యా ర్థులు జ్వరాల బారిన పడుతున్నారు. 300నుండి వెయ్యి మంది ఉండే స్కూళ్ళల్లో ప్రాథమిక చికిత్స అందించే నర్స్‌ లేరు. ప్రభుత్వ పాఠశాలలను ఆశ్రయిస్తున్న వారంతా యస్‌.సి,యస్‌.టి, బి.సి పిల్లలే! 80 శాతం మంది యస్‌.టి, యస్‌.సి లే అని తేలింది.
‘నాకు పార్టీలతో పనిలేదు. పారదర్శకతే ముఖ్యం’ అని చెప్పిన ముఖ్యమంత్రి,మధ్యాహ్న భోజన కార్మికులను, యానిమేటర్లను, ఆశా వర్కర్ల ను, మున్సిపల్‌ అంగన్‌వాడీ వర్కర్లను రాజకీయ కారణాలతో తొలగించి, తమ పార్టీ వారిని పెట్టు కొంటున్నారు. ఇదిరాజ్యాంగ విరుద్ధం! ఇలా తొలగించడం వల్ల ఒక యానిమేటర్‌ ఆత్మహత్య చేసుకొన్నారు కూడా! ‘పార్టీ కార్యకర్తలకే పదవులు’ అనే అంశం వల్లనే కదా చంద్రబాబు ప్రభుత్వం పై అసంత ృప్తి రగిలింది. బాబు దారి లోనే ఈ ముఖ్యమంత్రి నడుస్తున్నారు. అంతేకాక, అనేకాం శాల్లో ఆయన్ని మించి పోతున్నారు.
పేదల ఆకలి తీర్చే ‘అన్న క్యాంటిన్‌’ని కూడా రద్దు చేశారు. దీని వెనుక ఆంతర్యం ఏంటి? మరోపక్క వ్యవసాయ కార్మికులకు భూమి పంచ కుండా ఉపాధి కూలీలుగా మార్చారు. గుంటూరు జిల్లా నివేదిక చూస్తే విస్తుపోక తప్పదు. జిల్లాలో సుమారు 13 లక్షల మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు. 7,99, 599 కుటుంబాలకు జాబ్‌ కార్టులు మంజూరు చేశారు. వీరిలో దళిత కుటుంబాలు 4,78,919 మంది, గిరిజనులు 1,12,954 మంది ఉన్నారు. మొత్తం జాబ్‌ కార్డుల్లో నమోదైన కూలీల సంఖ్య 15,53,660 మంది ఉన్నారు. దళిత, గిరిజన, బీసీ వర్గాల నుంచి మాత్రమే కాకుండా ఓసీల్లోని పేదలు సైతం కూలీలుగా నమోదైన పరిస్థితి ఉంది. అయితే జిల్లాలో ప్రతి రోజూ 1.50లక్షల మందికే పని కల్పిస్తున్నారు. వేతనాలను పరిశీలిస్తే కనీస వేతనం రూ.211 రావాల్సి వుంది కానీ రూ.80 నుంచి రూ.140మాత్రమే ఇస్తున్నారు. ఇకపోతే 100 పని దినాలు కల్పించాల్సి ఉండగా సరాసరి 40 పని దినాలు మాత్రమే కల్పిస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి. దీనిని బట్టి పరిశీలిస్తే ప్రతి వ్యవసాయ కార్మికుడు రోజుకు కనీస వేతనం నుంచి రూ.81కోల్పోతున్నట్లు వెల్ల డవుతోంది. ప్రతి రోజూ పని ప్రదేశాలకు ప్రతి కూలి తన మంచి నీరు తానే తెచ్చుకుంటే వేతనం కాకుండా రోజుకు రూ.5 మంచి నీటికి, పలుగు, పార తెచ్చుకుంటే రూ.5 అదనంగా అద్దె ఇవ్వాలి. ఈ వివరాలన్నీ పే స్లిప్పులో నమోదై పారదర్శకంగా కూలీలకు తెలియజేయాలి. అయితే అది అమలు జరగడం లేదు. పని ప్రదేశాల్లో మెడికల్‌ కిట్స్‌ దాదాపు లేవు. మజ్జిగ సరఫరా చేయడం లేదు. గతంలో మజ్జిగ సరఫరా చేసినా బిల్లులు రావడం లేదని మేట్స్‌ చెప్పారు. ఒకజిల్లా నివేదికే ఇలా వుంటే రాష్ట్ర మొత్తంగా ఉపాధి కూలీల సంగతి ఆలోచిస్తే దారుణంగా వుంది. ప్రజల దాహం తీర్చడానికి, ప్రజల పొట్ట నింపడానికి వెనకాడడం ఏ ధర్మ సూత్రమో ముఖ్యమంత్రే చెప్పాలి. తన చేతిలో రెండు కోట్ల 20లక్షల ఎకరాల భూమి పెట్టుకొని విదేశీ కంపెనీలను పిలిచి పందేరం చేయాలని చూస్తున్నారే గాని, ఆభూమిని భూమి లేని పేదలకు పంచి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని చూడ డం లేదు.
విద్య,భూమి కలిగి వుండటం, పారి శ్రామీకరణలో భాగం కావడం అంబేద్కర్‌ ఆలోచన లో ప్రధానమైనవి. సమాజంలో అణగారిన ప్రజలు ఆకలితో బాధ పడకూడదు. వారి బిడ్డలు ఆకలితో అలమటించకూడదనే సదాÄవేన ముఖ్యమంత్రికి చాలా అవసరం. సులభంగా ప్రజలకు ఏదో ఒక పేరుతో డబ్బు ఇచ్చివేస్తే మన బాధ్యత తీరిపో తుందని అనుకోవడం సొంత ఎజెండా అవుతుందే కానీ రాజ్యాంగబద్ధ ఎజెండాకాదు.
డా॥బి. ఆర్‌. అంబేద్కర్‌ అణగారిన వర్గాలకు న్యాయం చేయడం అంటే భూమి పంప కంలో,వారి పిల్లలకు విద్యను నేర్పించడంలో, పరిశ్రమల్లో వారిని భాగం చేయ డంలో చిత్తశుద్ధితో వుండాలని చెప్పారు. నిజానికి దళితుల నుండి ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా ముఖ్య మంత్రిని పొగిడే పనిలో వున్నారు గాని వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేట పరిస్థితి లేదు. ద్వేషంతో దేన్నీ నిర్మించలేం. ప్రేమ, కరుణ తోనే పునర్నిర్మాణం సాధ్యం అని ముఖ్య మంత్రి తెలుసు కున్న నాడు ఆంధ్ర దేశంలో ఆకలి కేకల నివారణకు పరిష్కారం రూపొందుతుంది.-నీలయపాలెం విజయ్‌ కుమార్‌

1 53 54 55 56 57 75