బాల్యం అంద‌మైన జ్ఞాప‌కం

పాపం పుణ్యం ప్రపంచ మార్గం/ కష్టం సౌఖ్యం శ్లేషార్ధాలూ/ ఏమీ ఎరుగని పూవుల్లారా/ ఆకసమున హరివిల్లు విరిస్తే/ అవి మీకే అని ఆనందించే/ కూనల్లారా’ అంటూ బాలలను ముద్దు చేస్తాడు మహాకవి శ్రీశ్రీ. కష్టసుఖాలు ఎన్నున్నా సంపూర్ణ ఆరోగ్యంతో… విజ్ఞానవంతులు కావాలి బాలలు. వారు దేశ భవితకు వనరులు…వారధులు… ఆశాదీపాలు.వారి శ్రేయస్సే దేశాభివృద్ధికి మూలం. అందుకే అంటారు…‘నేటి బాలలే రేపటి పౌరులు’ అని. బాల్యాన్ని ఆనందంగా…ఆరోగ్యవంతంగా అనుభవించడం ప్రతి చిన్నారి జన్మహక్కు. ఎవరికై నా బాల్యం ఒక అందమైన జ్ఞాపకం. ‘స్వచ్ఛ మైన పువ్వులు/విచ్చుకున్నబంధాలు/పెంచుకున్న అను బంధాలు/చిన్ననాటి జ్ఞాపకాలు’అనిఓకవి అంటాడు. మనిషి వ్యక్తిత్వం బాల్యాన్ని పెనవేసుకునే వికసి స్తుంది. మనిషిగా ఎంత ఎదిగినా…బాల్యపు జ్ఞాప కాలు…అనుభవాలు అప్పుడప్పుడు తట్టి లేపుతూనే వుంటాయి. అమ్మ లాలిపాట, గోరుముద్దలు, నాన్న మురిపెం,అమ్మమ్మ,నానమ్మ,తాతయ్యల గారా బాలు…అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, అత్తామామల ప్రేమానురాగాల మధ్య బాల్యం ఆనందంగా గడిచిపోతుంది.అందమైన జ్ఞాపకంగా మిగిలి పోతుంది. తిరిగిరాని బాల్యాన్ని తలచుకొని ‘నా సర్వస్వం నీకిచ్చేస్తా… నా బాల్యం నాకు ఇచ్చెరు’ అంటాడు సినారె. బాల్యం అంటే…రంగురంగుల అనుభూతులే కాదు… మింగుడుపడని విషాదాలూ వుంటాయి.తన ప్రమేయం లేకపోయినా అనుభ వించక తప్పని కష్టాలూ వుంటాయి.
చిట్టిచిట్టి చేతుల చిన్నారులు బాల కార్మికుల వుతున్నారు. ఆడిపాడాల్సిన వయస్సులో నాలుగు గోడల మధ్య బందీ అవుతున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో విజ్ఞానవంతులు కావాల్సిన పిల్లలకు తగిన ఆదాయాలు లేక తల్లిదండ్రులు పౌష్టికాహారం అందించలేకపోతున్నారు. గర్భస్థ శిశువు నుండే అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. తక్కువ బరువుతో పుట్టడం,అంగవైకల్యంతో పుట్టడం వంటి కారణాల వల్ల వీరు మిగతా పిల్లలతో సమానంగా వుండలేకపోతున్నారు. చిన్నారుల్లో పోషకాహార లోపాలు, వయసుకు తగిన బరువు లేకపోవటం, శిశు మరణాల రేటు వంటి అంశాలను పరిగణ నలోకి తీసుకున్న ‘ప్రపంచ ఆకలి సూచీ-2021’ లో…107 దేశాలతో పోల్చితే మన దేశం 94వ స్థానంలో వుంది. దేశంలోని ప్రజల ఆదాయం, ఆర్థిక అసమానతలు వంటి అంశాలను లెక్క తీసు కుంటే… ‘ప్రపంచ ఆహార భద్రత సూచీ-2021’లో 113 దేశాలతో కూడిన ఈజాబితాలో మనం 71వ స్థానంలో వున్నాం. చిన్నతనంలో ఎదుర్కొనే సమ స్యలు పిల్లల భవిష్యత్‌పై ప్రభావం చూపుతాయని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా విద్య,ఆరోగ్యం,గృహవసతి,పోషకా హారం,పారిశుధ్యం,నీరు అందుబాటులో లేని పిల్లల సంఖ్య 120కోట్లు ఉండగా,కోవిడ్‌ కారణంగా మరో 15కోట్ల మంది అదనంగా యునిసెఫ్‌ అధ్య యనం వెల్లడిరచింది. బాలల జనాభా అత్యధి కంగా గల భారత్‌లో కూడా దీనిప్రభావం భారీ గానే వుంటుందని ఈ నివేదిక నొక్కి చెబుతోంది.
అమ్మమ్మ, నానమ్మ ఇళ్లల్లో ఆటపాటల మధ్య సాగిపోయే బాల్యం…నేడు ఒంటరిపాలైంది. కుం చించుకుపోయిన కుటుంబ వ్యవస్థలో…ఇరుకు ఇళ్ళలో..పలకరింపులు కూడా మరిచి, ప్రపంచీ కరణ వలలో చిక్కుకుపోయిన తర్వాత అందమైన బాల్యం,బాల్య స్నేహాల బంధమెక్కడిది? ప్రభుత్వాలు రుద్దిన ఆర్థిక భారాలతో భార్యాభర్తలిద్దరూ ఉద్యో గాలు చేయాల్సిన పరిస్థితి అనివార్యంగా ఏర్ప డిరది. పిల్లల మంచిచెడ్డలు చూడడమూ కష్టతర మౌతోంది. ఏబిడ్డకైనా తల్లి తొలి గురువు. తల్లిదం డ్రులతో పాటు పెద్దలు నేర్పిన నీతి,బాధ్యతలు మంచి పౌరులుగా ఎదగడానికి ఉపయోగపడ తాయి. ఇవన్నీ జరగాలంటే ప్రభుత్వాలు కనీస మౌలిక వసతులను కల్పించాలి. ఆహ్లాదకరమైన వాతావరణం…మౌలిక వసతులు కల్పించడం మన బాధ్యత. ‘బాల బాలికలందరికీ ప్రభుత్వ పాఠ శాలల్లో ఉచితంగా చదువు నేర్పాలి. బాలబాలికలు పని చేసే పద్ధతిని నిర్మూలించాలి. అలాంటి ఒక సుహృద్భావ వాతావరణంలో పిల్లలు ఎదగాలి. ‘మీదే మీదే సమస్త విశ్వం/మీరే లోకపు భాగ్య విధాతలు/ మీ హాసంలో మెరుగులు తీరును/ వచ్చే నాళ్ల విభాప్రభాతములు’ అంటాడు శ్రీశ్రీ. చిన్నారుల మోమున హాసం మెరిసినప్పుడే నిజమైన ‘బాలల దినోత్సవం’.
బాలల హక్కులపై సమత అవగాహన సదస్సులు
బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా సమత ఆధ్వర్యంలో పలు గిరిజన గ్రామాలు,పాఠశాలల్లోని విద్యార్ధులకు అవగాహన సదస్సలు నిర్వహించింది. బాలల హక్కుల వారోత్సవాలపై యూనిసెఫ్‌ నవంబరు 14 నుంచి 20వరకు వారోత్సవాలు నిర్వహించడానికి పిలుపు నిచ్చింది. ఇందులో భాగంగా సమత సరుగుడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల,రామన్నపాలెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించింది. ఈసందర్భంగా గోడపత్రికలను స్థానిక ఉపాధ్యాయులు,సరుగుడు పంచాయితీ సర్పంచ్‌, గిరిమిత్ర సొసైటీ అధ్యక్షుడు బండి గంగ రాజు, సమత డైరెక్టర్‌ విక్కీ,కో`ఆర్డినేటర్లు కె.సతీష్‌, జి.సైమన్‌లతో కలసి సరుగుడు యూపీ స్కూల్‌ ప్రదానోపాధ్యాయుడు డి.సుబ్రహ్మణ్యే శ్వరరావు కలసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో విద్యా ర్ధినీ, విద్యార్థులు బాలల హక్కులపట్ల భారత రాజ్యాంగం బాలలకు కల్పించిన హక్కులపై వారి కున్న అనుభవాలను లఘునాటికల ద్వారా ప్రదర్శిం చారు. అనంతరం విద్యార్థులు ప్లకార్డులతో బాలల హక్కుల పరిరక్షిద్దాం..పిల్లల హక్కులను భాగస్వా మ్యం కల్పిద్దాం..నేటిబాలలే..రేపటి పౌరులు, పరిసరాల పరిశుభ్రత మన హక్కు అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమాన్ని పురస్కరించుకొని సమత డైరెక్టర్‌ విక్కీ,సత్తీష్‌ కుమార్‌ పిల్లలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు,విధులపై వివరిం చారు.
కందుకూరి సతీష్‌ కుమార్‌

ఆ గాలిలోనే గ‌ర‌ళం

దేశ రాజధాని నగరంఢిల్లీ మరోసారి వణికిపోతోంది. వాయ కాలుష్యం అమాంతంగా పెరిగిపోయింది. వాయ నాణ్యత దారుణంగా క్షీణిస్తుండటంతో ఆందోళన రేగుతోంది.ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి కారణమేంటంటే.. దేశ రాజధానికి ఉన్న ఒకే ఒక పెను సమస్య వాయు కాలుష్యం. ప్రతియేటా అక్టోబర్‌-నవంబర్‌-డిసెంబర్‌ వస్తే చాలు కాలుష్యం మరింతగా పెరిగిపోతుంటుంది. ఢిల్లీలో హఠాత్తుగా కాలుష్యం రేటు 14శాతంగా నమోదై ఆందోళన కల్గించింది. ఇంత పెద్దమొత్తంలో కాలుష్యం నమోదవడం కలవరం రేపుతోంది. ఇటీవల కురిసిన తేలికపాటి వర్షాలతో కాస్త ఉపశమనం కలిగినా.. మళ్లీ గాలి నాణ్యత క్షీణించడం ప్రారంభమైందని ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ సూచించింది. పంట వ్యర్ధాల్ని ప్రతియేటా అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ మధ్యలో రైతులు అక్కడే పొలాల్లో తగల బెడుతుంటారు. ఇదంతా ఢిల్లీ సరిహద్దు లోని హర్యానా, రాజస్థాన్‌,ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో జరుగు తుంటుంది. ఆ పొగంతాఢిల్లీను కమ్మేస్తుం టుంది. ఒక్కసారిగా 14శాతం కాలుష్య రేటుకు కారణం కూడా పంటవ్యర్ధాల్ని తగలబెట్టడ మేనని తెలిసింది. ఇండియన్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ అందించిన డేటా ప్రకారం పంజాబ్‌లో గత రెండ్రోజుల్లోనే 1089 పంట వ్యర్ధాల్ని తగలబెట్టారు. అదే విధంగా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హర్యానాల్లో 1789 పంటవ్యర్ధాల్ని కాల్చారు. పొరుగు రాష్ట్రాల ప్రభావంతోనే ఢల్లీిలో వాయు కాలుష్యం(ణవశ్రీష్ట్రఱ Aఱతీ ూశీశ్రీశ్రీబ్‌ఱశీఅ) పెరుగు తోంది. పదిరోజుల్లో జరిగిన సంఘటనల కంటే రెండ్రోజుల్లో నమోదైన పంట వ్యర్ధరాల తాలూకు పొగ ఎక్కువగా ఉందని డేటా చెబుతోంది. సాధారణంగా అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో వరికోతలుంటాయి. ఆ తరువాత గోధుమ, బంగాళాదుంప సాగు చేస్తారు. పంట అవశేషాల్ని త్వరగా తొలగించే ప్రక్రియలో భాగంగా రైతులు వ్యర్ధాలకు నిప్పు పెడుతుంటారు. ఢిల్లీఎన్‌సీఆర్‌(ణవశ్రీష్ట్రఱ చీజR) పరిధిలో వాయు కాలుష్యం పెరగడానికి ఇదే ప్రధాన కారణంగా ఉంటోంది.
ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో పెరుగుతున్న కాలుష్యం వల్ల ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య వారంలో 22 శాతం నుంచి 44శాతానికి పెరిగింది. అయితే ఈ ప్రాంతంలోని ప్రజలు కాలుష్యం తగ్గించడానికి మూడు రోజుల లాక్‌డౌన్‌ విధించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తు న్నారు. తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌ లోకల్‌ సర్కిల్స్‌ సర్వే ప్రకారం.. రెండో వారంలో వాయు కాలుష్యం అధికంగా పెరిగింది. ప్రజల పరిస్థితి మరింత దిగజారింది.86 శాతం ఢిల్లీ-ఎన్‌సిసిఆర్‌ కుటుంబాలలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు విషపూరిత గాలి ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటున్నారు. దాదాపు 56 శాతం కుటుంబాల్లో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందిలో గొంతునొప్పి, కఫం, గొంతు బొంగురుపోవడం, కళ్ల మంటలు వంటి సమస్యలు ఉన్నాయి. ఈ సర్వేలో ఢిల్లీ, గుర్గావ్‌, నోయిడా, ఘజియాబాద్‌, ఫరీదాబాద్‌లకు చెందిన 25000 మందికి పైగా ప్రజల అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ నగరాల్లో గాలి నాణ్యత సూచిక 300-1000 మధ్య ఉంది. సర్వే ప్రకారం..’’ గత రెండు వారాల్లో డాక్టర్‌ లేదా ఆసుపత్రిని సందర్శించే వారి శాతం రెండిరతలు పెరిగింది. సహాయం కోరే కుటుంబాలు 22 శాతం నుంచి 44 శాతానికి పెరిగాయి.
ప్రపంచంలోనే టాప్‌ పొల్యూటెడ్‌ సిటీ ఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. దీపావళి పండుగ తర్వాత నుంచి పరిస్థితి మరింత దిగజారుతూ వస్తున్నది. ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నా మాస్క్‌ పెట్టుకోవాల్సిన దుస్థితి ఎదురవుతున్నది. శీతాకాలం మంచుతో పాటు కాలుష్యం తోడవడంతో ప్రపంచంలోనే అత్యంత కాలుష్యం ఉన్న పది నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచి.. చెత్త రికార్డును మూట గట్టుకున్నది. ఈ జాబితాలో ముంబై, కోల్‌కతా కూడా చేరాయి.స్విట్జర్లాండ్‌కు చెందిన క్లైమేట్‌ గ్రూప్‌ ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (IూA)ని తాజా జాబితాను విడుదల చేసింది. ఈ గ్రూప్‌ గాలి నాణ్యత, కాలుష్యాన్ని పర్యవేక్షిస్తుంటుంది. టాప్‌-10 జాబితాలో పాకిస్థాన్‌లోని లాహోర్‌, చైనాలోని చెంగు నగరాలున్నాయి. దేశ రాజ ధానిలో నెలకొన్న ఈ దుస్థితికి వాహనాల నుంచి వెలువడే కాలుష్యంతో పాటు పాటు పంజాబ్‌, హర్యానాల్లో వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం ప్రధాన కారణాలని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వ్యర్థాల విషయంలో రాష్ట్రాల మధ్య వాగ్వాదాలు జరుగుతూ వస్తున్నది. అలాగే యూపీలోని బులంద్‌షహర్‌, హాపూర్‌, నోయిడా, మీరట్‌, ఘజియాబాద్‌లోనూ ఏక్యూఐ 400కు పెరిగింది. రాజస్థాన్‌లోని జైపూర్‌, ఉదయపూర్‌, అజ్మీర్‌, పుష్కర్‌ సహా 15 జిల్లాల్లో కాలుష్యం పెరిగింది. వాయు కాలుష్యంతో ఊపిరితిత్తులకు నష్టం సీపీసీబీ ప్రకారం.. ఢిల్లీలోగాలిలో పీఎం2.5 స్థాయి శుక్రవారం అర్ధరాత్రి 300 మార్క్‌ను దాటింది. సాయంత్రం 4 గంటలకు క్యూబిక్‌ మీటర్‌కు 381 మైక్రోగ్రాములు. గాలి నాణ్యంగా ఉండా లంటే పీఎం 2.5 స్థాయి క్యూబిక్‌ మీటరుకు 60 మైక్రోగ్రాములుండాలి. ప్రస్తుతం ఆరు రెట్లు ఎక్కువగా కాలుష్యం ఉన్నది. పెరుగుతున్న వాయు కాలుష్యం ఊపరితిత్తుల క్యాన్సర్‌తో పాటు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరి స్తున్నారు. అత్యవసర సమయాల్లో తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని సూచిస్తున్నారు.
ప్రాణవాయువే… ప్రాణాంతకం
ప్రాణవాయువే…ప్రాణాంతకంగా మారితే అంతకన్నా ఘోరం ఉంటుందా? కాలుష్యం దెబ్బకు గాలి నాణ్యత గణనీయంగా పడి పోయిందనే కారణంతో ఏకంగా దేశరాజ ధానిలో కొద్ది రోజులు లాక్డౌన్‌ పెట్టే ఆలోచన చేస్తున్నారంటే ఇంకేమనాలి? దట్టంగా కమ్మేసిన వాయు కాలుష్యం… యమునా నదిని నింపేసిన విషపు నురగలతో జల కాలుష్యం…గత పది రోజుల్లో రెండున్నర వేలకు పైగా కొత్త డెంగ్యూ కేసులు…ఉన్నట్టుండి పెరుగుతున్న కోవిడ్‌ కేసులు -ఇలా ఢల్లీిలో పరిస్థితులు దయనీయం అనిపిస్తున్నాయి. సోమవారం సుప్రీమ్‌ కోర్టు వేసిన మొట్టికాయలను బట్టి చూస్తే, ఏయేటి కాయేడు పెరుగుతున్న కాలుష్య సమస్యపై దృష్టి పెట్టని పాలకుల నిర్లక్ష్యం వెక్కిరిస్తోంది. చలి పెరిగేవేళ, ప్రధానంగా కొయ్యకాళ్ళు కాల్చే అక్టోబర్‌ చివర నుంచి నవంబర్‌ వరకు ఒక పక్క వాతావరణం, మరోపక్క ఇతర కాలుష్యా లు కలగలిసి ఢల్లీిలో ఆరోగ్య సమస్యలు సృష్టిస్తున్నాయి. ఏడెనిమిదేళ్ళుగా ఇది చర్చనీ యాంశమే. ఈ ఏడాది పంటకోతలు ఆలస్యమై, అక్టోబర్‌లో పరిస్థితి మెరుగ్గా ఉంటుందని ఆశలు రేపింది. కానీ,నవంబర్‌ మొదట్లో దీపావళి టపాసులు,పక్క రాష్ట్రాలలో పెరిగిన పంట వ్యర్థాల మంటలు తోడై,ఈ నెలలో తొలి పది రోజులూ ఢిల్లీలో వాయుకాలుష్యం తారస్థా యికి చేరింది. గాలి గరళంలా మారడంతో నవంబర్‌ 13న సుప్రీమ్‌ కోర్టు కొరడా జుళిపిం చింది. ఢిల్లీ సర్కారు అత్యవసరంగా సమా వేశమై, కరోనా తర్వాత మొన్నామధ్యే తెరిచిన స్కూళ్ళను సైతం మూసేసి, నిర్మాణ కార్యక లాపాలకు బ్రేక్‌ ప్రకటించింది. లాక్డౌన్‌కు కూడా సిద్ధమైంది. ప్రపంచ కాలుష్య నగరాల్లో ముందు వరుసలో ఉన్న ఢల్లీిలో ఏడాది పొడుగూతా ‘వాయు నాణ్యత సూచి’ (ఏక్యూఐ) ఆందోళనకరమే. సగటున గంటకో చెట్టు నరికివేతకు గురవుతోందని లెక్కిస్తున్న ఢల్లీిలో దుమ్ము ధూళి,పరిశ్రమలు, వాహనాల లాంటి అనేక కాలుష్య కారణాలున్నాయి. కేవలం 3 వేల చిల్లర ప్రభుత్వ బస్సులే నడుస్తున్నాయనీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ పాలనలో గత ఏడేళ్ళలో కొత్త బస్సుల ఊసే లేదనీ ప్రతిపక్ష ఆరోపణ. ఏమైనా,ఢిల్లీలో ప్రైవేట్‌ వాహనాల సంఖ్య యథేచ్ఛగా పెరుగుతోంది. ఇక, పంటపొలాల మంటలు చుట్టుపక్కలి హర్యానా,పంజాబ్‌ మీదుగా రాజధాని దాకా వ్యాపిస్తున్న సమస్య. ఢిల్లీ హైకోర్టు, సుప్రీమ్‌ కోర్టు కొన్నేళ్ళుగా పంజాబ్‌ సహా అనేక ఉత్తరాది రాష్ట్రాలను కాలుష్యంపై హెచ్చరిస్తూనే వస్తున్నాయి. ఫలితం లేదు. యమునా నది శుద్ధీకరణకు రూ. 4 వేల పైగా కోట్లు పాలకులు ఖర్చు పెట్టారంటున్నా, జరిగిందేమిటో నురగ రూపంలో కనిపిస్తోంది. ప్రభుత్వాలు మాత్రం సమస్యను వదిలేసి, రైతుల తప్పును ప్రస్తావిస్తూ రాజకీయాలు చేస్తుండడమే విచారకరం. నిజానికి, పంట కోసేశాక, మిగిలిన వరి దుబ్బులనే ఇలా కాలుస్తున్నా రనుకోవడం తప్పు. పత్తి, చెరకు, కాయధాన్యాలు, గోదుమలు – ఇలా అనేక పంటలకు పంజాబ్‌, హర్యానాల్లో ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు. అందుకే, ఉత్తర భారతంలో కాలుష్య సమస్య మరింత తీవ్రంగా ఉంది. రైతుల వైపు నుంచి చూస్తే, కొయ్యకాళ్ళను వెంటనే తొలగిస్తే కానీ, తరువాతి పంట వేసుకోలేరు. అందుకు తగిన యంత్ర సామగ్రి అందుబాటులో లేకపోవడంతో, కాలుష్యమని తెలిసినా సరే కాల్చడమే మార్గమవుతోంది. ప్రభుత్వాలు ఈ సమస్య పరిష్కారంపై శ్రద్ధ పెట్టాలి. వాయు ఉద్గారాలు లేకుండా, పంట వ్యర్థాలను ఇంధనంగా, ఎరువుగా మార్చే చౌకైన, పోర్టబుల్‌ యంత్రాన్ని రూపొందించి, అవార్డందుకున్న ‘తకచర్‌’ సంస్థ లాంటి వాటి అనుభవాన్ని ఉపయోగించుకోవాలి. తాజా పర్యావరణ సదస్సు ‘కాప్‌-26’లో ప్రపంచ పరిరక్షణకు వాగ్దానాలు చేసిన మన ప్రభుత్వం, అంతకన్నా ముందుగా మన ‘జాతీయ రాజధాని ప్రాంతం’ (ఎన్సీఆర్‌)పై దృష్టి పెట్టడం అవసరం. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటికి రెండు మన నగరాలే కాబట్టి, నివారణ చర్యల్లో చైనా లాంటి దేశాల అనుభ వాలను ఆదర్శంగా తీసుకోవాలి. విద్య మొదలు ఆర్థిక వ్యవస్థ దాకా అన్నీ స్తంభించే లాక్డౌన్‌ లాంటివి తాత్కాలిక ఉపశమనమే తప్ప, దీర్ఘకాలిక పరిష్కారాలు కాలేవు. అందుకే, ఇప్పటికైనా ఉత్తరాది రాష్ట్రాల పాలకులను ఒకచోట చేర్చి, కాలుష్యంపై ప్రణాళిక రూపకల్పనకు కేంద్రం చొరవ తీసుకోవాలి. కాలుష్యానికి కారణం వ్యవసాయ వ్యర్థాలా, వాహనాలా, పారిశ్రామిక ఉద్గారాలా అనే రాజకీయ చర్చ, పరస్పర రాజకీయ నిందారోపణలు మాని, పనిలోకి దిగడం మంచిది. ఎందుకంటే, ఈ అసాధారణ వాతావరణ ఎమర్జెన్సీ వేళ అసాధారణ రీతిలో స్పందించడమే అత్యవసరం. మీనమేషాలు లెక్కిస్తే…మొదటికే మోసం!
ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత తీవ్రమైంది. స్థానిక పరిశ్రమల నుంచి, వాహనాల నుంచి వెలువడే పొగ కారణంగా అక్కడ ప్రతి శీతాకాలంలో వాయు కాలుష్యం తీవ్రమవుతుంది. ప్రతి ఏటా దీపావళి పటాసులవల్ల కూడా వాయు కాలుష్యం తీవ్రత పెరుగుతున్నది. ప్రస్తుతం ఢిల్లీ వాయు కాలుష్యం తీవ్రతపై ఓ సోషల్‌ మీడియా సంస్థ అధ్యయనం చేసింది. ప్రతి ఐదు కుటుంబాల్లో నాలుగు కుటుంబాలపై కాలుష్యం ప్రభావం పడిరదని తెలిపింది. ప్రతి ఐదు కుటుంబాల్లో నాలుగు కుటుంబాలవాళ్లు ఒకటి లేదా అంత కంటే ఎక్కువ అనారోగ్య సమస్యలతో బాధపడు తున్నారని వెల్లడిరచింది. సర్వే సంస్థ ఢిల్లీ, గుర్గావ్‌,నోయిడా,ఘజియాబాద్‌,ఫరీదాబాద్‌ లలో మొత్తం 34,000 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది.
సర్వేలో పాల్గొన్న వారిలో 66శాతం మంది పురుషులు, 34 శాతం మంది మహిళలు ఉన్నారు. 16 శాతం మంది గొంతు సమస్య లేదా దగ్గు లేదా రెండిరటితో బాధపడు తున్నారు. మరో 16 శాతం మంది ముక్కు కారడం, కండ్ల మంట సమస్యతో సతమత మవుతున్నారు. ఇంకో 16 శాతం మంది తాము శ్వాస సంబంధ సమస్య తో బాధపడు తున్నామని చెప్పారు.కేవలం 20 శాతం మంది మాత్రమే తమపై కాలుష్యం ప్రభావం లేదని తెలిపారు. ఇంకో 24శాతం మంది పైన పేర్కొన్న అన్ని రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరో 8 శాతం మంది కనీసం రెండు రకాల అనారోగ్య సమస్య లతో బాధపడుతున్నారు. ఇదిలావుంటే ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేవలం 28 శాతం మంది మాత్రమే ఎయిర్‌ ప్యూరిఫయర్స్‌ ఉపయో గించాలనుకుంటున్నారని,61శాతం మంది ప్రస్తుతం పరిస్థితిని తట్టుకునేందుకు యాంటీ పొల్యూషన్‌ మాస్కులను వినిగియోగిస్తున్నారని సర్వే సంస్థ తెలిపింది.

-జి.ఎన్‌.వి.సతీష్‌

రైతు గెలిచాడు

నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఏడాది నుంచి రైతులు చేసిన పోరాటానికి కేంద్రం దిగొచ్చింది. దేశంలో తీసుకొచ్చిన 3 నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. అన్నదాతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉం దన్న ప్రధాని…. వ్యవసాయ బడ్జెట్‌ ను ఐదు రెట్లు పెంచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా దేశ రైతులందరికీ క్షమాపణ చెబుతున్నట్లు ప్రధాని వెల్లడిరచారు. ‘గ్రామీణ మార్కెట్లకు సంబంధించి మౌలిక వసతులను బలోపేతం చేశాం.. పంటకు కనీస మద్దతు ధరను కూడా పెంచాం.. క్రాప్‌ లోన్‌ను రెండిరతలు చేశాం.. రైతుల సంక్షేమం కోసం ఎంత చేయాలో అంతా చేశాం.. రైతన్నల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేశాం.. చిన్న,సన్నకారు రైతులకు మేలు చేసేం దుకే కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చాం’ అన్నారు. ‘కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులను మేము ఒప్పించ లేకపోయాం. ఈచట్టాలపై వారికి అవగాహన కల్పించేందుకు ఎంతో చేశాం. మూడు సాగు చట్టాలను రద్దుచేస్తున్నట్టు మోదీ సంచలన ప్రకటన. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను రద్దుచేయాలని కోరుతూ గతేడాది నవంబరు 26 నుంచి రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
నవంబర్‌ 19న(శుక్రవారం) జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటిం చారు. సిక్కులకు అత్యంత పవిత్రమైన రోజున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు మోదీ పేర్కొ న్నారు. అయితే,కొత్త సాగు చట్టాల వల్ల చిన్న రైతులకు మేలు జరుగుతుందని మోదీ అంతకు ముందు వ్యాఖ్యానించారు. రైతులకు మేలు జరిగేలా ఈ చట్టాలను తీసుకొచ్చినా.. అర్ధం చేసుకోవడంలో విఫలమయ్యారని తెలిపారు. ఈ మూడు చట్టాలను వెనక్కు తీసుకునే ప్రక్రియ వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో పూర్తిచేస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. నవంబర్‌ నెలాఖరు నుంచి జరిగే పార్లమెంట్‌ సమా వేశాల్లోనే ప్రకటన చేస్తామని తెలిపారు. అలాగే, ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేస్తామని వెల్లడిరచారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రైతులు, నిపుణులు ఉంటారని తెలిపారు. ఈ కమిటీ నిర్ణయాల ఆధారంగా వ్యవసాయ రంగానికి సంబంధించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అన్నదాతల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. వ్యవసాయానికి బడ్జెట్‌లో కేటాయింపులు ఐదు రెట్లు పెంచామని తెలిపారు. రైతులకు తక్కువ ధరకే విత్తనాలు లభించేలా కృషిచేశామని పేర్కొన్నారు. 22 కోట్ల భూసార కార్డులను పంపిణికి చర్యలు చేపట్టా మని,ఫసల్‌ బీమా యోజనను మరింత బలో పేతం చేస్తామని వివరించారు. రైతులు ఆందోళనలను విరమించి ఇళ్లకు వెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ‘గ్రామీణ మార్కెట్లకు సంబంధించి మౌలిక వసతులను బలోపేతం చేశాం..పంటకు కనీస మద్దతు ధరను కూడా పెంచాం..క్రాప్‌ లోన్‌ను రెండిరతలు చేశాం.. రైతుల సంక్షేమం కోసం ఎంత చేయాలో అంతా చేశాం.. రైతన్నల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేశాం.. చిన్న, సన్నకారు రైతులకు మేలు చేసేందుకే కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చాం’ అన్నారు. ‘కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులను మేము ఒప్పించ లేకపోయాం. ఈచట్టాలపై వారికి అవగాహన కల్పించేందుకు ఎంతో చేశాం. అయితే రైతుల్లో ఒక వర్గం మాత్రం ఈ చట్టాలను వ్యతిరేకిం చింది. చట్టాలలో మార్పులు తీసుకొచ్చేందుకు కూడా సిద్ధమయ్యాం. వ్యవసాయ చట్టాల అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది’ అని పేర్కొన్నారు. పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గతేడాది నవంబరు 26నుంచి ఢల్లీి శివార్లలో రహదారులను దిగ్బంధం చేశారు. ఏడాదిగా రోడ్లపైనే తిష్ట వేసి..అక్కడే తిండి,అక్కడే నిద్ర. కొంత మంది తమ కుటుంబాలతో పాటు తరలివచ్చి ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. నిరసన తెలుపుతున్న వారిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారు.
రైతు విజయం
కేంద్ర మూడు నూతన సాగు చట్టాల రద్దు నిర్ణయం రైతు పోరాట ఘన విజయం. స్వాతంత్య్ర భారతాన సల్పిన ఉద్యమాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అపూర్వ ఘట్టం. నల్ల చట్టాల రద్దు కోరుతూ సంవత్సర కాలంగా ఢల్లీి సరిహద్దుల్లో లక్షలాది రైతులు బైఠాయించి ఆందోళనలు నిర్వహిస్తున్నా మొండిగా వ్యవహరించింది మోడీ సర్కారు. ఆందోళన చేస్తున్న అన్నదాతలపై పాశవిక నిర్బంధాలకు, కిరాతక దాడులకు ఒడిగట్టింది. రోజు రోజుకూ ఆసేతు హిమాచలం రైతు ఉద్యమం సంఘటితమవుతున్నదని గ్రహించిన మీదట ఇక తలవంచక తప్పదని భావించి స్వయంగా ప్రధాని రంగంలోకి దిగి మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. బిజెపి ఏమి చేసినా దాని వెనుక కచ్చితంగా రాజకీయ ప్రయోజనం ఉండి తీరుతుంది. ఏడాదిగా అప్రతిహతంగా సాగిస్తున్న రైతు ఆందోళనను చిన్న చూపు చూసిన బిజెపి, రైతాంగంలో, ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలను ఇటీవలి ఉప ఎన్నికల్లో చవి చూసింది. లఖింపూర్‌ ఖేరి మారణకాండ, కోర్టు మందలింపులు బిజెపిని ఇంటా బయటా రోడ్డుకీడ్చాయి. ఇప్పటికీ వెనక్కి రాకపోతే త్వరలో ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల్లో పార్టీ పుట్టి మునగడం ఖాయమని తలచి చట్టాల రద్దుకు ఉపక్రమించిందనేది బహిరంగ రహస్యం. చట్టాల రద్దుపై జాతి నుద్దేశించి చేసిన ప్రకటనలోనూ ప్రధాని తన మాటల గారడీని వదిలిపెట్టలేదు. రైతుల సంక్షేమం కోసమే చట్టాలను తెచ్చినప్పటికీ, కొన్ని వర్గాల రైతులకు సర్ది చెప్పలేకపోయామని పేర్కొని, అసలు చట్టాల్లో తప్పేమీ లేదంటూ నల్ల చట్టాలను తెల్లగా మార్చే ప్రయత్నం చేశారు. స్వేచ్ఛా మార్కెట్‌ కోసం ఎఎంసి రద్దు, కాంట్రాక్టు సేద్యం, నిత్యావసరాల నిల్వలపై పరిమితుల ఎత్తివేతకు ఉద్దేశించిన చట్టాలు కార్పొరేట్ల విచ్చలవిడి దోపిడీకి ఊతం ఇచ్చేవి. ఇప్పటి వరకు కొన్ని పంటలకు ఉన్న కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)ను హరించేవి. ఈ నేపథ్యంలో చట్టాలు చిన్న, సన్నకారు రైతుల సంక్షేమం కోసమన్న ప్రధాని వాక్కు నయ వంచన. రాజ్యాంగం ప్రకారం సమాఖ్య వ్యవస్థలో వ్యవసాయం రాష్ట్రాల పరిధి లోని అంశం. రాష్ట్రాలను పట్టించుకోకుండా, రైతులతో సంప్రదించకుండా ఏకపక్షంగా చట్టాలు చేశారు. ఈ వాస్తవాలను మోడీ తన ప్రకటనలో ప్రస్తావించకుండా దాచారు. వినాశకర చట్టాలు తెచ్చినందుకు ప్రధాని రైతులకు క్షమాపణ చెప్పలేదు. తెచ్చిన చట్టాలను అమలు చేయనందుకు కార్పొరేట్లకు క్షమాపణ చెప్పారు. ప్రస్తుతానికి చట్టాలను రద్దు చేసినా, ఇంకా వాటి ముప్పు తొలగి పోలేదని ప్రధాని మాటల్లో స్ఫురిస్తోంది.రైతులు కేవలం మూడు సాగు చట్టాల రద్దు కోసమే ఉద్యమం చేయడం లేదు. అన్ని పంటలకూ ఎంఎస్‌పి ని చట్టబద్ధ హక్కు చేయాలంటున్నారు. ప్రధాని ప్రకటనలో ఎక్కడా ఎంఎస్‌పి ప్రస్తావన లేదు. విద్యుత్‌ సవరణల చట్టం రైతులకు హానికరం. ఆ సవరణలను సైతం రద్దు చేయాలని రైతులు అడుగుతున్నారు. మూడు చట్టాల రద్దు ప్రధాని ప్రకటనతోనే జరగదు. పార్లమెంట్‌ ఆమోదిం చిన చట్టాలను రద్దు చేయాలంటే తిరిగి పార్లమెంట్‌లోనే చేయాలి. ఈ నెలాఖరులో జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో ఆ ప్రక్రియ కొనసాగిస్తామన్నారు ప్రధాని. అప్పటి వరకు వేచి చూస్తామన్న సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) నిర్ణయం సముచితమైనది. ఉద్యమ ప్రధాన డిమాండ్‌ ఎంఎస్‌పికి చట్టబద్ధత మీదా తేల్చుకోవాలన్న ఎస్‌కెఎం యోచన సరైనది. నలభై రైతు సంఘాలు కలగలిసిన ఎస్‌కెఎం నాయకత్వంలోని ఉద్యమం, ఆ పోరాటానికి అందుతున్న విశాల మద్దతు బృహత్తరమైనది. అంతటి ఒత్తిడి ఫలితంగానే విధి లేక కేంద్రం చట్టాల రద్దుకు దిగొచ్చింది. తమ ఉద్యమం తమ కోసమే కాదని, ప్రజలందరి కోసమని రైతులు నినదిస్తున్నారు. కార్మిక కర్షక ఐక్యత కూడా ఈ సందర్భంలో వెల్లివిరిసింది. కార్పొ రేట్లకు, వాటి అనుకూల ప్రభుత్వాలకు రైతు ఉద్యమం సింహస్వప్నంగా నిలిచింది. సుదీర్ఘ పోరాటంలో 750 మంది అమరులు కావడం మామూలు విషయం కాదు. మహత్తర రైతు ఉద్యమం అభినందనీయమైనది. ఇక్కడితో ఆగకుండా వ్యవసాయ, రైతు రక్షణకు మరింత ఉధృతంగా సంఘటిత ఉద్యమం కొనసాగితేనే అసలైన లక్ష్యం సిద్ధిస్తుంది.
తొలుత కేబినెట్‌ ముందుకు.. దాదాపు ఏడాది కాలంగా నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల చేస్తున్న ఆందోళనలతో కేంద్రం ఇటీవల దిగొచ్చింది. కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించడం తెలిసిందే.దాదాపు ఏడాది కాలంగా నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల చేస్తున్న ఆందోళనలతో కేంద్రం ఇటీవల దిగొచ్చింది. కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించడం తెలిసిందే.ఈ నేపథ్యంలో కొత్త చట్టాలను ఉపసంహరించుకునే ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్రం. నవంబర్‌ 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశంలో మూడు నూతన సాగు చట్టాల రద్దు ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు.
కొత్త చట్టాల రద్దు ఇలా..
గత ఏడాది ఇదే సమయంలో నూతన సాగు చట్టాలను ఆమెదించింది కేంద్రం. రైతులకు మేలు చేసేందుకే ఈ చట్టాలను తీసుకొచ్చినట్లు తెలిపింది. అయితే కొంత మంది రైతులు మాత్రం ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ.. దాదాపు ఏడాది కాలంగా నిరసనలు తెలుపుతున్నారు. దిల్లీ సరిహద్దుల్లో పలు మార్లు ఈ నిరసనల్లో హింస కూడా చెలరేగింది. ఈ పరిణామా లన్నింటి నేపథ్యంలో ఇటీవల గురునానక్‌ జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. కొత్త సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. రైతులు ఉద్యమం వీడి ఇళ్లకు వెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా రైతులకు క్షమాపణ కూడా చెప్పారు.అయితే సాగు చట్టాలు సన్నకారు రైతులను ఆదుకునేందుకే తెచ్చామని..కానీ అందరికీ దీనిని అర్థమయ్యేలా వివరించలేకపోయామని మోదీ పేర్కొన్నారు. మోదీ సర్కార్‌ సాగు చట్టాలపై వెనక్కి తగ్గడాన్ని విపక్షాలు.. ప్రముఖులు అందరూ స్వాగతిం చారు.
సాగు చట్టాల రద్దు ప్రక్రియ ఇలా..
సాగు చట్టాలను రద్దు చేసే ప్రక్రియ.. కూడా చట్టాలు ఆమలులోకి వచ్చిన విధంగానే ఉంటుంది. అంటే.. ఏదైనా చట్టం కావాలంటే పార్లమెంట్‌?లో అందుకు సంబంధఇంచి బిల్లు ప్రవేశ పెట్టాలి. దానికి పార్లమెంట్‌ ఆమోదం తెలిపితే చట్టంగా మారుతుంది. ఏదైనా చట్టాన్ని రద్దు చేయాలన్నా ఇదే ప్రక్రియ ఉంటుంది.
క్షమాపణ చెప్పిన ప్రధాని
2014లో తన ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని.. వారి అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చిందని చెప్పారు. రైతుల కష్టాలు తనకు తెలుసు కాబట్టి వ్యవసాయ రంగంలో సంస్కరణలకు ప్రాధాన్యమిచ్చానని చెప్పారు.వ్యవసాయ బడ్జెట్‌ను అయిదు రెట్లు పెంచామని.. ఏటా రూ.1.25 లక్షల కోట్లకు పైగా వ్యవసాయానికి వెచ్చిస్తున్నాం, రైతులకు తక్కువ ధరకే విత్తనాలు అందించేలా చర్యలు తీసుకున్నామని మోదీ చెప్పారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో ఈ చట్టాల రద్దుపై ప్రకటన చేస్తామని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన దేశంలోని రైతులందరికీ క్షమాపణ చెప్పారు. ‘ప్రభుత్వం ఈరోజే వ్యవసాయానికి సంబధించిన మరో కీలక నిర్ణయం తీసుకుంది. అదే జీరో బడ్జెట్‌ వ్యవసాయం, అంటే సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, క్రాప్‌ పాటర్న్‌ను శాస్త్రీయ పద్ధతుల్లో మార్చడానికి, ఎంఎస్‌పీని మరింత ప్రభావంగా, పారద ర్శకంగా మార్చడానికి, ఇలాంటి అన్ని విషయా లపై భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిదులు, రైతులు ఉంటారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఆర్థికవేత్తలు ఉంటారు’.
సుదీర్ఘ రైతు ఉద్యమంలో కీలక నేతలు ..
358 రోజుల అలుపెరగని రైతుల పోరాటం .. మోడీ ప్రభుత్వం దిగి వచ్చేలా చేసింది. రైతులకు క్షమాపణ చెబుతూ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కుతీసుకుంటున్నామని ప్రధాని ప్రకటించేలా చేసింది. వణుకు పుట్టించే చలి, వేసవిగాలులు, తుఫానులు వేటికీ వారు వెనుకంజ వేయలేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నల్ల చట్టాలతో వ్యవసాయాన్ని కార్పోరేట్లకు అప్పగించేది లేదంటూ ప్రతినబూనారు. మాజీ సైనికుడు, వైద్యుడు, ఎన్నికల సర్వే అధికారి, జాత్‌ నేత, మహిళా హక్కుల కార్యకర్త ఇలా కొందరు రైతుల నిరసనను ఏడాది పాటు కొనసాగించడంలో కీలక పాత్ర పోషించారు. కొందరి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ.. ఈ ఉద్యమంలో పాల్గన్న ప్రతి రైతు ఒక నాయకుడే. ఇది భారత్‌లో ప్రజా ఉద్యమాలను పునర్నిర్వచించింది. భవిష్యత్‌ ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది. వారి నాయకత్వంతో రైతుల మధ్య రాజకీయ విభజనను తగ్గించడంలో సహాయపడిరది. పంజాబ్‌,హర్యానా,ఉత్తర ప్రదేశ్‌ నుండి రైతులు ఉమ్మడి వేదికపై సమావేశమై సుదీర్ఘ కాలం పోరాడేందుకు మార్గం సుగమం చేసింది.
మహిళల పాత్ర
ఈ నిరసనలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం కీలకంగా మారింది. ఉద్యమంలో మహిళల గొంతును వినిపించేలా చేయడంలో హరీందర్‌ బిందు, జస్బీర్‌ కౌర్‌ నట్‌లు ముందంజలో ఉన్నారు. ప్రత్యేక మరుగుదొడ్లు వంటి వసతులు లేనప్పటికీ ట్రాక్టర్లు నడిపారు. విప్లవ గీతాలు పాడారు. జాతీయ రహదా రులను తమ నివాసాలుగా మార్చు కున్నారు. పితృస్వామ్య సమాజం, పురుష ఆధిక్య సమాజంలో పలువురు సామాజిక శాస్త్రవేత్తలు మహిళా మేల్కోల్పును చూశారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బికెయు) ఏక్తా ఉగ్రహాన్‌ మహిళా విభాగం ఇన్‌చార్జ్‌ హరీందర్‌ బిందు పంజాబ్‌లోని మారుమూల గ్రామాల నుండి మహిళలను ఉద్యమంలో నిమగం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆమె స్వయంగా నిరసన ప్రాంతంలోనే నెలల తరబడి ఉన్నారు. నిరసనలో చేరేలా పలువురు మహిళలను ప్రోత్సహించారు. పంజాబ్‌ వ్యవసాయ సంస్థలలో మహిళల భాగస్వామ్యాన్ని చూసి, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలోని తమ సహచరులు కూడా మహిళలను నిరసనలోకి తీసుకువచ్చేలా ప్రేరణ పొందారని, ఇది గొప్ప విజయమని ఆమె హరీందర్‌ అన్నారు. పంజాబ్‌లోని ప్రముఖ మహిళా రైతు నేతల్లో ఒకరైన జస్బీర్‌ కౌర్‌ తిక్రీ సరిహద్దుల్లోని నిరసనలో మహిళల పట్ల బాధ్యతగా వ్యవహరించారు. పంజాబ్‌ కిసాన్‌ మోర్చా రాష్ట్ర కమిటీ సభ్యులుగా జస్బీర్‌ వ్యవహరిస్తున్నారు. కాలేజీ రోజుల్లో దళిత హక్కుల కార్యకర్తగా పనిచేసిన ఆమె వ్యవసాయ రంగంలో మహిళల దుస్థితిని చూసి పోరాటం దిశగా వారిని నడిపించేందుకు నడుం బిగించారు.ఆమె కుమార్తె నవకిరణ్‌ నట్‌ కూడా ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. రైతు ఉద్యమాన్ని గురించి వివరించిన వార్తాపత్రిక ట్రాలీటైమ్స్‌ వ్యవస్థాపక సభ్యులలో నవకిరణ్‌ కూడాఉన్నారు. గతేడాది నుండి వీరిద్దరూ నిరసన ప్రాంతంలోనే ఎక్కువ సమయం గడిపారు.
డా. దర్శన్‌ పాల్‌
సంయుక్త కిసాన్‌ మోర్చా కింద వివిధ రైతు సంఘాలను ఏకం చేసి సైద్ధాంతిక రూపాన్ని అందించిన దర్శన్‌ పాల్‌ వైద్యుడని చాలా మందికి తెలియదు. పంజాబ్‌ సివిల్‌ మెడికల్‌ సర్వీస్‌లో అనస్థీషియా విభాగంలో పనిచేసే ఆయన 2000 సంవత్సరంలో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2016లో క్రాంతికారి కిసాన్‌ యూనియన్‌లో చేరడానికి ముందు రైతు సంఘాల కార్యకలాపాలలో పాల్గొన్నారు. అనంతరం ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఉద్యమంలో పాల్గనడమే కాకుండా నిరసన ప్రాంతంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం అందేందుకు కృషి చేశారు. రైతులకు రుణమాఫీ హామీ ఇవ్వాలని మొదటి నుండి ఆయన పోరాటం చేశారు. 2020 జూన్‌లో కేంద్రం వ్యవసాయ ఆర్డినెన్స్‌లకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించిన రైతు సంఘాల్లో ఆయనది కూడా ఒకటి. ఆల్‌ ఇండియా కిసాన్‌ సంఘర్ష్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ (ఎఐకెఎస్‌సిసి)లో సభ్యులు కూడా. పంజాబ్‌ నుండి ఉద్యమాన్ని ఢల్లీి వరకు తీసుకెళ్లడంలో పాల్‌ ముఖ్యపాత్ర పోషించారు. ఆయన ప్రేరణతోనే ఎఐకెఎస్‌సిసి సభ్యులు యుపి,రాజస్తాన్‌,కర్ణాటక, మహారాష్ట్ర నుండి రైతులను ఢల్లీి సరిహద్దులకు తీసుకువచ్చేందుకు కృషి చేశారు.
రాకేష్‌ తికాయత్‌
పశ్చిమ యుపికి చెందిన జాత్‌ నేత రాకేష్‌ తికాయత్‌ వ్యవసాయ ఉద్యమాన్ని పునరు ద్ధరించడంలో కీలకంగా వ్యవహరించారు. పంజాబ్‌,హర్యానా నుండి రైతు నిరసనను ఢల్లీికి మారినప్పటికీ కొన్ని నెలల పాటు తికాయత్‌ పేరు వినిపించలేదని రాజకీయవిశ్లేషకుడు అశుతోష్‌ కుమార్‌ తెలిపారు. రిపబ్లిక్‌ డే రోజున జరిగిన ట్రాక్టర్‌ ర్యాలీ అనంతరం రైతుల నిరసన విఫలమవుతుందనుకున్న సమయంలో తికాయత్‌ ముందుకు వచ్చారు. ఆయన ఉద్వేగ భరితమైన ప్రసంగాలు రైతులను ఉత్తేజ పరిచాయి. అనంతరం నిరసన మరింత బలంగా మారింది. తికాయత్‌ తండ్రి మొహీందర్‌ తికాయత్‌ కూడా వ్యవసాయ నేత అని, 1980లో కేంద్ర ప్రభుత్వాన్ని మోకరిల్లేలా చేశారని అశుతోష్‌ తెలిపారు. నిరసనలో కుల, మత విభజనలను తలెత్తకుండా ఉండేందుకు పలు మహా పంచాయత్‌లను నిర్వహించారు.
బల్బీర్‌ సింగ్‌ రేజ్వాల్‌
పంజాబ్‌ నుండి ఢల్లీికి ఉద్యమాన్ని తీసుకెళ్ల డంలో కీలకంగా వ్యవహరించిన మరో నేత బల్బీర్‌సింగ్‌ రేజ్వాల్‌. సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం)లో ప్రముఖంగా వ్యవ హరించారు. అనంతరం భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బికెయు)ని ఏర్పాటు చేసి రైతు ఉద్యమాన్ని బలోపేతం చేశారు. వివిధ సమస్యలపై పంజాబ్‌లోని రైతులను ఐక్యం చేసిన అనుభవం ఉద్యమంలో రైతులను సమీకరించడంలో ప్రముఖంగా నిలిచింది. వ్యవసాయ చట్టాల ఆర్డినెన్స్‌లను ప్రవేశపెట్టి నప్పటినుండి బల్బీర్‌ సింగ్‌ ట్రాక్టర్‌ ర్యాలీలు చేపడుతూ నిరసన తెలిపారు. అనంతరం ఢల్లీి సరిహద్దులోనూ ఉద్యమాన్ని నడిపించారు.
జోగీందర్‌ సింగ్‌ ఉగ్రహాన్‌
మాజీ సైనికుడైన జోగీందర్‌ సింగ్‌ ఉగ్రహాన్‌ పదవీ విరమణ అనంతరం వ్యవసాయం ప్రారంభించారు. 2002లో బికెయు (ఏక్తా ఉగ్రహాన్‌) స్వంత శాఖను ఏర్పాటు చేసుకు న్నారు. పంజాబ్‌లోని మాల్వా ప్రాం తంలో రైతుల ఉద్యమం సుమారు ఏడాది పాటు కొన సాగేలా చర్యలు చేపట్టారు. చిన్న, సన్నకారు రైతులతో ఉన్నప్పటికీ.. రైతు సంఘాల్లో అతి పెద్ద సభ్యత్వాన్ని కలిగి ఉందని మాజీ ప్రొఫెసర్‌ మంజిత్‌ సింగ్‌ తెలిపారు.
యోగేంద్ర యాదవ్‌
ఉద్యమ ప్రతినిధి యోగేంద్రయాదవ్‌ అనడంలో అసత్యం లేదనేలా ఉద్యమంలో యోగేందర్‌ పాలుపంచుకున్నారు. ఎన్నికల సర్వే అధికారి, కార్యకర్త అయిన యోగేంద్ర ఉద్యమాన్ని గురించి ఆంగ్లంలో అందరికీ చేరువయ్యేలా చేశారు. యోగేంద్ర యాదవ్‌ ఇంటర్వ్యూలు నిరసనలను ప్రపంచప్రేక్షకుల దగ్గరకు తీసుకువెళ్లాయి. నిరసనలపై అసత్యాలు ప్రచారం చేసినప్పుడల్లా మీడియా సమావేశాల ద్వారా ఎస్‌కెఎం వైఖరిని స్పష్టం చేశారు. (‘ది వైర్‌’ సౌజన్యంతో)
-గునపర్తి సైమన్‌

పర్యావరణానికి ప్రాణాధారం కాప్‌-26

భూమిపై జీవజాలం ఉనికికి ప్రమాదకారిగా మారిన వాతావరణమార్పులపై ప్రపంచదేశాలు మరోసారి దృష్టి సారించాయి. స్కాట్‌లాండ్‌ గ్లాస్గో నగరంలో కాన్ఫిరెన్స్‌ ఆఫ్‌ ద పార్టీస్‌(కాప్‌26) సదస్సు ఈ ఏడాది నవంబరులో జరిగింది. పన్నెండు రోజుల (నవంబర్‌ 1నుంచి 12తేదీల మధ్య ) పాటు జరిగిన సదస్సులో 197 దేశాలు పాల్గొన్నాయి. ప్రతిఏటా197దేశాల నుంచి 25వేల మంది ప్రతినిధులు హజరయ్యారు.వాతావరణమార్పులపై యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌ (ఖచీఖీజజజ) ఆధ్వర్యంలో జరిగే కన్వెన్షన్‌ ఇది. పర్యావరణంపై మానవకార్యకలాపాల ప్రభావాన్ని పరిమితం చేయడమేలక్ష్యంగా ప్రపంచంలోని ప్రతిదేశం,ప్రతి భూభాగం అంగీకరించి సంతకం చేసిన అంతర్జాతీయ ఒప్పందం కాప్‌.1994 మార్చి 21న తొలి ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 25 సమావేశాలు జరగ్గా,ఈ ఏడాది జరిగింది26వది.గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా పారిశ్రామిక విప్లవానికి పూర్వం ఉన్న ఉష్ణోగ్రతలు 1.5 సెల్సియస్‌ పెరుగుతున్నాయి.ఈ ఉష్ణోగ్రతలు ఇలా పెరుగుతూ పోతే భూమికి తిరిగి బాగు చేసుకోలేని ప్రమాదాన్ని సృష్టిస్తాయి. ఈసమ్మిట్‌లో కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయాలు,వ్యూహాలుసరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అన్నది చర్చించు కోవడానికే ఈ సదస్సును ఏర్పాటు చేశారు. పెట్రోలు,డీజిల్‌,బొగ్గు వంటి శిలాజఇంధనాలను మండిరచడంవల్ల భూమి నానాటికీ వేడెక్కుతోంది.వాతావరణ మార్పులతో ముడిపడిన తీవ్ర వడగాల్పులు,వరదలు,కార్చిచ్చు వంటి విఫత్తుల తీవ్రత పెరుగుతోంది.గడిచిన దశాబ్దం..అత్యంత ఉష్ణమయంగా రికార్డులకెక్కింది.ఈ నేపథ్యంలో వాతావరణ మార్పుల కట్టడికి తక్షణ చర్యలు అవసరమన్న నిపుణుల అభిప్రాయానికి ప్రపంచ నేతలు హజరయ్యారు. కాఫ్‌26 అన్ని వాతావరణ శిఖరాలలో అత్యంత ప్రత్యేకమైనది.సమ్మిట్‌లో కార్బన్‌ ఉద్గారాలను తగ్గించడానికి యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌ (ఖచీఖీజజజ) గుర్తించిన ప్రణాళికలను అమలు చేశామని యూకే ప్రభుత్వం చెప్పింది.

Read more

1 2