వనవాసి నవల

1930 దశకంలో, బిభూతి భూషణ్ బందోపాధ్యాయ తన స్వీయానుభవాల ఆధారంగా రాసిన ‘ అరణ్యక్’ పర్యావరణం పై వచ్చిన అత్యుత్తమమైన నవలల్లో ఒకటి. దీనిని తెలుగులోకి ‘వనవాసి’ అనే పేరుతో సూరంపూడి సీతారాం గారు అనువదించారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది హర్షణీయం , హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఈ నవల ను శబ్ద-రూపకంగా మీకందిస్తున్నాము. వనవాసి నవల మొదటి ఐదు భాగాలు ఇప్పుడు పాడ్కాస్ట్ చెయ్యడం జరుగుతోంది.ఈ నవల మొత్తం వంద భాగాలుగా హర్షణీయంలో పాడ్కాస్ట్ చెయ్యబడుతుంది రాబోయే మూడు నెలలలో.తెలుగు రాష్ట్రాలలోనే కాక దేశవ్యాప్తంగా వున్న పర్యావరణం సమస్యలు , అటవీ ప్రాంత ప్రజల సమస్యలు, వాటిపై పని చేస్తున్న పర్యావరణ కార్యకర్తల, ప్రముఖులతో హర్షణీయం జరిపిన సంభాషణలు కూడా ఈ రూపకంలో భాగంగా ప్రసారం చేయబడతాయి. https://player.captivate.fm/collection/ae7d492e-4bb1-47bb-b1a2-0642b7ed4461

మా గుండెల్లో చెరగని మీ సింహసనం

ఆయన ఆదివాసీ హృదయాల్లో చెరగని సంతకం. పుట్టింది ఉన్నత కుటుంబంలోనైనా..ఆయన జీవితం ఆదివాసులకే అంకితం. వైవిధ్యం ఆయన జీవన శైలి.ఉద్యమం ఆయన ఊపిరి.ఎన్నో సమస్యలపై పోరాడారు..విజయం సాధించారు. గిరిజనులకు ‘నేనున్నా’ అంటూ భరోసా ఇచ్చారు. వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఆయనే రెబ్బాప్రగడ రవి. రాజ్యాంగ బద్దంగా షెడ్యూల్‌ ఏరియాలో ఆయన సేవలకుగాను చత్తీష్‌ఘర్‌ రాష్ట్ర ప్రభుత్వం పీసా చట్టం వర్కింగ్‌ గ్రూప్‌ చైర్‌పర్సన్‌గా ఎంపిక చేసింది. ఈనేపథ్యంలో గిరిపుత్రులు..ఆదివాసుల ముద్దబిడ్డలు.. ఆదివాసీ మిత్ర వెల్ఫేర్‌ సొసైటీ అక్టోబరు 4న రెబ్బాప్రగడ రవిగారిని ఘనంగా సత్కరించింది. ఈ పురస్కార సభలో పరిశోధకుడు సురేష్‌ కుమార్‌ తన స్వీయ రచన నుంచి అందించిన అభినందన పత్రంలోని అంశాలు మన థింసా పాఠకుల కోసం యథావిధిగా ప్రచరిస్తున్నందుకు సంతోషిస్తున్నాం -థింసా సెంట్రల్‌ డెస్క్‌.

Read more

పోడు రైతుల పోరు

తరతరాలుగా పొడు భూములనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న జిల్లా పోడు రైతుల పరిస్థితి అగమ్య ఘోచరంగా మారుతోంది. వానాకాల సీజన్‌ మొదలైనప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు అటవీ శాఖాధికారుల నుంచి అడుగ డుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఏళ్ల తరబడి పొడు భూములపై హక్కులు కల్పిం చాలని అధికారుల చుట్టు కాళ్లరిగేలా తిరుగు తున్నా ఫలితం మాత్రం దక్కడం లేదని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనేతర రైతులు కూడాపోడు భూములను సాగు చేసుకోవడం పెద్ద సమస్యగా మారుతోంది. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 డిసెంబరు 31లోపు సాగు చేసుకున్న అటవీ భూములకు హక్కు పత్రాలు అందించాలని కేంద్ర అటవీ హక్కుల చట్టం పేర్కొంటుంది. అలాగే 70 ఏళ్లకు పైగా పోడు భూములను సాగు చేసు కుంటున్న గిరిజనేతర రైతులకు కూడా భూమిపై హక్కు కల్పించాలని చట్టం స్పష్టం చేస్తుంది. అసలే నిరక్షరాస్యులైన పోడు రైతులకు చట్టాలపై ఏ మాత్రం అవగాహన లేక పోవడంతో భూమిపై హక్కు పొందేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. జిల్లాలో 1లక్ష ఎకరాల వరకు పొడుభూములు ఉన్నట్లు అటవీ శాఖాధి కారుల అంచనా వేస్తున్నారు. అనాధికారికంగా మాత్రం పొడు భూముల విస్తీర్ణం మరింత అధికంగానే ఉంటుందని గిరిజన సంఘాల నేతలు చెబుతున్నారు. గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 56వేల 358మంది పోడు రైతులు హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో గ్రామ సభల ద్వారా 37వేల 372 దరఖాస్తులకు ఆమోదం లభించింది. ఇప్పటి వరకు లక్ష 35వేల 99ఎకరాలకు గాను హక్కు పత్రాలను అందజేశారు. మరో 18వేల 886 దరఖాస్తులను వివిధ రకాల కారణాలతో తిరస్కరించారు. అయినా రైతులు ఆ భూము లను సాగు చేసుకోవడంతో అటవీ శాఖాధి కారులు దాడులు చేస్తూ లాక్కునే ప్రయత్నం చేయడంతో వివాదాస్పదంగా మారుతోంది. ఇలాంటి భూముల్లో హరిత హారం మొక్కలు నాటేందుకు అటవీ శాఖాధికారులు కసరత్తు చేస్తున్నారు. అటవీ హద్దుల చుట్టు భారీ కందకాలు తవ్వడంతో పంట చేనులోకి వెళ్లేందుకు రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఏటా ఖరీఫ్‌ ప్రారంభంలో పోడు భూములపై వివాదం చెలరేగుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం చూపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మంగళవారం జిల్లా వ్యాప్తంగా పోడు భూములకు హక్కుపత్రాలు కల్పించాలన్న డిమాండ్‌తో రైతులు రహదారుల దిగ్బంధానికి సిద్ధమవుతున్నారు.

Read more

బాలల దినోత్సవం సందడే సందడి

‘‘ భయం మనలో ఎప్పటికీ ఉండ కూడని విషయం. మనం ధైర్యంగా ముంద డుగు వేసినప్పుడు మనకు మద్దతుగా బోలెడు మంది ఉంటారు.ఉర్దూ,హిందీ,ఇంగ్లిష్‌.. భాష ఏదైనా సరే.. అక్షరమాల నుంచే క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఏ విషయమైనా అంతే. మూలం నుంచే క్షుణ్నంగా అర్థం చేసుకోవాలి. అప్పుడే దానిపై మనకు పట్టు వచ్చేస్తుంది. (నెహ్రూ ఇందిరతో చెప్పిన మాట ఇది. మన పాఠ శాల ల్లో పిల్లలను గమనిస్తే.. పై తరగతులు చదువు కునే వాళ్లు కూడా సరిగ్గా అక్షరాలు గుర్తు పట్ట లేరు. ఇలాంటి వారికి నెహ్రూ చెప్పిన విషయం అనుసరణీయం’’

Read more

రాజ్యాంగ విలువలకు ప్రతీకలు…చట్టం…న్యాయం..ధర్మం..!

సమాజంలో ఒకకట్టుబాటు,క్రమ పద్దతి ఏర్పరచేటందుకు ఏర్పాటు చేసుకున్న నియమ నిబం ధనలే చట్టంగా చెప్పబడుతున్నాయి. చట్టం సామా జిక వాస్తవాలపై ఆధారపడివుంటుంది. న్యాయ స్థానాల ద్వారా,ప్రభుత్వ సంస్థలద్వారా అమలు చేయబడే విధి విధానాలు చట్టంగా చెప్పవచ్చును. సమాజంలో నీతి, న్యాయం ధర్మం క్రమ పద్దతితో అమలు పరచాలంటే కొన్ని నిర్దుష్ట విధానాలు అవస రము. ఏవ్యక్తికో, సమాజా నికో,కులానికో ఇష్టం ఉన్నా లేకపోయినా అమలు పరచ టానికి చట్టాలు అవసరం. వీటిని అతిక్రమించుట ఎవ్వరికీ సాధ్య ము కాదు. అతిక్రమించినవారు శిక్షార్హులౌతారు. చట్టం అనేది ప్రభుత్వాలు ప్రజలను భయపెట్టడం ద్వారా వాటికిలొంగి ఉండేలా చేసే ఆదేశాలు అన్నాడు‘ఆస్టిన్‌’. సామాజికంగా అంగీకరించబడిన సూత్రాలకు అను గుణంగా చట్టాలు రూపొందించ బడతాయి.
చట్టానికి ఎంత వరకు నిబద్ధత ఉం టుందనేది నైతిక అంశాల మీద ఆధారపడి వుం టుంది.‘‘హెచ్‌.ఎల్‌.హార్టు’’ప్రకారం శీలానికి సంబం ధించిన ప్రాధమిక నియమాలు మరియు ప్రాథమిక నియమాలు అమలు పరచేందుకు అధికారులకు ఇవ్వబడిన అధికారాలను సెకండరీ నియమాలుగా వర్ణించాడు. ఈ నియమాలు న్యాయబద్ధమైన నియ మాలయ్యాయి. వివాదాలను పరిష్కరించేందుకు, మార్పుకు సంబంధించిన నియమాలు, చట్టాలలో మార్పుకు అనుమతిచ్చేవి మరియు గుర్తింపుకు, చట్టాల యొక్క ప్రామాణికతను పరిరక్షించేందుకు అవకాశం ఇచ్చే నియమాలుగా వీటిని వర్గీకరించ వచ్చును.

Read more

పెట్రో ధరలు పైపైకీ

ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న పెట్రోలు, డీజిల్‌ ధరాఘాతంతో సామాన్యులు విలవిల్లాడిపోతున్నారు. వంద కొట్టు! పెట్రోలు బంకుల వద్ద ఇదివరకు వినిపించిన ఈ మాట ఇప్పుడు గొంతు సవరించుకోక తప్పడం లేదు. ఈ రోజు ఎంత పెరిగిందనే ఆందోళనా స్వరాలే నేడు బంకుల వద్ద ప్రతిధ్వనిస్తున్నాయి. ఇంధన ధరలు పెంచినప్పుడల్లా ఆందోళన చేస్తుంటే ఇదివరకు ‘మనకెందుకులే’ అనుకున్నవాళ్లూ ఇప్పుడు ఎర్రజెండా పట్టుకొని ‘ఇంత అన్యాయమా?’ అంటూ పాలకుల దోపిడిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇంధన ధరల పెరుగుదలను నిరసిస్తూ ప్రజాగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.

Read more

అడవి తల్లికి గర్భశోకం

ప్రభుత్వ రంగంలో ఇంతవరకూ ఉన్న గనులను ప్రైవేటుపరం చేసే కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలూ లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనపడుతోంది.‘’ప్రజా ప్రయోజనాల’’ పేరుతో కారుచౌకగా ప్రభుత్వ రంగ కంపెనీల మైన్లను, భూములను ప్రైవేటు కార్పొరేట్లకు కట్టబెట్టడమే ప్రభుత్వ ధ్యేయం. బడా బడా బహుళజాతి మైనింగు కంపెనీల నుండి వస్తున్న ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గినట్టు కనపడుతోంది. దీనివలన ఖనిజ సంపద విస్తారంగా ఉన్న మన అటవీ ప్రాంతాల్లో సామాజిక ఉద్రిక్తతలు బాగా పెరిగే ప్రమాదం ఉంది.

గత నెలలో కేంద్ర ప్రభుత్వం‘’ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించే నిమిత్తం’’ ఒక పత్రాన్ని విడుదల చేసింది.1980 అటవీ సంరక్షణ చట్టంలో కొన్ని సవరణలను కేంద్ర పర్యావరణ, అటవీ సంరక్షణ మంత్రిత్వ శాఖ ఆపత్రంలో ప్రతిపాదించారు. ‘’పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక అవసరాలు-వీటికి సంబం ధించి వేగంగా మారుతున్న దేశ అవసరాలు నెరవేర్చే’’ ఉద్దేశ్యంతో అటవీ సంరక్షణ చట్టాన్ని సంస్కరించాలని భావిస్తున్నట్టు కేంద్రం ఆపత్రంలో పేర్కొంది. చాలా అస్ప ష్టంగా చేసిన ప్రతిపాదనలు ఆ పత్రంలోఉన్నాయి. కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే జాతీయ మానిటైజేషన్‌ ప్రణాళిక, 2022-25కు అనుగుణంగా ఉండేలా అటవీ అనుమతుల నిబంధనలను, పర్యావరణ సంరక్షణ నిబంధనలను సడలిం చడమే ఈ ప్రతిపాదనల వెనుక అసలు ఉద్దేశ్యం అని మనకు అర్ధమౌ తుంది. అనేక ప్రభుత్వ ఆస్తులు అటవీ ప్రాంతాల్లో వున్నాయి. అవన్నీ ప్రస్తుత అటవీ సంరక్షణ చట్టం విధించిన నిబంధనలకు లోబడి ఉన్నాయి. జాతీయ మాని టైజేషన్‌ పథకం వివిధ ప్రభుత్వ ఆస్తులను లీజుకివ్వాలని ప్రతిపాదించింది. ఆవిధంగా లీజుకివ్వడానికి ఈ అటవీ సంరక్షణ చట్ట నిబంధనలు అడ్డం వస్తున్నాయి. అందుకే ఆ చట్టాన్నే ఏకంగా సవరించాలని మోడీ ప్రభుత్వం భావిస్తున్నది. వివిధ వర్గాల ప్రజలు ఈ ప్రతిపాదిత సవరణలను వ్యతిరేకిస్తున్నారు. ఆ సవరణలను అడ్డుకోడానికి పెద్ద ఎత్తున ప్రతిఘటనను నిర్మించే యోచనలో కూడా వారున్నారు. ఐతే ఈ సవరణల వెనుక అసలు ఉద్దేశ్యం మానిటైజేషన్‌ చేయడానికి ఉన్న ఆటంకాలను తొలగించడమేనన్న సంగతిని వారిలో చాలామంది గుర్తించలేకపోతున్నారు.

Read more

పొటెత్తిన జనసంద్రం

అందాల మన్యసీమను జల సమాధి చేసి పెట్టుబడి దారీ వ్యవస్థకు‘‘జలాభిషేకం’’ చేసే పోలవరం ప్రాజెక్టు ముంపుకుగురయ్యే గిరిజన గ్రామాలను సందర్శించిన సాహితీవేత్తల పర్యట నలో భాగస్వామి అయిన రచయిత జీవన్‌. అక్కడ చూసిన గిరిజనుల దీనావస్థకు అక్షర రూపమే ఈకథ. సహజంగా రచయితకు గిరిజన జీవన విధానాలు, పోరాటాలు, గిరిజనయోధుల వీరగాధలు, తదితర విషయాలపట్ల ప్రత్యక్షంగా అనుభవం వుంది. రచనా కాలం ఫిబ్రవరి 2006, ‘‘జీవన్మరణం’’ సంకలనం కోసం వ్రాయబడిరది.
నిత్యం సతతహరిత వనాల్లో జీవించే వన జీవులను సమస్యలు కూడా సదా వెంటాడు తూనే ఉంటాయి. ఒకసమస్య నుంచి బయటపడగానే మరోకొత్త సమస్య ఎదురురావడం ప్రతి మని షికి సర్వసాధారణం. సమస్యలను ఎదిరించి నిలిచి వాటినుంచి బయటపడటం తెలివైన మాన వులు లక్షణం. కానీఅడవులలో నివసించే గిరిజనులలోని మాయ,మోసంచేయడం, తెలియని ‘‘అమా యకపు గుణం’’తో ఆధునికులకు వారు తెలివిలేని దద్దమ్మలు చేతగానివాళ్ళు,చేతగాని వాళ్ళు. అయితే సాధు జంతువు అయిన పిల్లిని సైతం బంధించి స్థాయికి మించిన ఇబ్బంది పెడితే అది పులిలా క్రూరత్వంతో ఎలా ప్రతిఘటిస్తుందో తేటతెల్లం చేసే కథ’’పోటెత్తిన జన సంద్రం’’ జీవన్‌గా తెలుగు సాహితీలోకానికి సుపరిచితులు అయిన‘‘శేష భట్టార్‌ నరసింహాచార్యులు’’రాసిన కథల్లో ఇది ఒకటి. దీని రచనా కాలం ఫిబ్రవరి 2006,‘‘జీవన్మరణం’’ సంకలనం కోసం వ్రాయబడిరది.
నేపథ్యం అందాల మన్యసీమను జల సమాధి చేసి పెట్టుబడిదారీ వ్యవస్థకు‘‘జలాభిషేకం’’ చేసే పోలవరం ప్రాజెక్టు ముంపుకుగురయ్యే గిరిజన గ్రామాలను సందర్శించిన సాహితీవేత్తల పర్యట నలో భాగస్వామి అయిన రచయిత జీవన్‌ తానుఅక్కడ చూసిన గిరిజనుల దీనావస్థకు అక్షర రూపమే ఈకథ.సహజంగా రచయితకు గిరిజన జీవన విధా నాలు,పోరాటాలు,గిరిజనయోధుల వీరగాధలు, తదితర విషయాలపట్ల ప్రత్యక్షంగా అనుభవం వుంది.నివాస రీత్యా ఖమ్మంనగరం అయినా అధ్య యన రీత్యా,కథాశిల్పం పండిరచడంలోనూ,చేయితిరిగిన రచయిత కావడంవల్ల ఈ కథలోని ప్రతి ఘట్టం కళ్లకు కట్టినట్టు చూపిస్తూ రాయడంలో శతశాతం సఫలీకృతులయ్యారు జీవన్‌.
ఇక కథ విషయానికొస్తే శబరి గోదావరి సంగమ ప్రదేశం అయిన కూనవరం కేంద్రంగా సమీప అడవుల్లోని గిరిజనులు పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేసిన పోరాట సమాయత్తం ఈ కథలోని వస్తువు, ఇతివృత్తం కూడా.కథలో ప్రధాన పాత్ర సోయం వెంకయ్య తన తలపుల ఆలోచనల ద్వారా కథ ఆసాంతం నడిపించి, చైతన్య నిండిన స్ఫూర్తివంతమైన ముగింపుతో కథను సుఖాంతం చేయడమే కాక తెలిసిన విషయాన్ని కూడా ఆసక్తిగా చదివించే శైలితో నడిపించడంలో రచయిత పరిణితి అడుగడుగునా కనిపిస్తుంది. కొత్త కథకులకు ఈ కథన శైలి మార్గదర్శిగా నిలుస్తుంది.చుట్టుపక్కల పది పన్నెండు గిరిజన గ్రామాల్లో అందరూ ‘‘ముసలోడు’’గా పిలవబడే సోయం వెంకయ్య,అతని భార్య రాజవ్వ. వెంకయ్య మంచి వేటగాడు తాతముత్తాతల నుంచి ఆస్తిగా వస్తున్నవేటను తన తండ్రి నుంచి తాను నేర్చుకున్నాడు.తండ్రి అతనికి వేట నేర్పిన గురువు. వెంకయ్య తండ్రి సాక్షాత్తు పెద్దపులినే తన బాణంతో మట్టుపెట్టిన ధైర్యశాలి. అంతటి ధీరుడి కన్న కొడుకు వెంకయ్యలో వేట నైపుణ్యంతో పాటు మానవత్వం,ప్రేమ,ప్రకృతిలోని పారవశ్యం,అనే మంచి గుణాలు అదనంగా వచ్చి చేరాయి. తాత ముత్తాతల నుంచి నివాసముంటున్న ఆ అడవి అన్నఅందాల గోదావరి అన్న ఇంకా ఎక్కువ అంతులేని ప్రేమ వయసు ఇచ్చారు కొంచెం వేగిన దృఢమైన దేహం శరీరంలో సత్తువ చావలేదు వేటకు వెళితే పరిగెత్తే జంతువు సైతం ఒకేఒక్క బాణంతో కొట్టగలడు. వాసనను బట్టి ఏజంతువు ఎక్కడ ఉందో చెప్పగలడు. కూతను బట్టి ఏపిట్ట ఈచెట్టు కొమ్మ మీద ఉందో కూడా చెప్పగలడు. పక్షుల కూతలను అనుకరించి వాటిని బురిడీకొట్టించే సత్తా,సోయంవెంకయ్య సొత్తు. ఇంతటి ధైర్యవంతుడు తెల్లదొరల ఇబ్బందులు నైజాం సర్కారు అనిపైశాచికత్వాన్ని అనుభవించిన దీనుడు వెంకయ్య ఇప్పుడు సొంత రాష్ట్రంలో సొంత పాలకులవల్ల రాబోతున్న‘‘విపత్తును’’తలుచుకున్నప్పుడల్లా భయం గోదావరి వరదల పొంగుకొస్తుంది..తల పగిలిపోతుంది..ఆలోచనలతో కళ్ళుబైర్లు కమ్ముతున్నాయి.కాళ్ళు తడబడుతున్నాయి….’’అంటూ రచయిత జీవన్‌ ముఖ్యపాత్ర వెంకయ్య మానసిక స్థితిద్వారా కథ ప్రారంభంలోనే విషయ వివరణలతో పాఠకులను కథ ప్రవేశం చేయించారు. వెంకయ్య మనోభావాలు నుంచి రచయిత సొంత భావాలకుకూడా కథను కాస్త మళ్ళించి గిరిజన గ్రామాల్లో మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనేతరులు అక్కడి సారవం తమైన భూముల్లో పొగాకు,పత్తి,మిరప,వంటి వాణిజ్య పంటలు పండిస్తూ ఎలా కాసుల వర్షం కురిపిస్తున్నారో చెబుతూ మొదటి నుంచి వాస్తు మార్పిడి విధానానికి అలవాటు పడ్డ అడవిబిడ్డలకు ఈ కాసులు అనబడే డబ్బుల కరెన్సీ కంపంరంపుట్టి స్తుందని,వారిలో వ్యామోహం పెరిగి స్వార్థం నీనడు తుందని దానికి కారకులు గిరిజనేతరులు అంటూ రచయిత పరోక్షంగా ఎద్దేవాతో కూడిన హెచ్చరిక చేశారు.గోదావరి దాపున జీవనం సాగించే గిరిజ నులకు వానా కాలంలో సహజంగా వచ్చే గోదావరి వరదలు కొత్తేమీకాదు,వరదల నాలుగు రోజులు పిల్లాపాపలతో,గొడ్డు గోదా,తీసుకుని ఎత్తు గుట్టల మీద తలదాచుకుని గోదావరి శాంతించినాక, తిరిగి తమ తమ గుడేలకు చేరుకుంటారు ఆనం దంగా…గోదావరి వరద తమ గుండెలను ముం చింది అన్న బాధకన్నా పంట భూముల్లో సారవంత మైన ఒండ్రు మట్టి పంచిదన్న సంతోషమే వారికి ఎక్కువ.కానీ ఇప్పుడు రాబోతున్న వరద ముంపు అలాంటిది కాదు. వారి జీవితాలను వారి ఆవాసా లను శాశ్వతంగా జల సమాధి చేసే ఘోరమైన విపత్తు’’పోలవరం’’ వద్ద గోదావరి నదిపై కట్టబోయే బహుళార్ధక ఆనకట్ట ద్వారా మటుమాయమయ్యే 300 గిరిజన గ్రామాలతో పాటు వేలాది అడవి జంతువులు,పక్షులు,కనువిందుచేసే అందాలు అడవి చెట్లు,ఔషధమొక్కలు,కలప వృక్షాలు అన్ని శాశ్వ తంగా మానవతప్పిదం ద్వారా, అనాలోచిత చర్యల వల్ల,స్వార్థబుద్ధికి,బలైకనుమరుగు కాబోతున్నవిషాద సంఘటన,దేశ చరిత్రలో ఇదే పెద్ద మానవ తప్పిద చర్యగా నమోదు కాబోతున్న సంఘటన ఇది.ఆ విషయం తమ ప్రాంతానికి చెందిన చదువుకున్న పెద్ద దిక్కు పాయం కనకయ్య అనే గిరిజన యువ కుడు ద్వారా తెలుసుకున్న వెంకయ్య మనసు మనసు లో లేదు.తమ ప్రాంతానికి తమ జాతికి రాబోతున్న విపత్తును ఎలా ఎదుర్కోవాలన్న ఆలోచనలే తప్ప మరో ఆలోచన రావడం లేదు ఆఅమాయకపు బుద్ధి బుర్రకు, పాయం కనకయ్య తాను చదువుకున్న చదువుతో పాటు వచ్చిన విజ్ఞానం, స్నేహితుల బలగపు బలంతో కలిసి,తనకు జన్మనిచ్చిన గ్రామా లను సందర్శించి రాబోయే ప్రమాదం నుంచి ఎలా ఎదుర్కోవాలో తనవాళ్లకు చెప్పిన మాటలు తాలూ కు ధైర్యం వెంకయ్యలో తెలియని శక్తి నింపి ముం దుకు నడిపిస్తున్నాయి. అంతేకాదు ఆపాడు పోలవరం ప్రాజెక్టు కట్టి ఏడు సముద్రాల ఆవల నుంచి ఇక్కడకు వచ్చి,ఫ్యాక్టరీలు కట్టేవారికి నీళ్లు,కరెంటు,ఇచ్చి వారిసుఖం,లాభం, కోసం ఎప్పటి నుంచో ఈభూమిని నమ్ముకొని ఇక్కడే జీవించే వారిని అనాధలు చేసి నిలువ నీడ లేకుండా చేయ బోయే ఇక్కడి పాలకులపై, అధికారులపై, ఎలా తిరుగుబాటు చేయాలో కూడా కనకయ్య మాటల ద్వారా విన్న వెంకయ్యలో స్పూర్తి కలిగింది. నాటి అల్లూరి,గంటందొర,కొమరంభీమ్‌,సోయం గంగు లు,వంటి వీరులు వెన్ను చూపని ధైర్యంతో కొదమ సింహాలై గర్జించిన పోరాట చైతన్యం కూడా అతని కళ్ళముందు కదలాడిరది. అంతా అనుకున్న విధం గానే వ్యూహ రచన సాగింది. పోలవరం ముంపు ప్రాంతాలన్నీ ఏకమయ్యాయి, తూర్పుకొండలు ఎర్ర బారాయ్‌,’’కోయిద’’గ్రామంలో కొమ్ము బూర మో గింది,అది విన్న పక్క గ్రామంలోనూ మోగించారు. అలాఅలా ఒకరికొకరు కొమ్ము బూర మోగిం చడంతో,తంత్రీ నాధంలా ఆమోత అన్ని గ్రామాలకు సైరన్‌ మోతల, సమర శంఖల వ్యాపించింది. ముందే అనుకున్న విధంగా కోయ దొరలు, కొండరెడ్లు,కొండలు దిగారు చీమల బారుల కదిలారు. కొమ్ము బూర శబ్దాలు, డోల్లమోతలు మోగుతుండగా,అన్నిరకాల అడవి బిడ్డలు ఇంటిల్లపాది నేల ఈనినట్టుగా బారులుతీరారు,వాళ్ళందరికీ సంఫీు భావంగా బస్తీలో చదు వుకుంటున్న యువతీ వకులు,మేధావులు,రచయితలు,కూడా కదిలి వచ్చారు. చూస్తుండగానే శబరి గోదావరి సంగమ ప్రదేశం అయిన ‘‘కూనవరం’’ జన ప్రవాహంతో నిండిపోయింది. కొమ్ము బూరలు,డోలి,వాయి ద్యాల హోరు ఒకవైపు,అడవిబిడ్డలకు అనుకూలంగా నినాదాల జోరు మరోవైపు, ఆ ప్రదేశం మొత్తం ప్రతిధ్వనించింది. అక్కడ చేరిన వారి పాటలు,నృత్యాలతో అక్కడో ‘‘ఆదివాసి ఐక్యత జన సముద్రం’’ ఏర్పడిరది. అది మోసపూరిత పోల వరం ప్రాజెక్టును నామరూపాలు లేకుండా చేయ బోతుందా!? అన్నట్టు అగుపించింది. ‘‘పోటెత్తిన జన ప్రవాహాన్ని చూసి హడలెత్తి పోయారు అధికా రులు,మంత్రులు, వెంట వచ్చిన తుపాకులు, రైఫిల్లు, మూగబోయాయి’’ అన్న వాక్యాలతో ముగిసిన ఈకథ నిండా గిరిజనజీవన విధానం అడవుల్లోని అందాలు,గోదావరి గొప్ప తనం,దర్శనీయ మవుతాయి. సమకాలీన సామాజిక విషయాన్ని వస్తువుగా తీసుకున్న ఈ కథా రచయిత జీవన్‌కథను ఆసాంతం తనదైన శిల్పం సాయంగా పాఠకులకు ఎక్కడా విసుపు కలగకుండా ఆసక్తికరంగా కడదాకా కథను నడిపించారు. రచయిత కథ మొత్తం ఆదివాసి జీవన ఆచార పద్ధతులు సందర్భోచితంగా చెప్పడంలో చక్కని శ్రద్ధ కనబర్చారు. కథకు నామౌచిత్యం కూడా కలిసింది. ఒకమంచి కథను చూస్తూ చదివిన అను భూతి కలగడంతో పాటు మంచి స్ఫూర్తి నిండిన ముగింపుతో కథకు మరింత సంపూర్ణ చేకూరింది. (వచ్చే మాసం డా:చింతకింది శ్రీనివాసరావు, కథ ‘‘వేలం బస’’ విశ్లేషణ మీ కోసం)- డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు,ఫోను: 77298 83223

ఆదివాసీల ఆత్మగానం

త్తరాంధ్ర కథకులు,రచయిత,కవి మల్లిపురం జగదీశ్‌ రాసిన కొత్త పుస్తకం‘‘దుర్ల’’ కవితా సంపుటి. ఈకవితా సంపుటిని పరిచయం చేస్తూ హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పరిశోధక విద్యార్ధి సారిపల్లి నాగరాజు గారు రాసిన సమీక్ష వ్యాసం – ఎడిటర్‌

మల్లిపురం జగదీశ్‌ మాష్టారు దాదాపుగా రెండు దశాబ్దాలు పాటు రాసిన కవితలన్నింటినీ సమూ హంగా చేసి ‘‘దుర్ల’’ పేరుతో ప్రచురిం చారు. తమ జాతి సంప్రదాయాలను, ఆచారాలను పాటిస్తూ కథలు, కవిత్వం, గేయాలు రాయడమే కాకుండా వారి రచనలకు కూడా ఆ సంప్రదాయాలకు తగినట్టుగానే శీర్షికలు పెట్టారు. గాయం మనిషికి తగిలినా మనసుకు తగిలినా గాయం తాలూకా జ్ఞాపకాలు అలాగే నిలిచిపోతాయి. బాధల ప్రవాహాన్ని అక్షరాలతో వెతికి హృదయాన్ని హత్తుకునేలా అల్లి నప్పుడు ఆ భాధలు గాథలవుతాయి, గీతాల వుతా యి. కవితల వెల్లువవుతాయి. గిరిజనుల బాధలను, కష్టాలను, ఇబ్బందులను అక్షరీకరిస్తున్న కవి మల్లిపు రం జగదీశ్‌. తమ జాతి మూలాలను అలాగే ఒడిసి పట్టుకొని వారి సంస్కృతి, సంప్రదాయాలను, పండగ లను, ఆచార వ్యవహారాలను తమ కవిత్వంలో చూపిస్తూ, తమ జాతికి జరిగే అన్యాయాలపై కవిత్వపు చైతన్య బావుటాను ఎగరవేస్తున్న గిరిపుత్రుడు మల్లిపురం జగదీశ్‌.
తెలుగు కథాసాహిత్యంలో సుస్థిర స్థానాన్ని ఆపాదించుకున్న కథకులు మల్లిపురం జగదీశ్‌. ఈయన కలం నుంచి ‘‘గాయం’’, ‘‘శిలకోల’’, ‘‘గురి’’ అను కథా సంపుటిలు ఇదివరకే తెలుగు పాఠకలోకం ఆదరణకు నోచుకున్నాయి. ఇప్పుడు ‘‘దుర్ల’’ కవితా సంపుటితో ఆదివాసీ జన జీవితాన్ని, సంప్రదాయాలను, బాధలను, ఇబ్బందులను, వారికి జరుగుతున్న అన్యాయాలను చాలా ఆర్ద్రంగా చెప్పుకొచ్చారు. కథకుడిగా చేయి తిరిగిన జగదీశ్‌గారు ఇప్పుడు కవిత్వంలో కూడా తనదైన ప్రతిభను చూపించారు. ఆదివాసీ సమూహాల మీద జరుగున్న అన్యాయాలకి, ప్రభుత్వం వారి పట్ల చూపిస్తున్న నిర్లక్ష్య ధోరణికి స్పందించి సందర్భానుసారంగా కవితలు రాసి ‘‘దుర్ల’’గా మన ముందుంచారు. ఆదివాసీ జనుల కష్టాలు,పథకాల పేర జరు గుతున్న మోసం,గిరిజనులకు అందని విద్య, ఆమడ దూరంలో ఉన్న వైద్యం, నరకయాతన పెట్టే రహదారులు మొదలైన గిరిజన సమస్యలు కళ్ళకు కట్టినట్లుగా ఈ కవితా సంపుటి నిండా జగదీశ్‌ గారు ఎత్తి చూపారు. ‘‘దుర్ల’’ కవితా సంపుటి 52 కవితల సమాహారం. ఇందులో ప్రతి కవితా పాఠకుల హృదయాన్ని ద్రవింప జేసి, చదివింపజేస్తుంది. ‘‘దుర్ల’’ సంపుటి కవిత్వంలోనే కాదు, కవితా శీర్షికల్లోనూ ఆ నూతనత్వం పాఠకుడిని పలకరిస్తుంది. శీర్షిక నుండే కవితా వస్తువుకు చెందిన ఆలోచనల్లోకి, సందిగ్ధావస్థల్లోకి, పరిశీలనాతత్వంలోకి, ఉత్సుకతలోకి పాఠకుడు అడుగులు వేస్తాడు. ‘‘పోరు ఎప్పటికీ ఆగదు,మాట్లాడుతాం,తూకం, పాట దారి,కొండ భాష,సృష్టి’’ వంటి శీర్షికల్లో కవి ఏ వస్తువును కవిత్వంగా మలచబోతున్నాడు అన్న ఉద్రిక్తత, సందిగ్ధత పాఠకుడిని సంఘర్షణ లోకి దించుతుంది. కవి తొలి విజయం కవితా శీర్షికల్లోనే పాఠకుడి నాడిని పట్టుకుని కవితలోకి వారి మనసును అంతర్లీనం కావించడం. ఈకవితా సంపుటికి శీర్షికగా నిలిచిన ‘‘దుర్ల’’. కవిత నిండా ఆదివాసీ సంప్రదాయాలు, సంస్కృతి, అడవి సౌందర్యం,ఆదివాసీ ఆడపడుచుల థింసా నృత్య సన్నివేశాలు స్పష్టంగా కనిపిస్తా యి. రచయిత తన మూలాలను,జీవితాన్ని ఈ కవిత నిండా చూపించే ప్రయత్నం చేసారు.‘‘పసుపు నీళ్ళ స్నానమాడి గుగ్గిలం ధూపంలోఎజ్జోడి మంత్రాలతో కొత్త కలల బొట్టుపెట్టుకొని కోడిపిల్లను ధరిస్తుంది గొడ్డలమ్మ’’ అని గిరిజన సంస్కృతిని,వారి ఆరాధ్య దైవాన్ని కొనియాడిన పద్ధతిని ఈకవితలోచిత్రీకరించారు. గిరిజను లంతా బృందంగా వెళ్ళి గొడ్డలమ్మ తల్లికి నీరాజనాలు పలికి,థింసా నృత్యాన్ని ఆ తల్లి ఎదుట ప్రదర్శిస్తారు. ఆ సన్నివేశాల న్నింటిని జగదీశ్‌ గారు చాలా చక్కగా‘‘దుర్ల’’ కవితలో చూపించారు.‘‘దుర్ల’’ అంటే అర్థం కంది కొత్తల పండుగలో.. పూజలందుకున్న గొడ్డలమ్మను చుట్టు ప్రక్కల ఊర్లకు ఊరేగిం పుగా తీసుకు పోవడమే ‘‘దుర్ల’’. ఇది ఉత్సవం జరుగుతున్న గ్రామాలన్నీ ఒకేసారి జరుపు కుంటారు. ఒక గ్రామ దుర్ల సమూహం మరొక గ్రామ దుర్ల సమూహానికి ఎదురైనప్పుడు గానీ, కలిసి నపుడుగానీ అక్కడ కలిసి రెండు గొడ్డల మ్మలూ నృత్యం చేస్తాయి. ఒక గ్రామం మరొక గ్రామం తో నేస్తరికం చేయడం దీనిలో ఆం తర్యం. ‘‘దుర్ల’’ ఆదివాసీ సమూహాలలో స్నేహంకి, సౌభ్రాతృత్వంకి,బంధంకి… ప్రతీక. నేటి ప్రపంచీకరణ యుగంలో అడవి,కొండ స్థానాలు ఎలాఉన్నాయో ‘‘తూకం’’ కవితలో చాలా ఆర్ద్రంగా చెప్పుకొచ్చారు.‘‘సంతదారిలో బరువెంతైనా బతుకు తూకంలో కొండెప్పుడూ తేలికే’’ అనే మాటలు పాఠకుల హృదయాన్ని ఆలోచింపజేస్తాయి. ఇది జగదీశ్‌ మాష్టారి దుఃఖం మాత్రమే కాదు యావత్తు ఆదివాసీ సమూహ దుఃఖం.పచ్చని చీరతో నిండుగా ఉన్న అడివితల్లిని విద్వంసం చేస్తున్న ప్పుడు ఉబికిన కన్నీటి దుఃఖం ఇది. కొండపై అంతటి అవ్యా జమైన ప్రేమను కలిగిన కవి మల్లిపురం. అంతరించిపోతున్న తమ జాతి సంస్కృతి, సంప్రదాయాలను తలచుకొని ‘‘ఏవితల్లీ!’’ అనే కవితలో తన మనసులోంచి తన్నుకొస్తున్న బాధను అక్షరాల్లో పొందుపర్చారు.‘‘ఏవి తల్లీ…నాఅడవితల్లీ!! నిన్న మోగిన తుడుం డప్పులూ…? ఏవి తల్లీ…నాకొండ తల్లీ!! నిన్న పాడిన నాసవర గీతాలూ…?ఏవి తల్లీ… నాపోడు తల్లీ!! నిన్న నాటిన నా కలల విత్తు లు…? ఏవి తల్లీ…నాకొండ మల్లీ…!! నిన్న వేసిన ధింసా అడుగులు…?ఏవి తల్లీ… నాజా కర తల్లీ…!! నిన్ను కొలిచే నావారేరి తల్లీ?’’ అంటూ అడివిలోని అంతరించిపోతున్న తమ జాతి సంస్కృతి,సంప్రదాయాలపట్ల ఆవేదనను వ్యక్తంచేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఇల్లులు కోల్పోయి, నిర్వాసితులైన ఆదిమ జాతి కన్నీళ్ళును ‘‘ముంపు కన్నీళ్ళు’’ పేరుతో చెప్పుకొచ్చారు..‘‘కట్టండి ప్రాజెక్టులు మా సమా ధుల మీద…మా చితి మంటల మీద… మా గుడిసెల మీద..మునిగిపోతున్న మా బతుకులమీద.. పోలవరం అంటే ప్రోజేక్టుడు కన్నీళ్ళు పోలవరం అంటే ములిగిపోయిన వెల జీవాలు పోలవరం అంటే చెరిగిపోయిన ఆదిమ ఆనవాళ్ళు పోలవరం అంటే మాయమైపోయిన ఒకానొక అరణ్యం’’ అంటూ పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం వల్ల ఆదివాసీలకు జరిగిన అన్యాయాన్ని గురించి వారికి జరుగుతున్న నష్టాన్ని జగదీశ్‌ మాష్టారు చెప్పారు. తమ రచనలు, గేయాలు ఎప్పుడూ తమ జాతికి దిక్సూచి కావాలనే మనస్తత్వం కలిగిన వారు జగదీశ్‌ మాష్టారు. ఆ క్రమంలోనే ‘‘పాట దారి’’ అనే కవితను రాశారు. ‘‘పాటంటే ఒక ఆయుధం ఒక జీవన నాదం ఒక నిప్పుకణం నా దృష్టంతా రేపటి మీదే పల్లవి పదునైనదైతే చరణాలు వాటంతటవే వేడెక్కుతాయ్‌ పాట దానంతటదే రగులుకుంటుంది..పది మందికి దారి చూపు తుంది’’ అని వారి భవిష్యత్తు ఆలోచన క్రమాన్ని ఈ కవితలో చెప్పారు. మౌనంగా ఉంటే తమ జాతి ప్రజలకి ఎప్పటికైనా రాజ్యం ఏలే సమయం వస్తుంది అది ఎప్పుడో కాదు అతి త్వరలోనే వస్తుంది. తమ హక్కులు తాము అనుభవించే రోజులు దగ్గరగానే ఉన్నాయి అని ‘‘ఎదురు చూపు’’ కవితలో తన ఆశాభావాన్ని వ్యక్తంచేసారు.
‘‘ఏదో ఒక రోజు…నీను కోరిన నా రాజ్జిము ఒస్తాది…నీనుండగానే ఒస్తాది ఆ నా రాజ్జిము సూసె ఎల్తాను అందాకా… ఎంత కష్టమైనా పడతాను గానీ పట్టొగ్గను… ఒగ్గనంతే… ఒగ్గను’’ అని తన ధృడ సంకల్పాన్ని ఈ కవితలో తెలియజెప్పారు. జగదీశ్‌ తన కథలు, కవిత్వం, గేయాల ద్వారా నిరంతరం గిరిజన యువతను చైతన్యపరుస్తునే ఉన్నారు. నిద్రాణమై ఉన్న తమ జాతి జనులను తన రచనల ద్వారా మేల్కొపుతూనే ఉన్నారు. తమ జాతి నిర్మాణానికి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. ‘‘జాగో… ఆదివాసీ! జాగో!!’’ కవితలో తన వేదనని, ఆవేదాన్ని వ్యక్తం చేసారు. ‘‘పీక తెగి పడుతున్నా కొండలు తరగనీకు జాగో… ఆదివాసీ! జాగో!! అంటూ ఎన్ని ఇబ్బందులు, కష్టాలు వచ్చిన పడినా కొండను ఎవరినీ తాకనివ్వొద్దని గిరిజనులను తన గళంతో,కలంతో మల్లిపురం జగదీశ్‌ గారు హెచ్చరిస్తూ, చైతన్యపరుస్తున్నారు. ‘‘రంగులు మార్చే రాజకీయాల్ని గమనిస్తూ వుండు కొండలు వెనుక పులులూ సింహాలు తిరుగుతున్నాయ్‌ నిన్ను ఉద్దరిస్తాయని రంగుబట్టలేసుకొని నీ భుజమ్మీద చెయ్యేసి నీతోనే అడుగులెస్తుంటాయ్‌ సంక్షేమ పథకాల ప్లకార్డులు పట్టుకుని నీ వెనకే గోతులు తవ్వుతుంటాయ్‌ జాగో.. ఆదివాసీ! జాగో!!’’ అంటూ ఆదివాసీ జనులను తన కవిత్వంతో జాగృతపరుస్తున్నారు. గిరిజనులను అభివృద్ధి పేరట నాగరికులు చేసే మోసాన్ని, రాజకీయ నాయకులు చేసే కుతంత్రాలను ఈ కవితలో జగదీశ్‌ గారు ఎండగట్టారు. గిరిజనులపై అటవీ అధికార్ల దాష్టీకాలు, పోలీసుల బెదిరింపులు నాటి నుంచి నేటి వరకు ఎప్పుడూ సాగుతూనే ఉన్నాయి. వాళ్ళ చేతిల్లో ఆదివాసీలు ఎల్లవేళలా నలిగి పోతూనే ఉన్నారని మల్లిపురం జగదీశ్‌ ‘‘పోరు ఎప్పటికీ ఆగదు’’ అనే కవితలో ఎలుగెత్తి చెప్పారు. ‘‘యుద్ధం తప్పనిసరైనప్పుడు ఆయుధం అనివార్యమవుతుంది..అది ఎండు గడ్డి పరక వ్వచ్చు అక్షరమైనా కావచ్చు’’ అని తన అక్షరాన్ని ఆయుధంగా ప్రకటించి, తన ధిక్కార స్వరాన్ని నాగరిక ప్రపంచానికి వినిపించారు. ఆదివాసీ లపైన జరిగిన దాడులు ఇప్పటివి కాదు అని అవి తరతరాలుగా సాగుతూనే ఉన్నాయని ఈ కవితలో స్పష్టం చేసారు.‘‘వనాలనే కాదు వాసు లనూ నరకడమే ఒకానొక సంస్కృతి నేటిదా? తెగిపడ్డ ఏకలవ్యుని బొటనవేలు చెబుతుంది ఏనాటిదో! రాలిపడ్డ శూర్పనఖ ముక్కు చెవులు చెబుతాయి ఈ దమన కాండ ఎప్పటిదో!’’ అంటూ ఆదివాసీ సముహంపై అనాది నుండి జరుగుతున్న దాడులను కవి ఇప్పటికీ ఖండి స్తూనే ఉన్నారు. ప్రపంచమంతా దినదినాభివృద్ధి చెందుతూ సాంకేతిక పరిజ్ఞానంతో తేజరిల్లు తున్న కాలంలో కూడా కొండాకోనల్లో నివసిస్తూ అడివికే పరిమితమైన తమ జాతి స్థితికి, వారి బతుకుకి అద్దంపట్టే కవిత ‘‘మేము’’… ‘‘ఇప్పటికే నెట్టివేయబడ్డవాళ్ళం..అడుగు తీసి అడుగెయ్యని వాళ్ళం..అడవి నుంచి బయటకు రానివాళ్ళం..కొండాకోనల్లో ఇరికిపోయినవాళ్ళం ఊష్టమొస్తేలి ఎజ్జోడివైపే ఆశగా చూస్తున్న వాళ్ళం..డోలీల్లోనే రాళ్ళదారులు సాగుతూ ఆసుపత్రికి తరతరాల దూరంలో నిలిచిపోయిన వాళ్ళం’’ అని తమ జాతి వారికి ఇంకా సమృ ద్ధిగా చేరువలో వైద్యం అందక చనిపోతున్న గిరిజనులను చూసి చలించిపోతూ ‘‘శిలాక్షరాల దారిలో బిగించిన పిడికిలితో సిద్ధమయ్యాం ఒక వేకువ కోసం!!!’’ అంటూ తన ఆగ్రహాన్నిజగదీశ్‌ వ్యక్తం చేసారు. ఇన్నేళ్ళు నాగరిక ప్రపంచానికి దూరంగా ఉండి అడవికే పరిమితమైన మేము ఇప్పుడు మాట్లాడుతాం..ఎవరికీ భయపడేదే లేదని, ఇప్పుడు మాకు మాట్లాడే సమయం వచ్చిందని మల్లిపురం ‘‘మాట్లాడుతాం’’ కవితలో తన మాటలను తూటాల్లా ఈ కవితలో పొందు పర్చారు.‘‘మౌనం ఇప్పుడు నిషేధం మాట్లాడ్డం తప్పనిసరి ఇప్పుడు మాట్లాడ్డం అంటే ఆయు ధాల్ని సిద్ధం చేయడమే ఇప్పుడు మాట్లాడ్డం అంటే నిశ్శబ్ధంగా మాటుకాయడమే ఇప్పుడు మాట్లాడ్డం అంటే కొండను మింగేబోతున్నోడి పీకమీద అడుగెయ్యడమే’’ అని తమ జాతి ఆవేదనను తన గళం ద్వారా వినిపిస్తూ.. ‘‘మాట్లాడుతాం! మాట్లాడుతాం! కొండ మీద దీపాలు వెలిగేదాక మాట్లాడుతాం!! మా దీపా లు ఆర్పినోడి దీపం ఆరేదాకా మాట్లాడుతాం!!! అని ఇప్పుడు మీరు కాదు. మేము మాత్రమే మాట్లాడే సమయం. మేమే మాట్లాడుతాం అని తన ఆవేశాన్ని, ఆగ్రహాన్ని ఈ కవితలో వెల బుచ్చారు.మల్లిపురం జగదీశ్‌ మాష్టారులో ఉత్తరాంధ్ర యాస,వెటకారం,వ్యంగ్యం కలగ లసిన క్రియాశీల కవి. ఆయన వ్యంగ్యానికి నిదర్శనంగా ‘‘తేడా’’ కవిత నిలుస్తుంది.‘‘నీ అక్ష రాలు ఆకలిని చూడ్డానికి వెనకడుగేస్తాయి! నా అక్షరాలు ఆకలి తీర్చడానికి అంబలిని వుడకేస్తుంటాయ్‌!! నీ అక్షరాలు అధికారపు అహంకారాలు నా అక్షరాలు ఆకలి కేకల హాహాకారాలు’’ అంటూ ఉత్తరాంధ్ర ప్రజలకు పొట్ట చింపినా అక్షరం ముక్క రాదు అని అన్నవాళ్ళకు ఈ కవిత గొప్ప కనువిప్పు.జగదీశ్‌ గారి భవిష్యత్తు ప్రణాళికకు,వ్యూహాత్మక రచనకు ప్రతీక ‘‘దుర్ల’’ కవితా సంపుటి. కవిగా తాను భవిష్యత్తులో చేయవలసిన పనులు, రచనలు మొదలైన విషయాలు అన్నీ ఇందులో సంపూ ర్ణంగా దర్శనమిస్తాయి.‘‘కలం’’ కవితలో ఆయన తాత్త్వికత కనిపిస్తుంది.‘‘గతం చీకటి వర్తమానం నెత్తురు భవిష్యత్‌ దహనం జ్వలనం నా కర్తవ్యం’’అని తాను నిరంతరం తమ జాతి కోసం వెలిగే దీపమై ఉంటానని, తమ జాతి నిర్మాణానికి నడుం బిగిస్తానని తన రచనల ద్వారా వ్యక్తంచేసారు. ఆదివాసీ సమూహాన్ని తన అక్షరాలతో నిరంతరం ఉత్తేజపరుస్తూనే ఉన్నారు జగదీశ్‌ మాష్టారు. ఆయన లక్ష్యం, గురి ఎప్పుడూ తమ జాతి ప్రజలకు జాగృత పరచడమే. ఆనేపథ్యం లోంచే పుట్టుకు వచ్చిన కవితా సంపుటి ఈ‘‘దుర్ల’’.ఈ సంపుటిలో‘‘సృష్టి’’ కవిత పాఠకుల్ని మరింత ఆకర్షిస్తుంది. ‘‘నా అక్ష రాలు వెన్నెల రాల్చే తుడుం దెబ్బలు నాఅక్ష రాలు రాత్రికి రంగులద్దే డప్పు వరసలు నా అక్ష రాలు కందికొత్తల సాయంత్రాన ఒకటై నడిచిన ధింసా అడుగులు నా అక్షరాలు కొండ దొంగ లపై ఎక్కుపెట్టిన శిలకోల మొనలు నా అక్షరాలు రేపటికి పదును పెట్టే నేటి కవితా పాద పద్యాలు నాకు కవిత్వమంటేఅరణ్యాలను సృష్టించడమే!’’ అంటూ తన కవిత్వం ఎప్పుడూ తమ జాతి జనులను చైతన్య పరచడం కోసమే నిర్మించబడుతుంది అని ఎలుగెత్తి చాటి చెప్పారు. అడవులలో, కొండలలో నివసించే గిరిజనుల బతుకు చిత్రాలను తన కవితలలో జగదీశ్‌ మాష్టారు చూపించారు. గిరిజనుల సంస్కృతిని, అడవి సౌందర్యాన్ని ఒకవైపు చూపిస్తూ, పెత్తందార్లు, పెట్టుబడిదార్లు, షావుకార్లు, నాగరికులు, రాజకీయ నాయకులు వచ్చి గిరిజనుల సంపదను దోచుకుని, కొండను ఆక్రమించుకొని, ఆ కొండకు వాళ్ళని దూరం చేసే దుర్మార్గ సన్నివేశాల్ని మరో వైపు బలంగా చూపించారు. ప్రభుత్వాన్ని, పాలక వర్గాన్ని వ్యతిరేకిస్తూ తమ జాతికి జరుగుతున్న అన్యాయాలను అక్షరీకృతం చేస్తున్న పదునైన కలం జగదీష్‌ మాష్టారిది.కవిగా జగదీష్‌ మాష్టారు మాట్లాడాల్సిన చోట చాలా గట్టిగా మాట్లాడి తన ధిక్కార స్వరాన్ని వినిపిస్తాడు. తమ జాతి హక్కుల కోసం, ప్రగతి కోసం తన రచనలు సాగిస్తాడు.‘‘దుర్ల’’ కవితా సంకల నంలో ప్రతి కవితా సభ్య సమాజానికి ఒక ప్రశ్నే. ప్రతి కవితా చైతన్య గీతమై సమాజాన్ని మేల్కొల్పుతుంది. ఇంత మంచి కవితా సంక లనాన్ని తను పుట్టి, పెరిగిన‘‘పి.ఆమిటి’’ గ్రామా నికి అంకితం ఇవ్వడం ఆయనలోని కృతజ్ఞతకు నిదర్శనంగా కనిపిస్తుంది. అంతేకాకుండా అదే గ్రామంలో గిరిజన సంప్రదాయ పద్ధతిలో జాకరమ్మ తల్లి ఎదుట ఎజ్జోడు(పూజారి) మంత్రాల నడుమ గ్రామ ప్రజలందరి మధ్య ఆవిష్కరణ జరిపి తన భక్తిని, విశ్వాసాన్ని నిరుపించుకుని మరో అడుగు ముందుకేసారు. ఈ ‘‘దుర్ల’’ కవితా సంపుటి ఆదివాసీ సామాజిక వర్గానికి చెందినదే అయినా దాని వెనుక గిరిజనుల అవస్థలు, వారిపై పెత్తందార్లు, షావుకార్ల, రాజకీయ నాయకులు దోపిడిని ఇతర వర్గాలు కూడా గమనించాల్సిన అవసరాన్ని కవి చెప్పకనే చెప్పారు. జగదీశ్‌ కేవలం గిరిజన కవి మాత్రమే కాదు. సమాజంలో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే వాటిపై ప్రతిస్పందించడమే గాక, వాటికీ అక్షర రూపమిచ్చి సమాజంలోని రుగ్మతులను రూపుమాపాలని తపనపడే కవి మల్లిపురం.- సారిపల్లి నాగరాజు ,8008370326

కొమరం భీమ్‌

అయనో అగ్గిబరాట … ఆదివాసీల అగ్గిరవ్వ..గెరిల్లా పోరాటంలో మడమతిప్పని యోధుడు..జంగ్‌ సైరన్‌తో నిజాం సర్కారు గుండెల్లో ధడ పుట్టించిన గోండు బిడ్డడు జల్‌,జంగల్‌,జమీన్‌ నినాదంతో గిరిజన హక్కుల కోసం తన చివరి శ్వాస వరకూ పోరాడిన మహనీయుడుకొమరం భీం నిజాం పాలకుల నిరంకుశత్వానికి..అధికారుల దమన నీతికి ఎదురు నిలిచి పోరాడిన వీరుడతను.జల్‌,జంగిల్‌,జమీన్‌ అని నినదించి ఆదివాసీల హక్కుల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయక ఉద్యమించిన యోధుడతను.గిరిజనుల అభ్యున్నతికి తన ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిన అమరుడతను. ఇప్పటికీ అడవిబిడ్డల గుండెల్లో కొలువైన ఆవ్యక్తే కొమరంభీమ్‌.ఆమహా నీయునిపై ఎస్‌.ఎం.ప్రాణ్‌రావు రచించినకొమరంభీమ్‌నవల.ఇది పక్క పరిశోధక నవల కావడంతో ప్రముఖ సాహిత్యవేత్త, గిరిజన కథావిశ్లేషకులు..డాక్టర్‌ అమ్మిన శ్రీనివాస రాజు గారు రాసిన అత్యాంత విలువైన సమీక్షా వ్యాసం ఇది.వారివిలువైన సమయాన్నికేటాయించి..శ్రమించి మన థింసా పాఠకులకోసం ఈసమీక్ష వ్యాసాన్ని అందించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు- ఎడిటర్‌
దక్షిణ భారతదేశ గిరిజన పోరాటయోధుడు, దమ్మున్న ఆదివాసి అమరుడు, కొమురం భీం.. సుమారు 1901లో జన్మించి 1940లో వీర మరణం చెందిన ఈఅడవి బిడ్డ జీవించిన కాలం నాలుగు పదులే అయిన తరతరాలకు స్ఫూర్తిని పోరాట విలువలను అందించడమే కాక తమ గోండు జాతి వికాసానికి కారకుడ య్యాడు.తాను చేసిన భూపోరాటం తన కాలం లో కాకపోయినా తదనంతర కాలంలో విజ యం సాధించి లక్ష్యాన్ని చేరుకుంది. తను ఏనైజాం రాజ్యపాలకుల అరాచక పాలనపై తిరుగుబాటు చేశాడో ఆ నైజాం ప్రభువులు కొమరం భీం చేసిన సంఘటిత పోరాటానికి తన జాతి కష్టార్జిత సంపద అడవులు, భూముల,రక్షణ కోసం చేసిన ప్రాణత్యాగానికి పశ్చాత్తాపం చెంది ఆప్రాంత ప్రజల అభివృద్ధి కోసం ప్రముఖ మానవ శాస్త్రవేత్త ‘‘హైమన్‌ డార్ప్‌’’ నేతృత్వంలో అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేశారు. అది అంతటితో ఆగకుండా తదనంతర పాలకులు కూడా ఆగిరిజన అభివృద్ధి పథకాలు కొనసాగిస్తూ గిరిజన హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టాలు చేసి, విద్య ఉద్యోగ రాజకీయ ఆర్థిక రంగాలలో వారి అభివృద్ధికి పాటు పడుతున్నారు. అడవుల జిల్లా అయిన ఆదిలాబాద్‌లో గల అధిక సంఖ్యాకులైన ఆదివాసీ తెగ ‘‘రాజ్‌ గోండు’’ స్వాతంత్రానికి పూర్వం నైజాం పాలనలో గోండుజాతి గిరిజనులు అనుభ వించిన శ్రమదోపిడి,జీవన అస్తిత్వం,మొదలైన పీడనలు,పాలకులు ప్రజల మధ్య వారదులైన అధికారులు,గుత్తేదారులు,నిత్యం అక్కడ గిరిజ నులపై చేసే దౌర్జన్యాలు,విద్రోహాలు,కారణంగా రాజుకుందే ఆ‘‘గోండు పోరాట జ్వాల’’.దానికి ముందుండి నడుం బిగించి తనజాతి అభివృద్ధి కోసం ఆహుతైన అగ్నికణమే ‘‘కొమరం భీమ్‌’’. అక్కడ జరిగింది భారీపోరాటం..కానీ నాటి పాలకుల దృష్టిలో అదిఒకస్థానిక పోరాటం గానే మిగిలిపోయింది.
స్వాతంత్య్రానంతరం జరిగిన గిరిజన వికాసంలో భాగంగా, అభివృద్ధి చెందిన సాహిత్యం సాక్షిగా,అల్లం రాజయ్య,సాహు , వంటి సామాజిక స్పృహగల రచయితల సాయంగా ..‘‘కొమురం భీం’’ చేసిన పోరాట పటిమ సభ్యసమాజానికి చేరడమేకాక,స్థానిక పోరాట యోధుడి,చరిత్ర రాష్ట్రవ్యాప్తంగా జాతీయ చరిత్రలో భాగమైంది.
ఆంధ్రదేశ గిరిజన పోరాటాల్లో అగ్రభాగంగా నిలిచిన అల్లూరి సీతారామరాజు పోరాటం, దానిలో సీతారామరాజు బ్రిటిష్‌ పాలకుల చేతుల్లో అమరుడైన ఆయన నింపిన పోరాట స్ఫూర్తి గిరిజనుల్లో చక్కని చైతన్యంకలిగించింది. కొమరంభీమ్‌,అల్లూరి సీతారామరాజుల,జీవిత కాలాలు,ప్రాంతాలు,ఒకటి కాకపోయినా,వారి లక్ష్యాలు మాత్రం ఒకటే! వారు జీవించింది కొద్ది కాలమే అయినా అనంతకాల స్ఫూర్తిని ఖ్యాతిని సొంతం చేసుకున్న త్యాగమూర్తులు వారు. కొమరంభీం త్యాగ చరిత్ర వెలుగు చూడటానికి ఆలస్యమైనా అతనిదే అసలైన పోరాటం,రన్‌ గేమ్స్‌ కం తన అమరత్వానికి ప్రతిఫలంగా తన జాతి హక్కులు,స్వేచ్ఛ,పొంది ఆర్థికవిద్య అభి వృద్ధి సాధించి తద్వారా సామాజిక గౌరవం పొందుతుంది. గిరిజనజాతి సంస్కృతిపై జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు జరగడానికి కారణం అయింది. ప్రారంభంలో కేవలం మౌఖిక సాహిత్యంగా మాత్రమే ఉండి ఆదిలాబాద్‌ గోండల గుండె గదుల్లో గుడి కట్టు కుని ఉన్న ‘‘భీమ్‌ పోరాట గాథ’’ పత్రికల పరంగా సభ్య సమాజంలో పాదం మోపిన, తెలియాల్సినంతగా తెలియలేదు.
1990లో విస్తృత ప్రచార సాధనమైన సినిమాగా కొమరం భీమ్‌ కథ సినిమాగ చిత్రీకరించబడ్డ అది విడుదల కావడానికి మరో 20 సంవత్సరాలు పట్టి విడుదలైన చిన్న చిత్రాల జాబితాలో చేరి, ఆచిత్ర లక్ష్యం అందరికీ చేరకుండానే తెరమరుగైంది. అయినా ఆ సినిమాకు కథ మాటలు రాసిన ప్రముఖ చారిత్రక నవలా రచయిత, నల్లగొండ వాసి ఎస్‌.ఎం.ప్రాణ్‌ రావుటసర బాద ముఖ్య ప్రాణ్‌ రావుఊ కలం నుండి పరిశోధనాత్మక నవల ‘‘కొమరంభీమ్‌’’ వెలువడిరది. తెలుగు సాహిత్యానికి ఒక ప్రామాణిక నవల దక్కింది. సినిమా చిత్రీకరణలో భాగంగా భీం నివాస ప్రాంతం, నైజాం పోలీసులతో పోరాటం జరిగిన వీర భూమి,జోడేఘాట్‌, కొమరం భీమ్‌ భార్య సోంబాయి నివాస ప్రాంతం ‘‘దో బె’’ తదితర గిరిజన గ్రామాలు స్వయంగా సందర్శించి భీమ్‌ సమకాలికులతో ముఖ్యంగా భీమ్‌ భార్యతో ముచ్చటించి ఆనాటి పరిస్థితులు, భీమ్‌ వ్యక్తిత్వం,తదితర అంశాలు ప్రత్యక్షంగా చెప్పగా విని రచయిత ఈనవల రాశారు. ‘‘అవ్వల్‌’’ తాలూక్దారు… అబ్దుల్‌ సత్తార్‌… జోడేఘాట్‌లో భీం నాయకత్వంలో జరిగిన గోండు పోరాటానికి సంబంధించిన కాల్పుల గురించి పై అధికారులకు రాసిన నివేదిక పత్రాల ఆధారాలు,‘‘ముషిర్‌- ఎ- డక్కన్‌’’ పత్రికలో 05 అక్టోబరు 1940 తేదీన ప్రచురించబడ్డ వార్తాకథనాలు ఈ నవలకు అధికార ధ్రువపత్రాలు గా చెప్పవచ్చు. ఇక నవల శైలి చారిత్రక కథనంకు అద్దం పడుతుంది. సుమారు 80 సంవత్సరాల క్రితం ఆదిలాబాద్‌ అడవుల్లో నియంత నిజాం సర్కారు,అతని గుత్తేదారులు,ప్రభుత్వ ఉద్యో గులు,అమాయకత్వానికి చిరునామాలైన అక్కడి గిరిజనులపై చేసిన మోసాలకు ప్రతిరూపంగా ఈ నవల ఆద్యంతం కొనసాగుతుంది. ఒకవైపు నవల కథనం కొనసాగుతూనే,మరోవైపు అంతర్భాగంగా సందర్భోచితంగా గోండు జాతి గిరిజనుల సాంప్రదాయ పండుగలు,జాతరలు, వారాంతపు సంతలు, మొదలైన వారి వారి సాంఘిక జీవన చిత్రాలు సంక్షిప్త రూపంగ అందించడంలో రచయిత సామాజిక దృష్టి స్పష్టమవుతుంది. ఈ నవలలో మరో ప్రాముఖ్యత….కొమురం భీం గురించిన గత విశ్వాసాలు నిరాధార విషయాలను తేటతెల్లం చేయడం. ఇందులో భీమ్‌ వ్యక్తిత్వం, పోరాటపటిమ,వాక్‌ చతురత,అతను మాతృభాష గోండుతో పాటు తెలుగు భాష నేర్చుకోవడం, ముఖ్యంగా తమ జాతి జనావళిలో తన పోరాటంపట్ల, తనపట్ల,నమ్మకం కలిగించ డంలో చేసిన నాయకత్వకృషి,మొదలైన విషయాల నూతన కోణాలు దీనిలో ఆవిష్కృతం అవుతాయి,నూతన నాయకత్వందారులకు ఈ నవల ఆదర్శంగా నిలుస్తుంది.ఈ నవలలో ప్రధాన పాత్ర కొమరంభీం. అతని చిన్నతనంలో తమ వంశస్థులు రాజులుగా ఉండి పాలన చేసిన వారు, ప్రస్తుతం పాలితులుగా ఉండి బాధలు అనుభవిస్తున్న తీరు..బ్రిటిష్‌ పాలకుల ఆదేశాల ప్రకారం నిర్మల్‌ తాలూకా దార్‌, రాంజీగోండును 1860లో నిర్మల్‌లో ఉరి తీసిన ధీనగాథలు,తన కులగురువులైన’’ప్రధాన్‌’’ల గేయాల ద్వారా విన్న యువ భీమ్‌..లో..తమ జాతి స్వేచ్ఛకై పోరాట బీజాలు నాటు కుంటాయి. భీమ్‌ ప్రధాన నాయకత్వానికి సహాయకులుగా,కురంగ రాము, కురిసెంగ సాము, కుమార లింగు, ఆత్రంరఘు, మడవి సోము, రాజు పటేల్‌, తదితరులు ఉండగా ఈ నవలలో ప్రధాన స్త్రీ పాత్రలు రెండు రెండు ఉన్నాయి. ఒకటి భార్య సొంబాయి, ముఖ్య అను చరుడు రాము భార్య జంగుబాయి,నిజాం పాలకుల పక్ష అధికారులైన అబ్బాస్‌ అలీబేగ్‌, సిద్దఖి, హజర్‌ హాసన్‌, పట్వారీ దేశ్‌ పాండే, లు.. గోండు ప్రజలను చిత్రహింసలకు గురి చేసిన క్రూర పాత్రలుకాగా, పైకాజి, మహ్మద్‌ ఆలీ, లు భీమ్‌ పోరాటంలోని న్యాయ, ధర్మం గురించి ఆలోచించిన సౌమ్య పాత్రలు. తిర్మాజి అనే పత్రికా సంపాదకుడు భీమ్‌ పోరాటానికి చేయుత నిచ్చిన అక్షర సేనాని. ఇక గోండు జాతికి చెందిన ‘‘కుర్దూ’’ దురాశతో స్వార్థంతో పటేల్‌ పదవికి ఆశపడి భీమ్‌ పోరాట వ్యూహాలు, నైజాం పోలీసులకు చేరవేసే వెన్నుపోటు దారుడుగ చిత్రించబడ్డాడు. ఈ నవలలో అత్యంత ప్రధాన ఘట్టం ‘‘జోడేఘాట్‌’’ కేంద్రంగా గోండులకు నైజం సైన్యానికి జరిగిన యుద్ధం, కొమరం భీం సంఘటిత నేతృత్వానికి భయపడిన నిజాం అధికారులు కుట్రలో భాగంగా భీమ్‌ కు 30 ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వడానికి ఆశ చూపిన, నిస్వార్ధంగా దాన్ని తృణప్రాయంగా తిరస్కరించి తన యావత్‌ జాతి సముద్దరణ ప్రధాన ధ్యేయంగా.. పోరాటానికి సిద్ధం అవుతాడు. ప్రతి ఘట్టంలో భీమ్‌ పాత్రను ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ చిత్రించడంలో రచయిత నేర్పు అక్షర అక్షరాన అగుపిస్తుంది, తన అనుచర వర్గంలో ఆత్మస్థైర్యం నింపడంలో భీమ్‌ కృషి, మాటల తీరు, రచయిత దృశ్యిక రించిన వైనం అద్భుతంగా సాగుతుంది. ఆధునిక ఆయుధాలు కలిగిన నైజాం సైనికులతో ఆత్మస్థైర్యంమే ప్రధాన ఆయుధంగా సాధారణ ఆయుధాలతో అసాధారణమైన పోరాటం చేసిన భీమ్‌ యుద్ధ నైపుణ్యంను కళ్ళకు కట్టినట్టు అక్షరీకరించిన తీరు కూడా ఆచరణీయం, కథ చారిత్రాత్మకమైన వాస్తవ చిత్రాలతో పాఠకులను ఆనాటి కాలానికి నడిపించుకుంటూ వెళుతుంది ప్రత్యక్షంగా ఎదిరించలేక నిజాం సైన్యం కుట్రదారుడు అయినా కుర్దూ సహకారంతో భీమ్‌ స్థావరాలపై అర్ధరాత్రి దాడి చేసినిప్పు పెట్టి, భీంను అతని అనుచర గణాన్ని అంతం చేసిన నైజాం పోలీసు మూక విజయగర్వంతో వెనుతిరుగగా, ఏడాది కొడుకును ఎత్తుకొని వచ్చి ఆరని మంటల వెలుగుతున్న భర్త మృతదేహం పక్కన మోకాళ్ళ మీద కూర్చుని, భర్త మొహాన్ని కడసారి చూసుకుని, వెలుగుతున్న దివిటీని ఒక చేత, ఏడాది కొడుకుని చంకలో ఎత్తుకుని భీమ్‌ భార్య ‘‘సొమ్‌ బాయ్‌’’ అడవిలోకి వెళ్ళి పోవడంతో నవల ముగుస్తుంది. ఒక వీరుడి మరణం తో పోరాటం ఆగదనే అక్షర సత్యాన్ని భీమ్‌ జీవన చిత్రం ద్వారా అనితర సాధ్యంగా చెప్పడంలో రచయిత కృషి విశేషంగా ఉంది, మనకున్న అనేక చారిత్రక నవలల్లో ఒక భిన్నమైన, నిజమైన, చారిత్రక నవల ఈ ‘‘భీం నవల’’ అక్షరీకరించిన రచయిత కృషి ఎన్నటికీ వన్నె తగ్గదు. డాక్టర్‌ అమ్మిన శ్రీనివాస రాజు

1 2