న్యాయ దేవత కళ్లు తెరిసింది

దేశ అత్యున్నత న్యాయస్థానం న్యాయదేవతకు కళ్లు ఉండాలని నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ ఆదేశాలతో సుప్రీంకోర్టులో కొత్తగా న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.గతంలో న్యాయ దేవత కుడి చేతిలో న్యాయానికి ప్రతి బింబంగా నిలిచే త్రాసు, ఎడమ చేతిలో ఖడ్గం ఉండేవి. కొత్తగా ఏర్పాటుచేసిన న్యాయ దేవత విగ్రహం కుడి చేతిలో త్రాసు అలాగే ఉంచి ఎడమ చేతిలో ఖడ్గానికి బదులుగా రాజ్యాంగం ఉంచారు . ప్రస్తుతానికి సుప్రీంకోర్టులోని జడ్జీల లైబ్రరీలో ఈ విగ్రహాన్ని ఉంచారు. న్యాయం గుడ్డిది కాదని.. చట్టానికి కళ్లున్నాయని బలమైన సంకేతమిచ్చే ఉద్దేశంతో న్యాయదేవత విగ్రహంలో సుప్రీంకోర్టు మార్పులు చేసింది.న్యాయదేవత విగ్రహం కళ్లకు గంతలు కట్టడం వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉంది. చట్టం ముందు అందరూ సమానమే.. న్యాయస్థానం డబ్బు, అధికారం.. ఇతర హోదాను చూడదు అనే సందేశంతో విగ్రహానికి గంతలు కట్టి ఉండేవి.ఇక ఖడ్గం విషయానికి వస్తే అన్యాయాన్ని న్యాయదేవత చీల్చిచెండాడుతుందని సంకేతం ఇచ్చేందుకు చేతిలో ఖడ్గం ఉండేది.కాగా కొత్త న్యాయ దేవత విగ్రహం కిరీటం, ఆభరణాలతో భారతమాత రూపంలో ఉండ డం విశేషం. ఈ విగ్రహానికి ఆమోదం లభిస్తే దేశ వ్యాప్తంగా ఇదే విగ్రహాన్ని అన్ని న్యాయస్థానాల్లో ఏర్పాటుచేసే అవకాశం ఉంది.
అయితే ఇప్పటివరకు ఉన్న న్యాయ దేవతల విగ్రహాలకు..ఈ విగ్రహానికి చాలా తేడాలు ఉన్నాయి. సుప్రీంకోర్టులో కొత్తగా ఏర్పాటు చేసిన న్యాయ దేవత విగ్రహానికి కళ్లకు గంతలు తీసేశారు. అంతేకాకుండా న్యాయ దేవత కుడి చేతిలో ఉండే త్రాసును అలాగే ఉంచగా..ఎడమ చేతిలో ఉండే పొడవైన కత్తిని తీసేసి ఆ స్థానంలో రాజ్యాంగాన్ని పెట్టారు. అంటే రాజ్యాంగం ప్రకారం అందరికీ సమానంగా న్యాయం జరుగుతుందని తెలియ జేయడానికి దాన్ని అలా ఉంచారు.సుప్రీంకోర్టు జడ్జిల లైబ్రరీలో ఏర్పాటైన ఈకొత్త న్యాయ దేవత విగ్రహానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.చట్టానికి కళ్లు ఉండవని.. దానికి గుర్తుగానే కోర్టుల్లో ఉండే న్యాయ దేవత విగ్రహానికి ఉండే కళ్లను గంతలతో కడతారని మనం ఇప్పటివరకు విన్నాం.అంతేకాకుండా ఎన్నో సినిమాల్లో చూశాం.న్యాయ దేవతకు కళ్లు ఉండవని,చెవులు కూడా వినిపించవని పేర్కొంటారు.ఎందుకంటే డబ్బు, అధికారాన్ని బట్టి..నిందితులకు చట్టాలు, తీర్పులు ఉండ వని..న్యాయ దేవత ముందు అందరూ సమాన మేనని చెప్పేందుకే అలా ఉంచారు. అయితే ఈ న్యాయ దేవత విగ్రహాన్ని బ్రిటీష్‌ కాలంలో ప్రవేశపెట్టగా.. ప్రస్తుత పరిస్థితులకు అనుగు ణంగా మార్పులు అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. మనం కోర్టుల్లో చూసే న్యాయ దేవత జస్టియా అనే గ్రీకు దేవత. జస్టిస్‌ అనే పదం నుంచి జస్టియా అనే పేరు వచ్చింది.17వ శతాబ్దంలో ఒక బ్రిటిష్‌ కోర్టు అధికారి ఈ జస్టియా విగ్రహాన్ని మొట్ట మొదటి సారిగా మన దేశానికి తీసుకువచ్చారు.ఆ తర్వా త 18వ శతాబ్దంలో బ్రిటిష్‌ కాలంలో న్యాయ దేవత విగ్రహాన్ని కోర్టుల్లో ఉంచగా..స్వాతం త్య్రం వచ్చిన తర్వాత అదే విగ్రహం కొనసా గుతూ వచ్చింది.
ఇటీవల సుప్రీంకోర్టు ఆవరణలోని న్యాయ మూర్తుల గ్రంథాలయంలో కొత్త న్యాయదేవతా విగ్రహం ఏర్పాటు చేయటంతో దేశంలో ఈ మార్పు వెనకాలవున్న ఉద్దేశాలపైన పెద్ద చర్చ మొదలయింది.సాధారణంగా న్యాయదేవత ఒక గౌను వేసుకొని, తల విరబోసుకుని, కళ్లకు గంతలతో,ఒక చేతిలో త్రాసు,మరో చేతిలో ఖడ్గంతో ఉంటుంది.న్యాయదేవతగా ప్రపంచ దేశాలలో సైతం ఈ విగ్రహం ప్రసిద్ధి.గ్రీకు పురాణాల ప్రకారం థెమిస్‌ అనేది న్యాయ దేవతగా చెప్పుకుంటారు. ఆమె న్యాయానికి, చట్టానికి అధికారానికీ ప్రతీక.థెమిస్‌ను గ్రీకు ప్రజలు బాగా గౌరవిస్తారు. థెమిస్‌ అంటే గ్రీకు భాషలో సంప్రదాయం,చట్టం అని అర్థం. ఈజిప్టులోనూ ‘మాట్‌’ దేవతను సత్యదేవతగా పూజిస్తారు. రోమ్‌లో జెస్టిసియా దేవత న్యాయానికి గుర్తుగా ఉంది. ప్రపంచ దేశాలలో ఈ విగ్రహాన్ని న్యాయ స్థానాలలో వాడు తున్నారు. బ్రిటన్‌, ఫ్రాన్స్‌ మొదలైన దేశాలలో కూడా ఈ ప్రతిమనే న్యాయానికి ప్రతీకగా పెడతారు. బ్రిటీషర్స్‌ నుండి మనమూ కొనసాగిస్తున్నాము. చట్టానికి అందరూ సమా నమని,వారి వారి రంగు, మతము, పేద, ధనిక, ప్రాంత భేదాలు లేకుండా తప్పొప్పుల ఆధారంగానే న్యాయం జరుగుతుందని, శిక్షలు విధించడం చేస్తామని చేప్పే ప్రకటనకు, కళ్లకు గంతలు ఉంటాయని వివరిస్తారు.అలాగే ఖడ్గం ధరించడం అనేది శిక్ష విధింపునకు ఉండే అధికారాన్ని సూచిస్తుంది. ఇంకా వివరణలేవో చెపుతుంటారు.
స్వతంత్రం వచ్చినా బ్రిటీష్‌ పాలకులు బిగించిన చట్రంలోనే భారత దేశం పరిపాలన సాగు తోందన్నది అందరికీ తెలిసిన నిజం.అయితే ఎవరూ ఆ సంకెళ్ల ఆనవాళ్లను వదలించడానికి ప్రయత్నించలేని పరిస్థితి. అయితే అప్పటి బ్రిటీష్‌ పాలకులు ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా న్యాయదేవత విగ్రహాన్ని ఇలా కళ్లకు గంతలు కట్టి ఏర్పాటు చేశారు. ఇంత కాలం న్యాయదేవత కళ్లకు గంతలతో పాటు ఒక చేతిలో త్రాసు,మరో చేతిలో కత్తి ఉండేవి. చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పేందుకే న్యాయదేవత విగ్రహం కళ్లకు గంతలు కట్టేవారు.కుడి చేతిలో ఉండే త్రాసు న్యాయానికి సూచికగా ఉం డేది.ఎడమ చేతిలో ఖడ్గం అన్యాయాన్ని న్యాయ దేవత సహిం చదని,అంతం చేస్తుందని తెలిపేందుకు ఏర్పాటు చేశారు.
ఇంతకాలం కోర్టుల్లోనూ న్యాయం జరగనపుడు న్యాయదేవత కళ్లు తెరచి చూడదని,అందుకనీ నిజాలు తెలువవనీ విమర్శ వచ్చేది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ ఆదేశాల మేరకు న్యాయ దేవత రూపురేఖలను మార్చి తయారు చేశారు.ఆవిగ్రహం కళ్లకు గంతలు తీసివేశారు. చేతిలో కత్తి బదులు రాజ్యాంగాన్ని పెట్టారు. త్రాసు అలాగే ఉంది. కానీ మొత్తం దేవతా రూపం భారతీకరించారు. ’’న్యాయదేవత కళ్లకు గంతలు అవసరం లేదు. చట్టం ఎప్పుడూ గుడ్డిది కాదు.అదిఅందరినీ సమంగా చూస్తుంది.కత్తి హింసకు ప్రతీకగా కనిపిస్తుంది.కానీ న్యాయస్థానాలు రాజ్యాంగ చట్టాల మేరకు న్యాయాన్ని అందజేస్తాయి’’అని జస్టిస్‌ చంద్రచూడ్‌ ఈసందర్భంగా వ్యాఖ్యానిం చారు. వాస్తవికతలో అలా జరిగితే సంతోషమే. ఈ న్యాయ వ్యవస్థలోనే మొన్న మరణించిన ప్రొఫెసర్‌ సాయిబాబా తొమ్మిదేళ్లు విచారణ పేరుతో ఏనేరంరుజువు కాకుండానే జైల్లో మగ్గారు.హక్కుల కార్యకర్త స్టాన్‌స్వామి జైల్లోనే ప్రాణాలు విడిచారు.సాయిబాబాకు తన తల్లి మరణిస్తే,చూసేందుకు కూడా అనుమతి దొరక లేదు.కానీ అనేక దుర్మార్గాలు, హత్యలు, లైంగిక దాడుల ఆరోపణలతో జైలుకెళ్లిన డేరా బాబాకు పదులసార్లు పెరోల్‌ దొరికిన సంద ర్భంలో, న్యాయదేవత విగ్రహం మారగానే న్యాయం జరుగుతుందని నమ్మటానికి అవకాశముందా? అంబేద్కర్‌ ఆధ్వర్యంలో నిర్మితమైన రాజ్యాంగం పైన ఏమాత్రమూ గౌరవం,విశ్వాసం లేని పాల కులు,అనేక రాజ్యాంగ సవరణలకు పూనుకుని, రాజ్యాంగ మౌలిక స్వభావాన్నే మార్చివేస్తున్న వేళ,న్యాయదేవత చేతిలో రాజ్యాంగాన్ని పెట్ట గానే భ్రమకు గురవుతామా!కళ్లకు గంతలు తీసిన దేవతకు నిజాల్ని చూసి తీర్పులిచ్చే ధైర్యం వస్తుందా!ఈఅసమ సమాజంలో న్యాయం ఎవరి పక్షం వహించాలో న్యాయ వ్యవస్థకు ముందుగానే తెలుసు.న్యాయ చట్టా లను మార్చి,సంస్కృత పేర్లతో వాటిని పిలిచిన పుడే ఏదో మార్పుకు మార్గం వేస్తున్నారని సంకేతించారు.ఇప్పుడు భారతీకరించిన మను ధర్మాన్నే న్యాయంగా తెచ్చేందుకు పూనుకునే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా వేచిచూడాలి!
ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన విగ్రహం కళ్లకు గంతలు తీసేశారు. దీని అర్థం ఏమిటంటే చట్టం కళ్లున్నా చూడలేని గుడ్డిది కాదు. రెండు కళ్లు తెరిచి అందరినీ సమానంగా చూడగలదని చెప్పడానికే న్యాయదేవత కళ్లకు గంతలు తీసేశారు. అదేవిధంగా ఎడమ చేతిలో ఉన్న కత్తి బదులు రాజ్యాంగం ఉంచారు. దీని అర్థం ఏమిటంటే రాజ్యాంగాన్ని అనుసరించి న్యాయదేవత జరిగిన అన్యాయాన్ని గుర్తించి శిక్ష విధిస్తుంది. ఈ విషయాలను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ వెల్లడిరచారు. ఆయన ఆదేశాల మేరకే న్యాయదేవత విగ్రహంలో ఈ మార్పులు చేశారు.
న్యాయ దేవత కొత్త విగ్రహాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల లైబ్రరీలో ఏర్పాటు చేశారు. చట్టం గుడ్డిది కాదన్న సందేశం బలంగా వెళ్లాలన్న ఉద్దేశంతోనే ఇలా న్యాయదేవత విగ్రహంలో మార్పులు చేసినట్లు సమాచారం. – గునపర్తి సైమన్‌

గిరిజన ఆకాంక్షల మేరకు అల్లూరి జిల్లా అభివృద్ధి

గిరిజనుల ఆకాంక్షల మేరకు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తా మని అల్లూరి సీతారామారాజు జిల్లా కలెక్టర్‌ఎ. ఎస్‌.దినేష్‌ కుమార్‌ పేర్కొన్నారు.అక్టోబర్‌ 23న కలెక్టరేట్‌ మిని సమావేశ మందిరంలో జిల్లా వ్యా ప్తంగా ఉన్న పలుగిరిజనసంఘాల నేతలతో సమా వేశం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో విద్య, ఉద్యోగ అవకాశాలు, వైద్య సేవలు,రహదారుల అభివృద్ది,స్వయంఉపాధి పథకాలు,నైపుణ్యాభివృద్ధిని సమర్దవంతంగా అమ లు చేయడానికి గిరిజన సంఘాల నేతల తగు సలహాలు సూచనలు అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్రా 2047కింద చేపట్టిన అబి óవృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. పాఠ శాల భవనాల నిర్మాణాలకు ప్రభుత్వానికి ప్రతిపా దనలు పంపించాలమని తెలియ జేసారు.పాఠశాల భవనాలు లేని చోట తాత్కాలిక భవనాలు ఏర్పాటు చేయడానికి ఒకడిజైన్‌ చేయాలని అన్నారు. ప్రభు త్వ భూములు,క్వార్టర్లను ఆక్రమిస్తే తనదృష్టికి తీసుకునివస్తే తగిన చర్యలు చేపడతామని చెప్పా రు.గిరిజన భూములను గిరిజనేతరులు ఆక్రమిస్తే సమాచారం అందించాలని అన్నారు. మూడు, నాలుగేల్లో ప్రతి గ్రామానికి కనీస రహదారి సదు పాయం కల్పిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసీ జెఎసి నేతలు రామారావు దొర,మొట్టడం రాజాబాబు,కొర్ర బల రాం,డా.రామకృష్ణ,ఎస్‌.వరలక్ష్మి తదితరులు మాట్లాడుతూ ఆశ్రమపాఠశాలల్లో మెనూ సక్ర మంగా అమలు చేయడం లేదని అన్నారు. డిప్యూటీ వార్డెన్ల పోస్టులు నిర్వహణకు ఉపాధ్యాయులు పైరవీలు చేస్తుంటారని చెప్పారు.ఆశ్రమ పాఠ శాలలో చదువుకుంటున్న 4,5తరగతి విద్యా ర్ధులపై ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఎంపిపి పాఠశాలల ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు హాజరుకావడం లేదని అన్నారు. కొయ్యూరు ప్రాంతంలో జీడి తోటలు అధికంగా ఉన్నాయని జీడిపిక్కల పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు మెరుగు పడతా యని సూచించారు. జాఫ్రా,రబ్బరు పరిశ్రమలు, అటవీ ఉత్పత్తుల పరిశ్రమలు నెలకొల్పితే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. మారేడు మిల్లి నుండి రాజమండ్రికి బస్సు సౌకర్యం కల్పించాలన్నారు.గిరిజన యువతకు శిక్షణ అందించి స్వయం ఉపాధి పథకాలు నెలకొల్ప డానికి తగిన అవకాశాలు కల్పించాలని కోరారు. గంజాయి సాగు,రవాణా,వినియోగంపై కఠిన చర్య లు తీసుకోవాలని సూచించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యపరీక్షలు,రక్త పరీక్షలు సక్ర మంగా నిర్వహించడం లేదని చెప్పారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు.నకిలీ కులదృవీ కరణ పత్రా లుపై చర్యలు తీసుకోవాలని అన్నారు. రెడ్‌ క్రాస్‌ సంస్థ కార్య కలాపాలు సక్రమంగా జరగపోవడం వలన రక్తకొరత ఏర్పడుతుందని చెప్పారు. జిల్లాలో ముఖ్యంగా చింతూరు డివిజన్లో వరద సహాయ చర్యలు చేపట్టి నష్టాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టిన జిల్లా కలెక్టర్‌ సేవలును అందరూ ప్రశంసించారు. ఈ సమావేశంలో 22 మండలాల నుండి గిరిజన సంఘాల ప్రతినిధులు కె.ఆనం దరావు,గోపాల్‌,ఎస్‌.అశోక్‌,డా.పి.రాకుమార్‌, కె.సన్యాసిరెడ్డి,గిరిజన విద్యార్ధి సంఘం ప్రతిని దులు కిరసాని కిషోర్‌, ఎం.బాబూజీ తది తరులు పాల్గొన్నారు.
కాఫీ రైతులకు గిట్టుబాటు ధర అందించండి
అరకు కాఫీకి గిట్టుబాటు ధర అందించా లని జిల్లా కలెక్టర్‌ఎ.ఎస్‌.దినేష్‌కుమార్‌ సూచిం చారు. బుధవారం ఆయన కార్యాలయంలో ఐటిసి కంపెనీ అధికారులు,కాఫీ అధికారులతో కాఫీ విక్ర యాలపై సమావేశం నిర్వహించారు.ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ అరకు కాఫీని గిరి జన రైతులు ఆర్గానిక్‌ విధానంలో సాగు చేస్తు న్నారని కాఫీ రైతులకు మంచి ధర చెల్లించాలని స్పష్టం చేసారు. చింతపల్లి మాక్స్‌ సంస్థ సేకరిస్తున్న కాఫీని బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తామ మన్నారు. కాఫీ సేకరణలో తగిన నాణ్యతలు పాటించాలని సూచించారు. కాఫీ రైతుకు జియో ట్యాగింగ్‌ చేయడానికి చర్యలు చేపట్టాలని ఆదేశిం చారు.కాఫీ నాణ్యతలపై లైజాన్‌ వర్కర్లకు అవగా హన కల్పించాలని చెప్పారు.చింతపల్లి మాక్స్‌ సంస్థ ఈ ఏడాది 600టన్నుల పార్చిమెంట్‌ కాఫీని ఉత్పత్తి చేస్తోందన్నారు గిరిజన కాఫీని బహిరంగ వేలంలో విక్రయిస్తామన్నారు.గత రెండు సంవ త్సరాలను అరకు కాఫీ ఫైన్‌ కప్‌ అవార్డును పొందు తోందన్నారు.ఐటిసి అధికారులు వాసు దేవ మూర్తి, కిరీట్‌ పాండే మాట్లాడుతూ మాక్స్‌ కాఫీ వేలంలో పాల్గొంటామని చెప్పారు. కాఫీ విక్రయాలు, వేలం సమయంలో సమాచారం అందించాలని కోరారు.
జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కలిసికట్టుగా నడుద్దాం – రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత
ఉమ్మడి విశాఖపట్టణం జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి అందరం కలిసి కట్టుగా నడుద్దా మని, సమష్టి కృషి చేద్దామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు.ప్రజా సమస్య ల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ పేద ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలుద్దామని పేర్కొ న్నారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఛైర్‌ పర్శన్‌ జె.సుభద్ర అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో హోం మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.సీజనల్‌ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయి లో వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండేలా జాగ్రత్త పడాలని సూచించారు. డయేరియా లాంటి మహమ్మారి దాడి చేయకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని,ఓవర్‌ హెడ్‌ ట్యాంకులను తరచూ శుభ్రం చేయాలని, క్లోరినేషన్‌ ప్రక్రియను నిరంతరం చేపట్టాలని చెప్పారు.మురుగు కాలువలకు ఆను కొని తాగునీటి పైపు లైన్లు ఏర్పాటు చేయరాదని, జలజీవన్‌ మిషన్‌ లో భాగంగా చేపట్టిన పనులను నిర్ణీత కాలంలో వందశాతం పూర్తి చేయాలని పేర్కొన్నారు.
గిరిజన ప్రాంతంలో రోడ్ల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక
గిరిజన ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని,శివారు గ్రామాలకు వెళ్లే పరిస్థితి లేదని పలువురు సభ్యులు ప్రస్తావించగా స్పందించిన హోం మంత్రి రోడ్ల అభివృద్ధికి సభ్యుల సలహాలు, సూచనలతో సమగ్ర ప్రణాళిక రూపొందిద్దామని పేర్కొన్నారు.ఇప్పటికే దీనిపై కేంద్ర హోం మంత్రి తో చర్చించామని కేంద్ర,రాష్ట్ర నిధుల సహా యం తో గిరిజన ప్రాంతాల్లో రోడ్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకుందామని అన్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఇక నుంచి డోలీమోత కష్టాలు ఉండ వని హోంమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మైదాన ప్రాంతాల్లో కూడా రోడ్ల మరమ్మతులకు తక్షణ చర్యలు చేపడతామని,తదుపరి శాశ్వత చర్యలు తీసుకుంటామని ఈసందర్భంగా తెలి పారు.ఇప్పటికే ఉమ్మడి జిల్లాల్లోని రోడ్ల మరమ్మ తులకు రూ.20కోట్లతో పనులు చేసేందుకు చర్య లు తీసుకున్నట్లు ఆమెగుర్తు చేశారు. రోడ్లకు ఇరు వైపులా తుప్పలను తక్షణమే తొలగించాలని ర.భ. శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే వర్షా కాలం కావున కాలువగట్ల పటిష్టతకు ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉందని సంబంధిత అధికా రులను ఉద్దేశించి పేర్కొన్నారు.జడ్పీ ఛైర్‌ పర్శన్‌ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ముం దుగా సీఈవోపి.నారాయణమూర్తి అజెండా అం శాలను చదివి వినిపించారు.సభ్యులు పలు అంశా లపై ప్రశ్నలు వేశారు. మధ్యాహ్న భోజనం పథకా న్ని బాగా అమలు చేయాలని,ప్రయివేటు పాఠశా లల్లో తనిఖీలు చేపట్టాలని, పిల్లల భద్రతకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ సకాలం లో విత్తనాలు, ఎరువులు అందించాలని కోరారు. ఇటీవల కురిసిన వర్షాల కు ఏజెన్సీ ప్రాంతంలో భారీగాపంట నష్టం జరి గిందని, పారదర్శకంగా అంచనాలు వేసి పరిహా రం అందించాలని విజ్ఞప్తి చేశారు.రోడ్లకు మరమ్మ తులు చేపట్టాలని విన్నవించారు. ఉపాధి హామీ, కల్వర్టుల నిర్మాణం, తాగు నీటి సౌకర్యం,జలజీవన్‌ మిషన్‌ పనులు తదితర అంశాలపై సభ్యలు మాట్లా డారు.
స్టీల్‌ ప్లాంటుపై ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా స్పందిస్తాం ః ఎంపీ శ్రీభరత్‌
సమావేశంలో భాగంగా స్టీల్‌ ప్లాంటు విషయంలో స్థానిక ఎంపీ పార్లమెంటులో ప్రస్తావించాలని, న్యా యం చేయాలని ఓసభ్యుడు విన్నవించగా విశాఖ పట్టణం ఎంపీ శ్రీభరత్‌ సానుకూలంగా స్పందిం చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక స్టీల్‌ ప్లాంటు విషయంలో కేంద్రం నుంచి సానుకూల పరిణా మాలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. ఈ నాలుగు నెలల కాలంలో రూ.500కోట్లు ఒక సారి,రూ.1200కోట్లు ఒకసారి మొత్తం రూ.1, 700 కోట్ల నిధులు వేర్వేరు అవసరాల దృష్ట్యా విడుదలయ్యాయని పేర్కొన్నారు. నిధుల విడుదల ను బట్టే స్టీల్‌ ప్లాంటు విషయంలో కూటమి ప్రభు త్వం దృక్పథం అర్థమవుతుందని ఎంపీ వ్యాఖ్యా నించారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే స్థానికంగా స్పందిస్తామని ఎంపీ స్పష్టం చేశారు. కాఫీ,మిరియాలు,జీడితోటలు,ఇతర పండ్ల తోట లకు గ్రామీణ ఉపాధిహామీపథకాన్ని అనుసం ధానం చేసే విధంగా పార్లమెంటులో ప్రస్తావిం చాలని జడ్పీ ఛైర్‌ పర్శన్‌ ఎంపీని కోరగా తప్పకుం డా ప్రస్తావిస్తామని ఎంపీ భరత్‌ పేర్కొన్నారు.
పాఠశాలల్లో, వసతి గృహాల్లో ఆహారం నాణ్యతను పెంచాలి ః ఎంపీ తనూజ రాణి
ప్రభుత్వ పాఠశాలల్లో, వసతి గృహాల్లో అందించే ఆహారం నాణ్యతను మరింత పెంచాలని అరుకు ఎంపీ తనూజ రాణి పేర్కొన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగు పరచాలన్నారు. పిల్ల లకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని సూచిం చారు. ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా హాజరయ్యేలా..పిల్లలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. శిథిల భవనా లకు మరమ్మతులు చేయాలని, కొత్తవాటిని నిర్మిం చాలని, గ్రామాల్లో జలజీవన్‌ మిషన్‌ పనులు పూర్తి చేయాలని సూచించారు.స్థానిక సమస్యలను పార్ల మెంటులో ప్రస్తావిస్తానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
మార్కెట్‌ కమిటీ ఆదాయాన్ని ప్రజా అవసరాలకు వెచ్చించాలి ః పెందుర్తి ఎమ్మెల్యే
స్థానికంగా ఉండే మార్కెటింగ్‌ కమిటీల ద్వారా వచ్చే ఆదాయాన్ని స్థానిక ప్రజా అవసరాల మేరకు వెచ్చించాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌ బాబు అభిప్రాయపడ్డారు. ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయాలపై అధికారులు దృష్టి సారించాలని, సభ్యులకు,ప్రజలకు సహకారం అందించాలని సూచించారు. అలాగే సమావేశానికి వచ్చే సభ్యులు స్థానిక పరిస్థితులపై ముందుగానే అవగాహన కల్పించుకోవాలని,ఏయే అంశాలపై ప్రశ్నలు అడ గాలో సిద్ధమై రావాలని అప్పుడే ఆశించిన ఫలితా లు వస్తాయని పేర్కొన్నారు. అన్ని రకాల శాఖలకు సంబంధించిన ప్రజా సమస్యలు, అంశాలపై అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి ప్రజలకు తోడుగా నిలవాలన్నారు.
షట్రపల్లిలో మోడల్‌ కాలనీ నిర్మిస్తాం ః ఏఎస్సార్‌ జిల్లా కలెక్టర్‌
ఇటీవల కురిసిన వర్షాలకు జీకే వీధి మండలం లోని షట్రపల్లిలో భారీ నష్టం జరిగిం దని, అక్కడి ప్రజలు ఇళ్లు కూడా కోల్పాయరని స్థానిక జడ్పీటీసీ సభ్యులు ప్రస్తావించగా అల్లూరి సీతారాజు జిల్లా కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ సానుకూలంగా స్పందిం చారు. ఇటీవల ఆ ప్రాంతాన్ని సందర్శించానని, అక్కడి పరిస్థితులను పరిశీలించానని చెప్పారు. షట్రపల్లి గ్రామంలోని 37కుటుంబాలను అనుకూ లమైన ప్రాంతానికి తరలించి వారికి కోసం పీఎం ఆవాస్‌ యోజన పథకం కింద మోడల్‌ కాలనీని నిర్మిస్తామని పేర్కొన్నారు.
సమావేశంలో విశాఖపట్టణం,అరుకు ఎంపీలు శ్రీభరత్‌, తనూజ రాణి,ఎమ్మెల్సీ దువ్వా రపు రామారావు,పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌ బాబు, విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లు ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌, దినేష్‌ కుమార్‌,విజయ కృష్ణన్‌,ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు,ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
-జిఎన్‌వి సతీష్‌

దసరా అందరూ కలిసే సరదా

ప్రకృతి ప్రసాదించే ప్రత్యేక కాలాల్లో మనుషుల సంతోషాలూ, సందళ్లూ పరవళ్లు తొక్కుతుం టాయి. ఆటపాటలూ, ఆనందాలూ ఆకాశాన్ని తాకుతాయి. ఇది పండగల ఆరంభ సంధర్భం. ఆ తరువాత పండగల్లోకి పురాణగాథలు వచ్చి చేరతాయి. కథోపకథల సంగతి ఎలా ఉన్నా.. పండుగ పరమార్థం పదిమందీ కలిసి ఆడటం, పాడటం, చెడును నిరసించి,మంచికి జేజేలు పలకటం. చెడు మీద మంచి గెలిచిన ప్రతిసారీ మనుషులంతా గెలిచినట్టే.అదే నిజమైన పండగ. దసరా సరిగ్గా అట్లాంటి పండగే. మంచి సాధించిన విజయానికి ప్రతీక. మన అమ్మల వీరత్వానికి ఒక మచ్చుతునక. ప్రకృతిని గౌరవించుకుంటూ మనుషులిచ్చే కానుక. ఈ చివరి వాక్యాలను స్కాన్‌ చేసి, మనసులో సేవ్‌ చేసుకోవాలి.ఈ చివరి వాక్యాలను టాటూగా హృదయం మీద వేసుకోవాలి. నిజానికి ఇది దసరాని మరింత గుర్తుచేసుకోవాల్సిన సందర్భం.సింధూ నాగరికత కాలం నుంచీ నేటి వరకూ మన చరిత్రను పరిచీ,తరచీ చూసుకోవాల్సిన సందర్భం.ఈ నేల మీద మాతృస్వామ్య వ్యవస్థ తాలూకా ఛాయలు లీలామాత్రంగా కనిపిస్తూనే ఉంటాయి. కాకపోతే మనం కాస్త ఫోకస్‌ చెయ్యాలి. మరి కాస్త జూమ్‌ చేయాలి. లేదంటే నిర్భయలూ, దిశలూ, గృహహింసా బాధితులు, చైల్డ్‌ అబ్యూజ్‌కు గురవుతున్న పిల్లలూ, ఆఫీస్‌లో చెవులు కట్టేసుకుని బతుకుతున్న ఉద్యోగినులు.. ఇలా వీళ్లే కనబడుతుంటారు. అదీ నేటి పరిస్థితి.ఇది చెడు మీద కత్తి తిప్పిన దుర్గమ్మను తలుచుకోవాల్సిన సమయం. పురుషాధిక్యపు చెట్టు మీద ఎక్కుపెట్టడానికి సమానత్వపు గొడ్డలిని సిద్ధం చేసుకోవాల్సిన సందర్భం. మన అమ్మలఅమ్మలఅమ్మల వీర గాథóలను నరన రానా ఇంకించుకోవాల్సిన సమయం. ఒకసారి దసరానీ, అందులో మిళితమై ఉన్న మన తెలుగు సంస్కృతినీ, మన ఇంటి అమ్మలని మనం గౌరవించుకునే విధానాన్నీ తలుచుకుందాం.
టూకీగా అదీ కథ..
ప్రకృతిని ఆరాధిస్తూ, మాతృమూర్తిని జగన్మా తగా కొలిచే పండగే దసరా. సహజంగా తల్లి తన బిడ్డల పట్ల అపరిమితమైన ప్రేమను కలిగి ఉంటుంది. తన బిడ్డలు మంచిని పంచాలనీ, చెడును అంతరించాలనీ, మనుషులందరి కోసం నిలబడాలనీ కోరుకుంటుంది. దీని కోసం తన జీవితాన్ని హాయిగా ఇచ్చేస్తుంది. కానీ కథ యూటర్న్‌ తీసుకుంటే ఊరుకోదు. ఆ బిడ్డలే చెడు వైపు నిలబడితే, అడ్డుకోవడానికి సర్వప్రయత్నాలూ చేస్తుంది. విఫలమైతే రౌద్ర మూర్తిగా మారి తానే బుద్ధి చెబుతుంది. టూకీగా ఈ తాత్వికతను చాటిచెప్పే పండుగే దసరా.
నవరాత్రులు..
సీమాంధ్రలో దసరా పండగను నవరాత్రులుగా చేసుకుంటారు. ఒక్కోరోజున ఒక్కోరకంగా దుర్గమ్మను అలంకరించుకుని మాతృమూర్తికి ప్రతిరూపంగా, చెడుపై అమ్మ సాధించిన విజయానికి ప్రతీకగా కొలుస్తారు. ప్రపంచీ కరణ ప్రభావానికి ముందు జీవం ఉన్న పండుగలను ప్రజలంతా మనసారా ఆస్వాదించే వాళ్లు.వేడుకలన్నీ కమర్షియల్‌ అయ్యాక ఆ మజా తగ్గిపోయింది. మనిషికీ, మనిషికీ మధ్య పోటీ ప్రపంచం దూరాన్ని పెంచింది. దాన్ని పండగలు కూడా దగ్గర చేయలేకపోతున్నాయి. ఇదంతా మనుషుల మీద పెట్టుబడి సాధించిన విజయం. మనుషులకూ, మమతలకూ మధ్య క్యాపిటలిష్టులు దూరం పెంచిన వైనం. కాలాన్ని కొంచెం వెనక్కి జరిపితే మనం కొన్ని ఆనంద సమయాలనూ, మరికొన్ని కళారూపాలనూ గుర్తుతెచ్చుకోవచ్చు.
విజయవాడలో కనకదుర్గ..
దసరా అనగానే విజయవాడ కచ్ఛితంగా గుర్తుకొస్తుంది. ఇప్పుడు కాస్త తీరు మారింది కానీ,గత కాలపు ఉత్సవాల్లో కళలకు ప్రాధా న్యత ఉండేది. తొమ్మిది దశాబ్దాల క్రితమే ఇంద్రకీలాద్రి కొండ మీద భేతాళ వేషాలు వేయడం..ఆడటం ఒక సంస్కృతిగా మొదలైంది. అంతరించిపోతున్న సామాన్యుల కళారూపాల్లో ఇదీ ఒకటి. అత్యంత క్లిష్టమైన ఈ కళాప్రక్రియలో కాళికాదేవి వేషం వేసుకుని, ఆడటం కత్తి మీద సాము లాంటిదే. ఆ రూపా నికి అవసరమయ్యే చేతుల బరువు పాతిక కేజీలు ఉంటుంది. వాటిని వీపుకు తగిలిం చుకుని తలపై కిరీటం పెట్టుకుని నృత్యం చేస్తారు. ఆ కళాకారులు పలికించే హావ భావాలు ఇప్పటి తరానికి ఏ ఓటీటీ తెర మీదా కనిపించవు. వెండితెర మీద డబ్బింగ్‌ సినిమా కాంతారాకు కలక్షన్ల వర్షం కురిపించాం. అలాంటి కళారూపాలు మనకూ ఉన్నాయనీ ఇప్పటికీ వాటి ప్రదర్శనలు జరుగుతున్నాయని ఎవరికో కానీ తెలియకపోవడం విషాదం. తొంభై ఏళ్ల క్రితం బెజవాడలో ఈ బేతాళ వేషాలను బి. గురువులు, చంటీ మొదటగా వేశారు. ఇప్పటికీ వాళ్ల వారసులు ఆ వారస త్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇవే కాకుండా తోలుబొమ్మలాటతో మొదలుకుని బుర్రకథల వరకూ అనేక కళరూపాలకు ప్రదర్శనా వేదికలుగా ఒకప్పటి దసరా ఉత్సవాలు ఉండేవి.ఇప్పటికీ అరాకొరా వాటి ఛాయలు ఉన్నా ఆ స్థాయి ప్రభావం లేదు. ప్రభలు కట్టే సంస్క ృతి కూడా ఇక్కడ వైభవంగా సాగేది. ఎడ్ల బండ్లపై ఎంత ఎత్తుగా ప్రభను కడితే అంత గొప్పగా భావించేవాళ్లు. అందులో కాళికాదేవి వేషం కట్టి కూర్చునే మనిషి అచ్చంగా విగ్రహంలానే ఉండి ఆశ్చర్యపరి చేవారు. పీడిత ప్రజల నేత పుచ్చలపల్లి సుందరయ్య ఫోటోని పెట్టి ప్రభను కట్టిన చరిత్ర ఉంది. అత్యంత వైభవంగా సాగే ఈ సంస్క ృతి కూడా దాదాపు అటకెక్కేసింది.
తెలంగాణాలో బతుకమ్మ
%దసరానే కాదు. దసరా నవరాత్రుల్లో జరుపుకునే పండగల్లోనూ ఓ విశిష్టత ఉంది. ప్రకృతితో మమేకమయ్యే సజీవ సంబంధమేదో దాగుంది. మహిళలను గౌరవించుకునే పద్ధతి ఇమిడి ఉంది. తెలంగాణలో దేవీ నవరాత్రుల్లో భాగంగా జరుపుకునే బతుకమ్మ పండగ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. బతుకమ్మ ‘పూల పండగ’, చెరువుల పండగ, మహిళల పండగ, పర్యావరణ పండగ. మరి కాస్త అర్థం చేసుకుని చెప్పాలంటే ప్రకృతి పండగ. మన అమ్మలకు, అక్కలకు, ప్రతి ఆడబిడ్డకూ కృతజ్ఞతలు తెలుపుకునే పండగ. ఇంకా లోతుగా వెళ్లి చూస్తే ఇది ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే పండుగ. జీవితాన్ని ఇచ్చిన ఆడబిడ్డలకు, అమ్మలకు మనం చెప్పే ధన్యవాదాల పండగ.
బతుకమ్మ పండగ సాధారణంగా భారతీయ కాలమానం ప్రకారం ఆశ్వయుజ మాసంలో వస్తుంది. ఈ వేడుకను తొమ్మిది రోజుల పాటు సెలబ్రేట్‌ చేసుకుంటారు. ‘బతుకు’ ‘అమ్మ’ అనే పదాలే బతుకమ్మగా మారాయి. ఇందులో భాగంగానే మహిళలనూ, ప్రకృతినీ పూజించు కుంటారు. సాధారణంగా భారతీయ పూజా విధానాల్లో విగ్రహారాధన ఉంది. అందులో భాగంగా పూజ కోసం పూలను ఉపయోగి స్తారు. కానీ బతుకమ్మ విషయంలో మాత్రం పూలనే దైవత్వానికి ప్రతినిధిగా గుర్తించి పండగ చేసుకుంటారు.
ఈ తొమ్మిది రోజుల వేడుకల్లో గొప్ప జీవన విలువల్ని నేర్పే పాఠాలూ ఉన్నాయి. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ,మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ,ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరోరోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ,తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో పండగ పూర్తవుతుంది. రోజుకో బతుకమ్మ చొప్పున చివరిరోజుకు చేరేసరికి ఒక రకమైన పరిపూర్ణత చేకూరుతుంది. చివరి రోజున సద్దుల బతుకమ్మతో దగ్గర్లోని చెరువుకి చేరతారు. అక్కడ ఆటపాటల మధ్యన బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. బతుకమ్మను పేర్చే క్రమంలోనూ మన మహిళల కళాత్మక నైపుణ్యం ఉట్టిపడుతూ ఉంటుంది.
బతుకమ్మ పాటల్లోనూ ఒకరకమైన స్పెషాలిటీ ఉంటుంది. ప్రతి వాక్యంలోనూ ప్రకృతి పట్ల ప్రేమ,గౌరవం,ఆరాధనా కనిపిస్తూ ఉంటాయి. అవి సామాన్యుల జీవితాలకు దగ్గరగానూ, అందరూ కలిసి పాడుకునేందుకు వీలుగానూ ఉంటాయి.
అవన్నీ పల్లెల నుంచి పుట్టిన పాటలు..
శ్రామిక మహిళల నుంచి పుట్టిన పాటలు. ఎంపలీ చెట్టు కింద ఉయ్యాలో ఎంపలీ చెట్టు కింద ఉయ్యాలో ఎల రేని కింద ఉయ్యాలో ఎప్పుడూ నీ నోము ఉయ్యాలో శ్రీ గౌరి దేవి ఉయ్యాలో చిన తల్లి నోమింది ఉయ్యాలో సిన తోటా వనము ఉయ్యాలో పెద తల్లి నోమింది ఉయ్యాలో పెద్ద తోటా వనము ఉయ్యాలో నా తల్లి నోమింది ఉయ్యాలో నందన్న వనము ఉయ్యాలో నందన్న వనమైతె ఉయ్యాలో నాకేమి కలుగు ఉయ్యాలో పెట్టెతో బియ్యమే ఉయ్యాలో పేటంచు చీర ఉయ్యాలో గోనెతో బియ్యమే ఉయ్యాలో గోరంచు చీర ఉయ్యాలో మొంటెతో బియ్యమే ఉయ్యాలో మొగ్గాలంగీలు ఉయ్యాలో ఏమేమి పువ్వొప్పుదూ గౌరమ్మ ఏమేమి పువ్వొప్పుదూ గౌరమ్మ ఏమేమి కాయొప్పుదూ గౌరమ్మ గుమ్మాడి పువ్వొప్పుదూ గౌరమ్మ గుమ్మాడి కాయొప్పుదూ గౌరమ్మ గుమ్మాడి చెట్టు మీది యాట సిలుకాలాల పాట సిలుకాలాల కలికి సిలుకాలాల కందుమ్మ గుడ్డలు మమ్మ సిరి మేడలు రాను మూడడుగులు పోను మూడడుగులు సందప్పు జల్లులు సకినప్పు నీడలు నీడల్ల కనుగొంటినీ గౌరమ్మ
నీ నోము నే నోమితీ గౌరమ్మ
ఈ పండుగలో జమ్మిచెట్టుకి కూడా ప్రాధాన్యత ఉంది. జమ్మి కొండవాలుల్లో పెరిగే ఒక ముల్ల చెట్టు. దీంతో అనుసంధానమవడం కంటే ప్రకృతితో మమేకం అవ్వడం ఇంకేముంటుంది. జమ్మి చెట్టును పూజించుకోవడం కూడా ఈ పండుగలో ప్రధాన ఘట్టం.జమ్మి ఆకులను పెద్దలకు ఇచ్చి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. ఈ విషయంలో కరీంనగర్‌ లాంటి ఉత్తర తెలంగాణా ప్రాంతాల్లో మరి కొంత విభిన్నమైన సంస్క ృతిని చూడొచ్చు.వయసు తేడాలను పరిగణనలోకి తీసుకోకుండా,ఇంట్లోని ప్రతి మహిళకూ జమ్మి ఆకును ఇచ్చి నమస్కరిస్తారు. అదీ కాక ఆడపిల్లలు తమ పుట్టింటికి కచ్ఛితంగా చేరే పండగ ఇది. బతుకమ్మకు పేర్చే పూలను చూసుకున్నంత అపురూపంగా, గౌరవంగా, మర్యాదగా వాళ్లని చూడమనే బతుకమ్మ చెప్పేది.
పిల్లల సందడి
అది ఏ పండగైనా కానివ్వండి.ముందుగా వెలిగిపోయేది పిల్లల మొహాలే.సెలవులకు వారం రోజులు ముందుగానే, పిల్లల్లో ఆ ఆనం దం కనిపిస్తూ ఉంటుంది. అమ్మమ్మల ఇళ్లకు, నానమ్మలకు ఇళ్లకు ఎప్పుడెప్పుడు వెళ్దామా అనే ఎదురుచూపులు ఉండేవి. స్కూల్‌ ఒత్తిళ్లకు కాస్త విరామమిచ్చి పల్లె వాతావరణపు మట్టిగాలినీ, ముందుతరాల ప్రేమలనీ గుండెల నిండా నింపుకునే అవకాశం ఉండేది.పండగ అంటే ఊరంతా కలిసి జరుపుకునేది.వీధుల్లో జరుపుకునేది.నవ్వుకుంటూ,తుళ్లుకుంటూ ఆలింగనాల మధ్య జరుపుకునేది.కానీ ఇప్పుడు తీరు మారిపోయింది. పిల్లలంతా అపార్ట్‌ మెంట్‌లో చిక్కుకుపోయారు. మన బతుకుల్లానే పండగ కూడా ఇరుకైపోయింది. ముందు తరం వరకూ అయినా కాస్తోకూస్తో అసలైన పండగ శోభను చూసి ఉన్నారు. బొమ్మల కొలువులు పెట్టుకుని, స్నేహితులతో ఆడిపాడి ఉన్నారు. ఇప్పుడంతా పబ్జీలు, ఫ్రీఫైర్‌ల కాలమొచ్చేసింది. బొమ్మల కొలువు కమ్యూనికేషన్‌ని పెంచితే, స్మార్ట్‌ఫోన్‌ ఆటలు కళ్లను డ్యామేజ్‌ చేస్తున్నాయి.
పిండి వంటలు
పండగ అంటే సంస్క ృతీ,సాంప్రదాయం,కళలు ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. వాటన్నింటితో పాటు పిండి వంటలకూ ప్రత్యేక స్థానం ఉంది. ఒక తమిళ సినిమాలో హీరో విజరు ’’కప్పు ముఖ్యం బిగిలు’’ అన్నట్టు పండుగకు ’’పిండి వంటలు’’ ముఖ్యం.పిల్లలకు సెలవులు ఇవ్వగానే, టౌన్‌లూ,సిటీలూ టిక్కెట్టేసుకుని సొంత ఊళ్లకు చేరిపోయేవాళ్లు. అందరూ కలిసి ఒకదగ్గర చేరి ఒక్కో ఇంటి పిండివంటలనూ చేసుకునేవాళ్లు. ఏడాది పాటు జీవితాల్లో జరిగిన కష్టాలకూ, నష్టాలకూ, సుఖాలకూ, దు:ఖాలకూ షేరింగ్‌ పాయింట్‌ అదే. ఇప్పుడు సోషల్‌ మీడియాలో స్టేటస్‌ పెడితే చూసే కాలం.మనుషులంతా సంతోషాలను తెర మీదా,బాధలను గుండె లోపలా దాచుకుంటున్న కాలం. పిండి వంటల సంగతి స్విగ్గీ,జొమోటో,స్వగృహా ఫుడ్స్‌ చూసుకుంటున్నాయి.ఆర్డర్‌ చేసాక, డెలివరీ బారు తెచ్చిచ్చే, కేజీ అరిసెలంత తీపిదనం కూడా లేని పండగను సెలబ్రేట్‌ చేసుకునే హడావుడిలోకి చేరిపోయాం.
దసరా మామూళ్లు
నిజానికి దసరా మామూళ్లు ఒక ఎమోషన్‌. ఒకరి సాయం లేకుండా ఎవరూ తమ బతుకుబండిని లాగలేరనేది వాస్తవం.అది ఇల్లు కావొచ్చు,ఆఫీస్‌ కావొచ్చు, పొలం కావొచ్చు మరేదైనా కావొచ్చు. హెల్పర్లు లేకపోతే ముందుకు నడవాల్సిన పని వెనక్కే నడుస్తుంది. వాళ్లని గౌరవించుకోకపోతే,ఒక మనిషి తనని తాను గౌరవించుకోనట్టే అవుతుంది. ఇలా పండగల సందర్భంలో తమ హెల్పర్లకు మూమూళ్లు ఇవ్వడం ఒక మనిషి తనకు తాను ఇచ్చుకునే మర్యాదే అవుతుంది. ఒకప్పుడు దసరా వస్తుందంటేనే పనివాళ్ల మొహాలన్నీ కళకళలాడుతుండేవి. ఇప్పటికీ ఈట్రెండ్‌ కొనసాగుతున్నా కొద్దిపాటి మార్పులొచ్చాయి. డిజిటల్‌ ఇండియా అట్టడుగు స్థాయి వర్కింగ్‌ క్లాస్‌ వరకూ ఇంకా పూర్తిగా చేరనేలేదు. మరో పక్క పైస్థాయి వర్కింగ్‌ క్లాస్‌ ఉద్యోగులు చెల్లిం పులన్నీ డిజిటల్‌ మయమైపోయాయి. ఇదే అవకాశం అనుకుని, మూమూళ్లకు ఎగనామం పెడుతున్న మహానుభావులూ పెరిగిపోయారు. తప్పదన్నట్టూ, వదిలించుకోవాలన్నట్టూ ఎంతో కొంత సమర్పించుకునేవాళ్లూ ఎక్కువైపోయారు. హృదయంతో మామూళ్లిచ్చే కాలం వెళ్లిపోయి చాలా కాలమే అయింది.
పలచనవుతోన్న కళ..
ఇప్పుడు ఏ పండగలోనైనా సాంప్రదాయకళల సందడి తగ్గింది. హడావిడి పెరిగింది.. ఆదరణ సన్నగిల్లింది. నాలుగు శతాబ్దాల చరిత్ర ఉన్న ఒంగోలు ‘కళారం’ ఆచారం ఇప్పటికీ కొనసాగుతున్నా ఆ శోభ తగ్గిపో యింది. తూతూ మంత్రంగా లాగించడమే తప్ప గౌరవమూ, ఆసక్తి సన్నగిల్లిపోతున్నాయి. మచిలీపట్నం కాళికానృత్యం పరిస్థితీ ఇంతే. అత్యంత కళాత్మకమైన ఆ నృత్యానికి అప్పటి ఆదరణలో పదోవంతు కూడా ఇప్పుడు కనిపించడం లేదు. ఆకాశాన్ని తాకే వీరవాసం ఏనుగు సంబరాలు ఇప్పుడు పూర్తిగా నేల మీదే ఉన్నాయి. ఇక దసరా వేషాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒకప్పుడు వీటికి ప్రత్యేక ఆకర్షణ ఉండేది. వేషం కట్టి ఇంటింటికీ తిరిగి తమ కళారూపాన్ని ప్రదర్శించే కళాకారుల కోసం మీ దగ్గర ఒక భూతద్దం ఉంటే తీసి వెతకండి. ఒకరో ఇద్దరో కనిపించొచ్చు. పోనీ మీ యూట్యూబ్‌లో సెర్చ్‌ చేసి చూడండి. అతి తక్కువ వ్యూవ్స్‌తో ఏదో ఒక మూలన కనిపించొచ్చు.ఇది మనం సమూలంగా దసరాను గుర్తుచేసుకోవాల్సిన సమయం.అసలైన దసరా అంటే ప్రకృతిని గౌరవించడం.అసలైన దసరా అంటే మహిళలను గౌరవించడం.అసలైన దసరా అంటే కళలను గౌరవించడం. అసలైన దసరా అంటే అదంతా అందరూ కలిసే ఒక సరదా.(ప్రజాశక్తి సౌజన్యంతో..) – (రావి నేహ)

కొత్త బొగ్గు తవ్వకాలు నిలిపివేయాలి

ఆసియన్‌ పీపుల్స్‌’మౌవ్‌మెంట్‌ ఆన్‌ డెబ్‌ట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఏపీఎండీడీ`Aూవీ ణణ) పిలపు మేరకు గ్లోబల్‌ వీన్‌ ఆఫ్‌ యాక్షన్‌ 10-20సెప్టెంబర్‌ వరకు ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు తవ్వకాలు నియంత్రించి, కొత్త చేపట్టబోయే తవ్వకాలను నిలిపి వేయా లని డిమాండ్‌ చేస్తూ ఏపీ అల్లూరి సీతారా మారాజు జిల్లా బొర్రా గుహలు,కటికి, అరకువ్యాలీ వంటి పర్యాటక ప్రాంతాల్లో గిరిజన యువకులతో కలసి ర్యాలీ నిర్వహిం చారు.బొగ్గు తవ్వకాలు ఆపాలి,భూగర్భలో ఉన్న ఇంధన వనరల వెలికితీత తగ్గించాలి, సోలార్‌ వినియోగం పెంచాలి,ప్రతిచోటా విండ్‌ పవర్‌ ప్లాంట్స్‌,మైక్రో హైడల్‌ పవర్‌ ప్లాంట్స్‌ ఏర్పాటు చేయాడెబ్బై అయిదు సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత…మన దేశంలోని ఇతర ఏ రంగం కన్నా కూడా…వ్యవసాయ రంగం ఎక్కువ సంక్షోభంలో ఉంది. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో లెక్కల ప్రకారం ఈ పాతిక్ఱేళ్లలో (1995-2020) రైతులు, వ్యవసాయ కూలీలు నాలుగు లక్షల మందికిపైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో గత ఎనిమిదేళ్లలో మోడీ పాలన లోనే ఒక లక్ష మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. దళితులు, ముస్లింలలో భూమిలేని కుటుం బాల సంఖ్య 60శాతం. ఆదివాసీలు సాధా రణంగా భూమి కలిగినవారై ఉంటారు. కానీ గత 30 ఏళ్లలో భూములు గుంజుకోవడం వల్ల భూమి లేని ఆదివాసీల సంఖ్య పది శాతం పెరిగింది. ఎన్‌ఎప ˜్‌హెచ్‌ఎస్‌ వివ రాల ప్రకారం దేశంలోని భూమిలో 20 శాతం భూమి 75 ఎకరాల పైబడి ఉన్న కుటుంబాల చేతిలోనే ఉంది. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం లెక్కల ప్రకారం చట్టంలో పేర్కొన్న దానికి విరుద్ధంగా 100 రోజుల బదులు వ్యవసాయ కార్మికులకు 2021-22 ఆర్థిక సంవత్సరంలో 49 రోజులే పని దొరికింది. జూన్‌ 2022లో గ్రామీణ ఉపాధి 80 లక్షల మందికి పోయిందని సీఎం ఐఈ లెక్క తేల్చింది. మొత్తం గ్రామీణ నిరు ద్యోగం రేటు ఎనిమిది శాతం పెరగటం ఆందోళనకరం. పిరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే వివరాల ప్రకారం 2018-19లో 21-59 ఏళ్ల వయసు వారిలో 10శాతం గ్రామీణ పురుషులు, 72 శాతం గ్రామీణ మహిళలు ఏ ఉపాధి లేకుండా ఉన్నారు. ఇది కోవిడ్‌ ముందు స్థితి, ఆతర్వాత పరిస్థితి ఇంకా దిగజారింది. ఆకలి వల్ల, పోషకాహార లేమి వల్ల లక్షల్లో చనిపోతున్న గిరిజన బిడ్డల సంగతి వర్ణనాతీతం. 2021లో ప్రపంచ ఆకలి సూచీలో మన దేశం 116 దేశాల్లోనూ 101వ స్థానానికి చేరింది. భారతదేశ వ్యవసాయ సంక్షోభానికి ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. స్వాతంత్య్రానంతరం వరుస కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అవలంభించిన వ్యవసాయ విధాన లక్ష్యం, అర్ధ ఫ్యూడల్‌ భూస్వాములను – గునపర్తి సైమన్‌

బంజారా తండాల్లో తీజ్‌ ఉత్సవాలు

ప్రతి ప్రాంతానికి,వర్గానికి ఓ సంస్కృతి ఉంటుంది.ఆ సంస్కృతిని నిలబెట్టే పండుగలూ ఉంటాయి.అలాంటి పండుగే తీజ్‌ ఉత్సవం.తెలుగు రాష్ట్రాల్లోని గోర్‌ బంజారాలు పవిత్రంగా జరుపుకునే వేడుక ఇది. వర్షాలు నిండుగా కురవాలనీ,పంటలు దండిగా పండాలనీ కోరుతూ ప్రత్యేక పూజలు చేస్తారు. ‘బతుకమ్మ’ పండుగ తరహాలో చేసుకునే సాగే తీజ్‌ పండుగ శ్రావణ మాసంలో వస్తుంది.తొమ్మిది రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ గిరిజనోత్సవం జరగనుంది.ఈ వేడుక విశిష్టతపై తెలంగాణ ఆదిలాబాద్‌ జిల్లా ‘‘రాథోడ్‌ శ్రావణ్‌’’ థింసా పాఠకుల కోసం అందిస్తున్న ప్రత్యేక కథనం..

కరవు నుండి, కాపాడే ప్రకృతి పండుగ..తీజ్‌ !
తొమ్మిది రోజుల సంబురాలు కఠోర నియ మాలు.. డప్పుల మోతలు తండాల్లో కేరింతలు పెళ్ళికాని ఆడబిడ్డల ఆటాపాటలు.. అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధాలు బావ మరదళ్ల అల్లరిచేష్టలు ఆపై భక్తి భావం వీట న్నింటి మేళవింపే తీజ్‌ పండుగ!పూర్వం తండాలలో తీవ్ర కరువు వచ్చినప్పుడు లోకం సుభిక్షంగా వుండాలని,తీజ్‌ పండుగ నిర్వహి స్తారు.ఈపండుగ బతుకమ్మను పోలి ఉం టుంది.తీజ్‌ను ఎనిమిది రోజుల పాటు పూజిం చి తొమ్మిదవ రోజు నిమజ్జనం చేస్తారు.ఈఉత్స వాలను పెళ్ళికాని ఆడపిల్లలే నిర్వహిస్తారు. వీరికి తండాపెద్దలు,సోదరులు సహకరిస్తారు. వర్షాకాలం ప్రారంభంలో కనిపించే ఎర్రని ఆరుద్ర పురుగును ‘తీజ్‌’ అంటారు.అలాగే గోధుమ మొలకలను కూడా‘తీజ్‌’గా పిలుస్తారు. బతుకమ్మను పూలతో అలంకరించినట్లే.. తీజ్‌ లో గోధుమ మొలకలను పూజించడం ఆనవా యితీ.ఆగస్టు నెలలో ఈ వేడుకలు మొదలువు తాయి.తీజ్‌ ఉత్సవం.బంజారాల సంస్కృతికి దర్పణం.ఈ తొమ్మిది రోజులు అమ్మాయిలకు అగ్నిపరీక్షే.ఉప్పుకారం లేని భోజనం తినాలి. మాంసాహారాలు ముట్టకూడదు, తండా నుంచి బయటికి వెళ్లకూడదు.యువతులు పుట్టమట్టి తెచ్చి కులదేవతలను కొలుస్తూ పాటలుపాడి తండా నాయకునిచేత బుట్టలో ఆమట్టిని పోయించి గోధుమలను చల్లుతారు.స్వయంగా మూడు పూటలు బావుల వద్దకు వెళ్లి బిందెలతో నీళ్లు తెచ్చి తీజ్‌లపై చల్లుతారు.అలా తొమ్మిది రోజుల్లో గోధుమ నారు ఏపుగా పెరుగు తుంది.అలా బుట్టల్లో గోధుమ మొలకలను పెంచి, వాటి చట్టూ ఆడిపాడి,తొమ్మిదోరోజు వాగులో నిమజ్జనం చేస్తారు.వర్షాలు సంవృ ద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ఊరంతా బాగుండాలని,మంచి మొగుడు రావాలని కోరుకుంటూ,అంతరించి పోతున్న గిరిజన సంస్కృతిని అపూర్వంగా కాపాడు కోవడానికి అడవిబిడ్డలు ప్రతి ఏటా తీజ్‌ పండు గను భక్తిగా జరుపుతున్నారు. చెట్టు,పుట్ట, గుట్టలకు నిలయమైన అడవుల్లో గుడిసెలు నిర్మించుకొని గోసేవ,ప్రకృతి సేవ చేస్తూ తమ దైన సంస్కృతిని, సంప్రదాయాలను నిలుపు కుంటూ సాగిపోతారు బంజారాలు.అనాదిగా సాతిభవానీలను (సప్తమాతృకలు) కొలుస్తూ ఆ జగదంబలోనే జగతిని దర్శిస్తారు.మొలకనారు ను ఆతల్లికి మరోరూపంగా భావించి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.ఈరెండు పండుగలకు దగ్గరి పోలికలు,సామీప్యతలు చాలా విషయా ల్లో కనిపిస్తాయి.ఈరెండు పండుగలు కాలా నుగుణంగా కొద్దిగా ముందు వెనకాల నిర్వ హించబడినా రెండిరటి లక్ష్యంసృష్టి కళ్యాణమే. తెలంగాణ రాష్ట్రమంతా బతుకమ్మ పండుగ జరుపబడితే,తీజ్‌ పండుగను మాత్రం దేశ వ్యాప్తంగా జరుపుకుంటారు బంజారాలు. రెండు పండుగల్లో ప్రకృతే ప్రధాన దైవంగా కొలవబడుతుంది.ముత్తైవదులు,కన్నెపిల్లలు తమ జీవితాలు మంగళమయం అవ్వాలనే ఆకాంక్ష తో ఈ పండుగలను జరుపుకుంటారు.తీజ్‌ కొండ కోనల్లో,అడవుల్లోని తండాల్లో నిర్వహిం చబడితే, బతుకమ్మ మైదాన ప్రాం తాల్లో నిర్వహించబడుతుంది.బతుకమ్మ,తీజ్‌ రెండు పండుగలు ప్రకృతి మాతను ఆరాధించే ప్రజల హృదయ నిర్మల తను ఆవిష్కరిస్తు న్నాయి. పండుగలు జరుపుకునే విధానాలు, పద్ధతులు వేరువేరు కావచ్చు.కానీ రెండిరటి లక్ష్యం లోక కల్యాణం అన్నది మాత్రం గమనించవలసిన అంశం. పాట, ఆటల మధ్య పువ్వులు, మొల కలు పరవశించి ప్రాణశక్తిని ప్రజారణ్యం లోకి ప్రసారం చేస్తున్న విధానం రెండు పండుగలలో కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను ఏ విధంగా గౌరవిస్తోందో అలాగే బంజారా గిరిజ నుల సంప్రదాయ తీజ్‌ పండుగను కూడా సాద రంగా గౌరవిస్తు న్నది.ఈపండుగలు రెండు తెలంగాణ గడ్డ ఆత్మగౌరవ ప్రతీకలుగా దర్శనమిస్తాయి.
బంజారా సాంస్కృతి, సాంప్రదాయానికి ప్రతీక
బంజారా సాంస్కృతి,సాంప్రదాయానికి చాటి చెప్పే పండుగలలో అతి ముఖ్యమైన తీజ్‌ పండుగ తీజ్‌.తీజ్‌ అనగా గోధుమ మొక్కలు అని అర్థం.ఈ పండుగను మన తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల్లోనే కాక పోరుగునున్న ఆంధ్రప్రదేశ్‌, మహరాష్ట్ర, కర్ణాటక,గోవా,ఉత్తర భారత దేశంలోని ఉత్తర ప్రదేశ్‌,మధ్యప్రదేశ్‌,ఛత్తీస్‌గడ్‌,రాజస్తాన్‌, గుజ రాత్‌ మొదలగు రాష్ట్రాల్లో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.ఈ పండుగ మొదట ఎలా ప్రారంభమౌతుందంటె తండా ల్లోని ప్రజలందరూ ఆ తండాకు చెందిన పెద్ద ఆయన నాయక్‌ ఆధ్వర్యంలో సమావేశమై పండుగ విశేషాలపై నిర్ణయాలు తీసుకుని ‘‘నాయక్‌’’అనుమతితో అంగడికి వెళ్లి వెదురుతో తయారు చేసిన చిన్నచిన్న గుల్లలని తీసుకు వస్తారు.ఐతే ఒక ఇంటిలో ఎంతమంది పెళ్లి కాని ఆడపిల్లలు ఉంటారో అన్ని వెదురు గుల్ల లు తీసుకువచ్చి వాటిని అందంగా రంగు, రంగుల నూలు దారాలతో,గువ్వలతో, ముత్యా లతో,పూసలతో,మరియు బాసింగాలు కట్టి పెళ్ళి కూతులా అందంగా ఆగుల్లలని ముస్తాబు చేస్తారు.ఈ పండుగను పెళ్లికాని ఆడపిల్లలు శ్రావణ పూర్ణిమి రోజు ఉదయంలేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసి అందంగా ముగ్గులు వేసి, అందం గా ముస్తాబై కొత్తబట్టలు ధరించి ‘‘నాయక్‌’’ ఇంటికి చేరుకోని అక్కడి నుండి గండు చీమలు గుల్లు కట్టిన నల్లని మట్టిని తీసుకురావడానికి అడవికి వెళ్తారు. ఇనుప గుల్లలో ఆమట్టిని తీసుకు వచ్చి ఆరబెట్టి శ్రావణంలో వచ్చే రాఖీ పౌర్ణమి రోజు సాయంత్రం తండా నాయకుని ఇంటి ఆవరణలో అందరూ సమావేశమై నాయక్‌ అనుమతితో అందంగా అలంకరించిన వెదురు గుల్లల్లో నల్లని మట్టిని నింపి అందులో నాయక్‌,భార్య నాయకణ నాని బెట్టిన గోధుమ లను చల్లడంతో ఈఉత్సవం ప్రారంభ మౌతుంది.అందరు పాటలు పాడుతూ,నాట్యం చేస్తూ ఈకార్యక్రమంలో పాల్గోంటారు. వెదురు బుట్టల్లోనే కాకుండా ‘‘మోదుగు’’ ఆకులతో గుల్లగా చేసి అందులో మట్టిని పోసి,గోదుమ లని చల్లుతారు.పెళ్ళికాని ఆడపిల్లలు ప్రతిరోజు మూడు పూటలు అందంగా ముస్తాబై వెదురు బుట్టల్లో ఉన్న గోదుమలకు నీల్లు జల్లుతారు ఐతే ఈ కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లలు ‘‘పులియా గెణో’’ ‘పూర్ణ కుంభం’లా తలపై పెట్టుకొని బావి నీళ్లు కాని బోరింగ్‌ నీళ్ళుకాని చెరువు నీళ్లుకాని తీసుకు వచ్చి తీజ్‌కి పో స్తారు.ఈ కార్యక్రమం జరిగేటప్పుడు పెళ్ళికాని మగపిల్లలు తీజ్‌ కినీరు పోయకుండా ఆపి కొన్ని పోడుపు కథలు వేస్తారు.వాటికి సమాధా నం చెప్పినవారికి తీజ్‌కి నీళ్ళు పోయ్యనిస్తారు. ఈవిధంగా రోజుకు మూడు పూటల పాటలు పాడుతూ,నృత్యాలు చేస్తూనీళ్ళు జల్లూతూ అగరు బత్తులతో ధూపం చేస్తూ నైవేద్యం పెడుతూ ఆనందంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు.పాటలు పాడుతూ తోమ్మిదవరోజు గోకుల అష్టమినాడు ‘డంభోళి’ పండుగను జరుపుకుంటారు.ఆరోజు పెళ్ళి కాని ఆడ పిల్లలు కొత్త బట్టలు ధరించుకొని నాన బెట్టాన సెనగలను తీసుకోని పోలాలకు వెళ్ళి నేరేడు చెట్టుకు సెనగలను గుచ్చుతారు అప్పుడు ఆడ పిల్లలు తమతో తెచ్చుకున్న పండ్లు, ఫలహారాలతో ఉపవాసాన్ని విరమీస్తారు. అక్కడి నుండి నల్లని బంక మట్టిని తీసుకోని నాయక్‌ ఇంటికి తీసుకువెళ్ళి పెళ్ళికాని ఆడ, మగవాల్లు ఆ మట్టితో డోక్రి,డోక్రా ముసలమ్మ ముసలోడులను పీట పై తయారు చేస్తారు దానినే ‘గణగోర్‌’అంటారు.తయారు చేసిన మట్టి బొమ్మల పై రైక బట్ట,తువ్వాల కప్పు తారు.‘డంబోళి’రోజు రాత్రి ఎనిమిది,తోమ్మిది గంటలకు తండా వాళ్లందరూ భోజనం చేసిన తర్వాత గోదుమ పిండితో తయారు చేసిన గోదుమ రోట్టే,బెల్లం నెయ్యితో కలిపి హుండలు తయారు చేస్తారు. దానిని ‘చుర్మో’అంటారు. తయారు చేసిన చుర్మోను హరితి పెళ్ళేంలో వేసి ఆగరుబత్తి,కోబ్బరికాయ,కుంకుమ,నీళ్ళు తీసుకొని స్త్రీ పురుషులందరు పెళ్ళి కాబోయె ఆడపిల్లలతో తండా నాయక్‌ ఇంట్లో డోక్రి, డోక్రా పూజలు చేసి డంబోళి పైన ఇలా పాట పాడుతారు.మరుసటి రోజు ఉదయాన్నె ఆడ పిల్లలందరు డోక్రి,డోక్రాను నెత్తి మీద పెట్టు కొని ఊరి బయట ఉన్న చెరువులో నిమజ్జనం చేస్తారు.అప్పుడు ఈ పాట విధంగా పాట పాడుతారు. ఈ పాటాల్లో ముసలమ్మను పోగు డుతూ,ముసలయ్యని విమర్శిస్తూ పాట పాడుతారు.గణగోర్‌ని చెరువులో నిమజ్జనం చేసి తిరిగి ఇంటికి వచ్చి స్నానంచేసి కొత్త బట్టలు ధరించి ఆడపిల్లలందరు నాయక్‌ ఇంటి ఆవరణలో ఉన్న తీజ్‌ గుల్లలను మధ్యలో పెట్టు కొని పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు.ఆ తర్వాత గ్రామప్రజలు,పెద్దలు, నాయకులు, కార్భారి,ఢావ్‌,ఢవ్‌ గేర్యా మాన్కరి అందరూ వచ్చి సహపంక్తి భోజనం (బాలాజీ బండారో) చేస్తారు.నాయక్‌ అగరుబత్తీలు పెట్టి కొబ్బరి కాయ కొట్టి పూజ నిర్వహిస్తారు.పూజ అనం తరం ఆడపిల్లలు తమ తీజ్‌ గుల్లలను నెత్తి మీద పెట్టుకొని నృత్యాలు చేస్తారు. ఆడపిల్లల వదినలు ఆగుల్లను లాక్కొని వారి అమ్మలకు ఇస్తారు. అమ్మ వాళ్ళందరూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ తీజ్‌ని తెంపుతారు. తెంపిన తీజ్‌ని ఆడ పిల్లలు గ్రామ పెద్దలకు ఇస్తూ మొక్కుతారు.గ్రామ పెద్దలు వారికి తోచిన విధంగా కానుకలు ఇస్తారు. తర్వాత ఆడ పిల్లలు తీజ్‌ని చేతుల్లో పట్టుకొని నృత్యం చేస్తుంటే వారి తల్లులు ఒక్కోక్కరు గుల్లల్లో డబ్బులు వేస్తారు.ఒక్కొక్కరు తీజ్‌ని ఇచ్చిపుచ్చుకుంటారు. ఆతీజ్‌ ని మొక్కతూ పెళ్ళికాని వారు హరాలకి పెళ్ళి అయిన వారు మంగళ సూత్రాలకి వాటిని కట్టుకుంటారు. ఆ తర్వాత నాయక్‌,నాయకణ్‌ జోన్నలు, గోధుమలు,సెనగలతో గుడాలు వండిస్తారు. వండిన గుడాలని సాయంత్రం ఐదు గంటలకు అందరు తినటం ఆతర్వాత ఎడ్లకు రaూలు వెసి అలంకరించి,బండి కట్టి అందులో తీజ్‌ని ఉంచి బాజా బజంత్రీలతో తాండా అంతా ఊరేగించి పిల్లలు, పెద్దలు తాండా చెరువులో తీజ్‌ గుల్లలని నిమజ్జనం చేస్తారు. ఆసమ యంలో ఆడ పిల్లలు బాదపడటం,ఏడ్వటం చేస్తారు.ఎందుకంటే తోమ్మిది రోజులు ఉపవాస దీక్షతో,భక్తి శ్రద్ధలతో,పాటలతో,నృత్యాలతో ఆనందంగా జరుపుకోని మరుసటి సంవత్సరం వరకు ఆగకుండా ఉండలేక అంతేకాకుండా పెళ్ళి అయినచో ఈతీజ్‌ ఉత్సవం జరుపుకోలే మన్న బాదతో ఏడుస్తారు.తీజ్‌ నిమజ్జనం అనంతరం ఆడపిల్లలకు వారి అన్నలు లేదా తమ్ముల్లు కాళ్ళు కడుగుతారు.అనంతరం సాయంత్రం ఐదు గంటలకు నాయక్‌ ఆధ్వర్యంలో గుడాలను ఆరగిస్తారు.తీజ్‌ పండుగ అనేది పెద్దలను గౌరవించాలని, గిరిజన సాంప్రదాయాన్ని,సంస్కృతిని కోనసా గించాలని, పచ్చదనంతో కుటుంబాలు ఎప్పుడు పచ్చగా వెలగాలని పెళ్ళి కాని యువతులకు మంచి భర్త దోరకాలని అంటారు.

అమరావతిలో అభివృద్ధి ప్రాజెక్టులు పురోగతి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని నిర్మాణంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈనేప థ్యంలో పాలక పక్షం అమరావతి ప్రాజెక్టుల్లో పనులు పురోగతిపై నిమగ్నమైంది.ఒకపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,మరోపక్క పురపాలక శాఖ మంత్రి పి.నారాయణరావు,విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌లు పెట్టుబడిదారులతో సమీక్షలు,చర్చలు నిర్వహించి అభివృద్ధికి బాటలు వేస్తున్నారు.
రాష్ట్రానికి స్పెషల్‌ అసిస్టెన్స్‌ ఫర్‌ క్యాపి టల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (ూAజI) కింద నిధులు ఇచ్చేం దుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇందులో తొలి విడతగా రూ.15 వందల కోట్లు విడుదల య్యాయి. ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఏయే మార్గాల్లో నిధులు రాబట్టాలన్న దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునేందుకు ఉన్న అన్ని మార్గాలనూ గుర్తించి ఆమేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ రెండుసార్లు దిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థికమంత్రి, ఆశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. తాజాగా ముఖ్య మంత్రి చంద్రబాబు సైతం నిధులకోసం దిల్లీ వెళ్లి ప్రయత్నించారు. మరోవైపు అన్ని రాష్ట్రాల్లో మూల ధన వ్యయం పెరిగే విధంగా కేంద్రం ఒక ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. కేంద్ర ప్రభు త్వమే ఇందుకు నిధులు ఇస్తుంది.దాదాపు 50ఏళ్ల పాటు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేకుండా కేంద్రం రుణం రూపంలో ఈ నిధులను సమకూరు స్తుంది.సాకి పథకం కింద ఈఆర్థిక సంవత్సరంలో 2వేల200కోట్లరూపాయలు రాష్ట్రానికి ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది.ఈపథకం కింద రూపొం దించిన విధివిధానాల ప్రకారం ప్రతిపా దనలు పంపితే కేంద్రం ఆమోదం తెలుపుతుంది. కేంద్రం ఆమోదించిన ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 66 శాతం కేంద్రం విడుదల చేస్తుంది. ప్రస్తుతం ఆ మేరకు తొలి విడతగా 15వందల కోట్ల రూపా యలు రాష్ట్రానికి వచ్చాయి.ఈ నిధులను ప్రత్యే కంగా నిర్మాణ పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇవ్వా లని ప్రభుత్వం భావిస్తోంది. ఎప్పటి నుంచో పెద్ద మొత్తంలో బిల్లులు పెండిరగులో ఉన్నాయి. గుత్తేదా రులు అనేకమంది ఈ కారణంగా చేతులెత్తేశారు. ప్రస్తుతం వచ్చే నిధులను కాంట్రాక్టర్లకు చెల్లించి పనులను ముందుకు నడిపించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
అమరావతిలో బ్యాంకుల ప్రతినిధి బృందాల పర్యటన
రాజధాని అమరావతి నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు,ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు రుణం సమకూర్చేందుకు ముందుకొచ్చాయి. ఈరెండు బ్యాంకుల ప్రతినిధి బృందాలు అమరా వతిలో పర్యటించనున్నాయి.ఈ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ, సీఆర్‌డీఏ ఉన్నతాధి కారులతో వరుసగా భేటీ అవుతారు.మధ్యలో మూడురోజులు రాజ ధానిలో పర్యటిస్తారు. అర్ధాంతరంగా ఆగిన నిర్మా ణాలు,ఆర్థిక వనరులకు అవకాశం,దశల వారీగా ప్రణాళికలు ప్రభుత్వం, సీఆర్‌డీఏ పరంగా వాటి అమలు తదితర అంశాలకు సంబంధించి ఉన్నతా ధికారులతో చర్చించి కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది. వరల్డ్‌ బ్యాంకు బృందంలో 23 మంది, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు బృం దంలో నలుగురు సభ్యులు ఉన్నారు.వెలగపూడిలోని సచివాలయంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో ఇవాళ భేటీ అవు తారు. అనంతరం ముఖ్యమం త్రితో సచివాలయంలోనే అత్యున్నతస్థాయి సమా వేశంఏర్పాటు చేశారు. ఇందులో ప్రాథమిక ఆలోచ నలు,ఆర్థికసాయం,ప్రణాళికపై చర్చించను న్నారు. ప్రభుత్వ ప్రాధాన్య తలు,విధానపరమైన కార్యాచర ణపై బృందానికి ముఖ్యమంత్రి వివరించనున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్‌ అసిస్టెన్స్‌ ఫర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ (సాకి) కింద నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇందులో తొలి విడత గారూ.1500కోట్లు విడుదల య్యాయి.ఆర్థిక కష్టా ల్లో ఉన్న రాష్ట్రాన్నిగాడిలో పెట్టేందుకు ఏయే మార్గా ల్లో నిధులు రాబట్టాలన్న దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.ఇందులో భాగంగా కేంద్రం నుంచి నిధు లు తెచ్చుకునేందుకు ఉన్న అన్ని మార్గాలనూ గుర్తించి ఆమేరకు ఇప్ప టికే రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఈనేపథ్యంలో రాష్ట్రఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ రెండుసార్లు దిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌,ఆశాఖ ఉన్నతాధి కారులతో మాట్లా డారు.తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు సైతం నిధుల కోసం ఢల్లీి వెళ్లి ఆర్థిక మంత్రిని కలిశారు.
గ్లోబల్‌ గ్రీన్‌ ఎనర్జీ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ గమ్యస్థానం
పునరుత్పాదక ఇంధన పెట్టుబడులకు ఉత్తమ గమ్య స్థానాలలో ఒకటిగా పరిగణించబడుతున్న ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో,5బిలియన్ల యూఎస్‌ డాలర్ల గ్రీన్‌ ఎనర్జీ పెట్టుబడులు పెట్టేందుకు, గ్లోబల్‌ ఇన్వెస్టింగ్‌ సంస్థ బ్రూక్‌ఫీల్డ్‌,యాక్సిస్‌ ఎనర్జీ ప్రమో ట్‌ చేసిన క్లీన్‌ ఎనర్జీ ప్లాట్‌ఫారమ్‌ ఎవ్రెన్‌ ముందు కొచ్చింది. బ్రూక్‌ఫీల్డ్‌,యాక్సిస్‌ యాజమాన్య బృందం ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడుతో పాటు ఇంధన శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో సమావేశమ య్యారు.రాష్ట్రంలో దశలవారీగా 3500 మెగావాట్ల సోలార్‌, 5500 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎవ్రెన్‌ సంస్థ ప్రతిని ధులు వెల్లడిరచారు. వీటిలో 3000మెగావాట్ల ప్రాజెక్టులకు ఇప్పటికే రాష్ట్రంలో శంకుస్థాపన జరిగిందని,2026 చివరి నాటికి ఆప్రాజెక్టులు ప్రారంభమవుతాయని తెలి పారు.పునరుత్పాదక ఇంధన పెట్టుబడుల ప్రణాళి కలే కాకుండా, ఇంటి గ్రేటెడ్‌ మాడ్యూల్‌ తయారీ, పంప్డ్‌ స్టోరేజ్‌,బ్యాటరీ స్టోరేజ్‌,ఈ -మొబిలిటీ, గ్రీన్‌ అమ్మోనియా వంటి వాటిలో రాష్ట్రంలో అద నపు అవకాశాలను ఎవ్రెన్‌ అన్వేషిస్తోం దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదా రులకు అనువైన విధానాలను అమలుచేస్తోందని ,పెట్టుబడిదారు లకు, ప్రజలకు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ లో సమయానుకూల అనుమతులతో పాటు పారదర్శకతను ప్రోత్సహించేందుకు,రాష్ట్ర ప్రభు త్వం పెట్టుబడులకు అనుకూల వాతావర ణాన్ని కల్పి స్తుందని అన్నారు. ఇంధన రంగంలో పెట్టు బడులను సాకారం చేయడంద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నూతన అవకాశాలకు,ఉద్యోగ కల్పనకు, స్థిర మైన అభివృద్ధి సాదించేందుకు పుష్కలంగా అవకా శాలున్నాయన్నారు.సౌర,పవన ఇంధన వనరులతో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి ఏపీలో ఆకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. సోలార్‌ పార్కులు,రూఫ్‌ టాప్‌ సోలార్‌ సిస్టమ్‌లు, పంప్డ్‌ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంటోందని ఇంధనశాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలి పారు.సుమారు 1ట్రిలియన్‌ యుఎస్‌ డాలర్లతో ప్రపంచవ్యాప్తంగా 2,40,000 మంది ఉద్యోగు లతో ఇన్వెస్ట్మెంట్‌ మేనేజ్మెంట్‌లో బ్రూక్‌ఫీల్డ్‌ గ్లోబల్‌ లీడర్‌గా ఉందని బ్రూక్‌ ఫీల్డ్‌ అధికారులు తెలి పారు.బ్రూక్‌ఫీల్డ్‌ రెన్యూవబుల్స్‌ పునరుత్పాదక ఇంధనాన్ని,ప్రపంచ ఇంధన పరివర్తన,వాతావర ణ పరివర్తనకు సంబందించిన కార్యక్రమా లను ముందుకు తీసుకెళ్లడానికి 100బిలియన్‌ యూ ఎస్‌ డాలర్లతో ఐదు ఖండాలలో విస్తరించి ఉన్న హైడ్రో,పవన,సౌర,స్టోరేజి విద్యుత్‌ పంపిణి వంటి వాటిలో 7,000 కంటే ఎక్కువ విద్యుత్‌ ఉత్పాదక సౌకర్యాలలో 33,000 మెగావాట్లకు మించి ఉత్పాదక సామర్థ్యం కలిగి ఉందన్నారు. బ్రూక్‌ఫీల్డ్‌ రెన్యూవబుల్స్‌ 5 ఖండాలలో విస్తరించి ఉన్న బహు ళ పునరుత్పాదక సాంకేతికతలలో155,000 మెగావాట్ల గ్లోబల్‌ డెవలప్మెంట్‌ పైప్‌లైన్‌ను కలిగి ఉందన్నారు. బ్రూక్‌ఫీల్డ్‌ సంస్థ, దశాబ్దానికి పైగా నైపుణ్యం కలిగిన క్లీన్‌టెక్‌ కంపెనీ అయిన యాక్సి స్‌ ఎనర్జీ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుందని, 2019లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను అమలుచేసి,1.8 Gఔ సౌర,పవన ప్రాజెక్టులను విజయవంతంగా అభివృద్ధి చేసిందని తెలిపారు. దేశంలో క్లీన్‌ ఎనర్జీ ఇన్వెస్ట్‌మెంట్‌లను ముందుకు తీసుకు వెళ్లేందుకు బ్రూక్‌ఫీల్డ్‌ మరియు యాక్సిస్‌ ఎనర్జీ మధ్య 51:49% హోల్డింగ్‌తో ఎవ్రెన్‌ సంస్థ ను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.ఉద్యోగాల కల్పన,పన్ను సహకారంద్వారా రాష్ట్ర ఆర్థికవృద్ధికి ఈ పెట్టుబడులు ఎంతగానో తోడ్పడ తాయని,ఈ పెట్టుబడి ప్రణాళికలు ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, ప్రపంచ ఇంధన పరివర్తనకు సహాయపడడంలో ఎవ్రెన్‌ నిబద్ధతను తెలియచేస్తుందని, అలాగే క్లీన్‌ ఎనర్జీ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను వారి ప్రధాన గమ్యస్థానంగా మారుస్తుందని బ్రూక్‌ఫీల్డ్‌ అధికా రులు పేర్కొన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌లతో సమావేశం అయిన వారిలో బ్రూక్‌ ఫీల్డ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్లు నావల్‌ సైనీ,ముర్జాష్‌ మనీ క్షణ, ఎవ్రన్‌ సంస్థ ఎండీ రవి కుమార్‌ రెడ్డి, సీఈఓ సుమన్‌ కుమార్‌,యాక్సిస్‌ సీఈఓమురళి, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డీవీవీ సత్య ప్రసాద్‌లు ఉన్నారు.
రాజధాని అమరావతి నిర్మాణాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకు న్నారు.ప్రభుత్వం చేపట్టిన మరుక్షణం నుంచి అమరావితిలో అభిమృద్ధి పనులు వేగంగా జరుగు తున్నాయి. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో నిర్విరామంగా చర్చలు జరుపుతోంది. ఈ తరుణంలో కీలక పరిణామం చోటు చేసు కుంది. అమరావతి నిర్మాణం కోసం నిధుల సమీ కరణ ప్రక్రియ వేగవంతం చేసిన విషయం తెలి సిందే. సీఎంతో ప్రపంచ బ్యాంక్‌, ఏడీబీ చర్చలు: అమరా వతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడుతో ప్రపంచ బ్యాంక్‌, ఏడీబీ ప్రతి నిధులు భేటీ అయ్యారు. అమరావతి నిర్మా ణనికి నిధులు అందించే విషయమై చర్చించారు. అమరావతి నిర్మాణానికి 15వేల కోట్లు నిధులు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నేటి నుంచి మూడు రోజుల పాటు ప్రపంచ బ్యాంక్‌, ఏడీబీ ప్రతినిధులు అమరావతిలో పర్యటిచనున్నారు. ప్రాథమికంగా అమరావతిలో చేపట్టాల్సిన పనులు, దశల వారీగా నిధుల విడుదలపై సీఎంతో ప్రపంచ బ్యాంక్‌, ఏడీబీ చర్చలు జరిపారు.అమరావతి ప్రాజె క్టులో పనుల పురోగతి, క్షేత్ర స్థాయి పర్యట నలు, భూసమీకరణ,మౌళిక సదుపాయాలు, పెట్టుబడుల అంశాలపై చర్చించారు.రాజధాని పరిధిలో ప్రభు త్వ ప్రాధాన్యత ప్రాజెక్టులు, విధాన నిర్ణయాలను ప్రపంచ బ్యాంక్‌,ఏడీబీ ప్రతినిధులకు సీఎం చంద్ర బాబు వివరించారు.అలాగే రాజధాని అమరా వతిలో ప్రస్తుత పరిస్థితులు వచ్చే కాలంలో ప్రభుత్వ ప్రణాళికలను చంద్రబాబు వారికి వివరిం చారు. సీఆర్డీఏ పరిధిలో క్షేత్ర స్థాయిలో ప్రపంచ బ్యాంక్‌, ఏడీబీ ప్రతినిధులు పర్యటించారు.వరల్డ్‌ బ్యాంకు బృందం ఏపీలో పర్యటించింది. పురపా లకశాఖ మంత్రి నారాయణతో పాటు ఆర్థికశాఖ ఉన్నతాధి కారులు సమావేశంలో పాల్గొన్నారు. అమరావతి అభివృద్ధి,ఆర్థిక సాయానికి సంబం ధించిన అంశాలపై సీఎంతో చర్చించారు.
ఎపిలో భారీవిస్తరణకు హెచ్‌ సిఎల్‌ సన్నాహాలు!
`మంత్రి లోకేష్‌తో భేటీ అయిన హెచ్‌ సిఎల్‌ ప్రతినిధులు : ప్రముఖ సాఫ్ట్‌ వేర్‌ సంస్థ హెచ్‌ సిఎల్‌ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాల విస్తరణకు సిద్ధమైంది.గత టిడిపి ప్రభుత్వ హయాం లో ఆంధ్రప్రదేశ్‌ లో కార్యకలాపాలు ప్రారంభించిన హెచ్‌ సిఎల్‌ ప్రస్తుతం 4,500 మందికి ఉద్యోగాలు కల్పించింది.రాష్ట్రంలో భారీఎత్తున విస్తరణ చేపట్టా లని నిర్ణయించినట్లు హెచ్‌ సిఎల్‌ కార్పొరేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీమతి శివ శంకర్‌, అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శివప్రసాద్‌ వెల్లడిరచారు. హెచ్‌ సిఎల్‌ సంస్థ ప్రతినిధులుఉండవల్లి నివాసంలో రాష్ట్ర విద్య,ఐటి శాఖల మంత్రి నారా లోకేష్‌ తో సమావే శమయ్యారు. ఎపిలో విస్తరణ ద్వారా మరో 5500 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెచ్‌ సిఎల్‌ ప్రతినిధులు తెలిపారు. ఐటిలో ప్రస్తుతం అంతర్జాతీ యంగా చోటుచేసు కున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా అధునాతన సాంకే తిక సేవలను అందుబాటులోకి తేవడం ద్వారా పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించ డానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న స్కిల్‌ సెన్సస్‌, స్కిల్‌ డెవెలప్మెంట్‌లో తాము కూడా భాగస్వామ్యం వహిస్తామని తెలిపారు.రాష్ట్రంలో 20లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తమవంతు సహాయ, సహకా రాలు అందిస్తామని చెప్పారు.ఈసందర్భంగా విస్తరణకు కావాల్సిన కొన్నిఅనుమతులు, గత ప్రభు త్వం నిలిపివేసిన రాయితీలు విడుదలచేయా ల్సిం దిగా హెచ్‌ సిఎల్‌ ప్రతినిధులు మంత్రిని కోరారు.
విడతల వారీగా రాయితీలు విడుదల చేస్తాం
మంత్రి నారా లోకేష్‌ స్పందిస్తూ…గత టిడిపి హయాంలో అనేక రాష్ట్రాలు పోటీపడగా, తాను స్వయంగా వెళ్లి హెచ్‌సిఎల్‌ ఛైర్‌ పర్సన్‌ శివ్‌ నాడా ర్‌తో మాట్లాడి గన్నవరంలో క్యాంపస్‌ ఏర్పాటుకు ఒప్పించానని చెప్పారు. రికార్డు టైంలో అనుమ తులు,భూ కేటాయింపులుచేసి,యుద్ధ ప్రాతి పదికన కార్యకలాపాలు ప్రారంభించేలా చేయడం తనకు మంచి అనుభూతి నిచ్చిందని అన్నారు. గన్నవరం వైపు వెళ్లిన ప్రతిసారీ యువతకు 4500 మందికి ఉద్యోగాలు కల్పించామన్న సంతృప్తి, సంతోషం కలిగేవని చెప్పారు. అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వ అసమర్ధత కారణంగా సంస్థ కార్య కలాపా లు ముందుకు సాగలేదు. 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించాల్సిన సంస్థ కేవలం 4500 మంది వద్దనే ఆగిపోయింది.పూర్తి స్థాయి అనుమ తులు, రాయితీలు ఇవ్వకుండా నిలిపివేసి ఇబ్బం దులు పెట్టారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది…అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పన మా లక్ష్యం. మీ కంపెనీ పూర్తి సామర్థ్యంతో కార్యకలాపాల విస్తరణకు సంపూర్ణ సహకారం అందిస్తాం,ఇందుకు అవసరమైన అన్ని అనుమ తులను త్వరితగతిన క్లియర్‌ చేస్తాం,గత ప్రభు త్వంలో పెండిరగ్‌ పెట్టిన రాయితీలను విడతల వారీగా చెల్లిస్తాం.మరో 15,500మందికి ఉద్యో గాలు కల్పించడమే లక్ష్యంగా మీరుపనిచే యండి, అందుకు అవసరమైన పూర్తి సహ కారం మేము అందిస్తామని మంత్రి లోకేష్‌ పేర్కొ న్నారు.ఐటిలో వస్తున్న అధునాతన మార్పులకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నందుకు హెచ్‌ సిఎల్‌ సంస్థ ప్రతినిధులను అభినందించారు.– జి.ఎన్‌.వి.సతీష్‌

మెరుగైన ఐటీ పాలసీతో ఐటీ పరిశ్రమలు రప్పిస్తాం..

  • 100 బిలియన్‌ ఎకానమీగా విశాఖ మహానగరాన్ని అభివృద్ధిచేస్తాం!
  • గ్రీన్‌ చానల్‌ ద్వారా ఐటి పరిశ్రమలకు రాయితీలను అందజేస్తాం
  • ఐటిలో ఎంత ఎక్కువ ఉద్యోగాలిస్తే అంత మెరుగైన ప్రోత్సాహకాలు
  • ఏపి ఐటి అసోసియేషన్‌ ప్రతినిధుల సమావేశంలో మంత్రి నారా లోకేష్‌ విశాఖపట్నం: త్వరలో మెరుగైన ఐటి పాలసీని ప్రకటించి, దేశంలోనే ప్రఖ్యాత కంపెనీలను రాష్ట్రానికి తీసుకువస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ పేర్కొ న్నారు. విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్‌ ఐటి అసోసియేషన్‌ ప్రతినిధులతో మంత్రి లోకేష్‌ గురువారం ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ ఐటి రంగంలో ఇప్పటికే అభివృద్ధి సాధించిన హైదరాబాద్‌, బెంగు ళూరు,చెన్నయ్‌ లల్లో అమలుచేస్తున్న పాలసీల ను అధ్యయనం చేసి మెరుగైన ఐటి పాలసీని తీసుకువస్తాం.రాష్ట్రంలో అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న తమ ప్రభుత్వ లక్ష్యం లో ఐటి,ఎలక్ట్రానిక్స్‌ రంగాలు కీలకపాత్ర పోషించబోతున్నాయి.దేశంలో టాప్‌-10 ఐటి కంపెనీలతో చర్చలు జరుపుతున్నాం,త్వరలో రాష్ట ప్రజానీకం ఐటి పరిశ్రమ పెట్టుబడులపై శుభవార్త వింటారు.ఐఎస్‌బి తరహాలో విశాఖ లో ప్రపంచస్థాయి ఎఐ యూనివర్సిటీని ఏర్పా టుచేస్తాం.ఎఐ హబ్‌ గా కూడా విశాఖను తీర్చి దిద్దుతాం.రోబోటిక్స్‌,హెల్త్‌ కేర్‌,ఎడ్యుకేషన్‌ వంటి రంగాలతో అనుసంధానించి ఐటిని వేగ వంతంగా అభివృద్ధిచేస్తాం.రాబోయే అయిదేళ్ల లో విశాఖపట్నాన్ని 100బిలియన్‌ డాలర్ల ఎకానమీ నగరంగా తీర్చిదిద్దుతాం.ఐటి రంగం లో హైదరాబాద్‌ ను చంద్రబాబు నాయుడు గారు ఏవిధంగా అభివృద్ధి చేశారో ఐటి పరిశ్ర మదారులకు తెలుసు. మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పోటీపడి ఐఎస్‌ బిని హైజాక్‌ చేసి హైదరాబాద్‌కు రప్పిం చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 4.0 వెర్షన్‌ను చూడబోతున్నాం.గతంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ లో రాష్ట్రాన్ని నెం.1గా నిలి పిన బాబు,ఇప్పుడు స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజి నెస్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు తీయించబోతున్నారు.చంద్రబాబుగారిలో 19 95 నాటి సిఎం మాదిరిగా పనిచేస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు మేంకట్టుబడి ఉన్నాం విశాఖను ఐటి క్యాపిటల్‌గా అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రజాప్రభుత్వం అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్లలా భావిస్తూ ముందుకు సాగుతోంది.గత అయిదేళ్లలో ఐటి పరిశ్రమ అష్టకష్టాలు గత అయిదేళ్లలో పరిశ్రమ దారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత ముఖ్యమంత్రి విశాఖలో తన కోసం విలాసవం తమైన ప్యాలెస్‌ కట్టుకున్నాడు కానీ ఒక్క చదర పు అడుగు కూడా ఐటి స్పేస్‌ అభివృద్ధి చేయ లేదు. ఐటి పరిశ్రమలకు వెళ్లే రహదారుల్లో వీధిలైట్లు కూడా ఏర్పాటుచేయలేదు. మెరుగైన ఐటి పాలసీ రూపకల్పనకు పరిశ్రమ పెద్దలతో చర్చిస్తున్నాం,గత ప్రభుత్వం పెండిరగ్‌ పెట్టిని ఇన్సెంటివ్‌ బకాయిలన్నీ క్లియర్‌ చేస్తాం. ప్రస్తు తం పనిచేస్తున్న ఐటి కంపెనీలు, కొత్తగా ఏర్పా టుచేసే కంపెనీలకు ఇకపై గ్రీన్‌ చానల్‌ ద్వారా ఇన్సెంటివ్స్‌ అందజేస్తాం.రాష్ట్రంలో కొత్తగా వచ్చే ఐటి పరిశ్రమల్లో 90శాతం విశాఖప ట్నానికే రాబోతున్నాయి.విశాఖలో ఐటి పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఆఫీస్‌ స్పేస్‌ను అభివృద్ధి చేస్తాం.కేవలం ఐటిలో మాత్ర మే కాకుండా ఫార్మా, ఎంఎస్‌ఎంఇ వంటి రంగాల్లో కూడా విశాఖవేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటి రంగంలో తెలుగువారు అధికంగా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయిన ఐటి నిపుణులను తిరిగి ఎపికి రప్పి స్తాం. యువతలో నైపుణ్యాలను పెంచేందుకు స్కిల్‌ సెన్సస్‌ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నాం, విద్యారంగంలో కెజి టు పిజి వరకు ప్రక్షాళన చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్‌ -100 యూనివర్సిటీల్లో ఎపి విశ్వ విద్యాలయాలు ఉండాలన్నదే తమ లక్ష్యం. కొత్త గా ఏర్పాటయ్యే ఐటి పరిశ్రమలు యువతకు ఎన్ని ఎక్కువ ఉద్యోగాలిస్తే అంత మెరుగైన ప్రోత్సహకాలు అందిస్తాం. – జిఎన్‌వి సతీష్‌

రాజముద్రతో..భూ పట్టాదారు పాస్‌పుస్తకాలు

త్వరలో రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.ప్రజలపాసు పుస్తకాలపై తన బొమ్మల కోసం15కోట్లు జగన్‌ ప్రభుత్వం తగలేసిందని ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు,ప్రజల కోరిక మేర కు రాజముద్రతో కొత్త పాసుపుస్తకాలు ఇచ్చేం దుకు ప్రభుత్వ నిర్ణయించిందన్నారు. రాజము ద్రతో ఉన్న పుస్తకాన్ని అధికారులు ముఖ్యమం త్రికి చూపించారు.క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే ఆస్తి వివరాలు,ఆ ఆస్తి అడ్రస్‌ వద్దకు తీసుకు వెళ్లే మ్యాప్‌ కూడా వచ్చేలా ఏర్పాటు చేశారు.రీ సర్వే పేరుతో పొలాల సర్వేకి గత ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసిందని తెలిపారు. సరిహద్దు రాళ్లపైనా తన బొమ్మలు ఉండాలన్న నాటి సీఎం జగన్‌ కోరిక తీర్చేందుకు 650 కోట్లు నాటి ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. కేంద్రం చెప్పిన రీసర్వేలో ఎక్కడా రాళ్లుపాత మని చెప్పకపోయినా తన బొమ్మల కోసం జగన్‌ గ్రానైట్‌రాళ్లు సిద్ధం చేశారు.జగన్‌ బొమ్మ ఉన్న 77లక్షల గ్రానైట్‌ రాళ్లను ఏమి చేయాలి అనేదానిపై ప్రభుత్వ కసరత్తు చేస్తోంది.ఆ రాళ్ల పై బొమ్మలు చెరపడానికి మరో 15కోట్లు ఖర్చు అవుతుందని తాత్కాలి కంగా అంచనా వేశారు. జగన్‌ బొమ్మల పిచ్చి వల్ల మొత్తంగా 700కోట్ల వరకు ప్రజా సొమ్ము వృథా అయ్యింది.ఆ గ్రానై ట్‌ రాళ్లను ఎలా ఉప యోగించు కోవచ్చు, వాటితో ఏం చెయ్యవచ్చో చూడమని ముఖ్య మంత్రి చంద్రబాబు అధికా రులను ఆదేశిం చారు. రెవెన్యూ శాఖలో పరిస్థి తులు,మదనపల్లి ఫైల్స్‌ దగ్దం ఘటన లాంటివి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖపై ముఖ్యమంత్రి చంద్ర బాబు సమీక్ష నిర్వహించారు.గత 5 ఏళ్లలో రెవెన్యూ శాఖలో తీసుకువచ్చిన చట్టాలు,అవి దుర్వినియోగం అయిన తీరుపై చర్చించారు. సంస్కరణల పేరుతో కొత్త చట్టాలు తెచ్చి అక్రమాలకు పాల్పడిన విధానంపై సమీక్షిం చారు. పెరిగిన భూవివాదాల నేపథ్యంలో ప్రజ లకు సమస్యలకు పరిష్కారం కోసం తీసుకు రావాల్సిన చర్యలపై చర్చించారు.ల్యాండ్‌ గ్రాబింగ్‌ను అరికట్టడానికి కొత్త చట్టాలు తేవా ల్సిన అవసరం ఉందా,ఎటువంటి కొత్త చట్టాలు తేవాలి అనే అంశంపైనా చర్చ జరిగింది.
పార్టీల రంగులు, నేతల ఫొటోలు ఉండ కూడదు.
పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీపై సమా వేశంలో ప్రస్తా వించిన చంద్రబాబు,భూ యజ మానుల కిచ్చే పట్టాదారు పాస్‌ పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు.పార్టీల రంగులు,నేతల ఫొటోలు ఉండ కూడదన్నారు.తాము రూపొం దించిన పట్టాదారు పాసు పుస్తకం నమూనాను అధికా రులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా,దానిలో కొన్ని మార్పులను సూచించారు.పట్టా దారు పాసు పుస్తకం చూడగానే రైతులకు భరోసా కలిగేలా ఉండాలన్నారు.
పేదలకు ఇళ్ల స్థలాలు…
రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.గృహ నిర్మాణశాఖపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. కొత్త లబ్దిదారులకు గ్రామాల్లో మూడు సెంట్లు,పట్టణాల్లో రెండు సెంట్లు స్ధలం కేటాయించాలని నిర్ణయించినట్లు గృహ నిర్మాణశాఖ మంత్రి పార్ధసారధి వెల్లడిరచారు. గత ప్రభుత్వం ఇళ్లపట్టాల కోసం భూ సేకరణ జరిపి లే అవుట్లు వేయని స్థలాల్లోనూ పేదలకు మూడు సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
వంద రోజుల్లో 1,25లక్షల ఇళ్ల నిర్మాణం
ఇళ్ల నిర్మాణమనేది తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతా అంశంగా ఉంటుందని సీఎం చంద్రబాబు సమీక్షలో స్పష్టం చేశారు.రాబోయే వంద రోజుల్లో 1.25లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.వచ్చే ఏడాది కాలంలో 8.25లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు వెల్లడిరచారు.గత ప్రభుత్వం ఎన్టీఆర్‌ ఇళ్ల లబ్దిదారులను పక్కన పెట్టేసిందన్నారు.ఇళ్లు పూర్తియినా పేమెంట్లు చెల్లించలేదని,ఇలాంటి బాధిత లబ్దిదారులకు చెల్లింపులు జరపాలని చంద్రబాబు ఆదేశించారు.మధ్యతరగతి ప్రజలకు ఎంఐజీ లే అవుట్లును ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలో హౌసింగ్‌లోనే రూ.10వేల కోట్లు నష్టం
జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం చేపట్టి తక్కువ ధరలకు ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పారు. పోలవరం ఆర్‌ అండ్‌ ఆర్‌ కింద ఇళ్ల నిర్మా ణాన్ని గృహ నిర్మాణ శాఖకు అప్పగించాలనే అంశంపై చర్చ జరిగిందని,ఇప్పటికే ప్రారం భించిన ఇళ్లను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలిచ్చి మౌలిక సదుపాయాలను కల్పించలేదని,అలాంటి చోట మౌళిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఒక్క హౌసింగ్‌శాఖ లోనే రూ.10వేల కోట్ల మేర నష్టం వాటిల్లిం దని విమర్శించారు.ఎస్సీ,ఎస్టీలకు ఎలాంటి ప్రత్యేకతలు లేకుండా గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.2014`2019మధ్యకాలంల నాలుగున్నర లక్షల మందికి రాష్ట్ర నిధులతో ఇళ్ల నిర్మాణం చేపట్టామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
పరిశ్రమల శాఖపై నూతన పాలసీలు రూపకల్పనకు ఆదేశం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, తీసుకు రావా ల్సిన కొత్త పాలసీలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు. గత పదేళ్ల కాలంలో పెట్టుబడుల కోసం వివిధ సందర్భాల్లో చేసుకున్న ఒప్పందాలు, వాటి ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సీఎం చర్చించారు. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్న సమయంలో రూ.16 లక్షల కోట్ల పెట్టు బడులపై ఒప్పందాలు చేసుకోగా…తరువాత వచ్చిన ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా పారిశ్రామిక వేత్తలు వెనక్కి వెళ్లిపో యారని సీఎం అన్నారు. పారిశ్రామిక వేత్తలను ఇబ్బందులు పెట్టడం, రాజకీయ వేధింపులకు గురిచేయడంతో చాలా కంపెనీలు పెట్టుబడుల ఒప్పందాలను రద్దు చేసుకున్నాయని…కొత్త కంపెనీలు కూడా రాలేదని సీఎం అన్నారు. మళ్లీ పారిశ్రామిక వేత్తల్లో నమ్మకం కల్పించా ల్సిన అసవరం ఉందన్నారు. పారిశ్రామిక అవసరాల కోసం తీసుకున్న భూములను కూడా ఇతర అవసరాలకు వినియోగించారని సీఎంకు అధికారులు వివరించారు. వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల కోసం సేకరించిన భూముల్లో 1,382 ఎకరాలను ఇళ్ల పట్టాల కోసం అంటూ తీసుకున్నారని అధికారులు తెలిపారు. పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు అసవర మైన స్థలం సేకరించి ఇవ్వాల్సి ఉన్నా… పరిశ్రమలకు ఇచ్చే స్థలాలు ఇచ్చారని వివరిం చారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల కోసం గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 66 శాతం ప్రోత్సాహకాలు చెల్లిస్తే….వైసీపీ ప్రభుత్వంలో 34 శాతం మాత్రమే ఇచ్చారని అధికారులు వివరించారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిద్దా మన్నారు. తద్వారా పెట్టుబడులకు ఆస్కారం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. 2014-2019 కాలంలో64ఇండస్ట్రియల్‌ పార్కుల ద్వారా14,125 ఎకరాలు అందుబాటులోకి తెస్తే 2019-2024 మధ్య కేవలం 31పార్కు లు అందుబాటులోకి తెచ్చారని అన్నారు. ఇలాంటి పరిణామాలతో పారిశ్రమిక వేత్తలు, పెట్టుబడి దారులు నమ్మకం కోల్పోయారని సీఎం అన్నారు.నాడు ఒప్పందం చేసుకుని వైసీపీ ప్రభుత్వ విధానాలతో వెనక్కి వెళ్లిన వారితో మళ్లీ సంప్రదింపులు జరపాలని, అవసరం అయితే తాను కూడా వారితో మాట్లాడుతానని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పటికే పనులు ప్రారంభించిన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని సీఎం అన్నారు. తద్వా రా ఏడాది కాలంలో లక్ష కోట్ల పెట్టుబ డులకు సంబంధించిన ప్రాజెక్టులు పూర్తి చేసి 1,36, 260 మందికి ఉపాది కల్పించాలని అన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా మల్లవల్లి పారిశ్రా మిక వాడలో భూముల రేట్లు తగ్గించి పెట్టుబడులకు ఊతం ఇవ్వాలని సీఎం అదేశించారు.వైసీపీ ప్రభుత్వం దీన్ని పూర్తిగా వివాదాల్లోకి నెట్టేసి…నిర్వీర్యం చేసిందని సీఎం అన్నారు.
5 నూతన పాలసీలు
వచ్చే 100రోజుల్లో కొత్తగా 5పాలసీలు తీసుకు రావాలని సీఎం అధికారులను ఆదేశించారు. నూతన ఇండస్ట్రీయల్‌ పాలసీ,ఎంఎస్‌ఎంఇ పాలసీ,ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ,ఎలక్ట్రానిక్‌, ఐటీ అండ్‌ క్లౌడ్‌ పాలసీ,టెక్స్‌ టైల్‌ పాలసీలు తీసుకురావాలని అన్నారు. అత్యుత్తమ పాలసీల ద్వారా పెట్టుబడుల ఆకర్షణకు అనువైన వాతారవణం కల్పించాలని అధికారులను ఆదేశించారు.రాష్ట్రాన్ని గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ ఎనర్జీ హబ్‌గా చెయ్యాలనే లక్ష్యంతో పాలసీలు రూపొందించాలని అన్నారు. అదే విధంగా కొత్తగా నాలుగు పారిశ్రామిక క్లష్టర్లపై ప్రతి పాదనలు సిద్ధం చేసి కేంద్ర అనుమతులు పొందాలని సీఎం అన్నారు.కుప్పం,మూల పేట,చిలమత్తూరు,దొనకొండ లేదా పామూ రులో కొత్త క్లష్టర్స్‌ ఏర్పాటు చేయాలని..ఈ మేరకు ప్రక్రియ ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.ఆయా క్లష్టర్లలో ఎలక్ట్రానిక్స్‌, ఫార్మా,ఫుడ్‌ ప్రాసెసింగ్‌,హార్డ్‌ వేర్‌ సంస్థల ఏర్పాటుకు కృషి చేయాలని సిఎం అన్నారు. అలాగే కృష్ణపట్నం,నక్కపల్లి,ఒర్వకల్లు,కొప్పర్తి నోడ్స్‌ ప్రోగ్రస్‌పై చర్చించారు.నక్కపల్లిలో రూ.11,542కోట్లతో ఏర్పాటు చేసే బల్క్‌ డ్రగ్‌ పార్క్‌,రూ. 60 వేల కోట్లతో ఏర్పాటు అయ్యే గ్రీన్‌ హైడ్రొజన్‌ హబ్‌, ప్రస్తుతం చర్చలు జరు పుతున్న బిపిసిఎల్‌ ప్రాజెక్టుల స్థితిగతులపై అధి కారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు.ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్‌ కూడా పాల్గొన్నారు. సమీక్ష ముగిసిన అనంతరం టీజీ భరత్‌ మీడియాతో మాట్లాడారు. ఏపీకి రూ.75,000 కోట్లతో బీపీసీఎల్‌ పరిశ్రమ రాబోతోందని వెల్లడిర చారు. బీపీసీఎల్‌ పరిశ్రమను రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయాలనేది 90 రోజుల్లో నిర్ణయి స్తారని తెలిపారు.కృష్ణపట్నంలో బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటుకు విన్‌ ఫాస్ట్‌ సంస్థ ముందుకొచ్చిందని వివరించారు. ఏపీలో పెట్టుబడులకు అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ జెన్నిఫర్‌ కూడా ఆసక్తి కనబరిచారని మంత్రి టీజీ భరత్‌ పేర్కొన్నారు.ఇక, దేశంలోనే ఉత్తమ పారిశ్రామిక విధానం తీసుకురావాలని నేటి సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉత్తమ ఎంఎస్‌ఎంఈ, క్లస్టర్‌ విధానాలు అమలు చేస్తామని తెలిపారు. సీబీఎన్‌ బ్రాండ్‌తో పారిశ్రామికవేత్తలకు అనుకూల విధానాలు అమలు చేస్తామని వివరించారు. రాష్ట్రంలో నాలుగు ఇండస్ట్రియల్‌ క్లస్టర్లు ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని టీజీ భరత్‌ వెల్లడిరచారు. ఇప్పటికే రాష్ట్రంలో కృష్ణపట్నం,ఏపీ బల్క్‌ డ్రగ్‌ పార్క్‌, ఓర్వకల్లు, కొప్పర్తిలో 4ఇండస్ట్రియల్‌ క్లస్టర్లు ఉన్నాయని వివరించారు.కొత్తగా కుప్పం, లేపాక్షి, దొన కొండ, మూలపేటలో క్లస్టర్లు ఏర్పాటు చేస్తా మని చెప్పారు.చిత్తూరు నోడ్‌ కింద రూ.1, 350 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని వెల్లడిరచారు. రాజధాని అమరావతి సమీ పంలో ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు చేయాల నేది తమ ప్రభుత్వ ఆలోచన అని మంత్రి టీజీ భరత్‌ తెలిపారు. గతంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు భయపడే పరి స్థితి కల్పించారని మంత్రి టీజీ భరత్‌ విమ ర్శించారు. గతంలో పారిశ్రామికవేత్తలను షేర్లు,పర్సంటేజీలు అడిగే పరిస్థితి ఉండేదని తెలిపారు.-జి.ఎన్‌.వి.సతీష్‌

అంతట విస్తరిస్తున్న అడవి బిడ్డల పండుగ

మాయ మర్మం..కుట్రలు కుతంత్రాలు.. తెలియని స్వచ్ఛమైన జీవన స్రవంతిలో ఐక మత్యానికి సాంప్రదా య పరిరక్షణకు చిరు నామాలుగా నిలిచే అడవి తల్లి ముద్దుబిడ్డలు, ఆదివా సులుగా, గిరిజనులు గా, వనవాసులుగా, వివిధ పేర్లతో పిలవబడు తున్న వీరంతా మానవజాతికి కార కులైన మూలవా సులే…! నివ సించే ప్రాం తాలను బట్టి పిలి చే పేర్లలో మార్పులు ఉండ వచ్చు,జా తులు, తెగలు, వేరుగా ఉన్న అందరూ మూలవాసులు గా నే మన ప్రాచీన చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తారు….!!
ప్రపంచ జనాభాలో నాలుగు శాతం ఆదివాసులు ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలలో సుమారు 30 కోట్ల మంది ఆదివా సులు ఉన్నారు. ఐదువేల తెగలు ఉన్నాయి ప్రపంచంలోని అన్ని ఖండాలలో ఈ వనవా సులు ఉన్న ఎక్కువ మంది ఉన్నది మాత్రం మన ఆసియా ఖండంలోనే,ప్రపంచ ఆదివాసి జనాభాలో 70% మంది ఆసియాలోనేఉన్నా రు.మనదేశంలో ఏడు కోట్ల మందికి పైగా గిరిజనులు ఉన్నారు తరతరాలుగా వారిదైన సొంత జీవన విధానంలో అడవులను నమ్ము కుని జీవనం సాగిస్తున్నారు అడవి బిడ్డలకు వారిదైన జీవన శైలి సంస్కృతి విశ్వాసాలు ఉంటాయి. ఆచారాలను ప్రాణప్రదంగా నేటికీ కాపాడుకుంటూ సంస్కృతి పరిరక్షకులుగా ఉన్న వీరు ఆధునికల దృష్టిలో అనాగ రికలు, నాగరికత తెలియని తెలివి తక్కువ వారు.కానీ వారిలో ఉండే ఐక్యత సాంప్ర దాయ పరిరక్షణ మానవ విలువలు మన అందరికీ ఆదర్శనీయం వీరికి గల ఆ ప్రత్యే కతల దృష్ట్యానే భారత రాజ్యాంగంలోని 342 అధికరణం కింద మొత్తం 698 గిరిజన తెగలను భారత ప్రభుత్వం గుర్తించి వారికి ప్రత్యేక హక్కులను చట్టబద్ధం చేసింది.మధ్య భారతంలో గల ఆదివాసీలను 5వ షెడ్యూలు, ఈశాన్య భారతంలోని ఆదివాసీలను 6వ షెడ్యూలులో చేర్చి సగౌరవంగా పాలిస్తున్నారు. చారిత్రకంగా చట్టబద్ధంగా ఘనమైన చరిత్ర భద్రత గల వీరు ప్రత్యక్షంగా దుర్భర జీవనం కడుపు తున్నారు, ప్రకృతిలో మమేకమై నిష్కల్మ షంగా సత్యమార్గంలో జీవించటం వీరి విల క్షణతలు, వారి హక్కులు మానవ హక్కులలో అంతర్భాగమే అందుకే… ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 1994 డిసెంబర్‌ 23న ఆది వాసుల కోసం వారి అభివృద్ధి కోసం ఒక తీర్మా నం చేసి ప్రతి ఏటా ఆగస్టు 9న‘‘ప్రపంచ ఆది వాసి దినోత్సవం’’ నిర్వహించాలని ప్రకటిం చింది. అంతే కాదు 1994 2004 దశాబ్దాన్ని ఆదివాసీ దశాబ్దంగా ప్రకటించింది. మన దేశంలో 2007 ఆగస్టు 9నుంచి అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం అధికారికంగా నిర్వహి స్తున్నారు. ఆర్థిక సంస్కృతిక విద్యా,ఆరోగ్య సామాజిక పర్యావరణ రంగాలలో ఆదివాసుల అభివృద్ధికి తగిన చర్యలు చేపట్టడం ఈఆది వాసీ దినోత్సవం ప్రధాన లక్ష్యం.గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేక చట్టాలు ప్రభుత్వ రంగ సంస్థలైన సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ప్రత్యేక గిరిజన మంత్రిత్వ శాఖలు ఏర్పడి ఉన్న ,దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75వసంతాలు నిండి న గిరిపుత్రుల అభివృద్ధిలో ఆశించిన లక్ష్యా లు నెరవేరలేదు అనడంలో అసత్యం లేదు. ఆదివాసులు అంటే నాగరిక ప్రపంచానికి దూరంగా అడవులు కొండలు,కోనలు అసౌ కర్యాల నడుము దుర్భర జీవనం చేసేవారు, వారే అసలైన ఆదివాసులు వీరికి అందా ల్సిన ప్రభుత్వ పథకాలు రిజర్వేషన్లు నేడు ఎవరికి వినియోగం అవుతున్నాయో అందరికీ తెలిసిందే. రాజ్యాంగబద్ధంగా రాజకీయాల లబ్ధికోసం జరిగిన అనేక సమీకర ణల ద్వారా అసలైన అడవుల్లో జీవించే అడవి బిడ్డలు ఘోరంగా నష్టపోవడమే కాక విద్య ఆర్థిక సామాజిక జనాభాపరంగా వెను కబడి నేటికీ శ్రమజీవులు గానే జీవనం సాగి స్తున్నారు, ఉన్నత విద్యావంతులుగా ఉన్నత ఉద్యోగులుగా ఎదగలేకపోతున్నారు, ఇక రాజకీయ రంగంలో నిజమైన అడవి బిడ్డలు నిరుపేద గిరిజనులు ఖరీదైన ఎన్నికల రణ రంగంలో ఎప్పుడూ జెండాలు మోసే రోజు వారి కూలీ కార్యకర్తలు గానే ఉండిపోతు న్నారు తప్ప చట్టసభల్లో అడుగుపెట్టి ‘‘అధ్యక్షా అనే….’’అర్హత శాశ్వతంగా కోల్పో తున్నారు. అటు రాజకీ యంగానే కాక సామాజికపరంగా వారికి గల మంచితనమే వారిని మోసం చేస్తుంది అనిపి స్తుంది, వారి అభివృద్ధి కోసం తెచ్చిన రిజర్వే షన్లు వారికే అవరోధంగా మారాయి అని ఆశ్చర్యం కలుగుతుంది. ఇటువంటి విపత్కర పరిస్థి తుల్లో పరిశీలనకు కష్టతరంగా కనిపిం చిన, తక్షణం షెడ్యూలు కులాల వారితో పాటు షెడ్యూలు తెగల వారి వర్గీకరణ పోరాటాన్ని గ్రహించి వెంటనే వర్గీకరణ అమలు చేయడమే గిరిజనాభివృద్ధికి ముందున్న మంచి మార్గం. వెనుకబడిన కులాలలో అమలు అవుతున్న విధానం ఈ రెండు తెగల కుల వర్గీకరణకు ఎందుకు కాదు అన్నది అమాయకులైన అడవి బిడ్డల అరణ్య రోదన ప్రశ్న?? ఎన్నో వినూత్న సంస్కర ణలు చేస్తున్న మన పాలకులు సరైన దృష్టి పెడితే వర్గీకరణ అంత కష్టమేమీ కాదు లేకపోతే మరో వంద సంవత్సరాలు గడిచిన నిజమైన అడవి బిడ్డలు నేడున్న దుర్భర పరిస్థి తుల్లోనే ఇలాగే ఉండిపోతారు తప్ప గిరిజన వికాసం కోరుకునే మేధావులు విద్యావంతులు ఆశించిన లక్ష్యాలు ఎంత మాత్రం నెరవేరవు. రోజురోజుకు పెరిగి పోయి పట్టణాల నుండి పల్లెలగుండా గిరిజన గుడేలకు పాకుతున్న ఆధునికత ముసుగేసుకున్న పాశ్చాత్య సంస్కృతి ద్వారా ఎన్నో గిరిజన కుటుంబాలు అనారో గ్యాల పాలై అసంపూర్ణ జీవితాలు గానే మిగిలి పోతున్నాయి. గిరిజనుల సాంప్రదాయంలో భాగమైన శారీరక శ్రమను తొలగించి ఆరోగ్యం నింపే సహజ తయారీలైన విప్ప, తాటి, ఈత,వేప, జీలుగు, కల్లుల స్థానంలో ఖరీదైన విదేశీ మద్యం వచ్చి ఎందరో గిరిజ నులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆధునికుల సాయం గా వచ్చి పడుతున్న ఆహార అలవాట్లు, ఆధ్యా త్మిక విధానాలు, వాహ నాలు,కూడా వారికి నష్టం కలిగించడమే కాక వారిదైన సంస్కృతి నుంచి వారిని దూరంగా తరిమేస్తూ కనిపించని నష్టం కలిగిస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్య విషయం ఉంది. గిరిజనులు వారిలాగే ఉండి అడవుల్లోనే నివసిస్తే అభివృద్ధి ఎలా సాధించగలరు? అని ఈ సందర్భంలో పాలకులు అధికారులు తమ సౌలభ్యం మాత్ర మే చూసుకుంటున్నారు తప్ప వారి ఆలోచన వారి సౌకర్యాల గురించి గమ నించడం లేదు వారు ఉన్నచోటనే వారిని ఉంచి అభివృద్ధి సౌక ర్యాలు అందించడం అసాధ్యం ఏమీ కాదు, కాకపోతే ఆర్థిక భారం కావచ్చు!! ఇక్కడ పెద్ద లంతా ఒకటే గమనించాలి నదుల్లో సహజ సిద్ధంగా జీవించే చేపలను ఆధునికత పేరు చెప్పి మన ఆర్థిక అభివృద్ధి కోసం చెరువులలో పెంచి వాటికి ఖరీదైన ఆహారం అందిం చడం ద్వారా చేపలకు ఎలాంటి ప్రయోజనం లేదనే సత్యం గమనించాలి. అదేవిధంగా అడవి బిడ్డ లకు కూడా వారి వారి తావుల్లోనే ఆధునిక సౌకర్యాలు కల్పించాలి, ఆదివాసులను వారిదైన పద్ధతులు సంస్కృతిలోనే ఆధునీకరించాలి తప్ప మైదాన ప్రాంతాలకు తరలించడం ద్వారానే అభివృద్ధి చేయగలం అనుకోవడం అనాలో చితం.ఇక గిరిజన యువత కూడా ముందు చూపుతో ఆలోచించాల్సిన సమయం ఇది.క్షణికా ఆనం దాలు వ్యసనాలు చిన్న వయసు పెళ్లిళ్లు వంటి అభివృద్ధి అవరో ధాలకు అతి దూరంగా ఉంటూ మీదైన దీక్ష పట్టుదలతో సవ్యమైన చదువుల సారం పొంది తమను తాము సంస్కరించు కోవ లసిన సమయం ఇది,ప్రస్తుతం గిరిజన ప్రాంతాలు అన్నీ ఆగస్టు 9న ఆకుపచ్చ రంగు పులుముకుని ఆనందంగా సంబ రాలు చేసు కుంటూ గిరిజన వీరులకు అంజలి ఘటిస్తు న్నాయి, ఇదో మంచి పరిణా మం,ఈ సందర్భంలోనే ఆదివాసీ యువత అంతా ఆరోగ్య కరమైన అభివృద్ధి వైపు అడు గులు వేస్తా మని ప్రతిజ్ఞ పూనాలి. – అమ్మిన శ్రీనివాస్‌రాజు

లోక్‌ అధాలత్‌తో సత్వర న్యాయం

కోర్టు పరిధిలో ఉన్న చిన్న చిన్న తగాదా లకు వెనువెంటనే పరిష్కారం.. ఆర్థిక లావాదేవీలు, బీమా తదితర కేసులను సత్వరమే పరిష్కరిం చటానికి లోక్‌ అదాలత్‌ ఎంతో ఉపయోగపడు తుంది. ఇందులో కక్షిదారుల ఆమోదంతో రాజీకుదిర్చి ఇరువర్గాలకు న్యాయం జరిగేలా పరిష్కార మార్గాలు చూపుతారు.లోక్‌ అదాలత్‌లో రాజీమార్గం ద్వారా పైకోర్టుల్లో అప్పీలు చేసుకోవడానికి వీలులేని విధంగా పరిష్కారం చూపుతారు. దీంతో లోక్‌ అదాలత్‌లో వందలాది కేసులు (దావాలు) పరిష్కారమవుతున్నాయి. వివిధ కేసుల్లో బాధితులు, కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరిగి విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా, ఆర్థికంగా నష్టపోకుండా లోక్‌ అదాలత్‌లో పరిష్కారం లభిస్తుంది. సత్వర న్యాయం కూడా లభిస్తుంది.
ఏండ్ల తరబడి పరిష్కారం కాని ఎన్నో కేసులు లోక్‌ అదాలత్‌లో రాజీమార్గం ద్వారా పరిష్కారమవుతున్నాయి. ఇరు వర్గాలకు రాజీకుదిర్చి,ఇద్దరికీ సమ్మతమైన న్యాయాన్ని అందిస్తున్నారు. లోక్‌ అదాలత్‌లో మోటారు వెహికిల్‌ యాక్టుల్లోనూ, ఆబ్కారీ (ఎక్సైజ్‌) కేసులు, బ్యాంకు రుణాలు, కుటుంబ తగదాల కేసులు, ఇలా పలు కేసులు పరిష్కరిస్తున్నారు.
లోక్‌ అదాలత్‌ అంటే ఏమిటీ..?
రాజీ పడదగ్గ కేసుల్లో బాధితులు, ముద్దాయిలు ఇరువర్గాలు రాజీ పడదలచినచో వారు కోర్టుకు వచ్చి డిసెంబర్‌ 11న రాజీ చేసుకోవచ్చు. ఇరువర్గాలను రాజీకుదిర్చి సత్వర న్యాయం చేయడమే లోక్‌ అదాలత్‌ లక్ష్యం. ఇందులో పరిష్కరించిన కేసులపై పైకోర్టులో అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండదు.
లోక్‌ అదాలత్‌లో ఏఏ కేసులు రాజీ పడొచ్చు?
కొట్లాట,దొంగతనం,చీటింగ్‌,అసభ్య పదజాలం, అతిక్రమణ, వ్యభిచారం, పరువునష్టం,బెదిరింపు, భార్యాభర్తల గొడవలు,మెయింటనెన్స్‌ క్రిమినల్‌ కంపౌండబుల్‌ కేసులు,ప్రీ-లిటిగేషన్‌, టెలిఫోన్‌, బ్యాంకు రుణాలకు సంబంధించిన కేసులు రాజీపడొచ్చు.
లోక్‌ అదాలత్‌ ప్రయోజనాలు ఏమిటీ..?
కోర్టుల చుట్టూ తిరిగి విలువైన సమయం వృథా చేసుకోవడం తప్పుతుంది. సమయం, డబ్బుల ఖర్చు కలిసివస్తాయి. కోర్టు ఫీజు లేకుండా ఇరువర్గాలు సంతోషపడే విధంగా రాజీ కుదుర్చుకోవచ్చు. సత్వర న్యాయం లభిస్తుంది. ఇరువర్గాలకు మేలు జరుగు తుంది. కోర్టు ఫీజు తిరిగి ఇస్తారు. లోక్‌ అదాలత్‌ కేసులకు సంబంధించి ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప సాధారణంగా అప్పీలు ఉండదు.సంబంధిత న్యాయవాది,పోలీసు అధికారి, మండల లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ సభ్యులను సంప్రదించవచ్చు.
న్యాయసేవా అధికార సంస్థ అంటే ఏమిటీ..?
పేదలకు పూర్తిస్థాయిలో న్యాయం అందించే ఏర్పాట్లను న్యాయశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది.డబ్బున్నా ,లేకపోయినా అందరికీ సరైనా న్యాయం అందించడానికి ప్రభుత్వం జాతీయ,రాష్ట్ర,జిల్లా,మండల స్థాయిల్లో న్యాయసేవా అధికార సంస్థలను అందుబాటులోకి తెచ్చింది. న్యాయసేవా అధికార సంస్థ ద్వారా పేదలు ఉచితంగా న్యాయసేవలు పొందవచ్చు.ఈ సేవలను పేదలు వినియోగించుకోవాలి.
లోక్‌ అదాలత్‌ ద్వారా బాధితులకు సత్వర న్యాయం దేశ అత్యున్నత న్యాయ స్థానం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న లోక్‌ అదాలత్‌ ల ద్వారా బాధితులకు సత్వర న్యాయం లభిస్తుందని, ఇలాంటి వేదికలను కక్షిదారులు తప్పక సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్‌ పేర్కొన్నారు. బాధితులకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు గాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిత్యం పని చేస్తోందని గుర్తు చేశారు. జాతీయ లోక్‌ అదాలత్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం స్థానిక కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవాసదన్‌ వద్ద శనివారం ఉదయం జరిగింది. జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలన్నదే న్యాయ వ్యవస్థ అంతిమ లక్ష్యమని, ఆ దిశగా న్యాయమూర్తులు సేవలందిస్తున్నారని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ బాధితులకు అండగా నిలుస్తూ న్యాయ సహాయం అందిస్తోందని పేర్కొన్నారు.లోక్‌ అదాలత్‌ లాంటి వేదికల్లో పౌర శిక్షాస్మృతి, నేర శిక్షాస్మృతి పరిధిలోని రాజీకాగలిగిన కేసులు, మోటారు ప్రమాదాల కేసులు, రాజీపడదగ్గ క్రిమినల్‌ కేసులు, సివిల్‌ కేసులు పరిష్కారానికి వస్తాయన్నారు. ప్రభుత్వ సంస్థలు, బీమా కంపెనీలు, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు, కక్షిదారులు ఇలాంటి వేదికలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా హితవు పలికారు.
కార్యక్రమంలో భాగంగా గనవ్యర్థాల నిర్వహణ, పునర్వినియోగం, కాలుష్య నివారణ పద్ధతులపై రూపొందించిన పోస్టర్ను జిల్లా కోర్టు న్యాయ మూర్తులు, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.వి.శేషమ్మ,మెట్రోపాలిటిన్‌ సెషన్స్‌ జడ్జి ఎం.వెంకటరమణ,ఫ్యామిలీ కోర్టు జడ్జి కె. రాధారత్నం, బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ బి. సత్యనారాయణ, ఏపీ బార్‌ కౌన్సిల్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎస్‌. కృష్ణ మోహన్‌, ఇతర న్యాయ మూర్తులు, న్యాయవాదులు, కోర్టు అధికారులు తదితరులు పాల్గొన్నారు.-జిఎన్‌వి సతీష్‌

1 2 3 4 10