ఎకో టూరిజం తగ్గేదెలా 

నగరవాసుల మధ్య (స్వచ్ఛసర్వేక్షణ్‌2023) పరిశుభ్రతను పెంపొందించడానికి ముమ్మర ప్రయత్నాలు సాగిస్తోంది.స్వచ్ఛ సర్వేక్షణ్‌2023 లో టాప్‌ ర్యాంక్‌ సాధించడమే లక్ష్యంగా జీవీఎంసీ దృష్టి కేంద్రీకరించింది. దీని కోసం నగర ప్రజలకు అవగాహన కల్పించడానికి ఏకో వైజాగ్‌ పేరుతో ప్రపంచ పర్యావరణ దినోత్స వం సందర్భంగా గతనెల 5న ప్రచారాన్ని ప్రారంభించింది.గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జివిఎంసి) పౌరులలో పరిశుభ్రతను పెంపొందించడానికి,నగరంలో కాలు ష్యంతో పాటు ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా పోరా టాన్ని కొనసాగించడానికి ‘ఈ ఎకో-వైజాగ్‌’అనే కొత్త ప్రచారాన్ని ఆర్‌కే బీచ్‌లో మున్సిపల్‌ అడ్మిని స్ట్రేషన్‌శాఖ మంత్రిఎ.సురేష్‌, జిల్లాఇన్‌ ఛార్జి మంత్రి వి.రజినితోపాటు మేయర్‌ జి.హరివెంకట కుమారి, ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు లాంఛనంగా ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా పర్యావరణ పరిశుభ్రత,పచ్చదనం,నీటి సంరక్షణ,ప్లాస్టిక్‌ నిషేధం, కాలుష్యాన్ని తగ్గించ డం వంటి ఐదు అంశాలపై జీవీఎంసీ కమిష నర్‌ సాయి కాంత్‌ వర్మ దృష్టి సారించారు.ఎకో క్లీనింగ్‌లో భాగంగా వ్యర్థ పదార్థాల నిర్వహణ, వేరు చేయడాన్ని ప్రోత్సహిం చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జివిఎంసి బహిరంగ డంపింగ్‌,పరిశుభ్రతను నిర్వహించ డంవల్ల కలిగే దుష్ప్రభావాల గురించి అవగా హన కల్పిస్తుంది. డ్రైవ్‌లో భాగంగా కార్పొరేషన్‌ పరిధిలో పచ్చదనాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టనున్నారు.నీటి సంరక్షణలో భాగంగా బీచ్‌ క్లీనింగ్‌ కార్యకలాపాలు,రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ మెళుకువలు భారీస్థాయిలో కొనసాగుతాయి. దీంతోపాటు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఉత్పత్తులను తీసుకు రావడానికి కార్పొరేషన్‌ కృషి చేస్తుంది.దీనికి సంబంధించి ఎకోమేళా కూడా నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికీ జీవీఎంసీ 10ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ బృందాలను సిద్ధం చేసి ఆ బృందాలకు ప్రత్యేక వాహనాలు కొనుగోలు చేసి అందజేశారు. ప్రతి బృందంలో ఇద్దరు అధికారులు నియమించారు.వారు తనిఖీలు, ఆలోచనలు,ఫిర్యాదుల పరిష్కారం, కార్యక్రమా లను నిర్వహిస్తున్నారు. నగర ప్రజల అలవాట్లను మార్చడం,పచ్చదనాన్ని పెంపొందించడం,నీటి సంరక్షణ, కాలుష్య నియంత్రణ చర్యలు,సింగిల్‌ యూ జ్‌ ప్లాస్టిక్‌పై కఠినమైన నిషేధం వంటి అంశాలపై ఈ టాస్క్‌ స్క్వాడ్‌లు చర్యలు తీసుకుంటారు.అవసరమైతే ఈఎన్‌ఫో ర్స్‌మెంట్‌ బృందాలు జరిమానాలు కూడా విధిస్తాయి. 56 కిలోమీటర్ల బీచ్‌ తీరప్రాంతంలోని నగర పరిమితుల్లో కాలు ష్యానికి వ్యతిరేకంగా పోరాడేందుకు నగర ప్రజలు మద్దతు ప్రకటిస్తూ ఉత్సహంగా భాగస్వామ్యం అవుతున్నారు.బీట్‌ ప్లాస్టిక్‌ పొల్యూషన్‌ అనే నినాదంతో ప్లాస్టిక్‌ కాలుష్యానికి పరిష్కారాలపై దృష్టి పెడుతూ విస్త్రత ప్రచారం చేస్తోంది.
స్వచ్ఛ సర్వేక్షణ్‌2023లో టాప్‌ ర్యాంకే లక్ష్యం గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ)స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2023-మేరా షెహర్‌,మేరీ పెహచాన్‌ (ఎస్‌ఎస్‌-2023) ఎనిమిది ఎడిషన్‌ కోసం సిద్ధమవుతోంది.దీని కోసం దేశవ్యాప్తంగా 3,000మంది మదింపు దారులతో జూలై ఒకటి నుండి ఫీల్డ్‌ అసెస్‌ మెంట్‌ ప్రారంభించారు.ఈనెల రెండోవారంలో వైజాగ్‌కు అసెస్సర్‌లు రానున్నారు. విశాఖ పట్నంతో సహా4,500ప్లస్‌ నగరాల పనితీరును 46సూచికలపై ఒక నెలలోపు మదింపుదారులు అధ్యయనం చేస్తారు. అంచనా నివేదిక ప్రతి పారామీటర్‌లో స్కోర్‌ల రూపంలో విడుదల చేయబడుతుంది.మొత్తం మార్కులు9,500. ఇందులో పౌర సేవలకు 4,525మార్కులు, సర్టిఫికెట్లు,అవార్డులకు 2,500,ప్రజల అభిప్రాయానికి 2,475మార్కులు ఉన్నాయి. ఎస్‌ఎస్‌2023 పౌరుల నుండి టెలిఫోనిక్‌ ఫీడ్‌బ్యాక్‌తో 2022లో మే 24న ప్రారంభి చింది. మూల్యాంకనం నాలుగు త్రైమాసికాల్లో నిర్వహించబడుతుంది. మొదటి మూడు త్రై మాసికాలు పూర్తయ్యాయి. బృందాలు సాక్ష్యం కోసం రెండు స్థాయిల నాణ్యత తనిఖీలు, ప్రత్యేక క్షేత్ర సందర్శనలను ఉంటాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2022 సర్వేలో విశాఖపట్నం నాలుగో స్థానంలో నిలిచింది.2021లో నగరం తొమ్మిదో స్థానం నుండి పైకి ఎగబాకింది. ఇది2017లో మూడవ పరిశుభ్రమైన నగరంగా ప్రకటించ బడిరది.ఇది ఇప్పటివరకు అత్యుత్తమ ర్యాంకింగ్‌ స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2022 ర్యాంకింగ్స్‌ ప్రకారం విశాఖపట్నం దేశంలో నాల్గవ పరిశుభ్రమైన నగరంగా (10లక్షలకు పైగా జనాభా విభాగం లో) ఎంపికైంది. నగరం 2021సంవత్సరంలో తొమ్మిదవ స్థానం నుండి 2022లో నాల్గవ స్థానానికి తన ర్యాంకింగ్‌లను మెరుగుపరిచింది. మొదటి నాలుగు స్థానాల్లో నగరానికి స్థానం దక్కడం ఇదిరెండోసారి.స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2017లో,నగరం మూడవ పరిశుభ్రమైన నగరంగా గుర్తింపు పొందింది. ఇది ఇప్పటి వరకు అత్యుత్తమ ర్యాంకింగ్‌గా ఉంది. ఇదికాకుండా,జీవీఎంసీ స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2022లో మరో రెండు అవార్డులను కైవసం చేసుకుంది. ఒక అవార్డు చెత్త రహితనగరాల్లో (జిఎఫ్‌సి)ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ను పొందినందు కుగాను, మరోకటి 10నుండి 40 కేటగిరీలో ‘క్లీన్‌ బిగ్‌ సిటీ’ అవార్డును పొందడం విశేషం.
స్వచ్ఛ సర్వేక్షణ్‌ ఫలితాల్లో విశాఖ టాప్‌
దేశ వ్యాప్తం గా 73లక్షల 95 వేల 680 మంది ఆన్‌లైన్‌లో ఫీడ్‌ బ్యాక్‌ సేకరించారు. 2701 మంది క్షేత్ర స్థాయిలో పర్యటించి 17,030 వాణిజ్య ప్రాం తాలు,24,744 నివాస ప్రాంతాలు, 16,501 చెత్త శుద్ధి కేంద్రాలు, 1496 రెమిడియేషన్‌ సైట్లను సందర్శించి క్షేత్ర స్థాయిలో తీసిన 22.26లక్షల ఫోటోలను విశ్లేషించి ర్యాంకుల్ని ఖరారు చేశారు.లక్షకు పైబడిన నగరాల్లో విశాఖ పట్నం7500మార్కులకు 6701మార్కు లతో నాలుగో స్థానంలో,6699 మార్కులతో విజయవాడ 5స్థానంలో,6584 మార్కులతో తిరుపతి ఏడో స్థానంలో,4810మార్కులతో 75వ ర్యాంకుతో కర్నూలు,4688 మార్కులతో 81వ స్థానంలో నెల్లూరు పట్టణాలు స్వచ్ఛ భారత్‌ ర్యాంకుల్ని దక్కించుకున్నాయి.జాతీయ స్థాయిలో స్థానిక సంస్థల విభాగంలో పెద్దనగ రాల జాబితాలో 10నుంచి 40లక్షల జనాభా కింద ఈసారి పలు నగరాలను అవార్డు కోసం ఎంపిక చేయగా,మధ్యస్థాయి నగరాల జాబితా లో,3 నుంచి 10లక్షల జనాభా విభాగంలో మరికొన్ని నగరాలు, పట్టణాలను చేర్చారు.స్టేట్‌ క్యాపిటల్‌ జాబితాలో మరికొన్ని నగరాలకు అవార్డులు ప్రకటించగా,విజయవాడ మొదటి స్థానంలో నిలిచింది.అంశాలవారీ స్కోరింగ్‌.. స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుకు సంబంధించి మొత్తం వివిధ విభాగాల కింద 7,500 మార్కులు కేటా యించారు. అందులో విజయవాడ 6,699 మార్కులు మాత్రమే సాధించింది.
వాలంటీర్లకు టార్గెట్లు
గత ఏడాది చెత్త రహిత శుభ్రమైన నగరంగా మూడో స్థానాన్ని దక్కించుకున్న విజయవాడకు వాటర్‌ ప్లస్‌ సిటీస్‌ క్యాటగిరీలో కూడాఅవార్డులు దక్కాయి. చెత్తసేకరణ, నిర్వహణ, రిసైక్లింగ్‌, తడిపొడిచెత్తల వేర్వేరు సేకరణ,నిర్మాణ వ్యర్థాల వినియోగంలలో నగరానికి మంచి ఫీడ్‌ బ్యాక్‌ లభించింది. కొన్నేళ్లుగా నంబర్‌ వన్‌ స్థానాన్ని దక్కించుకునేందుకు విజయవాడ తీవ్రంగా శ్రమిస్తోంది.అందుకే ఈసారి స్వచ్ఛ్‌ భారత్‌ అవార్డుల్లో నంబర్‌ వన్‌ స్థానం పొందడానికి ఓ ప్లాన్‌ వేశారు. ప్రజల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణతో పాటు అదనంగా పాయింట్లు పొందేందుకు ఉద్యోగులు, ాలంటీర్లకు టార్గెట్లు పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి గ్రామంలో, పట్టణాల్లో ప్రతి వార్డులో క్లస్టర్ల వారీగా వాలంటీర్ల ద్వారా పౌరసేవలు అందిస్తున్నారు. ఇప్పుడు స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ బాధ్యతల్ని కూడా విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికా రులు వాలంటీర్లకు అప్పగించారు. ప్రతి వాలంటీర్‌ తన పరిధిలో ఉన్న కుటుంబాల తరపున సర్వే పూర్తి చేసేస్తున్నారు. వాలంటీర్ల వద్ద తన పరిధిలో ఉండే కుటుంబాల మొబైల్‌ ఫోన్‌ నంబర్లు ఉండటంతో వాటి ద్వారా సర్వే పూర్తి చేస్తున్నారు. మొబైల్‌ రిజిస్టర్‌ చేసి ఆ ˜ోన్లకు వచ్చే టీపీలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇలా కనీసం 100మంది తరపున సర్వే పూర్తి చేయాలని ఒక్కోక్కరికి టార్గెట్‌ పెట్టారు.
ప్రచారం ఎక్కువ ఫలితం తక్కువ…
స్వచ్ఛ్‌ భారత్‌ ద్వారా ప్రజోపయోగ కార్యక్ర మాలు విస్తృతంగా చేపడుతున్నా వాటి ఫలి తాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. విజయవాడ వంటి నగరాల్లో పబ్లిక్‌ టాయిలెట్లు పేరుకే ఉంటున్నాయి. నిర్వహణాలోపాలు ఎక్కువగా ఉంటున్నాయి. అయినా సర్వేలలో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం విజయవాడ మునిసిపల్‌ కమిషనర్‌గా నివాస్‌ ఉన్న సమయంలో సర్వేలో పాల్గొనేం దుకు కన్సల్టెంట్లకు బాధ్యతలు అప్పగించారని వార్తలు రావడంతో విజయవాడ నగరాన్ని ర్యాంకుల నుంచి మినహాయించారు. ఆ తర్వాత మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు వాలం టీర్లే ప్రజల తరపున సర్వేలు పూర్తి చేసే బాధ్యత అప్పగించారు. స్వచ్ఛ్‌ భారత్‌ కార్యక్ర మాల కోసం కేంద్రం భారీ ఎత్తున ఖర్చు చేస్తోంది. కేంద్ర బృందాలు పర్యటించే సమయంలో ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో పెద్ద ఎత్తున హోర్డింగులు, ప్రచార కార్యక్రమాలు కనిపించేలా ఏర్పాట్లు చేస్తారు. ఆ బృందాలు నగరాల్లో పర్యటించకుండానే ఈ హంగామా చూసి బాగా పనిచేస్తున్నాయనుకుని వెనుదిరిగిపోతాయి. మొత్తంమ్మీద ఏపీలో స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ అవార్డుల కోసం నగరపాలక సంస్థలు పడుతున్న పాట్లు ప్రచారాలకు పనికొస్తున్నాయి. ఈ ఏడాది విశాఖకు ర్యాంకు రావడానికి రాజకీ య కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.
టాప్‌ వన్‌ ర్యాంక్‌ సాధనే లక్ష్యం..
ఈ సంవత్సరం ప్రారంభంలో నగరంలో జరిగిన జీ-20సమ్మిట్‌ వర్కింగ్‌ గ్రూప్‌ కమిటీ సమావేశానికి, జీవీఎంసీ మౌలిక సదు పాయాల అభివృద్ధి పనుల కోసం సుమారు 110కోట్లు ఖర్చు చేసింది మరియు సుమారు 1.5లక్షల మెట్రిక్‌ టన్నుల లెగసీ వేస్ట్‌ల బయో మైనింగ్‌ను కూడా పూర్తిచేసింది.మూల్యాంకనంలో మంచి స్కోర్‌ కోసం అవసరమైన అన్ని రంగాలను మేము కవర్‌ చేసాం.ఈ సంవత్సరం టాప్‌ 1ర్యాంక్‌ సాధిస్తామనేది మా ఆకాంక్ష.
` సాయి క్రాంత్‌ వర్మ,కమిషనర్‌,జీవీఎంసీ-గునపర్తి సైమన్‌