ద‌ఢ పుట్టిస్తున్న ఒమిక్రాన్‌-వ‌ణికుతున్న ప్ర‌పంచ‌దేశాలు

కరోనా వేరియంట్లు వస్తూనే ఉన్నాయి. మొన్నటి వరకు డెల్టా వేరియంట్‌ అన్నారు. ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కొత్తగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ అంటు న్నారు. మరి ఇంది ప్రాణాం తకమా? కాదా?..అంటే కాదు అంటు న్నారు సౌత్‌ ఆఫ్రికన్‌ డాక్టర్‌. ఒమిక్రాన్‌ గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేసిన సౌత్‌ ఆఫ్రికన్‌ డాక్టర్‌ ఏంజెలిక్‌ కొయెట్జి తన దగ్గరకి ట్రీట్మెంట్‌కి వచ్చిన పేషెంట్స్‌ త్వరగా కోలుకున్నారు అని చెప్పారు. గత కొద్ది రోజులుగా దాదాపు 30 పేషెంట్స్‌ను చూడగా వారిలో తీవ్రమైన కోవిడ్‌ లక్షణాలు ఏమి కనిపించ లేదన్నారు. వీరెవరూ హాస్పిటల్‌?లో చేరకుండానే డిశ్చార్జ్‌ అయినట్లు తెలిపారు.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ లక్షణాలు
అందరు యువకులు అయినా బాగా అలసట కనిపించిందని ఏంజెలిక్‌ కొయెట్జి చెప్పారు. దానితో పాటు కొంచెం గొంతులో గరగర, పొడి దగ్గు, కండరాల నొప్పులతో తన దగ్గరకు వచ్చారని వివరించారు. ఎక్కువ మంది పేషెంట్లలో స్మెల్‌ రుచి పోలేదని అన్నారు. కొద్ది మందిలోనే హై టెంపరేచర్‌ కనిపించిందని పేర్కొన్నారు. తీవ్రమైన లక్షణాలు చూపించే ఇతర వేరియంట్లతో పోలిస్తే ఇవి చాలా తక్కువ అని ఏంజెలిక్‌ కొయెట్జి వెల్లడిరచారు.

Read more

72 ఏండ్ల రాజ్యాంగ‌మే మ‌న సార‌ధి

‘ప్రపంచ చరిత్రలో ఈ సమయంలో రూపొందించ బడిన రాజ్యాంగంలో కొత్త అంశం ఏదైనా ఉందా అని అడుగవచ్చు.మొదటి రాత రాజ్యాంగ రూపొందించి నేటికి ఒకవందకంటే ఎక్కువ సంవత్సరాలు గడిచాయి. ఈసంప్రదాయాన్ని అనేక రాజ్యాలు పాటించి తమతమ రాజ్యాంగాలను రాత లోకి తెచ్చాయి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే అనేక రాజ్యాం గాల్లో ప్రధాన నిబంధనలు ఒకే విధంగా ఉన్నాయి.చేసిన కొత్త విషయమే మిటంటే మనంరూపొందించిన రాజ్యాం గంలో వివిధ రాజ్యాంగాల్లోని లోపాలను సవరించి అవి మన దేశ అవసరాలకు అనుగుణంగా మార్చు కోగలిగాం.’అలా అంబేద్కర్‌ కృషితో నేడు ప్రపంచంలోని అత్యుత్తమ రాజ్యాంగంగా గుర్తింపు పొందింది.                                                        భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా...
ప్రపంచ దేశాల్లోనే భారత రాజ్యాంగం గొప్పవిశిష్టత స్థానాన్ని సంతరించు కుంది. 1948, జనవరి నెలలో రాజ్యాంగం తొలిముసాయిదా ప్రతి విడుదలైంది. ఆముసాయిదాకు వివిధ వర్గాల నుంచి,ప్రజల నుంచి7,635 సవరణలు వచ్చాయి. వాటిలో 2,473 సవరణలపై ఉపసం ఘం చర్చిం చింది.1949,నవంబర్‌ 26న నూతన రాజ్యాం గాన్ని, రాజ్యాంగ పరిషత్‌ ఆమోదించింది. తొలి రాజ్యాంగ ప్రతిపై 1949 నవంబర్‌ 24న 284 మంది రాజ్యాంగపరిషత్‌ సభ్యులు సంతకాలు చేశారు. అలా నవంబర్‌ 26ను రాజ్యాంగ దినోత్స వంగా పరిగణిస్తున్నారు. 1950జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
కొందరు న్యాయమూర్తులు, భారత రాజ్యాంగ ఆర్టికల్స్‌ను తమకు తోచినవిధంగా వ్యాఖ్యానించి ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటూ, అమలుజరుపకుండా వచ్చారు. దాంతో భారత రాజ్యాంగంలో 15(4),16(4),31బి,9వ షెడ్యూల్‌ వంటివి చేర్చి సుప్రీంకోర్టు పరిధిలోకి రాకుండా ఆయా చట్టాల,శాసనాల రక్షణ చర్యలు చేపట్టడం జరిగింది.అలా 9వషెడ్యూల్లో285ఆయా రాష్ట్రాల, కేంద్రాల చట్టాలను చేర్చడం జరిగింది. జవాబుదా రీతనం లేని సుప్రీంకోర్టు అపరిమిత అధికారాలను జవాబుదారీగా ఉండేవిధంగా మలుచుకోవాలి. అందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన విస్తృతాధికారాలు ఇచ్చిన ఆర్టికల్స్‌ను తొలిగించాలి.1950, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన భారత గణతంత్ర రాజ్యాంగం 1949, నవంబర్‌ 26న రాజ్యాంగ పరిషత్‌చే ఆమోదించబడిరది.70 ఏండ్లుగా భారత రాజ్యాంగం అనేక ఆటుపోట్లకు గురై మార్పు చేర్పులతో సుస్థిరంగా కొనసాగుతున్నది. భారత రాజ్యాంగంలో ప్రతి మనిషికి ఒకే విలువ,ఒకే ఓటు..ప్రాదేశిక నియోజకవర్గాలు,చట్టసభలు, పరి పాలనా వ్యవస్థ, న్యాయవ్యవస్థ అనేవి మౌలికాం శాలు.భారత రాజ్యాంగం ఒకఉత్కృష్టమైన గ్రంథం. దీని రచనలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న వాళ్లంతా మహనీయులు. స్వాతంత్య్ర ఉద్యమంలో కలలుగన్న భవిష్యత్‌ స్వప్నాలను సాకారం చేయ డానికి భారత రాజ్యాంగం ఒక ప్రతీకగా రూపొం దింది. రాజ్యాంగనిర్మాణం వెనుక శతాబ్దాల చరిత్ర, పరిణామం ఉన్నది.1948,జనవరినెలలో రాజ్యాం గం తొలి ముసాయిదా ప్రతి విడుదలైంది. ఆ ముసాయిదాకు వివిధవర్గాల నుంచి, ప్రజల నుంచి 7,635 సవరణలు వచ్చాయి. వాటిలో 2,473 సవరణలపై ఉపసంఘం చర్చించింది.1949, నవంబర్‌ 26న నూతన రాజ్యాంగాన్ని, రాజ్యాంగ పరిషత్‌ ఆమోదించింది. తొలి రాజ్యాంగ ప్రతిపై 1949 నవంబర్‌ 24న 284 మంది రాజ్యాంగ పరిషత్‌ సభ్యులు సంతకాలు చేశారు. అలా నవం బర్‌ 26ను రాజ్యాంగ దినోత్సవంగా పరిగణిస్తున్నారు. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ పరిణా మం: 1919 భారత ప్రభుత్వ చట్టం మాంటేంగ్‌ చేవ్‌ ఫర్డ్‌ అనే పేరుతో అనేక సంస్కరణలకు దారి తీసింది. ఈచట్టంద్వారా ఆంగ్లేయులు మన దేశంలో ద్వంద్వ పరిపాలనను ప్రవేశపెట్టారు. ఈచట్టం ద్వారా శాసనసభ నిర్మాణంలో ఎక్కువ ప్రజా ప్రాతినిధ్యానికి అవకాశం ఏర్పడిరది. తొలిసారిగా కేంద్రంలో ద్విసభా విధానం అమల్లో కి వచ్చింది. దిగువసభను లెజిస్లేటివ్‌ అసెంబ్లీ అని ఎగువ సభను కౌన్సిలర్‌ స్టేట్స్‌ అని పిలిచేవారు.1919 నాటి చట్టంలోని లోపాలను సరిదిద్దడానికి బ్రిటిషు ప్రభుత్వం 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని రూపొం దించింది. దీనికితోడు కొన్ని ఇతర కారణాలు కూడా 1935చట్టానికి దోహదం చేశాయి. స్వరాజ్య వాదుల ఉద్యమాలు సైమన్‌ కమిషన్‌ నివేదిక పరిణామాలు నెహ్రూ నివేదిక, జిల్లా నివేదిక, గాంధీ ఆధ్వర్యంలో జరిగినశాసనోల్లంఘన ఉద్య మం, రౌండ్‌టేబుల్‌ సమావేశాల వంటివి ఈ చట్టం చేయడానికి దారి తీసిన కొన్ని ముఖ్యమైన అంశాలు. 1933లోబ్రిటిష్‌ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రం 1935 భారత ప్రభుత్వ చట్టానికి మూలా ధారం. అప్పటి బ్రిటిష్‌ ప్రధానిరావ్న్‌సేవ్న్‌కో డొనాల్డ్‌ 1932 ఆగస్టు 4న జారీ చేసిన కమ్యూనల్‌ అవార్డు పరిణామం కూడా ఈచట్టానికి కారణంగా భావిం చవచ్చు. ముస్లిం, ముస్లిమేతరులకు ప్రత్యేక నియో జకవర్గాలను కేటాయించారు. ఆక్రమంలో కమ్యూ నల్‌ అవార్డు పునా ఒప్పందంగామారి ఎస్సీ,ఎస్టీ లకు రిజర్వేషన్లు కొనసాగుతూ వస్తున్నాయి. 19 35లో భారత రాజ్యంగచట్టం రూపొందించ బడిరది. ఎన్నికలు జరిగాయి. 1946లో భారత రాజ్యాంగ పరిషత్‌ ఏర్పడిరది. నాటి రాజ్యాంగ పరిషత్‌లో నేటి బంగ్లాదేశ్‌,పాకిస్థాన్‌ భూ భాగాలకు చెందినవారూ ఉన్నారు. 
1947ఆగస్టు29నాడు రాజ్యాంగ ముసాయిదా కమిటీకి డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ చైర్మన్‌గా ఎన్నుకోబడినారు. ఈకమిటీలో ఏడుగురు సభ్యులున్నారు. వారు..డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌,ఎన్‌.గోపాలస్వామి అయ్యంగార్‌,అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్‌,డాక్టర్‌ కె.ఎన్‌.మున్షి,సయ్యద్‌ మహ్మద్‌,ఎన్‌.మాధవరావు(బి.ఎల్‌.మిట్టల్‌) రాజీ నామా చేయగా ఇతను నియమించబడ్డారు.టి.టి.కృష్ణమాచారి(1948లోడి.పి.ఖైతాన్‌ మర ణించిన తర్వాత ఇతడు నియమించబడినారు. ఫెడరలిజం సమానత్వం ప్రాతినిధ్యం: 1.ప్రజా ప్రాతినిధ్యం, 2.ప్రాదేశిక నియోజకవర్గాలవారీగా ప్రాతినిధ్యం,3.పార్టిసిపేటింగ్‌ ప్రజాస్వా మ్యం, 4.రిప్రెజెంటేటివ్‌ ప్రజాస్వామ్యం,5.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనాశాఖలు, 6.న్యాయవ్యవస్థ,7.పత్రికాస్వేచ్ఛా, భావ ప్రకటనా స్వేచ్ఛ, మీడియా, పత్రికలు. అందువల్ల ప్రజాస్వామ్యంలో మూలస్తం భాలైన మూడిరటిలో ప్రాదేశిక నియోజకవర్గాల ప్రాతినిధ్యం ఉన్నప్పుడే దేశం ఒక సమాఖ్యగా కొనసాగుతుంది. దీన్ని సరిగ్గా ఆచరిస్తే స్వేచ్ఛా సమానత్వం, అందరికీ సమానావకాశాలు అందించే ఫెడరలిజం, కేంద్రీ కృత పరిపాలన చక్కగా ఏకకా లంలో కొనసాగుతాయి. ప్రస్తుతం చట్టసభలకు ప్రాదేశిక నియోజకవర్గాలుగా ప్రతినిధులున్నారు. పరిపాలనా యంత్రాంగంలో కూడా ఐఏఎస్‌ మొదలుకొని నాన్‌ గెజిటెడ్‌ అధికారి దాకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రాదేశిక నియోజకవర్గాల ప్రకారం ఉద్యోగులు,అధికారులు ఎన్నికయ్యే వ్యవస్థ ను అమలు జరుపుకోవాలి. న్యాయవ్యవస్థలో కూడా ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా ఇండియన్‌ జ్యుడిషియల్‌ సర్వీస్‌ ద్వారా ఎంపిక జరుగాలి. అలాగే ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా పారిశ్రా మికీకరణ,అభివృద్ధి వికేంద్రీకరణ జరుగాలి. పరి పానాధికారం యంత్రాంగంతో నియామకాలు, న్యాయవ్యవస్థలో నియామకాలు, ప్రాదేశిక నియోజక వర్గాలవారీగా జరుగడం అవసరం. నీట్‌ పరీక్ష వలె అఖిల భారతస్థాయిలో పరీక్షలు నిర్వహించి, స్థానికత ఆధారంగా నియామకాలు,ఎంపిక చేయా  కొందరు న్యాయమూర్తులు,భారత రాజ్యాంగ ఆర్టికల్స్‌ను తమకు తోచినవిధంగా వ్యాఖ్యానించి ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటూ, అమలుజరుప కుండా వచ్చారు. దాంతో భారత రాజ్యాంగంలో 15(4),16(4),31బి,9వ షెడ్యూల్‌ వంటివి చేర్చి సుప్రీంకోర్టు పరిధిలోకి రాకుండా ఆయా చట్టాల, శాసనాల రక్షణచర్యలు చేపట్టడం జరిగింది. అలా9వషెడ్యూల్లో 285 ఆయారాష్ట్రాల,కేంద్రాల చట్టా లను చేర్చడం జరిగింది. జవాబుదారీతనం లేని సుప్రీంకోర్టు అపరిమిత అధికారాలను జవాబు దారీగా ఉండేవిధంగా మలుచుకోవాలి. అందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన విస్తృతాధికారాలు ఇచ్చిన ఆర్టి కల్స్‌ను తొలిగించాలి. ఉత్కృష్టమైన ఈభారత రాజ్యాంగ పరిరక్షణ భారత పౌరులందరి కర్తవ్యం.భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్‌ బి.ఆర్‌.అంబే ద్కర్‌ రాజ్యాంగం గురించి ఇలా అంటారు. ‘ప్రపం చ చరిత్రలో ఈ సమయంలో రూపొందించ బడిన రాజ్యాంగంలో కొత్తఅంశం ఏదైనాఉందా అని అడుగవచ్చు.మొదటి రాత రాజ్యాంగం రూపొం దించి నేటికి ఒక వందకంటే ఎక్కువ సంవ త్సరాలు గడిచాయి. ఈ సంప్రదాయాన్ని అనేక రాజ్యాలు పాటించి తమతమ రాజ్యాంగాలను రాత లోకి తెచ్చాయి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే అనేక రాజ్యాంగాల్లో ప్రధాన నిబంధనలు ఒకే విధంగా ఉన్నాయి. చేసిన కొత్త విషయమే మిటంటే మనం రూపొందించిన రాజ్యాంగంలో వివిధ రాజ్యాంగాల్లోని లోపాలను సవరించి అవి మన దేశ అవసరాలకు అనుగుణంగా మార్చు కోగలిగాం.’అలా అంబేద్కర్‌ కృషితో నేడు ప్రపంచంలోని అత్యుత్తమ రాజ్యాంగంగా గుర్తింపు పొందింది.                                             రాజ్యాంగమే సుప్రీం
విభిన్న జాతులు,సంస్కృతులు, ప్రాం తాలు, మతాలు,కులాలు,భాషలసంక్లిష్ట సమాజం భారత దేశం. ఏదో ఒకఅంశంలో ఎపుడూ కేంద్రం తో రాష్ట్రాలు ఏదో ఒక ఘర్షణకు దిగుతుంటాయి. అలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని కాదని, రాష్ట్రాలు ఎదురుతిరిగేందుకు అవకాశం లేకుండా రాజ్యాంగంలోనే పకడ్బందీ ఆంక్షలు కూడా పొందుపరిచారు. ముందుగా రాష్టప్రతి, గవర్నర్‌ అనుమతి లేకున్నా శాసనం చెల్లుబాటు అయ్యే అవకాశం అధికరణం 255లో ఉంది.. అంతే కాదు అధికరణం 256లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలు, 257లో రాష్ట్రాలపై కేంద్రం నియం త్రణ గురించి కూడా ఉంది. జీఎస్‌టీ అమలు చేయాలని అప్పట్లో కేంద్రం నిర్ణయిస్తే చాలా రాష్ట్రాలు తొలుత వ్యతిరేకించాయి, తర్వాత అన్ని రాష్ట్రాలు గాడిలో పడ్డాయంటే దానికి కారణం రాజ్యాంగంలో సంలీనంగా ఉన్న ఆదేశ సూత్రాలే ననేది సుస్పష్టం. స్వాతంత్య్రాన్ని సాధించి, ప్రజా స్వామిక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇతర ప్రజాస్వామిక దేశాలను అనుసరించి మన నాయకులు, పాలకులు దేశానికి చక్కని రాజ్యాం గాన్ని రూపొందించారు. రాజ్యాంగం దేశానికి వౌలిక శాసనం. ప్రభుత్వానికి మూలచట్టం. అందు కే రాజ్యాంగ నిర్మాతలు ఆచర ణాత్మకమైన, సలక్షణ మైన రాజ్యాంగాన్ని నిర్మించ డమే ధ్యేయంగా పెట్టు కుని ప్రపంచంలోని ప్రజా స్వామిక రాజ్యాంగాలను అన్నింటినీ అధ్యయనంచేసి వాటిలో మన దేశ పరిస్థితుకు సరిపడే అంశాలను జోడిరచి వాటిని మన రాజ్యాంగంలో తగిన చోట పొందుపరిచారు.
అనేక దేశాల సంప్రదాయాలు
ఏక పౌరసత్వాన్ని, పార్లమెంటరీ విధా నాన్ని,స్పీకర్‌ పదవిని బ్రిటన్‌ నుండి,ప్రాథమిక హక్కులు, సుప్రీంకోర్టు, న్యాయ సమీక్షాధికారం అమెరికా రాజ్యాంగం నుండి, ఆదేశిక సూత్రాలు, రాష్టప్రతి ఎన్నిక పద్ధతి, రాజ్యసభ సభ్యుల వివరా లను ఐర్లాండ్‌ నుండి, ప్రాథమిక విధులను రష్యా నుండి, కేంద్ర రాష్ట్ర సంబంధాలను కెనడా నుండి, అత్యవసర పరిస్థితిని వైమర్‌(జర్మనీ)నుండి ఉమ్మడి జాబితా,పీఠికలో వాడినభాషను ఆస్ట్రేలియా నుండి, గణతంత్ర వ్యవస్థను ఫ్రాన్స్‌నుండి దత్తత తీసు కున్నారు.
ప్రవేశికే హృదయం
రాజ్యాంగం తొలి పుటలోనే ప్రస్తావన ఉంటుంది.‘‘భారతదేశ ప్రజలైన మేము..1949 సంవత్సరం నవంబర్‌ 26వ తేదీన ఈభారత రాజ్యాంగాన్ని మా కోసం రూపొందించుకుని మాకు మేమే సమర్పించుకుంటున్నాం…ఈ క్రమంలో భారతదేశాన్ని సర్వసత్తాక,సామ్యవాద,లౌకిక ప్రజా స్వామిక గణతంత్రంగా ప్రకటిస్తున్నాం, భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కింది సౌలభ్యాలను కలిగించడం లక్ష్యంగా కలిగి ఉంటుంది- సామా జిక ఆర్థిక రాజకీయ న్యాయం, ఆలోచనా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ,నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటే స్వేచ్ఛ, ఆరాధనా స్వేచ్ఛ, సమాన హోదా, సమాన అవకాశాలు, ప్రజలందరిలో దేశ సమైక్య తను, అఖండతాభావాన్ని , సోదర భావాన్ని, వ్యక్తి గౌరవాన్ని పెంపొందించడం కొసం ఈ రాజ్యాం గాన్ని సమర్పించుకుంటున్నాం’’ అని పేర్కొని ఉంటుంది. మొత్తం రాజ్యాంగాన్ని రంగరించి, వడపోస్తే వచ్చే వ్యాఖ్యలివి. ఇందులో అర్థం మొత్తం ఉంది.
నందాలాల్‌ బోస్‌ స్వీయ లిఖిత గ్రంథం
రాజ్యాంగాన్ని రూపొందించిన తర్వాత రాజ్యాంగాన్ని ప్రజలు తమకు తామే సమర్పించు కున్న దరిమిలా విశ్వభారతిలోని శాంతినికేతన్‌ కళాకారులు ప్రముఖ చిత్రకారుడు నందాలాల్‌ బోస్‌ నేతృత్వంలో చక్కనిరాతప్రతిని సిద్ధంచేశారు. రాష్ట ప్రతి డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌, ప్రధాన జవహర్‌ లాల్‌ నెహ్రూ మొదలైన ఆనాటి నేతలు ఆ ప్రతిపై తమ చేతిరాతతో సంతకాలు చేశారు.
ఘనకీర్తి
ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ, విజయవంతమైన ప్రజాస్వామ్యాన్ని ప్రసాదించిన భారత రాజ్యాంగానికి ఉన్న ఘనకీర్తి అంతా ఇంతా కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఖ్యాతి చెందిన భారత్‌లో భారీ సంఖ్యలో ప్రజలు ఎన్నికల్లో పాల్గొని, తమకు నచ్చిన నేతనే ఎన్నుకునే మహద్భాగ్యం ఈ రాజ్యాంగంతోనే వచ్చింది. రాజ్యాంగం దేశానికి వౌలిక శాసనం, ప్రభుత్వానికి మూల చట్టం.
వ్యక్తుల్లో ఆదర్శాలుండాలి
రాజ్యాంగ లక్ష్యాల ప్రాశస్త్యం అనేది దానిని అమలుచేసే పాలనావ్యవస్థల మీద, అంటే అమలుచేసే మనుష్యుల మీద ఆధారపడి ఉం టుంది. ఈవిషయాన్ని డాక్టర్‌ అంబేద్కర్‌, పండిట్‌ జవహర్‌లాల్‌నెహ్రూ, డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ అనేక మార్లు నొక్కి వక్కాణించారు. ఈ నూతన రాజ్యాం గం కింద పరిస్థితులు వక్రమార్గం తొక్కాయంటే ఆ అపరాధం రాజ్యాంగానిది కాదు, రాజ్యాంగాన్ని అమలుచేసే వ్యక్తుల వల్ల మాత్రమేనని అంబేద్కర్‌ పేర్కొన్నారు. రాజ్యాంగం సజీవంగా ఉండాలంటే అది నవనవోన్మేషంగా ఉండాలి. దేశ పరిస్థితులు, పరిణామాలకు అనుగుణంగా వొదిగేదిగా ఉండా లి. సరళంగా ఉండాలి. మార్పులకు సిద్ధంగా ఉండాలి. సమాజ మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు రాజ్యాంగం కూడా మారాలి. తగిన మార్పులకు సిద్ధంగా ఉండాలని ఆనాడే అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ స్పష్టం చేశారు. రాజ్యాంగ నిర్ణయసభ సమాపక సమావేశంలో సభాధ్యక్షుడు డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ ప్రసం గిస్తూ ‘‘రాజ్యాంగం అనేది ఎలాఉన్నా..అది దేశాన్ని పాలించే వ్యక్తులపై, దాన్ని పాలించే తీరుతెన్నులపై ప్రజల సంక్షేమం ఆధారపడి ఉంటుంది. ఇందుకు ఆ వ్యక్తులు నిజాయితీపరులై ఉండాలి.. వారికి దేశ ప్రయోజనాలు తప్ప మరో యావఉండరాదు’’ అని రాజేంద్రప్రసాద్‌ పేర్కొన్నారు. భారతదేశానికి దివ్యమైన భవిష్యత్‌ను అందించేందుకు, రాజ్యాంగ నిర్మాతల లక్ష్యాలను సాక్షాత్కారం చేసుకునేందుకు వీలు కలుగుతుంది. ఆదిశలోనే ప్రభుత్వాలు కదలాలనీ,కదులు తాయని..సగటు భారతీయుడి ఆశ.
రాజ్యాంగం ఆసక్తికర సంగతులు
1950 జనవరి 26వ తేదీ నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
రాజ్యాంగాన్ని రాసేందుకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది.
మన రాజ్యాంగాన్ని రూపొందించడానికి సుమారు రూ.64 లక్షలు ఖర్చు చేశారు.
రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 1947లో ముసాయిదా కమిటీ ఏర్పడిరది. దీనికి అంబేడ్కర్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. దీంట్లో ఏడుగురు సభ్యులతో కూడిన ప్రధాన కమిటీతో పాటు, కొన్నిఉప కమిటీలు ఏర్పడ్డాయి.
ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మనదే.
రాజ్యాంగాన్ని చేతి రాతతోనే రాశారు. ప్రేమ్‌ బిహారీ నారాయణ్‌ రాయ్‌జాదా..ఇటాలిక్‌ కాలిగ్రఫీ స్టైల్‌లో రాశారు. ప్రతి పేజీనీ కొందరు కళాకారులు అందంగా తీర్చిదిద్దారు. ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో చేతిరాతతో రాశారు.
‘భారత దేశ ప్రజలమైన మేము’ అనే ప్రవేశికతో మొదలయ్యే మన రాజ్యాంగం.. అమల్లోకి వచ్చినప్పుడు 395 ఆర్టికళ్లు, 8 షెడ్యూళ్లు,22 భాగాలుగా ఉంది.
రాజ్యాంగం మూల ప్రతులను దిల్లీలో ఉన్న పార్లమెంటు భవనంలోని గ్రంథాలయంలో చూడొచ్చు. వీటిని హీలియం వాయువు నింపిన పెట్టెలో భద్రపరిచారు.
మన రాజ్యాంగాన్ని ‘బ్యాగ్‌ ఆఫ్‌ బారోయింగ్స్‌’ అని సరదాగా అంటారు. జపాన్‌, ఐర్లాండ్‌ ఇంగ్లండ్‌, యూఎస్‌ఏ, ఫ్రాన్స్‌.. లాంటి దేశాల రాజ్యాంగాల నుంచి కొన్ని అంశాల్ని తీసుకున్నాం కాబట్టే ఆ విధంగా పిలుస్తారు. రాజ్యాంగం రాయడం 1949 నవంబరు 26వ తేదీ నాటికి పూర్తయ్యింది. ఈ తేదీనే మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకొంటాం. మరో రెండు నెలల తర్వాత అంటే..1950, జనవరి 26న రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు.
ఏడు దశాబ్దాల రాజ్యాంగం… అందించిన ప్రజాస్వామ్యం
వందకోట్ల మందికి ఆమోద యోగ్యంగా వుండే పాలనా వ్యవస్థను రూపొందించడం అంత సులభం కాదు.అంతేకాదు..దారిద్య్ర రేఖకు దిగువన వున్న వారిని జనజీవన స్రవంతిలో కలపడానికి కొన్ని చట్టాలు,వాటికి కొన్ని సవరణలూ తప్ప నిసరి..భారత దేశ స్థితి గతులను సమున్నతంగా మార్చేసిన కొన్నికీలక చట్టాలు,వారి సవరణల నొకసారి చూద్దాం..ఈ70ఏళ్లలో కాలానికను గుణంగా మనం ఎన్నో చట్టాలను రూపొందిం చుకున్నాం.. ఎన్నో సార్లు రాజ్యాంగాన్ని సవరించు కున్నాం. కొన్ని చట్టాలు దేశ గతినే మలుపు తిప్పితే..మరికొన్ని వివాదాస్పదం కూడా అయ్యా యి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 15 నెలలకే మొదటి సవరణ జరిగింది. ఈసవరణద్వారా భూ సంస్కరణలకు ఎలాంటి సవాళ్లు ఎదురు కాకుండా దానిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌ లో చేర్చారు. దీంతో రాష్ట్రప్రభుత్వాలు చేసిన ఎన్నో భూ చట్టాలకు ఇది రక్షణ కవచంలా నిలి చింది.ఒకటే బాణం..ఒకటే భార్య..ఇది శ్రీరాముడి విధా నమే కాదు..కోట్లాది భారతీయుల మనోగతం కూడా..హిందూ సంప్రదాయం..హిందూ సంస్కృతి సంప్ర దాయాలను కాపాడుకోవడానికి 1955లో హిందూ వివాహ చట్టాన్ని రూపొందించారు. ఈచట్టం ద్వారా బహుభార్యాత్వం రద్ద వడమే కా కుండా..మహిళల రక్షణకోసం విడాకుల భావ నను కూడా ప్రవేశపెట్టారు.ఇక 1986లోవచ్చిన ముస్లిం మహిళ విడాకు హక్కుల రక్షణ చట్టాన్ని వివాదాలు చుట్టుముట్టాయి. దేశంలో అప్పట్లో తలెత్తిన మత హింసకు ఈచట్టమే దోహదం చేసిం దని కొందరు కారాలు మిరియాలు నూరితే.. ముస్లిం ఛాంద సవాదుల్ని సంతృప్తి పరచడం కోసమే దానిని తెచ్చి నట్టు మరికొందరు మండిపడ్డారు. ఇక సామాజిక రుగ్మతైన అంటరానితనాన్ని తరిమి వేయడానికి మన ప్రభుత్వానికి అయిదేళ్లు పెట్టింది. అంటరాని తనాన్ని నేరంగా ప్రకటిస్తూ 1955లో చట్టాన్ని చేశారు. దేశంలోభాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమం అప్పట్లో ఊపందుకుంది. దీంతో 1956 లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా దేశాన్ని 14 రాష్ట్రాలు,7కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిం చారు. తెలుగు, మళయాళీ, కన్నడీ గులకు ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. ప్రపం చంలోనే రెండవ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది.ప్రపంచంలో మరెక్క డాలేనన్ని రాజకీయ పార్టీ లున్న దేశం కూడా మనదే..1980వ దశకం భారత రాజకీ యాల్లో అనారోగ్యకర ధోరణులకు బీజం పడిన సమయం..అధికార కాంక్షకు తోడు ఆయారాం,గయారాం సంస్కృతి పెచ్చరిల్లిన తరుణమూ అదే..దీని నియం త్రణ కోసమే ఫిరా యింపుల నిరోధక చట్టాన్ని తెచ్చింది.ఆమ్‌ఆద్మీ..ఈనినాదంతో అధికారం లోకొచ్చిన..యుపి ఏగ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చట్టంగా చేసి నిరుద్యోగాన్ని,ఆకలి కేకలను రూపుమాపాలని తలపెట్టింది. అన్నదే తడవుగా రాజ్యాంగ సవరణ ద్వారా ఉపాధి హామీ పథకాన్ని చట్టం చేసింది. గ్రామీణ భారతావని రూపు రేఖలను సమున్నతంగా మార్చేసిన చట్టమది. సామా న్యుడి చేతిలో వజ్రా యుధం సమాచార హక్కు చట్టం..ప్రభుత్వ పాలనపై ఇదో డేగ కళ్ల పహారా.. అవినీతి, రెడ్‌ టేపి జం వేళ్లూనిన మన సమాజంలో తప్పు చేసిన అధికారి ఎంత పెద్ద వాడైనా నిలదీసే హక్కుని ఈచట్టం కల్పిస్తోంది.అంతేనా గతి తప్పి నడు చుకునే అధికారులపై కొరడా రaళిపిం చడానికీ ఈ చట్టం ఉపయోగపడు తోంది.
రాజ్యాంగమే రాచబాట
భారతీయ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగమే రాచబాటని సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రెబ్బాప్రగడ రవి పేర్కొన్నారు.72వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ పట్నంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎండాడ ఎస్సీకాలనీ,జిల్లా పరిషత్‌,ఉన్నత పాఠశాలల్లో విద్యార్ధులకు రాజ్యాంగం`విలువలు అనే అంశంపై మాట్లాడారు. భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోకెల్లా ఎంతో విశిష్టతను సంతరించుకుందని పేర్కొన్నారు. విద్యార్ధులంతా సమానత్వభావన కలిగి డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ ఆశయాలు,వారి సిద్దాంతాలను స్పూర్తిగా తీసుకుని విద్యావంతులుగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.న్యాయ,సాంఘిక,ఆర్థిక,రాజకీయ, స్వేచ్ఛా భావన,భావప్రకటన,నమ్మకం,విశ్వాసం,గౌరవం,సమానత్వం,అవకాశాలను పెంచుట.. సౌభ్రాతృ త్వం,వ్యక్తి హోదా,జాతిఐక్యత, సమగ్రతను పెంపొందించుటే రాజ్యంగం ఉద్దేశమని సూచించారు. దీన్ని గౌరవించడం మన అందరి కర్తవ్యమని పిలుపు నిచ్చారు.అంబేద్కర్‌ చెప్పినట్లుగా దేశం అభివృద్ధి చెందడ మంటే,అద్దాల మేడలు,రంగుల గోడలు కాదు..పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధిని పేర్కొన్నారని గుర్తిచేశారు.స్వయం పాలనాధికారాన్ని దక్కించుకున్న ఇండియాలోని అన్ని మతాలు,తెగలు,దళితులు,గిరిజనులు,వెనుకబడిన కులాల తదితర వర్గాలకు సైతం న్యాయం జరిగేలా, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు, సర్వసత్తాక సౌర్వభౌమాధికారాన్ని దక్కించుకొనేందుకు వీలుగా రాజ్యంగాన్ని రూపొందించాల్సిన బాధ్యత అప్పటి ప్రభుత్వంపై పడిరది. ప్రభుత్వ విధివిధానాలు,శాసనసభల రూపకల్పనతోపాటు కోట్లాది మంది పీడిత ప్రజల ఆశయాలను ప్రతిబింభించేలా రాజ్యాంగాన్ని లిఖించారని విద్యార్థులకు వివరించారు.-గునపర్తి సైమన్‌

ఆదివాసీల కీర్తి…పోరాటాల‌కు స్పూర్తి

ఆదివాసీల్లో పోరాట భావాలను రగిలించిన తొలి వ్యక్తి, బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా ’’స్వయం పాలన’’ నినాదంతో సమరశంఖం పూరించిన ఆదివాసీల తొలి బాణం శ్రీ భగవాన్‌ బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి శతకోటి ప్రణామాలు. స్వతంత్ర భారతావనిలో గిరిజనులకు ఇంత గౌరవం దక్కడ ఇదే తొలిసారి’
‘‘ గిరిజనులు.. ప్రకృతి ఒడిలో జీవనం సాగి స్తూ.. సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడు కుంటూ  వస్తున్నారు.దేశ స్వాతంత్య్ర సమరంలో బిర్సాముండా.. నిజాంకు వ్యతిరేకంగా జల్‌`జంగిల్‌`జమీన్‌ అన్న నినాదంతో కొమరం భీం లాంటి ఎంతోమంది గిరిజన యోధులు పోరాటాలు చేశారు. అలాంటివారికి సమున్నత స్థానం కల్పించాలని కేంద్రప్రభుత్వం ఏటా నవంబరు 15న భగవాన్‌ బిర్సాముండా పేరిట (15న జనజాతి) గిరిజన గౌరవ దినోత్సవాన్ని నిర్వహించేందు కు సంకల్పించింది. మొట్టమొదటి సారిగా  షెడ్యూల్‌ ప్రాంతాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం దేశంవ్యాప్తంగా ఉన్న తొమ్మిది షెడ్యూల్‌ రాష్ట్రాల్లో అంరగంగ వైభంగా జరిగింది.’ఆదివాసీ హక్కుల కోసం ఆంగ్లేయుల పాలనను ఎదరించిన బిర్సాముండా జయంతి రోజునే ఏటా గిరిజన గౌరవ దిరోత్సవం నిర్వహించా లని ప్రభుత్వం నిర్ణయించింది. రaార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన బిర్సాముండా ఆదివాసీ ముద్దుబిడ్డగా కీర్తి గడిరచారు.చరిత్రలో సమున్నత స్థానం కల్పించేందుకు ఆయన జయింతిని ఉత్సహంగా నిర్వహించారు.
భావితరాలకు తెలిసేలా
గిరిజన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు,వారి జీవన విధానాలు, వినియోగించిన వస్తవులు,లిపి, సాహిత్యం, తదితర సమాచారాన్ని వరంగల్‌ హంటల్‌ రోడ్డులోని గిరిజన విజ్ఞాన పీఠంలో నిక్షిప్తం చేశారు. పోట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ విద్యార్ధులు విజ్ఞానపీఠంలో గిరిజనుల జీవనశైలిపై పరిశోధనలు చేస్తుంటారు. భావితరాలకు గిరిజనుల సంస్కృతిని తెలిపేందుకు ఇదెంతో ఉపయోగపడుతుంది. విశాఖ జిల్లా అరకు,మేడారంలో ఉన్న గితరిజన మ్యూజియంలు గిరిజనులు పూర్వం నుంచి నేటి వరకు వినియోగిస్తున్న వస్తువులెన్నో అందులో పొందుపర్చారు.కళాఖండాలు,అంతరించిపోతున్న కళాకృతులు,ఇతర వస్తువుల సేకరించిపెట్టారు. సమ్మక్క సారలమ్మ జీవిత చరిత్రను బొమ్మల రూపంలో ఏర్పాటు చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. విదేశాల నుంచి సైతం వచ్చి వనదేవతలను దర్శించుకుంటారు.
ప్రకృతి ఆరాధకులు
పూజించే దేవతకు రంగు,రూపం,ఆకారం అంటూ ఏవీ ఉండకుండా ప్రకృతి మాతనే ఆదిశక్తి స్వరూపిణిగా భావిస్తారు. ప్రకృతి ఒడిలో సహజసిద్దంగా పుట్టి పెరిగిన చెట్లను,చెట్టు కొయ్యలను,బండరాళ్లను దేవతల ప్రతిరూపాలుగా భావించి పూజించడం ఆనవాయితీ.ఆలయాలు నిర్మించకుండానే కొలుస్తారు. ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలతో ఆదివాసీల్లో సుమారు 35వరకు తెగలుంటాయి. వర్షాకాలం ప్రారంభంలో మొదటిసారిగా వచ్చేది విత్తనాల పండు. విత్తనాలు వేసే ముందు వాటిని దేవతా మూర్తుల ముందు ఉంచి పూజలు నిర్వహి స్తారు. దేవుడి అనుమతితో పంట వేసినట్లు భావిస్తారు. దీంతో అధిక దిగుబడులు వస్తా యనేది నమ్మకం. పెద్దల పండుగ నాడు గ్రామ పెద్దల సమక్షంలో కొత్తగా పెళ్లైన జంటలను కలుపుకుంటారు.
వన వీరులను స్మరిస్తూ..
బిర్సా ముండా జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఆయన జయంతిని ప్రతి ఏటా ‘జనజాతీయ గౌరవ్‌ దివస్‌’గా నిర్వహిస్తామని తెలిపారు. గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతి అయిన నవంబర్‌ 15ను ఇక నుంచి ఏటా ‘జనజాతీయ గౌరవ్‌ దివస్‌?’గా జరుపుకో నున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. బిర్సా ముండా స్మారకార్థం రaార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఏర్పాటు చేసిన మ్యూజియంను మోదీ ఆవిష్కరించారు.‘‘ఆజాదీకా అమృత్‌ మహోత్స వాలు జరుగుతోన్న ఈ సమయంలో గిరిజన యోధుల సాహసాలు, సంప్రదా యాలకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. గిరిజ నుల కష్టసుఖాలను నేను దగ్గరుండి చూశాను. వారి జీవనవిధానం, అవసరాలు అన్నీ నాకు తెలుసు. కాబట్టి వ్యక్తిగతంగా ఈ రోజు నాకు చాలా ప్రత్యేకం. బిర్సా ముండా జయంతి సందర్భంగా చారిత్రక నిర్ణయం తీసు కున్నాం. మధ్యప్రదేశ్‌ భోపాల్‌లో జరిగిన జన జాతీయ గౌరవ్‌ దివస్‌ మహాసమ్మేళనంలో మోదీ పాల్గొన్నారు. బిర్స ముండాకు నివాళులర్పించారు. ‘‘ నేడు దేశం మొదటి జనజాతీయ గౌరవ్‌ దివస్‌ జరుపుకుంటున్నాం.స్వాంతంత్య్రం తర్వాత తొలిసారి గిరిజనుల కళ, సంప్రదా యాలు, స్వాతంత్య్రంలో వారి పాత్రకు తగిన గౌరవం లభించింది. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో జరిగిన కార్యక్రమంలో తెలంగణా రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ హజరై బిర్సాముండాకి నివాళులర్పించారు. బ్రిటిష్‌ వలసవాదం,దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించిన గిరిజన యోధుడు, బెంగాల్‌ ప్రెసిడెన్సీ (ప్రస్తుత రaార్ఖండ్‌) ప్రాంతానికి చెందిన బిర్సాముండా జయంతిని పురస్కరించుకుని గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల స్మారకార్థం నవంబర్‌ 15ను జన జాతీయ గౌరవ్‌ దివస్‌గా పాటించాలని కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. ఈ మేరకు కేంద్రమంత్రి వర్గం నిర్ణయించగా, అఖిల భారత వనవాసి కల్యాణ పరిషత్‌ తెలంగాణ శాఖ ఇదివరకే ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో జనజాతి గౌరవ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, ఆత్మీయ అతిథిగా ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు సోయం బాపురావు పాల్గొననున్నారు. జాతీయ నాయకుడిగా బిర్సాముండాకు గుర్తింపు గిరిజన యోధుడు బిర్సాముండాను జాతీయ నాయ కుడిగా ప్రభుత్వం గుర్తించిందని.. ఎస్టీలకు ఇది గర్వకారణమని పేర్కొన్నారు.
కేంద్రం మరియు రాష్ట్రాలు‘‘వాక్‌ ది టాక్‌’’ చేయాలి!
ఉమ్మడి ఏపీలో గిరిజన సంక్షేమ శాఖ మాజీ కమిషనర్‌ ఇఏఎస్‌శర్మ నవంబర్‌ 15, 2021న జనజాతీయ గౌరవ్‌ దివస్‌ కార్యక్ర మంపై ఇటీవల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్త రాన్ని యథా విధిగా తెలుగు అనువాదంలో ప్రధాన మంత్రి ప్రియమైన శ్రీ మోదీ..నవంబర్‌ 15న జరిగే మొట్టమొదటి జనజాతీయ గౌరవ్‌ దివస్‌కు మీరు నాయకత్వం వహిస్తారని నాకు అర్థమైంది. సంవత్సరం, ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా. భారత జనాభాలో 8శాతం కంటే ఎక్కువ ఉన్న ఆదివాసీలు దీనిని స్వాగతిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటు న్నాను, కేంద్రం మరియు రాష్ట్రాలు రాజ్యాంగంలోని ఐదవ మరియు ఆరవ షెడ్యూల్‌ ప్రకారం తమకు లభించే హక్కులను ఇకపై పూర్తిగా గౌరవిస్తాయని ఆత్రుతగా ఆశిస్తున్నాను. రాజ్యాంగ నిర్మాతలు చాలా విస్తృతమైన మరియు అత్యంత జ్ఞానోదయమైన చర్చల తర్వాత స్పృహతో ప్రవేశపెట్టిన ఐదవ షెడ్యూల్‌లోని పారా5,షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు వర్తించే ప్రతి చట్టాన్ని సమీక్షించడానికి మరియు తీసుకురావడానికి కేంద్రం మరియు రాష్ట్రాలను అనుమతించే ఒక ప్రత్యేక నిబంధన. వారు ఆదివాసీల ప్రయోజ నాలకు అనుగుణంగా ఉన్నారు. రాజ్యాంగ పరిషత్‌ ప్రత్యేక ప్రతిపత్తిని ఆమోదించి ఏడు దశాబ్దాలు గడిచినా, నేరస్థులకు సంబంధించిన చట్టాలు,ఆదివాసీల జీవితాలను విమర్శనాత్మకంగా ప్రభావితం చేసే చట్టాలను సమీక్షించి వాటిని మార్చేందుకు కేంద్రం లేదా రాష్ట్రాలు పట్టించుకోలేదు. పౌర న్యాయవ్యవస్థలు,మైనింగ్‌ కార్యకలాపాలకు సంబంధించిన చట్టాలు, అటవీచట్టాలు, భూమి మరియు ఇతర వనరులపై ఆదివాసీల ఊహాజనిత హక్కులను పరి రక్షించే చట్టాలు మొదలైనవి.ఉదాహరణకు, జాతీయ అటవీ విధానం లేదా అటవీ (సంరక్షణ) చట్టానికి ఇటీవల మీ ప్రభుత్వం ప్రతిపా దించిన సవరణలు,ఆదివాసీల గురించి ప్రస్తావించ వద్దు, ఆదివాసీల జీవితాలు సహజీవనంగా ఉన్నప్పటికీ, వారికి ఏది సరిపోతుందో తెలుసుకునే ప్రయత్నం చేయవద్దు. అవి విమర్శనాత్మకంగా ఆధారపడిన అడవులతో ముడిపడి ఉన్నాయి. రెండు కేంద్ర చట్టాలు ఉన్నాయి, అవి పంచా యితీలు (షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు పొడిగింపు) చట్టం, 1996 (క్లుప్తంగా ూజుూA అని పిలు స్తారు) మరియు షెడ్యూల్డ్‌ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం,2006 (క్లుప్తంగా అటవీ హక్కుల చట్టం (ఖీRA),ఇది వారి జీవి తాలను ప్రభావితం చేసే కార్యక్రమాలు, ప్రాజెక్ట్‌లు మరియు కార్యక లాపాలపై నిర్ణయం తీసుకోవడంలో స్థానిక ఆదివాసీ గ్రామసభలకు తుది నిర్ణయం తీసుకునే అధికారం ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ పట్నం జిల్లాలోని షెడ్యూల్డ్‌ ఏరియాలో ఖనిజా భివృద్ధికి సంబంధించిన సుప్రసిద్ధ సమతా కేసులో, 1997జూలై 11న, ఒకటి వెలువ రించిన రెండు మైలురాయి తీర్పులలో భారత సర్వోన్నత న్యాయస్థానం ఈ వైఖరిని అస్పష్టంగా పునరు ద్ఘాటించింది. రెండవది ఏప్రిల్‌ 18, 2013న రాష్ట్రంలోని కలహండి/రాయగడ జిల్లాల్లోని వేదాంత కంపెనీకి ఒడిశా ప్రభుత్వం మం జూరు చేసిన మైనింగ్‌ లీజుపై.ఈ రెండు కేసుల్లోనూ,సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ఆదివాసీ గ్రామసభలను విస్మరించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నించాయి, అత్యున్నత న్యాయస్థానం ఇది ఆమోదయోగ్యం కాదు. ఛత్తీస్‌గఢ్‌, రaార్ఖండ్‌,ఒడిశా మొదలైన షెడ్యూల్డ్‌ ప్రాంతాలలో ఉన్న పెద్ద సంఖ్యలో ఖనిజాలు మరియు బొగ్గు బ్లాకులను వేలం వేయాలనే కేంద్రం ఏకపక్ష నిర్ణయం విషయం లో ూజుూA, ఖీRA రెండిరటినీ పూర్తిగా ఉల్లం ఘించిన ఇటీవలి ఉదాహరణ.వేలానికి ముందు ఏ సమయంలోనైనా, కేంద్రం మరియు రాష్ట్రాలు స్థానిక గ్రామసభలను ఈ ప్రతిపాద నను వివరంగా చర్చించడానికి మరియు వారి అభిప్రాయాలను తెలియజేయడానికి అనుమతిం చలేదు,అయినప్పటికీ దాని నుండి ఉత్పన్నమ య్యే మైనింగ్‌ కార్యకలాపాలు వారి నివాసాలను మరియు వారి జీవితాలను కోలుకోలేని విధంగా విఘాతం కలిగిస్తాయి. వాస్తవానికి, వేలం వేయ డానికి వీలుగా ఖనిజాభివృద్ధి చట్టాలకు గతం లో అనేక సుదూర సవరణలను కేంద్రం ప్రవేశపెట్టినప్పుడు, అది ఒక్కసారి కూడా ప్రయత్నించని ఆదివాసీల అభిప్రాయాలను ముందుగానే కోరింది! ఐదవ షెడ్యూల్‌లోని 5వ పేరాలోని స్ఫూర్తికి అనుగుణంగా,అటవీ మరియు ఖనిజాభివృద్ధి చట్టాలను సవరించ డానికి ప్రతిపాదించే ముందు, కేంద్రం మరియు రాష్ట్రాలు ఆదివాసీ గ్రామసభలు, ఎన్నికైన ఆదివాసీ శాసనసభ్యులు మరియు ఆదివాసీ సంఘాలను సంప్రదించి ఉండాలి. ప్రతిపాదిత చట్టాలు ఆదివాసీ ప్రయోజనాలను సమర్థించేలా చూసేందుకు. బదులుగా, కేంద్రం ఏకపక్షంగా ముందుకు సాగాలని ఎంచుకుంది! షెడ్యూల్డ్‌ తెగల జాతీయ కమీషన్‌ (చీజూు) రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 338A ప్రకారం షెడ్యూల్డ్‌ తెగ లకు సంబంధించిన అన్ని విధాన విషయా లపై ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికి మరియు వారి ప్రయోజనాలను పరిరక్షించడానికి రూపొం దించబడిన ఒక ప్రముఖ సంస్థ. ఆఆర్టికల్‌ క్లాజ్‌ (9) ప్రకారం యూనియన్‌ మరియు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ‘‘షెడ్యూల్డ్‌ తెగలను ప్రభావితం చేసే అన్ని ప్రధాన విధాన విషయాలపై కమిషన్‌ను సంప్రదించాలి’’. పైన పేర్కొన్న చట్టబద్ధమైన సవరణలను ప్రవేశపెడుతున్నప్పుడు, నాకు తెలిసినంతవరకు,చీజూుతో ఇంత విస్తృతమైన ముందస్తు సంప్రదింపులు జరగలేదు. జనజా తీయ గౌరవ్‌ దివస్‌ వేడుకల్లో భాగంగా,శతా బ్దానికి పైగా తన కమ్యూనిటీ హక్కుల కోసం పోరాడిన గొప్ప ఆదివాసీ నాయకుడి జ్ఞాపకార్థం మీరు రాంచీలో బిర్సా ముండా ఫ్రీడమ్‌ ఫైటర్‌ మ్యూజియాన్ని ప్రారంభించ బోతున్నారని నేను అర్థం చేసుకున్నాను. బిర్సా ముండా నేతృత్వం లోని చోటానాగ్‌పూర్‌లో జరిగిన ఆదివాసీ ఉద్య మాలు, ఎనిమిది దశాబ్దాల క్రితం కొమరం భీం నేతృత్వంలో తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా లో జరిగిన తిరుగుబాటు,శతాబ్దానికి పైగా ముర్ము వర్గం నేతృత్వంలోని సంతాల్‌ తిరుగు బాటు చట్టబద్ధమైన ముసుగులో జరిగింది. ఆదివాసీల హక్కులు,ఆ కాలంలో పూర్వపు పాలకవర్గం ద్వారా తుంగలో తొక్కివే యబడిరది. వారి జ్ఞాపకాలను గౌరవించా లంటే,ఆరోజుల్లో ఆదివాసీలు తిరుగుబాటుకు దారితీసిన పరిస్థి తులను అర్థం చేసుకోవడం మరియు ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఆదివాసీ సంఘాలను మరియు వారి హక్కులను గౌరవించేలా చూసు కోవడం కంటే సరైన మార్గం మరొకటి ఉండ దు. తప్పులు.జన్‌ జాతీయ గౌరవ్‌ దివస్‌ దేశం లోని ఆదివాసీల హక్కులను పూర్తి స్థాయిలో గుర్తించడానికి నాంది పలుకుతుందని మరియు కేంద్రం మరియు రాష్ట్రాలు కలిసి ూజుూA,ఖీRA రెండిర టినీ పూర్తిగా అమలు చేయాలని సంకల్పిస్తా యని నేను ఆశిస్తున్నాను మరియు విశ్వసిస్తు న్నాను. ఆదివాసీ జీవితాలను ప్రభావితం చేసే విధానాలు, ప్రాజెక్టులు, కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకోవ డంలో. ఆదివాసీల జీవి తాలను ప్రభావితం చేసే దేశం లోని అన్ని ముఖ్యమైన చట్టాలను సమీక్షిం చి,షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు వర్తించేంత వరకు వాటిని ఆది వాసీల ప్రయోజనాలకు అనుగు ణంగా మార్చా లని కేంద్రం మరియు రాష్ట్రాలు రెండూ కూడా సంకల్పించు కుంటాయని నేను ఆశిస్తున్నాను.దేశ నిర్మాణంలో ఆదివాసీలను సమాన భాగస్వాములుగా కేంద్రం,రాష్ట్రాలు గుర్తించాలి. దేశంలో ఎన్నుకో బడిన అన్ని ప్రభుత్వాలు ఆదివాసీలకు తమ రాజ్యాంగ పరమైన బాధ్యత లను గ్రహించి, నెరవేర్చడానికి జనజాతీయ గౌరవ్‌ దివస్‌ను రిమైండర్‌గా మార్చడంలో మీరు ముందుం టారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఆది వాసీల రాజ్యాంగ హక్కులకు తగిన గుర్తింపును కల్పించడంలో విఫల మైతే, దేశం మొత్తం భవిష్యత్తు శ్రేయస్సుకు మేలు జరగదు.-గునపర్తి సైమన్‌

కొఠియా గ్రామాల వివాదంపై ఆంధ్ర‌-ఒడిశా జాయింట్ క‌మిటీ

ఒక ఓటరు...ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేస్తే అది నేరం. అలావేస్తే ఆ రెండు ఓట్లూ చెల్లవు.కానీ ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉన్న 34 గ్రామాలకు చెందిన దాదాపు 4 వేల మంది ఓటర్లు అధికారికంగా రెండేసి ఓట్లు వేస్తారు. అది ఒక రాష్ట్రంలో కాదు.... రెండు రాష్ట్రాల్లో.అలా ఓట్లు వేయడం కోసమే ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రెండూ రాష్ట్రాలు వీరికి పోటీ పడి ఓటు హక్కుతో పాటు అనేక పథకాలు అందిస్తున్నాయి. దీంతో ఇక్కడ గిరిజనులకు రెండు రేషన్‌ కార్డులు, రెండు పింఛన్‌ కార్డులు, రెండు ఓటరు కార్డులు...ఇలా అన్నీ రెండేసి ఉంటాయి. అలాగే రెండు రాష్ట్రాల ప్రజాప్రతినిధులను వీరు ఎన్నుకుంటారు. ఈ గ్రామాల కథేంటి? వీటిపై రెండు రాష్ట్రాలకూ ఇంత ప్రేమ దేనికి? అనే అంశాలపై సమగ్ర కథనం.!                                                                                                                        సర్వేతో మొదలైన సమస్య…
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లాల మధ్య ఉండే షెడ్యూల్‌ ప్రాంతంలోని 21 గ్రామాల్ని కొటియా గ్రామాలుగా పిలుస్తారు.ఇక్కడ దాదాపు 15 వేల మంది నివసిస్తున్నారు. వీరిలో 3,902 మంది ఓటర్లు. వీరు ఇటు ఆంధ్రాలోనూ,అటు ఒడిశాలో ఓటు హక్కును కలిగి ఉంటారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు అవతరించి నప్పుడు కొటియా గ్రామాల్లో సర్వే జరగలేదు. వీటిని ఏ రాష్ట్రంలోనూ కలపలేదు. ఈ గ్రామా లు తమ పరిధిలోనివేనంటూ ఇరు రాష్ట్రాలూ వాదిస్తున్నాయి. 1968లో సుప్రీంకోర్టునూ ఆశ్రయించాయి.అప్పటి నుంచి ముందుకు కదలని కొటియా కేసుపై 2000లో సుప్రీం కోర్టు ఓప్రతిపాదన చేసింది. దాని ప్రకారం కొటియా సమస్యను పరిష్కరించేందుకు ఇరు రాష్ట్రాల సమ్మతితో జైపూర్‌ జిల్లా జడ్జి అధ్యక్ష తన ఆరుగురు సభ్యుల కమిటీని వేసింది. అందు లో ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు,న్యాయ వాదులు ఉన్నారు. కొటియా విషయంలో ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటనలు, కోర్టులో వాదనలు చేసింది. అయినా విషయం కొలిక్కి రాలేదు. తర్వాత 2006లో ఈ సమస్యని పార్ల మెంటులో తేల్చుకోవాలని సుప్రీం కోర్టు సూచిం చింది.
ఇప్పటికీ ఈ పంచాయితీ తేలలేదు.
కొటియా గ్రామాలుగా ఉన్న 21 గ్రామలు… మరికొన్ని గ్రామాలుగా విడిపోయి వాటి సంఖ్య ప్రస్తుతం 34కి చేరిందని కొటియా కమిటీలో ఏపీ తరపున స్పెషల్‌ కౌన్సిల్‌గా పని చేసిన విజయనగరం జిల్లాకు చెందిన న్యాయవాది ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌ రాజు బీబీసీతో చెప్పారు. ‘1942లో పరిపాలనా సౌలభ్యం కోసం బ్రిటిష్‌ ప్రభుత్వం రాష్ట్రాలను ఏర్పాటు చేయాలనే ఆలోచన చేసింది. దానికోసం 1942లో సర్వే జరిపించింది. ఆ క్రమంలో ఏపీ,ఒడిశా, మధ్య ప్రదేశ్‌,బిహార్‌ రాష్ట్రాల సరిహద్దులు నిర్ణయిం చేందుకు గిల్‌.జి అనే సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డు కార్యాలయ అధికారి సర్వే నిర్వహిం చారు. ఇందులో ఏపీ,ఒడిశా సరిహద్దుల్లోని 101 గ్రామాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వీటిలో కొన్నింటిని ఇరు రాష్ట్రాల్లో విలీనం చేయగా…కొటియా పంచాయతీ పరిధిలో 21 గ్రూపు గ్రామాల సంగతి తేల్చ లేదు. అప్పట్నుంచి ఈ గ్రామాలు తమవంటే తమవని ఒడిశా, ఆంధ్రా పట్టుబడుతున్నాయి. ఈ గ్రామాల వివాదంపై రెండు రాష్ట్రాలు 1968లో సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే…కోర్టు స్టేటస్‌ కో విధించింది. దీంతో ఇప్పటికీ పరి ష్కారం లభించలేదు. అసలు కొటియా గ్రామాల సమస్యపై అవగాహన ఉన్నవారు కూడా లేరు. ఏపీ తరపున ఈ సమస్యపై పని చేసిన ఆర్జేడీ చనిపోయారు. కాకినాడకు చెందిన మరో సర్వే యర్‌ చలపతిరావు రిటైర్డ్‌ అయి పోయారు. ప్రస్తుతానికి ఈ సమస్యపై అవగాహన ఉండి పని చేసిన వారిలో నేను,చలపతి రావు మాత్రమే ఉన్నాం’’ అని ఆయన తెలిపారు.
పథకాలు ఆంధ్రా…పనులు ఒడిశా…
గత ఏడాది ఫిబ్రవరిలో ఒడిశా స్థానిక ఎన్ని కల్లో ఓటేసిన ఈ గిరిజనం..ఇప్పుడు ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కును విని యోగించుకున్నారు.కొటియా,కురిటిభద్ర, మడ కార్‌,డోలియాంబ తదితర గ్రామలు ఒడిశాకు….నేరేళ్లవలస,ఎగువశెంబి, దిగు వశెంబి,ధూళిభద్ర,మూలతాడివలస,పగులు చెన్నేరు,పట్టుచెన్నేరులు,సొలిపిగుడ,శిఖపరువు గ్రామాలు ఏపీ భూభాగానికి సమీపంలో ఉంటా యి. మిగతావి రెండు సరిహద్దులకి దాదాపు సమాన దూరంలో ఉంటాయి.దీంతో ఏ రాష్ట్రా నికి సమీపంగా ఉన్న గ్రామాలపై ఆరాష్ట్ర ప్రభుత్వం పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇందులో ఒడిశారాష్ట్రానిదే పైచేయిగా కనిపిస్తోంది.ఎందుకంటే రోడ్లు వేయడంతోపాటు అనేక కార్యాలయాలు ఆ రాష్ట్రం నిర్మిస్తోంది.ఎక్కడ చూసినా ఒడిశా కార్యాలయాలు,ఒరియా భాషలోని బోర్డులే కనిపిస్తున్నాయి తప్పా…తెలుగు భాషలో అరుదు గా బోర్డులు కనిపిస్తాయి. అయితే రెండు రాష్ట్రా ల ఫలాలను అందుకుంటున్న కొటియా గ్రామా ల గిరిజనం అభివృద్ధి కోసం ఒడిశా ప్రభు త్వాన్ని, సంక్షేమ పథకాల కోసం ఏపీ ప్రభుత్వా న్ని నమ్ముకుంటున్నారు.‘‘మమ్మల్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు బాగా చూసుకుంటున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం పథకాల ద్వారా మాకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. ఒడిశా ప్రభుత్వం ద్వారా తక్కువ వస్తున్నాయి. కానీ ఒడిశా ప్రభుత్వం రోడ్లు వేయించింది. గత ఏడాది వరకు మా గ్రామాలకు ఎక్కడికి వెళ్లాలన్నా రాళ్లు రప్పులు తేలిన దారుల్లోనే వెళ్లేవాళ్లం. ఇప్పుడు కొత్త తారు రోడ్లపై వెళ్తున్నాం. అలాగే ఒడిశా మాకు ఇళ్లు కూడా కట్టించింది. మాకు రెండు ప్రభు త్వాలు కావాలి. రెండు ప్రభుత్వాలు అందించే పథకాలు కావాలి. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయిస్తే…వాళ్లు ఏరాష్ట్రంలో ఉండమంటే అక్కడే ఉంటాం. అప్పటి వరకూ మాత్రం రెండు రాష్ట్రాల ఎన్నికల్లో మేం ఓటేస్తాం’’ అని కొటియా గ్రామాల్లో ఒకటైన పట్టుచెన్నూరు నివాసి బుట్రూ చెప్పారు.వివాదస్పద కొటియాలో రాజకీయాలు ఇప్పటివరకు రెండు రాష్ట్రాల సమస్యగా ప్రభుత్వాల మధ్య నలుగుతున్న సమస్యలోకి రాజకీయాలు చేరాయి. ఎన్నికల సమయం కావడంతో రాజకీయ నాయకులు ఈ ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నారు. కొటియా గ్రామాల్లో ఒడిశా బీజేపీ నాయకులు పర్యట నలు చేస్తున్నారు. ఆంధ్రా ప్రభుత్వం నిర్వహించ నున్న పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనవద్దని కొటియా వాసులకి ఒడిశా బీజేపీ నాయకత్వం సూచించింది. అలాగే అయా ప్రాంతాల్లో ఒడిశా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ఆరా తీసింది. ‘‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తనది కాని ప్రాంతంపై పట్టుసాధించేందుకు సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇది ముమ్మాటికి తప్పు. ఇప్పుటికే ఒడిశా సరిహద్దులోని అనేక ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌ ఆక్రమించుకుంది. ఇది పూర్తిగా ఒడిశా ఇంటిలిజెన్స్‌ విభాగం వైఫల్యం. ఒడిశా ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి… కేంద్రం తో మాట్లాడి భూభాగాన్ని కాపాడుకోవాలి. ఇప్పటీకే ఒడిశా సుప్రీంకోర్టులో కేసు వేసిందని తెలిసింది. ఈ ప్రాంతాలను ఒడిశా సాధించే వరకు పోరాటం ఆపకూడదు. దీనికి పూర్తిగా సహకరిస్తుంది’’ అని బీజేపీ నాయకుడు ఒకరు చెప్పారు.మరో వైపు కొటియా పంచాయతీలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న పంచా యతీ ఎన్నికలను ఆపేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిబ్రవరి 10వ తేదిన (2021)హైకోర్టులో పిల్‌ నమోదైంది. భారత్‌ బికాస్‌ పరిషత్‌ అనే స్వంచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఈ పిల్‌ వేశారు.
కొటియాపై ప్రేమకు ఖనిజాలే కారణమా…?
కేసులు, క్షేత్రస్థాయి పర్యటనలు, రాజకీయాలు ఎలా ఉన్నా…అసలు ఈ ప్రాంతంపై ఇరు రాష్ట్రాలకు ఇంత ప్రేమ ఎందుకు?గిరి శిఖర ప్రాంతంలో ఎవ్వరికి పట్టనట్లు ఉండే ఈ కొటి యా గ్రామాల్లో వందల కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు పోటీపడి మరీ రెండు రాష్ట్రాల ప్రభు త్వాలు అభివృద్ధి పనులు చేస్తున్నాయి?ఈ ప్రాం తంలో విలువైన ఖనిజాలు ఉన్నాయని…వాటిని దక్కించుకోవాంటే ముందుగా ఇక్కడి గిరిజనుల మనస్సుని గెల్చుకోవాలని… అందుకే ప్రభుత్వా లు పోటీపడి మరి పథకాలు ఇస్తూ పనులు చేస్తున్నాయని వామపక్షనాయకులు అంటున్నారు. ‘‘ఇక్కడ చాలా రోజులుగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏదో సాకుతో కొండలు తవ్వడం చేస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే ఇక్కడ రహ స్యంగా ఖనిజ అన్వేషణ జరుగుతుందనే అనిపిస్తుంది. అయితే ఏదో ఒక రూపంలో ప్రజలకు మంచి జరగడం శుభపరిణామమే… కాకపోతే ఈ వివాదాన్ని త్వరగా తేల్చుకోక పోతే… ప్రస్తుతానికి గిరిజనులకి బాగున్నా… భవిష్యత్తులో సమ్యలు వచ్చే అవకాశం ఉంది’’ అని స్థానిక వామపక్ష నాయకులు కిల్లి సురేశ్‌ చెప్పారు. కొటియా గ్రామాల పరిధిలో ఖనిజ సంపద అనే మాట అందరి నోటా వినిపిస్తూనే ఉంది. అసలు నిజంగా ఇక్కడ ఖనిజాలు ఉన్నాయా అనే విషయంపై ఏయూ జియాలజీ విభాగం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ వెంకటేశ్వరావు వెల్లడిరచారు. ‘‘తూర్పు కనుమల్లో చాలా చోట్ల ఖనిజాలు ఉన్నాయి. ముఖ్యంగా బాక్సైట్‌ వంటి ఖనిజాలు విస్తరంగా ఉన్నాయి. మనం ఒప్పు కున్నా…లేకున్నా…ఖనిజాలను తవ్వడానికి ఏ ప్రభుత్వమూ సంకోచించదు. విలువైన ఖనిజా లున్న ప్రాంతాలను తమ పరిధిలోకి తెచ్చుకో వాలనే చూస్తాయి. కొటియా గ్రామాల పరిధి లోని కొండల్లో కూడా విలువైన ఖనిజాలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ తూర్పు కనుమల్లోని ఈ బెల్ట్‌లో మాంగనీసు, ఇనుము,లైమ్‌ కంకర,క్వార్జ్‌,గ్రానెట్కట్‌, రంగు రాళ్లు వంటి ఖనిజ సంపద ఉంది. వీటితో పాటు జల,జంతుసంపద కూడా అపారం. వీటిని కాపాడుకోవాలి. అసలు తూర్పు కనుమల్ని బయోడైవర్సీటి హాట్‌ స్పాట్‌గా గుర్తించాల్సిన అవసరం ఉంది’’ అని ప్రొఫెసర్‌ వెంకటేశ్వరావు చెప్పారు.
ఏపీ వేసిన రోడ్లపైనే ఒడిశా రోడ్లు వేస్తోంది’
మద్రాస్‌ ప్రెసిడెన్సీ కాలం నుంచి నేటి వరకు ఏపీ రాష్ట్రానికి సంబంధించి భౌగోళికంగా ఎన్నెన్నో మార్పులొచ్చాయి. కానీ కొటియా గ్రామాలు ఏ రాష్ట్ర పరిధిలోకి వస్తాయనే వివాదం మాత్రం ఇంకా తేలలేదు. ఏపీ ప్రభు త్వం కొటియా గ్రామాల విషయంలో పోరాటం చేయడం లేదని…అలాగే అక్కడ ఏపీ ముద్ర వేసే కార్యక్రమాలు ఎక్కువగా జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వీటి గురించి స్థానిక ఎమ్మేల్యే రాజన్నదొర తెలిపారు. ‘‘వివాదస్పద కొటియా గ్రామాలు విజయనగరం జిల్లా సాలూరు మండలంలోకి కొటియా ప్రాంతాలు వస్తాయి. బ్రిటిష్‌ హయంలో ఈ ప్రాంతాలు మద్రాస్‌ ప్రెసిడెన్సీ పరిధిలో ఉండేవి. అప్పట్లోనే ఒడిశా ప్రభుత్వం ఈ ప్రాంతాలు తమవని వాదించేది. అయితే దీనిని మద్రాస్‌ ప్రెడిడెన్సీ ఖండిస్తూ ఉండేది. బ్రిటిష్‌ హయాం నుంచి ఈ గ్రామాలను సాలూరు మండల పరిధి భూ భాగంలో చూపించారు. 1942లో జరిగిన గిల్‌ సర్వే ప్రకారం కూడా అదే వర్తిస్తుంది. గతంలో రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ దృష్టికి కొటియా గ్రామాల సమస్యను తీసుకువెళ్లాం. ఇరు రాష్ట్రాలను సమన్వయపరిచి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరాం. ప్రస్తుతం అక్కడ ఎన్నికలు నిర్వహించవద్దని బీజేపీతో పాటు ఒడిశాలోని కొన్ని పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. కానీ అక్కడ ఏపీ ప్రభుత్వం తరపున ఎన్నికలు జరగడం ఇదేమి కొత్త కాదు. నేను పుట్టక ముందు నుంచి ఆ ప్రాంతంలో ఏపీ గవర్నమెంట్‌ ఎన్నికలు నిర్వహిస్తోంది. దీనికి సుప్రీం కోర్టు లేదా పార్లమెంట్‌ పరిష్కారం చూపాలి. ఒడిశా మేం అభివృద్ధి చేశామని చెప్పుకోవడం కోసం….ఏపీ ప్రభుత్వం వేసిన రోడ్లపై మళ్లీ రోడ్లు వేసి మేమే వేశాం అని చెప్పుకుంటోంది. నిజానికి అక్కడున్న అపారమైన ఖనిజ సంపదను కొల్లకొట్టేందుకే ఒడిశా ఈ డ్రామాలు ఆడుతోంది’’ అని సాలూరు ఎమ్మేల్యే పీడిక రాజన్నదొర చెప్పారు.
‘కొటియా అభివృద్ధే లక్ష్యం’
‘‘ప్రస్తుతం కొటియా గ్రామాల్లో ఏపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోంది. అంతా సజావుగా ఉంది. అధికారులు నిరంతరం గ్రామాలకు వెళ్లి సమస్యలను తెలుసు కుంటున్నారు. ‘‘కొటియా భౌగోళికంగా ఒడిశాకే చెందుతుంది.కోరాపూట్‌ జిల్లాలో భాగమే కొటియా గ్రామాలు. దీనిపై ఆంధ్ర ప్రదేశ్‌కు ఎటువంటి హక్కులూ లేవు. 1951 లోనే ఒడిశా ఇక్కడ అసెంబ్లీ, పార్ల మెంట్‌ ఎన్నికలు నిర్వహించింది. 1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ కొటియా మాది అనడం హాస్యా స్పదం. దీనిపై ఇటీవలే సుప్రీం కోర్టుని ఆశ్రయించాం. ఇప్పటీకే కొటియా గ్రామాల్లో చాలా అభివృధ్ది చేసి చూపించాం. కొటియా గ్రామాల అభివృద్ధి,అక్కడి గిరిజనుల బాగోగుల కోసం కొటియా ప్రాంతంలో ఒడిశా అభివృద్ది పనులు నిరంతరం సాగుతూనే ఉంటాయి ‘‘అని ఒడిశా రాష్ట్ర ప్లానింగ్‌ బోర్డు డిప్యూటీ చైర్మెన్‌ సంజయ్‌ దాస్‌ వర్మ మీడియాతో చెప్పారు. తమ రాష్ట్రానికి చెందిన పంచా యతీలకు ఏపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహి స్తోందని, అందులో మూడు పంచాయతీల పేర్లు మార్చారని ఒడిశా ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్‌ ధర్మాసనం ఏపీ తరఫు న్యాయవాదికి పిటిషన్‌ కాపీ అందించాలని సూచించింది.
ఆంధ్రాలోనే ఉంటాం
కొటియాలో టెన్షన్‌కి తెరదించారు. ఏపీ అధికారుల కృషి ఫలించింది. 50ఏళ్లుగా నెలకొన్న ఆంధ్రా-ఒడిశా సరిహద్దు వివాదాన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అక్కడి గిరిజనులు ఆకర్షితులయ్యారు. తాము ఏపీ పౌరుల మేనంటూ నినాదాలు చేశారు. ఒడిశా అధికా రులు, పోలీసులపై తిరగబడ్డారు. అక్కడి రేషన్‌కార్డు, ఓటర్‌ ఐడీ కార్డులను విసిరి కొట్టారు. విజయనగరంజిల్లా అధికారుల విశేష కృషి కారణంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కొటియా విలేజ్‌ గ్రూప్‌ గ్రామ ప్రజ లకు చేరువయ్యాయి. ప్రభుత్వ పథకాలపై మొదటి నుంచి అధికారులు వారికి అవగాహన కల్పించారు. ఈ మేరకు సాలూరు వీూA పీడిక రాజన్న దొరను కలిసి ఏపీలోనే కొనసాగు తామని అంగీకారపత్రం ఇచ్చారు. ఒడిశాతో తమకు సంబంధంలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొటియా ప్రజలను ఎమ్మెల్యే రాజన్నదొర అభినందించారు.ఈ నేపథ్యంలో స్థానిక గిరిజనుల ధైర్యసాహసాలకు ముగ్థులైన విజయనగరంజిల్లా కలెక్టర్‌..కొటియా గ్రూప్‌ ప్రజలను కలెక్టరేట్‌కి పిలిపించారు. కలెక్టరేట్‌లో వారిని ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ పథ కాలు వారికి మరింత చేరువయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ విషయంలోనే గిరిజనులు, ఒడిశా అధికారులు మధ్య వివాదం తలెత్తింది. పెద్దయెత్తున పోలీసులు కొటియా చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెలుగు బోర్డులు పెడుతున్న గిరిజనులను పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఒడిశా పోలీసులు, అధి కారుల ఓవరాక్షన్‌పై స్థానిక గిరిజనులు తిరగ బడ్డారు. పగలుచెన్నూరు, డోలియాంబల దగ్గర ఒడిశా పోలీసులతో బాహాబాహీకి సిద్ధమ వ్వడంతో యుద్ధ వాతావరణం కనిపించింది.
ఏపీలోనే ఉంటామని కొఠియా గ్రామాల తీర్మానాలు
ముఖ్యంగా కొఠియా గ్రామాల్లో సమస్యపై పరిష్కారంపై ఫోకస్‌ చేయనున్నారు. ఇటీవల పరిణామాలు, వివాదం వివరాలను అధికా రులు తాజాగా సీఎం జగన్‌కు తెలియ చేశారు. 21 గ్రామాలకుగానూ 16 గ్రామాలు ఆంధ్ర ప్రదేశ్‌లోనే ఉంటామని తీర్మానాలు చేసినట్లు విజయనగరం కలెక్టర్‌ సూర్యకుమారి వివరించారు. ఇటీవల ఆయా గ్రామాల్లో ఎన్నికలు కూడా నిర్వహించినట్లు అధికారులు పేర్కొ న్నారు. కొఠియా గ్రామాల్లో దాదాపు 87 శాతానికి పైగా గిరిజనులేనని, వారికి సేవలు అందిం చే విషయంలో అవాంతరాలు లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. సరిహద్దు భూ సమస్యలను పరిష్కారానికి వినతి..!! ఆంధ్ర`ఒడిశా సరిహద్దు గ్రామాలైన కొల్లాపుట్టుపంచాయితీని చత్తీష్‌ఘర్‌ రాష్ట్ర పీసా చట్టం గ్రూప్‌ చైర్‌పర్సన్‌ రవి పర్యటన రెబ్బాప్రగడ రవి పర్యటించారు.ఇక్కడ సమస్యపై గిరిజనులు చైర్‌పర్సన్‌ రవికి ఒక వినతి పత్రాన్ని అందజేశారు.విశాఖ జిల్లా డుంబ్రిగుడ మండలం కొల్లాపుటు గ్రామ పంచాయితీలో సరిహద్దు అంశంపై గ్రామసభలో తీర్మానించిన అంశాలను ఆయనకు స్థానిక గిరిజనులు అందజేశారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు అంశంపై అధికారులు దృష్టికి తీసుకెళ్లడంపై చర్చించడం జరిగిందని,డెక్కపారు,బొడ్లమామిడి,నిట్టమామిడి,కొల్లాపుట్టు గ్రామ రెవెన్యూ,అటవీ హక్కుల పట్ట భూములు కొల్లాపుట్టు గ్రామ పంచాయితీకి చెందినవి అంటూ పలు అంశాలను గ్రామసభ తీర్మాణంలో తీర్మాణించారు.అలాగే ఒడిశావాసులు ఆక్రమించిన భూములను ఇప్పించాలని కోరారు.-శ్రీ‌నివాస్‌

సంఘ‌టిత పోరాట‌మే ప‌రిష్కారం కాఫ్‌-26

కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ ద పార్టీస్‌(కాప్‌`26) సదస్సు ఈ ఏడాది నవంబరులో స్కాట్లాండ్‌లో జరిగింది. ప్రతిఏటా 197దేశాలను ఒకచోట చేర్చే సదస్సు ఇది. వాతావరణ మార్పులు, దాని ద్వారా ఏర్పడే సమస్యల గురించి ఈసదస్సు ప్రధానంగా చర్చిం చింది. ఇది వాతావరణ మార్పుల పై యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌ (ఖచీఖీజజజ) ఆధ్వ ర్యంలో జరిగిన కన్వెన్షన్‌.పర్యావరణంపై మానవ కార్యక లాపాల ప్రభా వాన్ని పరిమితం చేయడమే లక్ష్యంగా ప్రపంచంలోని ప్రతి దేశం, ప్రతిభూభాగం అంగీకరించి సంతకం చేసిన అంతర్జాతీయ ఒప్పందం కాప్‌.1994 మార్చి 21న తొలి ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 25 సమావేశాలు జరగ్గా, ఈ ఏడాది జరగబోయేది 26వది. స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో నవంబర్‌ 1 నుంచి 12 తేదీల మధ్య ఈసదస్సు జరిగింది.కాప్‌ 26 ప్రాధాన్యత
కాప్‌ 26 సదస్సు 2015లో పారిస్‌ వాతావరణ ఒప్పందంపై సంతకాల తర్వాత, అది ఏం సాధిం చింది, ఎక్కడ విఫలమైంది అని చర్చించే మొదటి శిఖరాగ్ర సమావేశం.పారిస్‌ ఒప్పందం ప్రాథమి కంగా వాతావరణ విపత్తును నివారించడానికి మనుషులు అమలు చేయాలనుకున్న వ్యూహం. గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా పారిశ్రామిక విప్లవానికి పూర్వం ఉన్న ఉష్ణోగ్రతలు1.5సెల్సియస్‌ పెరుగు తున్నాయి.ఈ ఉష్ణోగ్రతలు ఇలా పెరుగుతూ పోతే భూమికి తిరిగి బాగు చేసుకోలేని ప్రమాదాన్ని సృష్టి స్తాయి. ఏదైనా ఒక ప్రణాళికను ప్రకటించినప్పుడు దానికి కట్టుబడి ఉండాలి.కాప్‌సదస్సుల ఉద్దేశం కూడా అదే. కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయాలు, వ్యూహాలు సరిగ్గా పని చేస్తున్నాయా లేదా అన్నది చర్చించు కోవడానికే ఈ సదస్సును ఏర్పాటు చేశారు.
కరోనా మహమ్మారి వల్ల ఎలాంటి మార్పులు వచ్చాయి?
మహమ్మారి కారణంగా పర్యావరణ పరిరక్షణ చర్య లకు తీవ్ర ఆటంకం కలిగింది. శిఖరాగ్ర సదస్సును ఒక ఏడాదివాయిదా వేయాల్సి వచ్చింది. మరోవైపు, మహమ్మారి అనంతర ఆర్థిక స్థితి మెరుగు పరుచు కోవడంలో భాగంగా కొత్త నిర్ణయాలు తీసుకునేలా కోవిడ్‌ అవకాశం కల్పించింది.ఉదాహరణకు… మనం నిజంగా ఇన్ని ప్రయాణాలు చేయాలా,ఇంటి దగ్గరఉండి పనిచేస్తే సరిపోదా,ఇది కర్బన ఉద్గారా లను తగ్గిస్తుంది కదా,పట్టణీకరణను తగ్గించడానికి అవకాశం ఉందా?లాంటి ఆలోచనలకు దారి తీసింది.
గతంలో ట్రంప్‌ రద్దు చేసుకున్న పారిస్‌ ఒప్పందాన్ని తాను కొనసాగిస్తానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు. వాతావరణ అనుకూల విధానాలు అవలంబించడంవల్ల ఆర్ధిక పరంగా కూడా ఎంతో మంచిదని ఆయన భావి స్తున్నారు. ఈసారి కాప్‌లో కూడా పర్యావరణానికి సంబంధించి సరికొత్త, సాహసోపేతమైన దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించారు.వాతావరణ మార్పులకు కారణమయ్యే దేశాలలో మొదటి వరసలో పేద దేశాలే ఉన్నాయి. మరోవైపు పెరుగుతున్న సముద్ర మట్టాలు ద్వీపాలను నెమ్మదిగా ముంచెత్తుతున్నాయి. ఇటు కరువు,వేడిగాలులు పంటలను దెబ్బ తీస్తు న్నాయి. ప్రస్తుత కాప్‌26 సదస్సులో వందకు పైగా దేశాలు కొన్ని డిమాండ్లు పెట్టాయి. పర్యా వరణ సమస్యలపై చర్యలకు నిధులు,ఈ చర్యలు తీసుకున్నందుకు కలిగిన నష్టాలకు పరిహారం,తమ ఆర్థిక స్థితిగతులు బాగుపడటానికి సహకారం,ధనిక దేశాలన్నీ 2020 నాటికి 100 బిలియన్‌ డాలర్లు అంటే సుమారు రూ.75వేల కోట్ల ఇస్తామని హామీ ఇచ్చాయి. కానీ ఇప్పటి వరకు అందులో సుమారు 80శాతం మాత్రమే ఇవ్వగలిగాయి.వీటిలో ఎక్కువ భాగం రుణాలే తప్ప గ్రాంట్లు కాదు.ఈ సదస్సులో చర్చకు వస్తుందనుకుంటున్న మరో అంశం క్లైమేట్‌ ఫైనాన్స్‌. కార్బన్‌ మార్కెట్లు, కార్బన్‌ క్రెడిట్‌ల వ్యవ స్థను అమలు చేయడానికి సరైన మార్గం వెతకాల్సిన అవసరం ఉంది. కాలుష్య కారకాలను ఎక్కువగా విడుదల చేసే వారు గ్రీనర్‌ ఎకానమీలకు కార్బన్‌ క్రెడిట్‌ లను ఇచ్చే విధానం ఇది. పేద దేశాలకు సాయం అందించాలి చూడటానికి ఎంతో బాగుంది. కానీ, ధనిక దేశాలు తాము చెల్లిస్తున్నాం కాబట్టి,ఇష్టారాజ్యంగా కాలు ష్యాలను విడుదల చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? మరొక ఉదాహరణ...ఒకఅడవిని నాశనం చేసి నందువల్ల ఏర్పడిన ఉద్గారాల కోసం ఒకదేశం ఎంత చెల్లించాలో ఎవరు నిర్ణయిస్తారు? ఒకవేళ గ్లాస్గో శిఖరాగ్ర సమావేశం పైన పేర్కొన్న అన్నింటికీ ఒప్పుకున్నప్పటికీ, మనం నిర్దేశించుకున్న హరిత లక్ష్యాలకు‘కాలపరిమితులు’అవసరం. ఈ సమస్య లకు పరిష్కారం చాలా సులభం అని అనుకుం టారు. కానీ అదినిజం కాదు. క్లైమేట్‌ ఛేంజ్‌ పై సాహసోపేత చర్యలు చేపట్టాం., ప్రధాని మోదీ వెల్లడి. ఇది నిరంతర ప్రక్రియ.వాతావరణ కాలుష్య నివారణకు ఇండియా పలు సాహసోపేత చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ తెలిపారు. క్లైమేట్‌ ఛేంజ్‌ అన్నది పెనుసవాల్‌ అని,అయితే క్లీన్‌ ఎనర్జీ ఎన్వి రాన్‌ మెంట్‌ సాధించాలన్న లక్ష్యంతో ఇండియా వివిధ చర్యలకు శ్రీకారం చుట్టిందని ఆయన చెప్పారు. ఇందుకోసం అంతర్జాతీయ సౌరకూట మిని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను తమ దేశం సమర్థించిందని ప్రధాని మోడీ చెప్పారు. వాతా వరణ కాలుష్యం వల్ల తలెత్తే విపరీత పరిణా మాల కారణంగా మానవ మనుగడ ప్రమాదంలో పడుతోందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే దీని మార్పు కోసం పటిష్టమైన చర్యలు అవసరమని మోదీ అభిప్రాయపడ్డారు. హరిత విప్లవ సాధన కోసం భారత, అమెరికా దేశాలు కృషి చేస్తున్నాయని అన్నారు. ఇందుకు తాను,అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌..2030 నాటికల్లా ఇండియా-యూఎస్‌ క్లైమేట్‌ అండ్‌ క్లీన్‌ ఎనర్జీకి సంబంధించిన లక్ష్య సాధన కోసం అజెండాను రూపొందించామని వెల్లడిరచారు. పలు ఇతర దేశాల్లోని కార్బన్‌ కాలు ష్యం కన్నా ఇండియాలో ఈకాలుష్యం 60 శాతాని కన్నా తక్కువగా ఉందని మోదీ చెప్పారు. దశాబ్దాల తరబడి కాలుష్య నివారణకుకృషి జరగాలని సూచిం చిన ఆయన ఈ సందర్భంగా స్వామి వివేకానందను గుర్తుచేశారు. క్లైమేట్‌ ఛేంజ్‌ పై 40దేశాల ప్రపంచ శిఖరాగ్ర సదస్సులో వర్చ్యువల్‌గా ప్రధాని పాల్గొ న్నారు. ఈ సమ్మిట్‌లో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌,బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, బ్రిటిష్‌ పీఎం బోరిస్‌ జాన్సన్‌, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో, బ్రెజిల్‌అధ్యక్షుడు జైర్‌ బొల్సనారో తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న వాతావరణ కాలుష్య సమస్యను ఎదుర్కొనేందుకు దేశాధినేతలంతా కృషి చేయాలని తీర్మానించారు. గ్లోబల్‌ హైబ్రిడ్‌ సమ్మిట్‌ద్వారా భారతదేశాన్ని స్వచ్చ Ûమైన శక్తి దిశగా నడిపేందుకు వేదికగా ఈ సమా వేశం నిలవనుంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (RIూ) ఛైర్మన్‌,మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముఖేష్‌ అంబానీ శిఖరాగ్ర సమావేశంలో ముఖ్య వక్తగా పాల్గొనడం విశేషం. ఈ శిఖరాగ్ర సమావేశాలను ూనణ ఛాంబర్‌,చీIుI ఆయోగ్‌, పర్యావరణ మంత్రిత్వ శాఖ, పారిశ్రామిక పరిశోధన విభాగం, (జూIR),సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం సంయుక్తంగా ఏర్పాటు చేశాయి.శిఖరాగ్రసమావేశంలో, భారతదేశ హైడ్రో జన్‌ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చాయి. కాప్‌26 వాతావరణ సదస్సుతో పెరిగిన కాలుష్యం
వాతావరణ మార్పుపై ప్రపంచ శిఖరాగ్ర సమా వేశాన్ని మీరు నిర్వహించబోతున్నట్లయితే, దాన్ని సాధ్యమైనంత కాలుష్యరహితంగా నిర్వహించడానికి ప్రయత్నించాలి.ఈ ఈవెంట్‌ని ‘‘కార్బన్‌ న్యూట్రల్‌’’గా నిర్వహించడానికి కట్టుబడి ఉన్నామని యూకే ప్రభుత్వం చెప్పింది. కానీ,మాడ్రిడ్‌లో జరిగిన మునుపటి శిఖరాగ్ర సమావేశం కంటే రెట్టింపును మించి ఉద్గారాలు గ్లాస్గో శిఖరాగ్ర సమావేశ నిర్వ హణ సమయంలో జరిగాయని ఓకొత్త నివేదిక తెలిపింది.ఎక్కువ మంది ప్రతినిధులు,ఎక్కువ ఉద్గారాలు కాప్‌26సమావేశ సమయంలో విడు దల అయిన మొత్తం కార్బన్‌ ఉద్గారాలు 1,02,500 టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌కు సమానంగా ఉండను న్నాయని యూకే ప్రభుత్వానికి అందిన ప్రాథమిక అంచనా నివేదిక ద్వారా తెలిసింది. ఇది దాదాపు 10,000 యూకేగృహాల నుండి ఒక ఏడాది మొత్తం వచ్చే ఉద్గారాలకు సమానం. 2019లో మాడ్రిడ్‌లో జరిగినచివరి వాతావరణ శిఖరాగ్ర సమావే శంలో జరిగిన ఉద్గారాలతో పోల్చితే కాప్‌26 సమావేశా నికి అయిన ఉద్గారాలు రెట్టింపు. 2019లో మాడ్రిడ్‌లో జరిగిన సదస్సులో27,000 మంది పాల్గొనగా, కోవిడ్‌ మహమ్మారి ఉన్నప్పటికీ, గ్లాస్గో ఈ సమావేశానికి 39,000 కంటే ఎక్కువ మంది హాజరయ్యారని యూకే ప్రభుత్వం తెలిపింది.
అంతర్జాతీయ విమానాలు,ప్రైవేట్‌ జెట్‌లు
నివేదిక ప్రకారం కాప్‌`26 ఉద్గారాలలో 60% అంతర్జాతీయ విమానాల ద్వారానే వచ్చినట్లు అంచనా వేశారు.విమానాల నుండి వచ్చే ఉద్గారా లను నియంత్రించడానికి,హాజరయ్యే వారు సాధ్య మైతే రోడ్డుమార్గంద్వారా ప్రయాణించాలని కోరారు. అయినా, చాలా మంది ప్రపంచ నాయకులు ప్రైవేట్‌ జెట్‌ విమానాల్లో వచ్చారు.
అంతేకాకుండా వారి సొంత కాన్వాయ్‌ వాహనాలను, హెలీకాప్టర్‌లను తీసుకురావడానికి ప్రత్యేకంగా కార్గో విమానాలను వాడారు. నవంబర్‌ 1 వరకు గ్లాస్గో చుట్టుపక్కల ప్రాంతాలకు నాలుగురోజుల్లో ప్రైవేట్‌ జెట్‌లు లేదా వీఐపీ విమానాలు అన్నీ కలుపుకుని మొత్తం 76 విమా నాలు వచ్చాయని ఏవియేషన్‌ అనలిటిక్స్‌ కంపెనీ సిరియమ్‌ రియాలిటీ చెక్‌తో చెప్పింది. సమ్మిట్‌లో కార్బన్‌ ఉద్గారాలను తగ్గించ డానికి యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌ (ఖచీఖీజజజ) గుర్తించిన ప్రణాళికలను అమలు చేశామని యూకే ప్రభుత్వం చెప్పింది. వీటిలో పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయో గించడం,చెట్ల పెంపకం వంటివి ఉన్నాయి. కార్బన్‌ న్యూట్రాలిటీపై అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రమాణం ూAూ2060కి అనుగుణంగా నిర్వహించిన మొదటి కాప్‌ ఇదే అని యూకే ప్రభు త్వం చెప్పింది. ఇటీవల కార్న్‌వాల్‌లో జరిగిన మూడు రోజుల జీ7సమ్మిట్‌లో 20,000 టన్నుల కార్భన్‌డయాక్సైడ్‌కి సమానమైన ఉద్గారాలు విడు దల అయినా ఇది కూడా ‘‘కార్బన్‌ న్యూట్రల్‌’’గా గుర్తింపు పొందింది.(బీబీసీ సౌజన్యంతో)
-రవీంద్రనాథ్‌ కె 

ప్ర‌కృతితోనా మ‌న‌వాళి వికృత క్రీడా

‘‘ కొవిడ్‌ మహమ్మారిని పక్కనపెడితే ప్రపంచ దేశాలకు పెను సవాల్‌?గా మారిన సమస్య భూతాపం. ఈసమస్యకు మూలం కూడా మానవుడి చర్యలే. అభివృద్ధి వర్సెస్‌ భూతా పం – అనే ఈ క్రూరమైన సందిగ్ధం వల్ల మనం ‘గ్రీన్‌హౌస్‌’ వాయువుల విడుదలను తగ్గించ లేకపోతున్నాం.ఈ తరుణంలో మన అందు బాటులో ఉన్న సాంకేతిక విజ్ఞానాన్ని, వనరుల్ని సరైన రీతిలో ఉపయోగిస్తేనే భూతా పాన్ని ఎదుర్కొని తిరిగి సాధారణ స్థితికి రాగలం. ’’ – డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌
మహమ్మారి నుంచి మానవాళి గ్రహించాల్సిన మరో పెద్ద పాఠం భూతాపాన్ని (గ్లోబల్‌ వార్మింగ్‌) అత్యవసర సమస్యగా సమష్టిగా ఎదుర్కోవడం! భూతాపం ప్రస్తుతం మానవ మనుగడకు ప్రమాదకరంగా పరిణమించిందని శాస్త్రీయ ఆధారాలన్నీ తేల్చి చెబుతున్నాయి. ‘గ్రీన్‌హౌస్‌’ వాయువులను ఇక ముందు నియంత్రించగలిగినా కూడా, భూమ్మీద ఇప్పటికే జరిగిన నష్టంవల్ల సరాసరి ఉష్ణోగ్రతలు సుమారు రెండు డిగ్రీల సెల్సియస్‌ మేర పెరుగుతాయి. బొగ్గుపులుసు వాయువు,మీథేన్‌, ఇతర ఉద్గారాల విడుదలను ఆపకపోతే ఉఉఉఉష్ణోగ్రతల పెరుగుదల ఇంకా ఎక్కువగా ఉం టుంది. రెండు డిగ్రీల సెల్సియస్‌ చాలా స్వల్పమే కదా అనిపించవచ్చు. కానీ రెండు డిగ్రీల సగటు ఉష్ణోగ్రత పెరుగుదలతో చోటు చేసుకునే మార్పు- మంచు యుగానికి, ఎడారీకరణకు మధ్య తేడాగా మారవచ్చు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కల్లోలం సృష్టిస్తున్నాయి. హిమనదాలను కరిగిస్తున్నాయి. సైబీరియా, గ్రీన్‌లాండ్‌ వంటి శీతల ప్రదేశాలలో మంచును కరిగిస్తున్నాయి. భారత్‌లో గంగా, ఉపఖండంలోని ఇండస్‌ వంటి హిమనదాలు ఎండిపోతుండటం, ఆర్కిటిక్‌ మహా సముద్రం కరుగుతుండటం, అంటార్కిటికాలో మంచు ఫలకం కరగడం, సముద్ర మట్టాలు పెరగడం, తీర, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికావడం, ద్వీపదేశాలు మునిగిపోవడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్న పరిణామాలు.పలు దేశాల్లో అటవీ కార్చిచ్చులు, భారత్‌ వంటి ఉష్ణ మండల దేశాల్లో ఉష్ణోగ్రతలు భరించలేని స్థాయిలో ఉండటం, పెనుతుపానులు, టైఫూన్లు వంటి అసాధారణ, అనూహ్య వాతావరణ పోకడలు మనిషికి సవాలు విసురుతున్నాయి. ఎడారీకరణ, దోమలు, ఇతర వ్యాధికారక కీటకాల వ్యాప్తి, మహమ్మారులు విజృంభిస్తుండటం ప్రపంచవ్యాప్తంగా గుర్తించని అనేక భయోత్పాతాలకు కారణమవు తున్నాయి.ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టిమానవాళి మనుగడకు ప్రమాదకరమైన భూతాపానికి మూలం మానవుడి చర్యలే. అభివృద్ధి వర్సెస్‌ భూతాపం- అనే ఈ క్రూరమైన సందిగ్ధం వల్ల మనం ‘గ్రీన్‌హౌస్‌’ వాయువుల విడుదలను తగ్గించలేకపోతున్నాం. తలసరి ఇంధన వాడకం పెద్దయెత్తున ఉన్నది సంపన్న దేశాల్లో, వృద్ధికోసం తంటాలు పడుతున్న పేద దేశాలకు ఇంధనం వాడొద్దని, ఉత్పత్తిని నిలిపివేయాలని చెప్పడం హాస్యాస్పదం. ఇప్పుడు పునరుత్పాదక ఇంధనాన్ని పుష్కలంగా, చౌకగా- దీర్ఘకాలిక ప్రాతిపదికనైతే శిలాజ ఇంధనాల కంటే చౌకగా- చేయగలిగేలా సాంకేతిక విజ్ఞానం పరిణతి సాధించడం సంతోషకరమైన విషయం.మాంసం ఉత్పత్తిలో కర్బన ఉద్గారాల్ని తగ్గించే సాంకేతికతా మనకుంది. వరి ఉత్పత్తి లో మెరుగైన పద్ధతులు, ప్రత్యామ్నాయ ఆహారాలు ‘గ్రీన్‌హౌస్‌’ వాయువుల్ని ఇంకా తగ్గిస్తాయి. ‘కణాల కల్చర్‌’ ద్వారా మాంసం ఉత్పత్తికి సింగపూర్‌ అనుమతులిచ్చింది. అటువంటి టెక్నాలజీలవల్ల ఇక వధించేందుకు జంతువుల్ని పెంచాల్సిన అవసరం ఉండదు. ప్రపంచ మార్కెట్ల డిమాండుకు తగ్గ మాంసాన్ని రాబోయే 10-20 ఏళ్లలో కొత్త టెక్నాలజీతో తయారు చేయవచ్చు.మనకు ఇప్పటికే సౌర విద్యుత్తు, బ్యాటరీ స్టోరేజీ టెక్నాలజీ, విద్యుత్‌ కార్లు, ఇంధన పొదుపు పరికరాలు, బయో మాస్‌ను ఇంధనంగా మార్చే సెల్యులోజిక్‌ ఎంజైములు, ఇతర అద్భుత సాంకేతికతలు చవకగా అందుబాటులో ఉన్నాయి. ఉత్పత్తిని, ఆర్థిక వృద్ధిని, ఉద్యోగాల్ని కోల్పోకుండానే వచ్చే 20ఏళ్లలో శిలాజ ఇంధనాల మీద ఆధార పడాల్సిన అవసరం నుంచి పూర్తిగా బయటపడే సామర్థ్యం ఈవేళ మానవాళికి ఉంది.కొత్త ఇంధన వ్యవస్థల్ని నిర్మించి, నిర్వహించే క్రమంలో కోట్ల సంఖ్యలో నూతన ఉద్యోగాల్ని సృష్టించవచ్చు. ఇందుకు ప్రతి దేశంలో, ప్రపంచ స్థాయిలోనూ భారీగా ప్రయత్నం కావాలి. ప్రస్తుత శిలాజ ఇంధన ఆధారిత విద్యుత్‌ గ్రిడ్లనుంచి పునరుత్పాదక ఇంధన గ్రిడ్‌లకు మరలడానికి సుమారు 15-20 లక్షల డాలర్లు అవసరమవుతాయి. ప్రస్తుత విద్యుత్‌ ప్లాంట్లను మూసివేస్తే, వాటి వ్యయాన్ని ఎవరో ఒకరు చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల పరిహారం కట్టాల్సి ఉంటుంది.పాత పెట్రోల్‌ బంక్‌ స్థానంలో విద్యుత్‌ కార్ల బ్యాటరీలను రీఛార్జి చేసే సౌర విద్యుత్‌ ఛార్జింగ్‌ స్టేషన్లు రావాలి. ప్రస్తుత కేంద్రీకృత గ్రిడ్‌ స్థానంలో వికేంద్రీకరించిన పంపిణీ వ్యవస్థలు ఏర్పడాలి. పగలు సౌర విద్యుత్తును ఉత్పత్తి చేస్తూనే, ప్రపంచవ్యాప్తంగా బ్యాటరీ స్టోరేజీ సామర్థ్యాన్ని నిరంతర విద్యుత్‌ అవసరాల కోసం భారీస్థాయిలో నెలకొల్పాలి. ఈ పరివర్తన (ట్రాన్సిషన్‌) కోసం తక్కువ ఖర్చుతో సమర్థంగా పనిచేసే టెక్నాలజీలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ పరివర్తన జరగాలంటే మనకు భారీ వనరులు కావాలి. కొవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ తమ ఆర్థిక వ్యవస్థల ఉద్దీపనకు, ఆర్థిక కార్యకలాపాలు లేక కుదేలైన కార్మికులను, సంస్థలను ఆదుకునేందుకు సుమారు 15లక్షల డాలర్ల ప్రభుత్వ ధనాన్ని వెచ్చించాయి. ఈ మొత్తాన్ని కేవలం ఏడాది కాలంలో సమకూర్చగలిగాయి.శిలాజ ఇంధన గ్రిడ్ల నుంచి పునరుత్పాదక గ్రిడ్లకు మరలేందుకు మనకు కావలసిందల్లా 15 లక్షల డాలర్లు- అంటే కొవిడ్‌ ఉద్దీపనకు ఏడాది కాలంలో వినియోగించిన మొత్తాన్ని 10-15 ఏళ్ల కాలంలో వినియోగించడం. వృద్ధి, ఉపాధి, నాణ్యమైన జీవితంతో పర్యావరణహిత ఆర్థిక వ్యవస్థల్ని నిర్మించడానికి కావలసిన సాంకేతికత, వనరులు ప్రపంచానికి ఉన్నాయి. మనకు కావలసిందల్లా రాజకీయ సంకల్పం, ఆర్థిక, వ్యాపార సృజనాత్మకత, ప్రపంచ దేశాల మధ్య సహకారం! బెంబేలెత్తిస్తున్న భూతాపం ఒకవిధంగా మొత్తం మానవాళికి కొవిడ్‌ ఒక మేలుకొలుపు. అసమానతలు తగ్గించడానికి, అందరికీ అవకాశాల్ని అందించడానికి, అభివృద్ధిని పెంచడానికి, పేదరికాన్ని అంతం చేయడానికి- నాణ్యమైన, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే ఒక ఆరోగ్య రక్షణ వ్యవస్థ, నైపుణ్యాలు, పెట్టుబడి ప్రోత్సాహకాలు, ఉద్యోగాల కల్పన, సమ్మిశ్రిత వృద్ధి ఎంత కీలకమన్నది అన్ని దేశాలకు, ముఖ్యంగా భారత్‌కు ఇది గుర్తుచేసింది.ఇది కేవలం ఒక ఆర్థికపరమైన అవసరం కాదు, స్థిరత్వానికి కావలసిన ఓ రాజకీయ అనివార్యత. సామరస్యత, సంతోషాలకు కావలసిన ఓ సామాజిక అనివార్యత. భవిష్యత్తులో తలెత్తే అవకాశమున్న మరింత ప్రమాదకర, విధ్వంస కారక మహమ్మారుల్ని నిరోధించడానికి మనం ప్రకృతి సమతౌల్యాన్ని పునరుద్ధరించాలి. వన్యప్రాణుల్ని ఆహారంగా వినియోగించడానికి స్వస్తి చెప్పాలి. అడవుల నరికివేతను ముఖ్యంగా ఆఫ్రికా, తూర్పు ఆసియా, దక్షిణ అమెరికాల్లో ఆపుచేయాలి. చివరిగా భూతాపాన్ని ఎదుర్కొని తిరిగి సాధారణ స్థితికి మళ్లించడానికి- తద్వారా మన పిల్లలు, మొత్తం మానవాళి భవిష్యత్తును పరిరక్షించడానికి అందుబాటులో ఉన్న సాంకేతిక విజ్ఞానాన్ని, వనరుల్ని సరైన రీతిలో ఉపయోగించాలి.
వాతావరణ మార్పు అంటే ఏమిటి? భూమి వేడెక్కితే ఏం జరుగుతుంది?
గ్లోబల్‌ వార్మింగ్‌ శాస్త్రవేత్తలు హెచ్చరిక
గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రపంచానికి పెనువిపత్తుగా మారబోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మనుషుల చర్యల వల్ల వాతవరణంలోకి కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉద్గారాలు భారీగా పెరిగాయి. ఫలి తంగా ఉష్ణోగ్రతలు కూడా మండుతు న్నాయి. ధ్రువాల్లో మంచు కరుగుతోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు పెరుగుతున్నాయి.
వాతావరణ మార్పు అంటే..
భూమి సగటు ఉష్ణోగ్రత 15 డిగ్రీ సెంటీగ్రేడ్లు. గతంలో ఇది ఇంతకన్నా ఎక్కువగా, తక్కువగా కూడా ఉంది.ఈ ఉష్ణోగ్రతలో మార్పులు సహజమే. అయితే, మునుపటి కన్నా చాలా వేగంతో ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతు న్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌ దీనికి కారణమని వారు చెబుతున్నారు. గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌ అంటే సూర్యుడి నుంచి భూమిపైకి వచ్చే శక్తిలో కొంత భూమిపైనే నిలిచిపోవడం. భూమిపై నుంచి పరావర్తనం చెంది అంతరిక్షంలోకి వెళ్లాల్సిన సౌరశక్తిని గ్రీన్‌ హౌజ్‌ వాయువులు గ్రహించుకుని తిరిగి భూమిపైకి చేరేలా చేస్తున్నాయి.ఫలితంగా వాతావరణం, భూ ఉపరితంల వేడెక్కు తున్నాయి. ఈ ఎఫెక్ట్‌ లేకపోతే భూమి ఇంకో 30 డిగ్రీ సెంటీగ్రేడ్స్‌ చల్లగా ఉండేది. జీవం మనుగడ కష్టమయ్యేది.అయితే,ఈ గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌కు పరిశ్రమలు, వ్యవసాయం వల్ల వెలువడే వాయువులు తోడై మరింత శక్తిని గ్రహించి, ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీన్నే గ్లోబల్‌ వార్మింగ్‌ (భూమి వేడెక్కడం), వాతావరణ మార్పులు అంటారు.
గ్రీన్‌ హౌజ్‌ వాయువులు ఇవే…
గ్రీన్‌ హౌజ్‌ వాయువుల్లో అత్యంత ప్రభావవంతమైంది నీటి ఆవిరి. కానీ, అది వాతావరణంలో కొన్ని రోజులపాటే ఉంటుంది. కార్బన్‌ డై ఆక్సైడ్‌ చాలా కాలం ఉంటుంది. అది పారిశ్రామికీకరణ కన్నా ముందు ఉన్న స్థాయిలకు వెళ్లాలంటే కొన్ని వందల ఏళ్లు పడుతుంది. సముద్రాల్లాంటి సహజ జలవ నరులు దాన్ని పీల్చుకోగలవు.శిలాజ ఇంధనా లను మండిరచడం వల్లే అత్యధికంగా కార్బన్‌ డై ఆక్సైడ్‌ విడుదలవుతోంది. కార్బన్‌ డై ఆక్సైడ్‌ ను పీల్చుకునే అడవులను నరికి, కాల్చేయడం వల్ల కూడా కార్బన్‌ వెలువడుతోంది. గ్లోబల్‌ వార్మింగ్‌ ఎక్కువవుతోంది.1750లో పారిశ్రామిక విప్లవం మొదలైనప్పటితో పోలిస్తే కార్బన్‌ డై ఆక్సైడ్‌ స్థాయిలు 30శాతం పెరిగాయి. గత 8 లక్షల ఏళ్లలో వాతావర ణంలో ఈ స్థాయిలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఎప్పుడూ లేదు. మనుషుల చర్యల వల్ల మీథేన్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌ లాంటి ఇతర గ్రీన్‌ హౌజ్‌ వాయు వులు కూడా వెలువడుతున్నాయి. అయితే, కార్బన్‌ డై ఆక్సైడ్‌ అంతటి స్థాయిలో అవి లేవు.
గ్లోబల్‌ వార్మింగ్‌కు ఆధారాలు ఉన్నాయా?
పారిశ్రామిక విప్లవం కన్నా ముందునాళ్లతో పోల్చితే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఇప్పుడు ఒక సెంటీగ్రేడ్‌ పెరిగినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) చెబుతోంది.అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు నమోదైన 20 ఏళ్లు.. గత 22 ఏళ్లలోనే ఉన్నాయి. 2005-2015 మధ్య సగటు సముద్ర మట్టం 3.6 మిల్లీమీటర్లు పెరిగింది. ఉష్ణోగ్రత పెరగడం వల్ల నీరు వ్యాకోచించి ఇది ఎక్కువగా జరిగింది. కరుగుతున్న మంచు కూడా సముద్ర మట్టాలు పెరగడానికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉష్ణోగ్రత పెరుగుతున్న ప్రాంతాల్లో హిమనీనదాలు కరుగుతున్నాయి. ఆర్కిటిక్‌ సముద్ర మంచు 1979కి ఇప్పటికీ చాలా తగ్గిపోయిందని ఉపగ్రహాలు తీసిన ఫొటోలు సూచిస్తున్నాయి. గ్రీన్‌లాండ్‌పై పరుచుకున్న మంచు కూడా కొన్నేళ్లుగా రికార్డు స్థాయిలో కరుగుతోంది. పశ్చిమ అంటార్కిటికా పై ఉన్న మంచు ద్రవ్యరాశి కూడా తగ్గుతోంది. తూర్పు అంటార్కిటికాలోనూ ఈ పరిణామం మొదలవ్వొచ్చని తాజాగా ఓ అధ్యయనం హెచ్చరించింది. పంటలు, జంతువులపైనా వాతావరణ మార్పుల ప్రభావం కనిపిస్తోంది. మొక్కల్లో పూలు పూసే, పండ్లు కాసే సమయాలు ముందుకు జరుగుతున్నాయి. జంతువులు వలస వెళ్తున్నాయి.
ఉష్ణోగ్రత ఎంత పెరగవచ్చు?
భూ ఉపరితల ఉష్ణోగ్రత 1850తో పోల్చితే 21వ శతాబ్దం చివరినాటికి 1.5 డిగ్రీ సెల్సి యస్‌ పెరగొచ్చు. చాలా వరకూ అంచ నాలు ఇదే సూచిస్తున్నాయి.ప్రస్తుతం ఉన్న గ్లోబల్‌ వార్మింగ్‌ పరిస్థితులే ఇకపైనా కొనసాగితే పెరుగుదల 3 నుంచి 5 డిగ్రీ సెల్సియస్‌లు కూడా ఉండొచ్చని డబ్ల్యూఎంఓ అంటోంది.
ఉష్ణోగ్రతలో 2 డిగ్రీ సెల్సియస్‌ల పెరుగుదల ప్రమాదకర పరిస్థితులకు దారితీయొచ్చని అంచనా వేస్తున్నారు. ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్‌లకు కట్టడి చేసుకోగలిగితే క్షేమంగానే ఉండొచ్చని ఇటీవలి కాలంలో శాస్త్రవేత్తలు, నాయకులు అంటున్నారు. ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీసెల్సియస్‌లకు అదుపు చేయాలంటే సమాజం అన్ని విధాలుగా త్వరితగతిన మారాల్సి ఉంటుందని ఇంటర్‌ గవర్న్‌మెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ (ఐపీసీసీ) నివేదిక అభిప్రాయపడిరది. చైనా నుంచే అత్యధికంగా కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉద్గారాలు వెలువడుతున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా,యురోపియన్‌ యూనియన్‌ సభ్య దేశాలు ఉన్నాయి. జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే, వీటిలో ఉద్గారాలు చాలా ఎక్కువ. ఇప్పటికిప్పుడు గ్రీన్‌ హౌజ్‌ వాయువుల ఉద్గారాలు గణనీయంగా తగ్గించుకున్నా, వాతా వరణంపై ప్రభావం తప్పదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ప్రభావం ఎలా ఉంటుంది?
వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉంటుదన్నదానిపై స్పష్టత లేదు.ప్రతికూల వాతావరణ పరిస్థితులు పెరుగతాయి. దీంతో మంచినీటి కొరత ఏర్పడొచ్చు. ఆహార ఉత్పత్తి పైనా తీవ్ర ప్రభావం పడొచ్చు. వరదలు, తుఫానులు, వడగాలుల వల్ల మరణాల సంఖ్య పెరగొచ్చు.భూతాపం పెరగడం వల్ల ఎక్కువ నీరు ఆవిరవుతుంది.
వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది. ఫలితంగా చాలా ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువవుతుంది. కొన్ని ప్రాంతాల్లో మంచుపడుతుంది. తీరాలకు దూరంగా ఉండే ప్రాంతాల్లో వేసవుల్లో కరవు ముప్పు ఎక్కువవుతుంది. సముద్ర మట్టాలు పెరుగుతాయి కాబట్టి వరదలు కూడా పెరగొచ్చు. ఈ మార్పులను తట్టుకునే సామర్థ్యం లేని పేద దేశాలపై ప్రభావం విపరీతంగా ఉండొచ్చు.పరిస్థితులకు అంత త్వరగా అలవాటుపడలేవు కాబట్టి కొన్ని రకాల మొక్కలు, జంతువులు అంతరించిపోవచ్చు. మలేరియా లాంటి వ్యాధులు, పోషకాహార లోపాల బారిన కోట్ల మంది పడొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంచనా వేసింది. వాతావరణంలో పెరిగిన కార్బన్‌ డై ఆక్సైడ్‌ను సముద్రాలు ఎక్కువగా పీల్చుకోవడం వల్ల వాటి ఆమ్లత్వం ఇంకా పెరగొచ్చు. కోరల్‌ రీవ్స్‌కు ముప్పు ఏర్పడొచ్చు.వాతావరణ మార్పులపై స్పందించడమే ఈ శతాబ్దంలో మానవాళికి అతిపెద్ద సవాలు కాబోతోంది. (- రచయిత: (ప్రజాస్వామ్య పీఠం(ఎఫ్‌.డీ.ఆర్‌), లోక్‌సత్తా వ్యవస్థాపకులు)

-డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌

సంప‌ద శాపం

వాతావరణం నుండి కార్బన్‌ డయాక్సైడ్‌ను తీసివేయడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలు ఇప్పుడు మొత్తం మానవాళి యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి అవసరం. చక్రవర్తిలా జీవించాలనుకునే వారిచే ఎందుకు బంధించబడాలి? విమానయానం యొక్క వాతావరణ ప్రభావాలను మనం విస్మరించమని తరచుగా ప్రయాణించే వారు తరచుగా చెబుతారు. ఎందుకంటే అవి ‘‘కొన్ని శాతం మాత్రమే’’. కానీ అవి సాపేక్షంగా తక్కువగా ఉండటానికి ఏకైక కారణం..ఎగురుతున్నది చాలా కేంద్రీకృతమై ఉంది. అత్యంత సంపన్నుల గ్రీన్‌హౌస్‌ వాయుఉద్గారాలకు ఎగిరే కారణమవుతుంది. అందుకే అత్యంత సంపన్నులైన ఒకశాతం ప్రపంచంలోని విమానయాన ఉద్గారాలలో దాదాపు సగం మందిని ఉత్పత్తి చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ వారిలాగే జీవించినట్లయితే, వాతావరణ పతనానికి అన్ని కారణాలలో విమానయానం అతిపెద్దది.
‘‘ అత్యంత ధనవంతుల భారీ పర్యావరణ ప్రభావాలను మనం ఎందుకు సహిస్తాం? ధనవంతుల పట్ల మక్కువ చూపడం వల్ల మనలో చాలా లోపాలు ఏర్పడతాయి. లాబీయిస్టుల (లాభదాయకమైన ప్రైవేట్‌ ప్రయోజనాలతో రాజకీయ నాయకులతో సహా) ప్రజా స్వామ్యాన్ని నాశనం చేయడానికి ప్రభుత్వాలు అను మతించిన విధానం, కార్పొరేషన్లు, ఒలిగార్చ్‌లు, భూస్వా ములు తమ కార్మికులు, అద్దెదారులను నొక్కేసేం దుకు అనుమతించే నియంత్రణ సడలింపు మహమ్మారి సమ యంలో లాభదాయకత కోసం అనుమతించే వాతా వరణం ప్రైవేటీకరణ వైపు నిరంతర డ్రైవ్‌తో ఆరోగ్యం, విద్య,ఇతర ప్రజాసేవలక్షీణత. ఇవన్నీ ఒకేపరిస్థితి లక్ష ణాలు. మన కష్టతరమైన పరిస్థితు లకు కూడా ఇది వర్తి స్తుంది.! ’’

మన జీవిత-సహాయక వ్యవస్థలను నాశనం చేయడం. మనమందరం ఆధారపడిన గ్రహాల స్థలంలో సింహభాగాన్ని చాలా ధనవంతులు తమకు తాముగా గర్విస్తారు. మన ఉమ్మడి ప్రయోజనాలపై ఈ దాడిని ఎందుకు సహిస్తు న్నామో అర్థం చేసుకోవడం కష్టం. ప్రపంచం లోని అత్యంత ధనవంతులైన ఒక శాతం మంది (సంవత్సరానికి సగటున 172,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నవారు) ప్రపంచం లోని 15శాతం కార్బన్‌ ఉద్గారాలను ఉత్పత్తి చేస్తున్నారు. పేద 50శాతం కంటే రెట్టింపు ప్రభావం. సగటున, వారు ప్రతిసంవత్సరం ఒకవ్యక్తికి 70 టన్ను లకు పైగా కార్బన్‌ డయాక్సైడ్‌ను విడుదల చేస్తారు. మనంగ్లోబల్‌ హీటింగ్‌లో 1.5శాతం సెల్సియస్‌ మించకుండా ఉంటే మనం ప్రతి ఒక్కరూ విడుదల చేయగలిగిన దానికంటే 30 రెట్లు ఎక్కువ. ప్రపంచంలోని మధ్యతరగతి ఉద్గా రాలు వచ్చే దశాబ్దంలో బాగా తగ్గుతాయని అంచనా వేయబడినప్పటికీ, మన ఆర్థిక వ్యవస్థల సాధారణ డీకార్బనైజేషన్‌ కారణంగా,అత్యంత సంపన్నులు ఉత్పత్తి చేసే మొత్తం ఏమాత్రం తగ్గదు. మరో మాటలో చెప్పాలంటే..వారు దీనికి బాధ్యత వహిస్తారు. మొత్తం శాతం సెల్సియస్‌ 2లో ఇంకా ఎక్కువ వాటా. మంచి ప్రపంచ పౌరులుగా మారడం అంటే వారి కార్బన్‌ వినియోగాన్ని సగటున 97శాతం తగ్గించడం. జనాభాలో 90శాతం మంది కార్బన్‌ను ఉత్పత్తి చేయకపోయినా,రాబోయే తొమ్మిదేళ్లలో ధనవంతులైన 10శాతం (సగటున 55,000 కంటే ఎక్కువ సంపాదిస్తు న్నవారు) ఊహించిన ఉద్గారాలు దాదాపు మొత్తం ప్రపంచ బడ్జెట్‌ను ఉపయోగిస్తాయి. పర్యావరణ ప్రభావంలో అసమానత దేశం యొక్క అసమానతకు అద్దం పడుతుంది. సంపన్న దేశాలకు చెందిన సంపన్న ప్రజలు తమ నిందను చైనాకు లేదా ఇతర వ్యక్తుల జననాలకు మార్చడానికి చాలా ఆసక్తిని కలిగి ఉండటంలో ఆశ్చర్యం లేదు. కొన్నిసార్లు వారు తమ స్వంత ప్రభావాలకు హాజరయ్యే ముందు ఏదైనా ప్రయత్నిస్తారని అనిపిస్తుంది. 20మంది బిలియనీర్ల జీవనశైలిని ఇటీవల విశ్లేషణలో ప్రతిఒక్కరు సగటున 8,000 టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ను ఉత్పత్తి చేశారని కనుగొన్నారు. 1.5శాతం సెల్సియస్‌ కంటే ఎక్కువ వేడి చేయడానికి కట్టుబడి ఉన్న ప్రపంచంలో వారి సరసమైన వాటా 3,500 రెట్లు.ప్రధాన కారణాలు వారి జెట్‌లు,పడవలు. కొంతమంది బిలియనీర్ల బోట్‌ల వలె శాశ్వత స్టాండ్‌బైలో ఉంచబడిన సూపర్‌యాచ్‌ మాత్రమే సంవత్సరానికి 7,000 టన్నుల శాతం సెల్సియస్‌ 2ని ఉత్పత్తి చేస్తుంది.వాతావరణ ఛాంపి యన్‌గా తనను తాను నిలబెట్టుకున్న బిల్‌ గేట్స్‌కు పడవ లేదు. అయినప్పటికీ,అతను మంచి ప్రపంచపౌరుల కంటే 3,000 రెట్లు పెద్ద పాదముద్రను కలిగి ఉన్నాడు. ఎక్కువగా అతని జెట్‌లు,హెలికాప్టర్‌ల సేకరణ ఫలి తంగా. అతను ‘గ్రీన్‌ ఏవియేషన్‌ ఇంధనం కొనుగోలు’ అనిపేర్కొన్నాడు. కానీ అలాంటిదేమీ లేదు. జెట్‌లకోసం జీవ ఇంధనాలు,విస్తృతంగా అమలు చేయబడితే,పర్యావరణ విపత్తును ప్రేరేపిస్తుంది. ఎందుకంటే ఒకే విమానానికి శక్తినివ్వడానికి చాలా మొక్కల పదార్థం అవసరం. దీని అర్థం పంటలు లేదా తోటలు తప్పనిసరిగా ఆహారఉత్పత్తి లేదా అడవి పర్యా వరణ వ్యవస్థలను స్థానభ్రంశం చేయాలి. ఇతర ‘‘గ్రీన్‌’’ ఏవియేషన్‌ ఇంధనాలు ప్రస్తుతం అందు బాటులో లేవు.గేట్స్‌ కార్బన్‌ ఆఫ్‌సెట్‌లను కొను గోలు చేయడం ద్వారా అటువంటి వైరుధ్యా లను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు. కానీ వాతావరణం నుండి కార్బన్‌ డయాక్సైడ్‌ను తీసివేయడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలు ఇప్పుడు మొత్తం మానవాళి యొక్క ప్రభా వాన్ని తగ్గించడానికి అవసరం. చక్రవ ర్తిలా జీవించాలనుకునే వారిచే ఎందుకు బంధించబడాలి? విమానయానం యొక్క వాతావరణ ప్రభావాలను మనం విస్మరించమని తరచుగా ప్రయాణించే వారు తరచుగా చెబుతారు. ఎందుకంటే అవి ‘‘కొన్ని శాతం మాత్రమే’’. కానీ అవి సాపేక్షంగా తక్కువగా ఉండటానికి ఏకైక కారణం..ఎగురుతున్నది చాలా కేంద్రీకృతమై ఉంది. అత్యంత సంపన్నుల గ్రీన్‌హౌస్‌ వాయుఉద్గారాలకు ఎగిరే కారణమవు తుంది. అందుకే అత్యంత సంపన్నులైన ఒకశాతం ప్రపంచంలోని విమానయాన ఉద్గారా లలో దాదాపు సగం మందిని ఉత్పత్తి చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ వారిలాగే జీవించి నట్లయితే, వాతావరణ పతనానికి అన్ని కారణాలలో విమానయానం అతిపెద్దది. కానీ వారి కర్బన దురాశకు పరిమితులు లేవు. కొంతమంది అత్యంత సంపన్నులు ఇప్పుడు అంతరిక్షంలోకి ప్రయాణించాలని ఆశిస్తున్నారు. అంటే వారు ప్రతి ఒక్కరు10 నిమిషాల్లో 30మంది సగటు మానవులు విడుదల చేసే కార్బన్‌ డయాక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తారని అర్థం. చాలా ధనవంతులు సంపద సృష్టికర్తలుగా చెప్పుకుంటారు. కానీ పర్యావరణ పరంగా,అవి సంపదను సృష్టించవు. వారు అందరి నుండి తీసుకుంటారు. ఎక్కువ డబ్బున్నవాడు ఇప్పుడు ప్రతిదీ కొనుగోలు చేస్తున్నాడు. ఈలోపాలను పరిష్కరించే సమావేశాలకు కూడా యాక్సెస్‌. కొన్ని ఖాతాల ప్రకారం, కాఫ్‌`26 అన్ని వాతావరణ శిఖరాలలో అత్యంత ప్రత్యేక మైనది. పేద దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు బైజాంటైన్‌ వీసా అవసరాలు,కోవిడ్‌ వ్యాక్సిన్‌లను అందుబాటులోకి తెస్తామనే విరుద్ధమైన వాగ్దా నాలు,స్థానిక ధరలను పరిమితం చేయడంలో లేదా గదులను అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వ వైఫల్యాలకు కృతజ్ఞతలు. వసతి కోసం పిచ్చి ఖర్చుల,క్రూరమైన కలయికతో అడ్డుకు న్నారు. పేద దేశాల నుండి ప్రతినిధులు ఈ గోడలను స్కేల్‌ చేయగలిగినప్పటికీ,వారు తరచుగా చర్చల ప్రాంతాల నుండి మినహా యించబడతారు అందువల్ల చర్చలను ప్రభా వితం చేయలేరు. దీనికి విరుద్ధంగా,500 కంటే ఎక్కువ శిలాజ ఇంధన లాబీయిస్ట్‌లకు యాక్సెస్‌ మంజూరు చేయబడిరది. ఇది ఇప్పటికే వాతా వరణ విధ్వంసం కారణంగా దెబ్బతిన్న ఎని మిది దేశాల సంయుక్త ప్రతినిధుల కంటే ఎక్కువ. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఫిలిప్పీన్స్‌, మొజాంబిక్‌,మయన్మార్‌,హైతీ,ప్యూర్టోరికో, బహామాస్‌. నేరస్తులు విన్నవించారు. బాధితు లను మినహాయించారు. తరచుగా కోట్‌ చేయబడిన సిద్ధాంతం ఉంది.పెట్టుబడిదారీ విధానం అంతం కంటే ప్రపంచ ముగింపును ఊహించడం సులభం. పెట్టుబడిదారీ విధానమే ఊహించడం కష్టంగా ఉండడమే కారణం. చాలా మంది వ్యక్తులు దానిని నిర్వ చించడానికి కష్టపడతారు.దాని ఛాంపియన్‌లు సాధారణంగా దాని నిజమైన స్వభావాన్ని మరుగుపరచడంలో విజయం సాధించారు. కాబట్టి సులభంగా గ్రహించగలిగేదాన్ని ఊహిం చడం ద్వారా ప్రారంభిద్దాం. కేంద్రీకృత సంపద ముగింపు మన మనుగడ దానిపైనే ఆధారపడి ఉంటుంది.అన్ని పర్యావరణ చర్యలలో ముఖ్యమై నది సంపద పన్ను అని నేను నమ్ముతున్నాను. దైహిక పర్యావరణ పతనాన్ని నివారించడం అంటే విపరీతమైన సంపదను అంతరించి పోయేలా చేయడం గ్రహం భరించలేనిది మొత్తం మానవాళి కాదు. ఇది అల్ట్రా రిచ్‌.
జార్జ్‌ మోన్‌బియోట్‌

వేలంబస

ఉత్తరాంధ్ర పలుకులు.. జీవితాలు,భిన్న సంస్కృతులు, సామాజిక అసమ తౌల్యాలు, సమతమమతలను వడపోసిన విఖ్యాత కథారచయిత చింతకింద శ్రీనివాసరావుకు బాగా తలుసు. తెలుసు అనేకంటే వాటిని ఆయన గాఢంగా పరిశీలిస్తారని చెప్పవచ్చు. అటువంటి అక్షర కృషిలో భాగంగానే ‘‘వేలంబస’’ అని కథ అందించారు. దీని రచనా కాలం 2019 కాగా 2020 జనవరి 12 ప్రజాశక్తి ఆదివారం అనుబంధంలో తొలిసారి ప్రచురించబడిరది.
తూర్పు కనుమల్లో తిరుగాడే అడవి బిడ్డలకు ఉండే ఆచారాలు అలవాట్లు, ఆధునికులకు అబ్బురం కలిగించే విషయా లు,అందులో దాగి ఉండే ఆత్మీయతలు ఐక మత్యాలు అందరికీ ఆదర్శనియాలే…! విశాఖపట్నంకు చెందిన డాక్టర్‌ చింతకింది శ్రీనివాస రావు. తనదైన పత్రికా రచన వృత్తి రీత్యా పాత్రికేయులు. ఉత్తరాంధ్ర జిల్లాలోని గిరిజనులతో మమేకమై వారితో దగ్గరగా జీవించిన వ్యక్తి, ఆదివాసుల జీవన చిత్రాలు అంటేనే పోరా టాలు,మోస పోవడం,ఉద్యమాల్లో బలి కావడం,వంటి విష యాలే ఎక్కువగా గుర్తుకు వచ్చి ఆకథాంశాలతోనే తెలుగు గిరిజనకథ విస్తరించింది. అందుకు భిన్నంగా వారి సంస్కృతి,సాంప్రదాయాలు, కథావస్తువు లుగా వెలు వడుతున్న కథల రాశి. అటు వంటి భావి అవసరా లను గుర్తించి కథలు రాసే అతి కొద్ది మంది రచయి తల్లో శ్రీనివాసరావు ఒకరు. తను రాసిన వన జీవుల కథల సంఖ్య తక్కువే అయినా సూక్ష్మ పరిశీలన గుణం చక్కని సంభాషణ శైలితో పాఠకులను తన కథవెంట పరవశంతో నడి పించే సృజన కారుడు ఆయన. అటువంటి అక్షర కృషిలో భాగంగానే ‘‘వేలంబస’’ అని కథ అందించారు. దీని రచనా కాలం 2019 కాగా 2020 జనవరి 12 ప్రజాశక్తి ఆదివారం అనుబంధంలో తొలిసారి ప్రచురించబడిరది. తాను 40 సంవ త్సరాల క్రితం ప్రత్యక్షంగా చూసిన సంఘటనలు నేటికీ అరణ్యవాసుల జీవి తాల్లో సజీవంగా కనిపించడం సాంప్రదా యాల పట్ల వారు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో అర్థమవుతుంది,అందుకే ఈరచయిత తన కథావస్తువుగా ఆవిష యాన్ని ఎంపిక చేసుకుని ‘‘వేలంబస’’ కథ అందించారు. ఇక కథ విషయాని కొస్తే జంబారి,గుమ్మీలుఅనే ఇద్దరు గిరిజన ‘‘చెలిమి గాళ్ళు’’అడవికి వేటకు వెళ్ళడంతో ప్రారంభమైన ఈ కథ ఆసాంతం అడవిలోనే సాగుతుంది, ఏకఅంశం,ఏకకాలం, అనే రెండు గుణాలు ఇందులో నిండుగా ఉండి కథానిక లక్షణాలు కనిపిస్తాయి. మొత్తం కథ అంతా ఇద్దరి సంభాషణతో నడిపిం చడం,అది పాఠకులకు ఆసక్తిని కలిగిస్తూ కడదాకా కథను చదివింపచేయడం దీనిలోని విశేషాలు. కథలోని సంభాష ణలు తూర్పు మన్యం ప్రాంత గిరిజన యాస,పలుకుబడితో,కూడి ఉండటంతో పాటు,అచ్చమైన అటవీ వాతావరణం అడుగడుగునా కనిపిస్తుంది.అంతేకాదు అడవిబిడ్డలు చేసే వేటరకాలు,తొలకరి ఆరంభానికి ముందు ప్రతి గిరిజన గూడెంలో జరిగే వేటకు సంబంధిం చిన,’’ఇటిం పండుగ’’ విశేషాలు రచయిత ఇందులో సందర్భాలు గుణంగా వివరిస్తారు. ఈకథ కూడా ‘‘ఇటిం పం డుగ’’ నేపథ్యంలో కొనసాగుతుంది. విశాఖ మన్యంలోని గిరిబిడ్డలు ప్రతి ఏటా ఏప్రిల్‌,మే,నెలల్లో వేటకు సంబంధించిన ఈ పండుగ ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటారు. ప్రతి గిరిజన యువ కుడు పొద్దున్నే అడవికి వెళ్లి సాయంత్రం గూడెం చేరుకునే వేళకు, సొంతంగా చేసే ‘‘ఒబ్బిడి’’ వేట ద్వారా గాని, సామూహికంగా చేసే ‘‘సోపు’’ వేటద్వారా గాని అడవి జంతువులను వేటాడి తెచ్చి,
‘‘వేలంబస’’ అనే పేరు గల ఊరి బయట ఖాళీస్థలంలో ఉంచాలి. అలా లక్ష్యంలోగా ఒక్క జంతువునైనా వేటాడి తీసుకురాక పోతే ఆగూడెం లోని వరసైన యువ తులంతా …ఒట్టి చేతులతో వచ్చిన యువకులపై పేడనీళ్లు, రంగునీళ్లు, మామూలు నీళ్ళు,పోసి సరాగాలు హాస్యా లు ఆడతారు.ఈ పండుగనే కొన్ని ప్రాంతాల్లో ‘‘ఇటుకల పండుగ ‘‘అంటారు ఆనేపథ్యంలోనే ‘‘వేలంబస’’ కథ కొన సాగింది.ఇటుకల పండుగ నాడు అడవి జంతువుల వేటకు బయలుదేరుతారు జంబారి,గుమ్మీలు,అనే గిరిజన మిత్ర ద్వయం. అడవి తల్లి దయతోనే తమకు వేట జరిగి ఏదో ఒక జంతువు పక్షి దొరుకుతుందని తద్వారా గూడెంలో ఆడవారి ముందు పరువు దక్కించు కోవచ్చు అనే లక్ష్యంతో కొండ బాటన నడుస్తుంటారు. వేటలో జంభారి కాస్త చురుకైన వాడు, గుమ్మిలే మందకొడి, తను అడివంతా పొద్దుటి నుంచి తిరిగిన….ఎక్కడ ఏ జంతువు,పక్షి, చిక్కలేదు.మధ్యాహ్నం వస్తుండడంతో సాయంత్రం ‘వేలంబస’లో ఆడవాళ్లు చేసే వెక్కిరింతలు,అవమానాలు, గుర్తు కొచ్చి గుండెలు జల్లుమన్నాయి ఇద్దరికీ, దిప్ప (ఆనపబుర్ర)లో తెచ్చుకున్న చోడి అంబలి తాగి దాహం,ఆకలి,తీర్చుకుని మళ్ళీ వేట ప్రయత్నం మొదలు పెడ తారు.కిందటి రోజు గింజలు పోసి పెట్టిన ఉచ్చులో ఏమైనా పడ్డ ఏమో అన్న ఆశ కొద్ది అటువైపు వెడతారు. మూడో కం టికి తెలియకుండా గుర్తులు నాటిన, దగ్గరకు వెళ్లారు అక్కడి దృశ్యం చూసిన మిత్రద్వ యం ఆనందానికి హద్దులు లేకుండా అయ్యింది.వారు ఉంచిన ఉచ్చులో కుందేలు చిక్కుకొని ఉంది. వెంటనే లాఘవంగ దాన్ని తీసి సంచిలో వేసి, జాంబకు ఇచ్చి అంతకుముందే కోరింగ పొదలో పరిచిన వల వైపు కదిలారు ఇద్దరు.అదృష్టం వెంటవెంటనే మంది వచ్చినట్టు ఆ వలలో మరో రెండు కుందేళ్ళు చిక్కుకుని కనిపించడంతో వారి ఆనందం అడి వంత అయింది, కానీ అక్కడ వేట జరిగింది ‘జంబారి’ ఉచ్చులు,వలలు,వల్లే…!!మిగిలింది గుమ్మీలు వేట,అతను పెట్టిన ఉచ్చుల వైపు నెమ్మదిగా కదిలారు, కానీ అక్కడ వారి కళ్ళకు నిరాశే కనిపించింది.పెట్టిన ఉచ్చులు పెట్టినట్టే ఉన్నాయి. వేసిన దుం పలు వేసినట్టే ఉన్నాయి. గుమ్మీలు గుండె జారింది. బాధతో బావురుమన్నాడు అది చూసిన’’జంబారి’’ కళ్ళు చెమ్మగిల్లాయి.ఆ క్షణాన జంబారిలో అడవిబిడ్డల ఉండే సహజ గుణం సహకారం అనే మాటల ముందుకు వచ్చింది, వేటలో వారికుండే రెండు పద్ధతులు గుర్తు చేశాడు, ఇప్పుడు మనం చేసిన వేట నేను ఒక్కడినే చేసిన ‘ఒబ్బిడి’వేట కాదు,మనం సమానంగా పంచుకునే ‘‘సోపువేట’’ అన్నాడు ఆత్మీయంగా…అలా పంచుకున్న ఆనం దం తోడుతో గూడెం బాట పట్టి సాయం త్రం గూడెం బయట ఏర్పాటుచేసిన వేటలో తెచ్చిన జంతువులు, పక్షులు ప్రదర్శించే ‘‘వేలంబస’’కు చేరుకున్నారు. మిత్రులిద్దరూ వారి ఫలితాలను ప్రదర్శిం చబడే ముందు ఇద్దరు కలిసి చేసిన వేట అని చెప్పడం కన్నా ఇద్దరం వేరువేరుగా వేటాడి తెచ్చాము, అంటే ఆవిజయం తాలూకు అభినందనలు ఎవరికి వారుగా అందుకోవచ్చు, అనే స్వార్థం నిండిన ఆలోచన రావడంతో, కానుగ చెట్టు కింద కూర్చుని ఆనందంతో కలిసి వచ్చిన నిర్లక్ష్యం సాయంగా, నాలుగు కుందేళ్ళను రెండు గోనె సంచుల్లో సర్దబో తుండగా ..అవకాశం కోసం ఎదురు చూస్తున్న అవి ఒక్కొక్కటిగా గోనె సంచు ల బందీఖానా నుండి బయటపడతాయి. ఊహించని సంఘటన తో మిత్రులిద్దరూ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.మానవ ప్రయత్నంగా వెతికారు కూడా,, చేతికం దిన వేట చేజారి పోయిందన్న బాధ ఒకవైపు, కాగా…వేట పడలేదు అంటే కలిగే అవమానం దూషణల కన్నా పడ్డ వేట తన్నుకుపోయింది అంటే మరింత అవమానం కూడా…!! వేట జరగలేదన్న భయం బాధతో పాటు దొరికిన వేట సమానంగా పంచుకోలేక పోయాము అని బాధ మరోవైపు ఆవహించాయి. చివరికి వేట జరగలేదు అని మాత్రమే నిర్ధారించు కుని అందుకుగాను జరిగే అవమా నాలకు,అవహేళనకు సిద్ధపడ్డ ‘‘చెల్లిమ య్యలు’’ ఇద్దరూ ‘‘వేలంబస’’ వైపు తమకు జరగబోయే హేళనలు తలుచు కుంటూ నడిచారు.
ఇలా ముగిసిన ఈ కథలో కేవలం గిరిజన సంస్కృతి, సాంప్ర దాయాలు, మాత్రమే తీసుకుని కథ రాశారు అంటే పొరపాటే…!! దీనిలో అడవిబిడ్డల సాంప్రదాయాలను గౌరవి స్తూనే మానవులందరికీ ప్రస్తుతం అత్యవ సరమైన మానవసంబంధాల గురించి, అంతర్వాహినిగా రచయిత ఇందులో వ్యక్తపరిచారు. భాషా నానుడులు సంపూ ర్ణంగా స్థానికతకు దగ్గరగా ఉండేటట్లు తీసుకుని నిర్ణయం, కథ మొత్తానికి నిండుదనాన్ని ఇచ్చి రచయితలోని, ప్రతిభ,పరిశీలన,తేటతెల్లం అవుతాయి. కథ పేరు కూడా ఆసక్తిని సముచి తత్వాన్ని కలిగిస్తుంది. ఇలాఅన్ని విధాల ఉన్న తత్వం కలిగిన ఈకథ, కొత్త కథకులకు నిజంగా దారి దీపమే…!!!
-డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు , ఫోను: 77298 83223

భారీ వ‌ర్షాల‌కు జ‌న‌జీవ‌నం అత‌లాకుత‌లం

ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో వరద తీవ్ర నష్టం కలిగించింది.బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా కురిసిన కుండ పోతకు వాగులు, నదులు పోటెత్తి ఊళ్లు, పట్టణాలను ముంచేశాయి. జలాశయాలు, చెరువుల కట్టలు తెగాయి. రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. వేలాది ఎకరాలలో పంట నీట మునిగింది. బస్సులు నీటిలో కొట్టుకుపో యాయి. స్వర్ణముఖి ఒడ్డున ఓ ఇల్లు నిలువునా కుంగి నదిలో కలిసిపోయింది. తిరుమల కొండలలో కుంభవృష్టి కురవడంతో ఘాట్‌ రోడ్డులో రాకపోకలకు ఆటంకమేర్ప డిరది. వర్షాలు వరదలకు రైళ్లు, బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. మొత్తం18 మంది మరణించినట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికా రులు తెలిపారు. 50 మందికి పైగా ప్రజలు గల్లంతయ్యారు. రేణిగుంట-గుంతకల్‌ రైలు మార్గంలో కిలోమీటరు మేర రెండు ట్రాక్‌లు కొట్టుకు పోయాయి. అనంతపురం జిల్లా కదిరిలో మూడంతుస్తుల భవనం వర్షాలకు నాని కూలిపోవడంతో ముగ్గురు చిన్నారులు, ఒక వృద్ధురాలు మరణించారు.
ఈశాన్య రుతుపవనాలకు తోడు బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షాలతో రాయలసీమలోని కడప,చిత్తూరు, అనంతపురం జిల్లాలతో పాటుగా నెల్లూరు జిల్లాలోనూ విలయం సృష్టించింది. భారీ వర్షాలకు పెన్నా, దాని ఉపనదులన్నీ పొంగిపొర్లాయి. ఆనకట్టలు తెగిపోయాయి. గ్రామాల మీదకు ఒక్కసారిగా జలప్రళయం మాదిరి ఎగిసిపడడంతో నేటికీ పలు గ్రామాలు కోలుకోలేని స్థితిలో ఉన్నాయి. 18వ తేదీ సాయంత్రం నుంచే..ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్‌ 16.2021,22వ తేదీవరకు వర్షాలు కురుశాయి. వర్షాన్ని వాతావరణ శాఖ ముందుగానే అంచనా వేసింది. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయు గుండంగా మారి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్‌ సరిహద్దుల్లో వాయుగుండం తీరం దాటు తుందని హెచ్చరించింది. ఆ క్రమంలోనే 17వ తేదీ నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. తిరుమలలో ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఏకంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని టీటీడీ అధికారికంగా వెల్లడిరచింది.వర్షాల ప్రభావంతో 18వ తేదీకి తిరుమల అల్లకల్లోలంగా మారింది. తిరుపతి వరద నీటిలో చిక్కుకుంది. చిత్తూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో కూడా వర్ష తాకిడి తీవ్రంగా కనిపించింది. చెరువులన్నీ నిండుకుండలయ్యాయి. వాగులు పొంగిపొర్లాయి. నదులు ఉద్ధృతంగా ప్రవహించాయి. తిరుమల ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా దిగువన పింఛా నదీకి వరదనీరు భారీ స్థాయిలో చేరింది. 40 వేల క్యూసెక్కుల నీరు వచ్చే పింఛాడ్యామ్‌కి ఒక్కసారిగా 4లక్షల క్యూసెక్కుల వరకూ వరద జలాలు రావడంతో కట్ట తెగిపోయింది.18వ తేదీ చీకటి పడిన తర్వాత పింఛా డ్యామ్‌ కట్ట కొట్టుకుపోయింది. ఈ నీరు, బాహుదా నుంచి వచ్చిన నీటితో కలిసి చెయ్యేరు నది ఒక్కసారిగా ఉప్పొంగింది. ఫలితంగా అన్నమయ్య డ్యామ్‌ ప్రమాదంలో చిక్కుకుంది.
అన్నమయ్య డ్యామ్‌ కొట్టుకు పోయింది..
1976లో జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉండగా శంకుస్థాపన చేసి..ఎన్టీఆర్‌ హయంలో పూర్తిచేసిన అన్నమయ్య ప్రాజెక్టు ద్వారా 10వేల ఎకరాలకు సాగునీరు, రాజంపేట పట్టణం సహా సమీప గ్రామాలకు తాగునీరు అందు తోంది. ఈడ్యామ్‌ నిర్వహణ లోపాలపై పలు ఫిర్యాదులున్నాయి. ఇప్పుడు పింఛా డ్యామ్‌ నుంచి వచ్చిపడిన వరద ప్రవాహంతో ఒక్క సారిగా 3.5 లక్షల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లోని అన్నమయ్య ప్రాజెక్ట్‌ తట్టుకునే స్థితిలో లేదని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి,కడప జిల్లా ప్రత్యేక అధికారిగా వరద సహాయక చర్యల కోసం వెళ్లిన శశి భూషణ్‌ కుమార్‌ తెలిపారు. ‘‘సహజంగా 2లక్షల క్యూసెక్కుల ప్రవాహానికి అనుగుణంగా ప్రాజెక్టు డిజైన్‌ చేశారు. కానీ దానికి దాదాపు రెట్టింపు స్థాయిలో వరద వచ్చింది. అప్పటికే గేట్లు ఎత్తి నీటిని తరలించే ప్రయత్నం చేశాం. కానీ కట్ట పై నుంచి ప్రవాహం సాగింది. చివరకు 19వ తేదీ ఉదయం 5.30 గంటలు దాటిన తర్వాత కట్ట తెగిపోయింది. దిగువన గ్రామాల్లోకి వరద ప్రవాహం ఒక్కసారిగా వెళ్లింది. ముందుగానే హెచ్చరికలు చేయడం వల్ల ప్రాణనష్టం తగ్గింది. కానీ నందలూరు, రాజంపేట మండ లాల్లో 9 గ్రామాలు జలమయమయ్యాయి’’ అని ఆయన వివరించారు.చాలా మంది ప్రాణ భయంతో పరుగులు తీశారు. కొండలపైకి ఎక్కి తలదాచుకున్నారు. అందులో కొందరు వరద ప్రవా హంలో కొట్టుకుపోగా, మిగిలిన వారు ఇప్పటికీ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
కళ్లెదురుగానే కొట్టుకుపోయారు
‘మా ఆయనకు చెవుడు. ఎంత చెప్పినా వినబడలేదు. వరద వచ్చేస్తుందని మాకు ఎవరో ఫోన్‌ చేశారు. ఆలోగానే నీరు వాకిట్లోకి వచ్చేసింది. కొండపైకి వెళ్లాలంటే మాకు ఓపిక లేదు. అరవై ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా గానీ ఇలాంటి భయంకర దృశ్యాలు చూడలేదు. మిద్దె పైకి ఎక్కి తలదాచుకున్నాం. చుట్టూ వరద నీరు. అలలు అలలుగా ఎగిసిపడేది. ఏం జరుగుతుందో తెలియదు.ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపాం. మూడు,నాలుగు గంటల తర్వాత శాంతించింది. మా కళ్లెదురుగానే కొందరు నీటిలో కొట్టుకుపోయారు. మా బంధువులిద్దరి ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు’’ అంటూ పులపుత్తూరు గ్రామానికి చెందిన ఎం నాగమణి బీబీసీకి తెలిపారు.సమీపంలోని గుం డ్లూరు శివాలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆ శివాలయ పుజారి కుటుంబం ఆచూకీ కూడా ఇప్పటి వరకూ దొరకలేదు. ఇంకా అనేక మంది గల్లంతయినట్టు చెబుతున్నారు. చెయ్యేరు వరదల మూలంగా మరణించిన వారిలో 12 మంది మృతదేహాలు లభ్యమయినట్టు అధికా రులు ప్రకటించారు. మరో 15 మంది వరకూ ఆచూకీ దొరకాలని చెబుతున్నారు.
గల్లంతయిన వారి సంఖ్య ఎక్కువే
అన్నమయ్య ప్రాజెక్టు దిగువన వరదల్లో గల్లంతయిన వారి సంఖ్యపై అనేక రకాల ప్రచారాలు సోషల్‌ మీడియాలో సాగుతున్నాయి. ప్రభుత్వం మాత్రం వారి సంఖ్య 15గా నిర్ధరిం చింది. తమ వాళ్లు కనిపించడం లేదంటూ ఎక్కడికక్కడ స్థానికులు చెబుతున్న సంఖ్యతో పోల్చితే ఇది సగం కంటే తక్కువే.‘‘ప్రభుత్వం చెప్పిన సంఖ్యకు, మా ఊరిలో కనిపించకుండా పోయిన వారి సంఖ్యకు సంబంధం లేదు. మా సొంత మేనత్త, ఆమె భర్త కనిపించడం లేదు. ఇంట్లో సామాను కోసం అని కొంత ఆలస్యం చేశారు. మేం కేకలు వేస్తున్నా వారు తొందరగా బయటపడలేదు. దాంతో ఇప్పుడు వారి ఆచూకీ లేదు. మా గ్రామంలోనే ఎస్సీ కాలనీలో ముగ్గురు కనిపించడం లేదు. రాజుల పేటకు చెందిన నలుగురు కనిపించడం లేదు. ఒక్క మా ఊరిలోనే 10 మంది. మందపల్లిలో ఆరు, గుండ్లూరులో 10 ఇలా ఇప్పటికే మా ప్రాం తంలో 26 మంది గల్లంతయ్యారు. ప్రభుత్వం మాత్రం తక్కువగా చెబుతోంది’’ అని పులపు త్తూరుకి చెందిన ఎం.నాగిరెడ్డి తెలిపారు.
నెల్లూరులో కకావికలం
ఎగువన కురిసన వర్షాలతో పెన్నా నది పోటెత్తింది. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహించింది. నెల్లూరు నగరం, కోవూరు నియోజకవర్గం సహా పలు ప్రాంతాలను జలదిగ్బంధంలో చిక్కుకోవడానికి కారణమైంది. 20వ తేదీ తెల్లవారుజాము నుంచి నెల్లూరులో వరద తాకిడి తీవ్రంగా కనిపించింది. అంతకు ముందే గూడురు వద్ద జాతీయ రహ దారిపై నీరు చేరింది. కావలి, సూళ్లూరుపేట పరిసరా ల్లో లక్షల ఎకరాల పంట నీటమునిగింది. పొలాలు చెరువులను తలపించాయి.చివరకు 20వ తేదీ రాత్రి నెల్లూరు వద్ద ఎన్‌హెచ్‌-16కి కూడా గండిపడిరది. కోవూరు సమీపంలో కూడా కృష్ణపట్నం,బళ్లారిరోడ్డు పైకి వరద ప్రవాహం చేరడం, గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకపోవడంతో తీవ్రంగా వరద తాకిడి కొనసాగుతోంది.ఎగువన సోమశిల శాంతించి నప్పటికీ మైలవరం డ్యామ్‌తో పాటుగా, పెన్నార్‌ నుంచి ప్రవాహం కొనసాగుతోంది. దాని కారణంగా పెన్నా నదికి వరద 21 వ తేదీ రాత్రి వరకూ కొనసాగే అవకాశం ఉందని ఇరిగేషన్‌ అధికారులు భావిస్తున్నారు.18 మంది మృతి, 3,500 పశువులు మృతిభారీ వర్షాలు, వరదల మూలంగా ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రమాదాల్లో 18 మంది మరణించినట్టు అధికారికంగా ధ్రువీకరించారు. గల్లంతయిన వారి కోసం గాలిస్తున్నట్టు ప్రకటించారు. వేల పశువులు వరదల్లో కొట్టుకుపోయాయి. సుమారు 3,500 పశువులు మృతి చెందినట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 28 కుంటలు, చెరువులు, కాలువలు తెగిపోయాయని విపత్తుల నిర్వహణశాఖ వెల్లడిరచింది.
తిరుపతిపై జలఖడ్గం..
తిరుమల తిరుపతిని భారీ వర్షాలు ముంచెత్తాయి. అన్ని ప్రాంతాలు నీట మునిగాయి. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో తిరుమల గిరులన్నీ జలపాతాల్లా మారాయి. రోడ్లన్నీ నదులను తలపించాయి. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా వరద నీరే. వరద వెళ్లే కాలువలు చిన్నగా ఉండడం.. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో.. కాలనీలన్నీ నదుల్లా మారిపోయాయి. వాహనాలు, జంతువులు కళ్ల ముందే కొట్టుకుపోయాయి. ఇళ్లలోని సామానులు కాగితపు పడవల్లా నీటితో తేలియాడుతూ వెళ్లిపోయాయి. తిరుమల, తిరుపతిలో ఎప్పుడూ ఇలాంటి దృశ్యాలను చూడలేదని స్థానికులు తెలిపారు. కనివినీ ఎరుగని రీతితో వరద ముంచెత్తిందని వాపోతున్నారు. ఇంతటి ప్రకృతి విపత్తును ఊహించలేదని చెబుతున్నారు.టీటీడీకి 4కోట్లకు పైగా నష్టం..30 ఏళ్లలో ఎప్పుడూ ఇంత భారీ వర్షం కురవలేదు’ నవంబరు 17 నుంచి 19వ తేదీ వరకు తిరుమల, తిరుపతిలో కురిసిన వర్షాలు గత 30 సంవత్సరాల్లో ఎప్పుడూ కురవలేదని టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు. ఈ భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్‌ డ్యామ్‌లు పొంగి పొర్లి..కపిల తీర్థం జలపాతం గుండా తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలను ముంచేశాయని ఆయన తెలిపారు.

పోల‌వ‌రంపై పాత‌పాటే!

పోలవరం ప్రాజెక్టుపై ఎప్పటి కప్పుడు పరిశీలిస్తామని చెబుతున్న కేంద్రం తాజాగా దక్షి ణాది రాష్ట్రాల మండలి సదస్సు సందర్భంగా కూడా ఆపాత పాటనే వినిపించింది. 2017లో చెప్పినట్లుగానే 100 శాతం నిధులను భరిస్తామని మాత్రమే చెప్పిన కేంద్రం సహాయ పునరావాసం, తాజా అంచనాలపై మాత్రం స్పష్టత ఇవ్వడంలేదు. ఎస్‌జెడ్‌సి సదస్సు సందర్భంగా నవంబర్‌ 8,10వ తేదీల్లో రాష్ట్రానికి రాసిన రెండు లేఖల్లోనూ స్పష్ట మైన వివరాలు చెప్పకపోవడం గమనార్హం. 8వ తేదీన రాసిన లేఖలో 2014కు తరువాత జాతీయ హోదా పొంది,అనంతరం జరిగిన పనుల్లో మొత్తం100 శాతం తామే భరిస్తామని చెప్పిన విషయాన్నికూడా ఆ లేఖలో పునరుద్ఘాటించింది. అయితే, ఇరిగేషన్‌ కాంపోనెంట్‌ విలువను మాత్రమే భరించనున్నట్లు పేర్కొంది. అరటేప్రాజెక్టుకు సంబం ధిరచి సహాయ పునరావాసం పనులకు నిధులివ్వ డానికి సానుకూలంగా లేనట్టేనని రాష్ట్ర అధికా రులు ఆరదోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే తాజా గా పెరిగిన పనుల అంచనా, కొత్త డిజైన్లపై మాత్రం స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. పైగా 2017-18 ధరల మేరకు కొత్త అంచనా రూ.47,725 కోట్లుకు సంబంధించిన ప్రతిపాదనలు ‘ఇన్‌ ప్రోగ్రెస్‌’గా ఉన్నట్లు లేఖలో పేర్కొన్న కేంద్రం, దాని వాస్తవిక పరిస్థితి ఏమిటన్నది స్పష్టం చేయక పోవడం గమనార్హం. ఇక10వ తేదీన రాసిన మరో లేఖలో కూడా ఆర్ధిక పరమైన అంశాలపై పాత పాటే పాడింది. జాతీయ హౌదా ప్రకటిరచిన తరువాత ఇప్పటివరకు 13,226 కోట్ల రూపాయలు ఖర్చు జరిగిరదని, అరదులో ఇప్పటికే రూ.11, 600 కోట్లు రీయింబర్స్‌ చేసామని వివరించింది. మరో రూ.302 కోట్లు బిల్లులు ఆర్ధిక శాఖ వద్ద ఉన్నాయని పేర్కొంది. మిగిలిన రూ.605 కోట్ల విలువైన బిల్లులు పోలవరం ప్రాజెక్టు అథారిటీ వద్దనే పరిశీలనలో ఉన్నట్లు పేర్కొంది. 2013-14ధరల మేరకు మారిన అంచనా 20,398 కోట్లు గా చెప్పిన కేంద్రం 2014కు ముందు జరిగిన వ్యయం తీసివేయగా మిగిలింది రూ.15,667 కోట్లుగా గతంలోనే అరగీకరించింది. ఈ నిధులను మాత్రమే ఇస్తామని చెప్పడంతో కొత్త అంచనాలపై ఆశలు గల్లంతవుతున్నట్టే కనిపిస్తోంది. ఇప్పుడు ఈ లేఖలు రాష్ట్ర ఆర్ధికశాఖ, నీటిపారుదల శాఖల్లో చర్చనీయాంశాలుగా ఉన్నాయి. స్పష్టమైన హామీలు రాకపోవడంవల్ల మరోసారి హస్తిన యాత్ర చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.పోలవరానికి తిలోదకాలే!!
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం రోజుకో నాటకమాడుతోంది.తుది అంచనా వ్యయాన్ని ఆమో దించకుండా దాగుడుమూత లాడుతోంది. దీని కంతటికీ ప్రస్తుత సీఎంజగన్మోహన్‌రెడ్డి నిర్వా కమే కారణం.చేసిన పాపం ఆయన్ను ఇప్పుడు కట్టి కడుపు తోంది. ప్రాజెక్టు తుది అంచనా వ్యయాన్ని రూ.55, 548.87 కోట్లుగా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణ యించినప్పుడు..వేలకోట్లు దోచుకోవడానికే అంచ నాలు పెంచారని నాటి విపక్ష నేతగా ఉన్న జగన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రానికి ఫిర్యాదులు చేశారు.ఎన్‌జీటీ, సుప్రీంకోర్టుల్లో కేసులు వేయిం చారు.నిజం తెలిసీ పోలవరం చంద్రబాబుకు ఏటీ ఎంలా మారిందని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచా రంలో ఆరోపించారు.ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్‌.. నాడు చంద్రబాబు రూపొందించిన తుది అంచనా వ్యయాన్నే ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.కానీ కేంద్ర జలశక్తి శాఖ నియమించిన కమిటీ రూ.47,725.25 కోట్లకు దానిని కుదించింది. తర్వాత ఈ వ్యవహారం కేంద్ర ఆర్థిక శాఖను చేరింది.ప్రాజెక్టులో సాగునీటి కాంపోనెంట్‌కే నిధులస్తామని మెలిక పెట్టింది. సాగునీటి అవసరాలకు సంబంధించిన వ్యయాన్ని రాష్ట్రమే భరించాలని అంది.ఆ తర్వాత 2017లో కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన రూ.20,398 కోట్ల తుది అంచనాకే కట్టుబడి ఉంటామని పేర్కొంది. దానిప్రకారమే రాష్ట్రప్రభుత్వాన్ని ఒప్పించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి సూచిం చింది. పీపీఏ అత్యవసర భేటీలో రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. 2013-14 అంచనా ధరలకు ప్రాజెక్టు ఎలా పూర్తవుతుందో చెప్పాలని నిలదీశారు.అది సాధ్యం కాదని కేంద్ర జలసంఘం అధికారులు కూడా స్పష్టం చేశారు. దీనిపై ఆర్థిక శాఖ నిర్ణయం కోసం రాష్ట్రప్రభుత్వం ఎదురుచూస్తోంది.కానీ కేంద్రం నిధులివ్వదని మాత్రం అర్థమైంది. అందుకే ప్రాజెక్టు ఎత్తును కుదించాలని దాదాపు నిర్ణయించినట్లు తెలిసింది.
సాధికారికంగా బలి..
ఆంధ్రుల జల-జీవ నాడిగా తెరపైకి వచ్చిన పోలవరం ప్రాజెక్టును ‘బలి’ చేసే ప్రక్రియ సాధికారికంగానే మొదలైంది. కేంద్రం నుంచి పోరాడి నిధులు సాధించడం పక్కనపెట్టి..నీటి నిల్వ ఎత్తును తగ్గించడంపైనే జగన్‌ సర్కారు దృష్టి పెట్టింది. ప్రాజెక్టులో నీటిని 45.72 మీటర్ల ఎత్తు వరకు నిల్వ చేయాలన్నది తొలి ప్రతిపాదన. దీని ప్రకారం పోలవరం నిర్మాణ వ్యయం రూ.55వేల కోట్లు! కానీ,2013-14 అంచనా వ్యయానికే కట్టు బడి ఉంటామని..20వేల కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్ర ఆర్థికశాఖ తేల్చి చెప్పింది.దీంతో.. పరిహారం ఖర్చును తగ్గించుకునేలా నీటి నిల్వను 41.15 మీటర్ల ఎత్తుకే పరిమితం చేసేందుకు రాష్ట్రప్రభుత్వం సమాయత్తమైంది. అదే జరిగితే..అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బ తింటాయి.సాగునీటి రంగంపై ఆమధ్య సమీక్ష జరిపిన జగన్‌..పోలవరంలో నీటిని41.15 మీటర్ల ఎత్తువద్ద నిల్వచేస్తే భూసేకరణకు ఎంత వ్యయం అవుతుందో పూర్తిస్థాయి సమాచారం తీసుకురా వాలని అధికారులను ఆదేశించారు. నిర్వాసితులు, సహాయ పునరావాసం వంటి అంశాలనూ తెలియ జేయాలన్నారు. వెరసి..ప్రాజెక్టు ఎత్తు కుదింపుపై స్పష్టమైన సంకేతాలు పంపారు. 41.15 మీటర్ల ఎత్తులో నీటి నిల్వ చేపట్టాలంటే భూసేకరణ, సహాయ పునరావాసానికి రూ.3500కోట్ల అవసర మవుతాయని సహాయ పునరావాస కమిషనర్‌ చెప్పారు.దీనికోసం నెలకు రూ.300 కోట్లు చొప్పున విడుదల చేయాలని సీఎంవో కార్యదర్శి ధనుంజ యరెడ్డిని జగన్‌ ఆదేశించారు.ఇక నిర్మాణ పనులకు రూ.1000 కోట్లు కావాలని ప్రాజెక్టు సీఈ సుధాకర బాబు కోరారు.దీంతో మొత్తంగా రూ.5000 కోట్లు అవసరమవుతాయని,ఈ మొత్తాన్ని ప్రతినెలా విడ తల వారీగా మంజూరు చేస్తామని జగన్‌ తెలి పారు. పోలవరంలో నీటి నిల్వను 41.15 మీటర్లకు పరిమితం చేస్తే భూసేకరణ,పునరావాసానికి రూ.3 500 కోట్లు అవసరమవుతాయి. 69,688.38 ఎకరాల భూసేకరణ అవసరం.ఇందులో 68, 087.88 ఎకరాలు ఇప్పటికే సేకరించి నందున.. మరో1600.50 ఎకరాలు సేకరిస్తే సరిపోతుంది. భూసేకరణతో20,870మంది నిర్వాసితులవు తారు. వారిలో ఇప్పటికే 3110 మందికి పరిహారం చెల్లించినందున..మరో 17,760 మందికి నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. విశాఖ పారిశ్రా మిక, తాగునీటి అవసరాల కోసం పోలవరం నుంచి పైపులైన్‌ వేసే విషయంపై ప్రతిపాదనలు తేవాలని సీఎం ఆదేశించారు.నిజానికి విశాఖ వరకు ప్రధాన కాలువ ఎప్పుడో పూర్తయింది.ఇప్పుడు కొత్తగా పైపులైన్‌ అవసరమేంటి? అంటే ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని నిర్ణయించినట్లే కదా! 41 మీటర్లకే పరిమితమైతే అదిబహుళార్థ సాధక ప్రాజెక్టు కాదు..సాధారణ బ్యారేజీగా మిగిలిపోతుంది.
కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయమే కీలకం !
పోలవరం అంచనాలపై ఢల్లీిలో కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావతతో రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పి.అనిల్‌ కుమార్‌, జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్య దర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి తదితరులు భేటీ అయ్యారు.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ఈ భేటీలో పాల్గొం టారని సీఎంవో లీకులిచ్చింది.అయితే అలాంటి కార్యక్రమమే ఖరారు కాలేదు. కేవలం షెకావతను కలిశారు. కేంద్ర జల సంఘం సిఫారసు చేసిన అంచనా వ్యయం రూ.47725.74 కోట్లకు ఆమోదం తెలపాలని ఆయన్ను కోరారు.అయితే కేంద్ర ఆర్థిక శాఖే నిర్ణయం తీసుకోవాలని ఆయన తేల్చేశారు.ఈ సమావేశం ఎలాంటి ఫలితాలూ ఇవ్వలేదు. ఈ భేటీ తర్వాత మంత్రులు బుగ్గన, అనిల్‌ విలేకరులతో మాట్లాడారు.గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టుపై అవలంబించిన విధానాలపై మోదీ సర్కారుకు దురభిప్రాయం ఉందని..జగన్‌ పగ్గాలు చేపట్టాక కేంద్ర వైఖరిలో మార్పు వచ్చిందని చెప్పారు. ప్రాజెక్టుకు నిధుల విషయంలో ఉదారత చూపుతోందని అన్నారు.అదే నిజమైతే 20.398 కోట్లే ఇస్తానని ఎలా చెబుతుంది? చంద్రబాబు సీఎంగా ఉండగా..ఇంత మొత్తమే ఇస్తామని ఎప్పుడూ చెప్పలేదు. ఆయన రూపొందించిన 55 వేల కోట్ల తుది అంచనాలకు సాంకేతిక సలహా మండలి (టీఏసీ) ఆమోదముద్ర వేసిందని రాజకీయ పరిశీలకులు గుర్తుచేస్తున్నారు.పైగా వైసీపీ నంబర్‌ టూ విజయసాయిరెడ్డి ప్రాజెక్టులో అవినీతిపై రాజ్యసభలో ప్రశ్నించినప్పుడు ఆ అవకాశమే లేదని ఇదే షెకావత పార్లమెంటు సాక్షిగా తేల్చిచెప్పారు.పైగా టీడీపీ వ్యయం చేసిన నిధులు రూ.8,500 కోట్లను కేంద్రం రీయింబర్స్‌మెంట్‌ చేసిందని గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యయం చేసిన మొత్తం నుంచే జగన్‌ సర్కారుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.1,850 కోట్లు..తాజాగా 2,234.288 కోట్లు విడుదల చేసింది.జగన్‌ ప్రభుత్వం వ్యయం చేసిన మొత్తానికి సంబంధించి ఇప్పటి వరకూ ఒక్క బిల్లు కూడా రీయింబర్స్‌ కాలేదు.ఈ బిల్లులు ఇంకా పీపీఏ వద్దే ఉన్నాయి.ఇంకా కేంద్రానికి పంపనేలేదు.ఎందుకంటే చేసిన పనులకు, పెట్టిన బిల్లులకు పొంతన లేదు. 55 వేల కోట్ల అంచనాలను ఆమోదించిన టీఏసీ..ఇంజనీరింగ్‌ అధికారుల బృందమే తప్ప కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కాదని ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ అడ్డగోలుగా వాదించింది. ఇప్పుడు అదే టీఏసీ నిర్ధారణ మేరకే రూ.55,548.87 కోట్ల అంచనా వ్యయానికి అంగీకరించాలని..కనీసం సవరించిన అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లకైనా ఆమోదం తెలపాలంటూ..ప్రధాని మోదీని, అమితషా, నిర్మలా సీతారామన్‌, షెకావతలను ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దాకా అభ్యర్థిస్తున్నారు.ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే..ఒక్క భూసేకరణకే రూ.28 వేల కోట్లు వ్యయమవుతాయని ఇప్పుడు చెబుతున్నారు.చంద్రబాబు చెప్పినప్పుడు అవినీతి ఆరోపణలు గుప్పించారు.అయితే..గతంలో వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్నందునే..ఎన్నికల ప్రచారం మోదీ నోట పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ‘ఏటీఎం’గా మారిందన్న ఆరోపణలు వచ్చాయని చెబుతున్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచే సత్తా లేక ఇప్పటికే ప్రత్యేక హోదాను అటకెక్కించిన జగన్‌..ఇప్పుడు పోలవరానికి మూతబండ వేసే దిశగా అడుగులు వేస్తున్నారు.రాష్ట్రానికి తీరని అన్యాయం చేయబోతున్నారు.రాష్ట్ర ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తే ఇలాంటి అనర్థాలే సంభవిస్తాయని జగన్‌ గుర్తెరగాలి.కేంద్రంపై ఒత్తిడి పెంచే మార్గాలను అన్వేషించాలి.అంతేతప్ప తన మంత్రులతో చంద్రబాబును నాలుగు బూతులు తిట్టించి పబ్బం గడుపుకోవాలంటే ప్రజలు క్షమించరన్న సంగతి తెలుసుకోవాలని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
పోలవరంపై కేంద్రం ఉపేక్ష, ముంపు గ్రామాలకు శిక్ష..
ఏపీ విభజన చట్టంలో జాతీయ ప్రాజె క్టుగా ఘనంగా ప్రకటించబడిన పోలవరం కేంద్రం వివక్షతో సమస్యాత్మకంగా నడుస్తుంటే జరిగిన మేరకు పనులు కూడా ప్రజల పాలిట ప్రాణాంతక మవుతున్నాయి. పెరిగిన వ్యయాన్ని లెక్కలోకి తీసు కోకపోవడం ఒకట్కెతే ప్రాథమిక సూత్రమైన సహాయ పునరావాస కార్యక్రమాలకు బాధ్యత లేదని దులి పేసుకోవడం కేంద్రం చేస్తున్న దారుణం. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పునరావాస పనులు సరిగ్గా జరగలేదని తాము అధికారంలోకి రాగానే పటిష్టంగా ఆదుకుంటామని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ పదేపదే ప్రకటించారు. అప్పట్లో ఎన్నికల ప్రచారంలో స్వయంగా ప్రధాని మోడీనే పోలవరం నిర్మాణం అక్రమాలకు నిలయంగా మారిందని ఆరోపించారు. తర్వాత ఆయన మళ్లీ ప్రధాని అయ్యారు, జగన్‌ ముఖ్యమంత్రి అయ్యారు గాని పోలవరం వెతలు మాత్రం తీరలేదు.. సరికదా తీవ్రమానవ సంక్షోభంగా మారుతు న్నాయి. కఫర్‌డాం ఘనంగా కట్టేసిన కారణంగా వర్షాలు పెద్దగా కురవకపోయినా సరే నీళ్లు ముం చేస్తున్నాయి.
ఫలితం లేని వినతులు
నిర్మాణ వ్యయం మాత్రమే అది కూడా 2014 నాటిలెక్కల ప్రకారం 22 వేల కోట్లు అది కూడా ముందు రాష్ట్రం ఖర్చు చేసిన తర్వాత మాత్రమే తాము విడుదల చేస్తామని కేంద్రం చాలా సార్లు ప్రకటించింది. ఏ ప్రాజెక్టు కట్టినా ముందు పునరావస కల్పన జీవనోపాధి పునరుద్ధరణ జరిగాకే జరగాలని సుప్రీంకోర్టుతో సహా న్యాయస్థానాలు అనేక సార్లు చెప్పి వున్నాయి. ఈ అంశంపై కేంద్రంలోని మోడీ సర్కారు కావాలనే వంకరటింకరవాదనలతోచేతులు దులిపేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నిష్క్రియా ప్రియత్వం వహిస్తున్నది. అడపాదడ వినతులతో సరిపెడుతున్నది. గత నెలలోనే ముఖ్యమంత్రి జగన్‌ స్వయంగా ఢల్లీికి వెళ్లి వినతి పత్రాలు ఇచ్చి వచ్చారు. కేంద్రం నుంచి ఈ విషయంలో రావలసిన సహాయం రావడం లేదనేది వాస్తవం. ప్రజలకు చెప్పి ప్రతిపక్షాలను కలుపుకొని వొత్తిడి పెట్టె బదులు టిడిపి, వైసీపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంలో మునిగి తేలుతున్నాయి. 55 వేల కోట్లకు పెరిగిన ప్రాజెక్టు అంచనా వ్యయం పెంపును తాము ఆమోదింప చేసుకుంటే ఈప్రభుత్వ హయాంలో వెనక్కు పోయిం దని టిడిపి చాలా కాలం విమర్శించింది. అయితే తర్వాత జల్‌శక్తి శాఖ పోలవరం ప్రాజెక్టు అధారిటీ (పిపిఎ)ఈపెరిగిన ఖర్చుకు ఒప్పుకున్నట్టు అది తమ విజయమైనట్టు వైసీపీనేతలు చెప్పుకున్నారు. అందులో భాగంగా కొన్ని వందలకోట్లు విడుదల చేస్తే అదో ఘనతగా చూపించుకున్నారు. అసలు సమస్యగా వున్న పునరావాసం దాటేస్తున్నారు. ప్రచారార్భాటంతో పర్యటనలకు వెళ్లి ప్రతిపక్షంపై సవాళ్లు విసిరే మంత్రులు అనిల్‌కుమార్‌ వంటివారు దీనిపై మాట్లాడకుండా అధికారులకు ఆదేశాలు ఇచ్చేసి అంతా అయిపోయినట్టే అభినయిస్తారు.
9 గ్రామాలకే దిక్కులేదు,అన్నీఖాళీ అయితే?
ఈప్రాజెక్టు నిర్మాణం, నీటినిల్వ ప్రవా హం కారణంగా 275 గ్రామాలలో 1,07లక్షల కుటుంబాలు నిర్వాసితమవుతాయి. లక్షాముప్పై వేల ఎకరాలు మునిగిపోతాయి. పశ్చిమగోదావరి జిల్లాలో కుకునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలాలు, తూర్పుగోదావరిజిల్లాలో పోలవరం, దేవీపట్నం,అంగలూరు, వరరామచంద్రాపురం (విఆర్‌పురం) చింతూరు, ఏటపాక, కూనవరం మండలాలు మునిగిపోతాయి.ఇందులో దేవీ పట్నం పోలవరం మినహా మిగిలిన మండలాలన్ని తెలం గాణ నుంచి బదలాయించబడినవే.కఫర్‌డ్యాం ఎత్తు పెంచాలనీ,వీల్కెతే దానిద్వారా ముందే నీళ్లు ఇవ్వా లని ఉత్సాహపడిన సర్కార్లు ఫలితంగా సంభ వించే ముంపుబాధితుల గోడు మాత్రం పట్టించు కోలేదు. అరకొర పునరావాసం కల్పించింది మాత్రం కేవలం 9 గ్రామాలలో 3300 కుటుంబా లకు మాత్రమే. ఇది మూడు శాతం కూడా కాదు. విద్యుత్‌ పనుల కోసం మరో 60 గ్రామాలవారిని బలవంతాన అక్కడినుంచి తొలగించినంత పని చేశారు. ఇక 41.15 కాంటూరు పరిధిలోకి వచ్చే 90 గ్రామాలు ఖాళీ చేయించాలని ప్రభుత్వం వత్తిడి చేస్తున్నది. ఇప్పుడు నిల్వ చేసిన నీటిని వదలడానికి స్పిల్‌వే గేట్లు ఉపయోగిస్తున్నారు. రేపు ఆగేట్లు మూ సేస్తే మొత్తంవూళ్లూ మునిగిపోతాయి. 2013 భూసేకరణ చట్టంప్రకారం భూమికి భూమిఉపాధి కల్పించాలి. కాని గిరిజనుల పోడు భూము లకు పట్టాలు లేవనే సాకుతో పరిహారమే ఎగవేశారు, ఇదిగాక 39సదుపాయాలతో ప్రత్యామ్నాయ గృహనిర్మాణం ప్రభుత్వాల నిర్మాణ సంస్థలబాధ్యత. చంద్రబాబు ఎకరాకు 1.25 లక్షల చొప్పున ఇచ్చిన ప్యాకేజీ సరిపోదని తామువస్తే 10లక్షలు ఇచ్చి పంపిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు, ఇప్పటికీ సమీక్షలలో చెబుతుంటారుగాని ఇచ్చింది లేదు.
నిబంధనల ఉల్లంఘన, అర్హులకు అన్యాయం
ఇక అర్హుల విషయమే చూస్తే గతంలో అనర్హులను చేర్చడం వల్ల దాన్నిసాకుగా చూపి బాధితులకు కూడా అన్యాయం చేశారు పాలకులు. వాస్తవానికి ఆ సంఖ్య పెరుగుతున్నది. 2017ను కొలబద్దగా తీసుకుని 18ఏళ్లు పైబడినవారు 1.25 లక్షల మంది వున్నారని లెక్కవేశారు. 2021 నాటికి పూర్తికాని పనులతో ఆ సంఖ్య 5లక్షలు దాటింది. నిర్వాసితులకోసం కట్టిన కాలనీలు లోపభూయిష్టం గా ఎలాంటి వసతులు లేకుండా కాస్తవానకే కారుతూ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి, ఏకంగా 30లక్షల ఇళ్లు కట్టి పండుగ చేస్తానంటున్న సర్కారు ముంపు ప్రాంతాల్లో ఎందుకుకట్టడం లేదు? గిరిజనులకు షెడ్యూలు ప్రాంతాలలోనే పునరావాసం కల్పించాలి గాని నాన్‌షెడ్యూల్‌ ప్రాంతాలకు తరలించి తంతు పూర్తి చేయడం మరో రాజ్యాంగ విరుద్ధ చర్య. ఇక్కడ దాదాపు 60 శాతం గిరిజనులే. ఇవన్నీగాక మానవ హక్కుల సమస్యలు కూడా వున్నాయి. ఉదాహరణకు ముంపు వచ్చేలోగా సరుకులు తీసుకు పోవడానికి టేకూరు వాడపల్లి తూటూరు వంటి గ్రామాల నుంచి ఏలూరు వచ్చిన ప్రజలను తిరిగి వారి గ్రామాలకు పోనీకుండా పోలీసులు అడ్డు కోవడం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఇటీవల అఖిల పక్ష నాయకులు ఆ గ్రామాలలో పరిశీలనకు వెళ్లినప్పుడు నిర్వాసితులు చెప్పిన వాస్తవాలు హృద యవిదారకంగావున్నాయి. వాటిపై విజయ వాడలో దీక్షలకు పిలుపునిస్తే ఎక్కడికక్కడ నిర్బంధించి రాకుండాచేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పుండు మీద కారం రాసింది. కేంద్రంజాతీయ ప్రా జెక్టు అంటూనే పోలవరం నిర్మాణ నిధులు పునరా వాస వ్యయం విడుదల చేయకపోవడం బాధ్యతా రాహి త్యమే. వ్యవసాయం నిలిచిపోయిపంటలూ పనులు లేక ఆప్రజలు గోడుపెడుమంటున్న నేపథ్యం మరింత దారుణంగా వుంది. కేంద్రంతో పోరాడి 33వేలకోట్ల నిధులు తక్షణం రాబట్టి కనీసవసతు లతో కాలనీలు నిర్మించి వారిని తరలించకపోతే తీవ్ర అసంతృప్తికి గురి ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. ప్రత్యేకహోదాకు ఎగనామం. లోటు భర్తీకి మంగళం..రాజధానికి రిక్తహస్తం.. విశాఖ ఉక్కు బేరం..వంటి కేంద్ర చర్యలు రాష్ట్ర ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నాయి, ఏ ఒక్క అంశంలోనూ ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలనే ధోరణి మోడీ సర్కారులో లేకున్నా గట్టిగా అడిగే చేవ జగన్‌ సర్కారుకూ వుండటం లేదు. ప్రజల బాధలు విని సత్వర సహాయం పునరావాసం కల్పించడం కేంద్ర రాష్ట్రాల బాధ్యత.లేకుంటే వారి నిరసన అని వార్యం.
-జిఎన్‌వి సతీష్‌

1 2