అటవీ హక్కుల చట్టం..ఆదివాసీలకు అన్యాయం

‘‘ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో అడవుల్లో నివసిస్తున్న ఇలాంటి 10 లక్షల కుటుంబాలు అక్కడి నుంచి ఖాళీ చేయాలని సూచించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే దానిపై తానే స్టే తెచ్చుకుంది. అటవీ హక్కుల కోసం వచ్చిన 40 లక్షల దరఖాస్తులను పరిశీలించిన అనంతరం 17 రాష్ట్రాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా సుప్రీం ఈ ఆదేశాలు జారీచేసింది. మూడు తరాలుగా అడవిలోనే నివిసిస్తున్న ఆధారాలుచూపుతూ వచ్చిన దరఖాస్తులను మూడు దశల్లో పరిశీలించిన తరువాత ఈ రాష్ట్రాల్లో సుమారు 18 లక్షల దరఖాస్తులను ఆమోదించారు. వారికి భూపత్రాలు కూడా అందించారు. ఇదే సమయంలో 10 లక్షలకు పైగా కుటుంబాల నుంచి వచ్చిన దరఖాస్తులను తిరస్కరించారు. దీంతో వారంతా అడవులను ఖాళీ చేసి వెళ్లిపోవాలని సుప్రీం ఆదేశించింది. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున గిరిజనులను తరలించాల్సి రావడం అనేది ఇదే ప్రథమమని ఎన్విరాన మెంటల్‌ జర్నలిస్ట్‌ నితిన్‌ శేఠీ అన్నారు. అడవులు ఆక్రమణకు గురవుతున్నాయని.. అడవుల్లో అక్రమంగా నివసిస్తున్నవారి కారణంగా వన్యప్రాణి సంరక్షణ ప్రమాదంలో పడుతోందని వైల్డ్‌ లైఫ్‌ యాక్టివిస్ట్‌లు న్యాయస్థానాలను ఆశ్రయించారు. అటవీ హక్కుల చట్టం అనేది అనాదిగా అరణ్యాల్లో నివసిస్తున్నవారికి భూమిపై హక్కు కల్పించడానికి ఉద్దేశించిందే కానీ భూపంపిణీ, వితరణకు ఉద్దేశించింది కాదని పిటిషన్‌దారులు అంటున్నారు. గిరిజనానికి మద్దతుగా మాట్లాడుతున్న వారు మాత్రం ఈ చట్టం అమలు లోపభూయిష్ఠంగా ఉందంటున్నారు. ..’- గునపర్తి సైమన్‌

భారత్‌ 10కోట్ల మంది గిరిజనులకు ఆవాసం.. ఓచరిత్రకారుడి మాటల్లో చెప్పాలంటే వారు అణగారిన అల్పసంఖ్యాకులు. ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్న రాష్ట్రాల్లోని దట్టమైన అడవుల్లో వీరు మనుగడ కోసం పోరాడుతూ దుర్భర జీవనం గడుపుతున్నారు. దేశంలోని మొత్తం గిరిజన జనాభాలో 40 లక్షల మంది రక్షిత అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దేశంలో సుమారు 500 వైల్డ్‌ లైఫ్‌ శాంక్చ్యురీలు, 90జాతీయ పార్కులు ఉన్నాయి. ఇది భారతదేశ మొత్తం విస్తీర్ణంలో సుమారు 5శాతం ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం 2005డిసెంబర్‌13కి పూర్వం నుంచి అడవిలో నివిసిస్తున్న గిరిజనులకు వారి అనుభవంలో ఉన్న భూమిలో నివసించే హక్కు ఉంటుంది. అడవుల్లోని ఇతర సంప్రదాయ తెగలు ఎవరైనా నివాసం ఉంటే వారు 2005 డిసెంబరు 13కి పూర్వం నుంచి మూడు తరాలు అక్కడ నివసిస్తున్నట్లు ఆధారాలు చూపించాలి. అప్పుడే వారి ఆక్రమణలో ఉన్న అటవీ భూమిపై వారికి హక్కు ఉంటుంది. ఇక్కడ తరం అంటే చట్టంలో 25ఏళ్లుగా తీసుకున్నారు. అంటే.. 2005 డిసెంబరు 13కి ముందు 75 ఏళ్లుగా అక్కడ నివసిస్తున్నవారై ఉండాలి. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో అడవుల్లో నివసిస్తున్న ఇలాంటి 10లక్షల కుటుంబాలు త్వరలో అక్కడి నుంచి ఖాళీ చేయాలని సూచించింది. అటవీ హక్కుల కోసం వచ్చిన 40లక్షల దరఖాస్తులను పరిశీలించిన అనంతరం 17రాష్ట్రాలు ఇచ్చిన సమా చారం ఆధారంగా సుప్రీం ఈఆదేశాలు జారీచేసింది. మూడు తరాలుగా అడవిలోనే నివిసిస్తున్న ఆధారాలుచూపుతూ వచ్చిన దరఖాస్తులను మూడు దశల్లో పరిశీలించిన తరువాత ఈరాష్ట్రాల్లో సుమారు 18లక్షలదరఖాస్తులను ఆమోదించారు. వారికి భూపత్రాలు కూడా అందించారు. ఇదే సమయంలో10 లక్షలకు పైగా కుటుంబాల నుంచి వచ్చిన దరఖాస్తులను తిరస్కరించారు. దీంతో వారంతా అడవులను ఖాళీ చేసి వెళ్లిపోవాలని సుప్రీం ఆదేశిం చింది. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున గిరిజనులను తరలించాల్సి రావడం అనేది ఇదే ప్రథమమని పర్యావరణం, అటవీ సామాజికవేత్తలు అభిప్రాయపడు తున్నారు. అడవులు ఆక్రమణకు గురవుతున్నాయని..

చిన్న రైతులు సతమతం

దేశంలో వ్యవసాయ కమతాలు నానాటికీ చిక్కిపోతున్నాయి. సాగు రంగానికి ఆలంబనగా ఉన్న చిన్న, సన్నకారు రైతులు అన్ని విధాలుగా చితికిపోతున్నారు. వ్యవసాయాన్ని ఏకంగా బడాసంస్థల పాలుచేసే ప్రభుత్వ ప్రయత్నాలు వారిని మరింత కుంగదీసేవే. కష్టనష్టాల కడలిలో చిక్కిన చిన్న రైతులను ఒడ్డున పడేసేందుకు సర్కారు సమగ్ర చర్యలు చేపడితేనే ప్రణాళిక లక్ష్యాలను చేరుకోగలం.దేశంలో సగానికి పైగా కమతాలు చిన్న, సన్నకారు రైతుల చేతిలోనే ఉన్నాయి. వీరి సంఖ్య పదికోట్లకు పైమాటే. వ్యవసాయమే వీరికి ప్రధాన ఆదాయ వనరు. ఏటా దాదాపు 15నుంచి 20లక్షలమంది చిన్న, సన్నకారు రైతులు అదనంగా చేరుతున్నారు.
వీరి కమతాల ఉత్పాదకత, నికర లాభాలు పెంచటానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్న దాఖలా లేదు. ఆహారభద్రత వంటి భారీ లక్ష్యాలు పెట్టుకొన్న ప్రభుత్వం,చిన్న,సన్నకారు రైతులను విస్మరిస్తే భంగపాటు తప్పదని గ్రహించాలి. వాస్తవంలో, కమతాల విస్తీర్ణం ఆధారంగానే రైతులను వర్గీకరిస్తారు. ఒకటి నుంచి రెండు హెక్టార్ల కమతమున్నవారిని చిన్న రైతులని, అర హెక్టారు నుంచి ఒక హెక్టారు కమతం విస్తీర్ణమున్న రైతులను సన్నకారు రైతులని అంటారు. దేశంలో నేడు రైతంటే చిన్న, సన్నకారు రైతులే. మొత్తం రైతుల్లో 80శాతానికి పైగా వీరే. వీరితలసరి కమతం పరిమాణం అయిదు ఎకరాలు. మనరాష్ట్రంలోనూ కమతాల విస్తీర్ణం తగ్గిపోతోంది. 2005-06లో రాష్ట్రంలో మొత్తం 1.44కోట్ల హెక్టార్ల సాగు భూమి ఉండేది. అయిదేళ్లలో అది 1.42కోట్ల హెక్టార్లకు పడిపోయింది. చిన్న కమతాల సంఖ్య పెరగటంతో కొంత భూమి సాగుకు అందకుండా పోయింది. రాష్ట్రంలో చిన్నకారు రైతుల తలసరి కమతం విస్తీర్ణం 0.7హెక్టార్లు. మొత్తం కమతాల్లో 84శాతం వీరివే. సగానికి పైగా సాగు విస్తీర్ణం ఈ రైతులదే. అధిక దిగుబడులతో ఆహార భద్రతకు వూతమిస్తున్నది చిన్న రైతాంగమే. పండ్లు, కూరగాయల సాగులో అధిక వాటా వీరిదే. 70శాతం కూరగాయలు, 55శాతం పండ్లు, 52శాతం ధాన్యపు గింజలు, 69శాతం పాల ఉత్పత్తి వీరి కృషి ఫలితమే.
అందని విస్తరణ సేవలు
పంట సాగులో రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గాలన్నా, నాణ్యమైన అధిక దిగుబడులు సాధించాలన్నా, వ్యవసాయ విస్తరణ సేవలు కీలకం. జాతీయ నమూనా సర్వే ప్రకారం రైతుకు అందుతున్న ప్రభుత్వ విస్తరణ సేవలు తొమ్మిది శాతమే. ప్రైవేటురంగమే నయం. వారినుంచి 19శాతం సలహాలు అందుతున్నాయి. కానీ, వారి సేవలవల్ల పంటల ఉత్పాదకత పెరగటం లేదన్నది నిజం. ఏటా దాదాపు లక్షకోట్ల రూపాయలకు పైగా వ్యవసాయ విస్తరణ, పరి శోధనపై ఖర్చుపెడుతున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ఆపరిశోధన ఫలాలు రైతులకు అందడం లేదు. పంట రుణాల విషయంలోనూ అదే పరిస్థితి. సకాలంలో పంటల ఉత్పత్తికి కావలసిన కారకాల కొనుగోలుకు పరపతి ముఖ్యం. ప్రభుత్వాలు గొప్పగా చెబుతున్న పంట రుణాలు చిన్న రైతుకు అందటంలేదు. బ్యాంకుల నుంచి రైతులకు అందుతున్న పరపతి కేవలం 15శాతమే. చిన్న, సన్నకారు రైతుల్లో అత్యధికులు పరపతి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. పంటల మార్కెటింగ్‌లోనూ చిన్న రైతు చిత్తవుతున్నాడు. వీరి ఉత్పత్తుల పరిమాణం తక్కువగా ఉండటంవల్ల కనీస మద్దతు ధర పొందుతున్న సందర్భాలు చాలా తక్కువ. మార్కెట్ల అందుబాటూ అంతంతే. దేశంలో 30శాతం చిన్న, సన్నకారు రైతులకు నియంత్రిత మార్కెట్‌ సేవలు అందుబాటులో లేవు. వారు నేరుగా సంఘటిత మార్కెట్లోకి అడుగుమోపే అవకాశం లేదు. మార్కెటింగ్‌లో చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేందుకు ‘రైతు ఉత్పత్తి సమాఖ్యలు’ ఏర్పాటు చేయాలని జాతీయ సలహా మండలి ఇటీవల ప్రభుత్వానికి నివేదించింది. దీనివల్ల చిన్న, సన్నకారు రైతులు సమాఖ్యగా ఏర్పడి, తమ ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసుకుని, గిట్టుబాటు ధర పొందేం దుకు వీలవుతుంది. ఉత్పత్తి కారకాలు, ఆర్థిక పరపతీ ఈ సమాఖ్య నుంచే చిన్న, సన్నకారు రైతులకు అందుతాయి. ప్రస్తుత ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా చిన్న, సన్నకారు రైతులకు తగినంత పరపతి అందటం లేదు. ఈ సంఘాల్లో సభ్యత్వం పొందటానికి సొంత భూమి ఉన్న రైతులే అర్హులు. ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులు చిన్న కమతాలతో కౌలుదారులుగా సాగు చేస్తున్నారు. పరపతి సంఘాల్లోని సభ్యుల్లో 20శాతం లోపే చిన్న, సన్నకారు రైతులున్నారు. ఈసమాఖ్యల్లో భూమితో సంబంధం లేకుండా వారికి సభ్యత్వం ఉంటుంది. దేశమంతటా ఈతరహా సమా ఖ్యలు స్థాపించి, అమలు చేయడానికి పన్నెండో పంచవర్ష ప్రణాళికలో మొత్తం రూ.3,600కోట్లు అవసరమని అంచనా. 15నుంచి 20 గ్రామాలకు కలిపి 1000 నుంచి 1200 మందితో ఒక్కో సమాఖ్య ఉంటుంది. ఒక్కో రైతుకు షేర్ల రూపంలో వాటా ఉండి-ఆ ప్రకారం ఆదాయం వస్తుంది. వీటి స్థాపన కోసం కంపెనీల చట్టంతోపాటు మార్కెట్‌ యార్డు చట్టంలోనూ మార్పులు చేయాలని సలహామండలి సిఫార్సు చేసింది. ఆ దిశలో ప్రభుత్వం ఎంత త్వరగా ముందడుగు వేస్తుందో చూడాలి!
సంస్కరణల దుష్ప్రభావం
ప్రపంచీకరణ, వాణిజ్య సరళీకరణా చిన్న రైతులపై దుష్ప్ర భావం చూపుతున్నాయి. ముఖ్యంగా పత్తి, నూనెగింజల సాగు, ధరల వంటివి విదేశీ వాణిజ్య ధోరణులపై ఆధారపడుతున్నాయి. ఈ పంట లను చిన్న, సన్నకారు రైతులే ఎక్కువగా సాగుచేస్తున్నారు. విదేశాల్లో ఎక్కువ సబ్సిడీలవల్ల ఆ ఉత్పత్తులు దేశంలోకి సులభంగా ప్రవేశించి
చిన్న, సన్నకారు రైతుల ఉత్పత్తుల మార్కెటింగ్‌ను పెంపొం దించడానికి ప్రభుత్వం కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించాలి.ఆ ఉత్పత్తులు ప్రకృతి సహజమైనవి. ఎక్కువ సేంద్రీయ ఉత్పత్తులు. అందువల్ల వాటిని ప్రత్యేకంగా అమ్ముకోనివ్వాలి. ప్రతినియంత్రిత మార్కెట్లో మొత్తం ఉత్పత్తుల్లో 15నుంచి 20శాతం వరకు చిన్న, సన్నకారు రైతుల ఉత్పత్తులు ఉండేలా ఆదేశించాలి. మారుమూల గ్రామాల్లో సైతం తక్కువ మోతాదు ఉత్పత్తులను కనీస మద్దతుధరకు కొనుగోలు చేసే కేంద్రాలు ఏర్పాటు చేయాలి. చిన్న రైతుల కమతాలు, ఉత్పత్తులను దృష్టిలో ఉంచుకుని వారికోసం ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాలు చేపట్టాలి. స్వయంసహాయక బృందాల మాదిరిగా ‘చిన్న రైతు సహాయక బ ృందాలు’ ఏర్పాటు చేసి, వారితోనే ఉత్పత్తులను కొనుగోలు చేయించి, ప్రభుత్వం ధర చెల్లించాలి. పన్నెండో పంచవర్ష ప్రణాళికలో సమ్మిళిత వ ృద్ధే లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యవసాయ వృద్ధిరేటు నాలుగు శాతంగా నిర్ణయించారు. ముఖ్యంగా చిన్న రైతుల అభివ ృద్ధితోనే అవి సాధ్యం. అందువల్ల వ్యవసాయ పరిశోధన, విస్తరణ కార్యక్రమాలను, వ్యవసాయ విధి విధానాలను చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కలిగించే విధంగా రూపొందించాలి. చిన్న రైతుల చింత తీరేది అప్పుడే!-(రచయిత – డాక్టర్‌ పిడిగెం సైదయ్య)

మన మూల వాసులు

‘‘మనిషి మనుగడకు మూలం ప్రకృతి నుంచే మొదలయ్యింది. నాగరికతకు దూరంగా, ప్రక ృతిలో భాగంగా ఉండే అడవులు, కొండలు, కోనలు, వాగులు, వంకల్ని అంటిపెట్టుకొని ఇప్పటికీ కొందరు మనుషులు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వారే దేశీయతెగలు, ఆదివాసీలైన మూలవాసులు. మనదేశంలో ఒక్కో మూల ఒక్కో ఆది వాసులకు సంబంధించిన మూలాలు కనిపిస్తాయి. మన దేశ కథ చెప్పాలంటే ముందుగా వీరి ఘట్టంతోనే మొదలుపెట్టాలి. మూలవాసులతోనే అసలైన భారతీయ సంస్క ృతిని ప్రపంచానికి చూపించాలి. అడవితో అను బంధాన్ని ఇంకా సజీవంగా మిగులుస్తోన్న ప్రకృతి బిడ్డల జీవనాన్నే ‘అబౌట్‌ ఇండియా’లో ముందుగా వివరించాలి. వివిధ ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన ఆతెగల ఆచారాలు, సాంప్రదాయాలకు సంబంధించిన విశేషాల సమాహారం ’’
ఆఫ్రికాలోని ఇథియోపియా, బ్రెజిల్‌లోని అమెజాన్‌ అటవీ ప్రాంతం పురాతన ఆటవిక తెగలకు స్థావరం అని ఎక్కువమందికి తెలుసు. మరి మనదేశంలోనూ అలాంటి తెగలు దాదాపు500పైగా తెగలుగా ఉన్నవారి గురించి తెలిసింది మాత్రం అతితక్కువమందికే. ఆహార్యం,భాష,నృత్యం, ఆచారాలు ఇలా ఈతెగల్లో ఎన్నోవైవిధ్యాలు ప్రత్యేకతలు కనిపిస్తాయి. అలాంటి తెగల్లో గోండ్‌తెగ ఒకటి. ఈతెగకు చెందినవారు చత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లాతోపాటు, మహారాష్ట్ర, అంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నా అత్యధికó సంఖ్యలో గోండ్లు నివసిస్తోంది మధ్యప్రదేశ్‌లోని చింద్‌వారా జిల్లాలోనే. అడవికి దగ్గరలోని ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో వీరు మట్టి ఇళ్ళను ఏర్పాటుచేసుకుని నివసిస్తుంటారు. ఇలా అధిక సంఖ్యలో గోండ్లు నివసించే కొన్ని ఆవాసాల్ని గోండ్ల గ్రామం అని పిలుస్తారు. ఇలాంటి మహారాష్ట్రలో మనకు ఎక్కువగా కనిపిస్తాయి. గోండ్ల గ్రామంలో ఒకగ్రామ పెద్దఉంటాడు. ఆయన్ని మాహజి/పటేల్‌ అనిపిలుస్తారు. ప్రతిగోండు గ్రామంలో గ్రామపెద్దతో పాటు ఒక మహిళ కూడా ఆ ఊరికి పెద్దదిక్కుగా ఉంటారు. వీళ్ళు జరుపుకునే పండుగల్లో వీరిరువురినీ ప్రత్యేకంగా అంలంకరించి సత్కరిస్తుంటారు. ఇక ఈతెగలో పేద ధనికలాంటి అసమానతలేవీ ఉండవు. ఈతెగ మహిళలు స్వయంగా ఎంపిక చేసుకున్న వ్యక్తులతోనే వారి వివాహాన్ని జరిపించే ఆచారం కూడా ఉంది. మహిళలు చీరల్ని మాత్రమే ధరిస్తారు. ఇక ఈతెగ మహిళల ఆహార్యం సాదాసీదాగానే ఉన్నా వృత్తాకారంలో సత్తుతో తయారుచేసిన కంఠాభరణాలతోపాటు, చెవిభాగంలో ధరించే పెద్ద రింగులతో ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తారు. మధ్యప్రదేశ్‌లో జరిగే మదాయి జాతర లో సాంప్రదాయ వస్త్రాలతో ఈతెగకు చెందిన స్త్రీ,పురుషులిరువురూ కలిసి చేసే నృత్యం కన్నుల పండుగగా ఉంటుంది. తెలంగాణలో నాగోబా జాతర గోండు తెగలు విశేషంగా జరుపుకునే పండుగ. ఈ తెగ ఎక్కువగా తీసుకునేది మాంసాహారమే అయినా, కొడొ, కుట్కి చిరుధాన్యాలతో చేసే వంటకాలను వీళ్ళు ఎక్కువగా ఆహారంగా తీసుకుంటారు. గోండీ వీరిప్రధాన భాషే అయినా, మనదేశంలో వివిధ రాష్ట్రాల్లో సంచార జీవనం కొనసాగించే ఈ తెగలో చాలా మందికి తెలుగు, హిందీ, మరాఠీ, పారీభాషలతోపాటు ఇతర ద్రవిడ భాషలూ తెలుసు. కమ్మరి, పశువుల కాపరి, డప్పు వాద్యంలాంటి వృత్తుల్లో ఈ తెగకు చెందిన పురుషులు కొనసాగుతున్నారు.
గూమర్‌ పుట్టిందిక్కడే…రాజస్థాన్‌కు చెందిన ఒక ప్రధాన తెగ భిల్‌. దుంగార్‌పూర్‌, బన్స్‌వారా జిల్లాలతోపాటు ఉదరుపూర్‌లోని సిరోహి ప్రాంతంలో ఈ తెగ నివాసాలు కనిపిస్తాయి. వీళ్ళ వస్త్రధారణ దాదాపు రాజస్థానీ సాంప్రదాయ దుస్తులని పోలుంటుంది. ఈ తెగ మహిళలు కంచుతో చేసిన వివిధ రకాల ఆభరణాల్ని ధరిస్తారు. సంగీతం, నృత్యానికి ఈతెగలో ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తుంది. భిల్‌ తెగలో జరిగే పండుగలను గ్రామ పెద్ద నిర్వహిస్తుంటారు. వారిని భగత్‌ అని పిలుస్తారు. ఈతెగ జరుపుకునే పండుగల్లో బనేశ్వర్‌ జాతర ప్రధాన పండుగ. ఈపండుగ సమయంలోనే మహిళలు గూమర్‌ నృత్యాన్ని ప్రదర్శిస్తుంటారు. అంటే..రాజస్థాన్‌ సాంస్క ృతిక ప్రతీకగా చెప్పుకునే గూమర్‌ న ృత్యానికి ఊపిరి పోసింది ఈ తెగ మహిళలేనన్న మాట. ఈ తెగలో ప్రదర్శించే మరో ప్రధాన నృత్యం గైర్‌జ. ఇక ఈ తెగలో దేవతారాధన ఉన్నా వాటికి సంబంధించి ఎలాంటి గుళ్ళూ కనిపించవు. స్థానికంగా ఉండే మిగతావాళ్ల ఆలయాల వద్దే వీరి పండుగలకు సంబంధించిన వేడుకలు జరుగుతుంటాయి. వేటతెగలో ప్రధాన లక్షణంగా ఉన్నా ప్రస్తుతం జీవనోపాధి కోసం ఎక్కువ మంది వ్యవసాయం, పశుపోషణలో కొనసాగుతున్నారు. ఇక తెగలో మహిళలు ఎక్కువ ధైర్య సాహసాల్ని కలిగుంటారు.
తిరుగుబాటు తెగ
బాంగ్లాకు చెందిన పురాతన తెగ సంతల్‌. బెంగాల్‌లోని బంకుర, పురులియా జిల్లాల్లో తెగకు చెందిన వారు కనిపిస్తారు. బాంగ్లాతోపాటు జార్ఘండ్‌్‌,ఒడిశా,అస్సోంరాష్ట్రాల్లో నివసిస్తున్న ఈ తెగ మొత్తం జనాభా 49 వేలు. వీరిప్రధాన భాష సంతలితోపాటు బెంగాలీ, ఒరియా, హిందీ భాషలను కూడా మాట్లాడుతుంటారు. వేటతోపాటు అరణ్య ప్రాంతాల్లో లభించే పళ్ళు, కాయల్ని ఈ తెగ ప్రధాన ఆహారం గా ఉంటుంది. వీరు నిర్వహించే ప్రతి చిన్న వేడుకలో నృత్యం తప్పని సరిగా ఉంటుంది. ఈ తెగలో పురుషులు ఫ్లూట్‌తోపాటు తుండక్‌, తమక్‌,జున్కొ,సింగా ఇలా రకరకాల వాద్యపరికరాలను తయారు చేస్తుంటారు. వీరునిర్వహించే పండుగల్లో కరమ్‌ ఒక ప్రధాన పండుగ. సెప్టెంబర్‌ అక్టోబర్‌ నెలల మధ్య జరపుకునే ఈ పండుగలో మహిళలు తలపై ఒక కూజాను ఉంచుకొని చేసే నృత్యం కన్నుల పండుగగా ఉంటుంది. బ్రిటీష్‌ తిరుగుబాటు ఉద్యమాల్లోనూ ప్రధాన పాత్ర పోషిం చిందీ తెగ.
మాతృస్వామిక తెగ
మిజోరాంకు చెందిన గారొ తెగ మాతృస్వామ్య వ్యవస్థ కలిగుంటుంది. ఇక్కడ అన్ని పనులకూ నాయకత్వం వహించేది మహిళలే. కుటుంబ పోషణతోపాటు, ఆర్థిక విషయాలనీ గారొ తెగలో మహిళలే చూసు కుంటారు. అలా మనదేశంలోమాతృస్వామిక వ్యవస్థ కొనసాగుతున్న తెగల్లో గారొ ప్రముఖ స్థానాన్ని దక్కించు కుంది. మిజోరాంతోపాటు మేఘాలయ, అస్సోం, త్రిపుర, నాగాల్యాండ్‌ రాష్ట్రాల్లో ఈ తెగ మనుగడ సాగిస్తోంది. గారొ తెగ వారిని చిక్‌ మంన్డే అని పిలుస్తారు. చిక్‌ మంన్డే అంటే కొండ ప్రజలు అని అర్థం. మేఘాలయాలోని ఘరో కొండ ప్రాంతంలో ఎక్కువగా నివసించే ఈ తెగ ద్వారా వారికి ఆ పేరొచ్చింది. బర్మా, టిబెట్‌ దేశాల్లో కూడా ఈ తెగ విస్తరించింది. ఈతెగలో మహిళలు వివిధ లోహాలతో తయారుచేసే ఆభరణాలను ఎక్కువగా ధరిస్తుంటారు. వంగ్ల వీళ్ళ ప్రధాన పండుగ. పండుగ సమయంలో అంద మైన వస్త్రధారణతోపాటు వీరి నృత్యాలు కన్నులపండువగా ఉంటాయి. పంచెకట్టుతోపాటు తలపాగ ఈ తెగ పురుషుల ప్రధాన వస్త్రధారణ. ఈ తెగలో ఆడ మగ ఇరువురూ కొప్పుభాగంలో ఈకల్ని తప్పనిసరిగా ధరిస్తారు. గారో తెగ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటుంది. అదేంటంటే వీళ్ళు ఇళ్ళు కట్టడంలో ఆరి తేరినవారు. వెదురు వాసాలు, రెల్లు గడ్డిని ఉపయోగించి వీరు నిర్మించుకునే ఇళ్ళలో బహుళ అంతస్తులతోపాటు, గదులు గదులుగా ఈ ఇళ్ళని నిర్మించే తీరు ఆకట్టుకుంటుంది. ఈ ఇళ్ళను ఎంతో అందంగా అలంకరించుకుంటారు.
జిప్సీస్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌…
తెలుగు రాష్రాల్లో ప్రధాన తెగలుగా చెంచులు, గడబలు, గోండ్లు, అన్ధ్‌, బొండ పురజలు, కోయ, లంబాడీలు, సవరలు ఇలా కొన్ని తెగల పేర్లు వినిపిస్తాయి. చెంచులు శ్రీశైలం పర్వత ప్రాంతాలకు చెందినవారైతే, గడబ, కోయ తెగలు భద్రాచలం స్థానికత కలిగిన వారిగా చరిత్రకారులు చెబుతుంటారు. ప్రస్తుతం ఈ తెగల్లో అత్యధిక జనాభా ఉంది సవరలు, లంబాడీ తెగల్లోనే. విజయనగం, విశాఖ పట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో స్థానిక తెగలుగా ఉన్న సవరల సంఖ్య తెలుగు రాష్ట్రాల్లోని అన్ని తెగల జనాభా కంటే ఐదు శాతం ఎక్కువ. సవరలు ఎక్కువగా ఒకబృందంగా ఉంటారు. ఒక వరుసలో వీరి ఇళ్లను ఏర్పరుచుకుంటారు. ఈతెగలో ఉమ్మడి కుటుంబాలే ఎక్కువ. ఈ తెగకు చెందిన వారు ఎక్కువగా వ్యవసాయం, కమ్మరి, మేదరి, కుమ్మరి వృత్తుల్లో కొనసాగుతున్నారు. ఇలా వీరు నిర్వహించే వృత్తుల్ని బట్టి జాతి సవర, అర్సి, ములి, కిందల్‌, కంబి సవరల్లో ఉపతెగలుగా ఉన్నాయి. ఈతెగలో మహిళలు ఎక్కువగా ముక్కు బులాకీ లతో కనిపిస్తారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికంగా కనిపించే తెగ లంబాడీలు. వీరినే గోర్‌ బొయలి, బంజారా ఇలా చాలా పేర్లతో పిలుస్తుంటారు. భారత్‌లో వివిధ రాష్ట్రాలో లంబాడీ తెగను బంజారాలుగా పిలుస్తారు. వ్యవసాయం, పశుపోషణలో ఎక్కువగా ఈతెగ ప్రజలు కొనసాగుతున్నారు. లంబాడీ తెగలు నివసించే ప్రాంతాల్ని తాండ అని పిలుస్తారు. అన్ని తెగల కంటే వీరి వస్త్రధారణ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మహిళలు గాగ్రాచోళీలో బాటు తలపై ఒక వస్త్రాన్ని ధరిస్తారు. కంచు, ఇతర లోహాలతో చేసిన వివిధ రకాల ఆభరణాల్ని మహిళలు ధరిస్తారు. ఇక తెగలో మహిళలు భుజాల వరకు సత్తు, కంచుతో చేసిన గాజుల్ని ధరించడం ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఆధునిక సమాజానికి దగ్గరగా ఉండే ఈ తెగను ‘జిప్సీస్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’గా ఒకప్పుడు బ్రిటిషర్లు పిలిచేవారు. ఎక్కువగా అలంకరణ వస్తువుల్ని ధరించి నిండుగా కనిపించే ఈ తెగమహిళల ద్వారా లంబాడీ తెగకు ఆ పేరొచ్చింది.
వీరు మాత్రమే కాదు, ఆఫ్రికా మూలాల్ని ఇప్పటికి పదిలపరుచుకున్న సిద్దీస్‌, భారత్‌లోనే ఉంటూ ఒంటరిగా కనిపించే అండమాన్‌ జార్వాలు, సెంటినల్స్‌, ఇంకా ఆదీవాసీ వైవిధ్య ఛాయల్ని మిగుల్చుకున్న ఈశాన్య రాష్ట్రాల కాసీ, ఆగామీలతో పాటు మూన్ద్‌, భూటియా, కొడవ, టోటో, ఇరులాస్‌, నైషి, వార్లి, తోడ, కురుంబన్‌, సొలుగ, లాంటి భారతీయ స్థానికతను కలిగున్న తెగలన్నీ సంస్క ృతి, సాంప్రదాయలు, ఆచారాల్లో తమ ఔన్నత్యాన్ని చాటుతున్నాయి.-అద్దేపల్లి శర్వాణి

గ్రామీణ ఉపాధి హామీకి తూట్లు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రావటానికి కారణమైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒకవిలక్షణ స్వభావం ఉంది. కావాలని అడిగిన తరువాత ఒకపక్షం రోజుల్లోఉపాధి అందించాలని చట్టం చెబుతోంది. అలా ఉపాధి అందించలేనప్పుడు నిరుద్యోగ భృతి చెల్లించాలని కూడా ఈచట్టం చెబుతోంది. ఈచట్టం గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైందనేది నిజం. అయితే ఇది ఉపాధిని హక్కుగా మార్చింది. బాగా చర్చించిన తరువాత పార్లమెంటు ఈ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. భారత రాజ్యాంగం సామాజిక, రాజకీయ హక్కులకు మాత్రమే హామీ ఇచ్చి ఆర్థిక హక్కులను విస్మరించిందనే లోపాన్ని…ఈ చట్టాన్ని రూపొందించి ఆచరణలో పార్లమెంట్‌ సరిదిద్దింది.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో ఒక నూతన పరిస్థితి ఏర్పడిరది. గతంలో కూడా పేదరికం నిర్మూలనకు ఉద్దేశించిన పనికి ఆహారం వంటి పథకాలున్నాయి. అయితే వాటిలో హామీలు ఏమీ లేవు. వాటికి బడ్జెట్‌ కేటాయింపులు ఉండేవి. అవి ప్రతి సంవత్సరం మారుతూ ఉండేవి. ఆకేటాయింపులు ఒక్కోసారి పెరగటం, మరోసారి తరగటం జరిగేది. అయితే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వీటికి పూర్తిగా భిన్నమైంది. ఈచట్టం ఉపాధికి హామీని ఇచ్చింది. ఆ క్రమంలో ఆర్థిక హక్కును స ృష్టించటమే కాకుండా పౌరసత్వ భావనకు లోతైన అర్థాన్ని ఇచ్చింది. బిచ్చగాళ్ళతో సహా ప్రతి పౌరుడు తాను కొన్న సరుకులపై పరోక్ష పన్నుల రూపంలో ప్రభుత్వానికి పన్ను కడతాడు. కానీగతంలో రాజ్యం అందుకు బదులుగా ఆచరణలో పౌరులకు ఏమీ చేసేదికాదు. అది పౌరులకు ‘భద్రత’ను కల్పించిందని ఎవరైనా చెబితే అదిచాలా చిన్న విషయం అవుతుంది. ఎందుకంటే పేదలకు ‘భద్రత’ కల్పించటం అర్థరహితం అవుతుంది. అందుకు భిన్నంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒక నూతన శకానికి తెర లేపుతున్నానని వాగ్దానం చేసింది. ఈ పథకం ద్వారా రాజ్యం తన పౌరులకు కొంతవరకు ఆర్థిక భద్రతను కల్పించటానికి ముందుకు వచ్చింది. అంటే పేదలకు అది ఎంతోకొంత మేలు చేస్తుంది.
ఈపథకం కింద ఉపాధిని పొందుతున్నవారిలో 40శాతం దళిత, ఆదివాసీ కుటుంబాలకు చెందినవారే. పాలక వర్గాలకుండే కుల వివక్ష,వర్గవైషమ్యాల కారణంగాను ఈవాగ్దానం అమలులో తీవ్రమైన ఒడిదుడుకులు ఏర్పడ్డాయి. యుపిఏ-2 పాలనలో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి చేయవలసిన వాస్తవ బడ్జెట్‌ కేటాయింపులలో కోతను విధించటం ద్వారా ఈ పథకానికి తూట్లు పొడవటం మొదలయింది. ‘ఈ పథకం డిమాండ్‌ ను అనుసరించి అమలు చేసేది. కనక అవసరమైతే అదనపు కేటాయిం పులు చేయటం జరుగుతుంది. బడ్జెట్‌లో చేసిన కేటాయింపులనుబట్టి అభిప్రా యానికి రాకూడదు’ అంటూ ఈపథక కేటాయింపులకు కోత పెట్టడాన్ని ఆయన సమర్థించుకున్నారు. అయితే అలాచేయటంవల్ల కేటాయింపులకు మించి డిమాండ్‌ ఏర్పడినప్పుడు వేతన బకాయిలు పోగుపడ్డాయి. కేటాయింపుల కంటే డిమాండ్‌ నిరంతరం పెరుగుతుం డగా ఒకవేళ కేటాయింపులను పెంచకపోతే కాలక్రమంలో వేతన బకాయిలు పెరిగి పోతాయి. ప్రస్తుతం ఈవిషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. వేతన బకాయిలు నిరంతరం పెరిగి పోతున్నాయి. అంటే సంవత్సరకాలంలో అనేక మంది కార్మికులకు వేతనాలు అందవు. అంతే కాకుండా వేతనాలను అందుకోవటానికి పట్టే సగటు కాలం కూడా నిరంతరం పెరుగుతూ ఉంటుంది. వేతనాలు సకాలంలో అందని స్థితిలో కార్మికులు ఈపథకం నుంచి నిష్క్రమించటం మొదలెడ తారు. తత్ఫలితంగా ఈ పథకంకింద పనికి వుండే డిమాండ్‌ ఏదో ఒక స్థితిలో దెబ్బ తింటుంది. అదే సమయంలో చట్టప్రకారం నిరుద్యో గానికి చేయవలసిన చెల్లింపులు చెల్లించకుండా, కనీసం తగిన సమయంలో పేర్లు నమోదు చేసుకున్న వారికి కూడా పని ఇవ్వకుండా, దరఖాస్తు దారులను రిజిస్టరు చేయకుండా డిమాండ్‌ను తగ్గించే ధోరణి కనపడుతోంది. ఒక ఆర్థిక హక్కుగా ఉండవలసిన హక్కును నిర్వీర్యం చేయటం జరుగుతోంది. రాజ్యం దయాదాక్షిణ్యాలతో పేదలకు ఎంతోకొంత ఉపశమనం అందించే మరో పేదరిక వ్యతిరేక కార్యక్ర మంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మార్చటం జరిగింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేదరిక వ్యతిరేక కార్యక్రమంగా కూడా గణనీయమైన విస్త ృతి ఉంది. ఈకార్యక్రమం మొదలయినప్పటి నుంచి దేశం లోని ప్రతి మూడు గ్రామీణ కుటుంబాలలో ఒకదానికి ఎప్పుడో ఒకప్పుడు పని దొరికింది. 2017-18లోనే ఈ కార్యక్రమం కింద ఎనిమిది కోట్ల మంది ప్రజలకు పనిదొరికింది. ఆసంవత్సరంలో ప్రతి కుటుం బానికి సగటున 46 రోజులపాటు పని దొరికింది. ప్రపంచంలోనే అత్యంత ఉద్యోగితను స ృష్టించే పథకం ఇది. అయితే రానురాను ఈ కార్యక్రమానికి చేసే కేటాయింపులు తగ్గుతూ వస్తున్నాయి. నిజానికి ఇది ఉపాధి హామీ పథకం అవటం అటుంచి ఉపాధిని సృష్టించే కార్యక్రమంగా కూడా దీని విస్తృతి కుచించుకు పోతున్నది. ఇంతకు ముందే చెప్పినట్టు ఒకవేళ ఈపథకానికి చేస్తున్న కేటాయింపులు నిలకడగా ఉన్నట్టయితే లేక ప్రతిసంవత్సరం కావలసిన దానికంటే కేటాయింపులు తక్కువగా వుంటే కాలక్రమంలో వేతన బకాయిలు పెరుగుతాయి. అటువంటి పరిస్థితులలో నికర కేటాయింపులు, నికర వేతన బకాయిలు తగ్గుతాయి. అయితే వాస్తవంలో జరుగుతున్న దేమంటే చేస్తున్న కేటాయింపు లలో నిలకడ ఉండటం లేదు. నికర కేటాయింపులు తగ్గటం వలన నికర వేతన బకాయిలు కూడా గణనీ యంగా తగ్గాయి. ఉదాహరణకు 2017-18 సంవత్సరంలో ద్రవ్యోల్బణం సర్దుబాటు చేసిన తరువాత జరిగిన కేటాయింపు 2010-11సంవత్సరంలో జరిగిన కేటాయింపు కంటే తక్కువగా ఉంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2012-13లో కాలయాపనతో జరిగిన వేతన చెల్లింపులు 39 శాతం ఉండగా 2016-17లో కాలయాపనతో జరిగిన వేతన చెల్లింపులు 56 శాతంగా ఉండటంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
వేతన బకాయిలను కూడా లెక్క లోకి తీసుకోకుండా చేసే స్థూల కేటాయింపులో తగ్గుదల స్థూల జాతీయోత్పత్తితో పోల్చి చూసిన ప్పుడు చాలా తీవ్రంగా ఉంది. ఈ కార్యక్రమం సరిjైున రీతిలో నడవాలంటే స్థూల జాతీయోత్పత్తిలో 1.7శాతం కేటాయించాలని ప్రపంచ బ్యాంకు కూడా అంచనా వేసింది. అందుకు భిన్నంగా 2017-18 సంవత్సరంలో జరిగిన కేటాయింపు (వాస్తవంలో చేసిన వ్యయం కాదు) కేవలం 0.28 శాతం మాత్రమే. 2010-11సంవత్సరంలో 0.58 శాతంగాను, 2011-12 సంవత్స రంలో 0.34 శాతంగాను ఉన్న కేటాయింపుల కంటే 2017-18 సంవత్సరంలో చేసిన కేటా యింపు తక్కువగా ఉంది. వాస్తవ వ్యయాలను, అంతకు ముందటి సంవత్సరాల నికర రుణాలను చూసినప్పుడు స్థూల జాతీయోత్పత్తిలో అటువంటి నికర వ్యయం వాటా 2012-13వ సంవత్సరంలో 0.36 శాతంఉంటే 2016-17సంవత్సరం కల్లా అది 0.30 శాతం కంటే కిందకు దిగ జారింది. కాబట్టి మనం ఏవిధంగా చూసినప్పటికీ స్థూల జాతీయోత్పత్తిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం కేటాయిస్తున్న నిధుల శాతం సాపేక్షంగా చూసినప్పుడు కాలక్రమంలో తగ్గిపోతున్నది. అయితే వేతనాల చెల్లింపులు సకాలంలో జరగటం లేదనే వాస్తవాన్ని ప్రభుత్వం అంగీకరించటం లేదు. నిజానికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేసే వేతనాల చెల్లింపులలో 90శాతం15రోజులలోపు జరుగుతున్నా యని ప్రభుత్వం అంటోంది. అయితే ఇది పూర్తిగా అబద్దం. 3500 గ్రామ పంచాయతీలను ఒకశాంపిల్‌గా తీసుకుని ఒక పరిశోధకుల బృందం సవివరంగా చేసిన అధ్యయనాన్ని జనవరి 4న కొత్త ఢల్లీిలో ఏర్పాటు చేసిన ఒకపత్రికా సమావేశంలో విడుదల చేశారు. ఈఅధ్య యనం ప్రకారం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరిగిన పనికి చేయవలసిన వేతన చెల్లింపులు సగటున 50 రోజులు ఆలస్యంగా జరుగు తున్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కార్మికులకు ఎదురవు తున్న ఇతర ప్రతిబంధకాలకు అదనంగా సకాలంలో అందవలసిన వేతనాలను ఆధార్‌తో లింకు చేయాలని అంటున్నారు. తత్ఫలితంగా ఈ కార్యక్రమం కింద లభిస్తున్న పనికిగల డిమాండ్‌ మందగిస్తుంది. వాస్తవంలో డిమాండ్‌ చేసిన పనిని కూడా ఇవ్వటంలేదు. అటువంటి పరిస్థితిలో చట్ట ప్రకారం చెల్లించవలసిన నిరుద్యోగ భృతి కూడా చెల్లించటం లేదు. నిజానికి మహాత్మా గాంధీజాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒకడిమాండ్‌ ఆధారిత కార్యక్రమంగా పని చేయటం లేదనేది సుస్పష్టం. అందుకోసం అందుబాటులో ఉంచే వనరులపై దాని విస్తృతి ఆధారపడి ఉంటుంది. ఒకడిమాండ్‌ ఆధారిత కార్యక్రమానికి వనరులు అందుబాటులో లేకపో వటమనే పరిస్థితిలో వైరుధ్యం ఉంది. అటువంటి కార్యక్రమానికి ముందుగా బడ్జెట్‌లో కేటాయింపులు ఉండాలి. నిధులు అందుబాటులోఉండటాన్ని బట్టి ప్రజల ఆర్థికహక్కును ప్రతిబింబించే అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించటం జరగ కూడదు. ఇటువంటి పథకానికి నిధులను కేటాయించటం కోసం ప్రజల హక్కును ప్రతిబింబించని కార్యక్రమాలపై ప్రభుత్వం చేసే వ్యయాన్ని తగ్గించుకోవాలి. అయితే ఆచరణలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉందని మనం గమనిస్తాం. అంటే ఇతర వ్యయాలకు ప్రాధాన్యతను ఇచ్చిన తరువాత మిగిలిందే ఈ పథకానికి కేటాయింపులు జరుగుతున్నాయి. పర్యవసానంగా పనికిగల డిమాండ్‌ ను అనుసరించి చేయవలసిన వ్యయానికి సరిపడా నిధులు అందుబాటు లో ఉండటం లేదు. పైన పేర్కొన్న అధ్యయనం ప్రకారం పని కోసం వస్తున్న డిమాండ్‌లో భాగంగా అధికారికంగా రిజిష్టర్‌ చేసుకున్న వారిలో కూడా 68శాతం కంటే ఎక్కువ మందికి వాస్తవంలో పని కల్పించటం లేదు. అధికారికంగా రిజిష్టర్‌ చేసుకున్న పని డిమాండ్‌లో వాస్తవంలో సగం మందికి కూడా అందుబాటులోకి రావటం లేదు. ఈనిష్పత్తి పెరుగుతూ ఉంది. ఆవిధంగా ప్రజల ఆర్థిక హక్కు రద్దవు తోంది. ఇది ఈచట్టాన్ని చేసిన పార్లమెంటుపై దాడితో సమానం అవుతుంది. ఈపథకాన్ని ఉద్యోగితను సృష్టించే సామాన్యమైన కార్యక్ర మంగా తీసుకున్నా దీని విస్తృతి కాలక్రమంలో తగ్గిపోయింది. ఇదో విపరీత స్థితి. దేశంలో వేగంగా పెరుగుతున్న నిరుద్యోగితపై చాలా కాలం తరువాత దృష్టిని కేంద్రీకరించారు. అటువంటి నిరుద్యోగంపై అన్ని ప్రభుత్వ వ్యయాలకంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒక బ్రహ్మాండమైన ఆయుధంగా పని చేయగలదు. ఒకవేళ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని అనుకుంటే ఈపథకాన్ని నిర్వీర్యం చేయటానికి బదులుగా దానిపై మరింతగా వ్యయం చేయాలి. అయితే ప్రస్తుత ధోరణి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేదిగానే ఉంది.- కందుకూరి సతీష్‌కుమార్‌

చిరు ధాన్యాలు కాదు..సిరి ధాన్యాలు

చిరు ధాన్యాలు ఎక్కువ ఉష్ణోగ్రతలను, బెట్టను తట్టుకొనే పంటలు కనుక కరువు పీడిత ప్రాంతాలలో కూడా పండిరచటానికి వీలుంటుంది. చిరుధాన్యాలలో పీచు పదార్థం, ఇనుము, కాల్షియం, విటమిన్లు అధికంగా ఉండటం వల్ల ఇవి ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. గడిచిన మూడు నాలుగు దశాబ్థాల కాలంలో జీవన శైలిలో వచ్చిన మార్పులు వల్ల మన ఆహార విధానంలోనూ మార్పులు వచ్చాయి. తద్వారా ప్రబలుతున్న దీర్ఘకాలిక వ్యాధుల ద ృష్ట్యా తిరిగి చిరుధాన్యాల వాడకంపై ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో వ్యవసాయాభివ ృద్ధికి తోడ్పడే గ ృహవిజ్ఞాన విభాగం నుంచి చిరుధాన్యాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించే ప్రచారం పెరిగింది. ఇందులో భాగంగా గ ృహవిజ్ఞానంలో పరిశోధకురాలిగా ఉన్న డాక్టర్‌ కీర్తి చిరుధాన్యాల ప్రాముఖ్యత, వాటితో చేసుకోదగిన వంటల గురించి వివరిస్తున్నారు.- కె.కీర్తి
చిరుధాన్యాలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల చిరుధాన్యాల వాడకం పెరుగుతుంది. తద్వారా రైతులు అధికంగా చిరుధాన్యాలను పండిరచడానికి మొగ్గు చూపుతారు. దీనితోపాటు రైతులకు అధిక ఆదాయం పెరిగే చిన్న కుటీర పరిశ్రమలనూ అభివ ృద్ధి చేసుకోవచ్చు. అయితే ప్రస్తుత ఆధునిక యుగంలో ఫాస్ట్‌ఫుడ్స్‌ వాడకం మూలంగా మార్కెట్‌లో చిరుధాన్యాలు లభించినప్పటికి చాలా మందికి వాటిని ఎలావినియోగించాలో తెలియక చిరుధాన్యాల వాడకాన్ని తగ్గించారు. చిరు ధాన్యాల పోషక విలువలను, చిరుధాన్యాలతో వివిధఆహార పదార్థాలను త్వరితగతిని చేసుకునే పద్ధతులపై అవగాహన పెంచడానికి కృషి చేస్తున్నారు గృహ విజ్ఞాన పరిశోధకులు. ఈప్రయత్నంలో భాగంగా చిరుధాన్యాలతో పౌష్టిక విలువలతో కూడిన సంప్రదాయ వంటలు ఎలా చేసుకోవాలో తెలియ జేస్తున్నారు.
చిరుధాన్యాలతో ఆరోగ్యం
మనం రోజూ తీసుకునే వరిఅన్నం, గోధుమల కంటే చిరు ధాన్యాలలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. రోజుతీసుకునే ఆహారంలో చిరుధాన్యాలను కూడా చేర్చడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు. చిరుధాన్యాల సాగుతో వీటి వినియోగ సామర్థాన్ని పెంచడానికి వీలుకలుగుతుంది. చిరుధాన్యాలలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల పిల్లల్లో, మహిళల్లో ఎముకల పుష్టికి అవకాశం ఏర్పడుతుంది. చిరుధాన్యాలలో పీచుపదార్థం,మాసంకృత్తులు, అమైనోయాసిడ్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి కనుక సులభంగా, నెమ్మదిగా జీర్ణం అవుతాయి. అంతేకాదు చిరుధాన్యాలను రోజువారి ఆహారంలో చేర్చ డం ద్వారా గుండె సమస్యలు, మధుమేహం, ఉబకాయం వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
రాగులు – ఆరోగ్య లాభాలు : రాగులు వాడితే ఎముకల పెరుగుదల, దృఢత్వం మెరుగవుతుంది. ఇవి అధిక బరువు నియంత్రణ, మధుమేహ వ్యాధి నియంత్రణ, రక్తహీనత నివారిస్తాయి. గ్లూటెన్‌ ఎలర్జీ, సీలియాక్‌ వ్యాధిగ్రస్తులకు రాగులు అనువైన ఆహారం. రాగిచేదు,కారం,వగరు, తీపిరుచులు కలిగి ఉంటుంది. రాగుల్లో ప్రోటీన్లు,అమినోయాసీడ్లు ఎక్కువగాఉంటాయి. లేలైన్‌,ధియోనైన్‌, ఐసో ల్యూసిన్‌, మిథియోనైన్‌, థైమీన్‌, ట్రిఫ్టోఫైన్‌ వంటి ముఖ్య అమినో యాసిడ్లు ఉండటం వల్ల కండరాలు పనిచేయటానికి, రక్తం ఏర్పడ టానికి, డిప్రెషన్‌లపై పోరాటానికి, శరీర పెరు గుదల హార్మోన్లు విడుదల అవ్వడానికి, మల బద్ధకం,ఊబకాయం, వ్రణాలకి మంచి ఆహా రం. ఇది జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. బాలిం త స్త్రీలలో పాలఉత్పత్తిని పెంచుతుంది. చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. పేగుక్యాన్సర్‌ బారిన పడకుండా ఉండటానికి ఇది చక్కని ఆహారం. రాగికి చలవ చేసే గుణం ఉండటంవల్ల వేసవి కాలంలో ఎండతాపాన్ని తట్టుకోవడానికి రాగిజావ, అంబరిని ఎక్కువగా తీసుకుంటారు. విటమిన్‌-ఎ, బి-1,బి-2, ఇనుము, కాల్షియం వంటి ఖని జాలు అధికంగా ఉండటంవల్ల రాగులను ‘పోషక ధాన్యంగా’ పిలుస్తారు. ఈ రాగులతో రాగిజావ, సేమ్యా,ఇడ్లి,వడ,పుల్లటి పునుగు లు,చెక్కపకోడి, పూరి,బూంది, మురుకులు, పొగడాలు, మిక్స్‌డ్‌ అటుకులు,లడ్డు, సంకటి, బొబ్బట్లు వంటి సంప్ర దాయ వంటకాలు చేసుకోవచ్చు.
జొన్నలు-ఆరోగ్య లాభాలు: జొన్నలతో అధిక శక్తి, పెరుగుదల సాధ్యమవుతుంది. అంతేకాక మలబద్ధకం నియంత్రణ, మధుమేహ వ్యాధి నియంత్రణ, కొలెస్ట్రాల్‌ నియంత్రణతో పాటు గ్లూటెన్‌ ఎలర్జీ, సీలియాక్‌ వ్యాధిగ్రస్తులకు అను వైన ఆహారం. జొన్నలు ఆరోగ్యవంతమైన జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు అధికంగాఉంటాయి. ఇది రక్తహీనతకు, మలబద్ధకానికి చక్కని ఆహారం. కండపుష్ఠికి,ఎముకల పటుత్వాన్ని పెంచు తుంది.కాల్షియం స్థాయిలను క్రమ బద్ధీకరిస్తుంది.రోగనిరోధక వ్యవస్థను పెం పొందిస్తుంది.ఇందులో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. క్యాన్సర్‌ బారినపడ కుండా కాపాడుతుంది. ఇది గ్లూటెన్‌ లేని ఆహారం. ధయామిన్‌, రైబోప్లేరిన్‌ పుష్కలంగా ఉండటంతో నరాల బలహీనతలు, మానసిక రుగ్మతలు, కాళ్లు చేతులు మంటలు, నోటి పుండ్లు, వార్థక్య రుగ్మతల నుంచి కాపాడతాయి. ఇలాంటి జొన్నలతో స్వీట్‌ దోశ, హాట్‌బాల్స్‌, జొన్న పాయసం, జొన్నబజ్జీ, జొన్నసేమ్యా, పాల తాలికలు, ఉప్మా, పొంగలి, జొన్న రవ్వ బిర్యాని, జొన్నరవ్వ, కిచిడి, బూంది, జొన్న వడ, అరటికాయ బజ్జీ, చెక్కలు, జంతి కలు, చెక్క పకోడి, జొన్న అటుకులతో చుడువా, మురిపి, గవ్వలు,లడ్డు, బర్ఫీ, అటుకుల పాయసం, వడియాలు మొదలైన వంటకాలు చేసుకోవచ్చు.
సజ్జలు-ఆరోగ్య లాభాలు: సజ్జలు అధిక శక్తి, శరీర పెరుగుదలకు తోడ్పడతాయి. ఇవి మల బద్ధకాన్ని నియంత్రిస్తాయి. రక్తహీనత నివారణ, కడుపులో పుళ్లను (అల్సర్‌) తగ్గించడం, గ్లూటెన్‌ ఎలర్జీ, సిలియాక్‌ వ్యాధిగ్రస్తులకు అనువైన ఆహారం. సజ్జలు వగరు, తీపి రుచులు కలిగి ఉంటాయి. సజ్జలలో పిండి పదార్థం అధికం, వీటిలో ప్రోటీన్లు, పీచు పదార్థం అధికంగా ఉంటాయి. సజ్జలలో ఉండే అమినోయాసిడ్లు గోధుమలో ఉండే అమినో యాసిడ్లు కంటే తేలికగా జీర్ణమవుతాయి. బి-కాంప్లెక్స్‌ మిటమిన్లు (నియాసిన్‌, మిథియోనైన్‌, థయామిన్‌, రైబోప్లైవిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, లెసిథిన్‌) పోటాషియం, మాంగనీస్‌, జింక్‌ వంటి అవసరమైన అనేక పాత్రలను సమర్థవంతంగా నిర్వర్తిస్తుంది. నియాసిన్‌ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. సజ్జలలో అధికంగా ఉండే భాస్వరం శరీరకణ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషి స్తుంది. జెనిటిక్‌ కోడ్‌ నిర్మాణంలో ముఖ్యమైన న్యూక్లిక్‌ యాసిడ్స్‌లో ఫాస్పరస్‌ ముఖ్యభాగం. కణాల పొరలు, నరాల నిర్మాణంలో పాత్ర పోషించే లిపిడ్స్‌లో కూడా భాస్వరం ఒక భాగం. సజ్జలతో తయారుచేసిన ఆహారాన్ని ప్రతిరోజు తీసుకుంటే స్త్రీలకు మూత్రపిండాలలో ఏర్పడే రాళ్ల సమస్య ఉండదు. శరీరంలో ట్రైగ్లీనరైడ్స్‌ స్థాయిని కూడా తగ్గిస్తుంది. ప్రతిరోజు సజ్జ ఆహరాన్ని తీసుకోవటం వల్ల స్త్రీలలో రొమ్ము క్యాన్సర్‌, పిల్లలో ఆస్తమా సమస్యలు తగ్గుతాయి. సజ్జలలో ఉండే అవసరమైన పోషకం లగ్నిన్‌ శరీరానికి చాలా ప్రయోజనకారి. ఇది క్యాన్సర్‌, గుండె ఆగిపోవటం వంటి ప్రమాదాలను అరికడు తుంది. సజ్జల ఆహారం డయోబెటిక్‌ టైపు-2ను కూడా తగ్గిస్తుంది. సజ్జలతో మసాలా రొట్టె, అప్పాలు, స్వీట్‌ పూరి,సేమ్యా, బిర్యాని, బూంది, వాంగీబాత్‌, నమక్‌ ఏరా, సజ్జ పకోడి, చెక్క పకోడి, మంచూరియా, బూంది లడ్డు, బొబ్బట్లు, మిఠాయి, బాదుషా, లడ్డు.
కొర్రలు ఆరోగ్య లాభాలు : శరీర పెరుగుదల, శరీర నిర్మాణంలో కొర్రలు తోడ్పడతాయి. సిలియాక్‌ జబ్బుకు అనువైన ఆహారమిది. కొర్రలు తీపి, వగరు రుచులు కలిగి ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు, రక్త హీనత నివారణలో ఇది మంచి ఆహారం. శరీరంలో కొలస్ట్రాల్‌ పరిమాణాన్ని తగ్గిస్తుంది. వీటిలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కొర్రలలో అధిక పీచుపదార్థం, మాంసక ృత్తులు, కాల్షియం, ఐరన్‌, మాంగనీస్‌, మెగ్నీషియం, ఫాస్పరస్‌, విటమిన్లు అధిక పాళ్లలో ఉంటాయి. కనుక చిన్న పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు మంచి ఆహారం. ఇవి ఉదర సంబంధ వ్యాధులకు మంచి ఉపశమనం కలిగిస్తాయి. కడుపు నొప్పి, మూత్రం పొసేటప్పుడు మంటగా ఉండటం, ఆకలిమాంద్యం, అతిసారం మొదలగు వ్యాధులకు ఔషధాహారం. మాంసకృత్తులు, ఇనుము ఆధికంగా ఉండటం వల్ల రక్తహీనత నివారణకు చక్కటి ఔషదం. పీచు పదార్థం అధికంగా ఉండటంవల్ల మలబద్ధకాన్ని అరికడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో జ్వరం వచ్చినప్పుడు కొర్ర గంజి తాగి దుప్పటి కప్పుకుని పడుకుంటే జ్వరం తగ్గిపోతుందని పెద్దల అనుభవం చెబుతుంది. గుండె జబ్బులు, రక్తహీనత, ఊబకాయం, కీళ్లవాతం, రక్తస్రావం, కాలిన గాయాలు త్వరగా తగ్గుటకు కొర్రలు తినడం మంచిది. కొర్రలతో కొర్ర పాయసం, కొర్ర లడ్డు చేసుకోవచ్చు.
సామాలు-ఆరోగ్య సూత్రాలు : సామాలతో అధిక శక్తి, శరీర పెరుగుదల ఉంటుంది. రక్తహీనత నివారణ, మలబద్ధకం నియంత్రణలో సహకరిస్తుంది. గ్లూటెన్‌ ఎలర్జీ వారికి, సీలియాక్‌ వ్యాధిగ్రస్తులకు అనువైన ఆహారం.
వరి గడలు-ఆరోగ్య సూత్రాలు : వీటితో మధుమేహ వ్యాధి, కొలెస్ట్రాల్‌, మలబద్ధకం నియంత్రణలో ఉంటాయి. గ్లూటెన్‌ ఎలర్జీ వారికి, సిలియాక్‌ వ్యాధిగ్రస్తులకు అనువైన ఆహారం.
అరికలు-ఆరోగ్య సూత్రాలు : అరికలు అధిక శక్తి, శరీర పెరుగుదలను ఇస్తాయి. వీటితో మధుమేహ వ్యాధి, మలబద్ధకం నియంత్రణలో ఉంటాయి. ఇవి అధిక బరువును నియంత్రి స్తాయి. ప్రస్తుతం అన్ని వయసుల వారిలోనూ ఆరోగ్య స్ప ృహ పెరుగుతోంది. అందుకు తగినట్టుగానే ఆహారంలోనూ మార్పులు వస్తున్నాయి. ఎలాంటి పురుగు మందులు, రసాయనాలు వేయకుండా, సేంద్రీయ పద్ధతిలో పండిరచిన పంటలతో చేసిన వంటలనే కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, బియ్యం, గోధుమలు, అపరాలు వంటి ఆహారోత్పత్తులకు నగరంలో ఏటేటా అనూహ్య ఆదరణ లభిస్తోంది. ఆహార ప్రియుల ‘స్వచ్ఛమైన’ అభిరుచికి అనుగుణంగానే వందల కొద్దీ చిన్న, పెద్ద సంస్థలు, కార్పొరేట్‌ దిగ్గజాలు, రైతు సహకార సంఘాలు సైతం మార్కెట్‌లో పోటీ పడుతున్నాయి. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో ఏటా సుమారు రూ.వెయ్యి కోట్ల ఆర్గానిక్‌ ఆహార పదార్థాల విక్రయాలు జరుగుతుండగా, ఒక్క హైదరాబాద్‌లోనే సుమారు రూ.80 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. ఒక అంచనా మేరకు సుమారు 70 వేల కుటుంబాలు నిత్యం సహజంగా పండిన ఆహార పదార్థాలను తీసుకుంటుండగా, మరో 20 వేల కుటుంబాలు ఆర్గానిక్‌ రుచులను మాత్రమే ఆస్వాధిస్తున్నాయి. ఏటా ‘ఆర్గానిక్‌’ ఆహార ప్రియుల సంఖ్య పెరుగుతోంది. నగర జీవనంలో పెరుగుతున్న ఒత్తిళ్లు, రకరకాల అనారోగ్య సమస్యల నుంచి శాశ్వత విముక్తిని, ఊరట పొందాలంటే అత్యధికంగా పిండిపదార్థాలు ఉండే బియ్యం కంటే.. పోషక విలువలు, పీచు పదార్థాలు సమ ృద్ధిగా ఉండే మిల్లెట్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు.
పాత వైపు కొత్త చూపు..
ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ ఫెస్టివళ్లు, నోరూరించే రకరకాల వంటకాలు, బిరియానీ ఘుమఘు మలు, వెరైటీ వెజ్‌, నాన్‌ వెజ్‌తో రోజూ పసందైన విందు భోజనాలు ఆరగించే నగర వాసులు ఇప్పుడు ‘పాత’ తరానికి పయనమవు తున్నారు. అలనాటి ఆహార పదార్థాల వైపు దృష్టి సారించారు. జీవనశైలి వ్యాధులకు దూరంగా, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా బతికిన నిన్నటి తరం ఆహారపు అలవాట్లను నేటి తరం ఎంతో ఆసక్తిగా పరిశీస్తోంది. ఒకప్పుడు ప్రధాన ఆహారంగా ఉన్న సజ్జలు, కొర్రలు, కొర్రలు, వరిగెలు, ఊదలు, సామలు, జొన్నలు, రాగులు, వరిగెలు వంటి చిరు ధాన్యాలకు అనూహ్యమైన డిమాండ్‌ పెరిగింది. కాల్షియం బాగా ఉండి అనేక రకాల జీవన శైలి వ్యాధుల నుంచి విముక్తి కల్పిండంలో దోహదం చేసే రాగులకు, స్థూలకాయాన్ని అదుపులో ఉంచే కొర్రలకు నగరవాసులు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇంటికి.. వంటికీ కూడా..
సహజమైన జీవన విధానంలో కేవలం ఆహార పదార్థాలే కాకుండా కూరగాయలు, ఆకు కూరలు, సబ్బులు, షాంపూలు, వంట నూనెలు, కాస్మోటిక్స్‌ కూడా చేరాయి. మొరార్కో, ఫ్యాబ్‌ ఇండియా, 24 లెటర్‌ మంత్ర, ఈకోఫుడ్స్‌, కాన్షియస్‌ ఫుడ్‌, నేచర్‌ బాస్కెట్‌ వంటి వ్యాపార దిగ్గజాలు నగరవాసుల అభిరుచికి తగ్గట్టుగా ఆర్గానిక్‌ ఉత్పత్తులను అందజేస్తున్నాయి. ఇక దక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ, రైతునేస్తం, సహజ ఆహారం, ధరణి నేచురల్స్‌, గ్రామీణ్‌ మాల్‌ వంటి సంస్థలు, రైతు సహకార సంఘాలు సేంద్రియ ఎరువులతో పడిరచిన పంటలతో మహానగరానికి పల్లెకు మధ్య బాటలు వేశాయి. సూపర్‌మార్కెట్లలో ఇప్పుడు బ్రౌన్‌రైస్‌, జొన్నలు, రాగులు తప్పనిసరి విక్రయ వస్తువులయ్యాయి. ఆన్‌లైన్‌ అమ్మకాలు సైతం జోరందుకున్నాయి.
సహజ ఆహారమే ఎందుకు..
ప్రస్తుతం కాలంలో బియ్యం నుంచి పప్పులు, వంట నూనెల వరకు అన్నింటా కల్తీయే రాజ్యమేలుతోంది. 34 ఏళ్ల క్రితమే నిషేధించిన ఇతియాన్‌, డీడీటీ, బీహెచ్‌సీ వంటి ప్రమాద కరమైన పురుగుమందుల అవశేషాలు ఇప్పటికీ బయటపడుతున్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం వంటి వ్యాధులకు రాజధానిగా మారిన హైదరాబాద్‌లో ఇలాంటి కల్తీ ఆహారాలు ప్రజలను మరింత అనారోగ్యం బారిన పడేస్తున్నాయి. చిన్న వయసులోనే అనేక రోగాలు దరిచేరుతున్నాయి. ఎదుగుతున్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి క్షీణిస్తోంది. కల్తీ ఆహారం మేధో వికాసానికి సైతం బ్రేకులు వేస్తోంది. వైద్యనిపుణుల అంచనా మేరకు నగరంలో సుమారు 20 లక్షల మంది మధు మేహంతో బాధపడుతుండగా..మరో 25 లక్షల మందికి పైగా అధికరక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి అనర్థాల నుంచి బయటపడేందుకు ప్రజలు ఇప్పుడు ఆర్గానిక్‌, మిల్లెట్స్‌ ఆహారాన్ని కోరుకుంటున్నారు. వ్యాధులకు గురై, రకరకాల మందులు మింగుతూ రోగులుగా బతకడం కంటే..సహజ ఆహారంతో అసలు వ్యాధులే రాకుండా ఉంటా యనే నమ్మకం ప్రజల్లో బాగా పెరిగింది. ఒకప్పుడు ముడి బియ్యం అన్నమంటే చాలా మందికి తెలిసేది కాదు. పుష్కలమైన పీచు పదార్థాలు, పోషక విలువలు ఉన్న ముడి బియ్యం తీసుకొనే వారి సంఖ్య ఇటీవల అధికమైంది. ఇదొక్కటే కాదు.. అన్ని ఆహార ఉత్పత్తులూ రైతు క్షేత్రాల నుంచి నేరుగా నగరానికి వస్తున్నాయి. మహారాష్ట్ర లోని వార్ధా నుంచి సహజమైన గోధుమలు, యావత్‌మాల్‌ నుంచి సోయాబీన్స్‌, తమిళనాడు నుంచి స్వచ్ఛమైన నువ్వులు, నువ్వుల నూనె, కేరళ నుంచి సహజమైన సుగంధ ద్రవ్యాలు సైతం ప్రస్తుతం నగర మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండడంతో చాలామంది అటువైపే చూస్తున్నారు.- రిసెర్చ్‌ అసోసియేట్‌,
గృహ విజ్ఞాన విభాగం, కృషి విజ్ఞాన కేంద్రం గరికపాడు, కృష్ణాజిల్లా.

పాలకుల నిర్లక్ష్యం…ఆదివాసీలకు శాపం

‘‘ ఆక్రమిత అటవీ భూముల నుంచి ఆదివాసీలను, ఇతర సంప్రదాయ అటవీ నివాసితులను(ఓటీఎఫ్‌డీ) తొలిగించే విషయంపై ఆయా రాష్ట్రాలకు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీచేయడం గిరిజనులలో కలకలం రేపుతున్నది. అటవీ హక్కు చట్టం-2006 కింద భూ యాజమాన్య హక్కు దరఖాస్తులు తిరస్కరణకు గురైన ఆదివాసీలను, ఓటీఎఫ్‌డీలను అటవీ ప్రాంతం నుంచి తొలిగించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా 21 రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జరిగే జూలై 17లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టంచేసింది ’’- గునపర్తి సైమన్‌
అటవీ భూములపై హక్కులు లేకుండా అక్రమంగా నివసిస్తున్న వారిని ఖాళీ చేయించాలని ఆదేశిస్తూ ఫిబ్రవరి13వ తేదీన తను ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అటవీ హక్కుల చట్టం(ఎఫ్‌ఆర్‌ఏ)2006 కింద అటవీ భూముల హక్కుల కోసం చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురైన దాదాపు 11.8 లక్షల మందిని ఖాళీ చేయించాలని సుప్రీంకోర్టు నాటి ఆదేశాల్లో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌పై జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేత ృత్వంలోని ధర్మాసనం గురువారం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, దరఖాస్తుల తిరస్కరణ ప్రక్రియలో పాటించిన విధివిధానాలపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా 16 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు నాలుగు నెలల్లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అటవీ హక్కుల కోసం చేసుకున్న దరఖాస్తులు భారీ సంఖ్యలో తిరస్కరణకు గురయ్యాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటన్నింటినీ పరిశీలించి అఫిడవిట్లు సమర్పించాలని కోరింది.
అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం 2005 డిసెంబరుకు ముందు నుంచి అడవుల్లో నివసిస్తున్న గిరిజనులు, మూడు తరాలుగా(75ఏళ్లు) అక్కడే నివసిస్తున్న ఇతర సంప్రదాయ తెగలు వారి వారి భూములపై హక్కులు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలి. అయితే, ఇలా చేసుకున్న దరఖాస్తుల్లో కేవలం 44.83 శాతం మాత్రమే ఆమోదం పొందాయి. ఆచరణయోగ్యం కాని గడువు, తగిన సమాచారం లేకపోవడం, రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీలు సమావేశాలు నిర్వహించకపోవడం, జిల్లా యంత్రాంగం నుంచి తగిన సహకారం అందకపోవడం వంటి కారణాల వల్ల ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయన్న ఫిర్యాదులు వచ్చాయి. ప్రక్రియ సవ్యంగా సాగక పోవడం వల్లే హక్కుదారులు పత్రాలు పొందలేకపోయారన్న ఆరోపణ లున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి13 నాటి సుప్రీంకోర్టు ఉత్తర్వు లక్షలాది మంది గిరిజనులపై ప్రభావం చూపుతోందని, అటవీ హక్కుల కోసం చేసుకున్న దరఖాస్తులను విధిగా గ్రామసభలు, రాష్ట్ర యంత్రాంగం పరిశీలించాయా? లేదా ? అన్న అంశాలను చూడాల్సిన అవసరం ఉందని కేంద్రం చేసిన అభిప్రాయంతో ధర్మాసనం ఏకీభవించింది. అటవీ హక్కులు లేనివారిని ఖాళీ చేయించే ముందు ప్రక్రియ సవ్యంగా సాగిందా లేదాఅనే అంశంలో రాష్ట్రాలు తగిన అఫిడవిట్‌ సమర్పించాల్సిన అవసరం ఉందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా నివేదించారు. ‘గిరిజనులను ఖాళీ చేయించే ప్రక్రియ ను నిలిపివేయాలి. నిరుపేదలు, నిరక్షరాస్యులుగా ఉన్న గిరిజనులు తమ అటవీ హక్కులపై తగిన ఆధారాలు పొందలేకపోయి ఉండొచ్చు. ప్రక్రియ అమలుపై తగిన సమాచారం లేకుండా వారిని తొలగించడం వారికి అన్యాయం చేయడమే అవుతుంది’అని నివేదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ తిరస్కరణకు గురైన దరఖాస్తులను సమీక్షించేందుకు యంత్రాంగం ఎందుకు లేదని ప్రశ్నించింది. ‘తిరస్కరణకు గురైన దరఖాస్తుల వివరాలు సమర్పించాలని 2016లో రాష్ట్ర ప్రభుత్వాలను కోరగా ఇప్పటిదాకా స్పందించలేదు. మేం ఉత్తర్వులిచ్చాక మాత్రమే వాటిని సరిచేయాలంటూ అడుగుతోంది. ఇప్పడు ప్రస్తావించిన అంశాలను గతంలో ఎందుకు లేవనెత్తలేదు. ఇంతకాలం ఎందుకు నిద్రపోయింది’అని ప్రశ్నించింది. సంప్రదాయ హక్కులు కలిగిన గిరిజనుల అటవీ భూములను గొప్పవ్యక్తులు’ఎవరూ ఆక్రమించరాదని కోర్టు పేర్కొంది. పిటిషనర్‌ అయిన వైల్డ్‌ లైఫ్‌ ఫస్ట్‌ స్వచ్ఛంద సంస్థ తరపున సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌ వాదనలు వినిపిస్తూ వాస్తవికమైన లక్షలాది దరఖాస్తులకు న్యాయం జరిగిందని వివరించారు. మొత్తం 42,24,951 దరఖాస్తులు రాగా 18,94,225 పట్టాలు పంపిణీ అయినట్టు వివరించారు. తదుపరి విచారణను ధర్మాసనం జూలై 10వతేదీకి వాయిదావేసింది. అటవీ హక్కుల చట్టం అమలుపై ఇటీవల సుప్రీంకోర్టు జారీచేసిన మధ్యంతంఉత్తర్వులు ఆదివాసీలకు, తరతరాలుగా అడవుల్లో నివసిస్తున్న నిరుపేదలకు పిడుగుపాటు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా దేశంలోని 21రాష్ట్రాల్లో అడవులనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న 23.30 లక్షల గిరిజన, గిరిజనేతర కుటుంబాలనుకోర్టు ఆర్డర్‌ తీవ్రఆందోళనకు గురి చేసింది. యుపిఎ-1ప్రభుత్వ హయాంలో 2006లో తీసుకొచ్చిన అటవీహక్కుల చట్టం అమల్లో భాగంగా ఆదివాసీలు తమఅధీనంలో ఉన్న భూములను గుర్తించివాటిపై యాజమాన్య హక్కులు కల్పిం చాలని దరఖాస్తులు పెట్టుకున్నారు. ఆవిధంగా పెట్టుకున్న అర్జీలను తిరస్కారానికి గురయ్యాక కూడా ప్రభుత్వాలు ఇంకా వారిని భూముల నుంచి ఖాళీ చేయించలేదన్నది కేసు వేసిన ‘వైల్డ్‌ లైఫ్‌ఫస్ట్‌’ సంస్థ అభియోగం. విచారించిన న్యాయస్థానం అర్జీలు తిరస్కరించినా ఇంకా భూముల్లో ఉన్న వారిని ఖాళీ చేయిం చాలని రాష్ట్రాలను ఆదేశించింది. కేసు వాయిదా తేదీని జులై 24గా పేర్కొని ఆలోపు గిరిజనులను, గిరిజనేతరులను భూము లనుంచి ఖాళీ చేయిం చాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శు లను ఆదేశించింది. కోర్టుఆదేశాల అమలు దిశగా రాష్ట్రాలు అడుగులేస్తుండటంతో గిరిజనుల్లో భయోత్పాతాలు బయలు దేరాయి. కోర్టుకేసు వేసిన వారి కోణంలో అటవీ హక్కుల చట్టం అమలును చూసింది తప్ప పూర్వాపరాల జోలికి పోలేదనిపిస్తుంది. అందుక్కారణం కేంద్ర ప్రభుత్వమే. కేసు వేసిన వారు అటవీశాఖలో పని చేసిన మాజీ అధికారులు. చట్టంలో లొసుగులను ఆమూలాగ్రం ఔపోసన పట్టినవారు. వన్యప్రాణుల సంరక్షణ ముసుగులో ఆదివాసీలను, అటవులనే నమ్ముకున్న ఇతర పేదతరగతులను భూముల నుంచి వెళ్లగొట్టి ప్రైవేటు కంపెనీలకు, కార్పొరేట్లకు ధారాదత్తం చేయాలన్న కుట్ర ఈకేసు వెనుక దాగుందనిపిస్తుంది. సహజ వనరుల దోపిడీకి కార్పొరేట్లకు అవకాశం కల్పించేలా చట్టాలను మారు స్తూ విధానాలను రూపొందిస్తున్న మోడీసర్కారు కోర్టులో అంటీముట్టనట్లు వ్యవహరించింది. గిరిజన సంక్షేమ వ్యవహారాలు చూసే మంత్రిత్వశాఖకు కాకుండా అటవీ శాఖకు కేసు బాధ్యత అప్పగించింది. కేసు విచారణ సమ యంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి గైర్హాజరయ్యారు. దీంతో న్యాయస్థానం కేసు వేసినవారికి అనుకూలంగా ఉత్తర్వులిచ్చింది. వాజ్‌పేయి సర్కారు 2002లో లక్ష లాది మంది ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొడుతూ ఉత్తర్వులి చ్చింది. ఆపూర్వరంగంలో చూసినప్పుడు ప్రస్తుత మోడీ ప్రభుత్వం కూడా గిరిపుత్రుల హక్కులకు ఉద్దేశపూర్వ కంగానే హాని తలపెట్టిందని అర్థమవుతోంది. యుపిఎ-1ప్రభుత్వ సమయంలో ప్రజాసంఘాల కృషితో గిరిజనుల అధీనంలోని భూములపై వారికే హక్కులు కల్పిం చేందుకు అటవీ హక్కుల చట్టం వచ్చింది. చట్టమైతే వచ్చింది కాని పూర్తి స్థాయిలో ఆచరణాత్మకం కాలేదు. గిరిజనులకు హక్కులు కల్పిం చాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కొర్రీలు వేసి సాంకేతికాంశాలతో లక్షలాది దరఖాస్తులను పరిష్కరించకుండా ఏళ్లుపూళ్లు గడుపు తున్నాయి. అటవీ హక్కుల చట్టం కోసం పోరాడిన గిరిజనులు చట్టం అమలు కోసం పోరాటాలు చేయాల్సి వచ్చింది. రాజ్యాంగం ప్రకారం గ్రామసభలు నిర్వహించి గిరిజనుల అర్జీలను పరిష్కరించాలి. అక్కడ తేలకపోతే రాష్ట్ర స్థాయి వరకు వివిధ స్థాయిల్లో అప్పీలు చేసుకోవచ్చు. ప్రభుత్వాల్లో గిరిజన వ్యతిరేకత గూడుకట్టు కోవడంతో అటవీ భూములపై హక్కుల కోసం గిరిపుత్రులు న్యాయ స్థానాలను సైతం ఆశ్రయించాల్సి వస్తోంది. నిరుడు డిసెంబర్‌ నాటికి భూములపై హక్కు ల కోసం దేశవ్యాప్తం గా42 లక్షల అర్జీలు అందితే 18లక్షలు మాత్రమే (40శాతం) పరిష్క రించారు. పరిష్కరించా రంటున్న వాటిలో తిరస్కరించినవి కూడాఉన్నాయి. ఎ.పిలో1.14లక్షల ఎకరాలకు సంబంధించి 66, 351 అర్జీలను తిరస్కరించారు. సుప్రీం ఆర్డర్‌ అమలు చేస్తే ఆమేరకు గిరిజనులు భూములను కోల్పో యి నిరాశ్రయు లవుతారు. దేశంలో21రాష్ట్రాల్లో ఇదేపరిస్థితి. కోర్టు ఉత్తర్వులకు కేంద్ర ప్రభుత్వ అసమర్ధ వాదనలే కారణం. అందుకు ప్రాయశ్చిత్తంగా ఆర్డినెన్స్‌ తీసుకురావాలి. హడావుడిగా త్రిపుల్‌ తలాక్‌ పైన, మెడికల్‌ కౌన్సిల్‌ పైన ఆర్డినెన్సులు తేగలిగిన మోడీ ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా లక్షలాది గిరిజనులు నిరాశ్రయులు కాకుండా నిలవరించడానికి ఒక ఆర్డినెన్సు తేవడం అసాధ్యంకాదు. కాకుంటే ప్రాయ శ్చిత్తం చేసుకునే నిజాయితీ మోడీ ప్రభుత్వానికి ఉన్నదా అన్నదే సందేహం. ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా లక్షలాది గిరిజన కుటుంబాలు నిరాశ్రయులు కాను న్నాయి. వీరిలో ఎక్కువశాతం పోలవరం నిర్వాసి తులే. వారికి అటవీ హక్కుల పట్టాలు ఇవ్వకుండా నష్టపరిహారాన్ని, పునరావాసాన్ని నిరాక రించే దుష్ట తలంపుతోనే రాష్ట్రంలో 66వేల మంది క్లెయిములను తిరస్కరించారు. ఇప్పుడీసుప్రీం ఆదేశాలను అడ్డం పెట్టుకుని వారం దరినీ బలవం తంగా ఖాళీ చేయించేందుకు సైతం వెనకాడరు. ఈవిష యమై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా తాత్సారం చేసి ఎన్నికల పబ్బం గడుపుకునే యోచన కూడా చేయవచ్చు. చైతన్యవం తమైన ప్రజా ఉద్యమ ఆవశ్యకతను ప్రస్తుత పరిస్థితి సూచిస్తోంది.
నేరం ప్రభుత్వాలది-శిక్ష ఆదివాసీలకా
దేశం మొత్తంపై 21 రాష్ట్రాల్లో 42.19 లక్షల మంది పట్టాల కోసం దరఖాస్తు చేసుకుంటే 18.89 లక్షల మందికే పట్టాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో 66,350, తెలంగాణలో 80,000, గుజరాత్‌లో 1,82,869, కర్నాటకలో 1,76,540 దరఖాస్తులు తిరస్కరించారు. కేరళలో వామపక్ష ప్రభుత్వం మాత్రమే ఆదివాసీలకు అనుకూలంగా దరఖాస్తులు పరిష్కరించింది. మొత్తం 39,999 దరఖాస్తుల్లో 894 మాత్రమే తిరస్కరించింది. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం ఆదివాసీలకు వ్యతిరేకమైనప్పుడు చట్టం ఎలా అమలు జరుగుతుంది? కేరళ వామపక్ష ప్రభుత్వం 99 శాతం దరఖాస్తుదార్లకు పట్టాలు ఇవ్వడం ద్వారా ఆదివాసీల వాస్తవ హక్కులను గుర్తించింది కదా! ఆదివాసీలు సాగు చేస్తున్న భూమికి పట్టాలు ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే. ప్రభుత్వమే అన్యాయంగా వ్యవహరిస్తుంటే ఆదివాసీలకు హక్కు పత్రాలు ఎలా వస్తాయి? ఎవరి హక్కు పత్రం వారే రాసుకునే అవకాశం లేదు కదా? కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాది/అధికారి కోర్టుకు హాజరై వాస్తవ పరిస్థితులను వాదనకు పెట్టి ఉంటే కోర్టు తీర్పు మరోలా వచ్చి ఉండేదేమో? కీలక సమయంలో కేంద్ర ప్రభుత్వం కోర్టుకు గైర్హాజరై ఆదివాసీ వ్యతిరేకులైన పదవీ విరమణ చేసిన అటవీ అధికార్ల వాదన నెగ్గేందుకు సహకరించింది. బిజెపి ఆదివాసీ వ్యతిరేకినని రుజువు చేసుకుంది.
అనాదిగా ఆదివాసీలకు అన్యాయం
ఆదివాసీలకు చారిత్రకంగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దు తున్నట్లు 2006 అటవీ హక్కుల చట్టం భాష్యం చెప్పింది. మైదానాల్లో ఎవరు సాగు చేసుకున్న భూమి వారికి దఖలుపర్చిన ప్రభుత్వాలు ఆదివాసీలకు అడవిపై హక్కును ఇవ్వకుండా తరతరాలుగా అన్యాయం చేస్తూ వచ్చాయి. నాటి రాజులు, అనంతరం బ్రిటిష్‌ పాలకులు, స్వాతం త్య్రం అనంతరం ఏర్పడిన ప్రభుత్వాలు అడవి మీద ఆధారపడి జీవిస్తున్న ఆదివాసీలను దురాక్రమణదారులుగానే పరిగణించాయి. నేడు వారిని ఏకంగా అడవి నుండి గెంటివేస్తున్నారు. 5వ షెడ్యూల్డ్‌ ఏరియాలో రాజ్యాంగం, పీసా చట్టం భూమికి సంపూర్ణ రక్షణ కల్పించి నప్పటికీ మోడీ ఉల్లంఘించి కార్పొరేట్లకు ఇచ్చేశారు. పోలవరం ప్రాజెక్టులో వేలాది ఎకరాల అటవీ భూమి మునిగిపోతుంది. రాజధాని నిర్మాణానికి 50వేల ఎకరాల అటవీ భూమి కావాలని చంద్రబాబు అడగడం, కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించడం అందరికీ తెలిసిందే. తక్షణమే ఆదివాసీ హక్కులను రక్షిస్తూ కేంద్రం ఆర్డినెన్సు తేవాలని, రాష్ట్రంలో ఆదివాసీలు చేసుకున్న దరఖాస్తులకు హక్కు పత్రాలు 27.7.2019లోపు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ఆదివాసీలంతా ఉద్యమించాలి.
అడవి బిడ్డలకు ఊరటనిచ్చిన సుప్రీం స్టే
అటవీ ప్రాంతాల నుండి ఆదివాసీలను తొలగించాలన్న ప్రభుత్వ ఆదేశాలపై సుప్రీం కోర్టు ఫిబ్రవరి 21న (గురువారం) స్టే ఇచ్చింది. సుప్రీం కోర్టు తీర్పు అడవి బిడ్డలకు ఊరటనిచ్చింది. 11.8 లక్షల ఆదివాసీలను తొలగించాలని ఫిబ్రవరి 13వ తేదీన కేంద్ర ప్రభుత్వం 21 రాష్ట్రాలకు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు ఈ రోజు నిలిపేసింది. అడవి బిడ్డల వాదనలను తోసిపుచ్చుతూ అవలంబించిన కేంద్ర ప్రభుత్వ విధానాలను వివరంగా అఫిడవిట్‌ లో దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆదివాసీలను అడవుల నుండి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను నిలుపుదల చేయాలని కోరుతూ.. దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పింది. ఇన్నేళ్లుగా నిద్ర పోతున్నందుకు కేంద్ర ప్రభుత్వాన్ని మందలించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున జాప్యం జరిగిందని సాలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అంగీకరించడంతో మీరు ఇప్పుడే నిద్ర లేచారా.. అని కేంద్ర ప్రభుత్వంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టులో రాష్ట్రాలు దాఖలు చేసిన అఫిడవిట్ల ప్రకారం.. షెడ్యూల్డ్‌ తెగలు, అటవీ హక్కుల చట్టం కింద ఇతర సంప్రదాయ అటవీ నివాసులతో సుమారు 11,72,931 (1.17 మిలియన్‌) ఎకరాల భూమి, భూ యాజమాన్యం హక్కుల వాదనలు, వివిధ కారణాలపై తిరస్కరించబడ్డాయి. ఈ భూమి కనీసం మూడు తరాల నుండి వారి స్వాధీనంలో ఉన్నట్టు నిరూపించలేక పోయినవారు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత చట్టాల ప్రకారం.. ఆ భూములను ఖాళీ చేయించాలని ఫిబ్రవరి 13 న జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ నవీన్‌ సిన్హా, జస్టిస్‌ ఇందిరా బెనర్జీల బెంచ్‌ ఆదేశించింది.

ఆదివాసీల అన్యాయంపై..ఊరాటనిచ్చిన సుప్రీం కోర్టు స్టే’

ఆదివాసీలు తరతరాలుగా అడవులపై గిరిజనులు వారసత్వపు హక్కు సహజంగానే అనుభవిస్తూ వస్తున్నారు. అడవులను ఆదాయ వనరులుగా ప్రభుత్వాలు గుర్తించడం ప్రారంభించనప్పటి నుంచి అటవీ వినియోగం నుండి గిరిజనులను దూరం చేయడం మొదలైంది. వారి సాంప్రదాయక హక్కులు హరింపజేస్తూ ఎన్నో చట్టాలు రూపొందించడం జరిగింది. అటవీ సంరక్షణ, క్రమబద్దీకరణ పేరుతో వారి హక్కులు కాలరాసి రాయితీలు కల్పిస్తూ నియమాలు రూపొందించారు. దేశవ్యాప్తంగా అటవీ భూవనరులపై హక్కుకోసం ఆదివాసీల పోరాటం సలిపారు. ఫోరాట ఫలితంగా ది షెడ్యూల్‌ ట్రైబ్స్‌ ఇతర సాంప్రదాయక అటవీ నివాసుల అటవీహక్కుల గుర్తింపు చట్టం`2006 నెం.2/2007ను భారత పార్లమెంట్‌లో 2006, డిసెంబరు 15న ఆమోదం పొందింది. అయినా సరే దీని అమల్లో ఆదివాసీ ప్రజలకు అన్యాయం జరుగుతూనే వస్తోంది. ఈ చట్టం ఆదివాసీలకు అటవీ భూములపై వ్యక్తిగత, కమ్యూనిటీ హక్కులతోపాటు అటవీ వనరులపై కూడా హక్కును కల్పిస్తుంది. చట్టం తీసుకువచ్చినప్పటికీ ఇది సక్రమైన రీతిలో అమలుకు నోచుకోవడం లేదు. దీనిఅమలుపట్ల పర్యావరణ పరిరక్షణ, అటవీశాఖ విభాగం సవితితల్లి ప్రేమగా చూపుతున్నారు. ఈనేపధ్యంలో చట్టం అమలుపై మరో ఘోరమైన పిడుగు పడిరది.
ఫిబ్రవరి 13వ తేదీన కేంద్ర ప్రభుత్వం 21 రాష్ట్రాలకు సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఆదివాసీలు ఆందోళనకు గురయ్యారు. అడవులు ఆక్రమణకు గురవుతున్నాయని..అడవుల్లో అక్రమంగా నివసిస్తున్నవారి కారణంగా వన్యప్రాణి సంరక్షణ ప్రమాదంలో పడుతోందని వైల్డ్‌ లైఫ్‌ యాక్టివిస్ట్‌లు న్యాయస్థానాలను ఆశ్రయించిన కారణంగా11.8లక్షల ఆదివాసీలను తొలగించాలని సుప్రీం కోర్టు మధ్యంతరఉత్తర్వులిచ్చింది. అటవీ హక్కుల చట్టం అనేది అనాదిగా అరణ్యాల్లో నివసిస్తున్నవారికి భూమిపై హక్కు కల్పించడానికి ఉద్దేశించిందే కానీ..భూపంపిణీ, వితరణకు ఉద్దేశించింది కాదని పిటిషనర్లలో ఒకరైన వైల్డ్‌ లైఫ్‌ ట్రస్ట్‌కు చెందిన ప్రవీణ్‌ భార్గవ్‌ నివేదించారు. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని కాపాడలేకపోవడమేనని వారు పలువురు మేధావులు అభియోగాలు. ఏజెన్సీలో అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయకుండా అటవీశాఖ అధికారులు తూట్లు పొడిచి నిర్వీర్యం చేశారు. ఇది అటవీశాఖ అధికారులు, రాష్ట్ర,కేంద్రప్రభుత్వాల వైఫల్యమేనని పలువురు భావిస్తున్నారు. గతంలో 2002, 2004 మధ్య అటవీ ఆక్రమణలను నిరోధించేందుకుగాను సుమారు 3 లక్షల మందిని అడవుల నుంచి ఖాళీ చేయించారని ఈ వ్యవహారాలపై అధ్యయనం చేసే సీఆర్‌ బిజోయ్‌ ప్రకటించారు. ఆసమయంలో అకృత్యాలు జరిగాయని.. ఇళ్లను తగలబెట్టారని, పంటలను ధ్వంసం చేశారని, పోలీసుల కాల్పుల్లో ఎంతోమంది మరణించారని బిజోయ్‌ వెల్లడిరచారు. అడవుల్లో నివసించేవారికి మొదటి నుంచి యాజ మాన్య హక్కులు పత్రసహితంగా లేకపోవడం, చట్టప్రకారం కల్పించాలన్నా కూడా అది అధికారులపై ఆధారపడి ఉండడంతో చాలామంది అనాదిగా అరణ్యాల్లోనే నివశిస్తూ, ఆక్రమణదారులుగా మిగిలిపోతున్నారని బిజోయ్‌ నివేదిక వెల్లడిస్తోంది. దీంతో గిరిజనులు ఎంత దుర్బల జీవితం గడుపుతున్నారో అర్ధమవుతుంది. దేశవ్యాప్తంగా దట్టమైన అడవుల్లో పరవళ్లు తొక్కే నదులు..ఇనుము, బాక్సైట్‌ ఖనిజ నిక్షేపాల మధ్య బతికే గిరిజనులు ఇప్పటికే గనులు, ఆనకట్టలు, కర్మాగారాల కోసం తమ ఇళ్లను, భూములను కోల్పోయారు. ఇప్పుడు కోర్టు తీర్పు మేరకు ఇల్లూపొల్లూ వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చాలు వారు ఎంత దుర్బల, దుర్భర పరిస్థితుల్లో ఉన్నారో చెప్పడానికి.
అడవి బిడ్డలకు ఊరటనిచ్చిన సుప్రీం స్టే
అటవీప్రాంతాల నుండి ఆదివాసీలను తొలగించాలన్న ప్రభుత్వ ఆదేశాలపై సుప్రీం కోర్టు ఫిబ్రవరి 21న (గురువారం) స్టే ఇచ్చింది. సుప్రీం కోర్టు తీర్పు అడవి బిడ్డలకు ఊరటనిచ్చింది. ఫిబ్రవరి 13వ తేదీన కేంద్ర ప్రభుత్వం 21 రాష్ట్రాలకు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు ఈ రోజు నిలిపేసింది. అడవి బిడ్డల వాదనలను తోసిపుచ్చుతూ అవలంబించిన కేంద్ర ప్రభుత్వ విధానాలను వివరంగా అఫిడవిట్‌లో దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆదివాసీలను అడవుల నుండి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను నిలుపుదల చేయాలని కోరుతూ.. దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పింది. ఇన్నేళ్లుగా నిద్ర పోతున్నందుకు కేంద్ర ప్రభుత్వాన్ని మందలించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున జాప్యం జరిగిందని సాలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అంగీకరించడంతో మీరు ఇప్పుడే నిద్ర లేచారా..అని కేంద్ర ప్రభుత్వంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టులో రాష్ట్రాలు దాఖలు చేసిన అఫిడవిట్ల ప్రకారం..షెడ్యూల్డ్‌ తెగలు, అటవీ హక్కుల చట్టం కింద ఇతర సంప్రదాయ అటవీ నివాసులతో సుమారు 11,72,931 (1.17 మిలియన్‌) ఎకరాల భూమి, భూ యాజమాన్యం హక్కుల వాదనలు, వివిధ కారణాలపై తిరస్కరించబడ్డాయి. ఈ భూమి కనీసం మూడు తరాల నుండి వారి స్వాధీనంలో ఉన్నట్టు నిరూపించలేక పోయినవారు ఉన్నారు.రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంతచట్టాల ప్రకారం..ఆ భూములను ఖాళీ చేయించాలని ఫిబ్రవరి 13న జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ నవీన్‌ సిన్హా, జస్టిస్‌ ఇందిరా బెనర్జీల బెంచ్‌ ఆదేశించిన విషయం విధేతమే. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆదివాసులకు అన్యాయాలు జరగకుండా షెడ్యూల్లో పొందుపరిచిన రాజ్యాంగపరమైన చట్టాలను సమర్ధవంతంగా అమలు పర్చడానికి చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఆదివాసీ అన్యాయాలు జరగకుండా వారి అభివృద్ధికి కృషి చేయాల్సిన అవశ్యకత ఉంది !- ర‌వి రెబ్బాప్ర‌గ‌డ‌,ఎడిట‌ర్‌