అసైన్డ్‌ చట్ట సవరణ ఎవరి కోసం?

పేదలకిచ్చిన అసైన్డ్‌ భూములు, ఇళ్ళ స్థలాలు లబ్ధి పొందినవారు, వారి వారసులు తరత రాలుగా అనుభవించాలేగానీ అమ్మకూడదు. ఇతరు లు కొనకూడదు. గత తెలుగుదేశం ప్రభుత్వం 20సంవత్సరాల తరువాత అమ్ముకోవచ్చని సవరిస్తే. …ఇప్పటి వైసిపి ప్రభుత్వం పదేళ్ళకు కుదించింది. అమ్ముకోవచ్చని చట్టమే సవరిస్తే పేదల చేతుల్లో ఉన్న చారెడు భూమి కూడ మిగలదు.
‘భూమి అనేది కేవలం ఆర్థిక వనరే కాదు. ఆత్మ గౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని, సమాజంలో హోదాని అందిస్తుంది. వీటితోపాటు భూమి అంటే అధికారం’ అని చెప్పేవారు ఎస్‌.ఆర్‌.శంకరన్‌. అందుకేనేమో పేదల చేతుల్లో ఉన్న అసైన్డ్‌ భూములు చేజారిపోకుండా, ఒకవేళ పోయినా తిరిగి ఆ పేదలకు చెందేలా 9/77 అసైన్డ్‌ చట్టాన్ని తెచ్చారు. నాటి పాలకవర్గం దీనిని తొలత తీవ్రం గా వ్యతిరేకించినా పట్టుబట్టి ఈ చట్టాన్ని సాధిం చారు. ఇంతటి ప్రాధాన్యత కల్గిన అసైన్డ్‌ చట్టాన్ని మరింత సమర్ధవంతంగా అమలు పరచాల్సింది పోయి నేటి పాలకులు రోజు రోజుకూ నిర్వీర్యం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్గం 9/77 చట్టం సెక్షన్‌ 3ను సవరించి పేదలకిచ్చిన ఇళ్ళ స్థలాలు,ఇళ్లు 10సంవత్సరాల అనుభవం తరువాత అమ్ము కోవచ్చని తీర్మానించింది. పేదలకిచ్చిన అసైన్డ్‌ భూములు, ఇళ్ళ స్థలాలు లబ్ధి పొందినవారు, వారి వారసులు తరతరాలుగా అనుభవించాలేగానీ అమ్మ కూడదు. ఇతరులు కొనకూడదు. గత తెలుగుదేశం ప్రభుత్వం 20సంవత్సరాల తరువాత అమ్ము కోవచ్చని సవరిస్తే…ఇప్పటి వైసిపి ప్రభుత్వం పదే ళ్ళకు కుదించింది. ఈ చట్టం ఇంత పగడ్బందీగా ఉన్నప్పటికీ పేదలకిచ్చిన భూములను పలుకుబడి కలిగినవారు, సంపన్నులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపా రులు, చివరకు ప్రభుత్వం కూడా అభివృద్ధి పేరుతో అసైన్డ్‌ భూములనే బలవంతంగా లాక్కుంటుంది. ఇక అమ్ముకోవచ్చని చట్టమే సవరిస్తే పేదల చేతుల్లో ఉన్న చారెడు భూమి కూడ మిగలదు.
స్వాతంత్య్రానికి ముందు ఆ తరువాత ‘దున్నే వానికే భూమి’ నినాదంతో దేశ వ్యాపితంగా జరిగిన భూ పోరాటాలవల్ల పాలక వర్గాలకు ఇష్టం ఉన్నా, లేకపోయినా భూసీలింగ్‌ చట్టం, రక్షిత కౌలుదారీ చట్టాలు, 1/70చట్టం,9/77 అసైన్డ్‌ చట్టాలు సాధించబడ్డాయి. ఈ చట్టాల వల్ల పేదల చేతుల్లోకి కొంతైనా భూమి వచ్చింది. ఆ భూమిని పొందిన దళితులు, బలహీన వర్గాల కుటుంబాలు తమ పిల్లలను చదివించుకుని ఇపుడిప్పుడే సమా జంలో మెల్లమెల్లగా తల ఎత్తుకుని తిరిగే స్థాయికి చేరుకుంటున్నారు. దీనిని కూడా సహించని పాలక వర్గాలు పేదలను భూమి నుండి వేరు చేసి వీరికున్న కొద్దిపాటి చట్టబద్ద హక్కులను కూడా లేకుండా చేస్తున్నాయి. ఇందులో భాగమే మన రాష్ట్ర మంత్రి వర్గం చేసిన అసైన్డ్‌ చట్ట సవరణ. స్వాతంత్య్రానికి పూర్వం నుండి కమ్యూనిస్టులు చేసిన పోరాటాల వల్లగాని లేదా ల్యాండ్‌ సీలింగ్‌ చట్టంవల్ల భూస్వా ముల చేతుల్లో ఉన్న మిగులు భూమిగాని, ప్రభుత్వ బంజర్లు, ఇనాం భూములు మొదలగు 16 రకాల భూములు ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 55 లక్షల ఎకరాలకుపైగా పేదలకు పంపిణీ చేసినట్లు ప్రభుత్వ లెక్కలు తెలియచేస్తున్నాయి. ఈ రూపంలో పేదలు పొందిన భూములను తిరిగి పెత్తందార్లు, పలుకు బడి కలిగినవారు అక్రమంగా దౌర్జన్యంగా ఆక్ర మించుకుంటుంటే….పేదలకు పావలో, పాతికో ఇచ్చి లాగేసుకుంటుంటే…పేదల చేతుల్లో ఉన్న భూములు చేజారిపోకుండా ఉండడానికే నాడు సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శిగా ఉన్న ఎస్‌.ఆర్‌ శంకరన్‌ 9/77అసైన్డ్‌ చట్టాన్ని తీసుకు వచ్చారు. ఈచట్టం ప్రకారం ఎవరైనా పేదలు తమ అవసరాల కోసం భూమిని అమ్మినా లేదా ఇతరులు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నా భూమి కోల్పోయిన పేదలు మా భూమి తిరిగి ఇప్పించమని ప్రభుత్వానికి విన్నవించుకుంటే సెక్షన్‌ 4 ప్రకారం తిరిగి కోల్పోయిన పేదలకే ఇవ్వాలి. సెక్షన్‌ 5ప్రకారం అసైన్డ్‌ భూములు రిజిష్టర్‌ చేయ కూడదు. అసైన్డ్‌ భూములు పొందేవారు ప్రభుత్వ ఉద్యోగులై ఉండకూడదు. అసైన్డ్‌ భూములు పొందాలంటే ప్రభుత్వం ఇచ్చేది, సొంత భూమి కలుపుకొని 5ఎకరాలు మెట్టగానీ లేదా రెండున్నర ఎకరాలు మాగాణి మించకుండా ఉండాలి. అనర్హులు అసైన్డ్‌ భూములు కొంటే 6 నెలలు జైలు శిక్ష, రూ.2000 జరిమానా విధించాలని సెక్షన్‌ 6 చెబుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అసైన్డ్‌ భూములకు ఈ చట్టం కవచకుండలం లాంటిది.
ఉమ్మడి రాష్ట్రంలో వామపక్షాల ఒత్తిడితో వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 2005లో కోనేరు రంగారావు నాయకత్వంలో ఏడు గురు ఐఎఎస్‌ అధికారులతో భూకమిటీని వేశారు. ఈ కమిటీ రాష్ట్ర వ్యాపితంగా పర్యటించి భూసమస్య పరిష్కారం కోసం 104సిఫారసులు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇందులో 90ఆమోదించింది. 12 తిర స్కరించింది.2పెండిరగ్‌లో ఉంచింది. ఆమోదిం చిన 90 సిఫారసులను తక్షణమే అమలు చేయాలని జిల్లా కలక్టర్లకు, సంబంధిత అధికారులకు జీవో నెంబర్‌ 1049,1191 విడుదల చేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో అన్యాక్రాంతమైన అసైన్డ్‌ భూములతో పాటు భూస్వాముల దగ్గర ఉన్న మిగుల భూములు, ప్రభుత్వం దగ్గర ఉన్న పదహారు రకాల భూములు మొత్తం కలుపుకుంటే ఈ రాష్ట్రంలో భూమిలేని ప్రతికుటుంబానికి ఎకరం భూమి పంచవచ్చని భూకమిటీ చెప్పింది. ఇది అమలు కావాలంటే అన్యాక్రాంతమైన అసైన్డ్‌ భూ ములు తిరిగి పేదలకు ఇప్పించాలి. సాగు నీటి వనరులు వచ్చిన చోట భూమి పున:వర్గీకరణ చేసి భూస్వాముల చేతుల్లో ఉన్న మిగులు భూమిని స్వాధీనం చేసుకోవాలి. దేవాలయ భూములు పేదలకే లీజుకివ్వాలి. కౌలుదారీ చట్టాలను సక్రమంగా అమలు చేయాలి. 1/70 చట్టాన్ని పక డ్బందీగా అమలు చేయాలని కోనేరు రంగారావు భూ కమిటీ 104 సిఫారసులు చేసింది. వీటిని అమలు చేయవలసిన రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం… అసైన్డ్‌ చట్టం సెక్షన్‌ 4 సవరించి అసైన్డ్‌ భూములు ఆక్రమించుకున్నవారు విద్యాలయాలు, పరిశ్రమలు, ఉద్యానవనాలు నిర్మించుకుని ఉంటే వారికే రెగ్యులర్‌ చేస్తూ చట్టసవరణ చేసి భూకమిటీ సిఫారసులకు ఆదిలోనే తిలోదకాలిచ్చి పేదలకు తీరని అన్యాయం చేసింది. అయినా నేటికీ 90 సిఫారసులు అమలు లోనే ఉన్నాయి. కానీ కోనేరు రంగారావు తో పాటు ఆయన సిఫారసులను కూడా కాంగ్రెస్‌, టిడిపి, వైసిపి ప్రభుత్వాలు కోనేటి లోకి కలిపేశాయి.
స్వాతంత్య్రానంతరం పాలక వర్గాలకు ఇష్టం ఉన్నా లేకపోయినా పేదలకు అనుకూలంగా కొన్ని చట్టాలయినా చేశాయి. 1991 నూతన ఆర్థిక విధా నాలు అమలు చేసిన తరవాత పేదలకు వ్యతి రేకంగా రివర్స్‌ భూసంస్కరణలు మొదలుపెట్టారు. నాడు పేదలకు అనుకూలంగా భూ పంపిణీ కోసం చట్టాలు చేస్తే నేడు పేదల భూములు పెద్దలకు కట్టబెట్టడానికి చట్టాలను అనుకూలంగా మారుస్తు న్నారు. ఇప్పటికే అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ చట్టాన్ని రద్దు చేశారు. నేడు అసైన్డ్‌ చట్టాన్ని మారుస్తున్నారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి మాటున భూ బ్యాంక్‌ పేరుతో అసైన్‌మెంట్‌ భూములనే లక్ష్యంగా చేసుకుని 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి చట్టబద్దమైన నష్టపరిహారం పేదలకివ్వ కుండా బలవంతంగా భూసేకరణకు పూనుకు న్నారు. నాడే చంద్రబాబు ప్రభుత్వం అసైన్డ్‌ భూము లు అనర్హులకు కట్టబెట్టడానికి ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళస్థలాలు, ఇళ్ళు 20సంవత్సరాలు అనుభవం ఉన్న వారు అమ్ముకోవచ్చని పేదలను నమ్మబలికించి చట్టసవరణ చేసింది. దీనివల్ల పేదలు లబ్ధి పొంద డం సంగతి పక్కనపెడితే రాష్ట్రంలో అక్రమంగా, దౌర్జన్యంగా పొందిన అనర్హులు తప్పుడు అగ్రి మెంట్‌లు సృష్టించి క్రమబద్దీకరించుకుని పేదలకు ద్రోహం చేశారు. నేడు వైసిపి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి 10 సంవత్సరాలు అనుభవం ఉంటే చాలు అమ్ముకోవచ్చని అసైన్డ్‌ చట్టం సెక్షన్‌ 3ను సవరిస్తూ మంత్రివర్గం తీర్మానం చేసింది. దీనివల్ల పేదలు లాభపడేదేమోగానీ దీనిమాటున అనర్హులకు మాత్రం రాజమార్గం ఏర్పడనుంది. ఏ ప్రభుత్వాలైనా పేదలకు భూములు ఇచ్చి వాటికి నీటి వనరులు, పరపతి సౌకర్యాలు కల్పించి వారిని దారిద్య్రంలో నుంచి బయటకి లాగి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళే ప్రయత్నం చేయాలి. దీనికి విరు ద్ధంగా పేదలకిచ్చిన సెంటో,కుంటో భూమిని కూడా అమ్ముకోమని ప్రభుత్వాలే పేదలను బికా రులుగా మార్చడం అత్యంత బాధాకరమైన విష యం.రాష్ట్ర వ్యాపితంగా భూముల విలువ పెరిగిన తరువాత రకరకాల అభివృద్ధి పేరుతో అసైన్డ్‌ భూ ములనే లక్ష్యంగా చేసుకొని బలవంతంగా లాక్కుంటున్నారు. ఎదిరించినవారిపై దౌర్జన్యం చేస్తూ అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వాలే భూమాఫి యాగా మారాయి. రాష్ట్రంలో నాగార్జున సాగర్‌, శ్రీశైలం, తుంగభద్ర,సోమశిల,వంశధార,తోటపల్లి,హంద్రీ నీవా,గండికోట,మొదలగు ప్రాజెక్టులు, రిజర్వాయర్ల కింద లక్షలాది ఎకరాలకు సాగునీటి సౌకర్యం వచ్చింది. 1975 భూసీలింగ్‌ చట్టం ప్రకారం ఈ భూములన్నీ పున:వర్గీకరణ చేసి భూస్వాముల చేతుల్లో ఉన్న భూములను తీసుకొని తిరిగి పేదలకు పంపిణీ చేయాలి. కానీ గడచిన నాలుగు దశాబ్దా లుగా కాంగ్రెస్‌, తెలుగుదేశం, వైసిపి ప్రభుత్వాలు ఒక్క భూస్వామి దగ్గర ఒక్క సెంటు భూమి తీసుకున్న దాఖలాలు లేవు.
దీనిని బట్టి ఈ ప్రభుత్వాలు ఏ వర్గ ప్రయోజనాలు కాపాడతాయో అర్థం అవు తుంది. దీనికి భిన్నంగా బెంగాల్‌, కేరళ రాష్ట్రాలలో భూస్వా ముల చేతుల్లో ఉన్న మిగుల భూములను తీసుకుని లక్షలాది ఎకరాలు పేదలకు పంచిన చరిత్ర వామ పక్ష ప్రభుత్వాలకు ఉంది. ప్రస్తుతం పేదలకు భూ పంపిణీ మాట ఏమో గానీ పేదల చేతుల్లో ఉన్న కొద్దిపాటి భూమిని కూడా వివిధ ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వాలే లాగేసుకుం టున్నాయి. రాష్ట్ర మంత్రి వర్గం చేసిన అసైన్డ్‌ చట్ట సవరణ వల్ల పేదలకు లాభం లేదు. ఆక్రమణ దారులకు రాజమార్గం ఏర్పాటు చేయడానికి కొద్దో, గొప్పో దళితుల చేతుల్లో ఉన్న అసైన్డ్‌ భూములను లాక్కోవడానికి తప్ప మరొకటి కాదు. నాడు ‘’దున్నే వానికే భూమి’’ కావాలని పోరాడి సాధించుకున్న భూ చట్టాలను నేటి ప్రభుత్వాలు ఒక్కొక్కటి నిర్వీర్యం చేస్తూ వస్తున్నాయి. సంక్షేమ పథకాల వల్ల దారిద్య్ర నిర్మూలన జరగదు. కేవలం ఉపశమనం మాత్ర మే. పేదలకు భూపంపిణీ చేయడం ద్వారానే దారిద్య్రాన్ని రూపుమాపడానికి దోహదపడుతుంది. కాబట్టి ఎంతోమంది త్యాగాల ఫలితంగా సాధించు కున్న భూ చట్టాలను అదే స్ఫూర్తితో పోరాడి రక్షించు కోవాలి.
వ్యాసకర్త ఎ.పి వ్యవసాయ కార్మిక సంఘం-రాష్ట్ర ప్రధాన కార్యదర్శి-వి.వెంకటేశ్వర్లు

సమత తీర్పుకు 24 ఏళ్లు

గిరిజన ప్రాంతాల్లో వారు అనుభవిస్తున్న భూములపై హక్కులను సమర్ధిస్తూ ‘సమత’ కేసులో ఒక సంచలన తీర్పు ఇచ్చి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్వర్గీయ జస్టిస్‌ కె రామ స్వామి సేవలు చిరస్మరణీయం. సమత తీర్పువెలువడి ఇప్పటికి 24 సంవత్సరాలు పూర్తి య్యాయి. రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలు ప్రకారం మాత్రమే కాకుండా వివిధ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలకు విరుద్ధంగా షెడ్యూల్డు ప్రాంతాల్లో గిరిజ నులకు చెందిన భూములను గిరిజనేతరులు దోచు కుంటున్నారని,చివరకు గిరిజనులు వారి హక్కు లను కోల్పోతున్నారని ‘సమత’ స్వచ్ఛంద సంస్థ ఆ హక్కుల కోసం చాలా కాలంగా పోరాడుతోంది.

దీర్ఘకాల పోరాటం తర్వాత ఆ సంస్థ కోర్టుల్ని ఆశ్రయించిది. 1993లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే దాన్ని కోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను దాఖలుచేసింది. నాలుగేళ్ళ పోరాటం తర్వాత సమత ఆ కేసులో విజయం సాధించింది.1980 నాటి అటవీ పరిరక్షణ చట్టం ప్రకారం షెడ్యూలు ప్రాంతాల్లో, రిజర్వు అటవీ ప్రాంతాల్లో భూములను ప్రైవేటు మైనింగ్‌ అవసరాల కోసం లీజుకు ఇవ్వడం నిషేధమంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. గిరిజన ప్రాంతాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక వ్యక్తి (పర్సన్‌) తరహాలోనే చట్టాలకు కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు ఆ తీర్పులో స్పష్టం చేసింది. ‘‘గవర్నర్‌ తన వ్యక్తిగత బాధ్యత ప్రకారం షెడ్యూల్డు ప్రాంతాల్లో శాంతి స్థాపనకు కృషి చేయాలి. సుపరిపాలన అందేందుకు చొరవ తీసుకోవాలి. గిరిజనులు, గిరిజనేతరులు, స్థానిక వ్యక్తుల మధ్య భూముల కేటాయింపు క్రమ బద్ధీకరణకు సంబంధించి రాజ్యాంగంలోని ఐదవ అధికరణంలో కొన్ని అధికారాలను కల్పించింది. షెడ్యూల్డు ప్రాంతాల్లోని భూములను బదలాయించడంపై నిషేధాజ్ఞలు విధించింది. ‘క్రమబద్ధీకరణ’ అంటే ‘నిషేధం’ కూడా అనే అంశాన్ని అన్వయించడానికి సంబంధించి స్పష్టమైన వివరణ ఇచ్చింది. ‘వ్యక్తుల’ అంటే సహజ వ్యక్తులతో పాటు న్యాయ వ్యవహారాలతో సంబంధం కలిగిన వ్యక్తులు, రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వాలు కూడా’’ అని జస్టిస్‌ కె.రామస్వామి, జస్టిస్‌ సాగిర్‌ అహ్మద్‌లు వారి తీర్పులో పేర్కొన్నారు. పైవేటు వ్యక్తులు, సంస్థలు, పారిశ్రామికవేత్తలకు అటవీ భూములను కేటాయించడం చెల్లదని సుప్రీంకోర్టు ఆ తీర్పులో స్పష్టం చేసింది. అయితే ఖనిజాభివృద్ధి సంస్థ, గిరిజన సహకార సంస్థ లాంటి రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రం అటవీ భూములను బదలాయించడాన్ని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం అనుమతించింది. కానీ కొన్ని షరతులు విధించింది. ఆ సంస్థలు ఆర్జిస్తున్న నికర ఆదాయంలో కనీసంగా ఇరవై శాతం మొత్తాన్ని ఒక శాశ్వత నిధిగా నిర్వహించాలని, ఆ నిధిని గిరిజనులకు ఉపయోగపడేలా పాఠశాలలు, ఆసుపత్రులు, రవాణా సౌకర్యాలు, పారిశుద్య అవసరాలు తదితరాల కోసం ఖర్చు చేయాలని ఆ షరతులో పేర్కొనింది.
గిరిజనుల ఆర్థిక వనరుల్లో ఒకటి వారి ప్రాంతాల్లో లభిస్తున్న విలువైన ఖనిజాలు. గిరిజనులు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో భారీ స్థాయిలోనే ఖనిజ (సహజ) వనరులు నిరుపయోగంగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఆశించిన స్థాయిలో, పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేక వృథాగా వదిలేసిన పరిస్థితుల్లో ఉన్నాయి. నిజంగా వాటిని సమర్ధవంతంగా వినియోగించుకున్నట్లయితే మైనింగ్‌ పరిశ్రమ లేదా ఖనిజ ఆధార పరిశ్రమలు గణనీయంగా వృద్ధి చెందుతాయి. ఫలితంగా గిరిజనులకే ఆ పరిశ్రమల్లో ఉపాధి కల్పన లభించే అవకాశం ఉంటుంది. మొత్తం గిరిజన ఆవాసాల్లోనే నాణ్యమైన లోహ సంబంధమైన ఖనిజాలే కాకుండా ఇతర రకాల ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. వీటిని వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవచ్చు. గిరిజనులను భాగస్వాములను చేసి అనేక రకాలుగా విలువను జోడిరచే ఖనిజ ఉత్పత్తుల తయారీ పరిశ్రమలను నెలకొల్పి అభివృద్ధి చేయవచ్చు. ఇదే చేసినట్లయితే గిరిజనుల అభివృద్ధి కోసం శాశ్వతంగానే ఒక ‘రాయల్టీ అభివృద్ధి డివిడెండ్‌ ఫండ్‌’ను నెలకొల్పడానికి పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు. మైనింగ్‌ వ్యాపారంలో గిరిజనులకు కూడా నిర్దిష్ట వాటాను కేటాయించడం ద్వారా వారిని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయవచ్చు. విలువైన ఖనిజాల ప్రాధాన్యత గురించి గిరిజనులు తెలుసుకునేందుకు, అవగాహన చేసుకోడానికి దోహదపడుతుంది. ఖనిజ ఆధార వ్యాపార, వాణిజ్య రంగాల్లో మాత్రమే కాక వ్యాపార నిర్వహణలో సైతం వారు రాణించేలా చైతన్యం కలిగించవచ్చు. అంతిమంగా ఇది వారి జీవన ప్రమాణాలు పెరగడానికి ఉపయోగపడుతుంది. గిరిజనుల చేతి బ్రహ్మాస్త్రం 1/70 చట్టం: షెడ్యూల్డు ప్రాంతాల్లో గిరిజనేతరుల స్వాధీనంలో ఉన్న భూములు గిరిజనులకే చెందేలా 1970లో ‘భూ బదలాయింపు క్రమబద్ధీకరణ చట్టం’ (వన్‌ ఆఫ్‌ సెవెంటీ) ఉనికిలోకి వచ్చింది. షెడ్యూల్డు ప్రాంతాల్లో గిరిజనేతరులకు భూమి ఉన్నట్లయితే, ఏదేని నిర్దిష్టమైన ఉత్తర్వులు లేదా అనుమతి ఉంటే తప్ప, అది గిరిజనుల నుంచి స్వాధీనం చేసుకున్నదేననే ఒక స్పష్టమైన (ముందస్తు అంచనాతో కూడిన) సెక్షన్‌ ఈ చట్టంలో ఉంది. గిరిజనేతరులు ఈ ప్రాంతాల్లో ఏ స్వల్ప స్థాయిలో భూమిని కలిగి ఉన్నా దాన్ని మరో గిరిజనేతరుల పేరు మీద బదలాయించడానికి కూడా వారికి అధికారం లేదు. షెడ్యూల్డు ప్రాంతాల్లోని భూమి (స్థిరాస్తి) బదలాయింపుకు ఈ చట్టంలో చాలా స్పష్టత ఉంది. 1964 నాటి సహకార సొసైటీల చట్టం కింద రిజిస్టర్‌ అయిన సొసైటీలోని సభ్యులు లేదా గిరిజనులకు తప్ప మరెవ్వరికి ఈ ప్రాంతంలోని భూమిని బదలాయించడం వీలు పడదు. బదలాయించాలనుకుంటున్నవారు గిరిజనులైనా, సొసైటీలో సభ్యులైనా తీసుకుంటున్నవారు గిరిజనులు కానప్పుడు, సొసైటీలో సభ్యులు కానప్పుడు ఆ బదలాయింపు చెల్లుబాటు కాదు.
ఈ చట్టం షెడ్యూల్డు ప్రాంతాల్లోని భూమిపై గిరిజనులకు హక్కు కల్పించింది. తొలుత ఈ చట్టాన్ని రూపొందించినప్పుడు సంబంధిత అధికారుల నుంచి ముందస్తు లిఖితపూర్వక అనుమతి ఉంటే తప్ప గిరిజనులకు చెందిన భూమిని గిరిజనేతరులకు బదలాయించడం సాధ్యంకాదు. ప్రారంభంలో ఈ చట్టం పరిధి ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితమైనప్పటికీ ఆ తర్వాత తెలంగాణ ప్రాంతానికి కూడా అన్వయించేలా సవరణ జరిగింది. గిరిజనుల నుంచి గిరిజనేతరులకు భూమి బదలాయింపు జరుగుతున్నట్లయితే ఈ చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్లకు అప్పగించబడిరది. అలాంటి సందర్భాల్లో ఆ భూమి గిరిజనులకు లేదా వారి వారసులకు మాత్రమే చెందుతుంది తప్ప గిరిజనేతరులకు చెల్లదు. ఈ చట్టం అమలులోకి వచ్చిన తొమ్మిదేళ్ళ కాలంలో (1979 వరకు) షెడ్యూల్డు ప్రాంతంలో గిరిజనేతరుల ఆధీనంలో ఉన్న విస్తారమైన భూములు పరిరక్షించబడినాయి. 1/70 చట్టానికి విరుద్ధంగా గిరిజనేతరుల ఆధీనం లో ఉన్న లక్షలాది ఎకరాల భూములు రక్షించ బడినట్లు ట్రైబల్‌ కల్చరల్‌ రీసెర్చి అండ్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పేర్కొనింది. అయితే ఇలా పరిరక్షణకు గురైన భూములు మళ్ళీ గిరిజనుల చేతికి వెళ్ళింది కేవలం నాల్గవ వంతు మాత్రమేనని, వివిధ రకాల ఉత్తర్వులతో ఇంకా లక్షలాది ఎకరాలు గిరిజనేతరులే అనుభవిస్తున్నారని కూడా పేర్కొనింది. ఇలాంటి పరిస్థితుల్లో 1197 జూలై 11న (దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం) దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో జస్టిస్‌ కె రామస్వామి, జస్టిస్‌ సాగిర్‌ అహ్మద్‌, జస్టిస్‌ జిబి పట్నాయక్‌ల నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన తీర్పులోని అంశాలను పరిశీలించడం అవసరం.
‘వ్యక్తి’ అంటే కేవలం వ్యక్తులు మాత్రమే కాదని, రాష్ట్ర ప్రభుత్వం కూడా అని ఆ తీర్పు నొక్కి చెప్పింది. షెడ్యూల్డు ప్రాంతంలోని భూమిని బదలాయించేటప్పుడు ‘వ్యక్తి’ అని పేర్కొన్నప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వం కూడా అవుతుందని, మైనింగ్‌ అవసరాల కోసం భూమిని గిరిజనేతరులకు లీజుకు ఇస్తున్నప్పుడు లేదా బదలాయిస్తున్నప్పుడు ఇది వర్తిస్తుందని, అలాంటి బదలాయింపు / లీజు నిషిద్ధమని ఆ తీర్పు స్పష్టం చేసింది. ఒకవేళ ప్రభుత్వమే ఆ భూమిని మైనింగ్‌ అవసరాల కోసం ఒక సంస్థకు బదలాయిస్తుంటే అది కూడా నిషేధిత చర్యే అవుతుందని స్పష్టం చేసింది. ఆ తర్వాతి పరిస్థితుల్లో రాష్ట్రపతి ఒక ప్రకటనలో ‘గవర్నర్లతో ఏర్పాటైన కమిటీ’ ఏర్పాటవు తుందని, చట్టం అమలులో జరుగుతున్న పొరపాట్లను, లోపాలను,ఉల్లంఘనలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు సంబంధించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సైతం పలు సిఫారసులతో కూడిన తీర్పు ఇచ్చినా ఆ తదనంతర పరిస్థితుల్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు చర్యలు తీసుకుంటున్నా యో స్పష్టం కావడంలేదు. -వనం జ్వాలా నరసింహారావు

వ్యవసాయ చట్టాలు రైతులకు ఉరితాళ్లు

భారత వ్యవసాయ రంగం ఇప్పటికే తీవ్ర సంక్షో భాన్ని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా, రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ, ఫెడరల్‌ స్ఫూర్తికి భంగం కలిగిస్తూ అప్రజాస్వామికంగా రాజ్యసభ బిజినెస్‌ రూల్స్‌ను తుంగలో తొక్కి మూడు నల్ల వ్యవసాయ చట్టాలను తెచ్చిన పరిస్థితి గతంలో ఏనాడూ లేదు.
ప్రస్తుత మార్కెటింగ్‌ యార్డులు రైతుల చేతులకు సంకెళ్ళు వేస్తున్నాయని,ఈనూతన వ్యవ సాయ చట్టాల వలన రైతులు ఎక్కడికైనా తమ ఉత్పత్తులను పంపి, తనకు నచ్చిన ధరకు అమ్ముకొనే వెసులుబాటు లభిస్తుందని,కమీషన్‌ ఏజెంట్లు వుండ రని, రైతులకు చాలా మేలు చేకూరుతుందని ప్రధాని మోడీ, వ్యవసాయ మంత్రి తోమర్‌ తదితరులు పదేపదే చెటబుతున్నారు. వాస్తవానికి ఈ మూడు నల్ల చట్టాలు రైతుల పాలిట ఉరితాళ్ళుగా మారతా యి. ఇప్పటి వరకు దేశం మొత్తం మీద వున్న 2384 రెగ్యులేటెడ్‌ మార్కెట్‌ యార్డులు, 4887 సబ్‌ యార్డులు,ఎ.పి.ఎం.సి.లు నోటిఫై చేసిన వేలా ది ప్రైవేట్‌ మార్కెట్‌ యార్డులు,గోడౌన్లు ఈ-నామ్‌తో అనుసంధానం చేయబడిన వందల మార్కెట్‌ యార్డులు,గ్రామీణ ప్రాంతాలలో వున్న దాదాపు 20,000 చిన్న చిన్న మార్కెట్‌ యార్డులు, మోడీ తెచ్చిన చట్టంలో ‘’ట్రేడ్‌ ఏరియా’’ నిర్వచనం లోకి రావు.దాంతో మార్కెటింగ్‌ వ్యవస్థ క్రమేపీ నిర్వీర్య మై, గత్యంతరం లేక రైతులు ఎమ్‌.ఎస్‌.పిలతో నిమిత్తం లేకుండా కార్పొరేట్‌ సంస్థలకు తక్కువ ధరలకు అమ్ముకోవలసిన దుర్గతి పడుతుంది.
మోడల్‌ ఎ.పి.యం.సి.యాక్ట్‌-2017, మోడల్‌ కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ యాక్ట్‌-2018లను అమలు చేసే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం నుండి అదనపు ఆర్థిక మద్దతు ఇవ్వబడుతుందని, దాంతో వ్యవసాయ మార్కెటింగ్‌ వ్యవస్థలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి వీలు కలుగుతుందని ఆర్థిక మంత్రి లోక్‌సభలో నమ్మబలికారు. రైతుల ఆదాయం రెట్టింపు అవ్వాలంటే ఈ రెండు మోడల్‌ చట్టాలను అమలు చేయటం అవసరమని నీతి అయోగ్‌ సంస్థ కేంద్రానికి సిఫార్సు చేసి వుంది. కమీషన్‌ ఏజెంట్లు ఉండరని ప్రధానమంత్రి పెద్ద అబద్ధం చెబుతున్నారు. రైతుల ఉత్పత్తుల మార్కె టింగ్‌లో ‘’ఎగ్రిగేటర్లు’’ ఉంటారని చట్టంలో స్పష్టంగా పేర్కొ నబడిరది. కమీషన్‌ ఏజెంట్లు చేసే పనినే ‘ఎగ్రిగేటర్లు’చేస్తారు. ‘మోడల్‌ ఎ.పి.ఎం.సి.యాక్ట్‌-2017’లో రెగ్యు లేటెడ్‌, ప్రైవేట్‌ మార్కెట్‌ యార్డు లనుఈ-నామ్‌తో అనుసంధానం చేయడం, ధాన్యం, గోధుమలు మున్నగు ఉత్పత్తులపైన 2శాతం మించ కుండా, కూరగాయలు, పండ్లు మొదలగు పచ్చి సరుకుపై 1శాతం మించకుండా మార్కెట్‌ సెస్సు వసూలు చేయవచ్చు. కమీషన్‌ ఏజెంట్లకు ధాన్యం మున్నగు వాటిపైన 2శాతం మించకుండా, కూర గాయలు మున్నగు వాటిపైన 4శాతం మించ కుండా కమీషన్‌ వసూలు చేసుకోవచ్చు. ఇందుకు పూర్తి భిన్నంగా మూడు నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకు రావలసిన అగత్యంపై కేంద్రం నుండి ఇంతవరకు సమాధానం లేదు.
మోడీ ప్రభుత్వం తెచ్చిన కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ చట్టం-2020 రైతులకు నష్టం కలిగిం చేలా వుంది. రైతులకు సరైన రక్షణ కలిగించే అంశాలు ఇందులో లేవు. స్పాన్సర్‌తో విభేదాలు వచ్చినపుడు రైతు (ఆర్‌.డి.ఒ/జిల్లా కలెక్టర్‌ స్థాయిలో నడిచే వివాద పరిష్కార ప్రక్రియ సందర్భంగా) న్యాయవాది సహాయం తీసుకోడానికి వీల్లేదని ఆంక్షలు విధించడం అత్యంత దుర్మార్గం. సాధార ణంగా రైతాంగంలో ఎక్కువ శాతం మంది నిరక్షరా శ్యులు. స్పాన్సర్‌ తరపున హాజరయ్యే వారికి ఉన్నత విద్య, చట్టాలపట్ల అవగాహన,ప్రభుత్వ అధి కారులతో సత్‌సంబంధాలు వుంటాయి. కావున వారు చెప్పినట్లుగానే జరుగుతుంది. అంతే తప్ప రైతుల మాటలకు విలువ వుండదు. ’నిత్యావసర వస్తువుల సవరణ చట్టం’’లో నిల్వ పరిమితులను ఎత్తివేయడంవల్ల బడారిటైల్‌ సంస్థలు చాలా హెచ్చు పరిమాణంలో సరకులను నిల్వ చేసుకోగల అవ కాశం కల్గుతుంది. ఫలితంగా కృత్రిమ కొరతలు సృష్టించబడేందుకు ఆస్కారం వుంది. అంతేకాక గత 12మాసాలలో వస్తువు సగటు ధరపైన మరు సటి సంవత్సరం 50శాతానికి మిగలని ధరలకు అమ్ముకోవచ్చుననే అంశం ప్రైవేట్‌ రిటైల్‌ మాల్స్‌కు అత్యధిక అదనపు లాభాలను పొందేందుకు వీలు కల్పిస్తుంది. ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధరలకు, రిలయన్స్‌ రిటైల్‌ మార్టులలో వినియోగ దారులకు అమ్మే ధరలకు పొంతన లేదు. రైతులకు ఎంతమాత్రం ఉపయోగం లేకపోగా వినియోగ దారులపైన పెనుభారం మోపబడుతుంది.
ఈ నేపథ్యంలో కౌలు రైతుల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలోపడ్డ చందంగా తయారయ్యే అవకాశం వుంది. సన్నకారు, చిన్న రైతులలో నూటికి 40మంది ప్రైవేట్‌ వడ్డీ వ్యాపా రుల దయాదాక్షిణ్యాల పైనే ఆధారపడాల్సిన పరిస్థితి వుందని నాబార్డుసర్వే చెబుతోంది. రూ.1.5లక్షల లోపు పంట రుణాలను హామీతో నిమిత్తం లేకుండా రైతులకు, కౌలు రైతులకు ఇవ్వా లని రిజర్వుబ్యాంకు మార్గదర్శకాలు వున్నా సరిగ్గా అమలు కావడం లేదు. దేశవ్యాప్తంగా సాగుభూమి లో 10శాతం భూమిని కౌలు రైతులు సాగు చేస్తు న్నారని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆచరణలో ఇంకా అధిక శాతం భూమిని కౌలు రైతులు సాగు చేస్తున్నారు. పంట రుణాలే కాక ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు అందవలసిన ఇన్‌పుట్‌ సబ్సిడీ గానీ, ప్రభుత్వం నేరుగా అందించే నగదు బదిలీ సహాయం (పి.ఎం.కిసాన్‌ సమ్మాన్‌ యోజన) కానీ, పంటల బీమా పథకం వలన అందాల్సిన సహా యం గానీ కౌలు రైతులకు ఇప్పటికీ అందడం లేదు. చాలామంది రైతులలో కౌలుకిచ్చినట్లు కాగి తంపైన అంగీకరిస్తే, తమ భూయాజమాన్య హక్కుకు భంగం వాటిల్లుతుందనే భయాందోళనలు వుండ టం వలన కౌలు పత్రం పైన సంతకాలు చేయడం లేదు. అంతేకాక బ్యాంకు కౌలు రైతుకిచ్చే పంట రుణం అతను కట్టకపోతే తాను కట్టవలసి వస్తుం దనే భయం కూడా వుంది. వాస్తవంగా తాము కౌలు చేస్తున్న భూమి తమకు చెందాలని, కౌలు రైతులు కోరుకోవడం లేదు. కౌలు చేసుకోడానికి భూమి దొరికితే చాలనుకుంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు నీతి ఆయోగ్‌ సంస్థ ‘’మోడల్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ లీజింగ్‌ యాక్ట్‌-2016’’ను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదానికి పంపించింది. ఉత్తరప్రదేశ్‌,మధ్యప్రదేశ్‌,రాజస్థాన్‌ తదితర రాష్ట్రాలు ఈచట్టం అమలు చేసేందుకు కృషి చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ చట్టా న్ని ఆమోదించాలని,రైతుకు తనభూమి పైన యాజ మాన్య హక్కుకు ఎట్టి పరిస్థితిలోనూ భంగం వాటి ల్లదని హామీ ఇస్తూ, అదే సమయంలో కౌలు రైతుకు గుర్తింపు ఇచ్చి,బ్యాంకు రుణం, ఇన్సూరెన్స్‌ సదు పాయం, ఇన్‌-పుట్‌ సబ్సిడి, నగదు బదిలీ మున్నగు ప్రయోజనాలు అందేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయవలసి వుంటుంది. రైతు సంఘాలు,కౌలు రైతు సంఘాలు, మోడల్‌ యాక్టు లోని అంశాలను రైతు లకు అవగాహన కల్పించి కౌలుపత్రాలపైన సంత కాలు చేయడంద్వారా కౌలు రైతులకు మేలు కలిగేం దుకు కృషి సల్పాలి.కేంద్ర ప్రభుత్వ నగదు బదిలీ (పి.యం.కిసాన్‌ సమ్మాన్‌) పథకంలో 5ఎకరాల లోపు భూయజమానులైన సన్నకారు, చిన్న రైతులకు మాత్రమే వార్షికంగా మూడు వాయిదాలలో రూ. 2,000 చొప్పున మొత్తంగా రూ.6,000నగదు బదిలీ జరుగుతుంది. వాస్తవానికి సాగు చేస్తున్న భూమిగల రైతుగాని లేక అనేక కష్టనష్టాలకోర్చి సాగు చేస్తూ వున్న కౌలురైతుకు ఈసహాయం అంద వలసిన అవసరం ఎంతైనావుంది. కాలియా పథ కం కింద ఒరిస్సా ప్రభుత్వం వార్షికంగా వ్యవసా య కూలీ కుటుంబాలకు రూ.12,500 చొప్పున, సన్నకారు,చిన్నరైతులు,కౌలు రైతులకు రూ.10,000 చొప్పున అందచేస్తున్నది. అదేపద్ధతిని ఇతర రాష్ట్రా లలో కూడా అమలు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా వుంది. ఈ పథకాలు సక్రమంగా అమలు కావాలంటే భూమి రికార్డులు సక్రమంగా వుండా లి. దేశంలో సుమారు 2 కోట్ల గిరిజన కుటుంబాలు వుండగా 20లక్షల మందికి మాత్రమే ఫారెస్ట్‌ అటవీ హక్కు పత్రాలు ఇవ్వబడ్డాయి. తగు సంఖ్యలో సిబ్బందిని నియమించి మహిళారైతుల పేర్లతో సహా భూ యజమానులపేర్లు, కౌలు రైతుల పేర్లతో సహా భూ రికార్డులను ఆధునీకరించవలసిన అవసరం ఎంతైనా వుంది.
వ్యవసాయ చట్టాలు -నిజా నిజాలు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసా య సంస్కరణల చట్టాలు రద్దు చేసేంత వరకు ఆందోళనలు విరమించేది లేదని రైతులు చెబుతు న్నారు. సంస్కరణల పేరుతో తీసుకువచ్చిన వ్యవసా య చట్టాలను వెనక్కు తీసుకోవాలని ఢల్లీి సరిహ ద్దుల్లో కొన్ని వారాలుగా వివిధ రాష్ట్రాల రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు రైతుల ప్రయోజనాల కోసమే మూడు కొత్త చట్టాలు చేశామని కేంద్రం చెబుతోంది. అవసరమైతే చట్టాల్లో సవరణలు చేస్తాం కానీ, వాటిని రద్దు చేసే ప్రసక్తి లేదని కేంద్ర మంత్రులు చెప్పారు. ఈ నేపథ్యంలో మూడు వ్యవసాయ సంస్కరణల చట్టాల వల్ల రైతులకు లాభం ఎంత? కార్పొరేట్లకు వ్యవసాయాన్ని దారాదత్తం చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణల్లో నిజం ఎంత? తదితర వివరాలను పరిశీలిద్దాం.
ప్రభుత్వం ఇటీవల మూడు వ్యవసాయ సంస్కరణల చట్టాలకు ఆమోదం తెలిపి, వాటిని అమల్లోకి తీసుకొచ్చింది. వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునేందుకు తీసుకువచ్చిన ుష్ట్రవ ఖీaతీఎవతీం ూతీశీసబషవ ుతీaసవ aఅస జశీఎఎవతీషవ (ూతీశీఎశ్‌ీఱశీఅ aఅస ఖీaషఱశ్రీఱ్‌a్‌ఱశీఅ) Aష్‌-2020బీ ఒప్పంద వ్యవసాయం చేసుకునేందుకు రూపొం దించిన, నిత్యావసర వస్తువుల పరిమితిపై చేసిన చట్టాలను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకు వచ్చింది. దళారులకు అవకాశం కల్పించకుండా రైతుల ఆదాయాన్ని వృద్ది చేయాలనే లక్ష్యంతోనే ఈ చట్టాలు చేశామని కేంద్రం ప్రకటించింది.
రైతులకు ఎలా ఉపయోగం?
ఇంతకు ముందు వివిధ రాష్ట్రాలు ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీల (Aూవీజ) నియమాల ప్రకారం రైతులు పంటలు అమ్ముకు నేవారు. వీటిని కొత్త చట్టాలు సడలించాయి. ఇప్పటి నుంచి ప్రభుత్వ మార్కెట్లలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తు లను అమ్ముకునేందుకు చట్టం వీలు కల్పిస్తోంది. దీంతోపాటు ఒప్పంద వ్యవసాయానికి సంబంధిం చిన నియమ,నిబంధనల ద్వారా చట్టబద్దత కల్పిం చారు. వ్యవసాయ ఉత్పత్తులపై స్టాక్‌ పరిమి తులను తొలగించేందుకు విధానాన్ని రూపొందించారు. పంటలు ఎక్కువగా పండినప్పుడు వ్యాపారులు రైతుల నుంచి పెద్ద మొత్తంలో ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేయడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది. పెద్దపెద్ద కార్పొరేట్‌ కంపెనీలు వ్యవసాయ ఉత్ప త్తుల మార్కెట్లలోకి వచ్చేందుకు కొత్త చట్టాలు వీలు కల్పిస్తున్నాయని రైతులు భయపడుతున్నారు. ఇది గుత్తాధిపత్యాన్ని సృష్టించగలదని,ఫలితంగా పంట ల ధరలను ఆయాకంపెనీలు తగ్గించడానికి అవకాశం కలుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Aూవీజ మార్కెట్లను 1960లలో దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. రైతులకు మెరుగైన మద్దతు ధరలు కల్పించాలనేది వీటిలక్ష్యం. దీని ప్రకారం రైతులు స్థానిక మార్కెట్‌ యార్డులలోని లైసెన్స్‌ పొందిన మధ్యవర్తులకు మాత్రమే పంట ఉత్పత్తులను అమ్మాల్సి ఉంటుంది. అంటే.. బహి రంగ మార్కెట్లో కాకుండా,తమకు దగ్గర్లో ఉన్న మార్కెట్‌ యార్డుల్లోనే రైతులు పంటలు అమ్ము కోవాలి. ఈ పరిమితుల వల్ల రైతులు తమ పంటను బహిరంగ మార్కెట్లలో అమ్ముకునేందుకు అడ్డంకు లు ఏర్పడ్డాయి. దీంతోపాటు కొన్ని దశాబ్దాలుగా ఈ కమిటీల ద్వారానే పంట ఉత్పత్తులు అమ్మాల్సి వచ్చింది. ఫలితంగా ప్రభుత్వ మార్కెట్లే రైతులు తమ ఉత్పత్తులకు సరిపోయే ధరను పొందడానికి అవరోధాలుగా మారాయి. ఏయే సీజన్లో, ఏయే పంటలకు ఎంత ధర పలుకుతుందనేది ప్రభుత్వం చేతుల నుంచి మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లింది. దీంతో దళారులు చెప్పిన ధరకే పంటలను అమ్ము కునే గతి రైతులకు పట్టింది. Aూవీజలు ప్రధానంగా కమిషన్‌ ఆధారిత వ్యవస్థ పై ఆధారపడి ఉంటాయి. లైసెన్స్‌ పొందిన మధ్యవర్తులు మాత్రమే ఈ మార్కెట్లలో రైతుల పంటలను కొనాలి. ఈ మధ్య వర్తుల్లో కమీషన్‌ ఏజెంట్లు,హోల్‌సేలర్స్‌, ట్రాన్స్‌ పోర్టర్స్‌, రైల్వే ఏజెంట్లు,స్టోరేజ్‌ ఏజెంట్లు ఉన్నారు. కానీ కొన్ని సంవత్సరాలు తరువాత ఇవి ఱఅ్‌వతీషశీఅఅవష్‌వస శీశ్రీఱస్త్రశీజూశీశ్రీఱవంలకు దారితీశాయి. కొన్ని వ్యాపార వర్గాలే మార్కెట్‌ యార్డులపై ఆధిపత్యం చూపడం మొదలైంది. స్థానిక మార్కెట్లలో వారు చెప్పిందే వేదం అనేంతగా పరిస్థితులు దిగజా రాయి. ఇందుకు ఒక ఉదాహరణ సైతం ఉంది. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్‌ ఉంది.2010 డిసెంబరులో…ఈ మార్కెట్‌ నుంచి జరిగిన వ్యాపారంలో దాదాపు 20శాతం ఒకే ఒక్క దళారీ సంస్థ ద్వారా జరిగిం దని కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా తేల్చింది. ఇలాంటి సంస్థలన్నీ కలిసి మార్కెట్‌ యార్డులకు వచ్చే రైతులకు మద్దతు ధర రాకుండా ముందుగానే ప్రణాళిక వేసుకొని వ్యాపారాన్ని పంచుకుం టున్నాయని తేలింది. ఇలాంటి దళారుల వల్ల రైతు అందుకున్న ధరకు, వినియోగదారులు కొనే ధరకు మధ్య తేడా పెరిగిపోతుంది.లాభం మాత్రం ఎప్పుడైనా మధ్యవర్తుల జేబుల్లోకే వెళ్తుంది. ప్రభుత్వ మార్కెట్‌ యార్డులు కొంతమంది వ్యాపారుల గుత్తాధిపత్యంలోకి వెళ్లాయని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ (చీa్‌ఱశీఅaశ్రీ జశీబఅషఱశ్రీ శీట Aజూజూశ్రీఱవస జుషశీఅశీఎఱష Rవంవaతీషష్ట్ర)2012లో వెల్లడిరచిన నివేదికలో తెలిపింది. రైతులు ప్రభుత్వ మార్కెట్‌ యార్డుల్లోనే కాకుండా బహిరంగ మార్కె ట్లలో,ఇతర రాష్ట్రాల్లో కూడా పంటలు అమ్ముకు నేందుకు కొత్తచట్టం అవకాశం కల్పించింది.దీనివల్ల రైతులు తమ ఉత్పత్తులకు ఎక్కడ ఎక్కువ ధర లభిస్తే అక్కడే అమ్ముకునే అవకాశం కలుగుతుంది. చట్టాలపై రైతులకు ఎందుకు నమ్మకం కలగడం లేదు? క్రమబద్ధీకరించని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లలోకి పెద్ద సంస్థలు, ప్రైవేటు వ్యాపారులు ప్రవేశిస్తే..వారితో బేరమాడే శక్తిని కోల్పోతామని రైతులు భయపడుతున్నారు.దీంతోపాటు కొత్త చట్టం ప్రకారం వ్యాపారులు ఎలాంటి ఫీజులూ చెల్లించా ల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణ లేకుండా ఇలాంటి ప్రైవేట్‌ వ్యాపారులు లావాదేవీ లు చేయడం వల్ల సాంప్రదాయ మార్కెట్‌ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుందేమోనని రైతులు భయపడుతు న్నారు. గత కొన్ని సంవత్సరాలలో చాలా రాజకీయ పార్టీలు ఇలాంటి సంస్కరణలు చేసేందుకు ముం దుకు వచ్చాయి. కానీ అందులో రాజకీయ కోణమే ఉందని స్పష్టంగా అర్థమైంది. సాంప్రదాయ Aూవీజమార్కెట్లు కొన్ని రాష్ట్రాలకు ఆదాయ వనరు లుగా ఉన్నాయి. ఉదాహరణకు పంజాబ్‌లో Aూవీజల్లో గోధుమల కొనుగోలుపై ఆరు శాతం ఫీజు(మార్కెట్‌ఫీజు,గ్రామీణాభివృద్ధి ఫీజు-మూడు శాతం చొప్పున)ను ప్రభుత్వం వసూలు చేస్తుంది. ధాన్యంపై ఆరు శాతం, బాస్మతి బియ్యంపై 4.25 శాతం ఫీజుఉంటుంది. పంజాబ్‌లో సుమారు 90 శాతం గోధుమలు, వరి పంటలను ఈ మార్కెట్ల లోనే కనీస మద్దతు ధరల (%వీూూం%)కు కొను గోలు చేస్తారు. అందువల్ల కొత్తచట్టాలతో ఈ వ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో ప్రభుత్వంతో పాటు మార్కె ట్‌ కమిటీలపై ఆధారపడి వ్యాపారాలు చేసే మధ్య వర్తులు,రైతులపై కూడా దీని ప్రభావం ఉంటుంది. కొత్త చట్టాల వల్ల ప్రభుత్వం చివరికి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడం ఆపేస్తుందేమోనని, ప్రైవేటు వ్యాపారులకే పంటలు అమ్ముకునే రోజులు వస్తాయేమోనని రైతులు భయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం 23 ప్రధాన పంటలకు కనీస మద్దతు ధర ను ప్రతి సంవత్సరం ప్రకటిస్తోంది.
కనీస మద్దతు ధరపై రైతుల డిమాండ్లు ఏంటి?
అన్ని ప్రధాన పంటల ఉత్పత్తులను ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేస్తామని చట్టప్రకారం హామీ ఉండాలని, అలాంటి హామీ ఇచ్చే చట్టాన్ని కేంద్రం తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. దీని ప్రకారం ప్రైవేటు వ్యాపారులు రైతుల పంటలను కనీస మద్దతు ధరకు, లేదా అంతకంటే ఎక్కువకు కొనాలనే నియమం ఉంటుంది.వీూూకి తక్కువగా ఉండే ఏదైనా వ్యవ సాయ ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించేలా చట్టం ఉండాలని రైతులు కోరుతున్నారు.
ఎవరికి ఉపయోగం?
వ్యవసాయ ఉత్పత్తులను ఫుడ్‌ కార్పొ రేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఖీజI)ద్వారా ప్రభుత్వం కొను గోలు చేస్తోంది.దేశ అవసరాలకు సరిపోయే ఉత్పత్తులను ఎఫ్‌సీఐ సేకరించి,నిల్వ చేస్తోంది. దేశవ్యాప్తంగా అతి తక్కువమంది రైతులు మాత్రమే కనీస మద్దతు ధరను పొందుతున్నారని ప్రభుత్వ గణాంకాలు నిరూపిస్తున్నాయి. వరిసాగు చేసే రైతుల్లో 13.5శాతం,గోధుమలు పండిరచే రైతుల్లో 16.2శాతం మంది రైతులు మాత్రమే కనీస మద్దతు ధరను పొందుతున్నారని నేషనల్‌ శాంపిల్‌ సర్వే చెబుతోంది.
కనీస మద్దతు ధరపై చట్టాలు చేయలేమా?
కనీస మద్దతు ధరకోసం చేసే చట్టం వల్ల ద్రవ్యోల్బణం ప్రభావితమవుతుందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. ఉదాహరణకు…రైతుల వద్ద మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేసే ప్రైవేట్‌ వ్యాపారి,తన లాభాన్ని చూసుకొని వాటిని వినియోగ దారులకు అందించేందుకు ఎక్కువ ధరలను నిర్దేశిం చాల్సి వస్తుంది. దీంతోపాటు మద్దతు ధరల విధా నాన్ని చట్టబద్దం చేస్తే.. బహిరంగ మార్కెట్లో కొను గోళ్లు తగ్గిపోయే అవకాశం ఉంది. ఇదిపంట ఉత్పత్తుల ఎగుమ తులపై కూడా ప్రభావం చూపు తుంది. కొన్నిసార్లు బహిరంగ మార్కెట్లో, విదేశాల్లో పంట ఉత్పత్తులధరలు మద్దతు ధరలకంటే తక్కువ గా ఉండే అవ కాశంఉంది. ఇలాంటప్పుడు వ్యాపా రులు పంటలను ఎక్కువ ధరలు పెట్టి కొని, తక్కువ లాభాలకు ఎగుమతి చేయలేరు. ఇదే సందర్భంలో దేశీయ మార్కెట్‌లో కూడా ప్రైవేటు వ్యాపారులు మద్దతు ధరలకు పంటలను కొనడానికి ముందుకు రారు. దీనివల్ల ప్రభుత్వం లేదా ఎఫ్‌సిఐ మాత్రమే మార్కెట్లో పంటలను కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీంతో పాటు ఎక్కువ మద్దతు ధర వచ్చే పంటలనే రైతులు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతారు. దీనివల్ల ప్రజలకు అవసరమయ్యే వివిధ రకాల పంటల సాగు తగ్గిపోతుంది. ఫలితంగా నూనె గింజలు వంటి అనేక ఆహార ఉత్పత్తులను భారత దేశం దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడు తుంది. సంస్కరణల వల్ల రైతులకు మంచి ధరలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. రైతుల అభ్యం తరాలను పరిగణనలోకి తీసుకొని, చట్టాలకు కొన్ని సవరణలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. కనీస మద్దతు ధరకు లిఖిత పూర్వక హామీ ఇస్తామని కేంద్ర మంత్రులు సైతం చెప్పారు. రైతులకు మెరుగైన ధర లభిస్తుందని భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం ధర-లోటు (జూతీఱషవ-సవటఱషఱవఅషవ) విధా నాన్ని అమలు చేస్తే మంచిదని కొంతమంది నిపు ణులు అభిప్రాయపడ్డారు.
ఈ వ్యవస్థను మధ్య ప్రదేశ్‌లో ప్రయ త్నించారు. దీని ప్రకారం..మార్కె ట్‌ ధరకు, కనీస మద్దతుధరకు మధ్య ఉండే లోటును ప్రభుత్వం రైతులకు చెల్లిస్తుంది. కాంట్రాక్ట్‌ వ్యవసా యంలో రైతుల హక్కులను కాపాడేందుకు చట్టపరంగా అద నపు రక్షణ కల్పించేందుకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. రిజిస్ట్రేషన్‌ విధానం ద్వారా ప్రైవేటు మార్కెట్లు, రాష్ట్రప్రభుత్వాల ఆధ్వ ర్యంలో పనిచేసే నోటిఫైడ్‌ మార్కెట్ల మధ్య సమానత్వం తీసు కొస్తామని తెలిపింది.నోటిఫైడ్‌ మార్కె ట్లలో వర్తించే సెస్‌, సర్వీస్‌ ఛార్జీలను రాష్ట్ర ప్రభు త్వాలు వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తా మని ప్రకటిం చింది. కాంట్రాక్ట్‌-ఫార్మింగ్‌ చట్టం ప్రకారం అగ్రి బిజినెస్‌ స్పాన్సర్లు రైతుల భూమిని ఇతరుల పేరుకు ట్రాన్స్‌ఫర్‌ చేయడం,అమ్మడం,లీజుకు ఇవ్వడం, తనఖా పెట్టడం వంటివి నిషేధించారు. కాంట్రా క్టు వ్యవసాయంలో రైతులు, స్పాన్సర్ల మధ్య ఏర్పడే భేదాభిప్రాయాల కారణంగా రైతుల భూమిని జప్తు చేయలేరని ప్రభుత్వం పేర్కొంది. పంటల వ్యర్థా లను కాల్చడంవల్ల ఢల్లీి,చీజR పరి సర ప్రాంతాల్లో కాలుష్యం పెరిగిపోతోందని, అందువల్ల వ్యర్థాలను దహనంచేసే రైతులకు ఒక సంవత్సరం జైలుశిక్ష, కోటి రూపాయల వరకు జరిమానా విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ అక్టోబర్లో దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. వ్యర్థా లను దహనం చేయకుండా ఇతర అవసరాలకు కొనుగోలు చేసేలా చొరవ చూపాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఒకక్వింటాల్‌ వ్యర్థాలకు రూ. 200 చొప్పున చెల్లించి, వాటిని తరలించాలని రైతులు కోరుతున్నారు. క్వింటాల్‌కు రూ.100 చొప్పున చెల్లించేందుకు ముందుకు రావాలని కేంద్రా నికి సుప్రీంకోర్టు సూచిం చింది. ఈసమస్యకు కూడా పరిష్కార మార్గాన్ని తీసుకువస్తామని ప్రభుత్వం తెలిపింది.– జిఎన్‌వి సతీష్‌

తత్వవేత్త సర్వోన్నతులు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌

‘‘ ఎవని లీలవలన రాతినుండి కూడా అమృతం లభిస్తుందో అట్టి లక్ష్మీకాంతుడైన మహాగురువునకు నమస్కరిస్తున్నాను. అల్పబుద్దుల్కెన శిష్యులను సైతం మహా ప్రజ్ఞావంతులుగా మలచగల శక్తియుక్తులు గల గురువులకు నమస్కారము.’’

ా విద్యార్థుల కోసం గవర్నర్‌నే ఎదిరించారు
ా అరిటాకు లేక నేల మీదే అన్నం తిన్నారు
ా పూజారి కాబోయి రాష్ట్రపతి అయ్యారు

ఆయనో ఆసాధారణ ప్రజ్ఞాశాలి,రాజ నీతి కోవి దుడు, విద్యావేత్త. భారత తొలి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్ర ప తిగా (1962 నుంచి67) పదవులకే వన్నెతెచ్చిన ‘భారత రత్నం’. ఆయనే డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌. ప్రజాస్వామ్య విలువలను నెలకొల్ప డంలో, విద్యకు సమున్నత స్థానాన్ని కల్పించడంలో ఆయన చూపిన బహుముఖ ప్రజ్ఞ ఆయనకు చరిత్ర లో శాశ్వత స్థానం కల్పించింది.‘తత్వవేత్తలు రాజ్యాధి పతులైనప్పుడు ఆదర్శ రాజ్యం ఏర్పడి దేశంలో సుఖశాం తులు విలసిల్లుతాయి’ అన్న గ్రీక్‌ తత్వవేత్త ప్లేటో వ్యాఖ్యలకు రాధాకృష్ణనే నిలువెత్తు నిదర్శనం. ముందుగా ఆయన జీవితంలోని మధుర ఘట్టాలను ఒకసారి స్పృశిద్దాం…

Read more

కథ చెబుతాను ఊకొడుతావా

వినదగు నెవ్వరు చెప్పిన ..వినినంతనె వేగపడక వివరింపదగున్‌.. గని కల్ల నిజము దెలిసిన.. మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ…!

చంద గహ్రణం (కథ)
మేడమీద మంచంలో లక్ష్మయ్యతాత చందమామను చూస్తూ పండుకున్నాడు. మనవడు సుధీర్‌, మనవరాలు ప్రతిమ తాత పక్కన చేరి చందమామను గూర్చి అనేక ప్రశ్నలు అమాయకంగా అడిగారు.
‘‘మేం చిన్నప్పుడు విన్న చంద్రుడికి, పుస్తకాల్లో చదువుకున్న చంద్రుడికి చాలా తేడ వుందిరా. రాహువు కేతువు అనే గ్రహాలు చంద్రుడిని, సూర్యుడిని మింగుతాయట. అలా మింగినపుడు చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఏర్పడతాయని మా తాతముత్తాతలు చెప్పారు. చంద్రుడు చాలా అందంగా వుంటాడని, చంద్రు నిపై చెట్టు, చెట్టుకింద అవ్వ, ఆమె పక్కన కుందేలు వుంటుందని చాలా కథలు చెప్పేవారు. నేను బడిలో చేరి పుస్తకాలు చదివినప్పుడు అసలు చంద్రుడు నేను విన్నట్లు అందంగా వుండడని,చంద్రునిపై చెట్టు,అవ్వ, కుందేలు లేవని చదివాను.చంద్రుని మీద దుమ్ము,ధూళి,రాళ్ళగుట్టలు వుంటాయని చదివా. సూర్యుడికి, చంద్రుడికి మధ్యలో భూమి వస్తే చంద్రగ్రహణం వస్తుంది. ఎక్కువగా పున్నమి రోజు ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది’’- అన్నాడు తాత లక్ష్మయ్య.

Read more

పీసా చట్టం గ్రూపు చైర్‌పర్సన్‌గా రెబ్బాప్రగడ రవి

‘ ఆదివాసీలు భిన్నజాతుల సమాహారమైన భారత ఉపఖండంలో అనేక గిరిజన సముదాయాలు నివసిస్తున్నాయి. ఆదివాసీలు తమదైన ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయం, సామాజిక విలువలను కలిగి ఉంటారు. దేశంలో ఆదివాసీలు నివసించే 9 రాష్ట్రాల్లో గిరిజనులకు కల్పించ బడిన రాజ్యాంగ హక్కులను అమలు పరచడానికి కృషి చేయడం తోపాటు, షడ్యూల్‌ తెగల సామాజిక సాధి కారత. సమా నత్వం, సంక్షేమం సాధిం చడమే సామాజిక బాధ్యత. ప్రజల జీవన ప్రమా ణాలు పెంచడంలోనూ, స్వయం సంవృద్ది సాధించడం లోనూ పీసా చట్టంలోని మరికొన్ని విశేష అధికారాలు ఉన్నాయి ’’ ` రెబ్బాప్రగడ రవి, సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మరియు పీసా వర్కింగ్‌ గ్రూప్‌ చైర్‌పర్సన్‌, చత్తీస్‌ఘర్‌,

అడవి బిడ్డలకు స్వయం పాలన మరింత సులువు కానుంది. ఇన్నాళ్లు షెడ్యూల్డ్‌ ఏరియాలో గిరిజనుల హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగింది. పెసా (పంచాయతీస్‌ ఎక్స్‌టెన్షన్‌ టూ షెడ్యూల్‌ ఏరియా)1996 చట్టం వచ్చి 25ఏళ్లు పూర్తియిన సమత ఎగ్జిక్యూ టివ్‌ డైరెక్టర్‌ రెబ్బాప్రగడ రవి చత్తీస్‌ఘడ్‌ రాష్ట్ర ప్రభుత్వం పీసా చట్టం వర్కింగ్‌ గ్రూప్‌ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్‌ బాగెల్‌ సలహాదారు శ్రీరాజేష్‌తివారీ అధ్యక్షతన‘‘గిరిజన అభివృద్ధి,అటవీ మరియు వన్యప్రాణి నిర్వహణ, మైనర్‌ ఫారెస్ట్‌ ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఏరియాస్‌ డెవలప్‌మెంట్‌’’పై టాస్క్ఫోర్స్‌ ఏర్పాటు చేసింది. దానికి అను బంధంగా టాస్క్ఫోర్స్‌ కింద వివిధ సబ్‌-వర్కింగ్‌ గ్రూపులను ఏర్పాటు చేశారు. ఇందులో సబ్‌-వర్కింగ్‌ గ్రూప్‌ ‘‘ట్రైబల్‌ ఏరియా గవర్నెన్స్‌-పెసా మరియు గవర్నెన్స్‌లో టెక్నాలజీ వాడకం’’ ఛైర్మన్‌గా సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రెబ్బాప్రగడ రవిని ఆరాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక సంఘం ప్రకటించింది.వర్కింగ్‌ గ్రూప్‌ కమిటీ పీసా చట్టంపై ప్రభుత్వానికి తగు సూచనలు సలహాలు ఇస్తోంది.

Read more

నిజం

నేటి ఆధునిక సమాజపు ఆలోచన, కానీ అందుకు భిన్నమైన దృక్పథంతో కొత్తకోణంలో రాసిన గిరిజన కథ ‘‘నిజం’’. మనుషులు, సమాజం, దేశం,తరతమ భేదం లేకుండా ఏనాటికైనా మార్పు చెంది తీరా ల్సిందే.అనే ఆశాభావంతో.. ఆలోచించే రచయిత్రి కథలన్నీ అలాంటి నిర్మాణాత్మక దృక్పథంతో ప్రయో జనాత్మకంగా తీర్చిదిద్ద బడ్డాయి. తన క్షేత్ర పర్యటనల్లో భాగంగా సందర్శించే గిరిజన గ్రామాల్లోని వాస్తవ సంఘటనలు, ప్రత్యక్షంగా గమ నించిన పరిజ్ఞానంతో ‘‘నిజం’’ కథ రాశారు. రచనా కాలం మార్చి 20,2006 జాగృతి వార పత్రికలో మొదట ప్రచురించబడిరది. అడవిబిడ్డలకు ప్రత్యేకంగా మతం,దైవాలు, ఉండవు వారు వేటి ద్వారా జీవనం సాగిస్తారో అవే వారి పాలిట దైవాలు..అవి వారి మతం… అభిమతం. అడవి బిడ్డలు విశ్వసించినట్టు దేని ద్వారా తమ జీవనం గడుస్తుందో దానినే దైవంగా ఆరాధించే లక్షణం ఆధునిక మానవులు అలవర్చుకుంటే ఇప్పుడున్న ఇన్ని మతాలు..నాగరికత ముసుగులో మనిషి సృష్టించుకున్న ఇన్ని రకాల దైవాల అవసరమే ఉండదు. ` శివల పద్మ , రచయితి.

సాధారణంగా గిరిజనులుఅంటే, కొండ కోనల్లో కాపురముంటూ, నాగరిక ప్రపంచం, లోకం పోకడ తెలియక, మూఢనమ్మకాలతో మూర్ఖ త్వం నిండిన, విచిత్ర వేషధారణలతో చిత్రంగా ఉం టారు. అనేది నేటి ఆధునిక సమాజపు ఆలోచన, కానీ అందుకు భిన్నమైన దృక్పథంతో కొత్తకోణంలో శివల పద్మ రాసిన గిరిజన కథ ‘‘నిజం’’. విద్యార్హ తల రీత్యా తెలుగు, ఫిలాసఫీ,ల్లో మాస్టర్‌ డిగ్రీలు పొందిన వీరు. కథా రచయిత్రిగా ‘‘ఎన్నాళ్లీ మౌ నం?’’ ‘‘ఫలించిన స్వప్నం’’ లాంటి కథా సంపు టాలు ప్రచురించిన ఈమె ఆలోచనా ధోరణిలాగే, కథా శిల్పం కూడా అద్భుతంగా ఉంటుంది. ‘‘సాధనమున పనులు సమకూరు ధరలోన’’ అన్న నానుడిని నిండుగా నమ్మిన ఆమె తాను నిత్యం చూస్తున్న సంఘటనలు,సమస్యలను,అనుభవాలను, వస్తువులుగా ఎంచుకుని ఎం చక్కని శిల్పసౌందర్యం అద్ది, అందమైన ఆలోచించదగ్గ కథలు రాయడంలో తను అందెవేసిన చేయి.
మనుషులు,సమాజం,దేశం,తరతమ భేదం లేకుండా ఏనాటికైనా మార్పు చెంది తీరా ల్సిందే.అనే ఆశాభావంతో.. ఆలోచించే రచయిత్రి కథలన్నీ అలాంటి నిర్మాణాత్మక దృక్పథంతో ప్రయో జనాత్మకంగా తీర్చిదిద్దబడ్డాయి. కథా రచయిత్రి తన క్షేత్ర పర్యటనల్లో భాగంగా సందర్శించే గిరిజన గ్రామాల్లోని వాస్తవ సంఘటనలు, ప్రత్యక్షంగా గమ నించిన పరిజ్ఞానంతో ‘‘నిజం’’ కథ రాశారు. దీని రచనా కాలం మార్చి 20,2006 జాగృతి వార పత్రికలో మొదట ప్రచురించబడిన గిరిజన కథ లోని కథనం, పరిశీలిస్తే…..
‘‘వారిజ’’ అనే పత్రిక రచయిత్రి తన స్నేహితురాళ్ళు సుధ,సునీతలతో కలిసి గిరిజన ప్రాం తాలతో పరిచయంగల‘మూర్తి’అనే సోదరుని సాయంతో ఒకచిన్నగిరిజన గ్రామం వెళ్లడంతో ప్రారంభమయ్యే కథ,ఆద్యంతం అడవుల్లోని వన వాసుల సుందర జీవన చిత్రాన్ని పాఠకుల కళ్ళకు కడుతూ,అందమైన అనుభవం అనుభూతిని,ఇచ్చి ఒకకొత్త ఆలోచన కలిగిస్తూ ముగుస్తుంది.తనదైన ‘‘కవితాత్మక ఉత్తమ వాక్య నిర్మాణ శైలి’’ సొంతం చేసుకున్న శివలపద్మకథా పయనం మరింత ఉత్తమోత్తమంగా సాగుతుంది. నగర జీవితంలో ఎంత వెతికినా దొరకని అనుభూతి సోయగం ‘వారిజ’ స్నేహితురాళ్ళ త్రయానికి అక్కడ లభ్య మౌతుంది. కానీ..బాహ్యప్రపంచంతో సంబం ధాలు లేకుండా,పూర్వకాలపు అనాగరిక పద్ధతు ల్లో, కూనరిల్లిపోతున్న అక్కడి గిరిజనుల పట్ల తక్కు వ భావం కలిగిన సుధ,సునీతలకు తన పరిశోధన ద్వారా వారి పూర్వాపరాలు తెలుసుకుని వారికి నాగరికత నేర్పడమే తన లక్ష్యం అని తన స్నేహితు రాళ్లకు సగర్వంగా చెబుతుంది. కానీ అక్కడ తాను ప్రత్యక్షంగా చూసిన పరిస్థితితో ఆశ్చర్యపోతుంది వారిజ.గిరిజన గ్రామంలో మూర్తి సేవా కార్యక్ర మాలు నిర్వహిస్తూ అక్కడి గిరిజనులతో సహృదయ సంబంధాలు కలిగి ఉంటాడు. అక్కడి వారంతా తనని తమ బంధువుగా భావించి ఆదరిస్తారు, ఆ చదువుతోనే స్నేహితురాళ్ళ బృందాన్ని అక్కడికి తీసుకువెళతాడు.
ముందస్తు సమాచారంతో అక్కడకు వెళ్లిన వీరిని ఆగూడెం ప్రజలంతా ఎంతో ఆత్మీ యంగా పలకరించడం,ఆహ్వానించడం,ఆధునిక అమ్మాయిలకు ఆశ్చర్యంగా అనిపించినా అది అడవి బిడ్డల సహజగుణం. మూర్తి అక్కడ తులసి అనే ఒక గిరిజన యువతిని ‘వారిజ’కు పరిచయం చేస్తాడు. ఆమె కట్టు బొట్టు రూపం చూసి తనకు మొదట చులకన భావం కలుగుతుంది.కానీ ‘తులసి’ లోని ఆప్యాయత పలకరింపులేకాదు.తను విశ్వ విద్యాలయ విద్యపూర్తి చేసి ఆగ్రామంలో ఒకబడి కూడా నడుపుతూ..జర్నలిజం కూడా చదువు తుం దని,చక్కని నాయకత్వ లక్షణాలు కలిగి,మంచి చైత న్యం నిండిన యువతి అని మూర్తి మాటల ద్వారా తెలుసుకున్న వారిజకి ఆశ్చర్యం కలుగుతుంది. చివరకు గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకునే పనిలో భాగంగా తులసి ఆధ్వ ర్యంలో అక్కడి గిరిజన మహిళలతో సమావేశం అయిన వారిజ స్నేహితురాళ్లకు చెంపలు చెళ్లు మనిపించేట్టు సమాధానాలు వస్తాయి.ప్రకృతితో ముడిపడి ఉండే వారి పండుగల గురించి, కట్న కానుకలు కనిపించని వారి పెళ్లిళ్లు, డబ్బు ప్రసక్తే లేకుండా సాగిపోయే వారి జీవనం గురించి, వృద్ధు లైన తల్లిదండ్రులను వారికొడుకులు కోడళ్ళు కాపా డే తీరు,ముసలి వారినినిర్లక్ష్యం చేస్తే గిరిజన కుటుం బాల్లో పాటించే,ఎలివేత,తదితర కట్టుబాట్లు, ఆచా రాల గురించి…ఆగిరిజన స్త్రీలు చెబుతూ ఉంటే ఈపట్టణ యువతులకు కళ్ళు బైర్లు కమ్ముతాయి, పేరుకు ఆధునిక ప్రాంతంలో నాగరికతతో జీవిస్తు న్నాము అని అనుకుంటున్నా,..అడవిబిడ్డల ఆత్మీయ సంస్కృతులతో పోల్చుకుంటే, మనం ఎంత అనాగరి కంగా జీవిస్తున్నామో నర్మగర్భంగా చెబుతూ రచ యిత్రి తనకు గల ‘మూలవాసి ప్రేమ’ను చెప్పకనే చెబుతారు.ఎంతో పటిష్టమైన కుటుంబ, సంఘ వ్యవస్థలకు, కట్టుబాట్లకు బద్ధులై జీవిస్తున్న ఈ వనవాసులు బాహ్యంగా అనాగరిక అవతారాల్లో అగుపించిన అంతర్గతంగా,మానసికంగా, నిజమైన మానవత్వం కలిగి జీవిస్తున్నారు అనే సందేశం ఈకథ ద్వారా అందించే ప్రయత్నం జరిగింది.
అడవిబిడ్డలకు ప్రత్యేకంగా మతం,దైవాలు, ఉండవు వారు వేటి ద్వారా జీవనం సాగిస్తారో అవే వారి పాలిట దైవాలు,అవి వారి మతం,అభిమతం. అడవి బిడ్డలు విశ్వసించినట్టు దేని ద్వారా తమ జీవనం గడుస్తుందో దానినే దైవంగా ఆరాధించే లక్షణం ఆధునిక మానవులు అలవర్చుకుంటే ఇప్పుడున్న ఇన్ని మతాలు,నాగరికత ముసుగులో మనిషి సృష్టించుకున్న ఇన్ని రకాల దైవాల అవ సరమే ఉండదు,అన్న భావన వ్యక్తం చేస్తుంది రచ యిత్రి. ‘‘వారిజ’’ తన గిరిజన ప్రాంత పర్యటనలో మనిషిని మనిషిగా గౌరవించే గొప్ప సుగుణాల సంపదలుగల అడవి బిడ్డలను…. వారిలో అడుగ డుగున అగుపించే అతిధి మర్యాదలు, నిష్కల్మష మైన, కాలుష్యరహిత జీవితాలు, చూసి మొదట తాము అనుకున్నట్టు వారికి ఏదో నాగరికత సంస్కా రాన్ని నేర్పి చైతన్యవంతుల్ని చేయాలి, అన్న ఆలోచ న మానుకుని వారినుంచే ఎంతో విలువైన సంస్కృతి సంప్రదాయాలు, తెలుసుకుని కొత్త ఆలోచనలతో తానేచైతన్యం చెందుతుంది.
గిరిజన సంస్కృతిని సంరక్షించడం అంటే వారికి ‘‘ఆధునిక మురికి సంస్కృతి’’ అంట కుండా చూడటంతోపాటు….వారిని వారిలాగే జీవింప జేసేస్తూ….మనమంతా వారికి అండగా తోడు ఉండటమే, నిజమైన గిరిజన సంస్కృతి సం రక్షణ, గిరిజన జాతి చైతన్య పతాక, అవుతుంది, అన్న వినూత్న అనుభవం ఐక్యసందేశం అంది స్తారు రచయిత్రి. దీనిలో గల క్లుప్తత,ఏకకాల, ఏకాంశ, లక్షణాల దృష్ట్యా ఇది అచ్చమైన ‘‘కథానిక’’ అనడంలో నిండు నిజం ఉంది. అలా..సార్థక నామధేయి అయింది కూడా.. కథానిక ప్రారంభం లో కనిపించే ఆసక్తి కథ నడపడం లో ఉండే సంబంధాలు చివరికి పాఠకులు ఊహించని ముగిం పు ఇలా ప్రతి విషయంలో రచయిత తీసుకున్న శ్రద్ధ కథకు మరింత వన్నె లద్దింది,నిజంగా ఈ ‘‘నిజం’’ కథ రచయిత్రి సంపూర్ణ రచనాపరిణితికి ఓమచ్చుతునక అనవచ్చు. (వచ్చే నెల సంచికలో మీ కోసం అట్టాడ అప్పలనాయుడు కథ అరణ్యపర్వం)
-డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు,ఫోను: 77298 83223

దేశ రక్షణ పోరాటంలో ఆదివాసీలు భాగం కావాలి

స్వాతంత్య్రానంతరం భారతదేశం నిర్మించుకున్న పరిశ్రమలు,ఆర్థిక సంస్థలైన ఇన్సూ రెన్స్‌, బ్యాంకులు, కోట్ల మంది ప్రయాణ సాధనమైన భారతీయ రైల్వేలు,పెట్రోలియం,గ్యాస్‌,విద్యుత్‌ ఇంధన సంస్థలు,విద్య,వైద్యంతో సహా సర్వమూ మోడీ ప్రభుత్వం దేశ,విదేశీ కార్పొరేట్లపరం చేస్తు న్నది. విదేశీ కార్పొరేట్‌ కంపెనీలతో కుమ్మక్కైన స్వదేశీ రిలయన్స్‌ వంటి కార్పొరేట్‌ కంపెనీలకు ప్రభుత్వరంగాల్ని అప్పగిస్తున్నది.వ్యవసాయ రంగా న్ని దేశ, విదేశీ కార్పొరేట్‌ కంపెనీల చేతుల్లో పెట్టేం దుకు మూడు వ్యవసాయచట్టాలు చేసింది. కార్మి కులు, రైతులను కార్పొరేట్‌ కంపెనీలకు కట్టు బానిసలుగా మార్చే చట్టాలు చేసింది. నిరసన తెలియజేసే హక్కు లేకుండా బ్రిటిష్‌ ప్రభుత్వం కంటే ప్రమాదకర‘ఉపా’ చట్టాలు చేసింది. ప్రజాస్వా మిక పునాదులపై దాడికి దిగింది. అమా యకులైన ఆదివాసీల పక్షాన నిస్వార్ధంగా నిలుస్తున్న హక్కుల కార్యకర్తలను జైళ్ల పాల్జేస్తోంది. జీవిత మంతా గిరిజన హక్కుల కోసం పోరాడిన 80 ఏళ్ల ఫాదర్‌ స్టాన్‌స్వామిని జైల్లో పెట్టి చంపేసింది. రాజ్యాంగ హక్కులను ధ్వంసం చేస్తున్నది. పౌరుల ప్రాథమిక హక్కులకు విఘాతం కలగడంతో ‘భారత దేశాన్ని రక్షించండి’ అంటూ కార్మికులు, రైతులు ఆగస్టు 9న ప్రభుత్వ ఆఫీసుల దిగ్భ్రందించారు. ఏజెన్సీ లోని విలువైన గనులు, ఖనిజ సంపదను కార్పొరేట్‌ శక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం చేయని కుట్రల్లేవు. ఆ కుట్రలకు కళ్లెం వేసేందుకు, కార్పొరేట్‌ శక్తులు అడవిలో అడుగు మోపకుండా అడ్డుకొనేందుకు ఆదివాసీలూ దేశ రక్షణ పోరాటంలో భాగస్వాములు కావాలి.
అటవీ సంపద కార్పొరేట్‌ పరం
ఆదివాసీలు బతుకుతున్న అడవులను మైనింగ్‌ పేరుతో కార్పొరేట్లకు కట్టబెడుతున్నది. అడవిపైవున్న హక్కును నిలబెట్టుకొనేందుకు పోరాడుతున్న గిరిజనులు, హక్కుల కార్యకర్తలపై బెయిల్‌ రాని భయంకరమైన ‘ఉపా’ చట్టం కింద కేసులు పెడుతోంది. బిజెపి పాలిత ఉత్తరప్రదేశ్‌, అస్సాం,హర్యానా ప్రభుత్వాలు వేల మంది గిరిజను లను జైల్లో నిర్బంధించాయి. జార్ఖండ్‌లో 10 వేల మంది గిరిజనులపై గతంలో రాజద్రోహం నేరం కింద కేసు నమోదు చేసింది. ఆదివాసీలను ఉద్దరిస్తామని గద్దెనెక్కి ద్రోహానికి పాల్పడుతున్న పాలకవర్గ విధానాలను ప్రతిఘటించాలి. ఆది వాసీల హక్కులు దెబ్బ తీయబోమని, అటవీ సంప దను కార్పొరేట్లకు కట్టబెట్టబోమని, పెట్టిన కేసులు ఉపసంహరించుకుంటామని ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాలు ప్రకటించేలా ఆదివాసీలు గొంతు విన్పించాలి.
రిజర్వేషన్లు గల్లంతు
ఆదివాసీలకు, దళితులకు ఉద్యోగ భర్తీలో రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పించింది. మోడీ ప్రభు త్వం వారికిప్పుడు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నది. జింక్‌, బాల్కో పరిశ్రమలను వాజ్‌పేయి ప్రభుత్వం దెబ్బ తీసింది. విశాఖ స్టీలుప్లాంట్‌ సహా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ అమ్మి తీరుతా మని మోడీ శపథం చేస్తున్నారు. 42 రక్షణ పరిశ్ర మలు అమ్మకానికి పెట్టారు. జీవిత బీమా(ఎల్‌ఐసి), జనరల్‌ ఇన్సూరెన్స్‌ రెండిరటినీ అంతం చేయ డానికి లోక్‌సభలో బిల్లుపెట్టారు. బ్యాంకులు కూడా ప్రైవేటుకు ఇచ్చేస్తామని నిర్ణయం చేశారు. విద్యుత్‌ పంపిణీ కూడా ప్రైవేటు వాళ్లకు ఇచ్చే చట్టం చేసింది. రైల్వేలో కొన్నిరూట్లు, కొన్ని స్టేషన్లు, రైల్‌ ఇంజన్లు, బోగీల నిర్మాణం ప్రైవేటుకు ఇచ్చే సింది. రైల్వేలో 3లక్షల ఉద్యోగులను తీసివేస్తామని ప్రకటిం చింది. రిజర్వేషన్లు అమలు చేయాల్సిన ప్రభుత్వ రంగం, ప్రభుత్వ సర్వీసులన్నింటినీ ప్రైవేటు పరం చేస్తే రిజర్వేషన్లు అమలు చేసేది ఎక్కడీ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు కానప్పుడు రిజర్వే షన్లకు విలువేం వుంటుంది? రిజర్వేషన్లు రాజ్యాం గంలో చెప్పుకోవడానికి ఉంటాయి తప్ప ఆచరణలో ఉండవు.
ప్రపంచబ్యాంకు బాటలో జగన్‌ ప్రభుత్వం
పాదయాత్ర, ఎన్నికల సందర్భంలో అధి కారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో 1.80లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి యువతకు న్యా యం చేస్తానని జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. మాట తప్పరు, మడమ తిప్పరని యువత నమ్మా రు. జాబ్‌ కేలండర్‌ విడుదలతో జగన్‌ ప్రభుత్వం అసలు నైజం బయటపడిరది. యువతలో ఆగ్రహం కల్గించింది. రాష్ట్రంలో 2.35లక్షలు ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలున్నాయని ఆర్థికశాఖ నివేదిక ఇస్తే జగన్‌ 10వేలు ప్రకటించి యువత విశ్వాసంపై నీళ్లుజల్లారు. గ్రామ సచివాలయాల పోలీసు కానిస్టే బుళ్లతో లెక్క సరిపెట్టేశారు. టీచర్‌ పోస్టుల భర్తీకి డిఎస్సీ ఊసెత్తలేదు. టీచర్లు లేక జివికే స్కూళ్లు మూతపడ్డాయి.స్పెషల్‌ డిఎస్సీ వేయాలని డిమాండ్‌ చేస్తుంటే డిఎస్సీనే జగన్‌ లేపేశారు. మోడీ వలె ఉద్యోగులను తగ్గించే పనిలో జగన్‌ ఉన్నారు. ప్రపం చ బ్యాంకు చెప్పినట్లు రెగ్యులర్‌ ఉద్యోగులను తగ్గించి తక్కువ వేతనాలు, హక్కుల్లేని వారితో పనిచేయించు కోవాలని జగన్‌ ప్రభుత్వం చూస్తున్నది.
జీవో3రద్దు ఆదివాసీ రాజ్యాంగ హక్కును కాల రాయడమే
జీవో3 సుప్రీంకోర్టు రద్దు చేయడంతో 5వ షెడ్యూల్డ్‌ ఏరియాలో ఆదివాసీల రాజ్యాంగ హక్కు దెబ్బతిన్నది. ఏజన్సీలో గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్‌ హక్కు పోయింది. కేంద్రంపై ఒత్తిడితెచ్చి రాష్ట్రపతి ఆర్డినెన్సు కోసం రాష్ట్ర ప్రభు త్వం ప్రయత్నించాలి. కానీ స్పందించలేదు. ఆ ప్రయత్నం చేయకపోగా ఒక పైపు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేసిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పు అమలుకు ఆదేశాలు ఇవ్వడం గిరిజనులను మోసం చేయడమే. సుప్రీం కోర్టు తీర్పునకు ముందు డిఎస్సీలో సెలెక్ట్‌ అయిన వారికి టీచర్‌ ఉద్యోగాలు ఇవ్వకపోవడం మరీ అన్యాయం. రిజర్వేషన్లు లేకుండా చేయాలనే బిజెపి వైఖరికి జగన్‌ ప్రభుత్వం బాసటగా నిలబడిరది.
షెడ్యూల్‌ ఏరియాలో అర్హత గల గ్రామాలను కలపాలి
యాభై శాతం పైన గిరిజనులు వుండి, 5వషెడ్యూల్డ్‌ ఏరియాకు ఆనుకొని వున్న గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో కలిపే ప్రయత్నం జగన్‌ ప్రభు త్వం చేయడంలేదు. రెండేళ్ల క్రితం గిరిజన సలహా మండలిలో కొన్ని గ్రామాలు షెడ్యూల్డ్‌ ఏరియాలో కలుపుతామని తీర్మానం చేసినట్లు ప్రకటించారు. అర్హత వున్న గ్రామాలన్నీ షెడ్యూల్డ్‌ ఏరియాలో కలపాలని డిమాండ్‌ చేయడంతో,సమగ్ర సర్వే జరిపి చేస్తామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి పష్ప శ్రీవాణి ప్రకటించారు. నిజంగానే చేస్తారని గిరిజనులు ఎదురు చూస్తున్నారు. భూమి, జనాభా రికార్డులన్నీ ప్రభుత్వం వద్దే ఉన్నాయి. వారం పది రోజుల్లో పూర్తి చేయాల్సిన సర్వేను ఏళ్లు గడుస్తున్నా చేయడంలేదంటే వైసిపి ప్రభుత్వంపై భూస్వాములు, గిరిజనేతర పెత్తందార్ల ఒత్తిడి వుందని అర్ధమ వుతుంది.
పోలవరం నిర్వాసితులనునిలువునా ముంచేశారు
గనులు తవ్వినా, ప్రాజెక్టులు కట్టినా, పరిశ్రమలు నిర్మించినా నిర్వాసితులు నిలువ నీడ లేకుండా పోతున్నారు. పోలవరంలో ముంచే యడం ఖాయమని తెలిసి, గ్రామ సభల్లో ప్రాజెక్టు వద్దని గిరిజనులు తీర్మానాలు చేశారు. గిరిజన గ్రామ సభలు ప్రాజెక్టు అంగీకరించినట్లు తీర్మానా లు తారుమారు చేసి రాజశేఖరరెడ్డి ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారు. రోజూ పోలవరంపై సమీక్ష చేసిన చంద్రబాబు లక్ష గిరిజన కుటుంబాల పునరావాసం గురించి 5ఏళ్లలో ఒక్క రోజూ సమీ క్షించలేదు. మొత్తం పునరావాసానికి అయ్యే ఖర్చు రూ. 33 వేల కోట్లు ఇచ్చేది లేదని మోడీ ప్రభుత్వం తెగేసి చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. పునరావాసం పూర్తి చేయకుండా ప్రాజెక్టు నిర్మాణం చేయం అని వాగ్దానం చేసిన జగన్‌ గిరిజనులను ప్రాజెక్టులో నిలువునా ముంచేశారు. పోలవరం నిర్వాసితులను బిజెపి, టిడిపి, వైసిపి దారుణంగా మోసం చేశాయి. గిరిజనుల బతుకులు, వారి ప్రాణాలకు విలువ ఇవ్వడంలేదు.
కార్మిక, కర్షక ఉద్యమంలో భాగం కావాలి
మోసపు మాటలతో గిరిజనులకు నష్టం,కష్టం కలిగించడమే గాక దేశ, విదేశీ కార్పొ రేట్లకు ఆదివాసీలను బలిచ్చే చర్యలు మానుకోవాలి. ఆదివాసీల భూమిని కార్పొరేట్లుకు ఇవ్వరాదు. విద్య,వైద్యం,పరిశ్రమలు,రైలు,బ్యాంకులు,ఇన్సూరెన్స్‌, విద్యుత్‌,వ్యవసాయం కార్పొరేట్లకు ఇవ్వొద్దు … అని ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నినదిం చాలి. పోలవరం నిర్వాసితులకు పునరావాసం యుద్ధప్రాతిపదికన కల్పించాలి. జీవో 3పై రాష్ట్ర పతి ఆర్డినెన్సు తీసుకువచ్చి గిరిజ నుల రాజ్యాంగ హక్కును కాపాడాలి. 50 శాతానికి పైగా జనాభా వున్న గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చాలి.స్పెషల్‌ డిఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయా లి …అని దేశ రక్షణ కోసం ఆగస్టు 9న మండ లాఫీసు వద్ద జరిగే ధర్నాలో గిరిజనులంతా భాగస్వాములు కావాలి.
-ఎం.కృష్ణ మూర్తి

భాగస్వామిని ఎంచుకునే హక్కు లేదా?

భారత రాజ్యాంగ రచనా కమిటీలో ఇద్దరు మహిళా సభ్యులు హన్సా మెహతా, రాజ్‌ కుమారి అమృత్‌ కౌర్‌ కూడా ఉన్నారు. ప్రతి మహిళ తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కును, లేదా కనీసం వివాహ మాడే వ్యక్తిపై తన ఇష్టాయిష్టాలను తెలిపే హక్కును రాజ్యాంగం లోని ప్రాథమిక హక్కులలో చేర్చాలని వారు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు కమిటీ లోని మిగతా సభ్యులు మద్దతు ఇవ్వలేదు. అందువల్ల రాజ్యాంగ పరిషత్తు ముందుంచిన తుది రాజ్యాంగ ప్రతిలో ఈ హక్కును చేర్చలేదు.
ఏడు దశాబ్దాల తర్వాత కూడా, మహిళలు తమకు నచ్చిన ఇతర కుల, మతా లకు చెందిన వ్యక్తులను ఎంపిక చేసుకోలేని పరిస్థితులను వారి కుటుంబాలే కల్పిస్తూ సంకుచితమైన ఆజ్ఞలను జారీ చేస్తున్నాయి. వారి జీవిత భాగస్వా ములపైన కిడ్నాప్‌, అత్యాచారం,‘లవ్‌ జిహాద్‌’ కేసులు మోపి జైలుపాలు చేస్త్తున్నారు. ఒకవేళ ప్రేమ జంట ప్రతిఘటిస్తే…స్వంత కుటుంబ సభ్యుల చేతిలోనో లేక ఆగ్రహంతో ఉన్న గుంపు దాడు లలోనో హత్యకు గురవుతున్నారు. ఇటీవల కాశ్మీర్‌ కు చెందిన సిక్కు యువతులు కొందరు ముస్లిం యువకులను వివాహం చేసుకొని, ఇస్లాం మతం లోకి మారాలనుకోవడంతో కాశ్మీర్‌ లోయలో ఒక ప్రమాదం ముంచుకొచ్చింది. పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీదళ్‌ సిక్కు నాయకులు ఇవన్నీ ‘’లవ్‌ జిహాద్‌’’ నేరపూరిత చర్యలని ఆగ్రహించారు. అమాయక హిందూ, సిక్కు బాలికలను వెంబడిస్తున్నారని ముస్లింలపై ద్వేషపూరితంగా నిందించడం కొత్తేమీ కాదు. ముస్లిం యువకులు గల్ఫ్‌ లో సంపాదించిన డబ్బుతో క్రైస్తవ బాలికలను వంచించి ఇస్లాం మతం లోకి మార్చే ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నారని ఆరోపిస్తూ కేరళ క్యాథలిక్‌ బిషప్‌ కౌన్సిల్‌ మొదట ‘లవ్‌ జిహాద్‌’ అనే పదాన్ని ఉపయోగించింది. ఈ భావావేశ ద్వేషభావాన్ని మొత్తం హిందూత్వ సంస్థలు వెంటనే స్వీకరించాయి. పైకి నదురుగా కనిపించే ముస్లిం యువకులను ఇలాంటి లవ్‌ జిహాద్‌ కోసం ఇస్లాం మత విశ్వాసాలను బోధించే కళాశాలల్లో జాగ్రత్తగా ఎంపిక చేశారని, హిందూ యువతులను ప్రేమ సంబంధాల్లోకి లాగి, ప్రలోభపెట్టే శిక్షణను వారికిస్తారనీ, వారికి అమ్మాయిలను ఆకర్షించడానికి మోటారు వాహనాలు, స్మార్ట్‌ ఫోన్లు, తేలికగా డబ్బు సంపాదించే ఏర్పాట్లు చేస్తారని హిందూత్వ సంస్థల వాదన. హిందూ యువతులతో సంబంధాలు ఏర్పరచుకునే ముస్లిం పురుషుల హృదయాల్లో ప్రేమ లేదని, కేవలం ఇస్లాం మతంలోకి మార్చేందుకే వారిని మభ్యపెట్టి పెళ్ళిళ్ళు చేసుకుంటారని హిందూత్వ వాదులు చెబుతున్నారు.
ఇటీవల సిక్కు మహిళలను (కేరళలో వారి క్రైస్తవ సోదరీమణులు, దేశంలో అనేక ప్రాంతాల్లో హిందూ సోదరీమణుల తరువాత) లవ్‌ జిహాదీలుగా ఆరోపణలు ఉన్న వారి మత ప్రచారంలోకి లాగారు. ‘లవ్‌ జిహాదీ’ల బాధితులుగా గుర్తించిన సిక్కు మహిళలలో, పద్దెనిమిది సంవత్సరాల మన్‌మీత్‌ కౌర్‌ కూడా వుంది. ఆమె ఇస్లాం మతంలోకి మారి,29 సంవత్సరాల ముస్లిం యువకుడు షాహీద్‌కు దగ్గరైంది. వారు రహస్యంగా పెళ్లి చేసుకు న్నారని రుజువు చేసే నిఖా ధ్రువపత్రాలు ఉన్నప్పటికీ…పోలీసులు వారిని గుర్తించి, వారు చెప్పే విషయాలను నమోదు చేయడానికి శ్రీనగర్‌ జిల్లా కోర్టుకు తీసుకెళ్ళారు. పోలీసు చర్యలు మన్‌మీత్‌ కౌర్‌ కోర్టులో చెప్పిన విషయాలను నిర్థారించడం కష్టమే అయినప్పటికీ, ఆమె ఇస్లాం మతం లోకి మారడం, షాహీద్‌ ను పెళ్లి చేసుకోవడం స్వచ్ఛందంగానే జరిగాయని అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆమె సంతకాలు చేసిన అఫిడవిట్‌ లు షాహీద్‌ కుటుంబం దగ్గర వున్నాయి. చివరికి ఆమె కోర్టు నుండి బయటకు వచ్చేటప్పుడు, ఆమెను షాహీద్‌ కుటుంబంతో వెళ్ళనివ్వలేదు. ఆమెను లాక్కెళ్లి ఒక వాహనంలో పడేసి, షాహీద్‌ ను పోలీసు కస్టడీ లోకి తీసుకున్నారు. మతాంతర వివాహాలకు వ్యతిరేకంగా స్థానికంగా చెలరేగిన దౌర్జన్యాలను పురికొల్పింది ఢల్లీి సిక్కు గురుద్వారా యాజమాన్యం పెద్ద, శిరోమణి అకాలీదళ్‌ కు చెందిన మంజీందర్‌ సింగ్‌ సిర్షా అని చాలా నివేదికలు తెలియజేస్తున్నాయి. మన్‌మీత్‌ కౌర్‌ వ్యవహారం లవ్‌ జిహాద్‌ కు ఒక ఉదాహరణ అని, ఆమెను తుపాకీతో బెదిరించి, కిడ్నాప్‌ చేసి అరవయ్యేళ్ళ ముస్లిం వృద్ధునితో పెళ్లి చేశారని గతంలో బిజెపి లో ఉన్న సిర్షా ఆరోపించాడు. మూడు రోజుల తరువాత, మన్‌మీత్‌ కౌర్‌ తన మొదటి భర్తతో విడాకులు కాకుండానే ఒక సిక్కు యువకునితో దక్షిణ కాశ్మీర్‌ లోని పుల్వామా గురుద్వారాలో పునర్వివాహం చేశారు. సిర్షా ముందుండి ఈ పెళ్ళి జరిపించినట్లు వార్తలందాయి.
ఆ ముస్లిం యువకునితో తనకున్న అనుబంధాన్ని గురించి హైకోర్టులో మన్‌మీత్‌ కౌర్‌ ఏం చెప్పిందనేది అధికారికంగా నిర్థారణ కాలేదు. అయినప్పటికీ, మరో మహిళ దన్‌మీత్‌ కౌర్‌ అలాంటి సమస్యతోనే ఒక సెల్ఫీ వీడియోను బయట పెట్టింది. 30 ఏళ్ళ తన భర్త ముజఫర్‌ తనను బెదిరించి కిడ్నాప్‌ చేశాడని ఆరోపణలు చేస్తూ ఆమె తల్లిదండ్రులు పోలీస్‌ కేసు పెట్టారు. దానిని ఖండిస్తూ, తాను అన్నీ తెలిసిన విద్యావంతురాలునని ఆమె వీడియోలో తెలిపింది. ‘నా హక్కులు నాకు తెలుసు. మంచి చెడుల మధ్య ఉన్న తేడా తెలుస’ంది. ఆమె జూన్‌ 6న ఇల్లు వదిలి, తన కోసం వెతకొద్దని తన తల్లిదండ్రులకు తెలిపింది. కానీ ఆరు గంటల వ్యవధిలోనే వారు పోలీసు ఫిర్యాదు చేయడంతో ఆమెను పెట్టుకొని వారికి అప్పగించారు. ఆమె 2012 లోనే స్వచ్ఛందంగా ఇస్లాం మతం లోకి మారి, 2014లో తన తోటి విద్యార్థి ముజఫర్‌ ను పెళ్లి చేసుకున్నానని రుజువు చేసే పత్రాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఆమె భర్త శ్రీనగర్‌ సెంట్రల్‌ జైలులోనే ఉన్నాడు.
తన ‘’సిక్కు బిడ్డలను’’ కిడ్నాప్‌ చేసి, బలవంతంగా ఇతర మతాలకు చెందిన వారితో పెళ్ళి జరిపించడం విస్మయానికి గురిచేసిందని శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌ అంటున్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ లో మాదిరిగా బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా చట్టాలు చేసి, అమలు చేయాలని బిజెపి అభిప్రాయపడిరది. కానీ, సిక్కు మహిళలు తమకు నచ్చిన వ్యక్తిని ఎంపిక చేసుకునే క్రమంలో… వారి కుటుంబ సభ్యులు, మత, రాజకీయ సంస్థలు, కోర్టులు, పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల…జమ్మూ, కాశ్మీర్‌ లో అనేక మంది మహిళలు బహిరంగంగా విచారాన్ని వ్యక్తం చేశారు.
మహిళ మతానికి చెందిన ఆస్తి కాదు
‘మహిళలను ఒక ‘’మతానికి చెందిన ఆస్తిగా’’ పరిగణిస్తున్నారు. 21వ శతాబ్దంలో కూడా మహిళలకు అండగా నిలిచే సంస్థలేమీ లేవు. పితృస్వామిక వ్యవస్థ చెప్పిన విధంగా మహిళలను మారకానికి ఉపయోగించే ఒక సరుకుగా చూస్తున్నారు’ అని జమ్మూ, కాశ్మీర్‌ కు చెందిన ఇఫ్రా జాన్‌ పేర్కొంది. పోలీసులు, కోర్టులు మహిళల ప్రాథమిక హక్కులను కాపాడే స్థితిలో లేవు. మగవారు కోరుకున్న విధంగానే ఆ వ్యవస్థలు పని చేస్తున్నాయి.
ఇటీవల కాలంలో సిక్కు మత పెద్దల మార్గదర్శకత్వంలో జరిగిన చర్యలను ఖండిస్తూ రచయితలు, మేధావులు, కవులు, కళాకారులు, సాంస్కృతిక కార్యకర్తలు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఒక వ్యక్తితో స్నేహం చేసే, ప్రేమించే, పెళ్లి చేసుకునే హక్కు, ఒక మత విశ్వాసాలను ఆచరించే హక్కులు విడదీయరానివి. ఇవి మహిళలకు కూడా సమానంగా చెందుతాయి. తప్పుడు వార్తలపై ఆధారపడే, మతాల మధ్య ద్వేష భావాన్ని, అనుమానాన్ని పెంచే ‘లవ్‌ జిహాద్‌’ లాంటి కుట్రపూరిత సిద్ధాంతాలను తిరస్కరిస్తున్నాం. దేశంలో ఏ ప్రాంతంలోనైనా మత మార్పిడి వ్యతిరేక చట్టాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అన్నారు. ‘వాస్తవానికి మత మార్పిడి వ్యతిరేక చట్టాన్ని ఇతర మతాలకు చెందిన మహిళలను పెళ్లాడిన ముస్లిం యువకులను నేరస్తులను చేసేందుకు ఉపయోగిస్తున్నారు. కానీ అటువంటి చట్టాలకు నిజమైన బాధితులు మహిళలే. ఎందుకంటే ఆ చట్టం వారి జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కును ఉల్లంఘిస్తుందని’ వారు అన్నారు. తమ జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకునే వారికి తమ సంఫీుభావాన్ని ప్రకటించి, మత పెద్దల బాధితులకు, కుటుంబాలకు మద్దతుగా నిలుస్తామని ప్రతినబూనారు.-(‘ది హిందూ’ సౌజన్యంతో),హర్ష మందిర్‌

భూముల చుట్టూ సమస్యల ముళ్లు

ఏళ్లతరబడి వారే సాగు చేసుకుంటు న్నారు. వారి వద్ద పాత దస్త్రాలున్నాయి. నేటికీ కొత్త పాసుపుస్తకం అందలేదు…తాము సాగు చేసు కుంటున్న భూమికి ఆధీనధ్రువీకరణ పత్రంఉంది. అయినా ఆన్‌లైన్‌లో సర్వే నంబరు కనిపిం చడం లేదు. క్షేత్రస్థాయిలో ఇలాంటి అనేక భూ సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి.

ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం రూపొం దించి ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలను ప్రవేశ పెట్టి సులభతర భూ లావాదేవీలకు వీలు కల్పించింది. అయితే కొత్త చట్టంతో ఇన్నాళ్లూ హక్కులు, పాసుపుస్తకాలు జారీ చేసిన తహసీల్దార్లకు అధికారాలు లేకుండా పోయాయి. ఇటీవల పెం డిరగ్‌ సమస్యల పరిష్కార బాధ్యతలను ప్రభు త్వం కలెక్టర్లకు అప్పగించింది. నెలల తరబడి పరిష్కా రం కాని సమస్యలకు వారం రోజులే గడువు విధిం చింది.దీనివల్ల గందరగోళ పరిస్థి తులు ఏర్పడగా.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ఐచ్ఛికాలే లేవంటూ నిట్టూరుస్తున్నారు.
కుటుంబంలోని కొందరిని తప్పించి మిగిలినవారికి గతంలో పాసుపుస్తకాలిచ్చారు. దీన్ని సరిచేసే ఐచ్ఛికాన్ని ధరణిలో ఇవ్వలేదు. ఇన్నాళ్లూ ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెబుతూ వచ్చిన అధికారులు ఇప్పుడు రెవెన్యూ కోర్టుల్లో కేసులున్న వారివి మాత్రమే పరిష్కరిస్తా మంటు న్నారు. క్షేత్ర స్థాయి అధికారులు చేసిన పొరపాట్లు అర్హులైన వారికి శాపంగా మారాయి. భూ సేకరణ సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న భూమి పోను మిగిలిన దానిని లబ్ధిదారుల ఖాతాలో కలపాల్సిఉండగా ఇంకా పరిష్కరించలేదు. ఒక సర్వే నంబరు లో సగం భూమి తీసుకుంటే ఆ నంబరు మొత్తం ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. కలెక్టర్‌ లాగిన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఇటీవల ప్రభుత్వం ఐచ్ఛి కాన్ని ఇచ్చింది. అయితే, సర్వే నంబరు ఆన్‌లైన్‌లో కనిపించక పోవడంతో దరఖాస్తును ఆన్‌లైన్‌ తిరస్క రిస్తోంది. గతంలో సాదాబైనామాకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని అనువుగా మలుచుకుని పక్కనే ఉన్న సర్వే నంబరులోని భూమిని కూడా కొందరు కలిపేసుకున్నారు. ఈఅంశంపై విచారించిన అనం తరమే క్రమబద్ధీ కరించాల్సి ఉండగా చాలా చోట్ల దస్త్రాల ఆధారంగా మమ అనిపించారు. ఇప్పుడు ఈతప్పును సరిచేసేందుకు అవకాశం లేకుండా పోయింది. ఏజెన్సీ ప్రాంతంలో పాసుపుస్తకాల జారీ సమస్య గిరిజనప్రాంతంలో ఏజెన్సీ చట్టానికి లోబడి అర్హులైన గిరిజనులకు హక్కుపత్రాలు జారీ చేయాల్సి ఉంది. గిరిజనుల నుంచి గిరిజనేతరులు,అర్హత లేని గిరిజనులు కొనుగోలు చేసిన భూములకు సంబంధించి 76వేల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. గిరిజనులు,గిరిజనులకు మధ్య తెల్ల కాగి తాలపై జరిగిన ఒప్పందాలు సాదాబైనామాలు క్రమబద్ధీకరించాల్సి ఉంది. కలెక్టర్‌ లాగిన్‌లో దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు. కానీ, చాలా సర్వే నంబర్లు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. దీంతో దరఖాస్తులు దాఖలు చేసేందుకు అవకాశం లేకుండా పోతోంది. కొందరు రైతుల మధ్య విస్తీర్ణం లో వివాదాలు నెలకొన్నాయి. దీనిపై గతంలోనే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసుకోగా ఇరు వురికి పాసుపుస్తకాలు నిలిపివేశారు. క్షేత్రస్థాయి సర్వే చేస్తే గానీ పరిష్కారం కనిపించడం లేదు. కలెక్టర్‌ లాగిన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఈ సర్వే నంబర్లు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. పాసు పుస్తకంతో ఆధార్‌ అనుసంధానం సందర్భంగా వేలిముద్రలు నమోదుకాక ఇన్నాళ్లూ పాసుపుస్తకం రానివాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కలెక్టర్‌ లాగిన్‌లో మరోమారు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. వేలిముద్రలు లేకపోతే కనుపాప ఐరిస్‌ తోనూ పాసుపుస్తకం జారీకి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి భూములు పొందిన వారికి చాలాచోట్ల పాసు పుస్త కాలు జారీ చేయడం లేదు.ఈ తరహా భూముల సర్వే నంబర్లు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. దీంతో లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగు తున్నారు. ఆన్‌లైన్‌లో ఖాతా నంబరు లేక పాసు పుస్తకాలు రాని రైతులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇన్నాళ్లూ వీరికి పాసుపుస్తకం జారీ చేస్తామంటూ తహసీల్దారు కార్యాలయ అధికారులు సర్ధిచెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం కలెక్టర్లకు పెండిరగ్‌ సమస్యల పరిష్కారానికి అవకాశం ఇచ్చింది. అయితే ఖాతా నంబరు లేని రైతులు దరఖాస్తు చేసుకునేందుకు మాత్రం మీసేవ, ధరణిలో ఐచ్ఛికాలు లేవు. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భూముల విస్తీర్ణంలో కోత
కొందరు రైతులకు పాసుపుస్తకాల్లో సర్వే సంఖ్యలు నమోదైనప్పటికీ విస్తీర్ణాల్లో కోతలు పెట్టారు. రెవెన్యూ సెటిల్‌మెంట్‌ సర్వే (ఆర్‌ఎస్‌ఆర్‌) ప్రకారం ఒక గ్రామ సేత్వారిలోని మొత్తం విస్తీర్ణం ఆ గ్రామంలోని రైతుల ఖాతాల్లోని విస్తీర్ణానికి మించి ఉంటే ధరణిలోకి అనుమతించదు. ఈకార ణంతోనే మొద ట్లో రెవెన్యూ సిబ్బంది కొందరు రైతుల విస్తీ ర్ణాల్లో కోతపెట్టారు. ఇప్పటికీ ఈ కత్తి రించిన విస్తీర్ణాలను కలిపే ప్రయత్నం చేయలేదు. ప్రస్తుతం కలెక్టర ్లకుదర ఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
3 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌.. మ్యుటేషన్‌
ధరణి పోర్టల్‌లో నెల రోజుల వ్యవధి లో 60వేల వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరి గాయి. పోర్టల్‌ గతేడాది నవంబరు రెండో తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. మూడు నెలల కాలంలో జనవరి-ఫిబ్రవరి నెలల మధ్య జరిగిన రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లే అధికం. మంగళవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1.36 లక్షల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరిగాయి. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తయ్యేందుకు కనిష్ఠంగా మూడు నిమిషాలు,సగటున 36నిమిషాల సమ యం పడుతోంది. వ్యవసాయ భూములను వ్యవ సాయేతర భూములుగా మార్పిడికి రెండు నుంచి ఎనిమిది నిమిషాల వ్యవధిపడుతోంది. ఎన్ని రిజిస్ట్రే షన్లు పూర్తవుతున్నాయో అంతే సంఖ్యలో మ్యుటేషన్లు కూడా పూర్తవుతున్నాయి.
పోడు భూముల సమస్యలు తీరాలంటే.. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీర్‌ ఇప్పటికే చాలా సందర్భాల్లో చెబుతూ వస్తు న్నారు. అయితే ప్రభుత్వం మూడు అంశాలపై దృష్టి కేంద్రీకరించడం వల్ల పోడు భూముల సమస్య లకు త్వరితగతిని పరిష్కారం చూపవచ్చంటున్నారు భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్‌ కుమార్‌. అటవీ భూములకు హక్కు పత్రాలు కావాలని గతంలో 2లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చా యి. ఇందులో 93 వేల మందికి హక్కు పత్రాలు అందాయి. మిగతా వారివి తిరస్కరించామని ప్రభు త్వం చెప్పింది. అయితే అధికారికంగా దర ఖాస్తు చేసుకున్న వారికి సమాచారం లేదు.ఈ క్రమంలో ఎవరి దరఖాస్తులు తిరస్కరించారో వారికి సమా చారం ఇవ్వడంతో పాటు అప్పీల్‌ చేసుకునే అవకా శం ఇవ్వాలని సూచిస్తున్నారు. అదే విధంగా అర్హత ఉండీ ఇంకా హక్కు పత్రాలకు కోసం దరఖాస్తు చేసుకోని వారు ఎవరైతే ఉన్నారో వారికి అవకాశం కల్పించాలంటున్నారు. ఇక అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదంలో ఉన్న భూములను ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వారికి తాత్కాలికంగా హక్కు పత్రాలు ఇవ్వడం దీర్ఘకాలికంగా ఉమ్మడి సర్వే చేసి అది ఏభూమో తేలితే ఆచట్టాల మేరకు హక్కు పత్రాలు కొనసాగించాలని చెబుతున్నారు. ఇక హక్కు పత్రాలను అందుకున్న వారికి అనేక చిక్కుముడులు ఉన్నాయి. కొద్ది మందికి వారు వాస్తవంగా సాగు చేసుకుంటున్న మొత్తం విస్తీర్ణం కాకుండా కొద్దిపాటి భూమికే హక్కు పత్రం వచ్చింది. పూర్తి విస్తీర్ణం కాకుండా ఎవరికైతే తక్కువ విస్తీర్ణం వచ్చిందో వారికి కూడా అప్పీల్‌ చేసుకునే అవకాశం కల్పిం చాలని సునీల్‌ కుమార్‌ సూచిస్తున్నారు. 2008 అటవీ హక్కుల చట్టం అదే చెబుతోందని అంటు న్నారు. 10ఎకరాల లోపు ఎంత భూమి సాగులో ఉంటే అంత భూమికి హక్కు పత్రం ఇవ్వచ్చని అంటున్నారు. ఇక పోడు భూములు సాగు చేసుకునే వారంతా గిరిజనులు కావడం వల్ల గిరిజన సంక్షేమ శాఖ తరపున లీగల్‌ టీమ్‌ను ఏర్పాటు చేసి వారి ద్వారా అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వాలం టున్నారు. గ్రామస్థాయిలోనే స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిం చి అక్కడ నెలకొన్న సమస్యలను గుర్తించి విచారణ చేపట్టి పరిష్కారం చూపాలంటున్నారు. అటవీ హక్కు చట్టం కేవలం అటవీ భూములను దున్నుకునే హక్కుకోసం చేసిన చట్టం మాత్రమే కాదు. అడవుల సంరక్షణ కోసమూ చేసిన చట్టం. అడవుల సం రక్షణ కోసం కమ్యూనిటీ టీమ్‌లు కీలకపాత్ర పోషి స్తున్నాయి. ఈ నేపథ్యంలో సామూహిక హక్కుల కోసం ఎక్కడైతే దరఖాస్తులు వచ్చాయో వాటిని వెంటనే పరిష్కరించే ప్రయత్నం ప్రభుత్వం చేయా లంటున్నారు.
ఆదివాసీల పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్‌ హామీ ఇవ్వడంతోనే నేను టీఆర్‌ఎస్‌లో చేరాను. అటవీ భూముల నుంచి గిరిజనులను ఖాళీ చేయిస్తున్నారు. వారిని బెదిరి స్తున్నారు. సాగు చేసుకోకుండా అడ్డుప డుతున్నారు. అమీ తుమీతేల్చుకోకుంటే బతుకులు రోడ్డున పడ తాయి.అటవీ అధికారులను నిర్బంధించండి. పోరాటాలు చేసేందుకు గిరిజనులు సిద్ధంగా ఉండాలి.‘‘అటవీ ప్రాంతాల్లోని గిరిజన, గిరిజనేతర రైతుల భూవివాదాలను పరిష్కరించి యాజమాన్య హక్కులు కల్పిస్తాం. పోడు భూముల విషయంలో నెలకొన్న వివాదాలను త్వరితగతిన పరిష్కరిస్తాం. ఇతర రైతులకు అందిస్తున్న ప్రయోజనాలను వారికీ వర్తింపజేస్తాం’ – 2018 శాసన సభ ఎన్నికలకు ముందు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ‘‘గిరిజనులను రక్షించాలి. పోడు భూముల వ్యవహారాన్ని తేల్చేయాలి. అన్ని జిల్లాలు, అన్ని డివిజన్లకూ నేనే స్వయంగా పోతా. నేనొక్కణ్నే కాదు.. మొత్తం మంత్రివర్గాన్ని, అటవీశాఖ ఉన్న తాధికారులను, చీఫ్‌ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీలం దరినీ తీసుకెళ్లి… తాలూకా కేంద్రాల్లో ప్రజాదర్బా ర్లు పెట్టి.. ‘ఇదిగో ఇది పోడు భూమి.. ఇదిగో మీ పట్టా’ అని ఇచ్చేస్తాం. దానిని ఫైనల్‌ చేసేస్తాం. ఆ తర్వాత ఒకఇంచు భూమి కూడా ఆక్రమణల పాలు కానివ్వం. పొరుగు రాష్ట్రం నుంచి గుత్తి కోయలు వచ్చి తమ ఇష్టం వచ్చినట్లు చెట్లను నరికేస్తు న్నారు. దీంతో మన గిరిజనులు నష్టపోయే పరిస్థితు లుంటున్నాయి. అందుకే ఈ పోడు భూములకు ఎక్కడో ఒక దగ్గర భరత వాక్యం పలకాలి. ఆర్‌వో ఎఫఆర్‌ చట్టం ప్రకారం హక్కులు కల్పిస్తాం. ఆ పేద గిరిజనులకు కూడా రైతుబంధు, రైతుబీమా రావాలి. వాళ్లు బతకాలి. వాళ్లూ మన బిడ్డలే ’’ -2019 జూలై నెలలో పోడుభూములపై అసెం బ్లీలో సీఎం కేసీఆర్‌ గిరిజనులకు ఇచ్చిన భరోసా ‘‘రాష్ట్రంలో పోడు భూముల సమస్యను పరిష్క రించాలని కేబినేట్‌ సమావేశంలో చర్చించాం. ఈ చట్టం కేంద్రం పరిధిలో ఉంది. 2005 సంవత్స రం కటాఫతో రాష్ట్రంలో అవకాశం ఉన్న అందరికీ పోడు భముముల సమస్యను పరిష్కరించాలని నిర్ణయించాం’’-నల్లగొండ జిల్లా హాలియాలో (ఆగస్టు 2న) జరిగిన నాగార్జునసాగర్‌ నియోజక వర్గ ప్రగతి సమీక్షలో సీఎం.
ఇలా పోడుభూముల సమస్యపై కేసీఆర్‌,టీఆర్‌ఎస్‌ పార్టీ పదేపదే హామీలిస్తున్నా సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదు. దశాబ్దన్నర కాలం నుంచి రావణ కాష్టంలా రగులుతున్న పోడు భూముల వ్యవహారం ఆదివారం నాటి కేబినేట్‌ సమావేశంలో, సోమవారం నాటి హాలియా ప్రగతి సమీక్ష సమావేశంలో ప్రస్తావనకు రావడంతో మళ్లీ తెరపైకి వచ్చింది. దీనిపై పాలకులు ప్రతిసారీ హామీలు,భరోసాలు ఇస్తున్నారే తప్ప,అవి ఆచరణ లోకి రావట్లేదని గిరిజన, ఆదివాసీ సంఘాలు, తుడుందెబ్బ భగ్గుమంటున్నాయి. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే పోడు భూములపై గిరిజనులకు సాగు హక్కులు కల్పించేలా ఆర్‌వోఎఫఆర్‌ చట్టాన్ని తెచ్చినా…తెలంగాణలో అది అమలు కావడం లేదని ఆరోపిస్తున్నాయి. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఒక్క సెంటు భూమిపై కూడా ఆదివాసీలకు హక్కులు కల్పించలేదని గుర్తుచేస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ దీనిపై పలుమార్లు భరోసా ఇస్తున్నా… ఆయన హామీలు ఆచరణలోకి రావట్లేదని గిరిజన, ఆదివాసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. తెలంగాణలో దాదాపు 13లక్షలకు పైగా ఎకరాలు పోడు వ్యవసాయం కింద ఉన్నాయని, ఇంత భారీ మొత్తంలో ఉన్న భూములపై ఆదివాసీలకు హక్కులు లేకుండా పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. పోడు భూములపై గిరిజనులకు సాగు హక్కులు కల్పిస్తామని సీఎం తాజాగా ప్రకటించి నందున ఇప్పటికైనా ఈసమస్యకు పరిష్కారం లభి స్తుందని ఆదివాసీలు ఆశిస్తున్నారు.
2005లోనే..
పోడు భూములపై ఆదివాసీ బిడ్డలకు సాగు హక్కులు కల్పించాలని దశాబ్దన్నర క్రితమే కేంద్రం నిర్ణయించి..‘రికగ్నిషన్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రైట్స్‌ (ఆర్‌వోఎఫఆర్‌) యాక్ట్‌-2006’ను అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు పోడు భూములపై సర్వే చేసి, న్యాయబద్ధంగా ఉన్న కేసులను గుర్తించి, పొసెషన్‌లో ఉన్న వారికి భూసాగు హక్కులు కల్పిం చాలని ఆదేశించింది. 2005 డిసెంబర్‌ 13 వరకు సాగులో ఉన్న పోడుభూములపై హక్కులు కల్పిం చాలంటూ ప్రకటించింది. తెలంగాణలో.. ఆదిలా బాద్‌, కుమ్రం భీం-ఆసిఫాబాద్‌, భద్రాద్రి-కొత్త గూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, జయశంకర్‌-భూపాలపల్లి, నాగర్‌కర్నూల్‌ వంటి మొత్తం 24 జిల్లాల్లో పోడు భూముల సమస్య ఉంది. రాష్ట్రంలో గోండు,బంజారా,కోయ,చెంచు,తోటి,కొలాం,నాయిక పోడ్‌ వంటి గిరిజన తెగలకు చెందిన ప్రజలు, కొంత మంది గిరిజనేతరులు పోడు భూములను సాగు చేస్తున్నారు. కేంద్రం ఆదేశాల మేరకు అప్పటి వైఎస్‌ ప్రభుత్వం 2007లో పోడుభూములపై సర్వే చేయించగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 40 లక్షలకు పైగా ఎకరాలు పోడు వ్యవసాయం కింద ఉన్నట్లు తేలింది. ఒక్క తెలంగాణలోనే 13 లక్షల ఎకరాలకు పైగా పోడు భూములున్నాయని తేల్చారు.
పరిష్కారమేదీ?
వైఎస్‌ హయాంలో రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ద్వారా.. పోడు భూములకు సాగు హక్కులు కల్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇలా తెలంగాణలోనే 1,86,679 క్లెయిమ్స్‌ వచ్చాయి. ఇందులో వ్యక్తిగత ఆర్జీలు1,83,252 కాగా, సామూహిక(కమ్యూనిటీ-గూడెంలోని ఆదివాసీ లందరూ కలిసి సాగు చేసుకునే భూమి) ఆర్జీలు 3,427.2020 మార్చి వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన వివరాల ప్రకారం..మొత్తం క్లెయిమ్స్‌లో 94,360 క్లెయిమ్స్‌ను పరిష్కరించారు. దాదాపు 7.54లక్షల ఎకరాలపై గిరిజనులకు సాగు హక్కులు కల్పించామని ప్రభుత్వం అందులో పేర్కొంది. కానీ..గిరిజన సంఘాలు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక సర్కారు ఒక్క ఎకరంపై కూడా హక్కులు కల్పించ లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ప్రజాదర్బార్లు అంటూ ప్రకటనలు చేస్తున్నారే తప్ప…ఎక్కడా నిర్వ హించిన దాఖలాలు లేవని విమర్శిస్తున్నారు.
వైఎస్‌ హయాంలో మొదటి దశ కింద 3.16లక్షల ఎక రాలకు హక్కులు కల్పించారని, ఇందులో తెలంగాణ ప్రభుత్వం హరితహారం కింద 40వేల ఎక రాలను వెనక్కి తీసుకుందని ఆరోపి స్తున్నారు. ఇంకా 10లక్షలకు పైగా ఎకరా లకు హక్కులు కల్పించాల్సి ఉందని వివరిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఆర్‌వోఎఫఆర్‌ చట్టాన్ని అమలు చేయలేదని విమర్శిస్తున్నారు. పైగా… వర్ధన్నపేట వంటి ఆర్డీవో కార్యాలయాల్లో అప్పటివరకూ ముద్రించి ఉన్న ఆర్‌వోఎఫఆర్‌ బుక్స్‌ను చెత్తబుట్టలో పారేశారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చిన వివ రాల ప్రకారం చూసుకున్నా..ఇంకా92,319 క్లెయిమ్స్‌ పెండిరగ్‌లో ఉన్నాయి. అయితే,అది పాత లెక్క. ఇప్పటి లెక్క ప్రకారం క్లెయిమ్స్‌ లక్షకు పైగానే ఉంటాయని సంఘాలు చెబుతున్నాయి. వీటికి సంబంధించి 10లక్షల ఎకరాలకు పైగా భూమి ఉంటుందని, వీటిపై గిరిజనులకు హక్కులు కల్పించాలని డిమాం డ్‌ చేస్తున్నాయి. పోడుభూముల వ్యవ హారం బయ టకు వచ్చినప్పుడల్లా సీఎం కేసీఆర్‌ స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి హామీ ఇవ్వడంతో ఇక తమబతుకుల్లో వెలుగులు నిండుతాయని ఆశిం చామని.. కానీ, ఇప్పటివరకూ ఒక్క ఇంచు భూమి సమస్యను కూడా పరిష్కరించలేదని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ఈ సమ స్య తీవ్రతను గుర్తించిన సీపీఐ బుధవారం (ఆగస్టు 4) నుంచి‘పోడుయాత్ర’ను చేపడుతోంది. ఇప్పటి కైనా కేసీఆర్‌ పోడు భూముల సమస్యను పరిష్క రించాలనిగిరిజన సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
అస్తిత్వంలో లేని కమిటీలు..
ఆర్‌వోఎఫఆర్‌ కింద సాగు హక్కులు కల్పించడానికి పెద్ద ప్రక్రియే ఉంది. ఇందుకోసం గ్రామ,జిల్లా,రాష్ట్రస్థాయి కమిటీలు ఏర్పాటు కావాలి. అప్పట్లో ఏర్పాటు చేసిన ఈ కమిటీలు అస్తిత్వాన్ని కోల్పోయాయి. ఇవి ఉన్నాయో లేదో అధికారులకే తెలియని పరిస్థితి. కాగా..పోడు భూములకు సంబంధించి ముందుగా గ్రామ స్థాయి కమిటీకి గిరిజనులు దరఖాస్తు చేసుకోవాలి. గ్రామ సభలు నిర్వహించి, ఆదరఖాస్తులు వాస్తవమో కాదో గ్రామ కమిటీలు తేలుస్తాయి. అర్హమైన ఆర్జీలను జిల్లా కమిటీలకు పంపుతారు. జిల్లా కమిటీలు వాటిని పరిశీలించి, రాష్ట్ర స్థాయి కమిటీకి పంపు తాయి. రాష్ట్రస్థాయి కమిటీ ఆర్జీలను ఆమో దిస్తుంది. అనంతరం ఫారెస్ట్‌, రెవెన్యూ శాఖలు ఆఆర్జీల్లో పేర్కొన్న భూములపై జాయింట్‌ సర్వే చేసి, నిజమో కాదో నిర్ధారిస్తాయి. సరిహద్దులు కరెక్టే అని తేలితే…భూసాగు హక్కులు కల్పిస్తారు. కానీ. తెలంగాణ ఏర్పాటయ్యాక ఏ ఒక్క గ్రామంలోనూ గ్రామసభలు జరిగిన సంద ర్భాలు లేవని ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అధికారులు వర్సెస్‌ గిరిజనులు
అధికారులు వర్సెస్‌ గరిజనులు
పోడు భూముల విషయంలో అటవీ అధికారులు,గిరిజనులకు మధ్య తరచూ వివా దాలు నెలకొంటున్నాయి. గిరిజనులు సాగు చేసు కుంటు న్న భూమి తమదేనంటూ అటవీ అధికారులు క్లెయి మ్‌ చేస్తున్నారు.ఎక్కడ చదును భూమి కనిపిస్తే… అక్కడ అటవీ శాఖాధికారులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇదిపోడు వ్యసాయం చేసుకుంటున్న గిరిజనుల భూముల్లో కూడా కొన సాగుతోంది. దీంతో గిరిజనులు తిరగబడు తున్నా రు. తరతరాలుగా తాముసాగు చేస్తున్నా మని, ఆ భూమి తమదేనని చెబుతున్నారు.దీనిపై ఇరు వర్గాల మధ్య తరచూ దాడులు, ప్రతిదాడులు జరుగు తున్నాయి.
-ఆదిలాబాద్‌ నుంచి సునీల్‌ నాయక్‌

1 54 55 56 57 58 75