కరువు కోరల్లో బీడ్‌ కదలని ప్రభుత్వం

ఈఏడాది జనవరి నాటికే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభు త్వాలు 300జిల్లాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించాయి. వీటిలో మహారాష్ట్రలోని బీడ్‌జిల్లా ఒకటి. గతేడాది అక్టోబర్‌లోనే ఈ జిల్లాను కరువు ప్రాంతంగా గుర్తించారు. సీపీఐ(ఎం), కిసాన్‌ సభ జిల్లా నాయకులతో కలిసి నేను వివిధ తాలూకాల్లోని 25గ్రామాలలో వందలాది మంది బాధితులను కలిశాను. ఇప్పటికీ అక్కడ ఎటువంటి సహాయక చర్యలు కనుచూపు మేరలో కనిపించటం లేదు. పంట నష్టాన్ని అంచనా వేయటానికి ఒక్క ప్రభుత్వ బ ృందం కూడా గ్రామాల్ని సందర్శించలేదు.
ఎండిన పంటలను పొలాల నుంచి తొలగించాల్సి ఉన్నా అవి తీసేస్తే తమకు బీమా సొమ్ము అందదేమోనన్న భయంతో రైతులు వాటిని అలాగే ఉంచేశారు. మేం కలిసిన ప్రతి రైతూ అప్పుల్లో కూరుకు పోయి ఉన్నారు. అయినా ప్రభుత్వ సహకారం అందుతుందన్న ఆశ వారికి ఏమాత్రం లేదు. వ్యవసాయ కార్మికులు ముఖ్యంగా మహిళా కార్మికుల దుర్భర పరిస్థితి కొట్టొచ్చినట్టు కనిపించి మా మనసుల్ని కలచివేసింది. చాలా గ్రామాలలో కుటుంబంలోని పురుషులు ఇతర పనులు వెతుక్కుంటూ వలస వెళ్లిపోయారు.ఈప్రాంతం కరువు ప్రభావిత జిల్లాగా గుర్తించినప్పటికీ గ్రామీణ ఉపాధి పథకం కింద అవసరానికన్నా చాలా తక్కువ పని దొరకటం దీనికి ప్రధాన కారణం. బీడ్‌జిల్లాలో 2018-19సంవత్సరానికి కేవలం 43రోజులు మాత్రమే ప్రభుత్వం పని కల్పించింది.
జిల్లావ్యాప్తంగా గ్రామస్థాయి సమావేశాలు వేసి వాటిలో వచ్చిన అభిప్రాయాలు, వాస్తవ పరిస్థితిపై ప్రతినిధి బృందం కలెక్టర్‌కు నివేదిక అందజేసింది. మోడీ ప్రభుత్వం తయారు చేసిన ‘కరువు సహాయక మార్గదర్శకాలు 2016’లో కూడా ఈజిల్లా రైతులకు అన్యాయం చేశాయనేది వారి అనుభవం ద్వారా తెలుస్తోంది.
నష్ట తీవ్రత-పరిహారం, సహాయం
బీడ్‌లోని మొత్తం 11తాలూకాలను కరువు ప్రాంతాలుగా గుర్తించారు. అయితే నష్టాన్ని అంచనా వేయలేదు. నష్ట పరిహారం, బీమా చెల్లింపునకు ఇదే కీలకం. గతంలో జరిగినట్టే నష్టశాతాన్ని తక్కువ చేసి చూపించి సరైన పరిహారం ఇవ్వకుండా ఎగవేస్తారని రైతులు భయపడుతున్నారు. ఈ ఐదేండ్లలో కేవలం 2017లో మాత్రమే వర్షాలు పడటంవల్ల మిగిలిన నాలుగేండ్లూ ప్రజలు కరువుతో సతమత మయ్యారు. ఈ ప్రాంతంలో చెరకు, పత్తి, సోయా, కందులు, సజ్జలు, జొన్న సాగు చేస్తారు. కరువుకు తోడు 2016నుంచి బీటీ పత్తికి ‘బొండాలి’ పురుగు సోకుతోంది. దీని నివారణకు ఎరువులు, పురుగు మందులూ అధికంగా వాడటం వల్ల ఎకరాకి అయ్యే ఖర్చు పెరిగింది. రైతులు చెప్పినదాన్ని బట్టి వర్షాభావం వల్ల 80శాతం ఖరీఫ్‌ పంట, దానికి కొంచెం అటూ ఇటూగా రబీ పాడైంది. అప్పుల్లో మునిగిపోయి, గత 8నెలలుగా ఆదాయం లేక తల్లడిల్లుతున్న రైతులకు ప్రభుత్వ సహాయంగాని, బీమా పరిహారంగానీ ఇచ్చేందుకు అటు ప్రభుత్వం, ఇటు అధికారులు ఎలాంటి శ్రద్ధా చూపలేదు.
అరకొర రుణాలు-అప్పుల గాయాలు
ఒకవైపు ప్రభుత్వం పంట రుణ పథకాల గురించి ఊదర కొడుతున్నప్పటికీ మేం కలిసిన రైతుల్లో చాలామంది బ్యాంకుల నుంచి రుణాలను పొందలేదు. అనేక ఆందోళనలు చేసినా బ్యాంకుల నుంచి ఎలాంటి సమాధానం లేదు. పర్లి తాలూకా మందఖేల్‌ గ్రామంలో రుణం కోసం బ్యాంకుకు వెళ్లిన చెరుకు రైతులను ‘షుగర్‌ మిల్లు యజమానుల నుంచి గ్యారంటీ లెటర్‌ తెస్తేనే లోన్లు ఇస్తామ’ని అధికారులు తిప్పి పంపేశారు. ఇప్పటికే రాజకీయ ప్రాబల్యం కలిగిన యజమానులకు ఈచర్య మరింత బలాన్ని ఇవ్వటమే కాక చెరుకు రైతులపై వారి పట్టు మరింత బిగుస్తుంది. ఆప్రాంతంలోని అన్ని బ్యాంకులలో ఇదే పరిస్థితి ఉంది.
మహారాష్ట్ర ప్రభుత్వ రుణ మాఫీ పథకం వల్ల లాభపడిన ఒక్క రైతు కూడా మాకు కనిపించలేదు. బ్యాంకులు తమకు రుణాలు ఇవ్వకుండా వివక్ష చూపి తమను శిక్షిస్తున్నాయని వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులుచేసి ఇబ్బందులపాలవుతున్న రైతులు వాపోయారు. ధానూ ర్లో జరిగిన సమావేశంలో రైతు బాబా సాహెబ్‌ పవార్‌ మాట్లాడుతూ ‘బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం వల్లే రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేస్తున్నారు. అటువంటి వారికి ప్రభుత్వం ఇప్పుడు కరువు సాయం అందించననటం న్యాయమా?’ అని కన్నీటితో ప్రశ్నించాడు. అయితే తమ అప్పుల వివరాలను బహిరంగంగా చెప్పటానికి రైతులు నిరాకరించారు. ‘మాకు ఎంత అప్పు ఉన్నదీ పబ్లిగ్గా చెబితే మా పరువు పోవటమే కాదు. రేపు ఇంకా ఎక్కడా అప్పు పుట్టదు. అందుకే మేము ఆ వివరాలు చెప్పలేం’ అని ఒకవృద్ధ రైతు సమావేశం అనంతరం మాతో తమ వ్యధ చెప్పుకున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి? ఒక వైపు అప్పుల భారాన్ని తమ భుజాలపై మోస్తున్నా దాని బరువును బయట పెట్టటానికి రైతులు ఒప్పుకోరు. కానీ ఆ భారంవల్ల కలిగే బాధను దాచుకోవటం సాధ్యమా?
యంత్రాలు మాట్లాడవు!
బీమా కంపెనీలతో రైతులకు అనేక చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఈఏడాది బీడ్‌ జిల్లాలో చెరుకు రైతులకు బీమా సౌకర్యం లేదు. ఎందుకని అడిగితే ప్రీమియం చాలా ఎక్కువ వున్నదని, రైతులు దానిని కట్టలేరని అధికారుల సమాధానం. అయితే వారు అసలు తమని ఎప్పుడూ సంప్రదించలేదని రైతులు చెప్పారు. ఈ విషయంలో మరింత లోతైన విచారణ జరగాల్సి ఉంది.
మజల్‌గావ్‌ ప్రాంతంలోని ధర్మేవాడి గ్రామంలో రైతులబ ృందం తమ అనుభవాలను తెలిపారు. పత్తి రైతు సందీపన్‌ భుంభ్లే మాట్లాడుతూ.. ‘2017లో నేను ఎకరా పత్తి పంటకు రూ.1200 బీమా చెల్లించా. వర్షం బాగానే ఉన్నా బొందాలి పురుగు ఆశించడంతో 10క్వింటాళ్లకి బదులు 6క్వింటాళ్లే పండిరది. బీమా కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం చాలా కష్టమైంది. మా ఊళ్లో ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ చాలా బలహీనంగా ఉంటుంది. దీనివల్ల ఆన్‌లైన్‌లో పూర్తిచేయాటానికి చాలా సమయం వృధా అయింది. నేను చెల్లించిన ప్రీమియం రసీదు నా దగ్గరే ఉంది కానీ ఏం ఉపయోగం? గతంలో బీమా ఏజంటుని మేం నేరుగా కలుసుకుని మా అనుమానాలన్నీ అడిగే వాళ్ళం. ఇప్పుడు మిషను మాత్రమే ఉంటుంది. యంత్రాన్ని ఏమని అడగగలం? నా పంట నష్టాన్ని అంచనా వేసి, బీమా సొమ్ము ఇవ్వటానికి ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూసేవాణ్ణి. ఎవ్వరూ రాలేదు. పరిహారం కింద ఒక్క పైసా కూడా అందలేదు. బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసుకి వెళ్ళటంవల్ల సమయం వ ృధాయేనని వదిలేశా’.
పశువులు – పశుగ్రాసం
అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 5లక్షల ఆవులు, 2.6లక్షల ఎడ్లు, 2.4లక్షల గేదెలూఉన్నాయి. పశువులపోషణ, డైరీ ఫారం నిర్వహణ ఇక్కడి ముఖ్య ఆదాయ వనరు. అయితే పశుగ్రాసం, నీళ్లు కొరత వల్ల పశువులను పోషించటం చాలా కష్టంగా ఉంది. అందువల్ల అన్ని గ్రామాలలోను పశువుల మందను అమ్మ టానికి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాలేడ్‌ పంచాయితీ సమావేశంలో రైతులు చెప్పిన ప్రకారం ఒక జత ఎద్దులకు నెలకు సుమారు 8క్వింటాళ్ల గ్రాసం కావాలి. క్వింటాల్‌ రూ.2000 చొప్పున ఏడాదికి రూ.72,000 కేవలం గడ్డి కొనటానికే అవుతుంది. నీళ్ళ కొరత ఇంకొక పెద్ద సమస్య. పశువుల సంగతి తరువాత. మనుషుల అవసరాలకు సరిపడా ట్యాంకర్లు కూడా అందుబాటులో లేవు. ఇక గోరక్షణ పేరుతో బీజేపీ చేపడుతున్న విధానాల వల్ల మొత్తం పశువుల వ్యాపారమే బాగా దెబ్బతిన్నదని రైతులు వాపోయారు. దానికి తోడు కరువు వల్ల ధరలు కూడా బాగా పడిపోయాయి. తప్పనిసరి పరిస్థితుల్లో పశువుల్ని అయినకాడికి అమ్మటంవల్ల బాగా నష్టాలొ చ్చాయి. హామీ ఇచ్చిన ప్రభుత్వం గ్రామాలలో ఇంకా పశువుల కొట్టాలు ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వమే గ్రామంలో పశుగ్రాసం సరఫరా చేయాలని రైతులు అడిగినా వాటిని మేత కోసం పశువుల కొట్టానికి తీసికెళ్లాలంటే ఒక మనిషి ఒక రోజు పనీ, ఆదాయాన్నీ వదులుకోవాలి.
కానరాని అదనపు సేవలు-సహకారం
ప్రభుత్వం నిర్వహించాల్సిన అదనపు సేవలు దాదాపు కను మరుగయ్యాయనే చెప్పవచ్చు. ఏరకమైన పంట వేయాలనే విషయంపై రైతులకు తాము అవగాహన కల్పిస్తామని, దానికనుగుణంగా రైతులు తమ పంటలను మార్చుకునేందుకు అవసరమైన సహకారం అంది స్తామని ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ ఉంది. కానీ ఇప్పటివరకు అటువంటిదేమీ అమల్లోలేదు. పైగా బీటీ కాటన్‌ విత్తనాలు, ఎరువుల అమ్మకానికి ప్రయివేటు ఏజన్సీలను అధికారులు ప్రోత్సహిస్తున్నారనీ, చక్కెర మిల్లు యజమానులకు పూర్తి మద్దతు ఇస్తున్నారనీ చెప్పారు. చక్కెర మిల్లులకు ప్రభుత్వమే విద్యుత్‌ ఇవ్వటం దీనికిసాక్ష్యం. ఇటు వంటి పరిస్థితుల్లో కరువు సమయాల్లో ఆచరించాల్సిన పద్ధతుల గురిం చి, ప్రణాళికల అమలు గురించి ఎక్కడా ఊసేలేదు. అదనపు సేవలు, మేలైన విత్తనాల ఉత్పాదనకు ప్రయోగాలు, నిరంతర వ్యవ సాయాన్ని పెంపొందించే చర్యలు మొదలైన వాటి లేమివల్ల వ్యవ సాయ ఉత్పాదకత, రైతుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. వీటి అమలులో ప్రభుత్వం తన కనీస బాధ్యత నుంచి కూడా తప్పుకుంటోంది.
అధికారుల పాత్ర
అన్ని గ్రామాల్లోను రుణాలు, ఇన్సూరెన్స్‌ విషయాలలో రైతులు సమస్యలెదుర్కొంటున్నారని చెప్పినప్పుడు ‘సమస్య కొన్ని బ్లాకులలోనే ఉన్నదనేది’ కలెక్టర్‌ స్పందన. నిజానికి ఆన్‌లైన్‌లో ఇన్సూ రెన్స్‌ రిజిస్ట్రేషన్‌ విధానం రైతులకు చాలాకష్టం. అలాగే బీమా ప్రీమి యం కట్టించుకోవటంలో కంపెనీల బాధ్యత శూన్యం. ప్రభుత్వమే దానిని నిర్ణయిస్తుంది. బీమా ప్రీమియం ఖరారు, నష్టం అంచనాలో జాప్యానికి అధికారుల అలసత్వమే కారణమని కలెక్టర్‌ అంగీకరించారు. కరువు అంచనాకు సంబంధించిన కొత్త నిబంధనల ప్రకారం ఇకముందు గ్రామస్థాయి ప్రత్యక్ష తనిఖీ అవసరం లేదు. బ్లాకు లేదా జిల్లాస్థాయిలో సగటు దిగుబడి ఆధారంగా అంచనా కడతారు. దీనివల్ల భూస్వాములు,ధనిక,మధ్య తరగతి, చిన్నరైతుల మధ్య పెద్ద వ్యత్యాసం ఉండదు. నీటి పారుదలకు సంబంధించి సేకరించిన లెక్కలు కూడా అందుబాటులో లేవు. కొన్నిప్రాంతాలలో సంపన్నులైన రైతులు పంపులు, బోర్ల ద్వారా పొలాలకు నీరు పెట్టుకోగలుగుతారు కాబట్టి సహజంగానే వారి పంట దిగుబడి అధికంగానే ఉంటుంది. వారిని కూడా పేద రైతులతో సమానంగా లెక్కగడుతున్నారు. ఇది చాలా అన్యాయం. ఇప్పుడు కరువు నష్టం అంచనా విషయంలో కూడా ఏవో కొత్త పద్ధతుల ద్వారా వాస్తవ పరిస్థితిని మరుగున పడేసి తనకు అనుకూలంగా నివేదికలను తెప్పించుకునే అవకాశం లేకపోలేదు.
ఇటీవలే మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘కరువు విధాన పత్రం – 2016’ను పరిశీలిస్తే దానిలో పొందుపరచిన అంశాలు కరువు తీవ్రతను తగ్గించి చూపేందుకు ప్రయత్నించినట్టు కనిపిస్తోంది. ఒక జిల్లాను కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించేందుకు తీసుకున్న ‘మధ్యస్థం’, ‘తీవ్రం’, ‘అతి తీవ్రం’ అనే కొలబద్దల స్వభావం మానవీ య విలువలతో కాక పూర్తిగా సాంకేతికంగా, కఠినంగా ఉన్నది. కరువు అంచనా వేయటంలో శాస్త్రీయ విధానమైన ప్రత్యక్ష తనిఖీని పూర్తిగా ఎత్తేశారు. పైన తెల్పిన మూడు కేటగిరీలు నిధుల కేటాయిం పులో కీలక పాత్ర వహిస్తాయి. కానీ నిధుల విషయానికి వచ్చేసరికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలే వాటిని భరించాలని తేల్చేశారు. సహాయ నిధుల్లో 2రకాలు ఉంటాయి. ఒకటి, ఎస్‌డీఆర్‌ఎఫ్‌-దీనిలో 75శాతం కేంద్ర ప్రభుత్వం, 25శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. రెండవది,ఎన్‌డీఆర్‌ఎఫ్‌-ఇది మొత్తం కేంద్ర నిధుల నుంచే చెల్లించాలి. ఈ విధానపత్రం ప్రకారం మహారాష్ట్రలో కేవలం 3జిల్లాలు మాత్రమే కరువు ప్రభావిత ప్రాంతాల కిందికి వస్తాయి. రైతుల నుంచి తీవ్ర నిరసనా రాజకీయ తిరుగుబాటూ ఎదుర్కొంటున్న రాష్ట్ర సర్కార్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయక తప్పలేదు. అయితే ఈ అంశంలో నిధుల కేటాయింపు కీలకం అయినందున కరువు తీవ్రత ప్రభావం ఇంకా నిర్ణయించాల్సి ఉంది. ఇప్పటికే బీడ్‌ జిల్లాలో కరువు సహాయానికి నిధుల కేటాయింపులో జరిగిన తీవ్ర జాప్యం వల్ల అక్కడి రైతుల దుస్థితి మరింత పెరిగింది. ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యమే దీనికంతటికీ కారణం!- బృందాకరత్‌

ఆదివాసీ సమస్యలపై అలసత్వం

ఆదివాసీ హక్కుల పరిరక్షణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. వారి సంక్షేమం కోసం రూపొందించిన చట్టాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. గిరిజనుల గ్రామసభలకు సర్వాధికారాలు దఖలుపరచే పంచాయతీరాజ్‌-షెడ్యూలు ప్రాంతాల విస్తరణ చట్టం (పీసా చట్టం- 1996) అమలులోకి వచ్చి 22 ఏళ్లు అయింది. గిరిజనులకు అడవిపై గల హక్కుల విషయంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దే ఉద్దేశంతో అటవీ హక్కుల గుర్తింపు చట్టం అమలులోకి వచ్చి 12 ఏళ్లు గడుస్తోంది. గిరిజనుల సంప్రదాయ హక్కులు, జీవనోపాధి, పరిపాలన వంటి కీలకమైన అంశాలతో ముడివడివున్న ఈ చట్టాల అమలులో ప్రభుత్వ వ్యవస్థలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. ప్రధాన చట్టాలను బలవంతంగా రుద్దడంతో ఆదివాసుల పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ పరిస్థితిని నివారించేందుకే గిరిజన సంప్రదాయాలను గౌరవించి, వారి పద్ధతులకు సముచిత ప్రాధాన్యమిచ్చేందుకు పీసా చట్టం ద్వారా గ్రామసభలకు అధికారాలు కల్పించారు. వాస్తవంలో అవి ఎండమావుల్ని తలపిస్తున్నాయి.
పసలేని చట్టం… పట్టని ప్రభుత్వంగ్రామసభలకు విశేష అధికారాలు
రెండు దశాబ్దాల క్రితం పీసా చట్టం కోసం దేశవ్యాప్తంగా గిరిజనులు పోరాడారు. 73వ రాజ్యాంగ సవరణతో 1991లో అమలులోకి వచ్చిన పంచాయతీరాజ్‌ చట్టాన్ని దేశమంతటా ఒకేరీతిన అమలు చేయడంతో గిరిజనుల్లో తీవ్ర నిరసన మొదలైంది. వారు ఉద్యమబాట పట్టారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దిలీప్‌సింగ్‌ భూరియా నేత ృత్వంలోని ఓ కమిటీని నియమించింది. కమిటీ సిఫార్సులతో 1996 డిసెంబరులో పీసా చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామపంచాయతీని కాకుండా గ్రామసభను కేంద్రబిందువు చేశారు. గ్రామసభకు విశేషాధికారాలను కల్పించారు. ఒక ప్రాంతంలో నివసించే ఓటుహక్కు కలిగి ఉన్న నివాసితులంతా గ్రామసభ పరిధిలోకి వస్తారు. వీరు తాము నివసించే ప్రాంతాల చుట్టూ గల సహజ వనరులు, అటవీ సంపదపై యాజమాన్య హక్కులు కలిగి ఉంటారు. ఆ వనరులను స్వీయ అవసరాల కోసం వినియోగించుకుంటూ, గిరిజన సంప్రదాయ పరిరక్షణకు దోహదపడతారు. ఆయా గ్రామాల్లో, ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పాఠశాలలు, వైద్య కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను గ్రామసభలకు అప్పగించారు. అభివ ృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, నష్ట పరిహారం పంపిణీ, గనుల తవ్వకాలకు సంబంధించిన లీజులు, సామాజిక, ఆర్ధిక అభివ ృద్ధి కార్యమ్రాలకు సంబంధించిన ప్రణాళికల రూపకల్పన, ఉప ప్రణాళిక నిధుల ఖర్చుకు సైతం గ్రామసభల అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల గుర్తింపు, చిన్న తరహా అటవీ ఉత్పత్తులపై యాజమాన్య హక్కులు, మద్యం అమ్మకాలు, వడ్డీ వ్యాపారాలపై నియంత్రణ, నీటివనరుల నిర్వహణ తదితర విషయాల్లోనూ గ్రామసభలకే సర్వాధికారాలు కల్పించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ అభివ ృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన జమాఖర్చుల ధ్రువపత్రాన్ని జారీ చేసే అధికారం సైతం గ్రామసభలకు ఉంటుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2011లో చట్టంలో కొత్తగా కొన్ని నిబంధనలు పొందుపరచింది. గ్రామసభలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఇందులో ఉన్నాయి. వీటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో వైఫల్యం కనపడుతోంది. 2013 సెప్టెంబరులో గిరిజన సంక్షేమ శాఖ జిల్లా, మండల, పంచాయతీల వారీగా గ్రామసభలను గుర్తించి, జాబితాను నోటిఫై చేసింది. అంతేతప్ప పీసా చట్టం అమలు ద్వారా క్షేతస్థాయిలో గిరిజనులకు జరగాల్సిన మేలు, లభించాల్సిన హక్కులపై శ్రద్ద చూపలేదు. అయిదో షెడ్యూలు ప్రాంత పరిధిలోకి వచ్చే పర్వత శ్రేణుల్లో బాక్సైట్‌ ఖనిజం తవ్వకాల విషయంలో అక్కడి డోంగ్రియా ఆదివాసులు ఒడిశా ప్రభుత్వంపై చేసిన న్యాయపోరాటం ఫలించడానికి పీసా గ్రామసభ దిక్సూచిగా నిలిచింది. 2013లో పీసా చట్టం ప్రకారం అక్కడి గ్రామసభల అనుమతులు తీసుకున్నాకే ఖనిజ తవ్వకాలు చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో గ్రామసభలు కీలకమయ్యాయి.
గడచిన రెండు దశాబ్దాల్లో పీసా అమలు తీరుతెన్నులను విశ్లేషించేందుకు ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. ఆదివాసీ ప్రాంతాల్లో చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేస్తే ప్రభుత్వ వ్యవస్థలపై గిరిజనులకు నమ్మకం పెరుగుతుందని ఆ కమిటీలు పేర్కొన్నాయి. భూసేకరణ, గనుల తవ్వకాల లీజులు వంటి విషయాల్లో గ్రామసభలను విస్మరించడం వల్ల ఆదివాసుల్లో అసంత ృప్తి, అశాంతి పెచ్చరిల్లుతాయని హెచ్చరించాయి. 2005నాటి రెండో పాలన సంస్కరణల సంఘం, తీవ్రవాద ప్రాంతాల్లో అభివ ృద్ధి, సవాళ్లపై 2008లో ఏర్పాటైన ప్రణాళికా సంఘ నిపుణుల కమిటీ, చిన్నతరహా అటవీ ఉత్పత్తుల యాజమాన్యం అంశంపై ఏర్పాటైన ఎ.కె.శర్మ కమిటీ, నిర్వాసిత సమస్య, అభివ ృద్ధి అంశాలపై అధ్యయనం చేసిన రాఘవచంద్ర కమిటీలతో పాటు, యూపీఏ ప్రభుత్వంలోని జాతీయ సలహా మండలి- పీసా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయి. అయిదేళ్ల క్రితం అప్పటి జాతీయ సలహా మండలి ‘గ్రామసభ’ నిర్వచనానికి స్పష్టత తీసుకొస్తూ సవరణ బిల్లును సైతం రూపొందించింది. ఆ తరవాత వచ్చిన ప్రభుత్వాలు దీనిపై శ్రద్ధ చూపలేదు. ఆదివాసీ ప్రాంతాల్లో భూములు, గనులు, అడవులు, ఇతర సహజ వనరుల ఇష్టారాజ్య దోపిడిని అడ్డుకునేందుకు గొప్ప ఆయుధంగా పీసా చట్టం దోహదపడుతుందన్న ఆశలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీన వైఖరితో అడియాశలయ్యాయి. చాలా రాష్ట్రాలు చట్టం అమలుకు సంబంధించి కనీసం కార్యనిర్వాహక యంత్రాంగాలను ఏర్పాటు చేయలేదు. 1996లో కేంద్రం అమలులోకి తీసుకొచ్చిన చట్టంలో తమ రాష్ట్రాల్లోని గిరిజనుల కట్టుబాట్లు, వనరుల యాజమాన్యంలో సంప్రదాయ పద్ధతులకు అనుగుణంగా మార్పులు చేపట్టవచ్చని పేర్కొనడాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సాకుగా తీసుకున్నాయి. కేంద్ర చట్ట స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలు చట్టాన్ని అన్వయించు కోవడంతో దాని స్వరూపమే మారిపోయింది. ఉదాహరణకు షెడ్యూలు ప్రాంతాల్లో ఏదైనా అభివ ృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ కోసం ముందు గ్రామసభలను సంప్రతించాలి. ఆ ప్రాజెక్టు వల్ల నష్టం అనర్ధం వాటిల్లక ముందే నష్ట పరిహారం, పునరావాసం కల్పించాలని కేంద్ర చట్టం చెబుతోంది. ఈ నిబంధనను కొన్ని రాష్ట్రాలు మార్చేశాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూపొందించిన పీసా చట్టంలో భూసేకరణకు ముందు మండల పరిషత్‌లను సంప్రతించాలని పేర్కొంది. అంతేకాక అభివృద్ధి ప్రాజెక్టుల ప్రణాళికలు, పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీలో ఉండేలా మార్పులు చేసింది. రaార?ండ్‌ రాష్ట్రం తీసుకువచ్చిన చట్టంలో అసలు ఈ వెసులుబాటే లేకుండా చేశారు. భూసేకరణకు ముందు తాలూకా పంచాయతీలను సంప్రతించాలని గుజరాత్‌ చట్టం చెబుతోంది. జిల్లా పంచాయతీ, రెవిన్యూ అధికారుల అజమాయిషీలో భూసేకరణ జరిగేలా ఒడిశా ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసింది. గనుల లీజులు, నీటి పారుదల నిర్వహణ, అటవీ ఉత్పత్తుల యాజమాన్యం…ఇలా అనేక అంశాల్లో కేంద్ర చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలు తమ చట్టాల్లో మార్పులు చేశాయి. ప్రధాని నరేంద్రమోదీ ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ 2022 నాటికి నూతన, శక్తిమంతమైన భారతదేశాన్ని నిర్మించే లక్ష్యంతో వ్యూహ ప్రణాళికను ప్రకటించారు. ఇందులో భాగంగా దేశంలో వామపక్ష తీవ్రవాదం అధికంగా గల 115 జిల్లాల సామాజిక, ఆర్థిక, పరిపాలన పరమైన అభివ ృద్ధిపై ద ృష్టి సారిస్తామని వెల్లడిరచారు. ఈ జిల్లాలకు కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి హోదాలోని అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడానికి కార్యాచరణ సిద్ధమైంది. గాయం ఒక చోట అయితే మందు మరో చోట పూస్తున్నట్టుగా ప్రభుత్వ వ్యవహారశైలి ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దేశంలో అత్యంత వెనకబాటుకు గురవుతున్న జిల్లాలు అన్నీ దాదాపుగా ఆదివాసులు నివసిస్తున్న ప్రాంతాలే. ఈ ప్రాంతాల్లో వామపక్ష తీవ్రవాదం ఉనికి బలంగా ఉంది. అటవీ వనరులపై హక్కులు కల్పించి, గ్రామసభల స్థాయిలో పరిపాలన పరమైన సామర్థ్యాన్ని పెంచినప్పుడే గిరిజనుల్లో నిజమైన సాధికారత సాధ్యమవుతుంది. విద్య, వైద్యం, రహదారులు, విద్యుత్‌ వంటి మౌలిక సౌకర్యాల కల్పనలో గ్రామసభలను మమేకం చేయాల్సిన అవసరం ఉంది. పంచాయతీ రాజ్‌ చట్టం మాదిరే మున్సిపల్‌ చట్టాన్ని గిరిజన ప్రాంతాలకు విస్తరించాలనే ప్రతిపాదన దశాబ్దకాలంగా కాగితాలకే పరిమితమైంది. దీంతో గిరిజన ప్రాంతాల్లో అధిక జనాభా ఉన్న పంచాయతీలను పురపాలక సంఘాలుగా మార్చడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పీసా, అటవీ హక్కుల గుర్తింపు చట్టంతోపాటు రాజ్యాంగంలోని అయిదో షెడ్యూలు నిబంధనలను అమలు చేయడానికి రాష్ట్రాల్లో వ్యవస్థాగత యంత్రాంగం లేదు. ఈ చట్టాలకు సంబంధించిన నిబంధనలపై అవగాహన కల్పించే, అమలు తీరును పర్యవేక్షించే యంత్రాంగాలూ లేవు. తగినంత మంది సిబ్బంది లేరు. నిధులూ కొరవడ్డాయి. పీసా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసే దిశగా ప్రభుత్వాలు చురుకందుకోవాల్సిన తరుణమిది. క్షేత్రస్థాయిలో సత్ఫలితాలు ప్రతి ఒక్కరికీ అందినప్పుడే చట్టానికి సార్థకత ఉంటుంది!- జి.ఎన్‌.వి.సతీష్‌

వీర జవాన్లకు జాతి నివాళి

‘‘ జమ్మూ- కాశ్మీర్‌ చరిత్రలోనే కనీవినీ ఎరుగుని దుర్ఘటన. ఉగ్రదాడిలో 46మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోడం దేశ ప్రజలను దిగ్భ్రాంతిలో ముంచింది. జమ్మూ నుంచి ఫిబ్రవరి 14 తెల్లవారుజామున బయలు దేరిన జవాన్ల 78వాహనశ్రేణిని అక్కడకు 241కిలోమీటర్ల దూరంలోని అవంతిపొరా పట్టణ సమీపంలో జేషే మహ్మద్‌ సంస్థకు చెందిన ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు 350కిలోల అత్యాధునిక పేలుడు పదార్థం (ఐఈడీ)తో నిండిన వాహనంతో ఢకొట్టెడంతో ఈ ఘోరం సంభవించింది. 2000సంవత్సరంలో ఇదే ఉగ్ర సంస్థ జరిపిన దాడిలో 29మంది చనిపోయిన తరువాత జమ్మూ- కాశ్మీర్‌లో జరిగిన అతిపెద్ద సంఘటన ఇది.’’- గునపర్తి సైమన్‌

సరిహద్దుల్లో ఉగ్రమూకలు మరింత రెచ్చిపోయాయి. స్థానికంగా శిక్షణ ఇచ్చి తయారుచేసిన ముష్కరులే ఈఘాతు కాలకు పాల్పడుతున్నారు.భరతమాత ముద్దుబిడ్డలని చెప్పుకునే వీరసైనికులు ప్రాణత్యాగాలుచేసారు. కుటుంబసభ్యులతో సెలవులు గడిపి జ్ఞాపకాలు నెమరేసు కుంటూ విధుల్లోనికి వస్తున్న సిఆర్‌పిఎఫ్‌ జవాన్ల వాణాలపై ఉగ్రమూకలు పంజావిసిరి 42 మందిని బలిగొన్నాయి. ఉగ్రమూకలకు, ఉగ్రస్థావరాలకు ఆశ్రయం కల్పించేదేశంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందిన పాకిస్తాన్‌లోని జైషేముహ్మద్‌ ఉగ్రవాదసంస్థపనే ఇది అని ప్రకటించుకుంది. పైపెచ్చుఎలా ఉంది మా ప్రతీకారం అన్నట్లుగా సంకేతాలు వదులుతూ ఇలాంటివే మరిన్ని చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతోంది. జెఎఎం సంస్థకు చెందిన ఒక ముష్కరుని ఆత్మాహుతి దాడితో ఘోరం జరిగి పోయింది. భద్రతాదళాలు త్యాగాలు వృదాగా పోనివ్వమని పాలకులు చెపుతున్నా ఆకుటుంబాల్లోని పుత్రశోకం భరతమాత సైతం తీర్చలేనిది. గురువారం సాయంత్రం 2500 మందికిపైగా సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు 78 వాహనాల్లో జమ్మునుంచి బయలుదేరారు. సూర్యాస్తమయంలోపు వీరంతా శ్రీనగర్‌చేరుకోవాలిస ఉంది అనేక మంది సెలవరలతర్వాత కశ్మీర్‌ విధుల్లో చేరేందుకు వస్తున్నారు. ఇక లక్ష్యానికి చేరువవుతున్న 20 కిలోమీటర్ల దూరంలోనే అఘోరం జరిగిపోయింది. పేలుడుపదార్ధాలతో నిండిన ఒక స్కార్పియో వాహనం వేగంగా దూసు కొచ్చింది. కాన్వ్నాులోని బస్సును ఢీకొట్టింది. దీనితో అక్కడికక్కడే ఆ బస్సు తునాతునకలైంది. వాహనంలో 76వ బెటాలియన్‌కు చెందిన 44మంది జవాన్లు ఉన్నారు. అక్కడకిక్కడే పలువురు మరణిస్తే మరికొందరు ఆసుప్రతిలో చికిత్స పొందుతో మరణించారు. 350 కిలోల పేలుడు పదార్ధాలతో ఉన్న ఈవాహనాన్ని నడిపిన ఉగ్రవాది దాడికి ముందు సైతం కరుడుగట్టిన వ్యాఖ్యలుచేసాడు. ’’మీరుస్వర్గంచూసేటప్పటికీ నేనే స్వర్గంలో ఉంటాఅనిచేసిన వ్యాఖ్యలు మరణానికి సైతం నేను సిద్ధమేనన్నట్లుగా ఉన్నాయి. కేవలం భారత్‌పై ప్రతీకారం తీర్చు కోవాలన్న కుట్ర, కసి, కరుడు గట్టిన ఉగ్రవాదమే ఇందుకు పురిగొలిపిందని చెప్పాలి. సైనికబలగాలకు ఇదే కొత్తకాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగి నెత్తురును ప్రవహింపచేసాయి. అమర సైనికుల ప్రాణత్యాగాలకు భారత్‌ గుణపాఠం చెపుతూనే ఉంది. అయినప్పటికీ ఎక్కడా ఆగిన దాఖలాలులేవు. 2001 తర్వాత కారుబాంబు దాడుల్లో ఈ సంఘటన అతిపెద్దదిగా చెపుతున్నారు.
2017 డిసెంబరులో కూడాదక్షిణ కశ్మీర్‌లోని లేత్‌పరాలో జెఇఎం బిఎస్‌ఎఫ్‌ దళాలకు మధ్యజరిగిన కాల్పుల్లో ఐదుగురు సిబ్బంది, ముగ్గురుపౌరులు మరణించారు. అలాగే 2016 జమ్ములోని సైనికశిబిరంపై ఉగ్రవాదులు మెరుపుదాడికితెగబడ్డారు. ఇద్దరు అధికారులు, ఐదుగురు సైనికులుమ ృతిచెందారు. పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడిజరిపితే ఏడుగురుసిబ్బందితోపాటు నలుగురు మిలిటెంట్లుసైతం చనిపోయారు. అహ్మద్‌నగర్‌, షోపియాన్‌, పుల్వామా ప్రాంతాల్లో ఒకేరోజు వేరువేరుదాడులుజరిగితే ఎనిమిది మంది సైనికులు, ముగ్గురుపోలీసులు, ఇద్దరుపౌరులతోపాటు మిలిటెంట్లుసైతం ఎనిమిది మందిని మన సైనికులు మట్టుపెట్టారు. అక్కడితో ఆగిందా అంటే అదీలేదు. శ్రీనగర్‌శివార్లలోని హైదర్‌పోరా, సర్బాల్‌క్రాసింగ్‌వద్ద సైనికులపై బాంబుదాడులు జరిపితే పదిమంది అమరులయ్యారు. డాల్‌లేక్‌మీదుగా వెళ్లే రాష్ట్రీయరైఫిల్స్‌ వాహనశ్రేణిపై మిలిటెంట్లు విరుచుకుపడితే 30మంది చనిపోయారు. వీరిలో తొమ్మిదిమంది సైనికులే ఉన్నారు. ఇలా 1999 నుంచి ఇప్పటిరకూ వాహన శ్రేణులపై దాడులుచేస్తూనే ఉన్నారు. మెరుపుదాడులు జరిగిన తర్వాత కూడా ఇవేమీ ఎక్కడా ఆగలేదు.పాకిస్తాన్‌లోని కరాచీలో ఏర్పాటుచేసిన జైషేముహమ్మద్‌ సంస్థకు మౌలానా మసూద్‌ అజహర్‌ అధ్యక్షుడు. ఆతనే వ్యవష్తాపకుడు కూడా. భారత్‌ విమానాన్నిహైజాక్‌చేయడంద్వారా మనదేశ జైలునుంచి 1999లో విడుదలయినప్పటినుంచి మసూద్‌ కరుడుగట్టిన కిరాతకాలకు పథకరచనచేస్తున్నాడు. లష్కరే తాయిబాతరహాలోనే జైషేము హమ్మద్‌కూడా ఉగ్రవాదుల సరఫరా, భారత్‌పై దాడులకు తెగబడటం వెనుక పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ నిధులు,విధులు, కుట్రలకు ప్రోత్సాహం పథకరచన అందిస్తున్నదనడంలో ఎలాంటి సందేహంలేదు.ఈ ఉగ్రసంస్థలకు మజ్లిస్‌ ఎ తవాన్‌ ఎ ఇస్లామికి చెందిన ముఫ్తీ నిజాముద్దీన్‌ షంజాయి, దార్‌ ఉల్‌ఇఫ్తా ఎ వల్‌ ఇర్షాద్‌కు చెందిన మౌలానా ముఫ్తీ రషీద్‌ అహ్మద్‌, షేర్‌ ఉల్‌ హడిత్‌దార్‌ ఉల్‌ హకానియా సంస్థల పెద్దలు ఈ కుట్రలకు మద్దతునిస్తున్నట్లు అమెరికాసైతం గుర్తించింది. మసూద్‌ అజర్‌ జైలునుంచి విడుదలయన తర్వాత ఏర్పడిన ఉగ్రసంస్థ ఆవిర్భవించింది. తాజాగాజరిగిన పుల్వామా దాడి 2001 తర్వాత ఇదే అతిపెద్ద దాడిగా చెపుతున్నారు. పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం చెప్పాల్సిందేనని ముక్తకంఠంతో భారతీయులు నినదిస్తున్నారు.

తగ్గుతున్న విద్యా ప్రమాణాలు

దేశంలో విద్యావ్యవస్థను సంస్కరించి నూతన విద్యావిధానాన్ని రూపొందించి అందరికీ నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గత రెండు మూడు దశాబ్దాలుగా పాలకులు, న్యాయస్థానాలు, మేధావ్ఞలు, పదేపదే చెపుతున్నా.. ఆచరణకు వచ్చేసరికి అవి మాటలకే పరిమితమవు తున్నాయి. ముఖ్యంగా పడిపోతున్న నాణ్యతగూర్చి న్యాయస్థానాలు ఎన్నోసార్లు ఎత్తిచూపాయి. చివరకు ప్రభుత్వం నుండి జీతభత్యాలు తీసుకుంటున్నవారుకూడా సర్కారు పాఠశాలల్లో తమ పిల్లలను చదివించకపోవడంపట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలంటూ అలహాబాద్‌కు చెందిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుధీర్‌ అగర్వాల్‌ 2015 ఆగస్టు 18న తీర్పు ఇచ్చారు. సర్కారు బడుల్లో ఉపాధ్యాయులను నియమిస్తున్నవారు తమ పిల్లలను మాత్రం వాటిల్లో చదివించకపోవడాన్ని ఆయన ఆనాడే తప్పుపట్టారు.ప్రైవేట్‌ విద్యా వ్యాపారం పెరిగిపోతున్నా నాణ్యత విషయంలోమాత్రం అంతంతమాత్రంగానే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశా లల్లో ప్రధమ్‌ సంస్థ నిర్వహించిన సర్వేలోని అంశాలను మంగళవారం వెల్లడిరచింది. భారతదేశంలోని 596 జిల్లాల పరిధిలో మూడు నుంచి పదహారేళ్ల వయస్సుఉన్న దాదాపు ఐదున్నర లక్షల మందికిపైగా విద్యార్థులపై ఈ సర్వే నిర్వహించగా బడిలో చేరని పిల్లల సంఖ్య 2007తో పోలిస్తే మూడు శాతం తగ్గినట్లు వెలుగుచూసింది. ప్రాథమిక స్థాయి నుంచే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలల్లో చేర్చేందుకోసమే మొగ్గు చూపుతున్నారు. పై తరగతులకు వెళ్లేకొద్దీ క్రమేణా చదువ్ఞ మానేసేవారి సంఖ్య పెరిగి పోతున్నది. 2018లో ప్రైవేట్‌ పాఠశాలల్లో రెండో తరగతి చదువ్ఞతున్న విద్యార్థులు 54.4 శాతం ఉంటే ఎనిమిదో తరగతి విద్యార్థులు 25 శాతంలోపే ఉన్నారు. ఇక పదాలు, వాక్యాలు చదవగలిగే వారి సంఖ్య గతంలో కంటే మరింత తగ్గిందని యాన్యూవల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌ బయటపెట్టింది.ప్రైవేట్‌ పాఠశా లల్లో కూడా ప్రమాణాలు భారీగానే పడిపోతున్నట్లు చెప్పింది. ప్రైవేట్‌, ప్రభుత్వ పాఠశాలల్లో మూడోతరగతిలో కూడా తీసివేతలు రాని విద్యార్థుల సంఖ్య పెరిగిందని 2016లో తీసివేత చేయగలిగిన విద్యార్థులు 4.2శాతం ఉంటే ఇప్పుడు వారి సంఖ్య ముప్పై నాలున్నర శాతానికి పడిపోయింది. గణాంకాలు చేయలేని విద్యార్థులు ఐదో తరగతిలో 2016లో 30.4శాతం ఉంటే, ఇప్పుడువారి శాతం 27.3 శాతానికి తగ్గింది.ఇక ప్రైవేట్‌ పాఠశాలల్లో ఎనిమిదో తరగతిలో లెక్కలు చేయగలిగిన విద్యార్థు లు 2016లో 54.9 శాతం ఉంటే ఇప్పు డు అది 48.7 శాతానికి తగ్గిపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రమా ణాలు పడిపోతున్నాయని ఈ సర్వే స్పష్టం చేస్తున్నది. గ్రామీణ ప్రాంతంలోని ప్రైవేట్‌ పాఠశాలల పరిస్థితి కూడా ఆందోళన కరంగానే ఉంది. ఫీజులు వసూలు చేయడంలో ఉన్న ధ్యాస%ౌౌ% న్యాణమైన విద్య అందించడంలో విఫలమవ్ఞతున్నారు. వాస్తవంగా చూస్తే.. ఒకనాడు ప్రభుత్వ పాఠశాలలే కానీ ప్రైవేట్‌ బడులు లేవ్ఞ. ఎక్కడో పట్టణాల్లో, నగరాల్లో అక్కడక్కడా ప్రైవేట్‌ బడులు నడిచేవి. వాటిల్లో కూడా వ్యాపార ధోరణులు కన్పించేవి కాదు. లాభనష్టాలతో సంబంధం లేకుండా కేవలం సేవా దృక్పథంతో ఆవిద్యా సంస్థలు ప్రజలకు సేవలు అందించేవి. నిర్వాహకులు సామాజిక బాధ్యతగా భావించి బడులు నడిపేవారు. అందువల్ల ఆనాడు వాటిని అరికట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. అందుకే ప్రైవేట్‌ విద్యను అరికట్టేందుకు ఆనాడు చట్టాల అవసరం తలెత్తలేదు. కానీ ఇప్పుడు అవి పూర్తిగా వ్యాపార సంస్థలుగా రూపాంతరం చెందాయి. లాభసాటిగా ఉన్న ఈ వ్యాపా రంలో రాజకీయ నాయకులు, కాంట్రా క్టర్లు, ఒకరేమిటి వ్యాపారాలు చేయాలను కున్నవారంతా ఈ విద్యా వ్యాపారంలో దిగుతున్నారు. దీనికి తోడు ఇంగ్లీషు చదువ్ఞలపై మోజు పెరగడంతో దాన్ని ఆసరాగా తీసుకుని విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చివేశారు. బీదా,బిక్కీ జనం కూడా ప్రైవేట్‌ విద్యకోసం ఆరాట పడుతున్నారు. ఏమాత్రం ఆర్థికవసతి లేక, మరోదారి లేనివారే విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల బాటపడుతున్నారు. ఇంతకాలం గ్రామాలకు ప్రైవేట్‌ వ్యాపారం సోకకపోవడంతో పట్టణాలకు పంపించి చదివించే ఆర్థిక స్థోమత లేని మధ్యతరగతి వారుసైతం తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వ విద్యపై ఆధారపడ్డారు. ఇప్పుడు మండల కేంద్రాలు, చివరకు మారుమూల గ్రామాలకుసైతం ఈ విద్యావ్యాపారం వ్యాపించిపోయింది.ఇక రానురానూ ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్‌ అనేది ప్రశ్నార్థకంగా కన్పిస్తోంది. ఎందుకు ఈ పరిస్థితి దాపురిస్తున్నది? కారుకులు ఎవరు? కారణాలు ఏమిటి? అనేది పాలకులకు తెలియంది కాదు. అందరికీ తెలుసు. అయినా ఈ దుర్మార్గపు వ్యాపారానికి అడ్డుకట్ట వేయలేక పోతున్నారు. పాలకులు ఘోరంగా విఫలమవ్ఞతున్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీచేయడం లేదని చెప్పడం లేదు. ప్రభుత్వ పథకాలు, ఆశయాలు కాగితాల వరకు బాగానే ఉంటాయి.
కానీ ఆచరణ విషయం వచ్చేటప్పటికీ అసలు సమస్య మొదలవ్ఞతుంది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవాలి. బాలబాలికలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన విద్యావ్యవస్థను ఇంతటి దారుణ పరిస్థితుల్లోకి నెట్టడం దురదృష్టకరం. మారిన పరిస్థితులకు అనుగుణంగా జీవనోపాధికి ఉపయోగ పడేలా విద్యావిధానాన్ని సంస్కరించాల్సిన అవశ్యకత ఉంది. కోట్లకొద్దిడబ్బు, ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా పాఠశాల విద్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. ఈమధ్యనే ప్రథం సంస్థ విడుదల చేసిన సర్వే(అసెర్‌) వివరాలు విద్యా ప్రమాణాలు దిగజారిన విషయాన్ని తేటతెల్లం చేసింది. 2005-2014 వరకు ఆ సంస్థ సర్వే నిర్వహించింది. ప్రతి సంవత్సరం ప్రథం సంస ్థసర్వే నిర్వహి స్తుంది. ఈ సర్వేలో మన ప్రభు త్వాలు విద్య కోసం చేస్తున్న కార్యక్రమాలు ఎంత వరకు ఫలితాన్ని స్తున్నయో తెలియజేసింది. విద్యా ప్రమ ణాలు పెంచడంలో విద్యావ్యవస్థ విఫల మవుతున్నదని చెప్పడానికి ఈ సర్వే గణాంకాలే నిదర్శనం. ఈసర్వే ప్రకారం 5వ తరగతి చదివే విద్యార్థికి 2వతరగతి స్థాయి భాష, గణితసామర్థ్యాలు లేవని తేల్చిచెప్పింది. వివిధ కార్యక్రమాల రూపకల్పన ద్వారా పాఠశాలలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డా, విద్యా ప్రమాణాలు మాత్రం మెరుగుపడకపోగా ఇంకా తగ్గిపోయాయి. ఈసర్వే వివరాల ప్రకారం రెండవ తరగతి పిల్లల్లో 19.5శాతం పిల్లలు 0 నుంచి 9 అంకెలను గుర్తించలేకపోతున్నారు. ఇది ఇదివరకు 17.6శాతంగా వుండేది. దీన్నిబట్టి చూస్తే విద్యార్థుల విద్యాప్రమాణాలు మెరుగుపడటం అటుంచి అవి మరింత దిగజారిపో తున్నాయి. విద్యా పమాణాల దిగజార డానికి కారణాలు అనేకం. అందులో ముఖ్యమైనది ఉపాధ్యాయుని పనితీరు, హాజరు. చాలవరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నా, ఉన్న ఉపాధ్యాయుల్లో ఎంతమంది అంకిత భావంతో పనిచేస్తున్నారనేది ప్రశ్న? బోధన నిరంతరం జరుగుతున్నది కానీ అభ్యసన ఎంతమేరకు జరిగింది అన్నది ముఖ్యం. అందుకే ఇటీవల మోదీ విదేశీ తరగతి గదుల్లో అభ్యసన మాత్రమే జరుగుతున్నది, కానీ మనతరగతి గదుల్లో బోధన జరుగుతున్నది అన్నారు. మారుతున్న పరిస్థితులకు కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయ విద్యలో మార్పులు ఉండటం లేదు.భావి ఉపాధ్యాయులను తయారుచేసే సంస్థల పనిత నం, వారు పాటిస్తున్న నిబంధనలు ఉపాధ్యాయుల ప్రమాణాలు పెంచేందుకు కృషి చేయాలి.ఉపాధ్యా యుల్లో లోపించిన జవాబుదారీతనం, అంకితభావానికి ఉపాధ్యాయ విద్యే బాధ్యత వహించాలి. పాఠశాలలకు ప్రభుత్వం రూపొందిస్తున్న వివిధ కార్యక్రమాలు ఎంతవరకు వాటి సామర్థ్యం మేర పనిచేస్తున్నాయనేది పర్యవేక్షకుల పనితీరు పైనే ఆధారపడి వుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం అన్నిరకాల సదుపాయాలు కల్పిస్తున్నా వాటిని పర్యవేక్షించే అధికారుల లోటును భర్తీచేయలేకపోతున్నది. పర్యవేక్షక అధికారుల పనితీరు, ఉపాధ్యాయ ఖాళీలు ఇవన్నీ సర్కారీ బడులన్నీ ఖాళీ అవుతున్నాయి. గ్రంథాలయపుస్తకాలు, ప్రయోగపరికరాలు సరఫరా చేసినా వాటిని వినియోగిస్తున్న దాఖలాలు లేవు. ూూA, RవీూA లద్వారా అందచేస్తున్న శిక్షణలు, వసతులపై పర్యవేక్షణ లోపాలున్నాయి.
విద్యాప్రమాణాలు మెరుగుపడాలంటే ఉపాధ్యాయ విద్యను పరిపుష్టం చేయాలి. ఉపాధ్యాయ విద్య ఎంత పటిష్టంగా వుంటే విద్యావ్యవస్థ అంతపటిష్టంగా ఉంటుంది. విద్యాప్రమాణాల పెరగడానికి దోహదం చేస్తుంది. పర్యవేక్షకుల నియామకం చేపట్టి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యా యుల పనితీరు మెరుగు పర్చవచ్చు. వీటన్నిటితో పాటు సంస్థలు, వ్యక్తుల మధ్య సమన్వయం అనేది విద్యాప్రమాణాల పెరుగుదలకు చాలా అవసరం. ఉపాధ్యాయ విద్య, పాఠశాల విద్యల మధ్య సమన్వయం విద్యా ప్రమణాల పెరుగుదలకు దోహదపడుతుంది. తద్వార విద్యా ప్రమాణాలు మెరుగుపడి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వపాఠశాలలపై నమ్మకం కలుగుతుంది. ప్రభుత్వాలు వీటన్నింటిపైదష్టి సారించాల్సిన అవసరంఎంతైనా వున్నది.- జి.ఎన్‌.వి.సతీష్‌

రాక్షసత్వాన్ని మించిన ఉన్మాదమిది

‘‘ అమ్మకడుపులో దాచాలంటే ఆడపిల్లకు కష్టంగా మారింది. ఇక పుట్టాక అడుగు వేస్తే ఆపద. గడియగడియకో గండం నిమిషానికోసారి తనని తాను చూసుకొని బతికున్నానని నిర్ధారించుకునే పరిస్థితులు దాపురించాయి. చదువుకుందామని కాలేజీకి వెళ్తే అక్కడ కామాంధుల చూపు వారిపైనే వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్తే ఒంట్లో ఉన్న రోగాన్ని చూడాల్సిన కొంతమంది డాక్టర్లు వారి ఒంటిని చూస్తున్న దాఖలాలు మనకు తెలిసిందే. కళాశాలల్లో కొంతమంది విద్యార్థుల వల్ల, ఉద్యోగం చేసే చోట కొంతమంది తోటి ఉద్యోగుల వల్ల ఏదో ఒకరకంగా లైంగిక వేధింపులకు, ఇతరత్రా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. మరికొందరు ప్రేమ పేరుతో వంచన చేస్తున్నారు. ఇటీవల తెలంగాణా రాష్ట్రం వరంగల్‌ హన్ముకొండ రాంగనర్‌లో చోటు చేసుకున్న దారుణం కారణంగా ఓ యువతి ఒక ఉన్మాది చేతికి గురైన విషయం సంచలనం సృష్టించిన విషయం విధేతమే. ఇలాంటి పరిస్థితుల్లో స్త్రీకి సమాజంలో రక్షణ ఎక్కడిది..? అందుకే వారి కోసం ప్రత్యేక చట్టాలు పుట్టాయి. లైంగిక దాడికి గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారా..? ఒక వేళ నిందితుడు ఏ బడాబాబు కొడుకైతే కొన్ని సందర్భాల్లో సులభంగా తప్పించుకుంటున్నారు.’’-(దామోదర సాయిబాబా)
చదువు సంధ్యలు పెరిగే కొద్దీ మనుషుల ప్రవర్తనలో మార్పులు రావాలి. సభ్యతా సంస్కారాలు పెరగాలి. సాంకేతికంగా అభివృద్ధి చెంది విజ్ఞానం ఆర్జించేకొద్దీ మంచి ఏదో, చెడు ఏదో గ్రహించే విచక్షణా జ్ఞానం పెరగాలి. దురదృష్టవశాత్తు అందుకు విరుద్ధంగా తిరోగమిస్తున్నామే మోననిపిస్తున్నది. జరిగిన, జరుగుతున్న సంఘ టనలు ఆవేదనే కాదు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థినిలపై జరుగుతున్న దాడులు కొందరు ఉన్మాదులు చేస్తున్న విన్యాసాలు సభ్యసమాజం తలవంచుకునేలా ఉన్నాయి. ఫిబ్రవరి 27న తెలంగాణలోని వరంగల్‌ అర్బన్‌జిల్లా హన్మకొండలో జరిగిన సంఘటన మళ్లీ ఒక్కసారి ఉల్లికిపరిచింది. ఏమిటిది? ఈదారుణాలను నిరోధించలేరా? ఇది నిరాటంకంగా జరగాల్సిందేనా? తదితర ప్రశ్నలు జవాబులు లేకుండా మిగిలిపోతున్నాయి. హన్మకొండ రాంనగర్‌లో దారుణం చోటుచేసుకున్నది. తనప్రేమను నిరాకరించిందన్న కారణంగా ఒకఉన్మాది మానవత్వం మరిచి అందరు చూస్తుండగా పట్టపగలు నడిరోడ్డులో తోటి విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పుఅంటించాడు. వాగ్దేవి కాలేజీలో డిగ్రీ ఫైనలియర్‌ చదువ్ఞతున్న రవళి అనే విద్యార్థిని బుధవారం కాలేజీకి వెళ్తున్న సమయంలో అదే కాలేజీలో, అదే తరగతి చదువ్ఞతున్న సాయిఅన్వేష్‌ అనే యువకుడు పెట్రోలు పోసి దాడికి తెగబడ్డాడు. దాదాపు అరవైశాతంపైగా కాలిన గాయాలతో రోడ్డుపై కొట్టుకుమిట్లాడుతున్న ఆమెను వరంగల్‌ ఎంజిఎమ్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రవళి చికిత్స పొందుతూ మార్చి 4న మృతి చెందింది వరంగల్‌లో గతంలో కూడా ఇద్దరు యువతులపై ఆసిడ్‌ దాడి జరిగింది. అందులో ఒకయువతి మరణించగా మరో యువతి కోలుకోగలిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ దేశవ్యాప్తంగా విద్యార్థినిలపై ఈఅఘాయిత్యాలు, దాడులు అంతకంతకు పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే అంశం. చట్టాలు ఎన్ని చేసినా, ఎంతమంది అధికారులను నియమించినా ఈచట్టాలు కానీ, ఆ అధికారుల కానీ వీటిని నియంత్రించలేకపోతున్నారు.పైగా అంతకంతకు పెరిగిపోతున్నాయి.
ఢల్లీిలోనిర్భయ కేసు అనంతరం చెలరేగిన ఆందోళనలతో కేంద్ర పాలకులు పకడ్బందీ చట్టం తీసుకువచ్చారు. కానీ ఆ నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా ఇవి ఆగడం లేదు. అలాని పోలీసులు ఏమి చేయడం లేదని చెప్పడం లేదు. కేసులు పెడుతున్నారు. అరెస్టులు చేస్తు న్నారు. జైళ్లకు పంపిస్తున్నారు. కొన్నింటిలో శిక్షలు కూడా వేయించగలుగుతున్నారు. కానీ అధికశాతం కేసులు వీగిపోతున్నాయి. ఈ కామాంధులకు పోలీసులన్నా, చట్టాలన్నా భయభక్తులు సన్న గిల్లుతుండటమే ఇందుకు కారణమనేది కాదనలేని వాస్తవం. అసలు ఈ సంఘటలన్నీ చూస్తుంటే సమాజం ఎటువైపు పయనిస్తుందనే అనుమానం రాకతప్పదు. ఇవి మొదలు కాదు. చివర కూడా కాదు. కొన్ని కేసుల్లో పోలీసుల అసమర్థత, చేతకానితనాన్ని నేరస్తులు తెలివిగా వాడుకోగలుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయేషా కేసు ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. హాస్టల్‌లోనే మానభంగం చేసి హత్యచేశారు. పోలీసుశాఖ సవాల్‌గా పరిగణించిన కేసులో పెద్దల హస్తం ఉందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఏదిఏమైతేనేం పోలీసులు సమర్థవంతంగా దర్యాప్తు నిర్వర్తించలేక నేరం ఎవరు చేశారో రుజువ్ఞ చేయలేకపోయారు. పోలీసులు కేసు నమోదు చేసినా నిందితుడు నిర్దోషిగా న్యాయస్థానం ప్రకటించింది. అంతేకాదు దర్యాప్తు ఎంత డొల్లగా ఉందో న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
ఇప్పుడు ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించారు. సిబిఐ రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తుంటే రికార్డులే మాయమైపోతున్నాయి. ఇలా ఎందరో విద్యార్థినిలు బలైపోతున్నారు. కొందరు తీవ్ర గాయాలతో బయటపడి జీవనం సాగిస్తున్నారు. అంతకుముందు విజయవాడలో ఎంసిఎ విద్యార్థి శ్రీలక్ష్మీని అదే కాలేజీకి చెందిన మనోహర్‌ అనే విద్యార్థి తనను ప్రేమించలేదని దారుణంగా హత్యచేశాడు. అంతకుముందు గుంటూరులో ఇంటర్‌ చదువ్ఞతున్న మరొక విద్యార్థినిని ఒక మేకానిక్‌ విద్యార్థులందరూ చూస్తుండగా ఏకంగా తరగతి గదిలోనే నరికిచంపాడు. ఇలా ఒకటి కాదు,రెండు కాదు. ఎన్నో సంఘటనల్లో విద్యార్థినులు బలైపోతున్నారు. రక్తాన్ని పంచిపెంచిన బిడ్డ ఇలా అర్థరహితంగా ఉన్మాదానికి బలైతే ఆతల్లి గర్భశోకాన్ని తీర్చేది ఎవరు? ఏమిచ్చి ఓదార్చగలరు? ఈవిషసంస్కృతి పెరిగిపోతున్న దనేందుకు జరుగుతున్న సంఘటనలు అద్దంపడుతున్నాయి. మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయనే విషయం పోలీసు రికార్డులు కూడా వెల్లడి స్తున్నాయి. విద్యార్థినిలపై వేధింపులకు అంతేలే కుండాపోతున్నది. చాలా వరకు ఇవి పోలీసు రికార్డుల్లోకి ఎక్కే అవకాశం తక్కువ. సంఘ టనలు జరిగినప్పుడో, గాయపడినప్పుడో, ప్రాణాలు పోయినప్పుడో తప్ప పోలీసు దృష్టికి వెళ్లడం లేదు. ఏయువతీ తాను వేధిం పులకు గురి అవ్ఞతున్నానని పోలీసు స్టేషన్ల మెట్లెక్కి ఫిర్యాదు చేయడానికి సాహసించడం లేదు. పోలీసులు వేసే సవాలక్ష ప్రశ్నలకు జవాబు చెప్పడం అయ్యేపని కాదని ఒకవేళ అన్నీసమకూర్చిన వారు తీసుకునే చర్యలకు ఈ వేధింపులు ఆగిపోతాయని ఏఆడపిల్ల నమ్మే స్థితిలో లేదు. అలా నమ్మి పోలీసుల దృష్టికి తీసుకువచ్చిన కేసుల్లో కూడా ఏదో కౌన్సిలింగ్‌ పేరుతో కాలం గడిపి పంపుతున్నారే తప్ప నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేక పోతున్నారు.మొన్న హైదరాబాద్‌ నడిబొడ్డులో జరిగిన సంఘటనలు ఇందుకు ఉదహరించవచ్చు. పాలకులు ఉక్కుపాదం మోపితే తప్ప ఈ దారుణాలు ఆగదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు బాధిత కుటుంబాలకు తగు న్యాయం చేసి, భవిష్యత్తులో మహిళలు, యువతలపై ఇటువంటి అగత్యాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవశ్యకత ఉంది.!

మహిళ నీకో వందనం

మహిళా సాధికారితతోనే మార్పు వస్తుంది అని భావిస్తున్న వర్తమాన సమాజంలో ఇప్పటికీ పురుషాధిక్యత మధ్యనే మహిళలు నలిగిపోతున్నారు అన్నది వాస్తవం. స్త్రీలను దేవతలతో పోల్చి చూస్తారు కానీ ఇప్పటికీ మహిళలపట్ల సమాజంలోనే కాదు కుటుంబాలలో కూడ చిన్న చూపు కొనసాగుతోంది అన్నది వాస్తవం. ఈక్రమంలో మహిళాభ్యుదయం జరగాలి మహిళల అభివ ృద్ధి జరగాలి అంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఎన్ని జరిగినా స్త్రీల సామాజిక ఆర్ధిక రాజకీయ అభివ ృద్ధి ఇంకా కేవలం నామమాత్రంగానే ఉంది అన్నది వాస్తవం. మనదేశంలో పురుషులతో సమానంగా స్త్రీలకు వేతనాలు ఉపాది ఆహారబద్రత లేకపోవడంతో పాటు స్త్రీల పై లైంగిక హింస ఇంటా బయటా వయస్సుతో నిమిత్తం లేకుండా పెరిగి పోవడం చూస్తూ ఉంటే ఇంకా ఎన్ని మహిళా దినోత్సవాలు జరిగితే మహిళల అభివ ృద్ధి జరుగుతుంది అని అనిపించడంలో ఎటువంటి సందేహం లేదు.
మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివ ృద్ధి చెందదు అన్నది నిజం. ఈవాస్తవాన్ని గుర్తించి స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం అనే నినాదంతో ఐక్యరాజ్య సమితి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకను ప్రతి ఏటా నిర్వహిస్తోంది. సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగితే మహిళా అభ్యుదయం దానంతట అదే జరుగుతుంది. ఇప్పటికీ మన దేశంలో ఆడపిల్ల పుడితే దురద ృష్టంగా భావిస్తున్న సగటు మనిషి ఆలోచనల నేపధ్యంలో ఎన్ని ఉద్యమాలు జరిగినా మహిళల అభివృద్ధి సంక్షేమం కేవలం ఉపన్యాసాలకే పరిమితం అవుతోంది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న జనాభా లెక్కల గణాంకాల ప్రకారం ఉత్తారాది రాష్ట్రాలలో ప్రతి వెయ్యి మంది పురుషు లకు 879 మాత్రమే అమ్మాయిలు ఉన్నారని గణాంకాలు చెపుతున్న నేపధ్యంలో మరో 100 సంవత్సరాలు గడిచేసరికి ప్రతి వెయ్యి మంది పురుషులకు స్త్రీల సంఖ్య ఐదువందలకు పడిపోయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఇప్పటికీ మనదేశంలోని మధ్య తరగతి దిగువ మధ్య తరగతి కుటుంబాలలో స్త్రీని ఒక పనిచేసే యంత్రంగా బావిస్తున్న నేపధ్యంలో ఇంటిపని పిల్లల పని ఉద్యోగ బాధ్యతలు నిర్వహించ గలిగే ఒక ‘రోబోలా’ మాత్రమే స్త్రీలను చూస్తున్నారు అన్నది వాస్తవం. ఈపరిస్థుతులకు ఎవరో పరిష్కారాలు చెపుతారని ఆశించకుండా స్త్రీలు తమని తాము తెలుసుకుని తమ శక్తియుక్తులు మెరుగు పరుచుకునే వరకు ఎన్ని మహిళా ఉద్యమాలు మహిళా దినోత్సవాలు జరిగినా స్త్రీల పై వేదింపులు స్త్రీలను చిన్న చూపు చూడటం కొనసాగుతూనే ఉంటుంది అన్నది వాస్తవం.
‘ఒక పని గురించి చెప్పాలి అంటే పురుషులకు చెప్పండి అదే ఆపని పూర్తి అవ్వాలి అంటే మాత్రం మహిళకు చెప్పండి’ అని ఉక్కు మహిళగా పేరుగాంచిన బ్రిటన్‌ మాజీ ప్రధాని మార్గరేట్‌ థాచర్‌ చెప్పిన మాటలను బట్టి మహిళా ఏదైనా సాధించాలి అనుకుంటే ఏ శక్తి ఆపలేదు అన్నది వాస్తవం. ఐస్‌ ల్యాండ్‌ లాంటి చిన్నదేశంలో మహిళను అసభ్యకరంగా చూపించే సినిమాలు వీడియాలు తీసినవారికి ఎటువంటి వాదన ప్రతివాదనలు లేకుండా వెంటనే కఠిన శిక్షలు విధించే చట్టాలు ఉన్నాయి. అంతేకాదు ఆదేశ పార్లమెంట్‌ లో మహిళలకు సంబంధించిన ఆదేశ మహిళలే రూపొందిస్తారు. అటువంటి పరిస్థుతులు మన భారతదేశంలో వచ్చిన నప్పుడు మాత్రమే నిజమైన మహిళా సాధికారిత :
వేదాలకాలం నుంచే భారతీయ సమాజంలో మహిళలకు ఎంతో గౌరవం ఉంది. మనదేశాన్నే ఒకస్త్రీ మూర్తిగా భావించి భారత మాతగా కొలుస్తున్నాం. మన దేశంలో నదులను సరస్వతి, గంగ, యమున, గోదావరి, కావేరీలను స్త్రీ మూర్తులుగా, మాతలుగా వ్యవ హరిస్తూ పూజిస్తున్నాం. స్త్రీలపట్ల ఆరాధనా భావం ఉన్నందువల్లే మనం పుట్టిన దేశాన్ని మాతృభూమిగా పిలుచుకుంటున్నాం. ప్రస్తుత భారతీయ సమాజంలో స్త్రీల పట్ల జరుగుతున్న సామాజిక వివక్షకు కారణం హిందూ సాంప్రదాయాలేనని చాలా మంది అజ్ఞానంగా వాదిస్తుంటారు. కానీఅనాది నుంచి భారతీయ సమాజంలో మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. హిందూ పురాణాల్లో సంపదకు అధిదేవతగా లక్ష్మిని, విద్యాధిదేవతగా సరస్వతిని, శక్తికి ప్రతిరూపంగా దుర్గను ఆరాధించారు. పురాతన హిందూ గ్రంథాల్లో కొన్ని మహిళా పాత్రలను బలంగా తీర్చిదిద్దారు. వారిలో సీత,సావిత్రి, మండోదరి, గంగ లాంటి పాత్రలు నేటితరం మహిళలకు ఎంతో ఆదర్శం. ప్రాచీన కాలంలో స్త్రీల పట్ల ఉన్న గౌరవం, ఆరాధన ఆధునిక సమాజంలో లేకుండా పోతోంది. మహిళలను పురుషులతో సమానంగా చూడడం లేదు. ఇది ఆందోళనకరం. స్త్రీలపట్ల మన ఆలోచనాధోరణి మారాలి. నేడు స్త్రీలపరిస్థితులు మారాయి. వంటిల్లే స్వర్గంగా భావించే మహిళలు ఇప్పుడు సమాజంలో ఒక విశిష్టమైన శక్తిగా అంచెలంచెలుగా ఎదుగు తున్నారు. వైద్య,విద్య,విజ్ఞాన,రాజకీయ,క్రీడా,రక్షణ.. ఇలా రంగం ఏదైనా స్త్రీలు దూసుకు పోతున్నారు.
విద్యార్థినిగా, గృహిణిగా,ఉద్యోగినిగా, రాజకీయవేత్తగా ఇలా ఎన్నో విధాలుగా సమాజంలో భాగంగా మారినా స్త్రీ స్వయం నిర్ణయం అనేది ఇంకా పురుషుల చేతులలోనే ఉన్నది. స్త్రీ,పురుషులు ఇద్దరూ పరస్పర అవగాహనతో కలసి నడవాలి. కాని ప్రస్తుతం అలా లేదు. అడుగడుగునా ఆటంకాలు.. అలుపెరుగని పోరాటాలు.. అత్మాభిమాన అణచి వేతలు ఇవన్నీ మహిళల అభ్యున్నతికి అడ్డుపడు తున్నాయి. తరతరాల నుండి వస్తున్న సంప్రదాయాలు, ఆచారాలు నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఈ వ్యవస్థలో కాలక్రమేణా మార్పులు చోటు చేసు కున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో మారేందుకు కాస్త సమయం పడుతుంది. ఇప్పటికే పురుషుల ఆలోచనా దృక్పథంలో కాస్త మార్పు వచ్చింది. భార్య అంటే గృహిణిగా సేవలందించడమే కాకుండా, ఉద్యోగినిగా ఆర్థిక సేవలం దించి, మాతృత్వంతో సంసా రాన్ని పెంచే త్రిపాత్ర ధారిణి అనే విషయాన్ని తెలుసు కుంటు న్నారు. సమాజంలో నేటికీ బాలికా శిశు గర్భవిచ్ఛిత్తి వంటి హేయమైన పనులు జరుగుతున్నాయి. పురుషులతోపాటు స్త్రీలకు విద్య,సాది óకారిత, హక్కులు,అభివృద్ధిలో భాగస్వా మ్యం సమానంగా లభించి నప్పుడే సమాజం అన్ని విధాలా అభ్యున్నతి సాధి స్తుంది. గృహహింస, విడాకుల చట్టం.. ఇలా ఇంకా ఎన్నో చట్టాలు నేడు స్త్రీలకు రక్షణ కవచాలుగా మారాయి. మహిళలే స్వయంగా రాజకీయ చక్రం తిప్పుతున్న నేటి సమాజంలో, మహిళా బిల్లు ప్రవేశ పెట్టటానికి ఎన్ని అవస్థలు పడ్డారో, ఎన్ని ఆటంకాలు ఎదురవుతు న్నాయో తెలిసిన విషయమే.
మహిళా సాధికారిత లేకుండా మానవ జాతి అభ్యున్నతి సాధించలేదు. ఇది జరగాలంటే పురుషుల ఆలోచనా విధానంలో పూర్తిగా మార్పులు రావడం తప్పనిసరి. ప్రపంచ జనాభాలో మహిళలు సగ భాగం. ఈ సగభాగం కృషి లేకుండా అన్ని రంగాల్లో అభ్యున్నతి సాధించడం సాధ్యం కాదు. కనుక తమకంటే స్త్రీలు తక్కువ అన్న దృక్ప థాన్ని పురుషులు విడిచిపెడితేనే సమాజం, దేశం, ప్రపంచం అభివృద్ధి చెందుతాయి.
వివిధ రంగాల్లో తమకు సాటిగల వారు లేరని స్త్రీలు నిరూపి స్తున్నారు. సైన్స్‌, టెక్నాలజీ రంగాల్లోనే కాకుండా రాజకీయాలు, కళలు, సాహిత్యం, క్రీడలు, విద్య మొదలైన అనేక రంగాల్లో దేశం రాణించ డానికి, అభ్యున్నతి చెందడానికి భారతీయ మహిళలు అద్బు Ûతమైన కృషి చేశారు. మహిళలు ఇప్పుడు మన సాయుధ దళాలలో చేరి యుద్ధరంగంలో కూడా దిగారు. ఇటీవలే మన యుద్ధ విమానా లను నడిపేందుకు ముగ్గురు మహిళలు వైమానిక దళంలో చేరి దేశం గర్వపడేలా చేశారు. వివిధ కార్పోరేట్‌ సంస్థల బోర్డుల్లో మహిళలు బోర్డు డైరెక్టర్లుగా ప్రవేశించిన తర్వాత చెప్పుకోదగ్గ ఆర్థిక ఫలితాలు వచ్చాయని ఓనివేదిక పేర్కొంది. ఒకస్త్రీ విద్యావంతురాలైతే మొత్తం కుటుంబం విద్యావంతం అయినట్లు లెక్క. అప్పుడు సమాజం, దేశం మొత్తం విద్యావంతంగా మారుతుంది. స్త్రీ,పురుషుల మధ్య సమా నత్వం,లింగపరమైన వివక్ష లేకుండా చూడడం అనేది దేశంలో ప్రతి పౌరుడి బాధ్యత. మహిళలకు సమానమైన పని, సమానమైన వేత నాలు, సమాన ఆస్తి కల్పించాలి.-డా. దేవులపల్లి పద్మజ