పోల‌వ‌రంపై పాత‌పాటే!

పోలవరం ప్రాజెక్టుపై ఎప్పటి కప్పుడు పరిశీలిస్తామని చెబుతున్న కేంద్రం తాజాగా దక్షి ణాది రాష్ట్రాల మండలి సదస్సు సందర్భంగా కూడా ఆపాత పాటనే వినిపించింది. 2017లో చెప్పినట్లుగానే 100 శాతం నిధులను భరిస్తామని మాత్రమే చెప్పిన కేంద్రం సహాయ పునరావాసం, తాజా అంచనాలపై మాత్రం స్పష్టత ఇవ్వడంలేదు. ఎస్‌జెడ్‌సి సదస్సు సందర్భంగా నవంబర్‌ 8,10వ తేదీల్లో రాష్ట్రానికి రాసిన రెండు లేఖల్లోనూ స్పష్ట మైన వివరాలు చెప్పకపోవడం గమనార్హం. 8వ తేదీన రాసిన లేఖలో 2014కు తరువాత జాతీయ హోదా పొంది,అనంతరం జరిగిన పనుల్లో మొత్తం100 శాతం తామే భరిస్తామని చెప్పిన విషయాన్నికూడా ఆ లేఖలో పునరుద్ఘాటించింది. అయితే, ఇరిగేషన్‌ కాంపోనెంట్‌ విలువను మాత్రమే భరించనున్నట్లు పేర్కొంది. అరటేప్రాజెక్టుకు సంబం ధిరచి సహాయ పునరావాసం పనులకు నిధులివ్వ డానికి సానుకూలంగా లేనట్టేనని రాష్ట్ర అధికా రులు ఆరదోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే తాజా గా పెరిగిన పనుల అంచనా, కొత్త డిజైన్లపై మాత్రం స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. పైగా 2017-18 ధరల మేరకు కొత్త అంచనా రూ.47,725 కోట్లుకు సంబంధించిన ప్రతిపాదనలు ‘ఇన్‌ ప్రోగ్రెస్‌’గా ఉన్నట్లు లేఖలో పేర్కొన్న కేంద్రం, దాని వాస్తవిక పరిస్థితి ఏమిటన్నది స్పష్టం చేయక పోవడం గమనార్హం. ఇక10వ తేదీన రాసిన మరో లేఖలో కూడా ఆర్ధిక పరమైన అంశాలపై పాత పాటే పాడింది. జాతీయ హౌదా ప్రకటిరచిన తరువాత ఇప్పటివరకు 13,226 కోట్ల రూపాయలు ఖర్చు జరిగిరదని, అరదులో ఇప్పటికే రూ.11, 600 కోట్లు రీయింబర్స్‌ చేసామని వివరించింది. మరో రూ.302 కోట్లు బిల్లులు ఆర్ధిక శాఖ వద్ద ఉన్నాయని పేర్కొంది. మిగిలిన రూ.605 కోట్ల విలువైన బిల్లులు పోలవరం ప్రాజెక్టు అథారిటీ వద్దనే పరిశీలనలో ఉన్నట్లు పేర్కొంది. 2013-14ధరల మేరకు మారిన అంచనా 20,398 కోట్లు గా చెప్పిన కేంద్రం 2014కు ముందు జరిగిన వ్యయం తీసివేయగా మిగిలింది రూ.15,667 కోట్లుగా గతంలోనే అరగీకరించింది. ఈ నిధులను మాత్రమే ఇస్తామని చెప్పడంతో కొత్త అంచనాలపై ఆశలు గల్లంతవుతున్నట్టే కనిపిస్తోంది. ఇప్పుడు ఈ లేఖలు రాష్ట్ర ఆర్ధికశాఖ, నీటిపారుదల శాఖల్లో చర్చనీయాంశాలుగా ఉన్నాయి. స్పష్టమైన హామీలు రాకపోవడంవల్ల మరోసారి హస్తిన యాత్ర చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.పోలవరానికి తిలోదకాలే!!
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం రోజుకో నాటకమాడుతోంది.తుది అంచనా వ్యయాన్ని ఆమో దించకుండా దాగుడుమూత లాడుతోంది. దీని కంతటికీ ప్రస్తుత సీఎంజగన్మోహన్‌రెడ్డి నిర్వా కమే కారణం.చేసిన పాపం ఆయన్ను ఇప్పుడు కట్టి కడుపు తోంది. ప్రాజెక్టు తుది అంచనా వ్యయాన్ని రూ.55, 548.87 కోట్లుగా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణ యించినప్పుడు..వేలకోట్లు దోచుకోవడానికే అంచ నాలు పెంచారని నాటి విపక్ష నేతగా ఉన్న జగన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రానికి ఫిర్యాదులు చేశారు.ఎన్‌జీటీ, సుప్రీంకోర్టుల్లో కేసులు వేయిం చారు.నిజం తెలిసీ పోలవరం చంద్రబాబుకు ఏటీ ఎంలా మారిందని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచా రంలో ఆరోపించారు.ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్‌.. నాడు చంద్రబాబు రూపొందించిన తుది అంచనా వ్యయాన్నే ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.కానీ కేంద్ర జలశక్తి శాఖ నియమించిన కమిటీ రూ.47,725.25 కోట్లకు దానిని కుదించింది. తర్వాత ఈ వ్యవహారం కేంద్ర ఆర్థిక శాఖను చేరింది.ప్రాజెక్టులో సాగునీటి కాంపోనెంట్‌కే నిధులస్తామని మెలిక పెట్టింది. సాగునీటి అవసరాలకు సంబంధించిన వ్యయాన్ని రాష్ట్రమే భరించాలని అంది.ఆ తర్వాత 2017లో కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన రూ.20,398 కోట్ల తుది అంచనాకే కట్టుబడి ఉంటామని పేర్కొంది. దానిప్రకారమే రాష్ట్రప్రభుత్వాన్ని ఒప్పించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి సూచిం చింది. పీపీఏ అత్యవసర భేటీలో రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. 2013-14 అంచనా ధరలకు ప్రాజెక్టు ఎలా పూర్తవుతుందో చెప్పాలని నిలదీశారు.అది సాధ్యం కాదని కేంద్ర జలసంఘం అధికారులు కూడా స్పష్టం చేశారు. దీనిపై ఆర్థిక శాఖ నిర్ణయం కోసం రాష్ట్రప్రభుత్వం ఎదురుచూస్తోంది.కానీ కేంద్రం నిధులివ్వదని మాత్రం అర్థమైంది. అందుకే ప్రాజెక్టు ఎత్తును కుదించాలని దాదాపు నిర్ణయించినట్లు తెలిసింది.
సాధికారికంగా బలి..
ఆంధ్రుల జల-జీవ నాడిగా తెరపైకి వచ్చిన పోలవరం ప్రాజెక్టును ‘బలి’ చేసే ప్రక్రియ సాధికారికంగానే మొదలైంది. కేంద్రం నుంచి పోరాడి నిధులు సాధించడం పక్కనపెట్టి..నీటి నిల్వ ఎత్తును తగ్గించడంపైనే జగన్‌ సర్కారు దృష్టి పెట్టింది. ప్రాజెక్టులో నీటిని 45.72 మీటర్ల ఎత్తు వరకు నిల్వ చేయాలన్నది తొలి ప్రతిపాదన. దీని ప్రకారం పోలవరం నిర్మాణ వ్యయం రూ.55వేల కోట్లు! కానీ,2013-14 అంచనా వ్యయానికే కట్టు బడి ఉంటామని..20వేల కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్ర ఆర్థికశాఖ తేల్చి చెప్పింది.దీంతో.. పరిహారం ఖర్చును తగ్గించుకునేలా నీటి నిల్వను 41.15 మీటర్ల ఎత్తుకే పరిమితం చేసేందుకు రాష్ట్రప్రభుత్వం సమాయత్తమైంది. అదే జరిగితే..అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బ తింటాయి.సాగునీటి రంగంపై ఆమధ్య సమీక్ష జరిపిన జగన్‌..పోలవరంలో నీటిని41.15 మీటర్ల ఎత్తువద్ద నిల్వచేస్తే భూసేకరణకు ఎంత వ్యయం అవుతుందో పూర్తిస్థాయి సమాచారం తీసుకురా వాలని అధికారులను ఆదేశించారు. నిర్వాసితులు, సహాయ పునరావాసం వంటి అంశాలనూ తెలియ జేయాలన్నారు. వెరసి..ప్రాజెక్టు ఎత్తు కుదింపుపై స్పష్టమైన సంకేతాలు పంపారు. 41.15 మీటర్ల ఎత్తులో నీటి నిల్వ చేపట్టాలంటే భూసేకరణ, సహాయ పునరావాసానికి రూ.3500కోట్ల అవసర మవుతాయని సహాయ పునరావాస కమిషనర్‌ చెప్పారు.దీనికోసం నెలకు రూ.300 కోట్లు చొప్పున విడుదల చేయాలని సీఎంవో కార్యదర్శి ధనుంజ యరెడ్డిని జగన్‌ ఆదేశించారు.ఇక నిర్మాణ పనులకు రూ.1000 కోట్లు కావాలని ప్రాజెక్టు సీఈ సుధాకర బాబు కోరారు.దీంతో మొత్తంగా రూ.5000 కోట్లు అవసరమవుతాయని,ఈ మొత్తాన్ని ప్రతినెలా విడ తల వారీగా మంజూరు చేస్తామని జగన్‌ తెలి పారు. పోలవరంలో నీటి నిల్వను 41.15 మీటర్లకు పరిమితం చేస్తే భూసేకరణ,పునరావాసానికి రూ.3 500 కోట్లు అవసరమవుతాయి. 69,688.38 ఎకరాల భూసేకరణ అవసరం.ఇందులో 68, 087.88 ఎకరాలు ఇప్పటికే సేకరించి నందున.. మరో1600.50 ఎకరాలు సేకరిస్తే సరిపోతుంది. భూసేకరణతో20,870మంది నిర్వాసితులవు తారు. వారిలో ఇప్పటికే 3110 మందికి పరిహారం చెల్లించినందున..మరో 17,760 మందికి నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. విశాఖ పారిశ్రా మిక, తాగునీటి అవసరాల కోసం పోలవరం నుంచి పైపులైన్‌ వేసే విషయంపై ప్రతిపాదనలు తేవాలని సీఎం ఆదేశించారు.నిజానికి విశాఖ వరకు ప్రధాన కాలువ ఎప్పుడో పూర్తయింది.ఇప్పుడు కొత్తగా పైపులైన్‌ అవసరమేంటి? అంటే ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని నిర్ణయించినట్లే కదా! 41 మీటర్లకే పరిమితమైతే అదిబహుళార్థ సాధక ప్రాజెక్టు కాదు..సాధారణ బ్యారేజీగా మిగిలిపోతుంది.
కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయమే కీలకం !
పోలవరం అంచనాలపై ఢల్లీిలో కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావతతో రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పి.అనిల్‌ కుమార్‌, జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్య దర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి తదితరులు భేటీ అయ్యారు.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ఈ భేటీలో పాల్గొం టారని సీఎంవో లీకులిచ్చింది.అయితే అలాంటి కార్యక్రమమే ఖరారు కాలేదు. కేవలం షెకావతను కలిశారు. కేంద్ర జల సంఘం సిఫారసు చేసిన అంచనా వ్యయం రూ.47725.74 కోట్లకు ఆమోదం తెలపాలని ఆయన్ను కోరారు.అయితే కేంద్ర ఆర్థిక శాఖే నిర్ణయం తీసుకోవాలని ఆయన తేల్చేశారు.ఈ సమావేశం ఎలాంటి ఫలితాలూ ఇవ్వలేదు. ఈ భేటీ తర్వాత మంత్రులు బుగ్గన, అనిల్‌ విలేకరులతో మాట్లాడారు.గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టుపై అవలంబించిన విధానాలపై మోదీ సర్కారుకు దురభిప్రాయం ఉందని..జగన్‌ పగ్గాలు చేపట్టాక కేంద్ర వైఖరిలో మార్పు వచ్చిందని చెప్పారు. ప్రాజెక్టుకు నిధుల విషయంలో ఉదారత చూపుతోందని అన్నారు.అదే నిజమైతే 20.398 కోట్లే ఇస్తానని ఎలా చెబుతుంది? చంద్రబాబు సీఎంగా ఉండగా..ఇంత మొత్తమే ఇస్తామని ఎప్పుడూ చెప్పలేదు. ఆయన రూపొందించిన 55 వేల కోట్ల తుది అంచనాలకు సాంకేతిక సలహా మండలి (టీఏసీ) ఆమోదముద్ర వేసిందని రాజకీయ పరిశీలకులు గుర్తుచేస్తున్నారు.పైగా వైసీపీ నంబర్‌ టూ విజయసాయిరెడ్డి ప్రాజెక్టులో అవినీతిపై రాజ్యసభలో ప్రశ్నించినప్పుడు ఆ అవకాశమే లేదని ఇదే షెకావత పార్లమెంటు సాక్షిగా తేల్చిచెప్పారు.పైగా టీడీపీ వ్యయం చేసిన నిధులు రూ.8,500 కోట్లను కేంద్రం రీయింబర్స్‌మెంట్‌ చేసిందని గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యయం చేసిన మొత్తం నుంచే జగన్‌ సర్కారుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.1,850 కోట్లు..తాజాగా 2,234.288 కోట్లు విడుదల చేసింది.జగన్‌ ప్రభుత్వం వ్యయం చేసిన మొత్తానికి సంబంధించి ఇప్పటి వరకూ ఒక్క బిల్లు కూడా రీయింబర్స్‌ కాలేదు.ఈ బిల్లులు ఇంకా పీపీఏ వద్దే ఉన్నాయి.ఇంకా కేంద్రానికి పంపనేలేదు.ఎందుకంటే చేసిన పనులకు, పెట్టిన బిల్లులకు పొంతన లేదు. 55 వేల కోట్ల అంచనాలను ఆమోదించిన టీఏసీ..ఇంజనీరింగ్‌ అధికారుల బృందమే తప్ప కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కాదని ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ అడ్డగోలుగా వాదించింది. ఇప్పుడు అదే టీఏసీ నిర్ధారణ మేరకే రూ.55,548.87 కోట్ల అంచనా వ్యయానికి అంగీకరించాలని..కనీసం సవరించిన అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లకైనా ఆమోదం తెలపాలంటూ..ప్రధాని మోదీని, అమితషా, నిర్మలా సీతారామన్‌, షెకావతలను ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దాకా అభ్యర్థిస్తున్నారు.ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే..ఒక్క భూసేకరణకే రూ.28 వేల కోట్లు వ్యయమవుతాయని ఇప్పుడు చెబుతున్నారు.చంద్రబాబు చెప్పినప్పుడు అవినీతి ఆరోపణలు గుప్పించారు.అయితే..గతంలో వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్నందునే..ఎన్నికల ప్రచారం మోదీ నోట పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ‘ఏటీఎం’గా మారిందన్న ఆరోపణలు వచ్చాయని చెబుతున్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచే సత్తా లేక ఇప్పటికే ప్రత్యేక హోదాను అటకెక్కించిన జగన్‌..ఇప్పుడు పోలవరానికి మూతబండ వేసే దిశగా అడుగులు వేస్తున్నారు.రాష్ట్రానికి తీరని అన్యాయం చేయబోతున్నారు.రాష్ట్ర ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తే ఇలాంటి అనర్థాలే సంభవిస్తాయని జగన్‌ గుర్తెరగాలి.కేంద్రంపై ఒత్తిడి పెంచే మార్గాలను అన్వేషించాలి.అంతేతప్ప తన మంత్రులతో చంద్రబాబును నాలుగు బూతులు తిట్టించి పబ్బం గడుపుకోవాలంటే ప్రజలు క్షమించరన్న సంగతి తెలుసుకోవాలని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
పోలవరంపై కేంద్రం ఉపేక్ష, ముంపు గ్రామాలకు శిక్ష..
ఏపీ విభజన చట్టంలో జాతీయ ప్రాజె క్టుగా ఘనంగా ప్రకటించబడిన పోలవరం కేంద్రం వివక్షతో సమస్యాత్మకంగా నడుస్తుంటే జరిగిన మేరకు పనులు కూడా ప్రజల పాలిట ప్రాణాంతక మవుతున్నాయి. పెరిగిన వ్యయాన్ని లెక్కలోకి తీసు కోకపోవడం ఒకట్కెతే ప్రాథమిక సూత్రమైన సహాయ పునరావాస కార్యక్రమాలకు బాధ్యత లేదని దులి పేసుకోవడం కేంద్రం చేస్తున్న దారుణం. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పునరావాస పనులు సరిగ్గా జరగలేదని తాము అధికారంలోకి రాగానే పటిష్టంగా ఆదుకుంటామని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ పదేపదే ప్రకటించారు. అప్పట్లో ఎన్నికల ప్రచారంలో స్వయంగా ప్రధాని మోడీనే పోలవరం నిర్మాణం అక్రమాలకు నిలయంగా మారిందని ఆరోపించారు. తర్వాత ఆయన మళ్లీ ప్రధాని అయ్యారు, జగన్‌ ముఖ్యమంత్రి అయ్యారు గాని పోలవరం వెతలు మాత్రం తీరలేదు.. సరికదా తీవ్రమానవ సంక్షోభంగా మారుతు న్నాయి. కఫర్‌డాం ఘనంగా కట్టేసిన కారణంగా వర్షాలు పెద్దగా కురవకపోయినా సరే నీళ్లు ముం చేస్తున్నాయి.
ఫలితం లేని వినతులు
నిర్మాణ వ్యయం మాత్రమే అది కూడా 2014 నాటిలెక్కల ప్రకారం 22 వేల కోట్లు అది కూడా ముందు రాష్ట్రం ఖర్చు చేసిన తర్వాత మాత్రమే తాము విడుదల చేస్తామని కేంద్రం చాలా సార్లు ప్రకటించింది. ఏ ప్రాజెక్టు కట్టినా ముందు పునరావస కల్పన జీవనోపాధి పునరుద్ధరణ జరిగాకే జరగాలని సుప్రీంకోర్టుతో సహా న్యాయస్థానాలు అనేక సార్లు చెప్పి వున్నాయి. ఈ అంశంపై కేంద్రంలోని మోడీ సర్కారు కావాలనే వంకరటింకరవాదనలతోచేతులు దులిపేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నిష్క్రియా ప్రియత్వం వహిస్తున్నది. అడపాదడ వినతులతో సరిపెడుతున్నది. గత నెలలోనే ముఖ్యమంత్రి జగన్‌ స్వయంగా ఢల్లీికి వెళ్లి వినతి పత్రాలు ఇచ్చి వచ్చారు. కేంద్రం నుంచి ఈ విషయంలో రావలసిన సహాయం రావడం లేదనేది వాస్తవం. ప్రజలకు చెప్పి ప్రతిపక్షాలను కలుపుకొని వొత్తిడి పెట్టె బదులు టిడిపి, వైసీపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంలో మునిగి తేలుతున్నాయి. 55 వేల కోట్లకు పెరిగిన ప్రాజెక్టు అంచనా వ్యయం పెంపును తాము ఆమోదింప చేసుకుంటే ఈప్రభుత్వ హయాంలో వెనక్కు పోయిం దని టిడిపి చాలా కాలం విమర్శించింది. అయితే తర్వాత జల్‌శక్తి శాఖ పోలవరం ప్రాజెక్టు అధారిటీ (పిపిఎ)ఈపెరిగిన ఖర్చుకు ఒప్పుకున్నట్టు అది తమ విజయమైనట్టు వైసీపీనేతలు చెప్పుకున్నారు. అందులో భాగంగా కొన్ని వందలకోట్లు విడుదల చేస్తే అదో ఘనతగా చూపించుకున్నారు. అసలు సమస్యగా వున్న పునరావాసం దాటేస్తున్నారు. ప్రచారార్భాటంతో పర్యటనలకు వెళ్లి ప్రతిపక్షంపై సవాళ్లు విసిరే మంత్రులు అనిల్‌కుమార్‌ వంటివారు దీనిపై మాట్లాడకుండా అధికారులకు ఆదేశాలు ఇచ్చేసి అంతా అయిపోయినట్టే అభినయిస్తారు.
9 గ్రామాలకే దిక్కులేదు,అన్నీఖాళీ అయితే?
ఈప్రాజెక్టు నిర్మాణం, నీటినిల్వ ప్రవా హం కారణంగా 275 గ్రామాలలో 1,07లక్షల కుటుంబాలు నిర్వాసితమవుతాయి. లక్షాముప్పై వేల ఎకరాలు మునిగిపోతాయి. పశ్చిమగోదావరి జిల్లాలో కుకునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలాలు, తూర్పుగోదావరిజిల్లాలో పోలవరం, దేవీపట్నం,అంగలూరు, వరరామచంద్రాపురం (విఆర్‌పురం) చింతూరు, ఏటపాక, కూనవరం మండలాలు మునిగిపోతాయి.ఇందులో దేవీ పట్నం పోలవరం మినహా మిగిలిన మండలాలన్ని తెలం గాణ నుంచి బదలాయించబడినవే.కఫర్‌డ్యాం ఎత్తు పెంచాలనీ,వీల్కెతే దానిద్వారా ముందే నీళ్లు ఇవ్వా లని ఉత్సాహపడిన సర్కార్లు ఫలితంగా సంభ వించే ముంపుబాధితుల గోడు మాత్రం పట్టించు కోలేదు. అరకొర పునరావాసం కల్పించింది మాత్రం కేవలం 9 గ్రామాలలో 3300 కుటుంబా లకు మాత్రమే. ఇది మూడు శాతం కూడా కాదు. విద్యుత్‌ పనుల కోసం మరో 60 గ్రామాలవారిని బలవంతాన అక్కడినుంచి తొలగించినంత పని చేశారు. ఇక 41.15 కాంటూరు పరిధిలోకి వచ్చే 90 గ్రామాలు ఖాళీ చేయించాలని ప్రభుత్వం వత్తిడి చేస్తున్నది. ఇప్పుడు నిల్వ చేసిన నీటిని వదలడానికి స్పిల్‌వే గేట్లు ఉపయోగిస్తున్నారు. రేపు ఆగేట్లు మూ సేస్తే మొత్తంవూళ్లూ మునిగిపోతాయి. 2013 భూసేకరణ చట్టంప్రకారం భూమికి భూమిఉపాధి కల్పించాలి. కాని గిరిజనుల పోడు భూము లకు పట్టాలు లేవనే సాకుతో పరిహారమే ఎగవేశారు, ఇదిగాక 39సదుపాయాలతో ప్రత్యామ్నాయ గృహనిర్మాణం ప్రభుత్వాల నిర్మాణ సంస్థలబాధ్యత. చంద్రబాబు ఎకరాకు 1.25 లక్షల చొప్పున ఇచ్చిన ప్యాకేజీ సరిపోదని తామువస్తే 10లక్షలు ఇచ్చి పంపిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు, ఇప్పటికీ సమీక్షలలో చెబుతుంటారుగాని ఇచ్చింది లేదు.
నిబంధనల ఉల్లంఘన, అర్హులకు అన్యాయం
ఇక అర్హుల విషయమే చూస్తే గతంలో అనర్హులను చేర్చడం వల్ల దాన్నిసాకుగా చూపి బాధితులకు కూడా అన్యాయం చేశారు పాలకులు. వాస్తవానికి ఆ సంఖ్య పెరుగుతున్నది. 2017ను కొలబద్దగా తీసుకుని 18ఏళ్లు పైబడినవారు 1.25 లక్షల మంది వున్నారని లెక్కవేశారు. 2021 నాటికి పూర్తికాని పనులతో ఆ సంఖ్య 5లక్షలు దాటింది. నిర్వాసితులకోసం కట్టిన కాలనీలు లోపభూయిష్టం గా ఎలాంటి వసతులు లేకుండా కాస్తవానకే కారుతూ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి, ఏకంగా 30లక్షల ఇళ్లు కట్టి పండుగ చేస్తానంటున్న సర్కారు ముంపు ప్రాంతాల్లో ఎందుకుకట్టడం లేదు? గిరిజనులకు షెడ్యూలు ప్రాంతాలలోనే పునరావాసం కల్పించాలి గాని నాన్‌షెడ్యూల్‌ ప్రాంతాలకు తరలించి తంతు పూర్తి చేయడం మరో రాజ్యాంగ విరుద్ధ చర్య. ఇక్కడ దాదాపు 60 శాతం గిరిజనులే. ఇవన్నీగాక మానవ హక్కుల సమస్యలు కూడా వున్నాయి. ఉదాహరణకు ముంపు వచ్చేలోగా సరుకులు తీసుకు పోవడానికి టేకూరు వాడపల్లి తూటూరు వంటి గ్రామాల నుంచి ఏలూరు వచ్చిన ప్రజలను తిరిగి వారి గ్రామాలకు పోనీకుండా పోలీసులు అడ్డు కోవడం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఇటీవల అఖిల పక్ష నాయకులు ఆ గ్రామాలలో పరిశీలనకు వెళ్లినప్పుడు నిర్వాసితులు చెప్పిన వాస్తవాలు హృద యవిదారకంగావున్నాయి. వాటిపై విజయ వాడలో దీక్షలకు పిలుపునిస్తే ఎక్కడికక్కడ నిర్బంధించి రాకుండాచేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పుండు మీద కారం రాసింది. కేంద్రంజాతీయ ప్రా జెక్టు అంటూనే పోలవరం నిర్మాణ నిధులు పునరా వాస వ్యయం విడుదల చేయకపోవడం బాధ్యతా రాహి త్యమే. వ్యవసాయం నిలిచిపోయిపంటలూ పనులు లేక ఆప్రజలు గోడుపెడుమంటున్న నేపథ్యం మరింత దారుణంగా వుంది. కేంద్రంతో పోరాడి 33వేలకోట్ల నిధులు తక్షణం రాబట్టి కనీసవసతు లతో కాలనీలు నిర్మించి వారిని తరలించకపోతే తీవ్ర అసంతృప్తికి గురి ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. ప్రత్యేకహోదాకు ఎగనామం. లోటు భర్తీకి మంగళం..రాజధానికి రిక్తహస్తం.. విశాఖ ఉక్కు బేరం..వంటి కేంద్ర చర్యలు రాష్ట్ర ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నాయి, ఏ ఒక్క అంశంలోనూ ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలనే ధోరణి మోడీ సర్కారులో లేకున్నా గట్టిగా అడిగే చేవ జగన్‌ సర్కారుకూ వుండటం లేదు. ప్రజల బాధలు విని సత్వర సహాయం పునరావాసం కల్పించడం కేంద్ర రాష్ట్రాల బాధ్యత.లేకుంటే వారి నిరసన అని వార్యం.
-జిఎన్‌వి సతీష్‌