మహానీయ స్వామి వివేకానంద

మహనీయ స్వామి వివేకానంద ఉన్నతమైన ఆశయాలు ఏదోఒకరోజు సర్వజనాంగీ కారాన్ని పొందుతాయి. కారణం ఆభావన, ఆశయాలు ప్రతి కార్యరంగంలోనూ,ప్రతీ ఆలోచనా విధా నంలోనూ ఉత్తేజం కలిగించేవి కాబట్టి. కాషాయాంబరాలు ధరించి,పద్మాసనస్థుల్కె, ఒకదాని మీద మరొకటిగా కరకమలాలను ఒడిలో ఉంచు కుని,అర్థనిమీనేత్రుల్కె ధ్యానమగ్నుల్కె వివేక మం తమైన ఆనందం అనుభవించే స్వామి వివేకానంద లోకానికి ప్రకాశానిచ్చే ఒక జగద్గురువు. సామాజిక సృహతో కూడిన ఆధ్యాత్మికతను ప్రజలకు ఉపదేశించడం, ఇంద్రియాతీత విషయాలను వివేకించటం ద్వారా ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మించడం, ఆ సౌధంలో చ్కెతన్యమూర్తులుగా జనులను విరాజిల్లింపచేయటం స్వామి వివేకానంద అపురూప ఆశయం. విశ్వాసంతో నిరంత రాభ్యాసాన్ని చేస్తూ, మనసు పొరలలో నిభిఢీకృ తమైన కొత్త విషయాలను అనుభ విస్తూ, క్రొంగొత్త శక్తుల వశీకరింపచేసు కుంటూ ఊహాతీత వ్యక్తిత్వాన్ని వికసింప చేసుకోవటానికి దివ్య ప్రేరణ స్వామి వివేకానంద. 1863వ సం.లో కలకత్తా నగరంలో జన్మించిన స్వామి వివేకానంద ఆరేళ్ళ ప్రాయంనుంచే అంతర్ముఖ అన్వేషణలో మనసు లగ్నం చేసి ధ్యానంలో నిమగ్నుడ్కె ఉండేవారు.జ్యోతిర్మయ ప్రకా శంలో జీవిస్తూ చిరుప్రాయంలోనే సృజనా త్మకత, ఆత్మ ప్రతిష్ట, ఆత్మ ప్రేరణలో దివ్యదర్శనాలు అనుభవించారు. ప్రకృతితో తాదాత్మ్యం చెంది ఆచ్కెతన్యంలో విరాజిల్లే అంతర్ముఖ చ్కెతన్య స్వరూపుడు.‘‘నేను భగవంతుడిని నిన్ను చూస్తు నంత స్పష్టంగా చూశాను,మతం అనేది అను భూతి పొందవలసిన సత్యం,లోకాన్ని మనం అర్దం చేసుకోవటంకన్నా అనేక రెట్లు లోతుగా గ్రహించవలసిన విషయం’’అని ప్రవచించే శ్రీరామకృష్ణ పరమహంస దివ్య సాన్నిధ్యంలో న,కర్మ,భక్తి,యోగ మార్గాలో కానరాని మెరు గులు ఆస్వాదించి వారి వచనాలను విపులీకరించి లోకాన్ని ఆశ్చర్యచకితులను చేసారు. పశుప్రాయులుగా జీవిస్తున్న వారిని మానవ స్థాయికి ఎదగచేయడమే ప్రధాన ధ్యేయంగా లోకాన్ని ఉద్ధరించిన మనీషి స్వామి వివేకానంద. చికాగోలో జరిగిన స్వామి ప్రసం గం బాహ్యంగా ఎగసిన ఉత్సాహపు టలలోనే కాక, ఉద్వేగ ప్రవాహాలోనే కాక, నరనరాల్లోకి చొచ్చుకుని పోయిన నూతన కాంతి పుంజం. దానిని గురించి ఒక్క మాటలో చెప్పటానికో, వ్రాయటానికో కుదిరేది కాదు. చికాగో ప్రసంగం స్వామి వివేకానందకు అమెరికాలో గుర్తింపు రావడమే కాదు, సాక్షాత్తు భారతదేశం కూడా గర్వించేలా చేసింది. అమెరికాలో ఎగసిన ఒక అల భారతదేశంలో సహస్ర తరంగాలను ఉత్పన్నం చేసింది.‘‘నేను ఎవరిని?ఆసియా వాసినా? ఐరోపా వాసినా?అమెరికా వాసినా? ఈ వ్యక్తిత్వాల వింత సమ్మేళనాన్ని నాలో అనుభూతి చెందుతున్నాను’’ అనేవారు స్వామి. మనుషులు ఎలా జీవించాలో స్వామి మాటల్లో…‘‘అందాన్ని పెంచుకుంటే నిన్ను కెమేరాలో బంధించి ఆనందిస్తారు అస్తిని పెంచుకుంటే నిన్ను గంధపు చెక్కలలో తగులబెడతారు పేరును పెంచుకుంటే నిన్ను సన్మాన పత్రాలతో సన్మానిస్తారు హోదాను పెంచుకుంటే నిన్ను హోర్డింగులలో నిల బెడతారు అదే వ్యక్తిత్వాన్ని పెంచుకుంటే నిన్ను జనం గుండెల్లో గుడి కట్టి పూజిస్తారు’’
ప్రతి మతంలోని, ప్రతి సిద్ధాంతంలోని మంచిని గ్రహించి హృదయంలో దీప్తిస్తున్న ఆత్మ జ్యోతిని అవలోకనం చేసుకుంటే సర్వమత ఏకత్వాన్ని దర్శించవచ్చని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి శ్రీవివేకానంద. హిందూమతాన్ని కించపరిస్తే సహించేవారు కాదు. దానిని తీవ్రంగా ప్రతిఘ టించి హిందూ మత ఔన్నత్యాన్ని చాటిచెప్పే వారు.జీవితంలో అన్ని విషయాలపైన కఠోర నియమం, నిఘా అవసరం అని చెప్పేవారు. ‘‘ఆహార నియంత్రణ ముఖ్యంగా పాటించాలి. ఆహార నియంత్రణ లేకుండా మనస్సుని నియంత్రించటం సాధ్యం కాదు. అవసరం కన్నా ఎక్కువ తినడం అనేక హానులకు దారితీస్తుంది.మితిమీరి తినడం వలన మనశ్శరీరాలు చెడిపోతాయి’’ అనేవారు. ప్రేమతత్వాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని సడలనీయవద్దని గట్టిగా ప్రభోదిం చేవాడు.మతం అనేది సిద్ధాంత రాద్ధాంత ములతో లేదు అదిఆచరణలే ఆధ్యాత్మికంగా పరిణతి చెందడంలో మాత్రమే వుంది అని విశ్వసించేవారు. వివేకానందను విదేశాలలో అనేకులు కుమారునిగా, సోదరునిగా భావిం చారని మనం తెలుసుకున్నప్పుడు మనకు ఆయన పరిణతి కనిపిస్తుంది. భారతదేశంలో ఇటు వంటి బాంధవ్యాలు కొత్త కాదు. విదేశాలలో ఇటువంటివి ఉత్పన్నమైనప్పుడు ఆయన వైఖరి విశిష్టత అర్థం అవుతుంది. జాతి మౌఢ్య, వర్ణ మౌఢ్యం విలయతాండవం చేసే రోజులలో అప్పట్లో బానిస దేశంగా పరిగణించే భారతదేశం నుండి వెళ్ళి అసంఖ్యాక మనసు లను దోచుకోవడం గమనార్హం. అహింసలో నెలకొనివున్న వ్యక్తి సాన్నిధ్యంలో వైరాలకు చోటులేదు. సత్యనిష్టుని సాన్ని హిత్యంలో అసత్యం నశించిపోతుంది. అందుకే అన్ని ఎల్లలను అతిక్రమించిన స్వామి వివేకా నంద ఆత్మ్ఞనంలో సుప్రతిష్టుల్కె ఉండగా ఎలాంటి వివక్షత తలెత్తడం సాధ్యంకాదు. వివేకానంద ఆధ్యాత్మిక శక్తి గురించి విన్న విదేశీయులు ఆయనతో సన్నిహితంగా మెలగటానికి మక్కువ చూపేవారు. తాను జన్మించిన కుటుంబాన్ని పరిత్యజించి ప్రపంచమనే పెద్ద కుటుంబాన్ని స్వీకరించారు. భారతదేశం కూడా తక్కిన దేశాలతో పాటు అభివృద్ధి పొందగోరితే పేదలు, పామరులు పురోగనమం చెందాలి. అందుకే పేదలకు కూడా విద్య గరపమని ఆయన నొక్కి వక్కాణించారు. భారతదేశపు గౌరవ మర్యాదలను విదేశాలలో ఇనుమ డిరపచేయటానికి అహర్నిశలు కృషి చేశారు. అప్పటికే ప్రచారంలోవున్న భారత వ్యతిరేకతను తొలగించటానికి నడుం బిగిం చారు. భారతీయ ఆధ్యాత్మికతలోని వివిధ పరిణామాలు ఆయన ఉపన్యాసాలలో ప్రధానాంశాలు అయిన ప్పటికి,ప్రతి ప్రసంగంలోనూ మన వాస్తవిక చిత్రాన్ని ఆవిష్కరించేవారు. మతాల మధ్య వ్యత్యాసాలు ఉండపచ్చు కాని వాటి మధ్యగల సామాన్య మౌలికతను గుర్తించమని చెప్పేవారు. హైందవుల శాంతి కాముకత్వాన్ని తన అహింసా తత్వంతో వెల్లడిచేసేవారు. శక్తివంతమైన ఈ భారతదేశం ప్రపంచాన్ని జయిస్తుంది. అందుకే ‘‘ఓభారతమా! నీఆధ్యా త్మికతతో ప్రపంచాన్ని జయించు!’’ అంటూ స్వామి సింహనాదం చేసేవారు. ప్రశాంతత, పవిత్రత,త్యాగశీలత,సౌభ్రాతృత్వాల సందేశా లను వివరించి సహన రహిత చెవిటి చెవులలో ప్రతిధ్యనులు ఉద్భవింపచేయటంలో విజయం సాధించారు.దుస్తరమైన అద్వ్కెతాన్ని కళాత్మ కమైనదిగానూ,సజీవమైనదిగానూ వర్ణించారు. భయం కలిగించే యోగ సంప్రదాయాలను అత్యంత శాస్త్రీయంగానూ,ఆచరణ యోగ్యం గానూ వివరించే మానసిక శాస్త్రంగా వివరిం చేవారు. సత్యమనేది మతానికి ఆపాదించటం మూర్ఖత్వం అని చెప్పేవారు. విదేశాలలో ధీర గంభీరత్వంతో ఎన్నో ఆటుపోటు లను ఎదుర్కొని సత్యంవైపు అడుగులు వేసారు. మనలో నిద్రాణమైవున్న శక్తిని తట్టిలేపిన మహనీయుడు.‘‘మన జాతీయ ఆత్మన్యూన తాభావ జాఢ్యాన్ని వదిలించుకునేలా చేసిన వ్యక్తి వివేకానంద’’అని రాజాజీ పేర్కొన్నారు. వివేకానందుని లేఖలు భారతీయులలో దాగివున్న శక్తిని వెలువరించి చింతనను జాగృతం చేసాయి.లేఖ మూలంగానే తమ భారతీయ మహత్కార్యాన్ని ప్రారంభించారు. భగవదనుగ్రహం వలన పావనత సంతరించు కున్న మనస్సులో ఉద్భవించిన చింతనలే లోకాన్ని కదిలించి వేస్తాయనటంలో అతిశ యోక్తిలేదు. ‘అక్కడ సూర్యుడు ప్రకాశించ డు.చంద్రతారకలు అసలే ప్రకాశించవు. మెరుపులు కూడా మెరవవు.ఇక ఈఅగ్ని మాట ఎందుకు! ఆత్మ ప్రకాశిస్తూ ఉంటే అన్నీ దానిని అనుసరించి ప్రకాశిస్తాయి.దాని వెలుగుతోనే ఇదంతా వెలిగింపబడుతున్నది.’ ‘‘స్వామి వివేకానంద ప్రసంగాలను, రచలను నేను క్షుణ్ణంగా చదివాను,ఆతరువాత నా దేశభక్తి వేయి రెట్లు అయింది. యువకుల్లారా! ఆయన రచన చదవాల్సిందిగా మిమ్మల్ని కోరు కుంటున్నాను’’ అని మహాత్మాగాంధి అన్నారు. వివేకానందుడు రామకృష్ణ మఠం స్థాపించి ‘‘పేదలకు,వెనుకబడ్డ వారికిసేవ చేయడం దీని ప్రధానోద్దేశాలలో ఒకటి‘అని ఉద్భో దించి భారతీయ యువతకుదిశానిర్దేశం చేశారు. భారతదేశాన్ని పురోగమింప చేయడానికి సంఘ సంస్కరణలు అవసరమని సమాజ నేతలు అనేకులు నొక్కివక్కాణించిన సమ యంలో, భారతదేశ పతనానికి ఉన్నత వర్గం వారు పేదలను బహిష్కరించడము, దోపిడీకి గురి చేయడమూ మొదటి కారణమని ఘోషించిన మొదటి నేతస్వామి.తన 33ఏళ్ళ వయసులోనే మరణించి భారతదేశాన్నే కాకుండా యావత్తు ప్రపంచాన్ని అనాధలుగా మార్చివేశారు. మనలో ధ్కెర్యంసడలి,దౌర్భ్యం ఆవహిస్తే ‘‘నేను ధీరుణ్ణి, వీరుణ్ణి, కామినీ కాంచనాలను నిర్జించిన శ్రీరామ కృష్ణు శిష్యుణ్ణి నేను’’అనే భావనలు మనసులో నింపుకుంటే సమస్తదౌర్భ ల్యాలు,అధ్కెర్యము మటుమాయమయుతాయి అని సర్వులకు ప్రభోదించేవారు. శ్రీవివేకానందుని జన్మదినం పురస్కరించుకుని భారతప్రభుత్వం ‘‘జాతీయ యువజనది నోత్సవం’’గా ప్రకటించింది.‘‘జనన మరణాలు సహజం,కాని నాభావనలు మావ వాళికి కొంతవరకైనా అందించగలిగితే నా జీవితం వ్యర్థం కాలేదనుకుంటాను’’ అన్న స్వామి వివేకానందుని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం,సర్వదా ఆచరణీయం.- (డాక్టర్‌.దేవులపల్లి పద్మజ), వ్యాసకర్త : ప్రముఖ రచయిత్రి, విశ్వశ్రీ, సాహిత్యశ్రీ విశాఖపట్టణం,ఫోను. 9849692414

ఆదివాసులు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు

భారతదేశ మూలనివాసులు ఆది వాసులు వారి అభివృద్ధి స్వాతంత్య్రానికి పూర్వ ము,తర్వాత కూడా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది.ఈస్టు ఇండియా కంపనీ,బ్రిటీషు పాలకులు,నిజాంప్రభుత్వము,కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలు ప్రవేశపెట్టిన చట్టాలు చేపట్టిన పథకాలతో వారు ఆశించినంత అభివృద్ధి జరుగలేదు. హైద రాబాదు రాష్ట్రంలో నిజాం ప్రభుత్వంపై జోడే ఘాట్‌ కేంద్రముగా 1940 సం॥లో కుమ్రంభీము నాయకత్వాన ప్రకృతి సంపదలైన (జల్‌,జంగల్‌, జమీన్‌)నీళ్లు,అడవి,భూమిపైహక్కులు, అధికారము కొరకై గోండుల తిరుగుబాటు జరిగింది.ఈ సం ఘటనలో నిజాం సర్కారుకు భీమ్‌ వర్గానికి మధ్య జోడేఘాట్‌లో భీకర పోరాటం జరిగింది. దీనిలో కుమ్రం భీమ్‌ మరణించాడు.
ఆదిలాబాద్‌ అడవులలో నివసిస్తున్న ఆదివాసుల అశాంతికిగల కారణాలను అధ్య యనము చేయటానికి నిజాం ప్రభుత్వము ప్రముఖ మానవ పరిణామశాస్త్రవేత్తను నియమిం చింది. ఆదివాసులు మరియు ఇతర వెనుక బడిన తరగతుల వారి అభివృద్ధి కొరకు సలహాదా రుగా మరియు ఉస్మానియా యూనివర్సిటీ ఆంత్రోపా లజీ డిపార్టుమెంటుకు ఆచార్యులుగా కూడా నియమించింది. ప్రొ.హైమండార్ఫ్‌ తన భార్య బెట్టి ఎలిజబెత్‌తో కలసి క్షేత్రస్థాయిలో పర్యటిం చారు.మొదట నల్లమల అడవులలో నివ సిస్తున్న చెంచుల గురించి, భద్రాచలం ప్రాంతం లోని కోయలు,కొండరెడ్ల గురించి మరియు ఆదిలా బాదులోని గోండుల గురించి విస్తృతమైన పరిశో ధనలు చేసారు. అంతేకాకుండా ఈశాన్య భారత ప్రాంతములో నివసిస్తున్న కొనియాక్‌ నాగాలు, అపతానీల గురించి కూడా అనేక పరిశో ధనలు చేశాడు. ఆదివాసుల అశాంతికి గల కారణా లలో ముఖ్యముగా వారికి సాగుభూమిపై అటవీ సంపద మీద హక్కులు కోల్పోవడం, ఆదివాసేతర భూస్వా ములు క్రింది స్థాయి అధికారుల దోపిడి, దౌర్జా న్యాలు పెరిగిపోవడం వారి తిరుగుబాటుకు కార ణాలుగా గుర్తించాడు. నిజాం ప్రభుత్వము గోండుల ఆర్థిక సామాజిక పరిస్థితులను మెరుగు పర్చటం ద్వారా వారిఅశాంతిని కొంతవరకు దూరం చెయ్యవచ్చని భావించింది. ప్రొ.హైమం డార్ఫ్‌ దంపతులు తమ కార్యక్షేత్రాన్ని ఆదివాసి గ్రామమైన మార్లవాయి కేంద్రముగా ఎంచుకు న్నారు. ప్రధా నంగా విద్య పరిపాలన పరమైన సూచనలతో నిజాం ప్రభుత్వానికి నాలుగు నివేది కలు సమర్పిం చాడు. గోండులు తమ ఆదిమ జీవనవిధా నం నుండి బయట పడటా నికే కాక భూదాహం గల ఆదిపత్య కులాలవారి నుండి తమనుతాము రక్షిం చుకోవడానికి మార్గా లను,అధికారులతో వ్యవహ రించడంలో తమ భూముల అక్రమ బదిలీలను అడ్డుకోలేక పోవడం వారినిరాశక్తతకు ప్రధాన కారణం వారి నిరక్షరా స్యతగా గుర్తించారు.వారికి ప్రభుత్వ చట్టా లు, నిబంధనలు తెలియకపోవడం వలన దురు ద్ధేశపూరితులైన ఆదివాసేతరులు, అవినీతిపరులైన క్రింది స్థాయి ప్రభుత్వ సిబ్బంది చేతిలో మోస పోవాల్సి ఉంటుంది. కాబట్టి గోం డుల పరిస్థితిలో మార్పుకు అక్షరాస్యతను పెంచు కోవడమే మొదటి మెట్టుగా భావించారు.
గోండు విద్యాప్రణాళిక రూపొం దించి 1943 వ సం॥లో మార్లవాయి,గిన్నెధారి కేంద్రాలుగా శిక్షణ పాఠశాలలను ప్రారంభిం చారు.ఈ ప్రణాళిక ప్రధాన ఉద్ధేశ్యం ఆదివాసు లకు చదువు నేర్పేందుకు ఆదివాసీ యువకులని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడం.గోండు భాషలో వ్రాయడం,చదవడమేకాక రెవెన్యూ,అటవీ శాఖల నిబంధనల గురించి వాటి పనివిధానంపై శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక స్కూళ్లను కూడా నెలకొల్పారు. ఈ విద్యా కార్యక్రమాలలో వృత్తి శిక్షణ, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన,రోజూవారి జీవితానికి అవసరమయ్యే ఇతర విషయాలను కూడా భోదించేవారు. ప్రొ.హైమండార్ఫ్‌ దంప తులు చేపట్టిన మరోముఖ్య కార్యక్రమం భూ పంపి ణీ,ఆదివాసుల అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కు రెవెన్యూశాఖలోనే సాంఘిక సంక్షేమ సంస్థను నెలకొల్పి అక్కడి ఉద్యోగులకు స్వయంగా తానే ఉస్మానియా యూనివర్సిటీలో శిక్షణ ఇచ్చేవారు. 1946 నాటికి ‘‘నోటిఫైట్‌’’ ఆదివాసీ ప్రాంతాలను సాధారణ పరిపాలనాశాఖ నుండి వేరుచేసి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. ఆయనే ‘‘మోజాం హుసేన్‌’’ ూజూవషఱaశ్రీ ుతీఱపవం ూటటఱషవతీ. భూపంపిణీ కార్యక్రమ పథకంలో కీలకపాత్ర పోషించారు.1948 నాటికి ఆదిలాబాద్‌ గోండు లు,కొలాంలకు ఒకలక్ష అరవైవేల (1.60 లక్షలు) ఎకరాల భూములకు ‘లావాణి’ పట్టాల రూపంలో పంచిపెట్టారు.వాటిని ఇప్పటికి ప్రొ. హైమండార్ఫ్‌ పట్టాలుగా పేర్కొంటారు. ఇంతేకాకుండా సం॥రా నికి ఒకసారి పుష్యమాసంలో ఆదివాసుల సంప్ర దాయబద్దముగా నిర్వహించే నాగోబా జాతరలో ఆదివాసుల సమస్యలను పరిష్కరించే వేదికగా జిల్లా అధికారుల సమక్షంలో ‘‘ప్రజాదర్బార్‌’’ ను కూడా ఏర్పాటుచేసాడు. నిజాంసర్కారుపై భారత ప్రభుత్వం తీసుకున్న పోలీసు చర్యఫలితముగా హైదరాబాద్‌ రాష్ట్రంలోని నిజాం సంస్థానం భారత దేశంలో విలీనం కావడం, కొన్నేళ్ల తర్వా త 1956లోతెలంగాణా ప్రాంతాన్ని మళ్ళీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్రంలో కల్పడంవలన నిజాం ప్రభు త్వానికి అంతవరకుప్రొ.హైమండార్ఫ్‌ రూపొం దిచిన ప్రణాళికలు ఆయన చేపట్టిన సామాజిక, ఆర్థిక అభివృద్ధి పథ కాలు అమలుకు నోచుకో కుండా అస్తవ్యస్తమై పోయినాయి.ఈ పరిణామాల కారణంగా తెలం గాణ,కోస్తాంధ్రలోని ఆదివాసీ ప్రాంతాల గిరిజ నులు విచ్చలవిడిగా దోపిడి పీడనలకు గురైనారు. సొంతగడ్డపై నిలువ నీడ లేకుండా అడవి లోతట్టు ప్రాంతానికి తరిమి వేయబడ్డారు. ఫలితముగా ఆదివాసీ ప్రాంత ప్రజలు కమ్యూనిస్టు పార్టీల నాయ కత్వంలో‘‘దున్నేవాడిదేభూమి’’నినాదంతో ప్రారం భమై సాయుధ పోరాటాలవైపుకు ఆకర్షితులైనారు.
ఆదిలాబాద్‌ నుండి శ్రీకాకుళం వరకు విస్తరించి ఉన్న (ఎజెన్సీ) మన్యప్రాంత గిరిపుత్రు లలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా వారి అభివృద్ధి ని ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వాలపై అసంతృప్తి పెరిగింది. శ్రీకాకుళంలోని మొండెంఖల్‌ నుండి ఆదిలాబాద్‌లోని ఇంద్రవెళ్ళివరకు నక్సల్‌బరి ఉద్యమాలు అడవిలో ఊపందుకున్నాయి. గోండు గూడాలలో వారి సంప్రదాయ వాయిద్యమైన ‘‘తుడుం’’ మోగింది. తమ హక్కుల సాధన కొరకు, దోపిడి పీడనల విముక్తి కొరకు ఆదివాసులు చైతన్య వంతులైనారు.పీపుల్స్‌వార్‌ గ్రూప్‌ అనుబంధ ‘‘గిరిజ న రైతు కూలి సంఘం’’ ఆధ్వర్యంలో 20ఏప్రిల్‌, 1981న ఇంద్రవెళ్ళి సంతలో సభ నిర్వహిస్తే ప్రభు త్వం దానిని అడ్డుకొని నిరాయుధులైన వందల మంది అమాయక గోండులపై కాల్పులు జరిపి మరో జలియన్‌ వాలా భాగ్‌ను సృష్ఠించింది. ఈ మారణకాండ దేశవ్యాప్తంగా ప్రకంపనలురేపింది.
భారతీయ ఆదివాసులు మాట్లాడే భాషలు, వారి సామాజిక వ్యవస్థ, సంస్కృతి, నివాస ప్రాంతాలు, జీవనశైలి, ఆదివాసేతర సమాజాల కంటే భిన్నముగా ఉండటం వలన వారు నివసించే ప్రాంతాల పరిపాలన కొరకు మానవ పరిణామ శాస్త్రవేత్తల పరిశోధన గ్రంథాలు, సూచనలు, నివేది కలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేకమైన పరిపాలన వ్యవస్థను తయారు చేయడం జరిగింది. బ్రిటీషు ప్రభుత్వము1917 సం॥లోనే ఆదివాసులు అధిక ముగా నివసించే ప్రాంతాలను నోటిఫైడ్‌ షెడ్యూలు ప్రాంతాలుగా గుర్తించింది. వారి సామాజిక, సాం స్కృతిక,ఆర్థిక అభివృద్ధికై భారత ప్రభుత్వము ఈశా న్య భారత ప్రాంతములో నివసించే ఆదివాసుల కొరకు స్వయం ప్రతిపత్తిగల జిల్లా కౌన్సిల్లను ఏర్పా టు చేసింది.మధ్య భారతప్రాంత ఆదివాసుల కొరకు వారి భూముల రక్షణకై ప్రత్యేకించి భూ బదలాయిం పు నిరోధక చట్టం వడ్డీ వ్యాపారుల నిరోధక చట్టం ప్రవేశపెట్టింది.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ముందుచూపుతో భారతీయ ఆదివాసుల అభివృద్ధికై ప్రత్యేక పరిపాలన వ్యవస్థ కొరకు ఈశాన్య భారతప్రాంత రాష్ట్రాలకు ఆరవ (6)షెడ్యూలు మరియు మధ్య భారత ప్రాంత రాష్ట్రా ల్లా ఆదివాసులకు అయిదవ(5)షెడ్యూలును భారత రాజ్యాంగంలో పొందుపర్చారు. భారతదేశ మొదటి ప్రధాని శ్రీ పండిత్‌ జవహార్‌లాల్‌ నెహ్రూ కూడా ఈ ప్రాంతఆదివాసి ప్రజల అభివృద్ధి కొరకై ప్రత్యే కమైన‘‘పంచశీలసూత్రాలను’’ప్రవేశపెట్టారు.ఈశాన్య భారతములో కొంతవరకు ప్రగతి జరిగినప్పటికీ మధ్య భారత ప్రాంతములోని ఆదివాసులకు ఆశించి నంత ప్రగతి ఏమాత్రము కూడా జరగలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా చాలాకాలము వరకు గిరిజన అభి వృద్ధి కార్యక్రమాలు సాంఘిక సాంక్షేమశాఖలో భాగంగానే కొనసాగాయి. 1974 సం॥లో ఆదివా సులు అధికముగా ఉన్న తొమ్మిది (9) జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలన కొరకు జి.ఓ.నెం.856సాంఘిక సాంక్షేమశాఖ తేది. 29. 10.1974ద్వార ‘‘సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ’’ లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన గిరిజన సాంక్షేమశాఖకు ఆసిఫా బాద్‌ నియోజకవర్గం నుండి శాసన సభ్యునిగా ఎన్నుకోబడిన గోండులలో ప్రథమ పట్టభదృడుశ్రీ కోట్నాక భీమ్‌రావు గిరిజన సాంక్షేమశాఖా మంత్రి గా నియమితులైనారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన తొమ్మిది (9) సమీకృత గిరిజనాభి వృద్ధి సంస్థలఏర్పాటు చేసింది. సమీకృత గిరిజనా భివృద్ధి సంస్థ లకు స్థాయి సీనియర్‌ IAS అధికారి నాయకత్వాన ఆ సంస్థ పరిదిలోని ప్రభుత్వ శాఖలన్నింటిని సమన్వయపరుస్తూ ఏకీ కృత పరిపాలన చెయ్యవలసి ఉంటుంది. సంబంధిత జిల్లా కలెక్టర్లు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలకు జష్ట్రaఱతీఎaఅ లుగా వ్యవహరిస్తారు. ప్రతిమూడు(3) నెలలకొకసారి ఈసంస్థలు అక్కడి ఆదివాసుల సామాజిక,ఆర్థిక అభివృద్ధి కొరకు చేపట్టిన పథకాల ప్రగతిని సమీక్షించుటకు స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టరు మరియు గిరిజన సాంక్షేమ శాఖామా త్యుల అధ్యక్షతన గవర్నింగ్‌ బాడీ సమావేశము నిర్వహించాలి. దురుదుష్టవశాత్తు చాలాకాలము వరకు ఈసంస్థల వ్యవస్థలంతాకూడా కొన్ని జిల్లా లలో జిల్లా కలెక్టర్ల కార్యాలయాలలో బంధీలై దీర్ఘానిద్రావస్థలో మునిగిపోయినది.
అంతేకాకుండ సాధారణముగా మైదాన ప్రాంతాలోల సరిగ్గా పనిచెయ్యని, అసమర్థులైన అధికారులను, సిబ్బందిని ఆదివాసీ ప్రాంతాలకు తరచుగా నియమిస్తారు. ఇందులో మొదటి రకం మొదటి నియామకం రెండోరకం పదోన్నతి, మూ డోరకం శిక్షించుటకు వీరు ఆదివాసుల సమస్యలను పట్టించుకోరు. అర్థం కూడా కావు. చుట్టపుచూపుగా వచ్చి విధులు నిర్వహిస్తారు. బదిలీల కొరకై రాజ కీయ నాయకుల చుట్టూ తిరుగుతుంటారు. రవాణా సౌకర్యాలు, స్థానికంగా ఉండటానికి కనీస వసతి కూడాలేని ప్రాంతాలలో ఆదివాసుల భాష వారి జీవనశైలి తెలియని ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ద్వారా ఆదివాసులకు ఒరిగేది ఏమి లేదు. పైగా వీళ్ళంతా వేతనంతో పాటు ఏజెన్సీ ప్రాంత అలవె న్సులు కూడ పొందుతుంటారు. 1981ఏప్రిల్‌ 20 సోమవారం ఇంద్రవెళ్లి సంతలో గోండులపై జరిగిన కాల్పుల సంఘటన తర్వాత భారతదేశానికి మళ్ళీ వచ్చిన ప్రొ॥హైమండార్ఫ్‌ దంపతులు ఆదివాసి గ్రామాలను విస్తృతంగా పర్యటించారు. ఇక్కడి ఆదివాసుల స్థితిగతులను పరిశీలించినప్పుడు తమకు1940 నాటి పరిణామాలే గుర్తుకు వస్తు న్నాయని ఆవేదన వ్యక్త పర్చారు. తాము నిజాం ప్రభుత్వ కాలములో ప్రవేషపెట్టిన పథకాలను ఆదివాసుల భూములను పరిరక్షించే చట్టాలను వారి కొరకు ప్రస్తుత ప్రభుత్వాలు చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయకపోవటమే ముఖ్యమైన కారణాలుగా పేర్కొన్నాడు. ఆదివాసుల అశాంతికి గల వివిధ కారణాలను తెల్పుతూ వారి అభివృద్ధి కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్ట వలసిన పథకాలపై పలు సూచనలు చేస్తూ ప్రభు త్వానికి తన నివేదిక సమర్పించాడు. ప్రొ॥ హైమం డార్ఫ్‌ దంపతుల సూచనల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని ఆదివాసుల అభివృద్ధికై పలు సంస్కరణలు చేపట్టింది.ఆదివాసులు ఎదుర్కొం టున్న సమస్యలపై అవగాహన కల్గి వారిపై అపార మైన సానుభూతి,చిత్తశుద్ధి గల అధికారులను ఉట్నూర్‌ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలో నియ మించారు.1975 సం॥లోనే ఏర్పాటై ఉట్నూర్‌ కేంద్రంగా పని చేయవలసిన సంస్థ జిల్లా కేంద్రం లోని కలెక్టరేట్‌ కార్యాలయము నుండి పని చేస్తుం డటం కొత్తగా నియమించబడిన అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.
1982 ఫిబ్రవరి నెలలో ఉట్నూరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు చేపట్టిన శ్రీఎమ్‌.వెంకటపూర్ణ చంద్రశేఖర శాస్త్రి, IAూ గారు,గోండు తెగనుండి మొదటిగ్రూప్‌`1అధికారిమడావి తుకారాంసహాయ ప్రాజెక్టు అధికారి (జనరల్‌) గారుఆదిలాబాద్‌ జిల్లా కేంద్రము నుండి పనిచేస్తున్న IుణA సంస్థ కార్యాలయాన్ని అరవై (60) కి.మీ. దూరములో గల గిరిజన బాలుర వసతి గృహము ఉట్నూరుకి మార్చేశారు. ఈ సంస్థలో పని చేయటానికి ఆశక్తి గల సిబ్బంది అందరూకూడా ఉట్నూరులోనే ఉండి పనిచేయవలసిందిగా ఆదేశాలుజారీ చేసారు. ఆది వాసులంటే అపారమైన ప్రేమాభిమానాలు, అంకితభావముగల అధికారి శాస్త్రీ గారు రాత్రిం బగళ్ళు గోండుగూడాలలో పర్యటించి వారి సాధక బాదకాలను అర్థం చేసుకుంటూ అనతి కాలంలోనే గోండు భాష నేర్చుకున్నారు. సహాయ ప్రాజెక్టు అధికారి శ్రీ మడావి తుకారాం గారి సహకారంతో IుణA లో చిత్తశుద్దిగల అధికారుల బృందాన్ని కూడ ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభుత్వం పై ఆదివాసులకు గల అసంతృప్తిని తొలగించుటకు వారికి ప్రభు త్వంపై నమ్మకాన్ని కల్గించటానికి ఎనలేని కృషి చేసారు. మారుమూల ఆదివాసి గ్రామాల నుండి చదువుకున్న స్థానిక గోండు యువకులను ఎంపిక చేసి IుణA సంస్థకు ఆదివాసులకు మధ్య సంధాన కర్తలుగా పనిచేయటానికి ఇరవై (20)మందిని Gశీఅస పఱశ్రీశ్రీaస్త్రవ ఔవశ్రీటaతీవ ూటటఱషవతీం (Gపఔూ) లుగా నియమించారు. ఆదిమ గిరిజనాభివృద్ధి సలహా సంఘం Aపశీతీఱస్త్రఱఅaశ్రీ ుతీఱపవం ఔవశ్రీటaతీవ Aసఙఱంశీతీవ జశీఎఎఱ్‌్‌వవ (AుఔAజ) ఏర్పాటు చేసి దానికి మాజీ గిరిజన సంక్షేమ శాఖామాత్యులు శ్రీ కొట్నాక భీమ్‌రావ్‌ను జష్ట్రaఱతీఎaఅ గా నియ మించారు. ఆదివాసుల విప్లవ జ్యోతి అమరవీరుడు కుమ్రం భీమ్‌ వర్ధంతి సభను ఆయన వీరమరణం పొందిన జోడేఘాట్‌లో 1983 సం॥ నుండి ప్రతి సంవత్సరము ఆశ్వాయుజ మాసం పున్నమి రోజున ప్రభుత్వ పరంగా IుణA ఆధ్వర్యంలో సభ నిర్వహిం చడం మొదలైనది. గోండుల సామాజిక, సాంస్కృ తిక,సాంప్రదాయ సంస్థలైన‘‘రాయ్‌సెంటర్ల’’ వ్యవస్థ ను పునరుద్దరించే కార్యక్రమాలను చేపట్టారు. రాయ్‌ సెంటర్లసభలు,సమావేశాలు ఏర్పాటు చేసి పరి పాలనలో భాగస్వాములను చేస్తూ ఆదివాసీ గ్రామా ల అభివృద్ధికి ఎటువంటి పథకాలు అవస రమో వారి సలహాలు,సూచనలను పరిగణలోనికి తీసు కోవడం మొదలుపెట్టారు.ఒక సంవత్సర కాలంలోనే ప్రాజెక్టు అధికారి శాస్త్రిగారి ఆధ్వర్యంలో ప్రధాన కార్యాలయం, గిరిజన సహకార సంస్థ ూబప-జశీశ్రీశ్రీవష్‌శీతీ, ూజూవషఱaశ్రీ ణవజూబ్‌వ జశీశ్రీశ్రీవష్‌శీతీ కార్యాలయాలతో పాటు అక్కడ పనిచేసే అధికారు లకు,ఇతర సిబ్బందికి కూడా నివాస గృహాల నిర్మా ణము పూర్తి చేసారు.ఫారెస్టు, పోలీసు, ఇతర అన్నీ ప్రభుత్వశాఖల కార్యాలయాలు ఉట్నూర్‌లో వెలి సాయి. కుమ్రం భీమ్‌ కాంప్లెక్సు నిర్మాణం పూర్తి కావడంతో ఉట్నూర్‌ పట్టణం యొక్క రూపురేఖలు పూర్తిగా మారిపోయినవి.ఉట్నూరు నుండి ఇందన్‌ పల్లి వరకు జన్నారంను కలుపుతూ రోడ్డు మార్గం ఏర్పాటు అయినది. ప్రాజెక్టు అధికారి శాస్త్రి గారు పరిపాలన సౌలభ్యం కొరకు తాలుకా వారిగా సెక్టోరల్‌ అధికారుల వ్యవస్థను ఏర్పాటుచేసి ప్రతి సెక్టారుకు IుణA పరిధిలో పనిచేస్తున్న వివిధ శాఖల అధికారులను నియమించారు. వారిద్వారా ఆది వాసులు ఎదుర్కొంటున్న తాత్కాలిక,దీర్ఘకాలిక సమస్యలను విశ్లేషిస్తూ ఐటిడిఏ చేపట్టిన పథకాలను క్షేత్రస్థాయిలో అమలుపరుస్తూ, వాటి వర్యవేక్షణ బాధ్యతను కూడా అప్పగించారు. శాస్త్రిగారిఐటిడిఏ దళంలోని ముఖ్యమైన సభ్యులు. మూడు సంవత్సరాల పాటు నిర్విరామంగా కృషి చేశారు. ఆదివాసులను అక్షరాస్యులుగా తీర్చిదిద్ద టానికి గిరి విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు చేపట్టారు. ఇరవై (20) మంది బడి ఈడు పిల్లలున్న ఆదివాసి గ్రామాలలో ప్రాథమిక పాఠశాలలు ఏర్పా టు చేసారు. మాద్యమిక, ఉన్నత పాఠశాల విద్యకై నూట ముప్పై మూడు (133) ఆశ్రమ పాఠశాలలు, ఏడు (7)వసతిగృహాలు, బాలికల కొరకై ప్రత్యేకించి నలభై ఎనిమిది (48) ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేసారు.ఈ పాఠశాలల పర్యవేక్షణ కొరకు జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి,సహాయ గిరిజనాభివృద్ధి అధి కారులు,ప్రత్యేక విద్యాశాఖాధికారి కూడా నియమించబడ్డారు. చాలా వెనుకబడిన కొలాం తెగవారి కొరకు నియమించి ఆసిఫాబాదు కేంద్రంగా ప్రత్యేక పాఠశాలను పది (10) శాటిలైట్‌ సెంటర్లను కూడా ఏర్పాటు చేసారు. ఆదివాసుల ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలలో భాగంగా ప్రతి ఆదివాసి గ్రామంలో స్థానిక ఆదివాసి మహిళను ఎంపిక చేసి సామాజిక ఆరోగ్య కార్యకర్తలు గానియమించారు. వారికి ఆరోగ్య సూత్రాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంత ప్రజల ఆరోగ్యం, సీజనల్‌ వ్యాధుల నియంత్రణకుఐటిడిఏ పరిదిలోని ముప్పై ఒకటి (31)ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు,నూట ఎనభై ఆరు (186) ఆరోగ్య ఉపకేంద్రాలు, ఆరు (6) సామాజిక ఆసుపత్రులను పర్యవేక్షణ కొరకు అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మరియు జిల్లా మలేరియా నియంత్రణ ఆధికారిని కూడా నియమించారు. ఆదివాసుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చటానికై వ్యవసాయం, పాడి పరిశ్రమ,పట్టు పరిశ్రమ,పండ్లతోటల పెంప కం కార్యక్రమాలను ఏర్పాటు చేసారు. చెన్నూర్‌, భీమారం,బెల్లంపల్లి,జంబుగామ్‌,బెజ్జూరు, ఆసిఫాబాద్‌, ఇచ్చోడ మరియు ఉట్నూరులో స్థానిక ఆదివాసి యువతీ యువకులను ప్రోత్సహించి, మామిడి మొక్కల నర్సరీల పెంపకంలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసారు. ప్రతిశాఖ నుండి అధికారులను నియమించి వాటిని పర్యవేక్షించే బాధ్యతలను చేపట్టారు. ఒక సంవత్సర కాలంలోనే ప్రాజెక్టు అధికారి శాస్త్రిగారి ఆధ్వర్యంలో ఐటిడిఏ ప్రధాన కార్యాలయం,గిరిజన సహకార సంస్థ కార్యాలయాలతోపాటు అక్కడ పనిచేసే అధికా రులకు, ఇతర సిబ్బందికి కూడా నివాస గృహాల నిర్మాణము పూర్తి చేసారు. ఫారెస్టు, పోలీసు, ఇతర అన్నీ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఉట్నూర్‌లో వెలిసాయి. కుమ్రం భీమ్‌కాంప్లెక్సు నిర్మాణం పూర్తి కావడంతో ఉట్నూర్‌ పట్టణం రూపు ంఖలు పూర్తిగా మారిపోయినవి. ఉట్నూరు నుండి ఇందన్‌పల్లి వరకు జన్నారంను కలుపుతూ రోడ్డు మార్గం ఏర్పాటు అయినది.ప్రాజెక్టు అధికారి శాస్త్రి గారు పరిపాలన సౌలభ్యం కొరకు తాలుకా వారిగా సెక్టోరల్‌ అధికారుల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి సెక్టారుకు ఐటిడిఏపరిధిలో పనిచేస్తున్న వివిధ శాఖల అధికారులను నియమించారు. వారి ద్వారా ఆదివాసులు ఎదుర్కొంటున్న తాత్కాలిక, దీర్ఘకాలిక సమస్యలను విశ్లేషిస్తూ ఐటిడిఏచేపట్టిన పథకాలను క్షేత్రస్థాయిలో అమలుపరుస్తూ, వాటి వర్యవేక్షణ బాధ్యతను కూడా అప్పగించారు.
ఆదివాసులను అక్షరాస్యులుగా తీర్చి దిద్దటానికి గిరి విద్యా వ్యవస్థలో అనేక సంస్కర ణలు చేపట్టారు. ఇరవై (20) మంది బడి ఈడు పిల్లలున్న ఆదివాసిగ్రామాలలో ప్రాథమిక పాఠ శాలలు ఏర్పాటు చేసారు.మాద్యమిక,ఉన్నత పాఠశాల విద్యకై నూట ముప్పై మూడు (133) ఆశ్రమ పాఠశాలలు,ఏడు (7) వసతి గృహాలు, బాలికల కొరకై ప్రత్యేకించి నలభై ఎనిమిది (48) ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేసారు. నియ మించబడ్డారు. చాలా వెనుకబడిన కొలాం తెగ వారి కొరకు నియమించి ఆసిఫాబాదు కేంద్రం గా ప్రత్యేక పాఠశాలను పది (10)శాటిలైట్‌ సెంట ర్లను కూడా ఏర్పాటు చేసారు. ఆదివాసుల ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలలోభాగంగా ప్రతి ఆది వాసి గ్రామంలో స్థానికఆదివాసి మహిళను ఎంపిక చేసి సామాజిక ఆరోగ్య కార్యకర్తలు గా నియమించారు. వారికి ఆరోగ్య సూత్రాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంత ప్రజల ఆరోగ్యం, సీజనల్‌ వ్యాధుల నియం త్రణకు ఐటిడిఏ పరిదిలోని ముప్పై ఒకటి (31) ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు,నూట ఎనభై ఆరు (186) ఆరోగ్య ఉపకేంద్రాలు,ఆరు(6) సామాజిక ఆసుపత్రులను పర్యవేక్షణ కొరకు అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జిల్లా మలేరియా నియంత్రణ ఆధికారిని కూడా నియమించారు. ఆదివాసుల ఆర్థిక పరిస్థితులను మెరు గుపర్చటానికై వ్యవసాయం, పాడి పరిశ్రమ,పట్టుపరిశ్రమ,పండ్లతోటల పెం పకం కార్యక్రమాలను ఏర్పాటు చేసారు. చెన్నూ ర్‌,భీమారం,బెల్లంపల్లి,జంబుగామ్‌, బెజ్జూరు, ఆసిఫాబాద్‌,ఇచ్చోడ మరియు ఉట్నూరు లో స్థానిక ఆదివాసి యువతీ యువకులను ప్రోత్సహించి, మామిడి మొక్కల నర్సరీల పెంపకంలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసారు.ప్రతిశాఖ నుండి అధికారులను నియమించి వాటిని పర్యవేక్షించే బాధ్యతలను చేపట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో సమగ్రగిరిజనాభివృద్ధి (ఐటిడిఏ) సంస్థ లు ఆదివాసుల అభివృద్ధి కొరకు చేపట్టిన పథకాలు కొంతమేర పురోగతి సాధించాయని చెప్పవచ్చును. అల్లంపల్లి ఎదురు కాల్పుల సంఘటన తర్వాత ఉట్నూరు ఐటిడిఏసంస్థ గిరిజనుల కొరకు గిరి జనులే ఉపాధ్యా యులుగా నెలకు వెయ్యి (1000/-) రూపాయల గౌరవవేతనంతో ఒక వెయ్యి (1000) మంది స్థానిక యువతీ యువకులను ఎంపిక చేసి గిరిజన విద్యావికాస కేంద్రాలను 1987సం.లో ఏర్పాటు చేయడం జరిగింది. ఉపాధ్యాయ నైపుణ్యా లతో సంబంధము లేకుండా కనీస విద్యాఅర్హత పదవ తరగతి చదివితే చాలు, ఈ యువత విద్యతోపాటు ఆయా గ్రామాల అభి వృద్ధికి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంధాన కర్తలుగా పాటుపడ్తారనే సదాశయముతో ప్రభుత్వం వీరిని నియమిం చింది.గిరిజన యువతకు ఉపాధి కల్పిం చటం, వారిని నక్సలైట్ల కార్యక్రమాల నుండి దూరం చేసి ప్రభుత్వంపై నమ్మకము కల్పిం చటం ప్రభుత్వం యొక్క ప్రధాన ఆశయం. గృహ నిర్మాణ కార్యక్రమంలో భాగముగా ముఖ్య మంత్రి చీ.ు.రామారావుగారు ప్రతిఇంటికి నాల్గు వేలు చొప్పున పదివేల (10, 000) సెమిపర్మనెంట్‌ ఇండ్లు మంజూరు చేసారు. మారుమూల కొండప్రాంత గిరిజనులకు ఇంటికి వెయ్యి (1000)చొప్పున బెంగళూరు గూన ఐటిడిఏ సెక్టొరల్‌ అధికారులద్వార పంపిణి చేసారు. ఈఇండ్ల నిర్మాణములో చాలాచోట్ల గిరిజ నులకు, ఫారెస్టు అధికారులకు మధ్య తగాదాలు, ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి.
గిరిజనులు భూమి సాగు చేసుకోవ డానికి ఎడ్ల జతల పంపిణీ కార్యక్రమం, వ్యవసా య బావుల నిర్మాణకార్యక్రమాలు కూడా ముమ్మరంగా చేపట్టారు. ఈ అబి óవృద్ధి కార్యక్రమా లన్ని ఒక దశాబ్దకాలము పాటు నిర్విరామంగా కొనసాగాయి.ఇందులో ఎక్కువశాతం ప్రక్క రాష్ట్ర మైన మహారాష్ట్రలో దీ.జ.లుగా ఉన్న లంబా డాలు వలసవచ్చి ఇక్కడి స్థానిక గిరిజ నులు పొందవలసిన ప్రభుత్వ పథకాలను వీరు పొందు తున్నారు.విద్యా, వైద్యము, ఉపాది నియ మకాలను వీరే దక్కించుకుంటున్నారు. స్థానిక ఆది వాసుల భూములను కూడా కాజేయటంతో వలస లంబా డీలకు,స్థానిక గోండులకు మధ్య తీవ్ర ఘర్ష ణలు మొదలై పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా మారాయి. వ్యాసకర్త : డాక్టర్‌. తొడసం చందూ,విశ్రాంత జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
సెల్‌ : 9440902142,

హైడ్రోప్రాజెక్టుపై గిరిజనం తిరుగుబాటు

జనాలను రక్షించేవాడని షిర్డిసాయికి పేరు. కానీ.. అక్కడ షిర్డిసాయి మాత్రం గిరిజనుల గుండెపై బాణం సంధిస్తు న్నాడు. వేలాది జనాలను రోడ్డున పడేస్తున్నాడు. వందల ఎకరాలు నేలమట్టం చేయి స్తున్నాడు. ప్రకృతిఒడిలో పెరిగిన పంటలను ధ్వం సం చేయిస్తున్నాడు.షిర్డిసాయి తలచుకోవడం.. కేంద్రం తలవంచటం చకచకా జరిగి పోయాయి. మరి అనుగ్రహించాల్సిన షిర్డిసాయినే ఆగ్రహిస్తే, వాళ్ల బతుకులేం కాను? నోరు లేని గిరిజనం, తమ గోడు ఎవరికి వినిపించాలి? కొత్తగా వచ్చే ప్రాజెక్టు వల్ల ఊళ్లు వదిలి వెళ్లేవారికి దిక్కెవరు? షిర్డిసాయి అంత పని చేస్తాడని ఊహించని ఆ అమాయకులను ఆదుకు నేదెవరు? అసలు ఎవరీ షిర్డీ సాయి? పల్లెపై ఎందుకు పగ పట్టారు? ఇదీ ఇప్పుడు.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం యర్రవరంలో గిరిజనగోస. దీన బాంధవుడు షిర్డీసాయి ఏమిటి? ఆదివాసీలను రోడ్డుపాలు చేయడమేమిటను కుంటు న్నారా? పేరులో కొంత గందరగోళం ఉన్నప్పటికీ, కంపెనీ మాత్రం షిర్డీసాయినే! ఆయన పేరు పెట్టుకున్న ఆ కంపెనీ ఇనుపపాదాల కింద, ఇప్పుడు వేలాది గిరిజనుల జీవితాలు నలిగి నాశనం కానున్నాయి. సర్కారే సదరు కంపెనీకి సలాము కొడుతున్నందున, గత్యంతరం లేని గిరిజనం పిడికిలి బిగించింది. షిర్డిసాయి కంపెనీ హైడ్రో పవర్‌ ప్రాజెక్టు మాకొద్దంటూ, మన్యంవీరులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. సర్కారుకు వ్యతిరేకంగా, చింతపల్లి ఏజెన్సీ బంద్‌తో తమ తడాఖా చూపించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింత పల్లి మండలం,గొందిపాకలు పంచాయతీ లోని ఎర్రవరం గ్రామంలో..షిర్డీ సాయి ఎలక్ట్రికల్‌ కంపె నీకి సర్కారు ధారాదత్తం చేసిన హైడ్రోపవర్‌ ప్రాజెక్ట్‌, కొండకోనల నడుమ ప్రశాంతంగా ఉండే గిరిజ నుల గూడేల జీవితాల్లో చిచ్చుపెట్టింది.ఎర్రవరం పరిధిలోని హైడ్రోపవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వటాన్నిగిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. హైడ్రోపవర్‌ ప్రాజెక్టు నిర్మాణం రద్దు చేయాలని రోడ్డెక్కారు.పంటలు, ఫలాలు పండి స్తూ జీవిసిస్తున్నామని..పవర్‌ ప్రాజెక్టు వస్తే జీవనా ధారం పోతుందని ఆవేదన వ్యక్తం చేసున్నారు. తమకు న్యాయం చేసేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.జనవరి 8నవిశాఖపట్నంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావవేశం ఏర్పాటు చేశారు.చింతపల్లి,అరకు,ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల వద్ద ఆల్‌పార్టీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) నిరసనలు చేపట్టారు.ఆంధ్రప్రదేశ్‌ కాశ్మీర్‌ గా ప్రసిద్ధి చెందిన లంబసింగి వద్ద ఆదివా సీలు తెల్లవారుజామున గుమిగూడి రాస్తారోకో నిర్వహిం చారు.కనీసం నాలుగు గంటలపాటు వారు తమ ఆందోళనను కొనసాగించారు.అనంతరం మండల కేంద్రానికి తరలివెళ్లిన ఆందోళనకారులు హనుమాన్‌ జంక్షన్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ధర్నాకు దిగారు. సమావేశంలో గిరిజన సంఘం అఖిల భారత కార్యవర్గ సభ్యుడు పి.అప్పల నరస మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లోనూ గిరిజన వ్యతిరేక ప్రభుత్వాలు నడుస్తున్నాయని ఆరోపించారు. మరియు రాష్ట్రం. యర్రవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టుకు కేంద్రం అట వీ,పర్యావరణ అనుమతులు ఇచ్చింది. దాని ఆధా రంగా రాష్ట్ర మంత్రివర్గం ఈ ప్రాజెక్టును షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌కు అప్పగించింది, ’’అని అప్పల నరస అన్నారు మరియు ఏజెన్సీ ప్రాంతాలలో సహజ వనరులను దోపిడీ చేయ డానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉన్న చర్యలను పలుచన చేస్తోందని ఆరోపించారు.రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సమత కోఆర్డినేటర్లు కందుకూరి సతీష్‌కుమార్‌,గునపర్తి సైమన్‌సీపీఎం అనంతగిరి జెడ్‌పీటీసీ దిసరి గంగరాజు పాల్గొన్నారు. బంద్‌ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పాల్గోని మాట్లాడుతూ గిరిజనుల ఆందోళనకు తమ పార్టీ మద్దతు ఉంటుందని, గిరిజనుల రక్షణ కోసం పార్టీ ఉమ్మడిగా ఆందోళన చేపడుతుందని ప్రకటించారు.
ప్రాజెక్టు లక్ష్యం ఇదీ..
యర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టును, ఒక్కొక్కటి 300 మెగా వాట్లసామర్థ్యంతో,నాలుగు యూనిట్లు ప్రారంభిం చాలన్నది లక్ష్యం.తాండవ రిజర్వా యర్‌లో కలిసే పిట్ట ఒరుకుగెడ్డపై,రెండు రిజర్వా యర్లు నిర్మించాల న్నది ఒకప్రతిపా దన. యర్ర వరం ఎగువడ్యాం నుంచిగానుగుల దిగువ ప్రాం తంలోని దిగువ డ్యాం వరకూ సొరంగం తవ్వి, మధ్యలో జలవిద్యు దుత్పత్తి యూనిట్‌ ఏర్పాటు చేయాలన్నది మరో ప్రతిపాదన.ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయం5,400 కోట్లుగా అంచనా వేశారు. నిజానికి 2020లో చింతపల్లి మండలంలో బాక్సైట్‌ తవ్వ కాల ఆలోచ నకు నాటిసీఎం వైఎస్‌ బీజంవేశారు. దానిని నక్స లైట్లు సహా, అన్ని రాజకీయపార్టీలూ వ్యతిరేకిం చాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం,జీఓ 97నురద్దు చేస్తూ మరో జీఓ ఇచ్చిం ది.దానితో మన్యంలో మంటలు చల్లారాయి. జగన్‌ సీఎంఅయిన తర్వాత, బాబు సర్కారు ఇచ్చిన జీవోనురద్దు చేసింది. ఫలితంగా పులివెం దులకు చెందిన షిర్డీసాయి ఎలక్ట్రిసిటీ కంపెనీ తెరపైకి వచ్చింది. ప్రైవేట్‌ కంపెనీ ఏజన్సీతో సర్వే చేయించడం,ఆ వెంటనే డీపీఆర్‌ సిద్ధం చేయిం చడం,ప్రాజెక్టు నిర్మాణానికి అటవీ,పర్యావరణశాఖ అనుమతికోసం ఢల్లీికి పంపించడం,ప్రాజెక్టును అదానీ కంపెనీకి అప్పగిం చేందుకు అంగీ కారం,2021 డిసెంబర్‌ 21న కేంద్రం అనుమ తులు జారీ చేయడం యుద్ధప్రాతి పదికన జరిగి పోయాయి. ఆతర్వాత దానిని షిర్డీ సాయి ఎలక్ట్రి కల్‌ కంపెనీకి అప్పగిస్తూ,జగన్‌ సర్కా రు మంత్రి వర్గం తీర్మానిచింది.షిర్డీసాయి ఎలక్ట్రికల్‌ కంపెనీ పాలకపార్టీకి,ఆత్మబంధువులన్న ఆరోపణ ల నేప థ్యంలో..ఆ కంపెనీకి ప్రాజెక్టు ధారాదత్తం చేసిన వైనం విమర్శలకు గురవు తోంది.ప్రాజెక్టును షిర్డీసాయి ఎలక్ట్రి కల్‌ కంపెనీకి కట్టబెట్టే అత్యుత్సా హంలో..నిబంధ నలకు నీళ్లొదిరారన్న ఆరోపణ లు వెల్లువెత్తుతు న్నాయి. విచిత్రంగా నిబంధనలు నిశితంగా పరిశీ లించిన తర్వాతనే, ఏ ప్రాజెక్టున యినా ఆమోదించే కేంద్రం ప్రభుత్వం కూడా.. హైడ్రో పవర్‌ ప్రాజెక్టుకు చకచకా అనుమతి ఇచ్చిందంటే, ‘షిర్డీసాయి మహత్యం’ఏస్థాయిలో పనిచేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అటు హైడ్రో ప్రాజెక్టు ఏర్పాటు పై గిరిజనం ఆందోళన చేస్తుంటే..ఇటు బీజేపీ వారికి మద్దతు నివ్వక పోగా,కేంద్రంలోనిబీజేపీ సర్కారు అనుమ తులన్నీ ఆగమేఘాలపై జారీ చేయ డాన్ని గిరిజను లు మండిపడుతున్నారు. ఫలితంగా ఈవివా దంలో బీజేపీఅడ్డంగా ఇరుక్కుపోయినట్ట యింది. ఇక తమ జీవనాధారమైన పంటపొలాలు ధ్వంస మయి, జీవితాలు రోడ్డునపడటంపై గిరిజనం గగ్గోలు పెడుతోంది. సర్కారు నిర్ణయానికి వ్యతిరే కంగా చింతపల్లి ఏజెన్సీ ఏరియాను బంద్‌ ప్రకటిం చగా,అనూహ్య స్పందన లభించింది. ఆదివాసీలు మూకుమ్మడిగా రోడ్డెక్కి, సర్కారుకు వ్యతిరేకంగా గళం విప్పారు.ప్రాజెక్టును కట్టనిచ్చేది లేదని హెచ్చ రించారు. మా జీవితాలు హరించే హక్కు ప్రభుత్వా నికి ఎవరిచ్చారని గర్జించారు. షిర్డీసాయి కంపెనీకి ఇచ్చిన అనుమతి రద్దు చేయాలంటూ గళమెత్తారు. ప్రాజెక్టు నిర్మాణంవల్ల తాము అనాధలమవు తామ ని ఆందోళన వ్యక్తం చేశారు. షిర్టీసాయి కంపెనీకి ఇచ్చిన ప్రాజెక్టు వల్ల..చింతపల్లి,కొయ్యూరు మండ లాల్లోని 2500ఎకరాలు నేలమట్టమవుతాయి. ఆరకంగా నాలుగు పంచాయతీలోని ఆదివాసీలు రోడ్డునపడతారన్నమాట. దాదాపు 20 వేల మంది ఆదివాసీలు,32 గిరిజన గ్రామాలు ప్రాజెక్టు కోసం పూర్తి స్థాయిలో ఖాళీ చేసి, మూటా ముల్లె సర్దుకుని పోవాల్సిందే. అదొక్కటే కాదు..కొన్ని దశాబ్దాల నుంచి,తాత ముత్తాతల కాలం నుంచీ సాగుచేసు కుంటున్న పంటలు కూడా ప్రాజెక్టుకు బలవుతా యన్నది గిరిజనుల ఆందోళన. 600ఎకరాల్లో గిరిజ నులు సాగుచేస్తున్న జామ,అనాస,మల తోటలు నేలకూలనున్నాయి. 1500 ఎకరాల్లో సాగుచేస్తున్న మిరియాలు, కాఫీ తోటలు నేలమట్టం కానున్నాయి. మొత్తంగా అక్కడ ఇక పచ్చని చెట్లు, పంటపొలాలు మాయమవుతాయన్నమాట.
రాజ్యాంగానికి తూట్లు
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 244(1) ద్వారా ఐదో షెడ్యూల్‌ ప్రాంతంలో ఆదివాసీలకు ప్రత్యేకంగా ఎన్నో హక్కులు కల్పించారు. వారికి రక్షణగా భూబదలాయింపు చట్టాలుచేశారు. వాటినీ జగన్‌ సర్కారు భేఖారుచేస్తోంది. ఆదివాసీల సంప దను ఆస్మదీయులకు అడ్డదారుల్లో దోచి పెట్టాలని చూస్తోంది. గిరిజనప్రాంతాల్లో ప్రాజెక్టులు నిర్మిం చాలంటే ప్రభావిత ప్రాంతాల్లో మొదట గ్రామసభను నిర్వహించి,వాటి ఆమెదంతోనే అనుమతులు ఇవ్వాలన్న నిబంధనను జగనన ప్రభుత్వం తుంగ లో తొక్కేసింది.ముఖ్యమంత్రి,మంత్రులు సచివా లయంలో కూర్చునే..షిర్డీసాయి సంస్దకు పీఎస్పీ ప్రాజెక్టుని కేటాయించేశారు. అది ఆచరణలోకి వస్తే ఏజెన్సీలోని కొయ్యూరు,చింతపల్లి,గూడెంకొత్తవీథి మండలాల్లోని కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందిని గిరిజనులు మూడు వేల ఎక రాల భూములు కోల్పోతారని గిరిజన సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.చట్టాలను తుంగలోకి తొక్కి గిరిజనుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వ చర్యలను నిరిసిస్తూ స్థానికలు ఆందోళనలు చేపడుతున్నారు. ముంపు ప్రభావిత మండలాల్లో బంద్‌లు,నిరసనలు,ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.
తాండవ జలాశయంపై ప్రభావం
ఎర్రవరంలో నిర్మించనున్న పీఎస్‌పీతో అనకాపల్లి,తూర్పుగోదావరి జిల్లాలో ఆయకట్టు కలిగిన తాండవ జలాశయంపై ప్రభావం పడు నుంది.కొయ్యూరు,చింతపల్లి మీదుగా జలాశయం లోకి ప్రవహించే నీటి వనరులపై ఈ పీఎస్‌పీని నిర్మించబోతున్నారు.0.4టీఎంసీల సామార్ద్యంతో ఎగువు,దిగువన రెండు రిజర్వాయర్లు నిర్మించి, విద్యుదుత్పిత్తి చేయనున్నారు.దీనివల్ల జలాశయం లోకి వచ్చే0.4టీఎంసీల నీరు తగ్గిపోయే ప్రమాదం ఉందని సంబంధిత అధికార్లులు అంటున్నారు. సుమారు 4వేలఎకరాలకు సాగునీరు ప్రశ్నార్ధ కంగా కానుంది.
చట్టం ఉల్లంఘన
ఐదో షెడ్యూల్‌ పరిథిలోని ఆదివాసీ గ్రామాల్లో భూములను గిరిజనేతరులకు బదలా యించడానికి వీల్లేదు.క్రయవిక్రయాలు పూర్తిగా గిరిజనుల మధ్యే జరగాలని 1/70చట్టం చెబుతోం ది.1995లో అనంతగిరి మండలంలో కాస్సైట్‌ గనుల వివాదంపై సమతా స్వచ్చంధ సంస్థ సుప్రీం కోర్టు ఆశ్రయించినప్పుడు షెడ్యూల్‌ ఏరియాలో ప్రభుతాన్ని కూడా గిరిజనేతరురాలిగానే భావిం చాల్సి వస్తుందని స్పష్టంగా పేర్కోంది. అయినా జగన్‌ ప్రభుత్వానిక లెక్కేలేదు. గిరిజన ప్రాంతంలో చేపట్టే కార్యాకలాపాలకు గ్రామసభల ఆమోదం తప్పనిసరి.సభలో సమగ్రంగా చర్చ జరిగిన తర్వాత వారి ఆమోదం ఉంటేనే ముందుకెళ్లాలని పీసా చట్టం చెబుతోంది.ఒడిశాలోని నియాంగిరి కొండ ను బాక్సైట్‌ కోసం వేదాంత గ్రూప్‌నకు కేటాయించి నప్పుడు సుప్రీంకోర్టు ఇదేవిషయాన్ని స్పష్టం చేసింది. అక్కడ గ్రామసభ నిర్వహించకుండా స్థానిక ప్రజాప్రతినిధి సంతకంతో అనుమతి చూపించడాన్ని తప్పపట్టింది.ఆకేటాయింపు రద్దుకు సిఫార్సు చేసింది.కానీ ఆవేవీ వైకాపా ప్రభుత్వం చెవికెక్కవు.
ఆదివాసీల ఆగ్రహ జ్వాల
ఎర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టు(పంప్డ్‌ స్టోరేజి ప్రాజెక్టు) నిర్మాణానికి ఏపీ కేబినెట్‌ ఆమో దం తెలపడంపై గిరిజన సంఘాల నాయకులు, మండిపడుతున్నారు.గిరిజనులు వ్యతిరేకిస్తున్న ప్పటికీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా వైఎ స్సార్‌ కడప జిల్లా వైసీపీ నేతకు చెందిన షిర్డీసాయి ఎలక్ట్రికల్‌ కంపెనీకి నామినేషన్‌ పద్ధతిలో 1200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యర్రవరం పీఎస్‌పీ నిర్వహణ బాధ్యతలను అప్పగించినట్టు ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో మంగళవారం గిరిజన సంఘం నాయకులు అదానీ దిష్టి బొమ్మను దహనం చేసి హైడ్రో పవర్‌ ప్రాజె క్టుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బాక్సైట్‌ తరహాలో ఉద్యమాన్ని ఉధృతం చేసి యర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టును అడ్డుకుంటామని, వైసీపీకి తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరిం చారు.
కేంద్ర అటవీ, పర్యావరణ అనుమతులు మంజూరు
ఎర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మా ణానికి కేంద్ర అటవీ, పర్యావరణ అనుమతులను ఇది వరకే మంజూరు చేసింది.యర్రవరంలో హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి ఓ ప్రైవేటు ఏజెన్సీ2020 జనవరి22 నుంచి 25వరకు సర్వే చేపట్టి ప్రాథమిక డీపీఆర్‌ సిద్ధం చేసింది. పవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన కేంద్ర అటవీ, పర్యావరణ అనుమతులు 2021 డిసెంబరు 21న మంజూరయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణానికి అవస రమైన కేంద్ర అటవీ, పర్యావరణ అనుమతులు మంజూరుకావడంతో రాష్ట్ర ప్రభుత్వం హైడ్రో పవర్‌ ప్రాజెక్టు(పంప్డ్‌ స్టోరేజి ప్రాజెక్టు) నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదంతో షిర్డీసాయి ఎలక్ట్రికల్‌ కంపెనీకి అప్ప గించింది.
ముంపునకు గురికానున్న 32 గ్రామాలు
హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మాణంవల్ల 32గిరిజన గ్రామాలు ముంపునకు గురికాను న్నాయి. దీంతో ఈ ప్రాంత గిరిజనులను గ్రామాల నుంచి ఖాళీ చేయించాల్సి వుంది. ప్రధానంగా కొయ్యూరు మండలంపి.మాకవరం పంచాయతీకి చెందిన గానుగుల,రామచంద్రపురం,రామరాజుపాలెం, దిబ్బలూరు,వెలగలపాలెం పంచాయతీలో కిత్తాబు, చింతపల్లి మండలం గొందిపాకలు పంచాయతీ పరిధిలోవంట్లమామిడి,తాటిబంద,రాసపనస, ఎర్ర వరం,గాగులబంద,బొర్రమామిడి,పొర్లుబంద, రోలుగుంట,దంపులగుంట,వేనం,తాడపాలెం, పోతురాజుగుమ్మల,చీమలపాడు,సమగిరి,రాస పనస,తోటమామిడి,గొడుగుమామిడి,ఎర్రబొమ్మలు పంచాయతీ ఎర్రాబెల్లి,తప్పలమామిడి,జీడు మామి డితోపాటు మరో ఏడు ఆవాస గ్రామాలు ముంపు నకు గురికానున్నాయి.
అడవులను అదానీకి కట్టబెడతారా !
జల విద్యుత్‌ ప్రాజక్టువల్ల 4800 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని రాష్ట్ర ప్రభు త్వం చెబుతున్నది వాస్తవం కాదు. సీలేరు, మాచ్‌ ఖండ్‌ జల విద్యుత్‌ ప్రాజెక్టులో కేవలం 5వందల మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారు. అందులో స్థానిక గిరిజనులు నామమాత్రమే. ప్రభు త్వ సంస్థలోనే అంతంతమాత్రపు ఉపాధి ఉన్నప్పుడు ప్రైవేటు అదానీ కంపెనీలో నాణ్యమైన టెక్నికల్‌ ఉద్యోగాలు పొందగలమా అనేది ప్రశ్న. జోలపుట్‌ డ్యాం,మాచ్‌ఖండ్‌ పవర్‌ప్రాజెక్టు నిర్మాణం 1955 లో జరిగినప్పుడు సుమారు 250 గ్రామాల ప్రజలు నిర్వాసితులైతే వారిని ఆదుకునేవారే కరవయ్యారు.
ఉపాధి పేరుతో మోసం
జల విద్యుత్‌ ప్రాజక్టువల్ల 4800 మం దికి ఉద్యోగావకాశాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది వాస్తవం కాదు. సీలేరు, మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ ప్రాజెక్టులో కేవలం 5 వందల మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారు. అందులో స్థానిక గిరిజనులు నామమాత్రమే. ప్రభుత్వ సంస్థ లోనే అంతంతమాత్రపు ఉపాధి ఉన్నప్పుడు ప్రైవేటు అదానీ కంపెనీలో నాణ్యమైన టెక్నికల్‌ ఉద్యోగాలు పొందగలమా అనేదిప్రశ్న.జోలపుట్‌ డ్యాం, మాచ్‌ ఖండ్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణం 1955లో జరిగిన ప్పుడు సుమారు 250 గ్రామాల ప్రజలు నిర్వాసితు లైతే వారిని ఆదుకునేవారే కరవయ్యారు. ఇప్పుడు మాత్రం ‘కేవలం 10 కుటుంబాలున్న 25 మంది జనాభాగల కొయ్యూరు మండలంలోని చిన్నయ్య కొండ అనే ఊరు మాత్రమే మునుగుతుంది. అందు లో కేవలం 22హెక్టార్ల ప్రైవేటు భూమి నష్టపోతు న్నారు.279 హెక్టార్ల భూమి అవసరం కాగా అందులో 257హెక్టార్ల అటవీభూమి ఉంద’ని ప్రభు త్వ సంస్థ ఎన్‌.ఆర్‌.ఇ.డి.సి.ఏ.పి చెప్పడం మోసం. అధిక సంఖ్యలో అడవిపై ఆధారపడి జీవిస్తున్న చుట్టుపక్కల నిర్వాసిత గ్రామాల ప్రజల వివరాలను పూర్తిగా దాస్తున్నది. రాష్ట్ర క్యాబినెట్‌ సత్య సాయి గ్రీన్‌ ఎనర్జీని అదానీ కంపెనీకి అప్పగిం చడంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రాజ్యాంగం ప్రకారం ఆదివాసీ ప్రాంతంలోని ఆదివాసీ ప్రాంత సహజ వనరులు ఆదివాసీలకు చెందాలని, ఆదివాసీ ప్రాంతంలో అదానీ ప్రవేటు సంస్థల ప్రవేశాన్ని నిషేధించాలని డిమాండ్‌ చేస్తూ…చింతపల్లి, జి.కె వీధి,కొయ్యూరు మండలంలో గిరిజనసంఘం నాయకత్వంలో మిగతా గిరిజన సంఘాలు, ప్రతి పక్ష పార్టీల ఆధ్వర్యంలో డిసెంబర్‌ 14న మూడు మండలాల్లో బంద్‌ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు.
సహజ వనరులున్నా వెనకబాటే
అడవుల విస్తీర్ణంలో అల్లూరి సీతారామ రాజు జిల్లా రాష్ట్రంలోకెల్లా మొదట స్థానంలో ఉంది.అయితే మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నేటికీ గిరిజన గ్రామాలలో వైద్యం కోసం డోలీ మోతలు కొనసాగిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి లేక మైదాన ప్రాంతంలో వలసలు వెళుతున్నారు. రక్త హీనతతో గిరిజన బాలింతలు,చిన్నపిల్లల మర ణాలు సర్వసాధారణంగా ఉన్నాయి. అక్షరాస్యత చాలా తక్కువ.సహజ వనరులు పుష్కలంగాఉన్న ప్పటికీ గిరిజనప్రజలు పేదరికంతో ఉన్నారు. పాడేరు ఏజెన్సీలో సుమారు 5 లక్షల కోట్ల రూపా యల విలువైన 515 మిలియన్‌ టన్నుల బాక్సైట్‌ మైనింగ్‌ వనరులు పుష్కలంగా ఉన్నాయి.చైనా క్లే, గ్రానైట్‌, లేటరైట్‌,రంగురాళ్ళు,క్వార్ట్డ్జ్‌, లైమ్‌ స్టోన్‌ తదితర సహజ వనరులతో లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదనిలయంగా ఉంది. ప్రపం చంలోనే అత్యంత రుచికరమైన ఆర్గానిక్‌ కాఫీ పంట పండే దట్టమైన అడవులు, సుగంధ ద్రవ్యా లు, పసుపు, పిప్పళ్లు, అల్లం, మిరియాల పంటలకు అనువైన ప్రాంతం.జీడి,అటవీ ఉత్పత్తులు, వనమూ లికలు,రాజ్మా విస్తారంగా దొరికే తూర్పు కనుమల అటవీ ప్రాంతమిది. ఇంకోవైపు దేశంలోనే అత్యంత ఎక్కువ మంది గిరిజనులను నిరాశ్రయులను చేసిన పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతం. ఈ జిల్లాలో గిరిజనులు 82.67శాతం.రాజ్యాంగంలోని 5వషె డ్యూల్‌ ప్రాంతంలోని గిరి జన ప్రాంత హక్కులు, విద్య,వైద్యం,ఉపాధిని …గిరిజన సలహా మండలి, రాష్ట్ర గవర్నర్‌,దేశ రాష్ట్రపతి ఆధ్వర్యంలో కాపా డాల్సి వుంది. ఆదివాసీల హక్కులు, సహజ వనరు లు,అటవీ భూముల రక్షణ చూడాల్సి ఉంది. కానీ దేశ విదేశీ బహుళజాతి సంస్థల ఒత్తిడితో కేంద్రం లోని బీజేపీ,రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వం మోనిటైజేషన్‌ పైప్‌లైన్‌లో భాగంగా 2024 వరకు ఆదివాసీ అడ వులను అమ్మకానికి పెట్టి డబ్బు సంపాదించడానికి పూనుకున్నాయి. రాజ్యాంగం ప్రకారం ఆదివాసీప్రాంతంలోని అడవు లు, భూములలో ప్రైవేటు కంపె నీల ప్రవేశంపై నిషేధం ఉన్నది. ఐదవ షెడ్యూల్‌ ప్రాంత అడవుల్లో బడా బహుళజాతి కంపెనీలు సులభంగా ప్రవేశిం చడానికి వీలుగా పర్యావరణ అటవీ సంరక్షణ చట్టం-1980ను సవరించి మరింత సులభతరం చేసింది. అటవీ పర్యావరణ పరిరక్షణ చట్టం-1980 ప్రకారం అటవీ ప్రాంతంలోని భూములను అటవీయేతర కార్యక్రమాలకు కేటాయించరాదు. మైనింగ్‌,భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి అటవీ భూము లు కేటాయించరాదు. ప్రభుత్వ ప్రాజెక్టు అయితే 70శాతం గ్రామ సభలో ఆమోదం పొందడం తప్పనిసరి. ప్రైవేటు కంపెనీలకు 80శాతం గ్రామ సభ ఆమో దం పొందడం తప్పనిసరి. అయితే ఇప్పుడు సవరిం చిన నిబంధనల ప్రకారం ఎటు వంటి ఆమోదం పొందనవసరం లేదు.
చట్టవిరుద్దంగా వెళుతున్నారు..!
క్షేత్రస్థాయిలో పరిస్థితు లను అధ్యయనం చేయకుండా ఎక్కడో కూర్చుని నిర్ణ యాలు తీసు కోవడం తపుని విశ్రాంతి ఐఏఎస్‌ అధికారి ఇ.ఎ.ఎస్‌.శర్మ సీఎంజగన్‌కు లేఖ రాశారు. లేఖసా రాంశం ఇలాఉంది.రాష్ట్ర ప్రభు త్వం, పార్వతీపురం మాన్యం జిల్లాలో రెండు ప్రాజెక్టులు,అంటే కురుకుట్టి దగ్గర 1,200హైడ్రోపంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్ట్‌, కర్రి వలస దగ్గర 1,000హైడ్రో పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్ట్‌, మరియు AూR జిల్లాలో ఎర్రవరం దగ్గర ఇంకొక 1,200వీఔ హైడ్రో పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్ట్‌,ఆదానీ కంపెనీకి ఇవ్వాలని నిర్ణయిం చడం,ఆప్రాంతాల్లో అమలులో ఉన్న పీసా,అటవీ హక్కుల చట్టాలను ఉల్లంఘించడం అవుతుంది.ఆ రెండు చట్టాల కింద,ఆ ప్రాంతాల్లో ప్రాజెక్టు లకు అనుమతులు ఇచ్చే ముందు, అక్కడి గ్రామ సభలను సంప్రదించి, వారి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంది. గ్రామసభల అనుమతి తీసుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి ప్రాజెక్టుల మీద,ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అధికారంలేదు.ఇదే విష యాన్ని,సుప్రీం కోర్టువారు,ఒరిస్సాలో కలాహండి ,రాయగడ జిల్లాలలో,అక్కడిప్రభుత్వం, గ్రామ సభల అనుమతి లేకుండా,వేదాంత కంపెనీకి బాక్సైట్‌ మైనింగ్‌ అనుమతి ఇవ్వడంచట్టవిరుద్ధమని, 20 13,ఏప్రిల్‌18నఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పాటించవలసిఉంది. సుప్రీం కోర్టువారి ఆదేశాల ప్రకారం,అక్కడ పద కొండు గ్రామాలలో గ్రామసభలు ఆమైనింగ్‌ ప్రాజె క్టును చర్చించి,తిరస్కరించడము వలన, ప్రాజెక్టు రద్దయింది. ఇదే కాకుండా, షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో, ప్రైవేటు కంపెనీలకు ప్రాజెక్టులు ఇవ్వడం, అక్కడ భూములను లీజ్‌ తీసుకునే అనుమతులు ఇవ్వడం, అక్కడ వర్తించే ల్యాండ్‌ ట్రాన్స్ఫర్‌ చట్టాన్ని ఉల్లంఘిం చడం అవుతుంది.సుప్రీంకోర్టువారు,అప్పటి విశాఖ పట్నం జిల్లా షెడ్యూల్డ్‌ ప్రాంతంలో, అనంతగిరి మండలంలో,ఒక ప్రైవేటు కంపెనీ కి ఇచ్చిన నిర్ణ యాన్ని 1997లో సమతా కేసులో రద్దు చేశారు. ఆకారణంగా,ఈమూడుహైడ్రో ప్రాజేక్ట్‌ లను అదానీ కంపెనీకి ఇవ్వడం చెల్లదని మీరు గుర్తించాలి. రాజ్యాంగంలో 5వషెడ్యూల్‌ పారా4కింద రాష్ట్రం లో ఏర్పాటు చేయబడిన ట్రైబల్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ (ుతీఱపaశ్రీ Aసఙఱంశీతీవ జశీబఅషఱశ్రీ),ఇటువంటి ప్రాజె క్టుల మీద చర్చించవలసినది.రాష్ట్రప్రభుత్వం ుAజ వారి అభిప్రాయాలు తీసుకోకుండా ఈ ప్రాజె క్టుల మీద నిర్ణయం తీసుకోవడం, రాజ్యాంగాన్ని ధిక్కరిం చినట్లు అవుతుంది.షెడ్యూల్డ్‌ ఏరియాలో గిరిజ నుల జీవితాలమీద,వారి సంప్రదాయం మీద ప్రభా వం కలిగించే పెద్ద ప్రాజెక్టులు పెట్టే విషయంలో, రాష్ట్ర ప్రభుత్వం,రాజ్యాంగం338A(9)కింద జాతీ య స్థాయి ట్రైబల్‌ కమీషన్‌ (చీa్‌ఱశీఅaశ్రీ జశీఎఎఱంంఱశీఅ టశీతీ ్‌ష్ట్రవ ూషష్ట్రవసబశ్రీవస ుతీఱపవం- చీజూు) అభిప్రాయాన్ని ముందే తీసుకోవాలి. మీ ప్రభుత్వంచీజూుతో ఎటువంటి సంప్రదింపులు జరిపినట్లు కనిపించడం లేదు. మీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను అదానీ కంపెనీకి, ఎటువంటి పోటీ లేకుండా,ఇవ్వడం సరికాదు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ‘‘జాతీయహైడ్రోఎలక్ట్రిక్‌ విధానం’’ ప్రకారం, పోటీ లేకుండా హైడ్రోప్రాజెక్టులను ప్రైవేటు కంపెనీలకు ఇవ్వడం చెల్లదు. ఈ మూడు ప్రాజెక్టు వలన,గిరిజన ప్రాంతాల్లో వారి జీవితా లకు, సాంస్కృతికి నష్టం కలిగే అవకాశాలు ఉన్నా యి. వారు ఆధారపడే జలవనరులకు అంతరా యం కలుగు తుంది. అటవీహక్కుల చట్టం క్రింద, వారికి అక్కడ అటవీ సంపద మీదఉన్న హక్కులకు అంత రాయం కలుగుతుంది. ఇన్ని విధాలుగా గిరిజన ప్రజలకు నష్టాలు కలిగే అవకాశాలున్నా, వారితో, వారి గ్రామసభలతో ముందుగా సంప్రదిం చకుం డా, ఇటువంటిపెద్ద ప్రాజెక్ట్‌ల మీద ఏకపాక్షి కంగా నిర్ణయాలు తీసుకోవడం, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన హైడ్రో ఎలక్ట్రిక్‌ విధానాన్ని ఉల్లంఘిస్తూ, ప్రాజెక్టులను అదానీకంపెనీకి పోటీ లేకుండా ఇవ్వ డం సబబు కాదు. ఈవిషయాలమీద, నేను ఎన్నో సార్లు మీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి లేఖలు రాసినా,వారు స్పందించలేదు. నా లేఖల నకళ్ళను జతపరుస్తున్నాను ఈవిషయాలను దృష్టిలో పెట్టు కుని, మీ ప్రభుత్వం తత్‌ క్షణం, ఈ మూడు ప్రాజెక్టు లను రద్దు చేయాలని నా విజ్ఞప్తి. గిరిజన ప్రాంతా లలో అమలులోఉన్న చట్టాలను, గిరిజనుల హక్కు లను గౌరవిస్తూ మీ ప్రభుత్వం ఆలస్యం చేయకుం డా ప్రాజెక్టులను వెనక్కి తీసుకుంటారని విశ్వసిస్తు న్నాను ఆలేఖలో వివరించారు.-(మార్తి సుబ్రహ్మణ్యం)

ఆదివాసీ సంస్కృతికి అద్దం

తెలుగు సాహితి చరిత్రలో కథాపక్రియ సదా వన్నె తరగని మకుటం లాంటిది,తెలుగు సమా జపు జీవిత చిత్రణ కథల్లో అగుపిస్తుంది. మానవ జీవితాల మనుగడకు అద్దంపట్టే కథా ప్రక్రియనే తన సామాజిక వర్గపు సంస్కృతి సాంప్రదాయాలను బాహ్య ప్రపంచానికి అందిం చడానికి సాధనంగా చేసుకుంది పాల్వంచకు చెందిన ‘‘పద్దం అనసూయ’’ కోయ సామాజిక వర్గానికి చెందిన సాంప్రదాయాలనే తన కథా వస్తువులుగా తీసుకుని వ్రాసిన ఆమె కథలు, రాశి కన్నా వాసిలో ముందు నిలుస్తాయి. వాస్తవంగా తనకు రచనా రంగంలో అంతగా అనుభవంగానీ, ప్రవేశం కానీ లేవు, అయినా తనలోని భావాలను పదుగురితో పంచు కోవాలనే తపన తనను రచయిత్రిగా తయారు చేసింది. దానికి తోడు తన చిన్నతనంలో అమ్మమ్మ చెప్పిన జానపద కథల ప్రభావం కూడా బాగా పనిచేసింది.తన మాతృభాష అయిన కోయ భాషతోపాటు వృత్తి భాష అయినా తెలుగులో కూడా మనసుతో చదివిన అనసూయ జీవిత లక్ష్యం లిపిలేని తన మాతృభాష కోయ భాషను, తెలుగు లిపి సాయంతో దేశవ్యాప్తం చేయడమే. !! అందులో భాగంగానే తన సామాజిక వర్గపు భాషతో పాటు సాంస్కృతి సాంప్రదాయాలను అక్షరీకరించి భద్రపరిచి భావితరాలకు అందించడమే దీక్షగా పని చేస్తున్నారు. అందులో భాగంగానే 2019లో ఆమె ‘‘చప్పుడు’’ అనే పేరుతో కోయ కథా సంపుటి వెలువరించారు. అంతేగాక తొలి గిరిజన కథారచయత్రిగా కూడా తెలుగు కథ సాహిత్యంలో స్థానం సంపాదించారు. ఈ కథ సంపుటిలో కథలు 2009-2011సంవత్సరాలు మధ్య వ్రాయబడినవి, సాధారణంగా గిరిజన కథలు అనగానే పోరాటాలు,మోసాలు,దగాలు, రాజకీ యాలు,వగైరా వగైరాలు,కథా వస్తువులుగా ఉంటాయి,కానీ ‘‘పద్దం అనసూయ’’ వ్రాసిన కథలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఒక వైపు తమ గిరిజన సామాజిక వర్గ సంస్కృతి సాంప్రదాయాలు కనిపిస్తే, మరో వైపు తనదైన గిరిజన స్త్రీ మానసిక వేదన లను మిళితం చేసినట్టు కనిపిస్తుంది. అనసూయ స్వతహాగా గిరిజన సామాజిక వర్గంకు చెందినవారు. నిత్యం తన సామాజిక వర్గపు స్త్రీలతో కలిసిమెలిసి జీవించిన వ్యక్తివారి భావాలను అను భవాలను బాధలను దగ్గరగా చూసిన స్వానుభవంగల మనిషి,సాధారణ సమాజపు స్త్రీవాదులచూపుకు, గిరిజన సామాజిక వర్గపు ఈ ఆడ బిడ్డ స్త్రీవా దపు దృష్టికి పూర్తి వైవిధ్యం కనిపి స్తుంది. తెలుగు సాహిత్యపు స్త్రీవాదాన్ని అనసూ య దిగుమతి చేసుకోలేదు కానీ‘‘గిరిజన మహిళల జీవితంలోని కష్టాలు’’అందరికీ తెలియాలి అని మాత్రం పూర్తిగా నమ్మింది. ప్రామాణిక కథా సిద్ధాంతాలు, పత్రికలవారి ‘‘నిర్దేశిత వలయ సూత్రాలు’’ తనకు తెలిసి ఉం డవు దరిమిలా ఆమె కథల్లో సంబంధిత కొలతలు కనిపించక పోవచ్చు,కానీ తనలోని ఆవేదనలను వ్యక్తీకరిం చు కోవడానికి రచయిత్రి పడ్డ శ్రమకు తోడు తనదైన భాష,తనకు మాత్రమే సొంతమైన కథన శైలి, వెరసి పాఠకు లకులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఈ కథల రచన కొనసాగింది. కథలశైలి ఎంత చిత్రమో! వాటి వస్తువు కూడా అంతే విచిత్రం గా ఉంది. ఈ సంపుటిలోని ప్రతి కథకు నేపథ్యం‘‘చావు’’, మనిషికి మరణం ఒక పోరా టం ప్రతి జీవన పోరాటం ఒక విప్లవంఅనే అర్థ సూత్రానికి కట్టుబడి ఈ కథలు రాశారు. కథలోని వస్తువు కన్నా వస్తువుకు నేపథ్యాలైన సంస్కృతి, సంప్ర దాయాల వెంటే ఆమెకథా ప్రయాణం సాగింది. ఈ కథలన్నీ గిరిజనస్త్రీని ముఖ్యపాత్రగా చేశాయి చావు సందర్భంగా బ్రతకు పోరాటం వివరిం చిన కథలు. మరణించిన గిరిజన మహిళల బతు కులను అక్షరీకరించిన ‘సమయ ప్రవా హికలు’ ఈ కథలు.‘కాకమ్మ’కథ మొదలు ‘మూగబోయిన శబ్దం’ వరకు సాగిన ఈ‘‘చప్పుడు’’ కథల పయనంలో పాఠకులకు సరికొత్త అను భూతి సంతృప్తి కలుగుతాయి అనడంలో నిండు నిజం దాగి ఉంది.‘కాకమ్మ’కథలో ప్రధాన పాత్ర ‘కాకమ్మ’ రచయిత్రి జ్ఞాపకాల సాయంతో గిరిజన సమాజం,సంస్కృతి,భాష, కలగలుపుకుని చక్కగా సాగుతుంది.కాకమ్మ వయసు పైబడిన వృద్ధ గిరిజనస్త్రీ,తన చిన్నతనం నుంచి తమ కుటుంబం బాగుకోసం ఎంతోకృషి చేసింది, తనకు తనదైనసంస్కృతి సాంప్రదాయాలంటే ప్రాణం.వాటిని పరిరక్షించుకోవడమే తన ధ్యేయం, కానీ తన వారసులు ఆధునికత పేరుతో సంస్కృతి సాంప్రదాయాలు పాటించ కుండా ఎవరిస్వార్థం కోసం వారు కట్టు తప్పి ముందుకు కదిలిపోయిన ప్రతి సంఘటనలు కాకమ్మ మనసును గాయపరుస్తాయి.కూతురు వేరే కులం వ్యక్తినిపెళ్లి చేసుకోవడం,కొడుకు తన పెళ్లి గిరిజన ఆచారం ప్రకారం చేయడం అనాగరికంగా భావించడం, మొదలైన సంఘ టనలతో కలత చెందిన కాకమ్మ చివరికి తన చావునైనా తనవాళ్లు తమపద్ధతిలో చేస్తారో చేయరో అని ఆవేదనపడి తానే తన కర్మకాం డలు గిరిజన సాంప్రదాయం ప్రకారం చేయ డానికి కావలసిన సరుకులు అన్నీ ముందు గానే సమకూర్చుకొని పాత భోషణం పెట్టెలో దాచి దాని తాళం చెవి తన వారికి అందించి, తన ప్రాణం తన ఇంట్లోనే పోవాలనే చివరి కోరికతో కన్నుమూస్తుంది కాకమ్మ. సంస్కృతి సంప్రదా యాల పరిరక్షణలో గిరిజన స్త్రీ పడే ఆవేదనకు ఈ కథ అద్దం పడుతుంది, రెండవ కథ సంపుటి శీర్షికఅయిన ‘చప్పుడు’ కథలో గిరిజన గూడెంకు చెందిన ‘పోతప్ప’ బ్రతుకు తెరువు కోసం భార్య ‘సుంకులు’తోకలిసి పాల్వంచ పట్ట ణం పోయి బ్రతుకు తుంటాడు. పట్టణం పోయిన తమ గిరిజన పద్ధతులు మానుకోలేదు ఆకోయ దంపతులు. దురదృష్టవ శాత్తు పోతప్ప భార్య సుంకులు చనిపోతుంది. ఆమె కర్మకాం డలు గిరిజన ఆచారం ప్రకారం చేయడానికి సిద్ధమే తగిన ఏర్పాట్లు చేసుకుం టాడు.14వ రోజు రాత్రిడోలి వాళ్ళడోలి వాయిద్యాల సాయంతో రాత్రి అంతా శబ్దాలు చేస్తూ ‘పూర్భం’ చెప్పి యాస పోసి చనిపోయిన వ్యక్తి ఆత్మను సాగనంపినప్పుడే గిరిజనుల ఆచార ప్రకారం కర్మ జరిగినట్టు. పోతప్ప తన భార్య కర్మకాండలు చేస్తున్న తీరు ఆడోలు వాయిద్యాల హోరుకు పట్టణంలోని ఆధునిక గిరిజనేతరులు అడ్డు తగలడం వారిని ఎదిరించి సింహంలా ఎదురు తిరిగి తనభార్య కర్మకాండ తమదైన పద్ధతిలో డోలు చప్పుళ్ళతో పోతప్ప పూర్తి చేయడం ఈ కథలో ఇతివృత్తం. ఎంతఎత్తుకు ఎదిగిన మన పూర్వ ఆచారాల పునాదిని వదల కూడదని సత్యాన్ని చాటింది ఈ ‘చప్పుడు’ కథ. స్వార్థం నీడలో ఆధునిక సమాజం ఎంతగా పాడైపోయినా గిరిజన సామాజిక వర్గంలో ఎప్పటికీ ప్రేమలు, ఆత్మీయతలు, ప్రవహిస్తూనే ఉంటాయి అని చాటి చెప్పిన కథ ‘ముసిలి’. తనకోసం మాత్రమే కాదు తన జాతి కోసం, గోత్రంకోసం,ఇంటి కోసం,కాకుండా తన ఊరి బాగు కోసం ఆలోచించి కష్టపడి కన్నుమూసిన ముసిలి చావును ఆఊరి వాళ్ళంతా ఓపండ గల చేయడం ఈ కథలో విశేషం.పరుల కోసం పాటుపడ్డ వారు చనిపోయి కూడా జీవిస్తారు అనే మంచి సందేశం ఇచ్చింది ఈ కథ.గతం వర్తమానాల మధ్య రెండు తరాల,రెండు మతాల,మధ్య ప్రస్తుతం అడవి బిడ్డల ఊగిసలాటను దృశ్యమానం చేసిన చివరి కథ ‘‘మూగబోయిన శబ్దం’’ ఇద్దరు కొడుకులు గల ‘‘పెద్దయ్య’’కు పెద్ద కొడుకు చనిపోవడంతో ఆ కర్మకాండల కోసం గూడెం గూడెం తిరిగి బంధువులకు కబుర్లు చెప్పుకొని అందరినీ పిలుచుకుంటాడు, కానీ మతం మారిన చిన్నకొడుకు తన అన్నకు కర్మకాండ తను మారిన కొత్త మతం ప్రకారం జరిపించడం చూసి ‘శిలువ బరువు’ భారం భరించలేక శోకసముద్రం గుండెల్లో దాచుకున్న పెద్దయ్య మానసిక స్థితి, గిరిజన సంప్రదాయాలను కమ్మేస్తున్న అన్యమత మేఘాలవల్ల పొంచి ఉన్న ప్రమాదపు హెచ్చరికలు రచయిత్రి ఈకథ ద్వారా అందించారు. కథల్లోని వాక్య నిర్మాణం, జాతీయాలు,సామెతలు,పలుకు బళ్ళు,అలం కారాలు,అన్ని అచ్చమైన అడవి బిడ్డల సాంప్ర దాయ వాతావరణంతో చూపించడం రచయి త్రికి అడవిబిడ్డలకు గల అనుబంధాన్ని తేట తెల్లచేస్తుంది. – డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)

భాషా పితామహుడుగా రిషి రాజ్‌పాటిల్‌

కేంబ్రిడ్జ్‌లోని భారతీయ విద్యార్థి 2,500ఏళ్ల నాటి సంస్కృత పజిల్‌ను పరిష్కరించాడు.27 ఏళ్ల రిషి అతుల్‌ రాజ్‌పోపట్‌, సుమారు రెండున్నర వేల సంవత్సరాల నాటి ప్రాచీన సంస్కృత భాషలో మాస్టర్‌ అయిన సంస్కృత భాషా మాస్టర్‌ పాణిని రాసిన వచనాన్ని డీకోడ్‌ చేసినట్లు నివేదించ బడిరది. కేంబ్రిడ్జ్‌ లోని సెయింట్‌ జాన్స్‌ కాలేజ్‌ లోని ఆసియన్‌, మిడిల్‌ ఈస్టర్న్‌ స్టడీస్‌ ఫ్యాకల్టీలో పీహెచ్‌డీ విద్యార్థి రిషి రాజ్‌పోపట్‌. 2500 ఏళ్ల నాటి సంస్కృత సమస్యకు..భారతీయ విద్యార్థి పరిష్కారించడం అందరూ సంతోషించాల్సిన విషయం.- రెబ్బాప్రగడ రవి
మలివేద కాలంలో..ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే తొలిభాషా పితామహుడిగా పేరొందిన సంస్కృత పండితుడు పాణిని రాసిన‘అష్టాధ్యాయి’ వ్యాకరణ గ్రంథంలోని ధాతు నియమాల(మెటా రూల్స్‌)ను ఇంతకాలం తప్పుగా అర్థం చేసుకు న్నారా?పాణిని వ్యాకరణంపై తొలిసారిగా భాష్యం రాసిన కాత్యాయనుడు కొన్నినిబంధనలను తప్పుగా అర్థం చేసుకోవడంవల్ల..అదే సంప్ర దాయం కొనసాగిందా?ఈప్రశ్నలకు కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో సంస్కృతంపై పీహెచ్‌డీ చేస్తున్న 27 ఏళ్ల భారత విద్యార్థి రిషిరాజ్‌ పోపట్‌ అవునని చెబుతున్నారు. క్రీ.పూ.4-5శతాబ్దాల మధ్యకాలంలో భారత వాయవ్యం(ప్రస్తుతం పాక్‌-అఫ్ఘానిస్థాన్‌ల మధ్య ప్రాంతం)లో పాణిని నివసించాడనడానికి ఆధారాలున్నాయి. సంస్కృతంపై ఆయన రాసిన ‘అష్టాధ్యాయి’ లోని వ్యాకరణ సూత్రాలు నేటికీ కొనసాగుతున్నాయి.‘‘అష్టాధ్యాయిని ఇంత కాలం మన పండితులు సరిగ్గాఅర్థం చేసుకోలేదు. ఆయన రాసిన ఎనిమిది అధ్యాయాల వ్యాకరణ పుస్తకంలో 4,000 నిబంధనలున్నాయి. పదాలను అర్థం చేసుకోవడం,కొత్తపదాల సృష్టి, విశేష ణాలు,విభక్తుల ప్రాధాన్యం.. ఇలా పలు అంశాలను ఈ నిబంధనలు స్పృశిస్తున్నాయి.గడిచిన 2,500 ఏళ్లుగా మన వాళ్లు ఈ నిబంధనలను తప్పుగా అర్థం చేసుకుని,వివరణలు ఇచ్చారు’’అని రిషి రాజ్‌పోపట్‌ వ్యాఖ్యానించారు. ‘పాణిని బోధించిన మెటారూల్‌ ప్రకారం..సమాన ప్రాముఖ్యం కలిగిన రెండు సూత్రాల మధ్య వైరుధ్యం ఏర్పడితే..వ్యాకరణ క్రమంలో వచ్చే తర్వాతి సూత్రం వర్తిస్తుందని ఇప్పటి వరకూ పండితులు భావించారు. ఈనిబంధన వ్యాకరణకోణం నుంచి తప్పుడు ఫలితాలను ఇస్తుండటంతో గందరగోళం నెలకొంది. పదానికి ఇరువైపులా వర్తించే నియమాల గురించి చెప్పడమే పాణిని ఉద్దేశం.పాఠకుడు కుడివైపు నియమాన్ని ఎంచుకోవాలన్నది ఆయన అభిప్రాయం.అష్టాధ్యాయిలోని 1.4.2 నిబం ధన(విప్రతిశేధే పరం కార్యం)ను అర్థం చేసుకుంటే ఈ విషయం తెలుస్తుంది’’ అనిరాజ్‌పోపట్‌ వాదించారు.ప్రాథమిక శబ్దాల నుంచి నూతన పదాలు, వాక్యాలను రూపొం దించడానికి అవసరమైన నిబంధనలను పాణిని తన ‘అష్టాధ్యాయి’లో చక్కగా వివరించారని పేర్కొన్నారు. పాణిని అల్గారిథమ్‌ను సరిగ్గా అర్థం చేసుకుని,కంప్యూటర్‌ప్రోగ్రామ్‌ను రూపొందిస్తే..సంస్కృతం నుంచి ఇతరభాషల తర్జుమా కూడా సులభమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు మరో రెండున్నరేళ్లు పనిచేయాల్సి ఉంటుందన్నారు. రాజ్‌పోపట్‌ పరిశోధనకు గైడ్‌(మార్గనిర్దేశకుడు)గా ఉన్న విన్సెంజో వెర్జియాని కూడా ఈకృషిపట్ల అభినందనలు తెలిపారు.శతాబ్దాలుగా ఎందరో పండితులు పరిష్కరించలేని సమస్యకు రాజ్‌పోపట్‌ మార్గ దర్శకుడయ్యారని, ఈపరిశోధనతో మరింత మంది సంస్కృత భాషపై ఆసక్తిచూపుతారని అభిప్రాయపడ్డారు.

రిజర్వేషన్ల విధానంలో కొత్త పోకడలు

ప్రస్తుత రాజకీయ వాతావరణంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల ప్రభుత్వాలు రిజర్వేషన్ల పరిధిని విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో మునుపున్న షెడ్యూల్ద్‌ కులాల (ఎస్‌.సి.), షెడ్యూల్డు తరగతుల (ఎస్‌.టి.) జాబితాలో కొత్త వర్గాలను చేరు స్తున్నాయి. ఇలా విస్తరించడానికి ఆర్థిక వెనుకబాటు తనాన్ని కారణంగా చూపుతున్నాయి. ఆర్థిక వెనుక బాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించేటట్టయితే అంతకనా వెనుకబడి ఉన్న సామాజిక వర్గాలను విస్మరించినట్టు అవుతుంది. లేవనెత్తవలసిన ప్రశ్న ఏమిటంటే 10 శాతం, 13 శాతం కులాలకు ఎందుకు పరిమితం చేయాలి. ఈ సూత్రం ద్వారా ప్రభుత్వాలు ఆర్థికంగా అత్యంత వెనుకబడిన వర్గాల ప్రాతిపదికగా రిజర్వేషన్ల గురించి ఆలోచిస్తాయి. కొత్త రిజర్వేషన్ల విధానంలో ఈ ప్రశ్నకు సమాధానం దొరకవచ్చు. ఇలాంటి రాజకీయాలవల్ల ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మైనారిటీలు ఓటర్లుగా అంత ఆకర్షణీ యంగా కనిపించక పోవచ్చు.
కొత్త రిజర్వేషన్ల విధానంతో మరో సమస్య కూడా ఉంది.ఈ పద్ధతి రాజ్యాంగ నిర్మా తల దృష్టిలో ఉన్న ‘‘పురోగమన’’ అంశాన్ని గమ నంలో ఉంచుకోదు. షెడ్యూల్డ్‌ జాబితాలో ఉన్న వారికి అవకాశాలు కలిగించడంలో ఉన్న ఇబ్బం దిని దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగ నిర్మాతలు రిజర్వేషన్ల విధానాన్ని రూపొందించారు. ఈ కార ణంవల్లే మన దేశంలో అమెరికాలోఉన్న సాను కూల చర్య పద్ధతి కాకుండా రిజర్వేషన్‌ పద్ధతి అనుసరించారు.ఇది మొదట్లో అవకాశాలు కల్పిం చడానికి ఉద్దేశించింది. దీనివల్ల ఫలితం ఉండా లనుకున్నారు. సానుకూల చర్యవల్ల నిర్దిష్ట ఫలితం ఉంటుందన్న నమ్మకం లేదు.కొత్త రిజర్వేషన్ల విధా నంవల్ల సామాజికంగా వెనుకబడిన కులాల వారికి ప్రాతినిధ్యం అన్న సూత్రం మరుగున పడవచ్చు. ఎంపిక చేసే వారు, పోటీ పడే వారు ఒక సామాజిక నేపథ్యానికి చెందినవారు కావచ్చు. అలాంటప్పుడు ఎంపిక చేసే వారు నియామకాలు చేసేటప్పుడు మరింత నైరూప్య ప్రమాణాలను పాటిస్తారా? లేదా అగ్రవర్ణాలలో ఉప కులాలను దృష్టిలో ఉంచు కుంటారా? కొత్త విధానంవల్ల అయినా, మునుపటి విధానంవల్ల అయినా లబ్ధి పొందే వారు ప్రభుత్వ రంగానికే పరిమితం అవుతారు. అందువల్ల ప్రై వేటు రంగంలో అవకాశం ఉండదు. ప్రైవేటు రంగం రిజర్వేషన్ల పరిధికి దూరంగానే ఉండిపో తుంది.అందువల్ల రిజర్వేషన్లు వర్తించే వారు ప్రభు త్వ ఉద్యోగాల మీదే ఆధారపడాలి. అయితే నిర్దిష్ట కులం దృష్టితో చూసినప్పుడు సిద్ధాంత రీత్యా కోటా విధానాన్ని విస్తరించినందువల్ల ఫలితం ఉండ వచ్చు. అగ్ర కులాల వారికి, దళితులు కాని వారికి, వెనుకబడిన తరగతులకు చెందని వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయవచ్చు. ఈ పద్ధతివల్ల అంతర్గతంగానూ, బహిర్గతంగానూ కొందరిని వదిలివేయడానికి అవకాశం ఉంటుంది. ఉన్న అవకాశాలను పోటీ తత్వంతో రిజర్వేషన్ల ద్వారా అందుకోవాలంటే ఎస్‌.సి.,ఎస్‌.టి.ల విష యంలో జరిగినట్టు అంతర్గతతేడాలకు దారి తీస్తుం ది.దీనివల్ల కులచైతన్యాన్ని వదిలి వ్యక్తులుగా నిల బడే వీలుంటుందని వాదించే వారూ ఉంటారు. వ్యక్తులుగా నిలబడితే కులం ప్రాతిపదికగా కాకుం డా సత్తా ఆధారంగా నిలబడే అవకాశం ఉంటుం దనే వారూ ఉన్నారు. కుల చైతన్యం నుంచి బయ టపడి కులప్రాతిపదిక మీదఉన్న సామాజిక నైతిక తను అంతం చేసే వీలుంటుంది. అంటే వ్యక్తులు ఆధునిక విధానాల ఆధారంగా పోటీ పడతారు.ఇది అమాతం జరిగిపోదు. ఆధునికత విసిరే సవాళ్లను ఎదుర్కోలేనప్పుడు కులం మీద ఆధారపడే పరిస్థితి రావచ్చు. మరో వేపున న్యాయాన్ని విస్తరించడం అంటే రిజర్వేషన్ల వల్ల లభ్ది పొందుతున్నారనే మచ్చ రూపు మాపే అవకాశం కూడా ఉంటుంది. అలాం టప్పుడు సామాజిక న్యాయం,దళితులు అన్న మాట లను ఒకసారి ఒకఅర్థంలో మరోసారి మరో అర్థం లో వాడతాయి. కొత్త కోటా విధానం వచ్చే లోపల రిజర్వేషన్లను వ్యతిరేకించే వారు సామాజిక న్యాయం అన్న పదానికి పెడార్థం తీస్తారు.ఈపదాన్ని దళి తులను ఉద్దేశించి వాడే అలవాటు ఉంది. కొత్త కోటా విధానం సామాజిక న్యాయాన్ని సమానత్వ దృష్టితో చూడడానికి అవకాశం ఇవ్వాలి. అప్పుడే సామాజిక న్యాయం అన్న భావన సర్వజనామోదం పొందుతుంది. దళితులు, ఆదివాసుల విషయంలో లాగా సామాజిక న్యాయాన్ని చులకన భావంతో చూసే వీలుండదు. సమానత్వం అన్న భావన బల హీనంగా ఉన్న సామాజిక సంబంధాలను పటి ష్ఠంచేస్తాయి.
ఆర్థికంగా వెనకబడిన తరగతులకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించిన 103వరాజ్యాంగ సవ రణచట్ట బద్ధమేనని అయిదుగురు సభ్యుల సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. రాజ్యాంగ సవరణను సమర్ధిస్తూ ముగ్గురు, వ్యతిరేకిస్తూ ఇద్దరు న్యాయమూర్తులు విభజన తీర్పు చెప్పడంతో చర్చనీ యాంశమైంది. రిజర్వేషన్ల నిర్ణయానికి ఆర్థిక కొల బద్దను వినియోగించడం న్యాయ సమ్మతమేనన్న విషయంలో న్యాయమూర్తులందరూ ఏకీభావం వ్యక్తంజేశారు. కానీ ఇద్దరు న్యాయమూర్తులు ఇతర అంశాల ప్రాతిపదికన రాజ్యాంగ సవరణ న్యాయ బద్ధతను తిరస్కరించారు. సుప్రీంకోర్టు తీర్పు ఒక వివాదాన్ని పరిష్కరిస్తూ మరికొన్ని వివాదాలకు తెర లేపుతున్నదని తనఆందోళనను వ్యక్తంజేస్తూనే ఇ.డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్లను సమర్ధిస్తూ ఇచ్చిన తీర్పు ను భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆహ్వా నించింది. ఆర్థికంగా వెనకబడిన తరగతులకు కొంత శాతం రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ విషయా లలో ఇవ్వాలని సిపిఐ(ఎం)చాలాకాలం నుండి చెప్తున్నది. బీహార్‌లో కర్పూరీ ఠాకూర్‌ ప్రభుత్వం 1978లో ఆర్థికంగా వెనకబడిన తరగతులకు 6శా తం రిజర్వేషన్లు కల్పించినపుడు సిపిఐ(ఎం) సమ ర్ధించింది. అదే వైఖరికి అనుగుణంగా పార్లమెం టులో 103వ రాజ్యాంగ సవరణను సమర్ధించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన మెజారిటీ తీర్పును కూడా ఆహ్వానించింది.సిపిఐ(ఎం) మూడు అంశాల ప్రాతి పదికగా ఇ.డబ్య్లు.ఎస్‌ రిజర్వేషన్లను సమర్ధిస్తున్నది. మొదటిది, సామాజిక, విద్యా విషయక, సాంస్కృతిక, ఆర్థిక వెనకబాటుతనాలను అవినాభావ సంబంధంగల అంశాలుగా పరిగణిం చాలి. అవి పరస్పరం ప్రభావం జేయగల, ప్రభావి తం కాగల అంశాలు. అందువలన రిజర్వేషన్లను నిర్ణయించేటప్పుడు, అమలు చేసేటపుడు, అఫర్మేటివ్‌ యాక్షన్‌ కార్యక్రమాలను తీసుకునేప్పుడు ఆర్థిక అంశాన్ని విస్మరించడం ఆయా తరగతులలో నిజ మైన అర్హులకు అన్యాయం చేస్తుంది. మన దేశంలో సామాజిక ఆర్థిక అణచివేతకు మూలంగా కుల వ్యవస్థ ఉన్నందున సామాజిక అంశానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. దానర్ధం ఇతర అంశాలకు ముఖ్యంగా ఆర్థిక అంశాన్ని విస్మరించమని కాదు. అలావిస్మరిస్తే మొదటికే మోసం వస్తుంది. రెండ వది,రిజర్వేషన్ల పరిధిలోకిరాని తరగతులలో అత్య ధికులు ఆర్థికంగా వెనకబడినవారున్నారు. పెట్టు బడిదారీ విధానం దేశంలో విస్తరించేకొలదీ వీరి సంఖ్య పెరుగుతున్నది. వారి పరిస్థితి దుర్భరం అవుతున్నది. ఈ తరగతులలోని యువకులకు విద్యా ఉద్యోగాలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. తమ దుస్థితికి ఇతరులకు రిజర్వేషన్లు ఉండడం, లేక తమకు లేకపోవడమేనన్న అపోహలకు గురవు తున్నారు.పాలకవర్గాలు,వారి మీడియా ఈ అపోహ లను పెంచు తున్నాయి. పర్యవసానంగా రిజర్వేషన్‌ వ్యతిరేక భావనలురోజురోజుకీ తీవ్రమవుతు న్నాయి. ఈ మానసిక స్థితి రిజర్వేషన్‌ వ్యతిరేక ఉద్యమాల ద్వారా గతంలో వెల్లడవడం చూశాము. మండల్‌ కమిషన్‌ సిఫార్సుల అమలుకు పూనుకున్నపుడు, రిజర్వేషన్లు లేని తరగతుల లోని పేద, మధ్య తరగతి ప్రజలను రెచ్చగొట్టి పాలకవర్గాలు రిజర్వే షన్‌ వ్యతిరేక ఉద్యమాన్ని ఉసిగొల్పాయి. రిజర్వేష న్లను తొలగించాలనే స్వార్థపర శక్తులకు (వెస్టెడ్‌ ఇంటరెస్ట్స్‌కు) అవకాశం లేకుండా ఆర్థికంగా వెనక బడిన తరగతులలో రిజర్వేషన్‌ విధానానికి సాను కూలత సాధించాలంటే వారికి కూడా కొంత రిజ ర్వేషన్‌ కల్పించడం అవసరం. లేనియెడల రిజర్వే షన్లకే ప్రమాదం వస్తుంది. మూడవది, సమసమాజ సాధనలో పీడిత వర్గాల ఐక్యత కు ఎంతో ప్రాధా న్యత ఉంది. కార్మికులు, ఉద్యోగుల్లో రిజర్వే షన్‌ అంశం విభేదాలను, విభజనను సృష్టిస్తున్న సంద ర్భంలో దాన్ని అధిగమించి వర్గ ఐక్యతను సాధించా లంటే ప్రస్తుత రిజర్వేషన్‌ పరిధిలోకి రాని తరగతు లకు ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లను ఇవ్వడం ద్వారా సామాజిక విభజన వలన ఏర్పడే అనైక్యత ను కొంతవరకు నిరోధించే అవకాశం ఉంది. విధానపరమైన అంశంతోపాటు, రిజర్వేషన్ల పట్ల సానుకూల వాతావరణం ఏర్పర్చడానికి, వర్గ ఐక్య తను బలపర్చుకోవడానికి ఆర్థికంగా వెనకబడిన తరగతులకు కూడా రిజర్వేషన్లను కల్పించడం అవ సరం అన్నది సిపిఐ(ఎం) అభిప్రాయం. కొంత మంది రిజర్వేషన్లకు ఆర్థిక కొలబద్దను ప్రాతిపది కగా తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాం గంలో సామాజిక విద్యా విషయక వెనకబాటు తనాన్ని మాత్రమే కొలమానంగా తీసుకోవాలని ఉంది తప్ప ఆర్థిక వెనకబాటుతనం గురించి ప్రస్తా వన లేదని, అందువలన ఇ.డబ్ల్యు.ఎస్‌కు రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధం కాదని వాదిస్తున్నారు. ఈ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆర్థిక న్యాయాన్ని అందించడం కూడా రాజ్యాంగ లక్ష్యమని, అందులో భాగంగా ఆర్థికంగా వెనకబడిన తరగతులకు రిజ ర్వేషన్లు ఇవ్వడం న్యాయమేనని కోర్టు అభిప్రా యపడిరది.ఇ.డబ్ల్యు.ఎస్‌తరగతులను ఇతర సంక్షేమ కార్యక్రమాల ద్వారా అభివృద్ధి చేయవచ్చు గదా, రిజర్వేషన్ల అవసరమేమిటని ఇంకో వాదన ఉంది. ఇప్పుడు రిజర్వేషన్లు అనుభవిస్తున్న సామాజిక తరగతులకు కూడా ఇతర సంక్షేమ కార్యక్రమాలు జమిలిగా అమలవుతున్నాయి. అలా అయినపుడు సామాజిక తరగతుల ప్రయోజనాలకు ఇబ్బంది కలగకుండా ఇ.డబ్లు.ఎస్‌ తరగతులకు రిజర్వేషన్లు అమలుజేయడాన్ని వ్యతిరేకించడంలో ఔచిత్యం కన్పించదు. రిజర్వేషన్లనేవి సామాజిక అంశానికి వర్తిస్తాయి తప్ప ఆర్థికఅంశానికి విస్తరించడం అంటే రిజర్వేషన్‌ స్వభావానికే విరుద్ధం అనే వాదన కూడా ఉంది. ఇతర దేశాల అనుభవాలు, మన దేశంలో రిజర్వేషన్లు పరిణామం చెందిన తీరు చూస్తే ఈ వాదన నిలబడదు. రిజర్వేషన్లు ఆయా దేశాల పరిస్థితులను బట్టి,అవసరాలను బట్టి అమల య్యాయి. మలేషియాలో మెజారిటీ మలే జాతి ఆర్థిక వెనకబాటుతనం రిజర్వేషన్‌కు ప్రాతిపదికగా ఉంది. అమెరికాలో మూలవాసి అమెరికన్ల కోసం కొన్ని ప్రాంతాలను రిజర్వేషన్లుగా ప్రకటించారు. ఇక్కడ ప్రదేశం రిజర్వేషన్‌గా ఉంది.విద్యా ఉద్యో గాలలో మన లాగా కోటా పద్ధతి కాకుండా, న్యాయ వ్యవస్థ ద్వారా అమలు సాధ్యంగాని నిర్ణీత లక్ష్యాల ద్వారా వైవిధ్యాన్ని సాధించే పద్ధతులలో అఫర్మేటివ్‌ యాక్షన్‌ అమలవుతున్నది. ఐర్లండ్‌ రిజర్వేషన్లకు మత ప్రాతిపదిక ఉన్నది.
మన దేశంలో రిజర్వేషన్‌ విధానం పరి ణామం చూసినా, సామాజిక అంశంతోపాటు అనేక ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకు న్నట్టు విదితమవుతుంది. బ్రిటిష్‌ వలస పాలకులు తమ విభజించు పాలించు విధానంలో భాగంగా 1909లో మత ప్రాతిపదికగా ప్రాతినిధ్య సంస్థల్లో రిజర్వేషన్‌ ప్రవేశపెట్టారు.బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాల ప్రభావంతో కొన్ని సంస్థానాలలో 20వ శతాబ్దం ప్రారంభంలో(ట్రావన్‌కోర్‌,బరోడా వగైరా) బ్రాహ్మణేతరులకు ప్రభుత్వ ఉద్యోగాలలో కొంత రిజర్వేషన్లు కల్పించారు.1921లో మద్రాస్‌ ప్రెసి డెన్సీలో జస్టిస్‌ పార్టీ బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్లు అమలుచేసింది.ఈరిజర్వేషన్లు ప్రధానంగా జమీం దార్లు,భూస్వాములు బలంగాఉన్న శూద్రకులాలకు ఉద్దేశించబడ్డాయి.అస్పృస్యతకు గురవుతున్న షెడ్యూ ల్డ్‌ కులాలకు డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ నిర్విరామ ఆందోళన,కృషి ఫలితంగా మొదటి సారి గా1935లో ప్రాతినిధ్య సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చా యి.స్వాతంత్య్రం వచ్చిన తర్వాతగానీ షెడ్యూ ల్డ్‌ తెగలకు రిజర్వేషన్లు కల్పించబడలేదు. షెడ్యూల్డ్‌ తెగలలో కుల వ్యవస్థ, అస్పృశ్యత లేకపోయినా సాంస్కృతిక, విద్య, ఆర్థిక వెనకబాటు ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించబడ్డాయి.అప్పుడు కూడా వెనక బడిన కులాల అభివృద్ధి విషయం రాష్ట్రాలకు వదిలి వేయబడిరది.వర్ణ వ్యవస్థ లోని సామాజిక అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ కులాలన్నీ రిజర్వే షన్లకు అర్హులు. ఈ అంశాన్నిబట్టే అనేక ఆధిపత్య శూద్రకులాలు బి.సిజాబితాలో చేర్చబడి రిజర్వే షన్లు అనుభవిస్తున్నాయి. ఇంకాఅనేక కులాలు అటు వంటి డిమాండ్‌తో ఆందోళన చేస్తున్నాయి. కానీ వర్ణ వ్యవస్థలో సామాజికంగా అగ్రవర్ణాల కన్నా దిగువస్థాయిగా పరిగణించబడే శూద్ర కులా లన్నీ ఒకే మోస్తరుగా వెనకబడిలేవు.వాటిల్లో కొన్ని గ్రామీ ణ సమాజంలో ఆధిపత్యం వహిస్తున్నాయి. స్వాతం త్య్రానంతరం ఈ కులాల్లో ధనాఢ్య వర్గాలు అభివృ ద్ధి అయ్యాయి. ఈ తరగతులలోని నిజమైన అర్హులకు మాత్రమే రిజర్వేషన్‌ ప్రయోజనం అందాలంటే ఆర్థిక కొలబద్దను వినియోగించడం తప్ప మార్గం లేదు. అందుకే బిసి తరగతులకు క్రీమీలేయర్‌ను మినహాయిస్తూ ఆర్థిక పరిమితి విధించబడిరది.
సామాజిక అంశాన్ని రిజర్వేషన్లకు ఏకైక కొలబద్దగా ఉంచాలనేవారు సామాజిక వెనకబాటు తనం అన్ని కులాలకు, తరగతులకు ఏకరూపంగా ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేస్తుంటారు. సామా జిక పీడన అసలైన రూపం అస్పృశ్యత, అంటరాని తనం. ఇది దళితులకు మిగతా అందరికీ మధ్య ఉన్న సామాజిక అగాధం.దళితులు ఎదుర్కొం టున్న సామాజిక దుస్థితికి, ఇతరులు ఎదుర్కొనే సామాజిక వెనకబాటుతనానికి పోలిక లేదు. అలాగే సేవాకులాలకు మిగిలిన శూద్రకులాలకు, ముఖ్యం గా వ్యవసాయ కులాలకు మధ్య ఉండే సామాజిక వ్యత్యాసం అనేక రూపాలలో కొట్టొచ్చినట్లు కనపడు తుంది. చాలా సందర్భాలలో శూద్ర కులాలలోని ఆధిపత్య కులాలు సామాజిక వివక్ష పాటింపులో ముందుంటున్న స్థితిచూస్తున్నాం.అగ్రకులాల్లో సైతం ఉపశాఖల మధ్య సామాజిక తారతమ్యాలు,హోదా వ్యత్యాసాలు ఉంటున్నాయి. అందుకే కుల వ్యవస్థను డాక్టర్‌ అంబేద్కర్‌ నిచ్చెన మెట్లతో పోల్చారు. వైవిధ్య రూపాలలో కొనసాగుతున్న సామాజిక వివక్షపై పోరాడాలంటే అందరికీ ఒకే కొలబద్దలు సరిపోవు. దేశంలో ప్రస్తుతం సామాజిక బృందాలపై ఆధార పడిన వర్టికల్‌ రిజర్వేషన్లతో పాటు, ఇతర అంశా లను పరిగణనలోకి తీసుకున్న సమాంతర రిజర్వే షన్లు కూడా అమలవుతున్నాయి.మహిళలు, విక లాంగులు, క్రీడాకారులు, మాజీ సైనికోద్యోగులు, వెనకబడిన ప్రాంతాలు, స్థానికులు-స్థానికేతరులు వగైరా రిజర్వేషన్లుకూడా అమలవుతున్నాయి. రిజర్వే షన్ల వర్తింపునకు సామాజిక అంశంతో పాటు అనేక అంశాలను పరిగణిస్తున్నారన్నది గమనించ వచ్చు. అందుకే ఈ సమస్యపట్ల ఒక సమగ్ర దృక్పథం అవసరం.
ఇ.డబ్యూ.ఎస్‌.రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దం
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ముం దుకు వచ్చిన మరికొన్ని వివాదాలను పరిశీలించాలి. ‘ఆర్థిక కొలబద్ద’సమంజసత్వంపై సుప్రీంకోర్టు ధర్మాసనంలోని మెజారిటీతో ఏకీభవిస్తూనే,10 శాతం ఇ.డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్‌ 50శాతం పరి మితిని దాటుతున్నందున అది న్యాయబద్ధం కాదని ఇద్దరు న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ అభిప్రా యాన్ని తిరస్కరిస్తూ మెజారిటీ తీర్పు 50శాతం పరిమితి అనుల్లంఘనీయమైనదేమీ కాదని కొట్టి పారేసింది.ఈవ్యాఖ్యానం1992లో ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు విధించిన పరిమితిని వివా దాస్పదం జేసింది.సిపిఐ(ఎం)తో పాటు అనేక ఇతర శక్తులు50శాతం సీలింగును తొలగించాలని, అప్పు డే రిజర్వేషన్లకు అర్హులైన ఇతర తరగ తులను ఆ పరిధిలోకి తీసుకురావచ్చని వాదిస్తూ వస్తున్నాయి. తీర్పు ఈ వాదనలను బలపరుస్తున్నది. మండల్‌ కమిషన్‌ సిఫార్సులు అమలయినప్పుడు ఓబిసి రిజర్వేషన్లు 27శాతంగా నిర్ణయించడానికి 50శాతం పరిమితి తప్ప వేరే కొలబద్దేమీ లేదు. ఇప్పుడు 50శాతం పరిమితి అనుల్లంఘనీయం కానప్పుడు ఓబిసిలకు, ఎస్‌సి, ఎస్‌టిల వలే జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు పెంచేందుకు అవస రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఓబిసి జనాభా నిష్పత్తిని నిర్ణయించేందుకు సరైన లెక్కలు ప్రస్తుతం లేవు. ఉజ్జాయింపుగా లెక్క వేయ డానికి బ్రిటిష్‌వారు నిర్వహించిన 1931సెన్సస్‌ వివరాలను వినియోగించుకుంటున్నారు.ఈ సమా చార లేమిని సరిజేసేందుకు అందరూ కోరుతు న్నట్లుగా జనగణన సందర్భంగా ఎస్‌సి, ఎస్‌టితో పాటు అన్ని కులాల గణన చేయడం అవసరం. అప్పుడే కొన్ని వివాదాలు సక్రమంగా పరిష్కారం అవుతాయి. ప్రభుత్వం ఈవిషయంలో సత్వరం నిర్ణయం తీసుకోవాలి. ధర్మాసనం10శాతం ఇ. డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్‌ను వర్తింపజేసిన తీరు కూడా వివాదాస్పదం అయింది. ఇ.డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్‌ ఇప్పటివరకు రిజర్వేషన్‌ అనుభవించని తరగతులకు (నాన్‌ రిజర్వుడ్‌ కేటగిరీకి) మాత్రమే వర్తిస్తుందని ధర్మాసనం పేర్కొన్నది. అంటే ఈ పది శాతానికి ఎస్‌సి,ఎస్‌టి,బిసిలోని పేదలను అనర్హులను చేయడం ద్వారా ఇంతకుముందు ఉన్న50శాతంలో పోటీపడే అవకాశాన్ని 40 శాతానికి కుదించినట్లయింది. 10శాతం ఇ.డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్‌ను జనరల్‌ కేటగిరీగా భావించి దానికి అన్ని తరగతులలోని పేదలను అర్హులుగా చేయడంద్వారా లోపాన్ని సరి దిద్దాల్సి ఉంది. లేనియెడల ఎస్‌సి,ఎస్‌టి,బిసి పేదలు గతంలోఉన్న సౌకర్యాన్నికోల్పోతారు. అంతే కాక ఇ.డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్లు10శాతం ఉండాలని ఏకొలబద్ద ప్రకారం నిర్ణయించారన్న విమర్శకు తావు లేకుండా పోతుంది.ఇ.డబ్ల్యు.ఎస్‌ రిజర్వే షన్లకు అర్హత నిర్ణయించేందుకు ప్రభుత్వం ప్రతి పాదించిన ఆర్థిక పరిమితి, మంచి చెడుల జోలికి సుప్రీంకోర్టు పోలేదు. ప్రభుత్వం నిర్దేశించిన 8 లక్షల రూపాయల ఆదాయం, ఐదెకరాల భూమి, వెయ్యి అడుగుల ఇల్లు, వంద గజాల స్థలం పరిమితి సంపన్నులను కూడా రిజర్వేషన్లకు అర్హులను చేస్తున్నది. నిరుపేదలు మాత్రమే అర్హులయ్యే పద్ధతి లో ఆర్థిక పరిమితిని తిరిగి నిర్ణయించకపోతే ఇ. డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్ల లక్ష్యం పూర్తిగా దెబ్బతిం టుంది.ఈ వివాదాస్పద అంశాలన్నింటినీ పరిష్క రించి అమలు చేయకపోతే వివాదాలు అనంతంగా కొనసాగుతూనే ఉంటాయి. ధర్మాసనంలోని ఒక న్యాయమూర్తి జస్టిస్‌ దారువాలా రిజర్వేషన్ల విధా నాన్ని సమీక్షించాలన్న అభిప్రాయాన్ని వెల్లడిరచారు. ఇటువంటి వాదన కోర్టు బయట అనేకమంది వివిధ సందర్భాలలో గతంనుండి వ్యక్తంచేస్తున్నారు. ఆర్‌ఎ స్‌ఎస్‌ అధినేత గతంలో బహిరంగంగానే ఈ అం శాన్ని ప్రస్తావించారు. క్రమేణా కొన్ని తరగతులలో, మీడియాలో రిజర్వేషన్‌ వ్యతిరేక ధోరణి ప్రబలు తుందనడానికి ఇదొక నిదర్శనం. దేశానికి స్వాతం త్య్రం వచ్చిన మొదటి నాలుగు దశాబ్దాలలో ప్రభుత్వ రంగం విస్తరించి,పాలనా వ్యవస్థ పెరిగింది. దీని మూలంగా రిజర్వేషన్ల వలన విద్యా, వైద్య, ప్రజా ప్రాతినిధ్య రంగాలలోకి కొన్ని కుటుంబాలు అభి వృద్ధి కావడానికి తోడ్పడిరది. కానీ అత్యధికులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. గత నాలుగు దశాబ్దా లలో వచ్చిన విధాన మార్పులతో ఉన్న పరిమిత రిజర్వేషన్‌ సౌకర్యం కూడా నిరుపయోగం అవు తున్నది. ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, యాంత్రీ కరణ మూలంగా విద్య, వైద్యం, ఉపాధి రంగా లలో రిజర్వేషన్లు అమలుకు నోచుకోవడంలేదు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టడానికి పాలక వర్గాలు,కార్పొరేట్లు సుముఖంగా లేవు. ఇటు వంటి పరిస్థితుల్లో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్‌ను ప్రవేశ పెట్టడంతోపాటు,వాటిని విస్తరించి పటిష్టం గా అమలుచేయడం అవసరం. మన దేశంలో రిజర్వేషన్‌ అవసరం తీరిపోయిందని అనుకోవడం తప్పు. పెట్టుబడిదారీ వ్యవస్థ కొనసాగినంత కాలం రిజర్వేషన్‌ అవసరం తీరిపోదు. ఈ పరిమిత సదు పాయాన్ని కొనసాగిస్తూనే రిజర్వేషన్లు అవసరం లేని సమసమాజ స్థాపనకు సాగిపోవాలి.వ్యాసకర్త : సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు,(ప్రజాశక్తి సౌజన్యంతో..)

విశాఖలో ప్రాణాలు తీస్తున్న ఫార్మా కంపెనీలు

విశాఖ ఫార్మా పరిశ్రమలు ప్రజల పాలిట శాపంగామారుతున్నాయి. వరస ప్రమా దాలు జరగడం, కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం పరిపాటిగా మారింది. ఏటా లాభాల లెక్కలు వేసుకుంటున్న కంపెనీలు… ప్రాణాలు కోల్పోతున్న కార్మికుల సంఖ్య పెరిగి పోతున్నా సరే ఖాతరు చేయడం లేదు. యాజ మాన్యాలు భద్రతా ప్రమాణాలను తుంగలోకి తొక్కుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. పరిశ్రమల్లో భద్రతా లోపాలు కార్మికుల ప్రాణాలను బలిగొంటున్నాయి. అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మా, అచ్యుతాపురం ప్రత్యేక ఆర్ధిక మండలిలోని పలు పరిశ్రమల్లో తరచూ జరుగుతున్న ప్రమాదాలతో కార్మికలోకం వణికిపోతోంది. యాజమాన్యాల నిర్లక్ష్యంతో చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు,పేలుళ్లతో ఉద్యోగులతో పాటు పరిసర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదాలు జరిగి నప్పుడే అధికారులు హంగామా చేస్తున్నారు. తర్వాత పట్టించుకోవడం లేదు. పరవాడ ఫార్మాసిటీలోని లారస్‌ ల్యాబ్స్‌లో డిసెంబర్‌ 19న జరిగిన అగ్ని ప్రమా దంలో నలుగురు మరణించగా,ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈఘటనతో పారిశ్రామిక ప్రాంతమంతా ఉలిక్కిపడిరది. 2022 జనవరి నుంచి డిసెంబర్‌ ఏడాదిలోనే పది ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. సుమారు పదిమంది వరకు మృత్యువాత పడగా అనేక మంది గాయాలకు గురై దివ్యాంగులగా మారారు.-– గునపర్తి సైమన్‌
విశాఖ జిల్లాలో ఫార్మాకంపెనీల్లో తర చూ ప్రమాదాలు జరుగుతున్నాయి.కార్మికుల భద్ర త,రక్షణపై పరిశ్రమల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ప్రాణాధార మందులు తయారుచేసే ఫార్మా పరిశ్రమలు అక్కడ పనిచేసే ఉద్యోగుల, సిబ్బంది ప్రాణాలను తోడేసే మృత్యుకుహరాలుగా మారడం దారుణం. యాజమాన్యాల తప్పి దాలు,డెవలపర్‌గా ఉన్న సంస్థ నిర్లక్ష్యం, తనిఖీ లు నిర్వ హించి ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన పలు విభాగాల అధికార యంత్రాంగం వైఫ ల్యం…వెరసి విలువైన ప్రాణాలను బలిగొంటు న్నాయి. అనకా పల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ లారస్‌ ల్యాబ్స్‌లో తాజా ప్రమాదం నలుగురిని బలిగొనడం,మరొ కరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండటం బాధాకరం. ఇలాంటి ఘటనలు జరిగిన వెంటనే…మృతుల కుటుం బాలకు,క్షతగాత్రులకు నష్ట పరిహారం చెల్లిం చడం,గంభీర ఉపన్యాసాలు చెప్పి చేతులు దులు పుకోవడం ఆయా కంపెనీల యాజమాన్యాలకు, ఉన్నతాధికారులకు,పాలకులకు పరిపాటిగా మారిపోయింది.ఈఏడాదిలోనే ఈఫార్మా సిటీ లో పది ప్రమాదాలు జరిగాయంటేనే నిర్లక్ష్యం ఏ మేరకు మేటలు వేసిందో అర్థం చేసుకోవచ్చు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఇజెడ్‌లో మూడు వేల ఎకరాల్లో ఉన్న ఫార్మా పరిశ్రమల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. పెద్దపెద్ద కొలి మిలతో పనిచేసే పరిశ్రమలకు కూడా…సొం తంగా ఒక్క అగ్ని మాపక వాహనం కూడా లేదంటే భద్రతపై వాటి నిర్లక్ష్యాన్ని అర్థం చేసు కోవచ్చు. పరిశ్రమల్లో భారీ ప్రమాదాలను గుర్తు చేసుకుంటేనే మానవ ప్రాణాలపట్ల ఎంత నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తున్నారో,పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో కళ్లకు కడుతుంది. రెండేళ్ల క్రితం ఎల్‌జి పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి విషవా యువులు లీకై పరిసర ప్రాంతాలకు చెందిన 12 మంది మరణించగా, వందలాదిమంది ఆసుపత్రి పాలైన ఘటనను తలచుకుంటేనే కలవరం కలుగు తుంది. పరవాడ ఫార్మాసిటీ లోనే అజిక బయో ఫోర్‌లో ఐదేళ్ల క్రితం నాటి ప్రమాదంలో ఐదుగు రు,సాయినార్‌ ఫార్మాలో గత ఏడాది మరో ఘటన లో ముగ్గురు బలయ్యారు. సీడ్స్‌ దుస్తుల పరిశ్రమలో విషవాయువులు లీకై 200మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటివరకూ పరవాడ ఫార్మాసిటీ లోని ఔషధ పరిశ్రమల్లో జరిగిన 70 ప్రమాదాల్లో49మంది ప్రాణాలు కోల్పోగా, 93 మంది క్షతగాత్రులయ్యారు.ఈ పరిశ్రమల్లో పని చేస్తున్న ఉద్యోగులతోపాటు పరిసర గ్రామాల ప్రజలు సైతం ఈ ప్రమాదాల పట్ల, లీకవుతున్న విషవాయువులు,వ్యర్థజలాలపట్ల ఆందోళన చెందు తున్నారు.ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది,ఉద్యోగులు సైతం విషవాయువులను పీల్చి అనేక జబ్బులకు గురవుతున్నారు. పరిశ్రమల్లో ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌, బాయిలర్‌ ఇన్‌స్పెక్టర్‌ సంయుక్తంగా తనిఖీలు చేప ట్టాల్సి ఉంది.ఎప్పటికప్పుడు నివేదికలను రూపొం దించి, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్ట్లాలి. ప్రమాదాలు జరిగినప్పుడు హడావిడి చేయడం మినహాయిస్తే… ప్రమాద కారణాలపై నివేదికలను విడుదల చేసిన పరిస్థితి కూడా లేదు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పేరిట ప్రభుత్వ శాఖల నుండి జరగవలసిన తనిఖీలు దాదాపు నిలిపివేశారు. దాంతో కంపెనీల ఇష్టారాజ్యంగా ఉంది. ఫార్మా పరిశ్రమల్లో వినియోగించే హానికరమైన రసాయ నాలపై ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి పూర్తి అవగా హన కల్పించడం, రక్షణ పరికరాలు సమకూర్చడం తదితర చర్యలన్నింటినీ పరిశ్రమలు గాలికొదిలే శాయి. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ రసాయనా లను శుద్ధిచేయడం,పర్యావరణ పరిరక్షణకు, వాతా వరణంలో విషవాయువుల మోతాదును తగ్గించ డానికి గ్రీన్‌ బెల్ట్‌ను ఏర్పాటు చేయడం, రహదారు లను నిర్మించడం…లాంటి చర్యలను డెవలపర్‌గా ఉన్న సంస్థ చేపట్టాలి. పరిశ్రమల నుంచి విడుదల వుతున్న వ్యర్థ రసాయనాలను కొంతమేర శుద్ధి చేయకుండానే సమీపంలోని చెరువుల్లోకి, సముద్రం లోకి విడిచిపెట్టడం వల్ల భూగర్భజలాలు విషతు ల్యమవుతున్నాయని,అర్ధరాత్రి సమయంలో విష వాయువులను విడిచిపెడుతున్నారని ఆరోపణ లొస్తున్నాయి. ఇప్పటికైనా…ఉద్యోగుల, సిబ్బంది ప్రాణాలను కాపాడటం…పరిసరప్రాంతాల వారికి సైతం కాలుష్యం నుంచి ఉపశమనం కలిగిం చేందుకు అవసరమైన అన్ని చర్యలను పరిశ్రమల యాజమాన్యాలు, సెజ్‌ డెవలపర్‌ సంస్థ చేపట్టాలి. చట్టబద్ధంగా, అన్ని ప్రమాణాలను పాటిస్తున్నారో లేదో ప్రభుత్వ అధికారులు తనిఖీ చేసి పర్యవేక్షిం చాలి. కార్మికుల ప్రాణాలకు,ప్రజల జీవనానికి అవసరమైన పర్యావరణాన్ని కాపాడడం ప్రభుత్వ బాధ్యత. అందుకు పటిష్ట చర్యలు చేపట్టాలి.
భద్రతా లోపాలు..కార్మికులే సమిధలు
పరిశ్రమల్లో భద్రతా లోపాలు కార్మి కుల ప్రాణాలను బలిగొంటున్నాయి. అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మా,అచ్యుతాపురం ప్రత్యేక ఆర్ధిక మండలిలోని పలు పరిశ్రమల్లో తరచూ జరుగుతున్న ప్రమాదాలతో కార్మికలోకం వణికిపో తోంది.యాజమాన్యాల నిర్లక్ష్యంతో చోటు చేసుకుం టున్న అగ్ని ప్రమాదాలు,పేలుళ్లతో ఉద్యోగులతో పాటు పరిసర ప్రజలు భయాందోళనకు గురవుతు న్నారు. ప్రమాదాలు జరిగినప్పుడే అధికారులు హంగామా చేస్తున్నారు. తర్వాత పట్టించుకోవడం లేదు. పరవాడ ఫార్మాసిటీలోని లారస్‌ ల్యాబ్స్‌లో డిసెంబర్‌19నజరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు మరణించగా,ఒకరు తీవ్రంగా గాయ పడ్డారు. ఈఘటనతో పారిశ్రామిక ప్రాంతమంతా ఉలిక్కిపడిరది.గతంలో పరవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మా సిటీలోనైనా,హెటిరో ఫార్మా పరిశ్ర మలోనైనా కార్మికుల భద్రతపై యాజమాన్యాలు తగిన శ్రద్ధ తీసుకోవడం లేదు.నక్కపల్లి హెటిరో ఫార్మా కంపెనీలో మొన్నజరిగిన ప్రమాదంలో ఓ కార్మి కుడు మృతి చెందారు. హెటిరో డ్రగ్స్‌ కంపెనీ డీఎం ఎస్‌వో ప్లాంట్‌లో ఇటీవల పేలుడు సంభవిం చింది.భారీగాశబ్ధం రావడంతో కార్మికు లు భయంతో పరుగుతు తీశారు.రియాక్టర్‌ పేలడం తోనే ప్రమాదం జరిగినట్టు కార్మికులు చెబుతు న్నారు.రియాక్టర్లు పేలకుండా ప్రెజర్‌ రిలీఫ్‌ వాల్వ్‌, రప్చర్‌ డిస్క్‌ నియంత్రిస్తాయి. ఈ రెండు సరిగా పనిచేయకపోవడంతోనే రియాక్టర్‌ పేలినట్టు పరి శ్రమలో సిబ్బంది చెబుతున్నారు.రియాక్టర్‌ పేలుడు తో విడుదలైన వాయువులు..కార్మికుల ప్రాణాలను బలిగొంటున్నాయి. సాధారణంగా ప్రమాదకర వాయువులు వెలువడే అవకాశమున్నచోట కార్మికు లకు రెస్పిరేటరీ మాస్క్‌లు ఇవ్వాలి. అయితే కార్మి కులకు రెస్పిరేటరీ మాస్కు లు హెటిరో యాజ మాన్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు విన్పిస్తు న్నాయి. పదేళ్ల కాలంలో హెటిరో పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో తొమ్మిది మంది కార్మికులు మృతిచెందారు. 2013లో ఐదుగురు, 2015, 2016,2020లో,2022ఫిబ్రవరి23న ఒక్కొ క్కరు చొప్పున ప్రమా దాల్లో ప్రాణాలు కోల్పోయారు. మరెందరో తీవ్ర గాయాలపాలయ్యారు. పరిశ్ర మలో అన్ని ప్రమా దాలు జరుగుతున్నా…కార్మికుల భద్రత, రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కార్మిక నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా కంపెనీల ప్రమా దాలకు సంబంధించి, భద్రతా ప్రమాణాల నిర్వహణపై 2020 జులై16 న అప్పటి కలెక్టర్‌ వినరు చంద్‌ నాలుగు బృందా లను నియమించారు.ఆ మేరకు కార్మికులకు కార్మి కుల భద్రత, ఫైర్‌ సేఫ్టీ, ఎలక్ట్రికల్‌ సేఫ్టీ అంశాలతో పాటు నింబంధనల అమలుతీరుపై నాలుగు నివేది కను ఇచ్చింది. అయితే పరిశ్ర మల్లో లోపాలను సరి చేసే దిశగా మాత్రం ప్రయ త్నాలు చేయక పోవడంతో ప్రమాదాలు ఆగడం లేదు.హెటిరో ఫార్మాలో జరిగిన ప్రమాదంపై సమ గ్ర విచారణ జరపాలని కార్మిక సంఘాలు, రాజకీ య పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి.ప్రమాదంలో మృతి చెందిన అల్లాడ సాయిరాం కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం,వారి కుటుంబంలో ఒకరిఉద్యోగం ఇచ్చి న్యాయం చేయాలనిపట్టు బడుతున్నాయి. క్షతగ్రా తులకు మెరుగైన వైద్యం అందించాలని పట్టుబడు తున్నాయి. సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం తోనే ప్రమాదాల్లో కార్మి కులు మృత్యువాతపడుతు న్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు…ఆ తరువాత పట్టనట్టు వ్యవ హరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాలుష్య నిబంధనలు,భద్రతా ప్రమాణాలు పాటించక పోయినా పట్టించు కోవ డం లేదని మండిపడుతు న్నారు. ఉన్నతాధికారు లు జోక్యం చేసుకొని హెటిరోలో ప్రమాదాలు పునరావృతం కాకుండా సమగ్ర విచారణ చేపట్టా లని కోరుతున్నారు. ఫార్మా కంపెనీల్లో వరస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అధి కారులు సమగ్ర విచారణ చేపడుతారా? లేక ఎప్పటిలాగే ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హాడావడిచేసి ఊరుకుంటారా?అనేది వేచి చూడా ల్సిందే.
వెంటాడుతున్న ప్రమాదాలు
ా రెండేళ్ల క్రితం ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి స్టైరిన్‌ అనే విషవాయువు లీకయి 12మంది మృతిచెందారు. వీరంతా పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నవారే.
ా గతేడాది నక్కపల్లిలోని హెటిరో మందుల పరిశ్రమలోని పీఎంఎస్‌వో సాల్వెంట్‌ తయారీ యూనిట్‌ వద్ద రియాక్టర్‌ పేలి ఒకరు చనిపోగా,నలుగురు తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఈ పరిశ్రమలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
ా అచ్యుతాపురం సెజ్‌లోని కొన్ని ఫెర్రో పరి శ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో ఓ ఫెర్రో కంపెనీలో కొలిమి పేలి 13మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ా రాంబిల్లి పరిథిలోని ఏషియన్‌ రంగుల పరిశ్ర మలో ప్రమాదం జరిగి ఒకరు మరణించారు.
ా గతేడాది సీడ్స్‌ దుస్తుల తయారీ పరిశ్రమలో వరుసగా రెండుసార్లు వాయువులు లీకై వందలాది మందిమంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.
నిత్యం భయం!
అచ్యుతాపురం సెజ్‌లోని సుమారు 9,2 97ఎకరాల్లో ఫార్మా కంపెనీలకు మూడువేల ఎకరాల వరకు కేటాయించారు. పరవాడ ఫార్మాతో పోల్చుకుంటే సెజ్‌లో భూమిధర తక్కువగా కేటా యించడంతో ఎక్కువ ఫార్మా కంపెనీలు ఏర్పాటవు తున్నాయి. పరవాడా ఫార్మాకంపెనీలతో పోల్చితే సెజ్‌ల్లో చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నా యి. ఫార్మాసిటీ చుట్టూ తక్కువ జనాభా గ్రామాలు ఉండగా సెజ్‌ని అనుకొని రాష్ట్రంలోని అతిపెద్ద మత్స్యకార గ్రామమైన పూడిమడక ఉంది.ఈ ఒక్క గ్రామంలోనే 20వేల జనాభా నివాసం ఉంటు న్నారు. పరిశ్రమల్లో తరచూ జరుగుతున్న అగ్నప్ర మాదాలు,రసాయనవ్యర్ధాల నిర్వహణలో లోపాలు, గ్యాస్‌ లీకేజీలు సమీప గ్రామస్థులను భయపెడు తున్నాయి.అచ్యుతాపురం సెజ్‌లో పెద్దపెద్ద కొలిమి లతో కూడిన ఫెర్రో పరిశ్రమలున్నాయి. వాటికి సొంతంగా ఒక్కఅగ్నిమాపక వాహనం కూడా లేకపోవడం గమనార్హం. సెజ్‌లో ఎటువంటి అగ్ని ప్రమాదం జరిగినా ఏపీఐఐసీ వాహనమే దిక్కువు తోంది. సెజ్‌లోని యూనిఫార్ట్స్‌ కంపెనీలో కూడా గతంలో అగ్ని ప్రమాదాలు జరిగాయి.
ఒక్క ఏడాదిలో పది ప్రమాదాలు
2022 జనవరి నుంచి ఇప్పటి వరకూ పరవాడ ఫార్మాసిటీలో 10ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా డిసెంబర్‌ 19న లారస్‌ ల్యాబ్స్‌ యూనిట్‌3లో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు మృతిచెందగా ఒకరు తీవ్రంగా గాయ పడ్డారు. ఫిబ్రవరి 7న అక్టోనస్‌ ఫార్మాలో రియాక్టర్‌ వద్ద ప్రమాదం జరిగింది.ఈనెల 17న ఎమ్మె న్నార్‌ ఫార్మాలో,ఏప్రిల్‌ 23న ఎస్‌ఎన్‌ఎఫ్‌ ఫార్మాలో,మే 7న ఎస్‌ఈజెడ్‌ అలివిర ఫార్మాసంస్థలో,మే 25న లారస్‌ ల్యాబ్స్‌ యూనిట్‌3లో,జూన్‌ 13న గ్లాండ్‌ ఫార్మాలో,జూలై 28నసాయిశ్రేయాష్‌ పార్మా కం పెనీలో,ఆగస్టు 22న ఆప్టిమస్‌ ఫార్మాసంస్థలో అగ్ని ప్రమాదాలతోపాటు గ్యాస్‌ లీకేజీలు జరిగా యి. సెప్టెంబరు 10న కోరి ఆర్గానిక్స్‌ రియాక్టర్‌ వద్ద ప్రమాదం జరిగిగోడలు కూలిపోయాయి. ఈ ప్రమా దాల్లో ఆస్తినష్టం తప్ప ఎవరికీ ఏమీ కాక పోవడం తో కంపెనీ యాజమాన్యాలు ఊపరి పీల్చు కున్నా యి. ఇప్పటికైనా కర్మాగారాల,అగ్నిమాపక శాఖ అధికారులు స్పందించి ఫార్మాసిటీలో భద్రతా ప్రమా ణాలు పక్కగా అమలయ్యేలా చర్యలు తీసు కోవాలని కార్మిక నాయకులు,ఉద్యోగులు కోరు తున్నారు.

అడవితల్లికి గర్భశోకం

ఆదివాసుల సంప్రదాయ హక్కులపై ఆదినుంచి పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. బ్రిటీష్‌ ప్రభుత్వం 1878లో అడవులపై ఆదివాసుల సంప్రదాయ హక్కులపై ఆంక్షల విధింపుతో అసంబద్ద సంప్రదాయం ప్రారంభమైంది.దాన్ని వ్యతిరేకిస్తూ విప్లవవీరుడు అల్లూరి సీతారామారాజు ఆదివాసులకే అడవిపై హక్కుకోసం పోరాటం చేశారు. తర్వాత 1932లో జమీందారు వ్యవస్థ హాయంలో ప్రముఖ సామాజికవేత్త రెబ్బాప్రగడ మందేశ్వర శర్మ విశాఖ మన్యప్రాంతాన్ని సందర్శించి అమాయక గిరిజనులు దోపిడికి గురవుతున్నట్లు గుర్తించారు. ఆతర్వాత ఐఎఫ్‌ఎస్‌ అధికారి రెబ్బాప్రగడ కృష్ణారావు అటవీ సంరక్షణ అధికారిగా చింతపల్లి,మినుములూరు,అనంతగిరి,పాడేరు,మారేడిమిల్లి వంటి గిరిజనప్రాంతాల్లో విధులునిర్వర్తించారు. ఆయన హాయంలోనే కాఫీతోటలు పెంపకాన్ని ప్రవేశ పెట్టి జీవనప్రమాణాలు మెరుగుపరిచారు.నేను చిన్నప్పటి నుంచే నాన్నగారితోకలసి ఆదివాసుల జీవనవిధానాలతో మమేకమ య్యాను. తరాలుగా అడవితల్లినీడలో బతుకుతున్న అటవీభూములపై హక్కుమాత్రం వారికి ఎండ మావిగానే మిగిలాయని గుర్తించాను. ఈనేపథ్యంలోనే సమత పుట్టికొచ్చింది.గిరిజనలకు రాజ్యాంగం కల్పించిన చట్టాలు,హక్కులు పరిరక్షణపై గత ముప్ఫైరెండేళ్ల నుంచి పోరాడుతుంది. విశాఖమన్యంలో బాక్సైట్‌,ఖనిజనిక్షేపాలు ప్రైవేటు కంపెనీలకు ధారతత్తం చేసినవైనాన్ని గుర్తించి అటుప్రభుత్వం,ఇటు ప్రైవేటు బహుళజాతికంపెనీలకు వ్యతిరేకంగాపోరాడిరది.ఆదివాసులకు రాజ్యాంగం కల్పించిన రక్షణ చట్టాలు,హక్కులు నిర్వీర్యమైపోతున్నాయంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిగా గిరిజనుల హక్కులను పునరుద్దరిస్తూ సర్వోన్నత (న్యాయస్థానం) సుప్రింకోర్టు చరిత్రాత్మకమైన1997లో సమత తీర్పు నిచ్చింది. నేడు ఈతీర్పుఫలితంగా భారతదేశంలోని షెడ్యూల్‌ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీ ప్రజలకు రక్షణ గా నిలిచింది.స్థానికులైన గిరిజనుల భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడిరది. సామా జిక,ఆర్ధిక న్యాయం కోసంపోరాడే ఆదివాసులకు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన సమత తీర్పు ఎంతో మనో నిబ్బరం కలిగించింది.ఈతీర్పును ఉల్లంఘించడానికి ప్రభుత్వాలు యథాశక్తి ప్రయత్నాలు సాగిస్తూనే వస్తోంది.అధికారంలోఉన్న ప్రభుత్వంఅటవీ సంపద మొత్తం కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేయడానికి రక్షణ చట్టాలను సవరించడం తీరని అన్యాయం.
అడవులతో గిరిజనులకు పెనవేసుకుపోయిన అనుబంధాన్ని విచ్ఛిన్నం చేసేందుకు పాలకులు చేయని ప్రయత్నమంటూ లేదు. అమాయకాదివాసుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగంలోని అయిదో షెడ్యూలులో పొందుపరిచన సూత్రావళి స్పూర్తిని మన పాలకులు అడ్డంగా విస్మరిస్తున్నారు. అడవులు,ఆదివాసులు అధికంగాఉన్న ఆంధ్రప్రదేశ్‌,ఛత్తీషఘడ్‌,ఒరిస్సా,జార్ఖండ్‌ రాష్ట్రాల్లో భారీ పరిశ్ర మల ఏర్పాటుకు,ఖనిజతవ్వకాలకు విచ్ఛలవిడిగా లాకులెత్తుతున్నారు.ఆస్మదీయుల,పెట్టుబడిదార్ల జేబులు నింపే కార్యక్రమాన్ని చేపట్టి ఆదివాసుల అగ్రహానికి గురవుతున్నారు.అడవులవృద్ధి,పరిరక్షణద్వారా ఒనగూడే ఆర్ధికప్రయోజనాలను గిరిజనులకు చేర వేయాలంటూ స్వాతంత్య్రానంతరం నిర్ధేశించుకున్న లక్ష్యాలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి.
ప్రభుత్వం వేసే ప్రతి అడుగూ,తీసుకునే ప్రతినిర్ణయమూ సామాన్యునికి ఎంతోకొంత ఉప శమనం కలిగించాలి.వారి సమస్యలకు పరిష్కారంచూపాలి. కానీ,నేడు గిరిజన సంక్షేమం,అడువుల పరిరక్షణ పేరిట పాలకులు చేపడుతున్న చర్యలు ఆదివాసులకు న్యాయం చేయడం లేదు సరికదా..,వారి ఆందోళనను మరింత పెంచుతున్నాయి. అటవీ వనరులను అయినవారికి దోచిపెట్టడానికి,ప్రకృతి వనరుల పరిరక్షణపేరిట నిధులుస్వాహాలు,సర్కారీ పెద్దలుతెగబడుతున్న నైచ్యం నేడు బహిరంగ రహాస్యం.తమకు నిలువ నీడలేకుండా పాపం చేస్తున్నదెవరో గ్రహించలేనంతటి అమాయకత్వంలో ఈనాటి గిరిజనులులేరు.వారుఅన్నీ చూస్తున్నారు. అర్ధం చేసుకుంటున్నారు. అక్రమార్కులకు వంతపాడుతూ అడవి బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్న పెద్దలు తీరు మార్చుకోవాల్సిన తరుణమిది!- రెబ్బాప్రగడ రవి,ఎడిటర్ 

తుఫాన్లు..కష్టాలు

తీర ప్రాంత ప్రజానీకానికి తుపాన్లు, వాటి వల్ల వచ్చే కష్టాలు కొత్త కాదు. కానీ, ఆ కష్టాలను పూర్తి స్థాయిలో నివారించలేక పోవడమే బాధాకరం. తాజాగా విరుచు కుపడిన మాండూస్‌ తుపాన్‌ కూడా తీర ప్రాంత ప్రజానీకానికి తరగని కష్టాలను మిగిల్చింది. తుపాన్‌ ప్రాంతానికి పలు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లినట్లు వార్తలు వస్తున్నాయి. అధికారికంగా నష్టతీవ్రతను ఇంకా ప్రకటించలేదు. ఎన్యూ మరేషన్‌ ఇంకా ప్రారంభమే కాకపోవడంతో ఈ ప్రక్రియ పూర్తయి, బాధితులకు నష్ట పరిహారం అందడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఆలోగా అరకొర సాయంతోనే బాధితులు నెట్టుకురావాల్సి ఉంటుంది. తుపాన్లు వంటి ప్రకృతి వైప రీత్యాలు చోటు చేసుకున్నప్పుడు గతంలో మరణాల సంఖ్య భారీగా ఉండేది. పెరి గిన సాంకేతికతతో పాటు అధికార యం త్రాంగం అప్రమత్తత కారణంగా ఇటీవల కాలంలో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది.-సైమన్‌ గునపర్తి
మాండూస్‌ తుపాన్‌ సమయంలోనూ ఈ విష యాన్ని గమనించవచ్చు. మూడు,నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసినప్పటికీ,దక్షిణ కోస్తా జిల్లాలో నదులు,వాగులు పొంగి ప్రవహించినప్పటికీ మన రాష్ట్రంలో ఒక్కరే మరణించారు. అది కూడా వర్షాలకు నానిన గోడ కూలడం కారణంగా సంభవించింది. సకాలంలో సహాయ చర్యలు చేపట్టినందున మరణాల సంఖ్యను నలుగురికి పరిమితం చేయగలిగామని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడులోనూ సంభవించిన ఆస్తి, పంట నష్టం మాత్రం అపారం. రాష్ట్రాలు కష్టాల్లో చిక్కుకున్నప్పుడు స్పందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే! తక్షణ సాయం ప్రకటించడంతో పాటు, పూర్తిస్థాయి నష్టం అంచనా వేయడానికి బృందాన్ని పంపడం, ఆ బృందం ఇచ్చే నివేదికను, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని మరిన్ని నిధులను మంజూరు చేయడం వంటి పనులు కేంద్ర ప్రభుత్వం సాధారణంగా చేస్తుంది. ఈ తరహా స్పందన ఎంత త్వరగా వ్యక్తమైతే బాధిత ప్రజానీకానికి అంత త్వరగా ఊరడిరపు లభిస్తుంది. అయితే,తాజా తుపాన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుండి ఇటువంటి స్పందన నామమాత్రంగా కూడా వ్యక్తం కాలేదు. సాయం సంగతి అలా ఉంచి,కనీసం బాధిత ప్రజానీకానికి కేంద్ర ప్రభుత్వ పెద్దలనుండి ఊరడిరపు మాటలు కూడా వ్యక్తం కాకపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది.తమ సొంత ప్రభుత్వాలు ఉన్నచోటో,ఎన్నికలు వచ్చినప్పుడో దీనికి భిన్నంగా ఉరుకులు, పరుగుల మీద సాయం అందడం ప్రజానీకం గమనిస్తున్న విషయమే. ఈ తరహా వివక్షా పూరిత వైఖరిని కేంద్ర ప్రభుత్వం తక్షణం మానుకోవాలి. మాం డూస్‌ తుపాన్‌ కారణంగా చిత్తూరు, తిరుపతి,కర్నూలు నెల్లూరు,ప్రకాశం, బాపట్ల,గుంటూరు,కృష్ణ,ఉభయ గోదావరి జిల్లాల్లో లక్షలాది ఎకరాల పంట దెబ్బ తింది. రేపో,మాపోమార్కెట్‌కు చేరాల్సిన ధాన్యపు కళ్ళాల్లోకి వర్షపు నీరు చేరింది. పండ్ల తోటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. వరద నీరు చేరడంతో కొన్ని చోట్ల ఇళ్లకు దెబ్బతిన్నాయి. వీరందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే ! అది జరగాలంటే ముందుగా ఎన్యూమరేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. సోమవారం నిర్వహిం చిన సమీక్షా సమావేశంలో నష్టం అంచనాల ప్రక్రియను వెంటనే ప్రారంభించి, వారం రోజుల్లోపు సాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ఉదారంగా నిర్వహించాలి. రంగుమారినా, తడిసినా ముందుగా ప్రకటించిన రేటుకే కొనుగోలు చేయాలి. ముఖ్యమంత్రి కూడా ఇదే విధమైన ఆదేశాలు జారీ చేశారు.ఈ ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావాలి.దీంతో పాటు అన్ని విధాల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకోవాలి. అప్పుడే రైతులకు కొంతమేరకైనా ఊరట లభిస్తుంది. అదే సమయంలో రాష్ట్రంలోని అధికార పక్షంతో పాటు, ప్రధాన ప్రతిపక్షం కూడా సాయం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలి. అవసరమైతే ఇతర ప్రతిపక్షాలను, శక్తులను కూడా కలుపుకుని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి.
ఆంధ్రప్రదేశ్‌కు పదే పదే ఎందుకీ వరద కష్టాలు….
భౌగోళికంగా గోదావరి, కృష్ణా, పెన్నా లాంటి ప్రధాన నదులకు చివరలో ఉండే ఆంధ్ర ప్రదేశ్‌కు అనేక ముప్పులు పొంచివున్నాయి. నీటి కొరత ఏర్పడినా, నదికి వరదలు వచ్చినా తొలి ప్రభావం ఏపీ మీదనే ఉంటుంది. గడిచిన రెండు మూడు సీజన్లలో ఏటా వరదలతో అపార నష్టాన్ని ఆంధ్రప్రదేశ్‌ చవిచూస్తోంది. రైతులు, తీర ప్రాంత ప్రజలే కాకుండా ప్రభుత్వం కూడా వివిధ రకాలుగా నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది.గోదావరికి చరిత్రలో ఎన్నడూ లేనంత రీతిలో జులైలో అతి పెద్ద వరదలు నమోదయ్యాయి. ప్రస్తుతానికి వరదల తాకిడి తగ్గినా వరద ముప్పు మాత్రం ఇంకా పోలేదు. సహజంగా ఆగష్టులో ఎక్కువగా వరదలు వచ్చే ప్రమాదం ఉండటంతో.. గోదావరి తీరం ఇంకా ప్రమాదం ముంగిట్లో ఉన్నట్టుగానే భావించాలి.సెప్టెంబర్‌ మాసంలో ఎక్కువగా వరదల ప్రమాదం ఎదుర్కొనే కృష్ణా నదీ తీరం కూడా రాబోయే రెండు నెలల పాటు దినదినగండంగా గడపాల్సిందే. అక్టోబర్‌, నవంబర్‌ మాసాల్లో పెన్నా తీరంలో ప్రమాదం పొంచి ఉంటుంది. గత నవంబర్‌లో ఎగువన కురిసిన భారీ వర్షాలకు పెన్నా నదీ తీరం పొడవునా అవస్థలు ఎదురయ్యాయి. ఏటా వరుసగా నాలుగైదు నెలల పాటు ఏదో నదికి వరదల ప్రమాదం అంచున ఆంధ్రప్రదేశ్‌ ఉంటుంది. అయితే, దీర్ఘకాలంగా ఈ సమస్య ఉన్నప్పటికీ..తగిన పరిష్కారం విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడం వల్లనే నష్టం ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా కరకట్టల పరిస్థితిపై ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరాన్ని ఇది చాటుతోంది.ఈ నేపథ్యంలో గోదావరి ఏటిగట్లు, కృష్ణా కరకట్ట, పెన్నా సహా పలు నదీ తీరాల్లో పరిస్థితిపై బీబీసీ పరిశీలన చేసింది.
గోదావరి ముప్పు నుంచి గట్టెక్కినట్టేనా
1986 తర్వాత 2006లో గోదావరికి ప్రమా దకర స్థాయిని మించి వరదలు వచ్చాయి. అపార నష్టానికి కారణమయ్యాయి. అధికా రికంగా 1986లో 300 మందికి పైగా ప్రాణా లు కోల్పోయారు. 2006లో 70మంది మర ణించారు. ఆతర్వాత 2022 జులై16న అత్యధి కంగా నీటిమట్టం నమోదయ్యింది. ఈసారి మాత్రం స్వల్ప సంఖ్యలోనే ప్రాణనష్టంతో గోదా వరి తీరం ఊపిరిపీల్చుకునే అవకాశం దక్కింది. ఇంత పెద్ద వరదల్లో గతానికి, ఇప్పటికీ ఉన్న ఏకైక తేడా ఏటిగట్లు బలోపేతం కావడం. ధవళేశ్వరంలోని కాటన్‌ బ్యారేజీకి ఎగువన అఖండ గోదావరిగా పిలుస్తారు.ఆ ప్రాంతం లో ఏటి గట్ల పొడవు 81.80కి.మీ.ఉం టుం ది.నదికి ఎడమ వైపు కొంత భాగాన్ని అంగు ళూరు ఫ్లడ్‌ బ్యాంకు అంటారు. దాని పరిధి 1.93 కి.మీ..ఇక బ్యారేజీ దిగువన గౌతమి ఏటి గట్లు 204.70కి.మీ.పరిధిలో ఉన్నాయి. వశిష్ఠ గోదావరి గట్లు 246.30 కి.మీ.పొడవు ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వైనతేయ సహా ఇతర నదీపాయల గట్లు కూడా కలిపితే దాదాపుగా 700 కిలోమీటర్లు ఉంటా యి. భద్రాచలం వద్ద 71 అడుగులకు చేరిన నీటి మట్టం కారణంగా,ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద సుమారుగా 27లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలాల్సి రావడంతో గోదావరి నదీ ప్రవాహం నిండుకుండను తలపించింది. అయినప్పటికీ పెద్ద ముప్పు రాకుండా నివారిం చేందుకు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది.రాత్రి, పగలూ వివిధ శాఖల సిబ్బంది పలు చోట్ల పహారా కాయాల్సి వచ్చింది. స్థానికుల సహకారంతో గట్లు పరిరక్షించాల్సి వచ్చింది. ఈ ప్రయత్నాలే గోదావరి వాసులను ముప్పుల నుంచి తప్పించాయని చెప్పాలి. 2006 వరదల సమయంలో అయినవిల్లి మండలం శానపల్లి లంక,పి గన్నవరం మండలం మొండెపులంక వద్ద గట్లు తెగిపోయాయి. వరద ప్రవాహంతో ఊళ్లన్నీ జలమయమయ్యాయి. ఊరూ, ఏరూ ఏకం కావడంతో అపారనష్టం సంభవించింది. ఆ సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నాటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో పాటుగా యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ కూడా పర్యటించారు. ఆ సమయంలో గోదావరి గట్లు ఆధునికీకరిస్తామని శానపల్లిలంకలోనే సీఎం వైఎస్సార్‌ ప్రకటించారు. దానికి తగ్గట్టుగా 1983 వరదల తీవ్రతను ప్రామాణికంగా తీసుకున్నారు. అప్పట్లో దాదాపు 35 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహించిన నేపథ్యంలో అలాంటి వరదలు మళ్లీ వచ్చినా ఎదుర్కోగల సామర్థ్యంతో గట్లు నిర్మించాలని ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. 2006 వరదల నుంచి నేర్చుకున్న పాఠంతో సుమారుగా రూ.600 కోట్ల వ్యయంతో 535 కిలోమీటర్లు మేర ఆధునికీకరణ పనులు జరిగా యి.గట్లు ఎత్తు అందుకు తగ్గట్టుగా పెం చారు. ఆనాటి నీటిపారుదల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ సీతాపతిరావు సారథ్యంలో వరదలు, ఏటిగట్ల ఆధునికీకరణపై సాంకేతిక బృందంతో సర్వేచేసి సమగ్ర నివేదిక ఆధారంగా ఈ పనులు చేశారు. ఇటీవల వరదల నుంచి కూడా కోన సీమ, పశ్చిమ గోదావరిలతో పాటు ప్రస్తుతం 5 జిల్లాల పరిధిలో ప్రజలకు ఉపశమనం దక్కేం దుకు ఆనాటి పనులు తోడ్పడ్డాయి. కానీ రాను రాను గట్ల పరిస్థితికి నానాటికీ తీసికట్టు చందంగా మారుతోంది. అప్పట్లో పనులు పూర్తికాని చోట ఈసారి ప్రమాద సంకేతాలు వెలువడ్డాయి. వశిష్ఠ కుడి గట్టు నరసాపురం, వశిష్ఠ ఎడమ గట్టు పరిధిలో 48వ కిలోమీ టరు నుంచి 90వ కిలో మీటరు వరకు మూడు ప్యాకేజీలు ఆనాటి నుంచి అసంపూర్ణంగా వదిలేశారు.
ఇసుక తవ్వకాలతోనే తలనొప్పులు..
గోదావరి ఏటిగట్లు పటిష్ట పరిచినప్పటికీ వాటి లక్ష్యం దెబ్బతింటోందని ఇటీవలి వరదలు చాటుతున్నాయి. ముఖ్యంగా ఇసుక తవ్వకాలతో నదీ ప్రవాహం, ఒడి పెరగడమే కాకుండా ఏటిగట్లు బలహీన మవుతున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇసుక తవ్వకాల విషయంలో నిబంధనలు అనుసరించకపోతే అనేక అనర్థాలు చవి చూడాల్సి వస్తుందని ఇరిగేషన్‌ నిఫునులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం గోదావరి ఇసుక ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. యంత్రాలు వినియోగించ కూడ దనే నిబంధన కేవలం పేపర్లకే పరిమితం. పైగా గట్లుని ఆనుకుని తవ్వేస్తుండడంతో గ్రోయిన్లు దెబ్బతింటున్నాయి. ఏటిగట్లు బలంగా ఉండేందుకు వాటిని నిర్మిస్తే ఇసుక తవ్వకందా రులు వాటిని కొల్లగొట్టేస్తు న్నారు. గట్లకి రక్షణ లేకుండా పోతోంది. ఏటిగట్లు మీద భారీ వాహనాల రాకపోకల కోసం బాటల పేరుతో గట్లు దెబ్బతీస్తున్నారు. ఫలితంగా వరదలు వచ్చిన ప్పుడు ఇసుక తవ్వకాలు జరిగిన ప్రాంతాల్లో ఎక్కువగా భయాందోళనలు ఎదుర్కోవాల్సి వస్తోందని’’ భావిస్తున్నారు.
కృష్ణా తీరంలోనూ అదే కథ..
గోదావరి వరదల తాకిడికి కోనసీమ వాసులు ఎక్కువగా కలత చెందుతుంటే కృష్ణా వరదల వల్ల అటు గుంటూరు, ఇటు కృష్ణా జిల్లాలు ప్రభావితం అవుతూ ఉంటాయి. ప్రధానంగా ప్రకాశం బ్యారేజ్‌ దిగువ ప్రాంతాలు వరద ముప్పు ఎదుర్కోవాల్సి వస్తోంది. విజయవాడ నగరంలోని పలు ప్రాంంతాలు కూడా వరద తాకిడికి తల్లడిల్లిపోవాల్సిన దుస్థితి నేటికీ ఉంది.కృష్ణా నదికి 2009లో భారీవరదలు వచ్చాయి. ఆ వరదల మూలంగా కృష్ణా తీర మంతా తీవ్ర నష్టాన్ని చవిచూసింది. 2020లో కూడా వరద తాకిడి ఎక్కువగా నమోదయ్యింది. కానీ అంత పెద్ద ముప్పు లేకుండానే ప్రజలు బయటపడ్డారు. 2009 తర్వాత కృష్ణా నది కరకట్ల విషయంలో కూడా కొంత దృష్టి పెట్టారు. కానీ ఇసుక తవ్వకం దారుల తీరుతో నదీగర్భం కొల్లగొట్టడం, కరకట్ట దెబ్బతినడం వంటివి ఎదురవుతున్నాయి. ‘‘రాష్ట్రంలో గోదావరి, కృష్ణా వంటి నదులకు వరదలు తప్పవు. ఒక ఏడాది తప్పినా,ఎప్పటికయినా ముప్పు ఉంటుంది.దానికి మనం సన్నద్ధంగా ఉండాలి. కానీ అనేక అనుభవాల తర్వాత కూడా పాఠాలు నేర్చుకుంటున్నట్టు కనిపించడం లేదు. మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదు. ఏటా వరదలు వస్తున్నాయనగానే వందల గ్రామాలు వణికిపోవాల్సి వస్తోంది. ఇలాంటి వాటికి శాశ్వత పరిష్కారం చూడాలి. అసాధా రణంగా ఎప్పుడయినా వరద వస్తే తప్ప, సాధారణ వరదలకు పెద్దగా భయపడాల్సిన పరిస్థితి లేకుండా చేయాలి. అందుకు కరకట్టలు బలోపేతం చేయడం,వాటిని పరిరక్షించడమే మార్గం.కోట్లు వెచ్చించి పనులు చేసిన తర్వాత ఇసుక కాంట్రాక్టర్ల వ్యాపారం కోసం భారీ వాహనాలతో వాటిని బలహీనపరిస్తే ఏమి ఉపయోగం ఉంటుంది. కాబట్టి యంత్రాంగం అటువైపు దృష్టి సారించాలి’’అన్నారు ఇరిగేషన్‌ రిటైర్డ్‌ ఎస్‌ ఈ పీవీ రామారావు. దేశంలో వరద తాకిడి నుంచి గట్టెక్కడానికి వివిధ రాష్ట్రాల్లో చేసిన ప్రయత్నాలను మనం పాఠంగా తీసుకొవచ్చని ఆయన బీబీసీతో అన్నారు. తమి ళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో వరద నియం త్రణ చర్యలు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ప్రమాదం అంచున పెన్నా తీరం…
గోదావరి, కృష్ణా నదులతో పాటుగా వంశధార, నాగవళి సహా వివిధ నదుల మూలంగానూ వరద ముప్పు ఎదుర్కోవాల్సి వస్తోంది.వాటిలో పెన్నా ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో 2021 నవంబర్‌లో వచ్చిన వరదలు చాటిచెప్పాయి. ఏకంగా అన్నమయ్య డ్యామ్‌ కొట్టుకుపోయే దశ నుంచి, సోమశిల ప్రాజెక్టు పరిస్థితి గురించి ప్రశ్నలు ఎదురయ్యే వరకూ వచ్చింది. భవిష్యత్తులో మరింత ముప్పు తప్ప దనే అంచనాలు ఉన్నాయి. దాంతో దానికి అనుగుణంగా చర్యలు అవసరమనే వాదన ఉంది. ‘‘అన్ని నదులకు కొన్ని సహజ లక్షణా లుంటాయి.20,30ఏళ్లలో ఓసారి అసాధా రణంగా ప్రవాహం వస్తుంది. వాటి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాటికి అనుగుణంగా మనం అప్రమత్తం కావాలి. వరద వచ్చినప్పుడు హడావిడి చేయడం, ఆ తర్వాత దానిని వదిలేయడంవల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. నిరుడు పెన్నా వరదలు, ఈ ఏడాది గోదావరి వరదలు వంటివి మనకు మేలుకొలుపు కావాలి. భారీ వరదలు వచ్చినా తట్టుకునేలా అన్ని నదీ తీరాలను ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేయాలి. వాటిని ఎప్పటి కప్పుడు పరిరక్షణ జరగాలి’’ అంటూ పర్యా వరణ వేత్త సీహెచ్‌ శ్రీనివాసరావు అన్నారు. పోలవరం ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ఎత్తు పెంచడానికి ప్రభుత్వం పూనుకుంది. ఓవైపు వరద నీరు వెల్లువలా వచ్చి పడుతుంటే అప్పటికప్పుడు 2 మీటర్లు ఎత్తు పెంచినట్టు చెప్పడం విస్మయకరంగా కనిపించిందని,వరద నివారణ విషయంలో ప్రభుత్వ సన్నద్ధతను ఈ పరిణామం చాటుతుంది.ఆధునికీకరణలో భాగంగా వరదల నుంచి శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని ఇటీవల సీఎం జగన్‌ ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాం తాలలో పర్యటనలో భాగంగా రాజమహేం ద్రవరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులను ఆదేశించారు. శాశ్వత చర్యలపై దృష్టిపెడతాం. నవంబర్‌ కల్లా మనం టెండర్లు పూర్తిచేసుకుని పనులు మొదలు పెడదాం’’ అంటూ ఆయన అధికారులను ఉద్దే శించి వ్యాఖ్యానించారు.సీఎం ఆదేశా లకు అనుగు ణంగా శాశ్వత వరద నివారణ చర్యలకు సర్కారు సిద్ధమయితే గోదావరి తీర వాసుల భయాందోళనలు తగ్గుతాయి. అదే సమయంలో ఇతర ప్రధాన నదుల వెంబడి కరకట్టల తీరు మీద కూడా దృష్టి పెట్టాలనే అభిప్రాయం వినిపిస్తోంది.

మళ్లీ కరోనా టెన్షన్‌

జన జీవనాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి మళ్లీ జడలు విప్పుతున్నది. మొన్నటి దాకా స్తబ్ధుగా ఉన్న కొవిడ్‌.. కొద్దిరోజులుగా విస్తరిస్తున్నది. ఫలితంగా పాజిటివ్‌ కేసులు మళ్లీ నమోదవుతున్నాయి. వైరస్‌ వ్యాప్తి తగ్గడం, వ్యాక్సిన్‌ తీసుకున్నామన్న భరోసాతో ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించడం మానేశారు. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటిం చాలన్న సోయి మరిచారు. ఫలితంగా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రజలు స్వీయ రక్షణ చర్యలు తీసు కోవాలని సూచిస్తున్నది. వైరస్‌ వల్ల తీవ్ర ఇబ్బందు లు పడిన ప్రజలు ఇక నుంచైనా జాగ్రత్తలు తీసు కోవాలి. అందరూ నిబంధనలు పాటిస్తేనే కొవిడ్‌ వ్యాప్తిని నిలువరించడం సాధ్యమవుతుంది. – జిఎన్‌వి సతీష్‌
కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతుం డటంతో అనేక దేశాలు మళ్లీ ఆంక్షలను విధిస్తున్నాయి. కొన్ని దేశాలు ఇప్పటికే విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. మన దేశంలోనూ వైరస్‌ వ్యాప్తిపై ఆందోళనలు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ లేఖ రాయడం ఆహ్వానించదగిన పరిణామం. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని కూడా నిర్వహించింది. అయితే లేఖతో పాటు సమావేశంలోనూ రాష్ట్రాలకు సూచనలు చేయడం తప్ప కేంద్ర ప్రభుత్వం చేపట్టే నిర్దిష్ట చర్యల ఊసు లేదు. గతాను భవాల దృష్ట్యా ఈ తరహా ధోరణి ఏమాత్రం మంచిది కాదు. కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబు తున్న సమాచారం ప్రకారమే కరోనా వైరస్‌ తాజా విజృంభణకు కారణమైన ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ బిఎఫ్‌-7 కూడా మన దేశంలో వెలుగులోకి వచ్చింది. దేశంలో ఈ రకం వైరస్‌ ముగ్గురికి సోకింది. ఇది బలంగా ఇన్‌ఫెక్షన్‌ కలిగిస్తుందని, ఇంక్యుబేషన్‌ వ్యవధి తక్కువగా ఉండటంతో పాటు ఒకరి నుండి మరొకరికి త్వరగా వ్యాపిస్తుందని, వ్యాక్సిన్ల సామర్ధ్యాన్ని సైతం అధిగమిస్తుందని అంత ర్జాతీయ నిర్ధారణ. అయితే, మన దేశంలో బిఎఫ్‌-7 రకం తొలి కేసును అక్టోబర్‌లోనే గుజరాత్‌లో గుర్తించారు.ఆ తరువాత ఇప్పటి వరకు మరో మూడు కేసులు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. వీటిలో రెండు గుజ రాత్‌ లోనే నమోదుకాగా, మరొ కటి ఒడిశా లో వెలుగులోకి వచ్చింది. జాన్స్‌ హాప్కిన్స్‌ కోవిడ్‌ ట్రాకర్‌ తాజా గణాంకాల ప్రకారం గడిచిన 28రోజుల్లో (డిసెంబర్‌ 21నాటికి) జపాన్‌లో అత్యధికంగా 34లక్షల కేసులు నమోదయ్యాయి. దక్షిణ కొరి యాలో16 లక్షల కొత్త కేసులు,1,385 మరణాలు సంభవించాయి. అమెరికాలో గత 28 రోజుల్లో 15,89,284 మందికి వైరస్‌ సోకింది.కోవిడ్‌ 19 వెలుగులోకి వచ్చినప్పటి నుండి ఆ దేశంలో మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 100 మిలియన్లకు చేరింది. ఫ్రాన్స్‌లో 15,26,427 మంది ఈ కాలంలో కొత్తగా వైరస్‌ బారిన పడ్డారు. బ్రెజిల్‌లో 9, 45,568 మందికి వైరస్‌ సోకగా, 3,125 మంది మరణించారు. చైనాలో 9,17,308 కేసులు నమోదుకాగా, 646 మరణాలు సంభవించాయి. జీరో కోవిడ్‌ పాలసీని సడ లించిన తరువాత చైనాలో వైరస్‌ ఉధృతంగా వ్యాపిస్తోంది. జీరో కోవిడ్‌ విధానాన్ని కార్పొరేట్‌ మీడియా తీవ్రంగా విమర్శించిన సంగతి ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. ఈ సమయంలోనే మన దేశంలో 6,482 మంది వైరస్‌ బారిన పడగా 86 మంది మృతి చెందినట్లు జాన్స్‌ హాప్కిన్స్‌ కోవిడ్‌ ట్రాకర్‌ నమోదు చేసింది.
కరోనా వ్యాప్తితో గత మూడేళ్ల కాలంలో దేశంలో కోట్లాది మంది ఆప్తులను కోల్పో యారు. ఆకస్మిక లాక్‌డౌన్‌ సామాన్యుల జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. కోల్పోయిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇంకా పూర్తిస్థాయి లో పునరుద్ధరణ జరగలేదు. ఆర్థిక సంక్షోభం ప్రజలను వెంటాడుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో వైరస్‌ వ్యాప్తిచెందకుండా చర్యలు చేపట్టడంతో పాటు, కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు వైద్య, ఆరోగ్య వ్యవస్థలను తక్షణమే బలోపేతం చేసుకోవాలి. దానికవసరమైన నిధులను యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రాలకు కేంద్రం ఇవ్వాలి. మందులకు కొరత రాకుండా చూడాలి. వ్యాక్సినేషన్‌ గురించి కేంద్ర ప్రభు త్వం ఎంత గొప్పగా చెబుతున్నప్పటికీ దాదా పుగా 27శాతం మంది ఇంకా మొదటి విడత వ్యాక్సినే అందలేదు. రెండు డోసులు వేసుకోని వారి సంఖ్య 32 శాతం దాకా ఉంది. ఇక బూస్టర్‌ డోస్‌ లెక్కల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. ఈ వాస్తవాన్ని గుర్తించి ప్రజలందరికి ఉచితంగా వ్యాక్సిన్‌ అందించడానికి కేంద్రం ఇప్పటికైనా సిద్ధపడాలి. వైరస్‌ను అడ్డుపెట్టుకుని కార్పొరేట్‌ మిత్రులకు కోట్లు కట్టబెట్టే విధానానికి స్వస్తి పలికి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రాలతో కలిసి కార్యాచరణకు కదలాలి. అటువంటి చర్యలే ప్రజలకు ధైర్యాన్నిస్తాయి. మహమ్మారిని నియంత్రించడంలో వారందరినీ భాగస్వామలను చేస్తాయి.
అకస్మాత్తుగా అలజడి..
కొవిడ్‌ తగ్గడంతో 2020 మార్చి నెలకు ముందు నాటి సాధారణ పరిస్థితులు వచ్చాయనే భావనలో ప్రజలు ఉన్నారు. సాధారణ జీవితానికి ప్రతి ఒక్కరూ అలవాటు పడ్డారు. మొదటి, సెకండ్‌ వేవ్‌లతో తీవ్ర ఇబ్బందులకు గురి కాగా, థర్డ్‌ వేవ్‌ ఇలా వచ్చి అలా వెళ్లడంతో ప్రజల్లో భయమే కనిపించలేదు. వ్యాక్సిన్‌ తీసుకున్నందున తమకేమీ కాదులే అనే ధీమాతో ప్రజలు చెట్టాపట్టాల్‌ వేసుకుని తిరుగుతున్నారు. ఫలితంగా వైరస్‌ జాడ మళ్లీ కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. మాస్కు తప్పనిసరిగా వాడాలని సూచిస్తున్నది.
జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి..
కరోనా కేసులు పెరుగుతున్నట్లుగా గణాంకాలను చూస్తుంటే అర్థం అవుతున్నది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. బయటికి వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా స్వీయ జాగ్రత్తలను పాటించాలి. మాస్కులు వాడడం, భౌతిక దూరం పాటించడంతో పాటుగా చేతులు శుభ్రం చేసుకోవడం అలవర్చుకోవాలి. వైరస్‌ సోకిన వారికి తగిన వైద్యం అందించేందుకు దవాఖాన ల్లో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు చాలా మంది ప్రికాషన్‌ డోసు తీసుకోలేదు. వారంతా మూడో డోసును తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు

1 35 36 37 38 39 75