అడుగంటిన బొగ్గు నిక్షేపాలు

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని విద్యుత్‌ కేంద్రా లలో బొగ్గునిల్వలు అంతరించి పోవడంతో రాబో యే రోజుల్లో రాష్ట్రం అంధకారమయం కానున్నది. బొగ్గు నిల్వలు తగినంతగా ఉన్నాయా లేవా అని ముందుచూపు లేనట్లు ప్రభుత్వాలు వ్యవహ రిస్తు న్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ప్రజలకు విద్యుత్‌ పొదుపు గురించి ఉచిత సల హాలు మాత్రం ఇస్తున్నారు విద్యుత్‌ శాఖ అధికారులు. సాయంత్రం పూట ఆరు గంటల నుండి పది గంటల వరకు ఏసీలు వాడొద్దని సెలవిస్తు న్నారు.
దేశవ్యాప్తంగా బొగ్గునిల్వల కొరత ఏర్పడటం, కేంద్రం నుంచి సహకారం లభించక పోవడం వంటి కారణాలతో రాష్ట్రంలోని ధర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లు బొగ్గు సంక్షోభం బారిన పడ్డాయి. ఇప్ప టికే చాలా వరకూ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు దాదాపు అంత రించిపోయాయి. దీంతో కొన్ని రోజులుగా సగం కెపాసిటీ మేరకే విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విద్యుత్‌ కోతలు విధిస్తోంది. సింగరేణి గను లతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోని పవర్‌ ప్లాంట్లకు రావాల్సిన బొగ్గు నిల్వలు దాదాపుగా నిలిచిపోవడంతో పవర్‌ ప్లాంట్లు అల్లాడు తున్నాయి. మన రాష్ట్రంలో 9ధర్మల్‌ విద్యుత్‌ ఆధారిత ప్లాంట్లు ఉన్నాయి. ఇందులో విశాఖ జిల్లా పరవాడలోని ఎన్టీపీసీ సింహాద్రి సూపర్‌ ధర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో 2000 మెగావాట్లు, గాజువాక లోని వీటీపీఎస్‌లో 1040 మెగావాట్లు, విజయవాడలోని ఎన్టీ పీఎస్‌లో 1760 మెగావాట్లు,కడప జిల్లా ముద్దనూరు లోని ఆర్టీపీఎస్‌ లో 1650 మెగా వాట్లు, నెల్లూరు జిల్లా కృష్ణపట్నం లోని డీఎస్టీపీఎస్‌ లో 1600 మెగావాట్లు,సింహపురి ధర్మల్‌ పవర్‌ స్టేషన్లో 600 మెగావాట్లు,మీనాక్షి ధర్మల్‌ పవర్‌ స్టేషన్లో 1000 మెగావాట్లు, సెంబ్‌ కార్ప్‌ ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌లో 1320 మెగావాట్లు, ఎస్జీపీఎల్‌ పవర్‌ స్టేషన్లో 1320 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం ఉంది. ఈ మొత్తం ప్లాంట్లు కలిపి 12 వేల 290 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయాల్సి ఉంది. కాని బొగ్గు కొరత కారణంగా సగం ఉత్పత్తే సాధ్యమవుతోంది. కొన్ని రోజులుగా ఇదే పరిస్ధితి. ప్లాంట్లు పూర్తిగా పని చేయక పోవడంతో ఆమేరకు విద్యుత్‌ ఉత్పత్తి కూడా భారీగా తగ్గిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపుగా బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. రేపు,ఎల్లుండి కల్లా మిగిలిన నిల్వలు కూడా తరిగిపోయే ప్రమాదం పొంచి ఉంది.అప్పుడు ధర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లన్నీ మూతపడటం ఖాయంగా కనిపిస్తోంది. బొగ్గు కొరత కార ణంగా ఆంధ్రప్రదేశ్‌లో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో ప్రతిరోజూ దాదాపు 2000 మెగావాట్లకు పైగా కొరత ఏర్పడుతోంది. ఇది ఇవాళ రేపట్లో మరింత ఎక్కువ కానుంది. సంక్షోభం తీవ్రతరం అయితే, డిస్కమ్‌లు బహిరంగ మార్కెట్‌ నుండి అధిక ధరలకు విద్యుత్‌ కొనుగోలు చేయాల్సిన పరిస్ధితులు నెలకొంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. విద్యుత్‌ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడ డడంతో….బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధరకు కొనాల్సిన దుస్థితి ఏర్పడిరది. అలా చేయాలన్నా ప్రభుత్వం దగ్గర తగినన్ని నిధులు ఉండాలి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వం…ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి. పైగా ఇప్పటికే ఆస్తి పన్ను, ట్రూ అప్‌ చార్జీల పేరుతో విద్యుత్‌ చార్జీల పెంపుదలపై ప్రజాగ్రహనికి గురైంది. ఇప్పుడు విద్యుత్‌ కొనుగోలుకు ఎక్కువ డబ్బు ఖర్చు చేసి డిస్కంలపై ఆర్థిక భారం తగ్గించాలంటే విద్యుత్‌ చార్జీలు పెంచక తప్పదు. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యంచేసి, ప్రతి రోజు డీజిల్‌,పెట్రోలు,గ్యాసు నిత్యావసర సరుకులు ధరలను పెంచుకుంటూ పోతోంది కేంద్ర ప్రభు త్వం. చెంపదెబ్బ గోడ దెబ్బ మాదిరిగా తయారైంది రాష్ట్ర ప్రజల పరిస్థితి.
విద్యుత్‌ సంక్షోభంపై కేంద్రం అప్రమత్తం..
దేశంలోని అనేక విద్యుత్‌ కంపెనీలలో బొగ్గు నిల్వలు తగ్గిపోయాయి. దీంతో దేశంలోని అనేక రాష్ట్రాలలో తీవ్ర విద్యుత్‌ సంక్షోభం ఏర్పడిరది. మున్ముందు కాలంలో దేశంలోని పలు ప్రాంతా ల్లో కారు చీకట్లు అలుముకోనున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. ముందుగా దక్షిణ భారత దేశంలోని బెంగళూరు పట్టణంలో అంధకారం నెలకొంటుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దేశంలో విద్యుత్‌ సంక్షోభం,బోగ్గు నిల్వల కొరతపై దృష్టిసారించింది. బొగ్గు నిల్వల కొరత, విద్యుత్‌ అంతరాయాల నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర అప్రమత్తమై.. అధి కారులు,బొగ్గు కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ మేరకు హోంమంత్రి అమిత్‌ షా..ఇప్పటికే కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌ కె సింగ్‌,బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేశంలో బొగ్గు నిల్వల కొరత,విద్యుత్‌ అంతరాయాల నేపథ్యంలో ఈ సమీక్షపై ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. బొగ్గు కొరత కారణంగా దేశంలోని పలు ప్లాంట్లల్లో విద్యుత్‌ ఉత్పత్తిలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. రాష్ట్రాల్లో దిగజారుతున్న పరిస్థితుస్థిలపై ఢల్లీి, పంజాబ్‌,కేరళ,మహారాష్ట్ర,కర్ణాటక ప్రభుత్వాలు కేంద్రానికి లేఖలు కూడా రాశాయి. దీంతో పాటు విద్యుత్‌ను జాగ్రత్తగా వాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. అక్టోబర్‌ 7న కేంద్ర విద్యుత్‌ అథారిటీ నివేదిక ప్రకారం, దేశంలోని 135 ప్లాంట్లలో 110కర్మాగారాలు బొగ్గు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అలాగే 16 ప్లాంట్లలో ఒక్క రోజుకు సరిపడా కూడా బొగ్గు నిల్వ లేదని సమచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే బొగ్గు సరఫరాను పెంచినట్లు కోల్‌ ఇండియా ప్రకటనను విడుదల చేసింది. దసరా అనంతరం బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచుతా మని ప్రకటించింది.
అసలు బొగ్గు కొరతకు కారణాలేంటి.?
నల్లబంగారానికి డిమాండ్‌ పెరిగింది. దేశ వ్యాప్తంగా ఉన్న థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో బొగ్గు నిల్వలు తగ్గుతున్నాయి. సరఫరా చేయడానికి సరిపడా బొగ్గు ‘కోల్‌ ఇండియా’ దగ్గరఉందా? లేదా? అనేదానిపై క్లారిటీ లేదు. సెంట్రల్‌ గవర్నమెంట్‌ కావాల్సినంత బొగ్గు ఉందం టోంది. కానీ..థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో మాత్రం కొన్ని రోజులకు సరిపడా బొగ్గు మాత్రమే నిల్వ ఉంది. అసలు ఈ కొరతకు కారణాలేంటి? కరెంట్‌ అవసరం ఒక్కసారిగా ఎందుకు పెరి గింది? కొన్ని రోజుల నుంచి బొగ్గు కొరతకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపి స్తున్నాయి. రాబోయే రోజుల్లో విద్యుత్‌ కొరత తప్పదనే అంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌. మనది ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అయినా మునుపెన్నడూ లేని విధంగా కరెంట్‌ సంక్షోభం వచ్చే పరిస్థితులు ఉన్నాయి. మన దేశంలో దాదాపు 70శాతం ఎలక్ట్రిసిటీ థర్మల్‌ ప్లాంట్ల నుంచే వస్తుంది. అయితే.. కొన్నాళ్ళ క్రితం కరోనా ఎఫెక్ట్‌ ఎక్కువగా ఉండడం వల్ల కంపెనీలు మూత పడ్డాయి. దాంతో కరెంట్‌ వినియోగం తగ్గింది. ఆ తర్వాత కంపెనీలు తెరిచినా థర్డ్‌ వేవ్‌ భయంతో పూర్తి ఆక్యు పెన్సీతో పనిచేయలేదు. తక్కువ స్టాఫ్‌తో తక్కువ ప్రొడ్యూస్‌ చేశాయి. కానీ.. ఇప్పుడు దాదాపు అన్ని కంపెనీలు పూర్తి కెపాసిటీతో పనిచేస్తు న్నాయి. దానివల్ల కరెంట్‌ వాడకం బాగా పెరిగింది. ప్రొడక్షన్‌ పెంచాల్సి వచ్చింది. కానీ.. ప్రొడక్షన్‌కి తగ్గట్టు బొగ్గు సరఫరా జరగడం లేదు. దానివల్ల నిల్వలు తగ్గుతు న్నాయి. ఈ కొరత ఇలాగే కొనసాగితే ఈ ఎఫెక్ట్‌ దాదాపు అన్ని రంగాల మీద పడే ప్రమాదం ఉందని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. దేశంలో బొగ్గు కొరత ఉందని కొన్ని రాష్ట్రాలు కేంద్రానికి చెప్పినా.. కేంద్రం మాత్రం పరిస్థి తులు బాగానే ఉన్నాయని అవసరమైనంత బొగ్గు సరఫరా చేయడానికి రెడీగా ఉన్నామని చెబు తోంది. కాకపోతే ప్లాంట్లలో నిల్వలు తక్కువగా ఉన్నాయని క్లారిటీ ఇచ్చింది. పైగా ‘‘ఎవరికి కావాలో చెప్పండి. సప్లై చేస్తాం’’ అంటూ కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ చెప్పారు. దేశంలో నాలుగు రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయన్నారు. కానీ..అది కేవలం స్టోరేజీ మాత్రమే ప్రతి రోజూ సప్లై జరుగుతూనే ఉందన్నారు. దీంతో అసలు బొగ్గు కొరత ఉందా? లేదా? అని అందరూ చర్చించుకుం టున్నారు. అయితే.. పరిస్థితులను బట్టి చూస్తే ప్రపంచవ్యాప్తంగా బొగ్గు కొరత ఉన్నదనే తెలు స్తోంది. ఎందుకంటే.. అంతర్జాతీయంగా బొగ్గు ధరలు బాగా పెరిగాయి. పొరుగు దేశం చైనా లో బొగ్గు కొరత వల్లే కరెంట్‌ ప్రొడక్షన్‌ బాగా తగ్గింది. పరిశ్రమలతోపాటు ఇళ్లకు కూడా కరెంటు కోతలు పెడుతున్నారు. అదే పరిస్థితి మనకూ వచ్చే ప్రమాదముందని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. ఇక బొగ్గు సరఫరా లేకపోవడం వల్లే బీహార్‌,రాజస్థాన్‌,జార్ఖండ్‌,పంజాబ్‌,ఏపీ వంటి రాష్ట్రాల్లో కరెంట్‌కోతలు ఎక్కువగా ఉంటున్నాయని ఎక్స్‌పర్ట్స్‌ అంటున్నారు.
మనకూ సమస్యేనా?
సింగరేణి బొగ్గు గనులు మన రాష్ట్రంలోనే ఉన్నా..రాష్ట్రంలోని థర్మల్‌ పవర్‌ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గాయి. జెన్‌కో, సింగరేణి, ఎన్టీపీసీ థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో మామూలుగా 15రోజులకు సరిపడా బొగ్గు స్టోర్‌ చేస్తారు. కానీ..ఇప్పుడు నాలుగైదు రోజులకు సరిపడా నిల్వలే ఉన్నట్టు,ఈస్టేషన్లకు తక్కువగా సప్లై చేస్తూ, కొరతతో ప్రొడక్షన్‌ ఆగిపోయే స్థితిలో ఉన్న స్టేషన్లకు సింగరేణి సంస్థ బొగ్గు సప్లై చేస్తోందని తెలుస్తోంది. కానీ..వర్షాలవల్ల కొన్నా ళ్ల సింగరేణిలో ప్రొడక్షన్‌ తగ్గినా ఇప్పుడు మళ్లీ మెరుగుపడిరది. ఇప్పుడు రోజుకు 1.8 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి ఉత్పత్తి చేస్తోంది. అందులో తెలంగాణలోని థర్మల్‌ పవర్‌ స్టేషన్లకు 30,000టన్నుల బొగ్గును సరఫరా చేస్తోంది. మిగతాది కర్నాటక,మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లకు సరఫరా అవుతోంది. ఇదిలా ఉండగా తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి తెలంగాణలో ఎటువంటి సమస్య రాదని తేల్చిచెప్పారు. ‘‘తెలంగాణ స్టేట్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’’ (ుూGజుచీజూ) ప్రకారం.. తెలంగాణలో థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో 3,772.5 మెగావాట్ల కరెంట్‌ ప్రొడ్యూస్‌ చేయొచ్చు. ప్రస్తుతం 3.8 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని మంత్రి చెప్పారు. అంతేకాకుండా పెద్దపల్లి జిల్లాలోని రామగుండం దగ్గర ఉన్న 2,600 మెగావాట్ల నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ పవర్‌ స్టేషన్‌ కూడా తెలంగాణలో కరెంట్‌ సరఫరాకు సాయం చేస్తుంది.
‘పిట్‌హెడ్‌’ కాబట్టి ఇబ్బంది లేదు
బొగ్గు గనులకు 50కిలోమీటర్లలోపు ఉండే థర్మల్‌ పవర్‌ ప్లాంట్లను ‘పిట్‌హెడ్‌’ అంటారు. వీటికి బొగ్గును అందించడం పెద్ద కష్టమేమీ కాదు. అందువల్ల ట్రాన్స్‌పోర్టేషన్‌ టైం, ఖర్చు కూడా చాలా తక్కువ. మన దగ్గర ఎక్కువగా ‘పిట్‌హెడ్‌’ ప్లాంట్లే ఉన్నాయి. అందువల్ల ఈ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గినా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు.
కొరత ఎందుకొచ్చింది?
పొరుగుదేశం చైనాలో కూడా కరెంట్‌ కొరత ఏర్పడిరది. కొన్ని పరిశ్రమలు మూతపడే పరిస్థితికి వచ్చాయి. ఆ పరిస్థితి మనకు రాకూడదనే బొగ్గు మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఇంటర్‌-మినిస్టీరియల్‌ సబ్‌-గ్రూప్‌ వారానికి రెండుసార్లు బొగ్గు స్టాక్‌ పరిస్థితి గురించి తెలుసుకుంటోంది. సమస్యలను పరిష్కరిస్తోంది. కరోనా లాక్‌డౌన్‌,వర్షాలు, ఫ్యాక్టరీలు ఎక్కువ కరెంట్‌ వాడడం ఇలా.. బొగ్గు కొరత ఏర్పడడానికి అనేక కారణాలు ఉన్నాయి.
కరోనా ఎఫెక్ట్‌
లాక్‌డౌన్‌ వల్ల స్టాఫ్‌ని తగ్గించుకున్న ఫ్యాక్టరీలు మళ్లీ కరోనా కేసులు పెరుగుతాయేమోననే భయంతో పూర్తి ఆక్యూపెన్సీతో ప్రొడక్షన్‌ మొదలుపెట్టలేదు. కానీ.. ఇప్పుడు మళ్లీ తేరుకున్నాయి. స్టాఫ్‌ని పెంచుకుని పూర్తి కెపాసిటీతో ప్రొడక్షన్‌ మొదలుపెట్టాయి. మళ్లీ మామూలు పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా కరెంట్‌కు డిమాండ్‌ పెరిగింది. కరెంట్‌ వాడకం పెరగ డం వల్ల దాని ప్రొడక్షన్‌కు ఉపయోగించే బొగ్గుకు కూడా డిమాండ్‌ బాగా పెరిగింది. అందుకే కొరత ఏర్పడిరది. ఈమధ్యే దేశంలో కరెంట్‌ వాడకం రోజుకు 4బిలియన్‌ యూనిట్లు దాటింది. ఇందులో 65నుండి 70శాతం బొగ్గు నుంచే ఉత్పత్తి అవుతోంది. 2019 ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో నెలకు దాదాపు 106.6 బిలియన్‌ యూనిట్లు, అదే 2021లో నెలకు 124.2 బిలియన్‌ యూనిట్లు కన్జ్యూమ్‌ అయింది.
వర్షాలు:
ఈ ఏడాది సెప్టెంబర్‌లో బొగ్గు గనులున్న ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు పడ్డాయి. దాంతో ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో నీళ్లు నిండడం వల్ల కోల్‌ ప్రొడక్షన్‌ తగ్గింది. ఈ సమస్య దాదాపు ప్రతి ఏటా ఉంటుంది. కానీ..ఈ సారి డిమాండ్‌ పెరిగి, ప్రొడక్షన్‌ తగ్గడంతో కొరత ఏర్పడిరది. రుతుపవనాల మొదలవడానికి ముందే ఎక్కువ బొగ్గును స్టోర్‌ చేసుకోగలిగితే ఈ సమస్య వచ్చేది కాదు.
ఇంటర్నేషనల్‌ మార్కెట్‌
అంతర్జాతీయ మార్కెట్‌లో బొగ్గు ధరలు బాగా పెరిగాయి. మనం ఎక్కువగా ఇండోనేసియా నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటున్నాం. ఇండోనేసియా నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గు ధర మార్చి-2021లో టన్నుకు 60డాలర్లుగా ఉంది. అదే (సెప్టెంబర్‌, అక్టోబర్‌లో 160 డాలర్లకు పెరిగింది. దానివల్ల ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుని కరెంట్‌ ప్రొడ్యూస్‌ చేస్తున్న ప్లాంట్లలో ప్రొడక్షన్‌ తగ్గింది. 2019తో పోల్చితే ఇతర దేశాల నుంచి ఉత్పత్తి చేసు కుంటున్న బొగ్గుతో ప్రొడ్యూస్‌ చేసే కరెంట్‌ 2021లో 43.6శాతం తగ్గింది. దీంతో బొగ్గు కొరతను తగ్గించేందుకు కోల్‌ ఇండియా బొగ్గు ప్రొడక్షన్‌ను పెంచింది. అక్టోబర్‌ 7న, కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (జIూ)1.501 మిలియన్‌ టన్నుల బొగ్గును సప్లై చేసింది. దానివల్ల వాడకానికి, సప్లైకి మధ్య ఉన్న తేడాని తగ్గిం చింది. సప్లై క్రమంగా పెంచాలని బొగ్గు మంత్రిత్వశాఖ తెలిపింది.
అందరికీ ఇదే పరిస్థితి
మన దేశంలోనే కాదు..ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ధరల పెరుగుదల, పెట్రోల్‌ సంక్షోభం వంటివి ఇబ్బందికరంగా మారాయి. యూరప్‌ లో నేచురల్‌ గ్యాస్‌ ధర ఈఏడాది దాదాపు నాలుగింతలు పెరిగింది. ఇక కరెంట్‌ చార్జీలు మూడిరతలు పెరిగాయి. మన దేశంలో కూడా పెట్రోల్‌,వంట గ్యాస్‌ ధరలు బాగా పెరిగాయి. కొన్నాళ్ల క్రితం శ్రీలంకలో ఏకంగా ఫుడ్‌ ఎమ ర్జెన్సీ ప్రకటించారు.ఎండ ఎక్కువగా ఉంటేనే కరెంట్‌ ఎక్కువ ప్రొడ్యూస్‌ అవుతుంది. గాలితో కూడా కరెంట్‌ ప్రొడ్యూస్‌ చేయొచ్చు. విండ్‌ పవర్‌ను కరెంట్‌గా మార్చడానికి విండ్‌ టర్బైన్‌లను వాడతారు. దీనికి మెకానికల్‌ పవర్‌ కోసం గాలి మరలను వాడతారు. కాకపోతే ఇది గాలి ఎక్కువగా వీచినప్పుడే ఉత్పత్తి అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఖర్చయ్యే కరెంట్‌లో విండ్‌ పవర్‌తో దాదాపు రెండు శాతం ప్రొడ్యూస్‌ చేస్తున్నారు. నేచురల్‌ గ్యాస్‌ టర్బైన్లు, ఆవిరి టర్బైన్లను వాడి కరెంట్‌ను ఉత్పత్తి చేయొచ్చు. బొగ్గు లాంటి శిలాజ ఇంధనాల కంటే నేచురల్‌ గ్యాస్‌ మండిర చడంవల్ల తక్కువ కాలుష్యం అవుతుంది. ఇది చాలా తక్కువ కార్బన్‌ డై ఆక్సైడ్‌ను రిలీజ్‌ చేస్తుంది.కాబట్టి థర్మల్‌ పవర్‌ కంటే నేచురల్‌ గ్యాస్‌తో కరెంట్‌ను ప్రొడ్యూస్‌ చేయడమే బెటర్‌. నేచురల్‌ గ్యాస్‌ వల్ల పెట్రోలి యంను కాల్చడం కంటే 30%తక్కువ, బొగ్గును కాల్చడం కంటే 45%తక్కువ కార్బన్‌ డై ఆక్సైడ్‌ రిలీజ్‌ అవుతుంది.న్యూక్లియర్‌ ఫూజన్‌ ద్వారా ఇది పవర్‌ని ప్రొడ్యూస్‌ చేస్తుంది. కాబట్టి ఇదిథర్మల్‌ పవర్‌ కంటే బెటర్‌. ఎందుకంటే ఇందులో కార్బన్‌ ప్రొడ్యూస్‌ అవ్వదు. థర్మల్‌ నుంచి న్యూక్లియర్‌ పవర్‌కి మారడం వల్ల డీకార్బోనైజింగ్‌ అవు తుంది. కానీ.. న్యూక్లియర్‌ పవర్‌ స్టేషన్ల సేఫ్టీపై ఎన్నో భయాలు ఉన్నాయి. అందుకే మన దేశంలో అణు విద్యుత్‌ చాలా తక్కువగానే ఉత్పత్తి అవుతుంది.
కొరత రాకుండా ఏం చేయాలి?
బొగ్గు కొరత రాకుండా ఉండేందుకు ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసు కోవాలి. లేదంటే ఇలాంటి పరిస్థితులు మళ్లీ మళ్లీ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా వర్షాలు, వరదల వల్ల సెప్టెంబర్‌లో బొగ్గు ప్రొడక్షన్‌ తగ్గుతుంది. అలా జరగకుండా ఉండాలంటే.. వర్షాకాలం రాకముందే ఎక్కువగా తవ్వి స్టోర్‌ చేసుకుని పెట్టుకోవాలి. లేదంటే.. ఎలాగూ వర్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి హైడల్‌ పవర్‌ జనరేషన్‌ కెపాసిటీని పెంచుకోవాలి. సెప్టెంబరు 30 వరకు గడిచిన ఆరు నెలల్లో హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల నుండి 14%,మాత్రమే కరెంట్‌ ప్రొడ్యూస్‌ అయింది. డ్యామ్‌ల దగ్గర మరిన్ని హైడ్రో పవర్‌ స్టేషన్లను ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాకుండా కొన్ని అల్యూమినియం, సిమెంట్‌ కంపెనీలు ఎక్కువగా బొగ్గును కొంటుంటాయి. ఆ కొనుగోళ్ల మీద కూడా ఎప్పటికప్పుడు కంట్రో ల్‌ ఉండాలి. దేశంలో బొగ్గుకు డిమాండ్‌ పెరుగుతుండడం వల్ల రిఫైనరీల నుంచి అల్యూ మినియం, మాం సం ప్రాసెసింగ్‌ చేసే సంస్థల వరకు చాలా కంపెనీలపై ఎఫెక్ట్‌ పడుతోంది. ఎక్కువ ఎఫెక్ట్‌ పడే కంపెనీలు ఇవి..
పెట్రోలియం
పవర్‌ రేషన్‌ పరిస్థితి మరింత దిగజారితే… పెట్రోలియం రంగం మీద కూడా ఎక్కువ ఎఫెక్ట్‌ పడే ప్రమాదం ఉంది. అయితే.. పెట్రోలియం రిఫైనరీలకు ఎక్కువగా కరెంట్‌ అవసరం ఉంటుంది. ఒకవేళ వాటికి సరిపడా కరెంట్‌ అందించకపోతే వాళ్లకున్న క్యాప్టివ్‌ పవర్‌ ప్లాంట్ల నుంచి పవర్‌ జనరేట్‌ చేసు కుంటారు. అయితే.. వాటిలో చాలా యూనిట్లు గ్యాస్‌ ద్వారా నడుస్తాయి. దానివల్ల నేచురల్‌ గ్యాస్‌ ధరలు పెరిగే ప్రమాదం కూడా ఉంది. ఈ రంగంలో ప్లాస్టిక్‌, ఫైబర్‌, సింథటిక్‌ రబ్బర్‌ తయారు చేసే ఫ్యాక్టరీలు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. వెహికల్‌ టైర్లు, ప్యాకేజింగ్‌ మెటీరియల్స్‌ తయారుచేసే వాటిపై కూడా ప్రభావం ఉండొచ్చు. కొన్ని పరిశ్రమలకు సొంత పవర్‌ యూనిట్లు ఉండవు. అందుకని ప్రొడక్షన్‌ ఆగకుండా ఉండేందుకు వాళ్లు డీజిల్‌ జనరేటర్లను వాడతారు. ఇండియాలో పెద్దస్టీల్‌ ఫ్యాక్టరీలకు సొంత పవర్‌ ప్లాంట్లు ఉన్నాయి. వాళ్లు బొగ్గును వేలం పాటలో కొనుక్కుంటారు. ఇక చిన్న చిన్న ఫ్యాక్టరీలు సొంతంగా కరెంట్‌ను తయారు చేసుకోలేవు. కాబట్టి వీటిలో ప్రొడ క్షన్‌పై ప్రభావం పడే ప్రమాదం ఉంది.
-డా.ఎం.సురేష్‌ బాబు

అటవీ చట్టం సవరణల వెనక మర్మమేమిటీ?

గత ముప్పై సంవత్సరాలక్రితం దేశంలో నూతనఆర్ధిక విధానాన్ని ప్రవేశ పెట్టారు.స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సోషలిస్టు విధానం అమలు పర్చారు. అటు కమ్యూనిస్టులు కాదు..ఇటు కాపిలిస్టులు కాదు..మిశ్రమ ఆర్ధిక విధానాన్ని మన దేశం ఎంచుకోవడం జరిగింది.రాజకీయ విధానంలో బహుళజాతి ప్రాజెక్టులు అనగా స్టీల్‌ ప్లాంట్‌,పవర్‌ ప్రాజెక్టులు,వంతెనల నిర్మాణాలు వంటి దేశంలో ఉన్న ప్రభుత్వరంగసంస్థలపై ప్రభుత్వమే పెట్టుబడులు పెడుతోంది. వీటిపై లాభం రావడం సమయం పడుతోంది. ఈలోగా లాభంవచ్చేటప్పటికీ ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. 2001లోప్రభుత్వ రంగ సంస్థ బాల్కో,వేదాంత వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయాయి. అక్కడ నుంచి పరిశీలిస్తే అన్నీ ప్రైవేటీకీకరణ అయిపోతూనే ఉన్నాయి. ఆఖరికి విశాఖ స్టీల్‌ఫ్లాంట్‌,ఎయిర్‌ ఇండియా లిమిటెడ్‌ అన్నీ అమ్ముడైపోతున్నాయి. గిరిజనులున్న అటవీ ప్రాంతాలలో అటవీ అభి వృద్ధిపేరుతో రకరకాల పథకాలు,కార్యాచరణ ప్రణాళికలు నడుస్తున్నాయి. ఇవన్నీ నూతన ఆర్థిక విధానాలతో ముడిపడి ఉన్నాయి.ప్రజా ప్రయోజనాల పేరుతో కారుచౌకగా ప్రభుత్వ రంగకంపెనీల మైన్లను,భూములను ప్రైవేటు కార్పొరేట్లకు కట్టబెట్టడమే ప్రభుత్వ ధ్యేయం. Read more

చత్తీష్‌ఘ‌డ్ గ‌వ‌ర్న‌ర్‌తో స‌మ‌త ర‌వి భేటీ

చత్తీష్‌ఘర్‌ రాష్ట్ర పీసా చట్టం గ్రూప్‌ వర్కింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌,సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రెబ్బాప్రగడ రవి ఆ రాష్ట్ర గవర్నర్‌ అనుసూయ ఉయిక్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ అనుసూయ ఉయిక్‌తో రవి పలు అంశాలు ప్రస్తావించారు. షెడ్యూల్‌ ప్రాంత చట్టాలు పరిరక్షణ, పీసా చట్టం`1996 అమలు,గ్రామసభల పటిష్టకు కృషి చేస్తానని తెలిపారు. షెడ్యూల్డు ప్రాంత పాలన,రాజ్యాంగ నియమాలు,భూమి బదలాయింపు నిబంధనలు 1/70,అటవీ హక్కుల గుర్తింపు చట్టం`2006,ఆదివాసీ హక్కలు వంటి కీలకమైన విషయాలుపై చర్చించారు. అదేవిధంగా సమత వ్యవస్థాపక దినోత్సవం ఏర్పా టుపై గవర్నర్‌ అనుసూయ ఉయిక్‌తో ప్రస్తావించారు. దీనిపై గవర్నర్‌ సానుకూలంగా స్పందించారు. చారిత్రాత్మకమైన సమత తీర్పు షెడ్యూల్‌ ప్రాంత ఆదివాసీలకు రక్షణ కవచంలాంటిదని కొనియాడారు.గిరిజన హక్కులను పునరుద్దరించిన సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుని పేర్కొన్నారు.ఆదివాసీ హక్కుల కోసం పోరాడే ఒక చిన్న సామాజిక కార్యాచరణ సంస్థ అయిన సమత అన్యాయాలపై గళమెత్తడానికి వివిధ మార్గాలను ఎంచుకొని చైతన్యవంతమైన రాజకీయ నిర్ణయాలు,న్యాయసాధనకు అసంఖ్యాక న్యాయమార్గాల ద్వారా ప్రజా ఉద్యమాన్ని నడిపిన మహా కర్తవ్యమని సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రవిని ప్రశంసించారు.అట్టడుగు స్థాయిలో గిరిజనుల సంక్షేమం,అభ్యున్నతికోసం శ్రమించే సామాజిక సంస్థని కితాబునిచ్చారు. గవర్నర్‌ను కలసిన వారిలో మైన్స్‌,మినరల్స్‌ అండ్‌ పీపుల్స్‌ ప్రధాన కార్యదర్శి అశోక్‌ శర్మాలి(గుజరాత్‌)సమత డైరెక్టర్‌ విక్కీ పాల్గొన్నారు.- గునపర్తి సైమన్‌
అక్టోబర్ 28న రాయపూర్ లో తొలిసారిగా సమావేశమైన PESA పై వర్కింగ్ గ్రూప్ చైర్ పర్సన్ రెబ్బాప్రగడ రవి షెడ్యూల్డ్ ఏరియాల అడ్మినిస్ట్రేషన్ & ఇంటర్నెట్ టెక్నాలజీ వినియోగ కమిటీ సభ్యులు - ఛత్తీస్‌గఢ్ స్టేట్ ప్లానింగ్ కమిషన్. - నయా రాయపూర్ 

వ్యవసాయ రంగాన్ని కమ్మేసిన సంక్షోభం

రైతాంగ ఉద్యమాలకు అశోక్‌ ధావలే గత ముప్పై సంవత్సరాలుగా దిశా నిర్దేశం చేస్తున్నారు. ‘సంయుక్త కిసాన్‌ మోర్చా’ (ఎస్‌.కె.ఎం)లో ప్రధాన భాగస్వామిగా ఉన్న ‘ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ’ (ఎ.ఐ.కె.ఎస్‌) అఖిల భారత అధ్యక్షుడిగా వ్యవహరిస్తు న్నారు. వ్యవసాయ రంగంపై మూడు దశాబ్దాల నయా ఉదారవాద విధానాల ప్రభావం గురించి…బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నల్ల వ్యవసాయ చట్టాల రద్దుకు రైతాంగం చేపట్టిన చారిత్రాత్మక పోరాటం గురించి….ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు….
మన దేశ జనాభాలో మూడిరట రెండొంతుల మందికి వ్యవసాయమే జీవనాధారంగా ఉంది. సరళీకరణ ఆర్థిక విధానాల ప్రభావం వల్ల నేటికీ వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్న తీరుపై మీ అభిప్రాయం ఏమిటి ? 75 ఏళ్ళ స్వాతంత్య్రం తరువాత కూడా దేశంలో మూడిరట రెండొంతుల జనాభాకు ఆధారంగా ఉన్న వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్న మాట నిజం. సరళీకరణ ఆర్థిక విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులను వేగవంతం చెయ్యడంలో విఫలం చెందాయి. వ్యవసాయంలో అతి తక్కువ వృద్ధిరేటు ఉన్న కారణంగా సగానికి పైగా వ్యవసాయ కుటుం బాలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తి బాగా తగ్గింది. వ్యవసాయ వృద్ధిరేటు తక్కువగా ఉన్న కారణంగా పారిశ్రామిక వృద్ధి రేటుపై కూడా ప్రతికూల ప్రభావం పడిరది. కేరళ, పశ్చిమ బెంగాల్‌, త్రిపుర రాష్ట్రాలు మినహా, దేశంలో వ్యవసాయ సంస్కరణలు, గ్రామీణ వ్యవసాయ నిర్మాణంలో ప్రభుత్వ పెట్టుబడుల కొరత వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిరది. ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ గ్రామీణ అసమానతలు ఉన్న దేశాల్లో మన దేశం ఒకటిగా ఉంది. గ్రామీణ వ్యవస్థలో అప్పటికే ఉన్న అసమానతలను..1991 తరు వాత వ్యవసాయ రంగాన్ని కమ్మేసిన సంక్షో భం..మరింత తీవ్రతరం చేసింది. వ్యవ సాయ వృద్ధి రేటు మందగించింది. ప్రభుత్వ పెట్టు బడులు పూర్తిగా తగ్గిపోయాయి. పెట్టుబడి సబ్సిడీలలో కోతల ఫలితంగా పెట్టుబడి ఖర్చు లు భారీగా పెరిగాయి.స్వేచ్ఛా వాణిజ్య ఒప్పం దాల ఫలితంగా ఆర్థిక దోపిడికి అవకాశం ఉన్న దిగుమతుల ప్రవాహం పెరగడం వల్ల సరుకుల ధరలు కుప్పకూలాయి. దాంతో అన్ని పంటలపై లాభదాయకంగా ఉండే ధరలు తగ్గిపోయాయి. చిన్న, సన్నకారు రైతులకు అందాల్సిన ఆర్థిక వనరులను ధనిక వర్గాలకు, బడా కార్పొరేట్‌ సంస్థలకు మళ్ళించారు. ప్రస్తుతం రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభానికి, గత మూడు దశాబ్దాలుగా నిరంతరాయంగా అమలవుతున్న నయా ఉదారవాద విధానాలే ప్రధాన కారణం. 1992లో హర్యానా లోని హిస్సార్‌ లో జరిగిన ఎఐకెఎస్‌ జాతీయ మహాసభ, ఈ నయా ఉదార వాద ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా హెచ్చరిం చింది. ఆర్థిక వృద్ధి జరిగినప్పటికీ, వ్యవసాయ రంగం గణనీయమైన వృద్ధిని పొందలేదు. చిన్న రైతులు విముక్తి కాలేదు. ఎందువల్ల ?గ్రామీణ అభివృద్ధి ఏమైనా జరిగిందా ?వారు వ్యవసాయ రంగం అవసరా లను తప్పుగా అర్ధం చేసుకోవ డంతో ఈ రంగంలో సంస్కరణలు విఫలమ య్యాయి. ఈరంగా నికి వ్యవసాయ సంస్కరణ లు, భారీ ప్రభుత్వ పెట్టుబడులు అవసరం. వ్యవసాయ రంగంలో దేశీయంగా, బయట కూడా మార్కెట్లు తెరిస్తే, వ్యవసాయ రంగం దానంతటదే పెరగడం ప్రారంభమవుతుందని మన విధాన నిర్ణేతలు ఊహించుకున్నారు. స్వేచ్ఛా వాణిజ్యం, ప్రభుత్వం చేయాల్సిన వ్యయంలో కోత విధింపు…భారతదేశ ఆహార భద్రతకు ప్రమాదమని స్థూల ఆర్థిక శాస్త్రవేత్తలు పదే పదే చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ?ఒక వ్యవస్థగా స్వేచ్ఛా వాణిజ్యం పట్ల ప్రపంచ వ్యాప్తంగా అపనమ్మకం ఉంది. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ప్రపంచ వాణిజ్య సంస్థను (డబ్ల్యూటీఓ) ఒక విశ్వసనీ యమైన సంస్థగా భావించడం లేదు. అందుకే ఈ దేశాలు ప్రాంతీయ, ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కోసం ప్రయత్నిస్తున్నాయి. డబ్ల్యూటీఓ ప్రయోజనకరంగా ఉన్నట్లైతే, మళ్ళీ కొత్త ఒప్పందాలతో అవసరం ఏమిటి? ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, ఆసియా దేశాల్లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు వ్యవసాయ రంగానికి ప్రమాదం తెచ్చిపెట్టాయి. చౌకగా లభించే వస్తువులను దిగుమతి చేసుకోవడంతో ధరలు బాగా పడిపోయి, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభం లోకి నెట్టబడిరది. ఆహారధాన్యాల ఉత్పత్తిలో బాగా వెనుకబడిన దేశాల్లోని ఆహార భద్రతపై స్వేచ్ఛా వాణిజ్యం తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. వారు వాణిజ్య పంటలను ఎగుమతి చేసే ప్రయత్నం చేసి, ఆహార ధాన్యాలను కొనుగోలు చేసే విధంగా విదేశీ మారక ద్రవ్యాన్ని పొందుతారు. కానీ వాణిజ్య పంటల ధరలు బాగా పడిపోతున్నాయి కాబట్టి, ఎగుమతుల ద్వారా పొందే ఆదాయాలు కూడా పడిపోతున్నాయి. అందువలన ఈ దేశాలు ఇంతకుముందు చేసుకున్న పరిమాణంలో దిగుమతి చేసుకోడానికి ఇబ్బంది పడుతున్నాయి. ఇది వారి ఆహార భద్రతపై ప్రభావం చూపుతుంది. మంచి లాభాలతో ధాన్యాలను ఉత్పత్తి చేసే చిన్న, సన్నకారు రైతుల సామర్థ్యంపై ప్రభుత్వ వ్యయంలో కోతలు ప్రభావం చూపుతాయి. కార్పొరేట్ల లాభాలు, సబ్సిడీలలో కోతలు విధిస్తున్న కారణంగా పెట్టుబడి ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. రైతులు బహుళజాతి కార్పొరేషన్‌లపై ఆధారపడేవారిగా మారిపోతున్నారు. ఇవన్నీ చిన్న, సన్నకారు రైతులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. 1980లో భారత వ్యవసాయ వృద్ధి రేటు, నయా ఉదారవాద విధానాలను అమలు చేసిన 30 ఏళ్ళ కాలం లోని వ్యవసాయ వృద్ధి రేటు కంటే ఎక్కువ. సంస్కరణలు వ్యవసాయ రంగంలో వృద్ధిని సాధించడంలో విఫలమ య్యాయని చెప్పడానికి ఈ ఒక్క సూచిక చాలు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 2015-2022 మధ్య కాలంలో వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని వాగ్దానం చేసింది. ఇది ప్రస్తుత బిజెపి పాలకుల అతి పెద్ద వైఫల్యం. వాస్తవానికి ఈ కాలంలో రైతుల ఆదాయాలు బాగా పడిపో యాయి. పెద్దనోట్ల రద్దు, అనాలోచితమైన జీఎస్టీ పన్ను విధానం, అనాగరికంగా విధించిన లాక్‌డౌన్‌ లాంటి నిర్ణయాలు రైతాంగాన్ని దెబ్బతీశాయి. ఈ సంస్కరణలు తమ స్థితిగ తులను దుర్భరం చేశాయని వారు ఆగ్రహంగా ఉన్నారు. గత ముప్పై సంవత్సరాలుగా మీరు నాయకత్వం వహిస్తున్న రైతాంగ ఉద్యమాల అనుభవాలను వివరిస్తారా ? గత ముప్పై ఏళ్ళుగా అమలవుతున్న నయా ఉదారవాద విధానాల ఫలితంగా ఏర్పడిన తీవ్ర వ్యవసాయ సంక్షోభం,4లక్షల మంది రైతుల ఆత్మహ త్యలకు దారి తీసింది. ప్రాథమిక సమస్యగా ఉన్న మూడు వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు… పెట్టుబడికి అయిన ఖర్చుకు అదనంగా యాభై శాతం కలిపి మద్దతు ధరగా హామీ ఇవ్వాలని, విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసం హరించుకోవాలని, పెట్రోల్‌-డీజిల్‌-గ్యాస్‌ ధరలను సగానికి తగ్గించాలని, రైతులు వ్యవసాయ కార్మికుల రుణాలను పూర్తిగా రద్దు చేయాలని, ఇన్సూరెన్స్‌ కంపెనీలకు కాకుండా బాధల్లో ఉన్న రైతాంగానికి పంట బీమా పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని, సన్న-చిన్నకారు రైతులకు తక్కువ వడ్డీతో రుణ సౌకర్యం కల్పించాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద వ్యవసాయ కార్మికులకు రెట్టింపు పని దినాలు, రెట్టింపు వేతనాలను అమలు చేయాలని, గిరిజన రైతులకు అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని, రైతుల నుండి బలవంతంగా భూసేకరణను నిలిపి వేయాలని, భూ సంస్కర ణలను చేపట్టాలని కోరుతూ పోరాటాలు జరిగా యి. అదే విధంగా కార్మికులకు వ్యతిరేకంగా చేసిన నాలుగు లేబర్‌ కోడ్‌ లను రద్దు చేయా లని, ప్రైవేటీకరణను నిలుపుదల చేసి, బిజెపి పాలకులు దేశాన్ని తెగనమ్మే చర్యలకు అంతం పలకాలని పోరాటాలు జరిగాయి. గడచిన ఏడు సంవత్సరాల కాలంలో కార్పొరేట్‌ కంపెనీల అనుకూల విధానాలను అమలు చేస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతాంగ ఉద్యమా లను తీవ్రతరం చేస్తున్నాం. ఈ ఉద్యమాలకు పరాకాష్టగానే ఢల్లీి సరిహద్దుల్లో జరుగుతున్న చారిత్రాత్మక రైతు ఉద్యమాన్ని చూడాలి. సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకత్వంలో 2020 నవంబర్‌ 26న దేశ వ్యాప్తంగా ప్రారంభమైన రైతు ఉద్యమం పది నెలల కాలాన్ని పూర్తి చేసుకోబోతోంది. ఈ ఉద్యమం మతం, కులం, ప్రాంతం, రాష్ట్రం, భాషలను అధిగమించి కొనసాగుతోంది. అణచివేత, అపఖ్యాతిపాలు చేసే చర్యలను సమర్థవంతంగా ఎదుర్కొం టోంది. విజయం సాధించే వరకు ఈ పోరా టాన్ని తీవ్ర తరం చేయాలని రైతులు పట్టు దలతో వున్నారు. కాంట్రాక్టు వ్యవసాయం వలన కలిగే లాభాలను, అనర్థాలను వివరిస్తారా ? కొంత కాలంగా మన దేశంలో కాంట్రాక్టు వ్యవసాయం అమలులో ఉంది. కార్పొరేట్‌ కంపెనీలు ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన ధరను చెల్లించి రైతులను మోసం చేయకుండా హామీ ఇవ్వాలి. అయితే మన చట్టాలు అందుకు భిన్నంగా వున్నాయి. కాంట్రాక్టు వ్యవసాయంలో కార్పొరేట్‌ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా వున్నాయి. రైతులు తమ భూములను ఈ కంపెనీలకు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందే మోనని భయపడుతున్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎఐకెఎస్‌ అనేక నిరస నోద్యమాలను నిర్వహిస్తున్నది. ఆ చట్టాల గురించి వివరిస్తారా?వ్యవసాయ చట్టాలు దేశంలోని రైతుల బతుకు తెరువుపై తీవ్ర దాడిగా చెప్పవచ్చు. అగ్రికల్చరల్‌ ప్రొడ్యూస్‌ మార్కెట్‌ కమిటీ (ఎపిఎంసి), ఎసెన్షియల్‌ కమోడిటీస్‌ యాక్ట్‌ (ఇసిఎ)లు 1960 నుండి రైతులకు, వినియోగదారులకు రక్షణగా ఉన్నాయి. అవి రైతులు మెరుగైన ప్రయోజనాలు, స్థిరమైన ధరలు (ఎపిఎంసి నిర్వహణలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ) పొందడానికి సహాయపడ్డాయి. ఎపిఎంసి వ్యవస్థను ఉపసం హరించి…వాటిని ఆదానీ, అంబానీ గ్రూప్‌ కంపెనీలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్కెట్‌ వ్యవస్థ పతనంతో రైతులు పూర్తిగా కార్పొరేట్‌ కంపెనీల అదుపు లోకి నెట్టివేయబడతారు. ఇది పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ లాంటి రాష్ట్రాల్లో రైతుల మరణాలకు దారి తీస్తుంది. అదేవిధంగా ఎసెన్షియల్‌ కమోడిటీస్‌ యాక్ట్‌, రిటైల్‌ మరియు రవాణా రంగాలను కార్పొరేట్‌ చేతుల్లోకి చేర్చుతుంది. అంటే దీనర్థం, వినియోగదారులు ఆహార పదార్థాలను మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
కనీస మద్దతు ధరను కల్పించే వ్యవస్థను, ప్రభుత్వ ఆహార ధాన్యాల సేకరణ వ్యవస్థను ఒక క్రమపద్ధతిలో ధ్వంసం చేసే లక్ష్యంతోనే…బిజెపి ప్రభుత్వం ఈ మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. భారతదేశంలో 81 కోట్ల మంది ఉపయోగిం చుకొనే ప్రజా పంపిణీ వ్యవస్థ కూడా ధ్వంసం చేయబడుతుంది. కాబట్టి ఈ వ్యవసాయ చట్టాలు కేవలం రైతులకు మాత్రమే కాక, ప్రజలందరికీ వ్యతిరేకమైనవి. ఈ వ్యవ సాయ చట్టాలు రాజ్యాంగబద్దం కావు. ఇవి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండాల్సిన అంశాలు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని పరిగణలోకి తీసుకోకుండా, అగౌరవ పరస్తూ, సమాఖ్య నిబంధనలను తుంగలో తొక్కి, రాష్ట్రాల హక్కులను కాలరాసి పార్లమెంట్‌లో చట్టాలను తెచ్చింది. – భాస్కరరావు

ప్రజా సమస్యలు వదిలి పథకాలతో కాలక్షేపం

ప్రజలు సమస్యలతో సతమతం అవుతుంటే పరిష్కారం చేయకుండా జగన్‌ ప్రభుత్వం కొన్ని పథకాలపైనే దృష్టి పెడుతూ కాలయాపన చేస్తోంది. రైతులు, కార్మికులు, చేతివృత్తి దారులు, గిరిజనులు వారు ఎదుర్కొనే సమస్యలు పరిష్కారం అయితే, ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం పాకులాడవలసిన దుస్థితి ఉత్పన్నం కాదు. కాని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమస్యలు ప్రాధాన్యతా సమస్యలుగా అనిపించకపోవడం శోచనీయం. ఈ సమస్యలు పరిష్కారం అయితే రాష్ట్రాభివృద్ధి నిలకడగా సాగుతుంది. సంక్షేమ పథకాల పంగల కర్రల మీద ఎన్నాళ్లు నడుపుతారు? రాష్ట్రంలో రైతులు, చేతివృత్తిదారులు, కార్మికులు, ప్రాజెక్టు నిర్వాసితులు, గిరిజనులు ముఖ్యమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వీటిపై తక్షణమే దృష్టి సారించి పరిష్కరిం చాల్సిన అవసరం ఉంది. కాని జగన్‌ ప్రభుత్వం ఈ సమస్యల్ని విస్మరిస్తూ రాజధాని సమస్యను ముందుకుతెచ్చింది. రాష్ట్ర పురోగమనం పట్టాలు తప్పే స్థితి తెచ్చింది. ఇంకో వైపు కేంద్రం, రాష్ట్రానికి చేసే అన్యాయం విషయంలో మెతకవైఖరి ప్రదర్శిస్తోంది.‘స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేసి రైతులకు గిట్టుబాటు ధరలు ఇస్తానని, మంచి రోజులు తెస్తానని, 2022 కి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాన’ని నరేంద్రమోడీ ఎన్నికల్లో చెప్పారు. కానీ ఆయన స్వామినాథన్‌ సిఫార్సును ఎగ్గొట్టారు. స్వామినాథన్‌ సిఫార్సు ప్రకారం క్వింటాల్‌ ధాన్యానికి రూ.2418 ధర ప్రకటించాలి. కానీ సాధారణ రకానికి రూ.1815, నాణ్యమైన రకానికి రూ.1835 కనీస మద్దతు ధరను మోడీ ప్రకటించారు. ఇలా అన్ని పంటల ధరల నిర్ణయంలోనూ రైతులకు ప్రధాని తీవ్ర అన్యాయం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించారు. 1710 ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచామని, 41లక్షల టన్నులు కొన్నామని ప్రకటిస్తున్నారు. కాని ఆచరణ తీరు వేరుగా ఉంది. ఎక్కడా ప్రభుత్వం ధాన్యం కొని రైతుకు నేరుగా డబ్బు చెల్లించడం లేదు. ప్రయివేటు వ్యాపారులే బ్రోకర్ల ద్వారా ధాన్యం కొని కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్నట్లు బినామీ పేర్లతో రికార్డు చేస్తున్నారు. విజయనగరం జిల్లా కొమరాడ మండలం దళాయిపేటలో 82 కిలోల ధాన్యం రూ.1070లకు బ్రోకర్ల ద్వారా రైస్‌ మిల్లు కొన్నది. 82 నుండి 84 కిలోల వరకు గల బస్తా ధాన్యాన్ని జిల్లాలో ఎక్కడా రూ.1350ల కంటే ఎక్కువకు కొనడం లేదు. అంటే క్వింటాల్‌ రూ.1300 నుండి రూ.1600ల మధ్యలో కొంటున్నారు. ఈ విధంగా క్వింటాల్‌కు 500 నుండి 200 వరకు రైతు నష్టపోతున్నాడు. ఇందుకు కేంద్రంతో పాటు రాష్ట్రమూ బాధ్యత వహించాలి. జిల్లాల్లో పంట దిగుబడిని బట్టి రైతుకు నష్టం వుంటుంది. జిల్లా జిల్లాకు వ్యత్యాసం వుంది. జగన్‌ మోహన్‌ రెడ్డి రైతుకు గిట్టుబాటు ధర ఇస్తానని ప్రకటించారు. ధరల స్థిరీకరణ నిధి సమకూరుస్తున్నట్లు ప్రకటించారు. కాని నిజంగా అవసరం వచ్చిన సమయానికి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ రైతుకు అండగా లేరు. మరో పంట పత్తికి కనీస మద్దతు ధర కూడా ఇవ్వడం లేదు. ఇక్కడా రైతు నష్టపోతున్నాడు. కందుల్లోనూ రైతుకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదు. చెరకు రైతులకు కనీస మద్దతు ధర టన్నుకు రూ.4,000 ఇవ్వాలి. కానీ ఇస్తున్నది రూ.2,700 మాత్రమే. సంవత్సరాల తరబడి బిల్లులు చెల్లించడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సమస్యలు చర్చించిందీ లేదు. చర్యలూ లేవు. జ్యూట్‌, ఫెర్రో ఎల్లాయిస్‌, స్పిన్నింగ్‌, షుగర్‌ మిల్లులన్నీ మూతపడుతున్నాయి. వేలకు వేల కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడుతున్నారు. ఈ పరిశ్ర మలు మూత పడడానికి కారణాలను తెలుసుకుని ఆ సమస్యలు పరిష్కరించడానికి బదులు ఎమ్మెల్యేలు, మంత్రులే దగ్గరుండి మరీ పరిశ్రమలను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు అమ్మించేస్తున్నారు. చిట్టివలస జ్యూట్‌ మిల్లును మంత్రి అవంతి శ్రీనివాస్‌, బొబ్బిలి లక్ష్మీ శ్రీనివాసా జ్యూట్‌ మిల్లును బొబ్బిలి శాసన సభ్యులు సంబంగి చిన్నప్పల నాయుడు, లచ్చయ్యపేట ఎన్‌సిఎస్‌ షుగర్‌ ఫ్యాక్టరీ భూమిని పార్వతీపురం శాసనసభ్యులు అమ్మేసే బాధ్యత తీసుకున్నారు. ‘నన్ను గెలిపించండి, మిల్లులను తెరిపించి ఉపాధి గ్యారంటీ చేస్తాన’ని స్వయంగా జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర లోనూ, ఎన్నికల సభల్లోనూ చెప్పారు. అధికారంలోకి వచ్చాక అందుకు భిన్నంగా జరుగుతోంది. పోలవరం మొదలు వంశధార వరకు ప్రాజెక్టు నిర్వాసితుల భూముల ధరల్లో జరిగిన అన్యాయాన్ని సరిచేస్తానని అదనంగా రైతుకు నష్టపరిహారం ఇస్తానని జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నికల్లో చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాలు 105 లక్షలని వారి పునరావాసానికి అయ్యే ఖర్చు రూ.33 వేల కోట్లని లెక్క వేసింది చంద్రబాబు ప్రభుత్వం. జాతీయ ప్రాజెక్టయినా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ‘పునరావాసం నా బాధ్యత కాద’ని చెప్పేసింది. ఇది అన్యాయమని నాడు చంద్రబాబు కాని, నేడు జగన్‌ కాని అనడం లేదు. నిర్వాసితులను మాత్రం ముంచేస్తున్నారు. వెలుగొండ, వంశధార, తోటపల్లి, తారక రామా నిర్వాసితులందరూ జగన్‌ ప్రభుత్వం ఏదో చేస్తుందని ఎదురు చూస్తున్నారు. నిర్వాసితుల ఇళ్ల నిర్మాణానికి, భృతికి అన్నింటిలో న్యాయం చేస్తామని చెప్పారు. ఇంత వరకు చేసిందేమీ లేదు. నిర్వాసితుల ఇళ్లకు గత చంద్రబాబు ప్రభుత్వం బిల్లులు కూడా ఇవ్వలేదు. ఆ ఇళ్ళు కూడా పిట్ట గూళ్ళ వలె ఉన్నాయి. నివాస యోగ్యంగా లేవు. విజయనగరం జిల్లా పాచిపెంట మండల కేంద్రం దగ్గర పెద్ద గెడ్డపై రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రిజర్వాయర్‌ నిర్మించింది. అందులో ఆ గిరిజన గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఆ గ్రామాల్లో గిరిజనులంతా ఫారెస్టు భూముల్లో ఇళ్ళు కట్టుకుని, ఫారెస్టు భూములను సాగు చేసుకుని వందల సంవత్సరాలు బతికారు. ఫారెస్టు భూమి కనుక నష్టపరిహారం ఇవ్వలేదు. ఎర్రొడ్లు వలస పునరావాస కాలనీ కొండ పక్కనే నిర్మించారు. కొండను ఆనుకుని వున్న భూమిని సాగు చేసుకుని బతకమని ఆనాడు కలెక్టర్‌, జె.సి చెప్పి ఒప్పించారు. ఇప్పుడు ఇళ్ళ స్థలాల కోసం భూమిని తీసుకుంటామని మండల అధికారులు ఆ గ్రామం మీద దాడి చేస్తున్నారు. ఒకసారి నిర్వాసితులైన ఆ పేదలనే మళ్లీ రెండోసారి నిర్వాసితులను చేస్తున్నారు, ఇదేం న్యాయం?25 లక్షల మందికి రేపు ఉగాది నాటికి ఇంటి స్థలాలు పంపిణీ చేస్తామని ప్రకటనలు చేస్తున్నారు. అందుకు భూమి సేకరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పేదల భూమిని తీసుకుని ఇళ్ళ స్థలాల పంపిణీకి పూనుకున్నారు. డీపట్టా భూమి, పేదల సాగులో వున్న ప్రభుత్వ భూమి తీసుకుంటామని అధికారులు పేదలపై దాడి చేస్తున్నారు. ప్రభుత్వమే భూమి కొని పేదలకు పంచి ఇస్తామని ప్రకటనలు చేస్తూ పేదల స్వాధీనంలో ఉన్న భూమిని ఎలా తీసుకుంటారు? పేదలకు అన్యాయమే కదా? భూస్వాముల దగ్గర భూమి కొని ఇళ్ళ స్థలాలు ఇవ్వాలనే అభిప్రాయం ఎందుకు కలగలేదు. విశాఖ ఉడా పరిధిలో డీ-పట్టా భూమిని రాజధానిలో చంద్రబాబు ల్యాండ్‌ పూలింగ్‌ చేసిన విధంగానే భూమిని సేకరిస్తామనడం పేదలకు అన్యాయం చేయడమే కదా! రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ‘పునాదులు వేయండి, ఇళ్ళు కట్టండి బిల్లులు ఇస్తామని అధికారుల తోనూ, వారి పార్టీ నాయకులతోనూ చెప్పి పేదలతో ఇళ్ళు కట్టించింది. జనంఆ మాటలు నమ్మి పునాదులు వేశారు. ఇళ్లు కట్టేశారు. తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ ఇళ్ళకు బిల్లులు ఇవ్వలేదు. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం పేదలను నిర్మించు కోమన్న ఇళ్ళకు, ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు. ప్రతిపక్షం మీద కోపంతో ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తున్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌తో అనేక ప్రయివేటు కాలేజీలు నడుస్తున్నాయి. జూన్‌ నుండి నడుస్తున్న కాలేజీలకు డిసెంబర్‌ నెలలో ఫీజు రియింబర్సుమెంట్‌ ఇవ్వనని ప్రభుత్వం జి.వో జారీ చేయడంతో ఆ కాలేజీలన్నీ గందరోళంలో పడ్డాయి. ఆదివాసీలకు 2006 అటవీ చట్టం ప్రకారం పోడు పట్టాలు ఇవ్వాలి. గత ప్రభుత్వం ఇస్తామని మోసం చేసింది. జగన్‌ ఎన్నికల హామీ ఇచ్చారు. తరువాత ఆ ఊసే లేదు. భూమి సర్వేలు చేయడం లేదు. సర్వే చేసిన వారికి పట్టాలు ఇవ్వడం లేదు. 554 నాన్‌ షెడ్యూల్‌ గ్రామాలను 5వ షెడ్యూల్డు గ్రామాల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయాలని గిరిజన సలహా మండలి ప్రకటించింది. వాస్తవంగా 1250 గ్రామాలు షెడ్యూల్డ్‌ గ్రామాలుగా ప్రకటించాల్సి ఉండగా కేవలం 554 గ్రామాలకే పరిమితం చేయడం గిరిజనులకు అన్యాయం చేయడమేనని గిరిజన సంఘాలన్నీ ఆందోళన చేశాయి. బంద్‌ కూడా నిర్వహించాయి. రీ సర్వే చేస్తామని ఉప ముఖ్యమంత్రివర్యులు పుష్పశ్రీవాణి ప్రకటించి నెలలు గడుస్తున్నాయి. అన్ని లెక్కలూ ప్రభుత్వం వద్ద ఉన్నాయి. వారం రోజుల్లో చేయాల్సిన పనిని 4 నెలలైనా చేయలేదు. భూస్వాముల ఒత్తిడికి లొంగిపోయి వుండకపోతే ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నట్లు అని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. చేనేత కార్మికులకు చేయూత పథకం ఇస్తామన్నారు. 80 శాతం చేనేత కార్మికులు మాష్టర్‌ వీవర్ల దగ్గర పని చేస్తున్నారు. ఆ కారణం చేత వారికి పథకం ఇవ్వ నిరాకరించారు. గొర్రెలు, మేకల పెంపకందార్లకు ఎన్‌.సి.డి.సి అప్పు ఇస్తామ న్నారు. ఒక్కరికీ ఇచ్చింది లేదు. హుదూద్‌ తుఫానులో నష్టపోయిన కల్లుగీత కార్మికుల నష్టపరిహారాన్ని, చంద్రబాబు ప్రభుత్వం కొంత మందికే ఇచ్చింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో గీత వృత్తిదార్లకు ఇవ్వలేదు. ‘మా ప్రభుత్వం వస్తే ఇస్తామ’ని జగన్‌ మోహన్‌ రెడ్డి వాగ్దానం చేశారు. ఈ రోజు వరకు ఆ ఊసే లేదు. ఇలా ప్రజలు సమస్యలతో సతమతం అవుతుంటే పరిష్కారం చేయకుండా జగన్‌ ప్రభుత్వం కొన్ని పథకా లపైనే దృష్టి పెడుతూ కాలయాపన చేస్తోంది. రైతులు, కార్మికులు, చేతివృత్తి దారులు, గిరిజనులు వారు ఎదుర్కొనే సమస్యలు పరిష్కారం అయితే, ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం పాకులాడవలసిన దుస్థితి ఉత్పన్నం కాదు. కాని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమస్యలు ప్రాధాన్యతా సమస్యలుగా అనిపించకపోవడం శోచనీయం. ఈ సమస్యలు పరిష్కారం అయితే రాష్ట్రాభివృద్ధి నిలకడగా సాగుతుంది. సంక్షేమ పథకాల పంగల కర్రల మీద ఎన్నాళ్లు నడుపుతారు? ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అమలు జరపకపోయినా సుతిమెత్తని అభ్యర్థనలతో, వేడికోళ్లతో సరిపెడుతున్నారు. దేశమంతా పౌరసత్వ సమస్యపై ఆందోళన జరుగుతుంటే రాష్ట్ర ప్రజలలో కలుగుతున్న ఆందోళన పట్ల ఉదాసీనంగా ఉన్నారు. మోడీ ప్రభుత్వం ప్రజల పౌరసత్వాన్నే ప్రశ్నార్ధకం చేసినా ఆ మోడీ పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతునీయడం మరీ దారుణం. అనేక పార్టీలు, పార్లమెంటులో సిఎఎకు మద్దతునిచ్చినా ప్రజల నుండి ప్రతిఘటన రావడంతో నిర్ణయం మార్చుకున్నాయి. ఎన్‌.ఆర్‌.సి.ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించాయి. చివరికి బిజెపి కర్నాటక ముఖ్యమంత్రి కూడా ప్రజా ప్రతిఘటనకు జడిసి కర్నాటకలో అమలు జరపనని ప్రకటించారు. కానీ జగన్‌ నేటి వరకు వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించలేదు. పలు ఎన్నికల వాగ్ధానాల అమలులో వెనకబడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో గాని, పాదయాత్ర సందర్భంలో గాని ప్రస్తావించని రాజధాని సమస్యను హఠాత్తుగా ముందుకు తెచ్చింది. అన్ని పక్షాలను, పార్టీలను సంప్రదించి కలుపుకుపోయే వైఖరి కాకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వం అతి కేంద్రీకరణ పేరుతో ఇబ్బంది పెడితే ఈ ప్రభుత్వం అర్థం లేని విధానాన్ని చేపట్టి, దానికి వికేంద్రీకరణ పేరుపెట్టి జనాన్ని ఇబ్బందుల పాలు చేస్తోంది. మొత్తం మీద అటు కేంద్రంలో బిజెపి ఎన్నార్సీ పేరుతోనూ, ఇటు రాష్ట్రంలో వైసిపి మూడు రాజధానుల పేరుతోనూ అప్రధాన అంశాలను ముందుకు తెచ్చి ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించకుండా జనాన్ని పక్కదోవ పట్టిస్తున్నాయి.

ఆగని అన్నదాత పోరు

పంటలకు చట్టపరంగా కనీస మద్దతు ధరల హామీ,రైతు వ్యతిరేకకార్పోరేట్‌ అనుకూల మూడు సేధ్యపు బిల్లుల రద్దును కోరుతూ దేశ రాజధాని ఢల్లీి నగర శివార్లలో అన్నదాతలు పట్టుదలతో సాగిస్తున్న పోరాటం నానాటికీ ఉన్నతమవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వ రైతు వ్యతిరేక,ధనవంతులకు లక్షల కోట్లు లాభాలు కట్టబేట్టిన వ్యవసాయ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని, పంటలకు కనీస మద్దతు కల్పిస్తూ చట్టపరంగా హామీ ఇవ్వాలని రైతాంగం కోర్కెలకు మద్దతుగా యువద్భారతం సెప్టెంబరు 27న బంద్‌ పాటించి సంఫీుభావం ప్రకటిచింది. గత పదినెలలుగా అన్నదాతలు ఆందోళన సాగిస్తున్నా మోదీ ప్రభుత్వం మొక్కుసూటిగా రైతు సంఘాలతో చర్చలు జరిపినా ఎలాంటి నిర్ధిష్ట హామీ ఇవ్వకపోవడంతో పోరు ముందుకు సాగుతోంది. కాలయాపన చేస్తే పట్టించుకోకపోతే రైతాంగ ఆందోళన అదంతకదే నీరుగారిపోయిందని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది. కానీ సెప్టెంబరు 5న జాట్‌ భూమిగా పిలిచే పశ్చిమ యూపీలోని ముజఫర్‌నగర్‌లో జరిగిన బ్రహ్మండమైన బహిరంగ సభలో యూపీ,ఉత్తరాఖాండ్‌, హర్యానా,మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుండి లక్షలాది మంది రైతులు పాల్గొని మోదీ ప్రభుత్వం మొండివైఖరిని నిరసిస్తూ వివాదస్పదమైన మూడు వ్యవసాయచట్టాలను రద్దు చేసేవరకు ఆందోళన కొనసాగించాలని ప్రతిబూనారు. సంయుక్త కొసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఈ కిసాన్‌ మహా పంచాయిత్‌లో మూడువందలకు పైగా రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. యూపీ,పంజాబ్‌ఉత్తరాఖండ్‌,గోవా,మణిపూర్‌ శాసనసభలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నఇకలు జరగున్న తరుణంలో బీజేపీ ప్రభుత్వఆనికి గుణపాఠం నేర్పేందుకు ముజఫర్‌నగర్‌లో ఈభారీ కిసాన్‌ బహిరంగ సభను నిర్వహించారు. యూపీ శాసనసభ 303స్థానాలకు,గోవా కనీసం125 అసెంబ్లీ స్థానాల ఫలితాలను రైతాంగ ప్రదర్శనధర్నాల ప్రభావితం చేయగలవని అంచనా. 2013లో ముజఫర్‌ నగరం ప్రాంతంలో జరిగిన హిందూముస్లిం ఘర్షణ వలల రైతాంగ వ్యతిరేకత నెరవేర్చనుంది. అన్నదాతల కనిపిస్తుంటే జాట్‌లో ముస్లింలు ఘర్షణ పదివేరై,జాట్‌లు బీజేపీకి మద్దతులు ఇవ్వగా 2014 మే ఎన్నికల్లో గెలిచి నరేంద్రమోడీ సారధ్యంలో కమలం పార్టఈ అధికారంలోకి రాగాలిగింది. 2017 యూపీశాసనసభ 2019లోక్‌సభ ఎన్నికల్లో ఇదే తంతు కొనసాగింది. అధికారపార్టీకి రాజకీయ లబ్దిచేకూరింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో తెచ్చిన మూడు సేధ్యపు చట్టాలు కార్పొరేటు వర్గాలకు లక్షల కోట్లు కట్టబెట్టేవని రైతు నాయకులు రాకేష్‌ తికాయల్‌ విమర్శించారు. ఈ పోరాటం కొన్ని రాష్ట్రాలకే పరిమితం కాదని జాతిని,రాజ్యాంగాన్ని రక్షించకోవడానికి జరుగుతున్న ఆందోళనలో 14కోట్ల భారత యువకలు క్రియాశీలపాత్ర వహించాలని తికాయల్‌ కోరారు. మోదీ ప్రభుత్వం భారత్‌ను అమ్ముకానికి పెట్టందని, రైళ్ళు,రేవులు, జాతీయరహదారులు, విమానాశ్రయాలు,ఎల్‌ఐసీ,ఓన్‌జీసీ,బీపీసీఎల్‌, తదితర ప్రతిష్టాత్మక సంస్థలను అదాన్న అంబానీ వంటి బడా పెట్టుబడిదార్లకు కారుచౌకగా కట్టబెట్టి దానికి చేస్తున్న ప్రయత్నాలపై దేశ ప్రజల్లో ఆగ్రహాం రగులు తోంది. ఎన్నో పోరాటాల తర్వాత సాధించు కున్న ప్రతిష్టాత్మకమ విశాఖ ఉక్కు కర్మాగారాన్నఇ ప్రైవేటీకరించేందుకు నిర్ణయిం జరిగి పోయిందని కమలానాధుల చేసిన ప్రకటనలకు వ్యతిరేకంగా తెలుగు ప్రజలు, కార్మికులు మహిళలు పోరుబాట పట్టిన సంగతి తెలిసిందే. పశ్చిమ యూపీలో రైతాంగం పండిరచే చెరకు క్వింటాల ధరకు రూ.450కి పెంచుతామని హామీ ఇచ్చిన ప్రస్తుత ప్రభుత్వం ఒక్క రూపాయు కూడా పెంచలేదు.పైగా చెరకు రైతుకు చక్కెర ప్యాక్టరీలు రూ.12వేలకోట్ల భారీ బకాయిలివ్వాలని రైతులు ఆందోళన చేస్తే అవి రాజకీయపరమైనవని,కమలానాధులు ప్రకటించడం సిగ్గు చేటు. యూపీలో మత విభజన వాణిని కొనసాగించి, హిందువుల ఓట్లును గంపగుత్తగా పొంది మళ్ళీ అధికారంలోకి రవాలన్నదే కమలనాధుల పన్నాగం. 2013 హిందూ ముస్లిం కల్లోలంలో 42మంది ముస్లింలు,20మంది హిందువులు మరణించారు. రైతుల ఆందోళనను ఆందోళనను పోలీసు తుఫాకుల్లో భాష్ప వాయువు గోళాలతో దమనకాండతో అణిచివేయాలని నరేంద్ర మోదీ యోగి ప్రభుత్వం ఎన్నో యత్నాలను లక్షలాది మంది రైతులు కదలి వచ్చి తిత్తాయల్‌ దీక్షకు మద్దతుగా నిలబడి వమ్మఉ చేశారు. మద్దతు ధరలు మూడు వందలకేనా? ఢలీి పరిసర ప్రాంతాలలో జరుగుతున్న ఆందోళనల్లో ఇరుగు పొరుగు రాష్ట్రాల వారే అధికంగా పాల్గొంటున్నా దక్షిణాది రాష్ట్రాల రైతు సంఘనేతలు,మహిళలు,కార్యకర్తలు వెళ్లి దీక్షల్లో పాల్గొని సంఫీుభావం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు బీమా పేరిట ప్రభుత్వానికి రూ.2500 కోట్ల బీమా కంపెనీలకు లాభాలే చేకూరుతున్నాయి. రైతుల ఆందోళన వల్ల ఏర్పడిన ప్రతిష్టంభన తొలగించేందుకు సుప్రీం కోర్టు రంగంలోకి దిగి తదుపరి ఉత్తర్వఉలు వచ్చేవరకు ఎలాంటి వివాదస్పద సేధ్యపు బిల్లులు అమలు చేయవద్దని ఆపేసింది. రైతుల సమస్యలను తెలుసుకున్న సుప్రీం కోర్టు విరమించినా కనీసం రైతులు ఎవ్వరూ పాల్గొనేదు. రైతుదినోత్సవం నాడు జనం,వ్యాపార ప్రొత్సహం,సహకార చట్టం2020,రైతుల సాధికారిత మరియు కనీస ధరల హామి ఒబ్బందం,రైతుల సేద్య చట్టం`2020,నిత్యఆవసర సరకులు(సవరణ) చట్టాలు పూర్తిగా రైతులను దోపిడికి గురిచేసి అదానీ తదితర కార్పొరేటు శక్తులకులాభాలు కట్టబెటేవని,వాటిని ఉపసంహరించుకోనేవరకు ఆందోళన వీడబోమని రైతు సంఘాల నేతలు స్పుష్ట్రం చేశారు. దీనికి తోడు గత ఏడాదిన్నరగా దేశంలో కరోనా మహమ్మారి వల్ల లాక్‌డౌన్‌లు విధించడం,రవాణా స్తంభించించడంవల్ల పండ్లు,కూరగాయలు,పూలు,పాలను ఎక్కడెక్కడ దొరక్కపోవడం వల్ల చాలా మంది రైతాంగం అప్పులు పాలైనారు. అందుకే వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దత ధరలు కల్పించే ఇచ్చే చట్టాలను కావాలని రైతులు కోరుతున్నారు.

సరికొత్త చరిత్రను సృష్టించిన భారత్‌ బంద్‌
ప్రభుత్వం రైతులపై రుద్దిన వ్యవసాయ చట్టాల రద్దు కోసం సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కె ఎం) పిలుపు మేరకు సెప్టెంబరు 27న నిర్వహించిన భారత్‌ బంద్‌ జయప్రదమైంది. రైతు,కౌల రైతు,వ్యవసాయకార్మిక,కార్మిక,ఉద్యోగ, మహిళా,విద్యార్థి,యువజన,ప్రజా సంఘాల భాగస్వామ్యాలతో బంద్‌ సరికొత్త చరిత్రను లిఖించింది. ప్రజల నుండి ఎన్నడూ లేని విధంగా అపూర్వ స్పందన,మద్దతు, సంఫీు భావం బంద్‌కు లభించాయి. మోడీ ప్రభుత్వ విధానాలు,పెట్రోల్‌,డీజిల్‌,గ్యాస్‌,నిత్యావసరాల ధరలకు తాళలేకున్న ప్రజ స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని తమ నిరసనాగ్రహాన్ని తెలియజెప్పారు. బంద్‌కు కాంగ్రెస్‌,లెఫ్ట్‌ సహా 19బిజెపి యేతర రాజకీయ పార్టీలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. మావోయిస్టు పార్టీ సైతం బంద్‌కు మద్దతుగా ప్రకటన చేసింది. కేరళ,పంజాబ్‌,రాజస్థాన్‌,తమిళనాడు, మహారాష్ట్ర,ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని అధికార ప్రభుత్వాలు మద్దతు తెలపడం బంద్‌ ఘనంగా విజయవంతం కావడానికి దోహదపడిరది. రాష్ట్రాల అధికారాలను,ఫెడరల్‌ స్ఫూర్తిని కాలరాసే విధంగా ఉన్న మోడీ ప్రభుత్వ వైఖరి వలన ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు సైతం బంద్‌ అనుకూల వైఖరి తీసుకున్నాయి. బిజెపి పాలిత గుజరాత్‌,ఉత్తరప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌,కర్నాటక,ఉత్తరాఖండ్‌లలో బంద్‌ను నిలువరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. పెద్ద ఎత్తున రైతులు, కార్మికులు, ప్రజలు బారికేడ్లను చేధించుకొని మరీ వీధుల్లో కదం తొక్కడం విశేషం.ఈపరిణామం బిజెపి పట్ల ప్రజల్లో గూడు కట్టుకుంటున్న ఆక్రోశానికి అద్దం పడుతుంది. నిరుడు కరోనా విజృంభిస్తున్న వేళ ఇదే అదనుగా వ్యవసాయ పంటల మార్కెట్‌ కమిటీలు ఎత్తివేసే,కాంట్రాక్టు సేద్యం మరింత పాదుకొనే, నిత్యావసరాల నిల్వలపై పరిమితులు ఎత్తేసే మూడు చట్టాలను మోడీ సర్కారు ఏకపక్షంగా చేసింది. తమ ఉనికికే ముప్పు కలిగించే వినాశకర నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గతేడాది నవంబర్‌ 26న రైతులు ఢల్లీి పీఠాన్ని కదిలించేందుకు పయనమయ్యారు. శివార్లలో నిలువరించగా అక్కడే బైఠాయింపు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు. దాంతో తమ ఆందోళన మొదలై పది మాసాలు పూర్తి చేసుకున్న సందర్భాన, తామెందుకు ఎండ, వాన,చలి,కరోనాలను లెక్క చేయకుండా పోరాటం చేయాల్సి వచ్చిందో దేశానికి తెలియజెప్పేందుకు 27న భారత్‌ బంద్‌కు నడుం కట్టారు రైతులు. ఈ నెల5న బిజెపి పాలిత యు.పిలోగల ముజఫర్‌నగర్‌లో లక్ష లాది రైతులతో ‘మహా పంచాయతీ’ నిర్వహించి బంద్‌ బావుటా చేతబూనారు. బంద్‌ ఆవశ్యకత ను వివరిస్తూ ఊరూ వాడా సదస్సులు, సమా వేశాలు,ర్యాలీలు,కరపత్రాలు,పోస్టర్లతో విస్తృత ప్రచారం చేసి మోడీ పాలనలో కడగండ్ల పాలైన వారిని సమీకరించి సన్నద్ధం చేశారు. ఇంతటి అకుంఠిత దీక్ష,కఠోర కృషి ఉన్నందునే బంద్‌ ఘన విజయం సార్ధకమైంది. ఈభారత్‌ బంద్‌ది ప్రత్యేక నేపథ్యం, చరిత్రాత్మకం. బిజెపి విధానాలకు వ్యతిరేకంగా కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఐక్య పోరాటాలు మరింత బలపడటానికి బంద్‌ దిశా నిర్దేశం చేసింది. కార్మిక, కర్షక ఐక్యతను పటిష్టమొనర్చింది. కార్పొరేట్ల దోపిడీని ఐక్యంగా ప్రతిఘటించాలని మార్గ దర్శనం కావించింది. కార్పొరేట్లకు అనుకూలంగా పని చేస్తున్న పార్టీలు, ప్రభు త్వాలకు గట్టి హెచ్చరిక అయింది. హిందూత్వ, కార్పొరేట్‌ దోపిడీకి ఊతం ఇచ్చే నయా-ఉదార వాద విధానాలను కలగలిపి మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న కుటిల పన్నాగాలను రైతు ఉద్య మం పటాపంచలు చేయనా రంభించింది. రైతు ల ఆందోళనలు కొన్ని రాష్ట్రాలకే, కొన్ని ప్రాంతా లలోనేనని తక్కువ చేసి చూస్తున్న బిజెపికి ఒకటి కాదు రెండు కాదు 540 సంఘాల మద్దతుతో ఆసేతు హిమాచలం జనాన్ని కదిలించిన భారత్‌ బంద్‌తోనైనా కనువిప్పు కలిగి ఉండాలి. ‘కార్పొ రేట్ల కబంధ హస్తాల నుండి వ్యవసాయ పరి రక్షణ, మోడీ గద్దె దిగాలి’ అనే నినాదం బంద్‌ లో దేశ వ్యాప్తంగా పెక్కటిల్లింది.జాతి వ్యతిరేక, రైతు వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక సాగు చట్టా లను రద్దు చేయకపోతే ప్రజలు ఆ కార్యాచరణ ను నిజం చేసే రోజు ఎంతో దూరం లేదు.

పతకమూరు దామోదర్‌ ప్రసాద్‌,సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు

మద్దతు ధర ఎలా?

పంటలకు ధరలు నిర్ణయించిన విధానం రైతాంగాన్ని ఆహారపంటల నుండి ఇతర పంటల వైపు మళ్ళించటం లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. వాణిజ్యపంటలు, పండ్లు, కూర గాయలు తదితరాలను ఎక్కువగా పండిర చాలని, ఆ పంటలకు అధికధరలు వస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. భారత్‌ లోని రైతు లను ఆహారపంటలు పండిరచటం నుండి దూరం చేసి, వాణిజ్యపంటలు పండిరచేలా చేసి, వారిని అంతర్జాతీయ మార్కెట్‌ ఒడిదుడుకుల లోకి లాగి దివాళా తీయించటం, దేశంలో ఆహారకొరత ఏర్పడేలాచేసి, ఆహార సరఫరాదారులుగా దేశ ఆర్థిక, రాజకీయ రంగాలపై తమ పెత్తనాన్ని పెంచు కోవచ్చు ననేది సామ్రాజ్యవాద దేశాలు, బహుళజాతి కంపెనీల వ్యూహం.
ప్రధాని మోడీ అధ్యక్షతన సెప్టెంబరు8వ తేదీన సమావేశమైన కేంద్ర కేబినెట్‌ ఆర్థిక వ్యవ హారాల కమిటి 2021-22 ఖరీఫ్‌ సీజన్‌లో 23 వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటించింది. కమిటీ ప్రకటించిన ధరలతో వ్యవసా య ఖర్చులు పోనూ రైతుల కనీస ఆదాయం 50 శాతం అదనంగా పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందని ప్రకటనలో పేర్కొన్నారు.కనీస మద్దతు ధరలను గురించి ఎవరూ ఏవిధమైన పొరపాటు అభిప్రాయాలతో ఉండవద్దని, కనీస మద్దతు ధరలు, వాటి పెంపుదల ఎప్పటికీ ఉంటాయని వ్యవ సాయశాఖ మంత్రి పత్రికా విలేకరుల సమా వేశంలో పేర్కొన్నాడు. ప్రభుత్వం వివిధ పంటలకు ప్రకటించిన ధరలు అత్యంత తక్కువగా ఉన్నాయి. మద్దతు ధరలు, వ్యవసాయోత్పత్తుల సేకరణపై రైతాంగం చేస్తున్న డిమాండ్లను, మూడు వ్యవసాయ చట్టాల రద్దు కోసం పది మాసాల నుండి దేశవ్యా పితంగా రైతాంగం చేస్తున్న పోరాటాలను పరిగణన లోకి తీసుకోకుండా ప్రభుత్వం పూర్తి ఏకపక్షంగా నిర్ణయించిన ధరలు రైతాంగానికి ఏ మాత్రం మేలు చేయవు.వరిధాన్యానికి 2020-21లో కనీస మద్ద తు ధర గ్రేడ్‌ ‘ఎ’కు క్వింటాలుకు 1,888 రూపా యలుగా నిర్ణయించగా,2021-22లో1960 రూపాయలకు-72రూపాయలుపెంచారు. సాధా రణ రకానికి క్వింటాలుకు 1,868 రూపా యల నుండి 1940 రూపాయలకు-72 రూపాయలు-పెంచారు. గత సంవత్సరం కన్నా గ్రేడ్‌ ‘ఎ’ రకానికి 3.8శాతం,సాధారణ రకానికి3.9 శాతం పెంచా రు. గోధుమలకు పెంపుదల మరింత తక్కువగా ఉంది.2020-21లో గోధుమ క్వింటాలుకు 1925 రూపాయలు కనీస మద్దతు ధరగా నిర్ణయించగా, 2021-22లో 1975రూపాయలుగా నిర్ణయించారు. పెంపుదల 2.5శాతం మాత్రమే. గత సంవ త్సరం కన్నా అత్యధికంగా నువ్వులకు క్వింటా లుకు 452 రూపాయలు(6.6శాతం) పెంచారు. తర్వాత కందులు, మినుములకు 300 రూపాయల చొప్పున (5శాతం) పెంచారు. వేరుశనగ, పొద్దు తిరుగుడు గింజలకు 275,235 రూపాయల చొప్పున 5.2,2.2శాతం చొప్పున పెంచారు. ఈవిధం గా కొన్ని పంటలకు ఎక్కువగా ధరలు పెంచ టం రైతాంగాన్ని ఆ పంటలను పండిరచే విధంగా ప్రోత్సహించటం కోసమేనని అధికా రికంగా విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. దేశంలో పండిరచే పంటలలో వరి, గోధుమ ప్రధానమైనవి. ప్రభుత్వం ఈ పంట లనే అధికంగా సేకరిస్తుంది. ప్రభుత్వం సేకరించని పంటలకు మద్దతు ధరలను ప్రకటించినా వాటిలో ఎక్కువ భాగం కాగితాలపై ఉండటం మినహా రైతాంగానికి ఉపయోగపడవు. ప్రభుత్వం గోధుమలకు క్వింటాలుకు 2.5 శాతం, వరి ధాన్యానికి 3.8 శాతం చొప్పున పెంచగా,ద్రవ్యోల్బణం 5 శాతం వరకు ఉంటుందని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అంచనా వేసింది. ద్రవ్యోల్బ ణంతో పోల్చుకున్నపుడు గోధుమలకు 2.5 శాతం, వరి ధాన్యానికి 1.1 శాతం తక్కువగా ధరలు నిర్ణయించినట్లు స్పష్టమౌతున్నది. వాస్తవవంగా ద్రవ్యోల్బణాన్ని పరిగణన లోకి తీసుకొని, అంతకన్నా అధికంగా మద్దతు ధరలు పెంచితే అదనంగా పెంచానని చెప్పుకోవటానికి అవకాశం ఉండేది. కాని కనీసం పెంచాల్సిన ధరల కన్నా తక్కువ నిర్ణయించి ఖర్చులకు అదనంగా 50 శాతం వచ్చేలా తాము రైతుల ఆదాయాన్ని పెంచామని చెప్పుకోవటం ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాన్ని వెల్లడి స్తున్నది. రైతులకు తాము పండిరచిన పంటలకు అయిన ఖర్చులన్నీ పోనూ 50శాతం అదనపు ఆదాయం వచ్చేలా ధరలు నిర్ణయించామని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నది. కాని వాస్తవంగా ప్రభుత్వం ఎ2ంఎఫ్‌.ఎల్‌కు అదనంగా 50 శాతాన్ని ప్రాతిపదికగా తీసుకొంటున్నామని చెబుతున్నది. రైతాంగం సి2ం50 శాతం విధానం ప్రాతిపదికగా వ్యవసాయోత్పత్తుల ధరలు నిర్ణయించాలని డిమాండ్‌ చేస్తున్నది. సి2ం50 విధానంలో మొత్తం వ్యవసాయ ఖర్చులతో పాటు వడ్డీలు, కౌలు, కుటుంబ శ్రమను కూడా పరిగణన లోకి తీసుకొని పంటలకు అయిన వ్యయాన్ని నిర్ణయి స్తారు. ఎ2ంఎఫ్‌.ఎల్‌ లో పెట్టుబడులు, కుటుంబ శ్రమను మాత్రమే పరిగణన లోకి తీసుకొని వ్యయాన్ని లెక్కిస్తారు. కాని వాస్తవంగా ప్రభుత్వం ఎ2ంఎఫ్‌.ఎల్‌ ను ప్రాతిపదికగా తీసుకోవటంలో కూడా మోసపూరితంగా వ్యవహరిస్తున్నది. వాస్తవంగా అయిన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మద్దతు ధరలను కొద్దిమేరకు పెంచి,50శాతం అదనంగా నిర్ణయించామని చెబుతున్నది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలను పరిశీలించినట్లైతే నువ్వులు, మినుములు, కందులు, వేరుశనగకు మాత్రమే 5 శాతం, అంతకన్నా ఎక్కువగా పెరచారు. ద్రవ్యోల్బణం 5శాతం ఉన్నపుడు ఇది నామకార్ధపు పెరుగుదల మాత్రమే. మిగతా పంటలకు వాస్తవంగా గత సంవత్సరం కన్నా తక్కువ ధరలు నిర్ణయించినట్లుగా స్పష్ట మౌతున్నది. అసలుకే తక్కువ ధరలు నిర్ణయించి నపుడు ఇక 50శాతం అదనంగా ఇవ్వటం ఎక్కడీ ప్రభుత్వం తానుగా ప్రజలపై వేస్తున్న భారాలు రైతులు,వ్యవసాయ రంగం పైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రభుత్వం పెట్రోలు, డీజిలు ధరలనను మూడోవంతుకు పైగా పెంచింది. సాధారణ రైతులు కూడా వ్యవ సాయంలో వచ్చిన మార్పుల దృష్టా మోటారు సైకిల్‌ వాడకం తప్పనిసరైంది. చాలా ప్రాంతా లలో వ్యవసాయ మోటార్లకు డీజిలు వినియో గిస్తున్నారు. వారు ఈ భారాన్నంతా భరించాల్సి వస్తున్నది. విద్యుత్‌ ఛార్జీల పెంపుతో పాటు వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించమని కేంద్రం ఒత్తిడి చేయటంతో కొన్ని రాష్ట్ర ప్రభు త్వాలు మోటార్లకు మీటర్లు బిగిస్తున్నాయి. దానిలో ఆంధ్రప్రదేశ్‌ లోని వైసిపి ప్రభుత్వం ముందెత్తున వున్నది. మీటర్లెందుకు బిగిస్తున్నా రంటే రైతులపై ఏ మాత్రం భారం ఉండదు. విద్యుత్‌ వ్యయాన్నంతా ప్రభుత్వం రైతులకు చెల్లిస్తుంది. రైతులు విద్యుత్‌ బిల్లులు చెల్లించవచ్చునని, వారిపై ఒక్క రూపాయి కూడా భారం ఉండదని చెబుతున్నారు. రైతులపై నిజంగా భారం వేసే ఉద్దేశ్యమే లేకపోతే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి, మీటర్లు బిగించటం ఎందుకు? ఇదే విధంగా గతంలో ప్రభుత్వం వంటగ్యాస్‌ సరఫరా చేసే కంపెనీలకు చెల్లిస్తున్న సబ్సిడీని వినియోగ దారుల ఎకౌంట్లలో జమ చేస్తానని,ముందు వినియోగదారులు మొత్తం ఖరీదు చెల్లించి వంటగ్యాస్‌ను కొనుగోలు చేయాలని చెప్పింది. ఆ విధంగా మార్చిన తర్వాత అనేకమంది ఎకౌంట్లలో సబ్సిడీ జమ కాలేదు.2020 నుండి మొత్తం సబ్సిడీని రద్దు చేశారు. వ్యవసాయ విద్యుత్‌కు కూడా ఆ విధంగా ప్రభుత్వం చెల్లిం చటం మానేస్తే బిల్లుల చెల్లింపు భారాన్ని రైతు లు భరించలేరు. కేంద్రం పంటల ధరలను నిర్ణయిస్తున్నపుడు ఈ విధంగా పెరుగుతున్న భారాలను పరిగణనలోకి తీసుకోవటం లేదు.
వాణిజ్య పంటల వైపుకు మళ్ళించే యత్నం
పంటలకు ధరలు నిర్ణయించిన విధానం రైతాంగాన్ని ఆహారపంటల నుండి ఇతర పంటల వైపు మళ్ళించటం లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. వాణిజ్య పంటలు,పండ్లు, కూర గాయలు తదితరాలను ఎక్కువగా పండిర చాలని, ఆ పంటలకు అధిక ధరలు వస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. భారత్‌ లోని రైతులను ఆహారపంటలు పండిరచటం నుండి దూరం చేసి,వాణిజ్య పంటలు పండిర చేలా చేసి,వారిని అంతర్జాతీయ మార్కెట్‌ ఒడిదు డుకుల లోకి లాగి దివాళా తీయించటం,దేశం లో ఆహారకొరత ఏర్పడేలా చేసి,ఆహార సరఫరా దారులుగా దేశ ఆర్థిక, రాజకీయ రంగాలపై తమ పెత్తనాన్ని పెంచుకోవచ్చుననేది సామ్రాజ్యవాద దేశాలు, బహుళజాతి కంపెనీల వ్యూహం. దీనిలో దేశంలోని కార్పొరేట్‌ కంపెనీలకు కూడా ప్రయోజనం ఉన్నది. అందువలన బహుళజాతి సంస్థలు, కార్పొరేట్‌ కంపెనీలు కలిసి దీనిని ముందుకు తీసుకు పోవటానికి ఒత్తిడి చేస్తున్నాయి. నయా ఉదార వాద విధానాలలో భాగమైన ఈ వ్యవసాయ విధానాన్ని అమలు చేయమని రైతులపై మోడీ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒత్తిడి చేస్తున్నాయి.వాణిజ్య పంటలు పండిర చమని రైతాంగాన్ని ఒత్తిడి చేస్తున్న ప్రభుత్వాలు పంటలు మార్కెట్లోకి వచ్చి ధరలు పడిపోయి నపుడు రైతాంగాన్ని ఆదుకోవటానికి, వారికి కనీస మద్దతు ధరలు ఇప్పించటానికి ఎటువంటి ప్రయత్నం చేయటం లేదు. గతసంవత్సరం ఉభ య తెలుగు రాష్ట్రాలలో ధాన్యం,పత్తి,ఇతర వాణిజ్య పంటలు మార్కెట్‌ లోకి వచ్చినపుడు వ్యాపారులు ధరలు దిగ్గోసి కోనుగోలు చేశారు. ఆ సందర్భంలో ప్రభు త్వాలు మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన చేశారు. ప్రభుత్వాలు నామమాత్రపు కొను గోళ్ళతో కంటి తుడుపు చర్యలు తీసుకున్నాయి మినహా మార్కెట్లోకి వచ్చిన ధాన్యం, వాణిజ్య పంటలను కొనుగోలు చేసి, రైతాంగానికి మద్దతు ధరలు అందించ టానికి ప్రయత్నం చేయలేదు. ఇటువంటి పరిస్థి తులలో రైతాం గాన్ని మరింతగా వాణిజ్య పంటల వైపు మళ్ళించటమంటే వారిని మరిం తగా మార్కెట్‌ దయాదాక్షిణ్యాలకు వదిలివేయ టమే అవు తుంది. అటువంటి స్థితిలో రైతాంగం మరిం తగా మార్కెట్‌ ఒడిదుడుకులకు గురై కనీస మద్దతు ధరలు పొందలేకపోవటం, అప్పుల పాలు కావటం,ఆత్మహత్యలు పెరగటానికి దారితీస్తుంది. అందువలన ప్రభుత్వం మద్దతు ధరలపై అసత్య ప్రచారాన్ని కట్టిపెట్టి, రైతాంగం డిమాండ్‌ చేస్తున్న విధంగా సి2ం50 శాతం ప్రాతిపదికగా అన్ని పంటలకు మద్దతు ధరలను నిర్ణయించి,సీజన్‌ ప్రారంభం కాగానే రైతాంగం నుండి మద్దతు ధరలకు పంటలను కొనుగోలు చేయటానికి పూనుకోవాలి. ఆహార ధాన్యాలు పండిరచే భూమి, ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గ కుండా,మన దేశ ఆహార భద్రత దెబ్బతినని విధంగా వ్యవసాయ విధానాలు రూపొందిం చాలి.- ఎ.కోటిరెడ్డి

బొక్కోసిన నిధులకు పక్కాగా లెక్కలు..?

వివిధ జిల్లాల పరిధిలో సుమారు 60 వేల పనులను పరిశీలించి 1000 కోట్ల రూపాయలకు పైగా ఉపాధి నిధులు దారిమళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఆ దిశగానే నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. కేవలం 60 వేల పనుల్లోనే ఇంత పెద్ద మొత్తంలో దొపిడీ బయట పడిరదంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సుమారు 16 లక్షల పనులను పరిశీలిస్తే ఇంకెన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయో అన్న సందేహాలు అధికారుల్లో సైతం వ్యక్తమవుతున్నాయి. ఏడు రకాల రికార్డుల్లో: అనుకూలంగా పద్దులు 13 జిల్లాల పరిధిలోని 12,944 గ్రామ పంచా యతీల పరిధిలో 20 లక్షల రూపాయలకు పైబడిన పనులు ఇప్పటి వరకు 8, 517 జరిగాయి. అలాగే 10 లక్షల పైన 20 లక్షలలోపు 2, 548 పనులు చేపట్టారు.5 నుంచి 10 లక్షల లోపు సుమారు 1000 పనులు మంజూరు చేశారు. 2 లక్షల నుంచి 5లక్షల లోపు 426 పనులు, లక్ష నుంచి 2లక్షల లోపు 126 పనులు మంజూరు చేశారు. గడిచిన రెండు మూడు నెలల్లో చేపట్టారు. గత ఏడాది నుంచి ప్రస్తుత ఏడాది వరకు అన్ని రకాల పనులు సుమారు 16 లక్షలకు పైగా మంజూరు చేశారు. అందుకు సంబంధించి వేలకోట్ల రూపాయలను కేటా యించారు. రాష్ట్రాన్ని లోటు బడ్జెట్‌ వెంటాడుతున్నా అభివృద్ధి పనుల విషయంలో వెనుకడుగుకు ఆస్కారం లేకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా వీలైనంత వరకు ఎక్కువ పనులను మంజూరు చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధిని పరుగు పెట్టిస్తున్నారు.

Read more

పోలవరం నిర్వాసితులకు అండగా జాతీయ కమిషన్‌

రాజ్యంగంలో 338ఎఆర్టికల్‌ పక్రారంగా ఏర్పడిన గిరిజన తెగల జాతీయ కమిషన్‌, గిరిజనుల రక్షణ సామాజిక ఆర్థిక శ్రేయస్సు ఇంకా పరిరక్షణకు సంబంధించిన అన్ని అంశాలను పర్యవేక్షిస్తుంది. ఇందులో భాగంగా ఈజాతీయ కమిషన్‌ పోలవరాన్ని సందర్శించు కుని తమ అభిప్రాయాన్ని ఒక రిపోర్ట్‌ రూపంలో వ్యక్తపరిచింది. జాతీయ కమిషణ్‌ చైర్మన్‌ అనంతనాయక్‌ నాయకత్వంలో కమిషన్‌ బృందం సభ్యులతో,అలాగే భుబనేశ్వర్‌ నుంచి అశోక్‌ వర్ధన్‌ గారు మరియు న్యాయ సలహా దారులు రాధకాంత త్రిపాటితో ఆంధ్రపద్రేశ్లో ముంపునకు లోనవుతున్న కూనవరం, విఆర్‌పురం మండ లాలతో పాటుగా ఒడిస్సలోని మల్కనగిరిలను సందర్శించారు. బాధితగిరిజనుల భూ వాస్త వాలను నిర్ధారించడానికి,ముఖ్యంగా గిరిజన ప్రజలతో సంభాషించడానికి క్షేత్ర సందర్శనలు జరిగాయి. ఆగస్టు 24 నుంచి 28వరకు వివిధ గ్రామాలకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం సమన్వ యంతో నిర్మాణంలో ఉన్న బహుళ ప్రయోజన పోలవరం ప్రాజెక్ట్‌ ప్రభావిత ప్రాంతాలైన పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలోని కొన్ని ప్రదేశాలు సందర్శించారు. ` జి.నివృతి, పోలవరం నిర్వాసితుల పరిశోధకరాలు

Read more
1 52 53 54 55 56 75