మహిళ నీకో వందనం

మహిళా సాధికారితతోనే మార్పు వస్తుంది అని భావిస్తున్న వర్తమాన సమాజంలో ఇప్పటికీ పురుషాధిక్యత మధ్యనే మహిళలు నలిగిపోతున్నారు అన్నది వాస్తవం. స్త్రీలను దేవతలతో పోల్చి చూస్తారు కానీ ఇప్పటికీ మహిళలపట్ల సమాజంలోనే కాదు కుటుంబాలలో కూడ చిన్న చూపు కొనసాగుతోంది అన్నది వాస్తవం. ఈక్రమంలో మహిళాభ్యుదయం జరగాలి మహిళల అభివ ృద్ధి జరగాలి అంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఎన్ని జరిగినా స్త్రీల సామాజిక ఆర్ధిక రాజకీయ అభివ ృద్ధి ఇంకా కేవలం నామమాత్రంగానే ఉంది అన్నది వాస్తవం. మనదేశంలో పురుషులతో సమానంగా స్త్రీలకు వేతనాలు ఉపాది ఆహారబద్రత లేకపోవడంతో పాటు స్త్రీల పై లైంగిక హింస ఇంటా బయటా వయస్సుతో నిమిత్తం లేకుండా పెరిగి పోవడం చూస్తూ ఉంటే ఇంకా ఎన్ని మహిళా దినోత్సవాలు జరిగితే మహిళల అభివ ృద్ధి జరుగుతుంది అని అనిపించడంలో ఎటువంటి సందేహం లేదు.
మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివ ృద్ధి చెందదు అన్నది నిజం. ఈవాస్తవాన్ని గుర్తించి స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం అనే నినాదంతో ఐక్యరాజ్య సమితి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకను ప్రతి ఏటా నిర్వహిస్తోంది. సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగితే మహిళా అభ్యుదయం దానంతట అదే జరుగుతుంది. ఇప్పటికీ మన దేశంలో ఆడపిల్ల పుడితే దురద ృష్టంగా భావిస్తున్న సగటు మనిషి ఆలోచనల నేపధ్యంలో ఎన్ని ఉద్యమాలు జరిగినా మహిళల అభివృద్ధి సంక్షేమం కేవలం ఉపన్యాసాలకే పరిమితం అవుతోంది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న జనాభా లెక్కల గణాంకాల ప్రకారం ఉత్తారాది రాష్ట్రాలలో ప్రతి వెయ్యి మంది పురుషు లకు 879 మాత్రమే అమ్మాయిలు ఉన్నారని గణాంకాలు చెపుతున్న నేపధ్యంలో మరో 100 సంవత్సరాలు గడిచేసరికి ప్రతి వెయ్యి మంది పురుషులకు స్త్రీల సంఖ్య ఐదువందలకు పడిపోయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఇప్పటికీ మనదేశంలోని మధ్య తరగతి దిగువ మధ్య తరగతి కుటుంబాలలో స్త్రీని ఒక పనిచేసే యంత్రంగా బావిస్తున్న నేపధ్యంలో ఇంటిపని పిల్లల పని ఉద్యోగ బాధ్యతలు నిర్వహించ గలిగే ఒక ‘రోబోలా’ మాత్రమే స్త్రీలను చూస్తున్నారు అన్నది వాస్తవం. ఈపరిస్థుతులకు ఎవరో పరిష్కారాలు చెపుతారని ఆశించకుండా స్త్రీలు తమని తాము తెలుసుకుని తమ శక్తియుక్తులు మెరుగు పరుచుకునే వరకు ఎన్ని మహిళా ఉద్యమాలు మహిళా దినోత్సవాలు జరిగినా స్త్రీల పై వేదింపులు స్త్రీలను చిన్న చూపు చూడటం కొనసాగుతూనే ఉంటుంది అన్నది వాస్తవం.
‘ఒక పని గురించి చెప్పాలి అంటే పురుషులకు చెప్పండి అదే ఆపని పూర్తి అవ్వాలి అంటే మాత్రం మహిళకు చెప్పండి’ అని ఉక్కు మహిళగా పేరుగాంచిన బ్రిటన్‌ మాజీ ప్రధాని మార్గరేట్‌ థాచర్‌ చెప్పిన మాటలను బట్టి మహిళా ఏదైనా సాధించాలి అనుకుంటే ఏ శక్తి ఆపలేదు అన్నది వాస్తవం. ఐస్‌ ల్యాండ్‌ లాంటి చిన్నదేశంలో మహిళను అసభ్యకరంగా చూపించే సినిమాలు వీడియాలు తీసినవారికి ఎటువంటి వాదన ప్రతివాదనలు లేకుండా వెంటనే కఠిన శిక్షలు విధించే చట్టాలు ఉన్నాయి. అంతేకాదు ఆదేశ పార్లమెంట్‌ లో మహిళలకు సంబంధించిన ఆదేశ మహిళలే రూపొందిస్తారు. అటువంటి పరిస్థుతులు మన భారతదేశంలో వచ్చిన నప్పుడు మాత్రమే నిజమైన మహిళా సాధికారిత :
వేదాలకాలం నుంచే భారతీయ సమాజంలో మహిళలకు ఎంతో గౌరవం ఉంది. మనదేశాన్నే ఒకస్త్రీ మూర్తిగా భావించి భారత మాతగా కొలుస్తున్నాం. మన దేశంలో నదులను సరస్వతి, గంగ, యమున, గోదావరి, కావేరీలను స్త్రీ మూర్తులుగా, మాతలుగా వ్యవ హరిస్తూ పూజిస్తున్నాం. స్త్రీలపట్ల ఆరాధనా భావం ఉన్నందువల్లే మనం పుట్టిన దేశాన్ని మాతృభూమిగా పిలుచుకుంటున్నాం. ప్రస్తుత భారతీయ సమాజంలో స్త్రీల పట్ల జరుగుతున్న సామాజిక వివక్షకు కారణం హిందూ సాంప్రదాయాలేనని చాలా మంది అజ్ఞానంగా వాదిస్తుంటారు. కానీఅనాది నుంచి భారతీయ సమాజంలో మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. హిందూ పురాణాల్లో సంపదకు అధిదేవతగా లక్ష్మిని, విద్యాధిదేవతగా సరస్వతిని, శక్తికి ప్రతిరూపంగా దుర్గను ఆరాధించారు. పురాతన హిందూ గ్రంథాల్లో కొన్ని మహిళా పాత్రలను బలంగా తీర్చిదిద్దారు. వారిలో సీత,సావిత్రి, మండోదరి, గంగ లాంటి పాత్రలు నేటితరం మహిళలకు ఎంతో ఆదర్శం. ప్రాచీన కాలంలో స్త్రీల పట్ల ఉన్న గౌరవం, ఆరాధన ఆధునిక సమాజంలో లేకుండా పోతోంది. మహిళలను పురుషులతో సమానంగా చూడడం లేదు. ఇది ఆందోళనకరం. స్త్రీలపట్ల మన ఆలోచనాధోరణి మారాలి. నేడు స్త్రీలపరిస్థితులు మారాయి. వంటిల్లే స్వర్గంగా భావించే మహిళలు ఇప్పుడు సమాజంలో ఒక విశిష్టమైన శక్తిగా అంచెలంచెలుగా ఎదుగు తున్నారు. వైద్య,విద్య,విజ్ఞాన,రాజకీయ,క్రీడా,రక్షణ.. ఇలా రంగం ఏదైనా స్త్రీలు దూసుకు పోతున్నారు.
విద్యార్థినిగా, గృహిణిగా,ఉద్యోగినిగా, రాజకీయవేత్తగా ఇలా ఎన్నో విధాలుగా సమాజంలో భాగంగా మారినా స్త్రీ స్వయం నిర్ణయం అనేది ఇంకా పురుషుల చేతులలోనే ఉన్నది. స్త్రీ,పురుషులు ఇద్దరూ పరస్పర అవగాహనతో కలసి నడవాలి. కాని ప్రస్తుతం అలా లేదు. అడుగడుగునా ఆటంకాలు.. అలుపెరుగని పోరాటాలు.. అత్మాభిమాన అణచి వేతలు ఇవన్నీ మహిళల అభ్యున్నతికి అడ్డుపడు తున్నాయి. తరతరాల నుండి వస్తున్న సంప్రదాయాలు, ఆచారాలు నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఈ వ్యవస్థలో కాలక్రమేణా మార్పులు చోటు చేసు కున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో మారేందుకు కాస్త సమయం పడుతుంది. ఇప్పటికే పురుషుల ఆలోచనా దృక్పథంలో కాస్త మార్పు వచ్చింది. భార్య అంటే గృహిణిగా సేవలందించడమే కాకుండా, ఉద్యోగినిగా ఆర్థిక సేవలం దించి, మాతృత్వంతో సంసా రాన్ని పెంచే త్రిపాత్ర ధారిణి అనే విషయాన్ని తెలుసు కుంటు న్నారు. సమాజంలో నేటికీ బాలికా శిశు గర్భవిచ్ఛిత్తి వంటి హేయమైన పనులు జరుగుతున్నాయి. పురుషులతోపాటు స్త్రీలకు విద్య,సాది óకారిత, హక్కులు,అభివృద్ధిలో భాగస్వా మ్యం సమానంగా లభించి నప్పుడే సమాజం అన్ని విధాలా అభ్యున్నతి సాధి స్తుంది. గృహహింస, విడాకుల చట్టం.. ఇలా ఇంకా ఎన్నో చట్టాలు నేడు స్త్రీలకు రక్షణ కవచాలుగా మారాయి. మహిళలే స్వయంగా రాజకీయ చక్రం తిప్పుతున్న నేటి సమాజంలో, మహిళా బిల్లు ప్రవేశ పెట్టటానికి ఎన్ని అవస్థలు పడ్డారో, ఎన్ని ఆటంకాలు ఎదురవుతు న్నాయో తెలిసిన విషయమే.
మహిళా సాధికారిత లేకుండా మానవ జాతి అభ్యున్నతి సాధించలేదు. ఇది జరగాలంటే పురుషుల ఆలోచనా విధానంలో పూర్తిగా మార్పులు రావడం తప్పనిసరి. ప్రపంచ జనాభాలో మహిళలు సగ భాగం. ఈ సగభాగం కృషి లేకుండా అన్ని రంగాల్లో అభ్యున్నతి సాధించడం సాధ్యం కాదు. కనుక తమకంటే స్త్రీలు తక్కువ అన్న దృక్ప థాన్ని పురుషులు విడిచిపెడితేనే సమాజం, దేశం, ప్రపంచం అభివృద్ధి చెందుతాయి.
వివిధ రంగాల్లో తమకు సాటిగల వారు లేరని స్త్రీలు నిరూపి స్తున్నారు. సైన్స్‌, టెక్నాలజీ రంగాల్లోనే కాకుండా రాజకీయాలు, కళలు, సాహిత్యం, క్రీడలు, విద్య మొదలైన అనేక రంగాల్లో దేశం రాణించ డానికి, అభ్యున్నతి చెందడానికి భారతీయ మహిళలు అద్బు Ûతమైన కృషి చేశారు. మహిళలు ఇప్పుడు మన సాయుధ దళాలలో చేరి యుద్ధరంగంలో కూడా దిగారు. ఇటీవలే మన యుద్ధ విమానా లను నడిపేందుకు ముగ్గురు మహిళలు వైమానిక దళంలో చేరి దేశం గర్వపడేలా చేశారు. వివిధ కార్పోరేట్‌ సంస్థల బోర్డుల్లో మహిళలు బోర్డు డైరెక్టర్లుగా ప్రవేశించిన తర్వాత చెప్పుకోదగ్గ ఆర్థిక ఫలితాలు వచ్చాయని ఓనివేదిక పేర్కొంది. ఒకస్త్రీ విద్యావంతురాలైతే మొత్తం కుటుంబం విద్యావంతం అయినట్లు లెక్క. అప్పుడు సమాజం, దేశం మొత్తం విద్యావంతంగా మారుతుంది. స్త్రీ,పురుషుల మధ్య సమా నత్వం,లింగపరమైన వివక్ష లేకుండా చూడడం అనేది దేశంలో ప్రతి పౌరుడి బాధ్యత. మహిళలకు సమానమైన పని, సమానమైన వేత నాలు, సమాన ఆస్తి కల్పించాలి.-డా. దేవులపల్లి పద్మజ