వీర జవాన్లకు జాతి నివాళి

‘‘ జమ్మూ- కాశ్మీర్‌ చరిత్రలోనే కనీవినీ ఎరుగుని దుర్ఘటన. ఉగ్రదాడిలో 46మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోడం దేశ ప్రజలను దిగ్భ్రాంతిలో ముంచింది. జమ్మూ నుంచి ఫిబ్రవరి 14 తెల్లవారుజామున బయలు దేరిన జవాన్ల 78వాహనశ్రేణిని అక్కడకు 241కిలోమీటర్ల దూరంలోని అవంతిపొరా పట్టణ సమీపంలో జేషే మహ్మద్‌ సంస్థకు చెందిన ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు 350కిలోల అత్యాధునిక పేలుడు పదార్థం (ఐఈడీ)తో నిండిన వాహనంతో ఢకొట్టెడంతో ఈ ఘోరం సంభవించింది. 2000సంవత్సరంలో ఇదే ఉగ్ర సంస్థ జరిపిన దాడిలో 29మంది చనిపోయిన తరువాత జమ్మూ- కాశ్మీర్‌లో జరిగిన అతిపెద్ద సంఘటన ఇది.’’- గునపర్తి సైమన్‌

సరిహద్దుల్లో ఉగ్రమూకలు మరింత రెచ్చిపోయాయి. స్థానికంగా శిక్షణ ఇచ్చి తయారుచేసిన ముష్కరులే ఈఘాతు కాలకు పాల్పడుతున్నారు.భరతమాత ముద్దుబిడ్డలని చెప్పుకునే వీరసైనికులు ప్రాణత్యాగాలుచేసారు. కుటుంబసభ్యులతో సెలవులు గడిపి జ్ఞాపకాలు నెమరేసు కుంటూ విధుల్లోనికి వస్తున్న సిఆర్‌పిఎఫ్‌ జవాన్ల వాణాలపై ఉగ్రమూకలు పంజావిసిరి 42 మందిని బలిగొన్నాయి. ఉగ్రమూకలకు, ఉగ్రస్థావరాలకు ఆశ్రయం కల్పించేదేశంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందిన పాకిస్తాన్‌లోని జైషేముహ్మద్‌ ఉగ్రవాదసంస్థపనే ఇది అని ప్రకటించుకుంది. పైపెచ్చుఎలా ఉంది మా ప్రతీకారం అన్నట్లుగా సంకేతాలు వదులుతూ ఇలాంటివే మరిన్ని చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతోంది. జెఎఎం సంస్థకు చెందిన ఒక ముష్కరుని ఆత్మాహుతి దాడితో ఘోరం జరిగి పోయింది. భద్రతాదళాలు త్యాగాలు వృదాగా పోనివ్వమని పాలకులు చెపుతున్నా ఆకుటుంబాల్లోని పుత్రశోకం భరతమాత సైతం తీర్చలేనిది. గురువారం సాయంత్రం 2500 మందికిపైగా సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు 78 వాహనాల్లో జమ్మునుంచి బయలుదేరారు. సూర్యాస్తమయంలోపు వీరంతా శ్రీనగర్‌చేరుకోవాలిస ఉంది అనేక మంది సెలవరలతర్వాత కశ్మీర్‌ విధుల్లో చేరేందుకు వస్తున్నారు. ఇక లక్ష్యానికి చేరువవుతున్న 20 కిలోమీటర్ల దూరంలోనే అఘోరం జరిగిపోయింది. పేలుడుపదార్ధాలతో నిండిన ఒక స్కార్పియో వాహనం వేగంగా దూసు కొచ్చింది. కాన్వ్నాులోని బస్సును ఢీకొట్టింది. దీనితో అక్కడికక్కడే ఆ బస్సు తునాతునకలైంది. వాహనంలో 76వ బెటాలియన్‌కు చెందిన 44మంది జవాన్లు ఉన్నారు. అక్కడకిక్కడే పలువురు మరణిస్తే మరికొందరు ఆసుప్రతిలో చికిత్స పొందుతో మరణించారు. 350 కిలోల పేలుడు పదార్ధాలతో ఉన్న ఈవాహనాన్ని నడిపిన ఉగ్రవాది దాడికి ముందు సైతం కరుడుగట్టిన వ్యాఖ్యలుచేసాడు. ’’మీరుస్వర్గంచూసేటప్పటికీ నేనే స్వర్గంలో ఉంటాఅనిచేసిన వ్యాఖ్యలు మరణానికి సైతం నేను సిద్ధమేనన్నట్లుగా ఉన్నాయి. కేవలం భారత్‌పై ప్రతీకారం తీర్చు కోవాలన్న కుట్ర, కసి, కరుడు గట్టిన ఉగ్రవాదమే ఇందుకు పురిగొలిపిందని చెప్పాలి. సైనికబలగాలకు ఇదే కొత్తకాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగి నెత్తురును ప్రవహింపచేసాయి. అమర సైనికుల ప్రాణత్యాగాలకు భారత్‌ గుణపాఠం చెపుతూనే ఉంది. అయినప్పటికీ ఎక్కడా ఆగిన దాఖలాలులేవు. 2001 తర్వాత కారుబాంబు దాడుల్లో ఈ సంఘటన అతిపెద్దదిగా చెపుతున్నారు.
2017 డిసెంబరులో కూడాదక్షిణ కశ్మీర్‌లోని లేత్‌పరాలో జెఇఎం బిఎస్‌ఎఫ్‌ దళాలకు మధ్యజరిగిన కాల్పుల్లో ఐదుగురు సిబ్బంది, ముగ్గురుపౌరులు మరణించారు. అలాగే 2016 జమ్ములోని సైనికశిబిరంపై ఉగ్రవాదులు మెరుపుదాడికితెగబడ్డారు. ఇద్దరు అధికారులు, ఐదుగురు సైనికులుమ ృతిచెందారు. పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడిజరిపితే ఏడుగురుసిబ్బందితోపాటు నలుగురు మిలిటెంట్లుసైతం చనిపోయారు. అహ్మద్‌నగర్‌, షోపియాన్‌, పుల్వామా ప్రాంతాల్లో ఒకేరోజు వేరువేరుదాడులుజరిగితే ఎనిమిది మంది సైనికులు, ముగ్గురుపోలీసులు, ఇద్దరుపౌరులతోపాటు మిలిటెంట్లుసైతం ఎనిమిది మందిని మన సైనికులు మట్టుపెట్టారు. అక్కడితో ఆగిందా అంటే అదీలేదు. శ్రీనగర్‌శివార్లలోని హైదర్‌పోరా, సర్బాల్‌క్రాసింగ్‌వద్ద సైనికులపై బాంబుదాడులు జరిపితే పదిమంది అమరులయ్యారు. డాల్‌లేక్‌మీదుగా వెళ్లే రాష్ట్రీయరైఫిల్స్‌ వాహనశ్రేణిపై మిలిటెంట్లు విరుచుకుపడితే 30మంది చనిపోయారు. వీరిలో తొమ్మిదిమంది సైనికులే ఉన్నారు. ఇలా 1999 నుంచి ఇప్పటిరకూ వాహన శ్రేణులపై దాడులుచేస్తూనే ఉన్నారు. మెరుపుదాడులు జరిగిన తర్వాత కూడా ఇవేమీ ఎక్కడా ఆగలేదు.పాకిస్తాన్‌లోని కరాచీలో ఏర్పాటుచేసిన జైషేముహమ్మద్‌ సంస్థకు మౌలానా మసూద్‌ అజహర్‌ అధ్యక్షుడు. ఆతనే వ్యవష్తాపకుడు కూడా. భారత్‌ విమానాన్నిహైజాక్‌చేయడంద్వారా మనదేశ జైలునుంచి 1999లో విడుదలయినప్పటినుంచి మసూద్‌ కరుడుగట్టిన కిరాతకాలకు పథకరచనచేస్తున్నాడు. లష్కరే తాయిబాతరహాలోనే జైషేము హమ్మద్‌కూడా ఉగ్రవాదుల సరఫరా, భారత్‌పై దాడులకు తెగబడటం వెనుక పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ నిధులు,విధులు, కుట్రలకు ప్రోత్సాహం పథకరచన అందిస్తున్నదనడంలో ఎలాంటి సందేహంలేదు.ఈ ఉగ్రసంస్థలకు మజ్లిస్‌ ఎ తవాన్‌ ఎ ఇస్లామికి చెందిన ముఫ్తీ నిజాముద్దీన్‌ షంజాయి, దార్‌ ఉల్‌ఇఫ్తా ఎ వల్‌ ఇర్షాద్‌కు చెందిన మౌలానా ముఫ్తీ రషీద్‌ అహ్మద్‌, షేర్‌ ఉల్‌ హడిత్‌దార్‌ ఉల్‌ హకానియా సంస్థల పెద్దలు ఈ కుట్రలకు మద్దతునిస్తున్నట్లు అమెరికాసైతం గుర్తించింది. మసూద్‌ అజర్‌ జైలునుంచి విడుదలయన తర్వాత ఏర్పడిన ఉగ్రసంస్థ ఆవిర్భవించింది. తాజాగాజరిగిన పుల్వామా దాడి 2001 తర్వాత ఇదే అతిపెద్ద దాడిగా చెపుతున్నారు. పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం చెప్పాల్సిందేనని ముక్తకంఠంతో భారతీయులు నినదిస్తున్నారు.