నిత్య నూతన ప్రవాహం.. అంబేడ్కర్‌ సిద్ధాంతం

(డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా..)

‘’1950, జనవరి 26న మనం వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించ బోతున్నాం. రాజకీయాలలో ఒక వ్యక్తి- ఒక ఓటు, ఒక ఓటు- ఒక విలువ అన్న రాజకీయ సమానత్వాన్ని గుర్తించబోతున్నాం. అయితే సామాజిక, ఆర్థిక జీవితంలో మనకున్న సామాజిక, ఆర్ధిక వ్యవస్థ వల్ల ఒక వ్యక్తి – ఒక విలువ అన్న సూత్రాన్ని తిరస్కరిస్తూనే ఉంటాం. వైరుధ్యాలతో కూడిన ఈ జీవితాన్ని ఎంత కాలం భరిస్తూ వద్దాం? ఎంత కాలం మన సామాజిక, ఆర్థిక జీవితాల్లో సమానత్వాన్ని సాధించకుండా ఉందాం? ఇలా ఎక్కువ కాలం కొనసాగనిస్తే మన రాజకీయ ప్రజాస్వామ్యమే ముప్పునకు లోనవుతుంది. ఈ వైరుధ్యాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి, లేకపోతే అసమానత్వంతో పీడిరపబడుతున్న వాళ్ళు ఈ రాజ్యాంగ సభ కష్టపడి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామిక వ్యవస్థను కుప్పకూలుస్తారు.’’