రామరాజ్యమా..లౌకిక రాజ్యామా?

ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఓట్ల కోసం ప్రజల మనోభావాలతో చెలగాటమాడటం కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బిజెపికి అలవాటు. మతాన్ని అడ్డం పెట్టుకుని ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాన్ని చాప కింద నీరులా దేశం మొత్తం వ్యాప్తి చేసే కార్యక్రమాన్ని యథేచ్ఛగా అమలు చేస్తున్నది. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట సందర్భంగా ప్రధాని చేసిన ఉపన్యాసమే అందుకు నిదర్శనం. ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నది సాధువులు, సన్యాసులు, బడా వ్యాపారవేత్తలు, కోట్లాధిపతులు. ఎన్నికల ముందు రామ మందిరాన్ని ప్రారంభించి ప్రజల భావోద్వే గాలను తమ వైపు మరల్చుకోవా లన్నది బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ల ప్రధాన ఎత్తుగడ. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, ప్రధాని మోడీ కలిసి రామమందిరాన్ని ప్రారంభిం చారు. దీన్నిబట్టి మనమేం అర్థం చేసుకోవాలి? మతం ముసుగులు తొలిగిపోయాయి. ఇక అంతా బహిరంగమే! ఎన్నికలయ్యేదాకా ఎక్కడ ఏం జరుగుతుందో, ఎలాంటి మత ఉద్రిక్తతలు చెలరేగుతాయో, ఘర్షణలు జరుగుతాయో తెలియని పరిస్థితి. మతాన్ని, రాజకీయాలను వేరుచేసి చూడటం లేదు. మతానికి రాజకీయాలను అనుసంధానం చేసి అధికారం కోసం తన ఎత్తుగడలను అనుసరిస్తున్నారు మోడీ. గత 75 ఏళ్లలో ఏ ప్రభుత్వాలు చేయలేని దానిని కేంద్రం అమలు చేస్తున్నది. 1990లో ఎల్‌కె అద్వానీ రామజన్మభూమి పేరుతో రథయాత్ర ప్రారంభించి 1984లో రెండు సీట్ల నుంచి 150 సీట్లకు తీసుకొచ్చారు. అప్పటినుంచే కాషాయపు జెండా తన ఎజెండాను పూర్తిగా మార్చుకున్నది. బిజెపిగా అవతరించింది. పేరు మార్చింది. ప్రజలను ఏమార్చింది. తన విధానాలను ఆ తర్వాత అదే కార్యక్రమాన్ని రామజన్మభూమితో కొనసాగించి అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ట అంకం పూర్తయింది. ఇక మధురలో కృష్ణ దేవాలయం, ఇతర దేవాలయాలపై దృష్టి సారించింది. నిరంతరం ప్రజలను మత ఉద్వేగాల వైపు మరల్చి ఓట్లు దండుకునే కార్యక్రమాన్నే బిజెపి పెట్టుకున్నది. మత విశ్వాసాలు వ్యక్తిగతమైనవి. పరమత సహనం పాటిస్తూ అందరినీ కలపుకుపోయేదే రాజనీతి. రాజకీయాలు లౌకికత్వానికి సంబంధించినవి. వర్తమానంలో రాజకీయాలలో మతం ప్రధాన పాత్ర వహించే విధంగా బిజెపి తన ఎత్తుగడలను కొనసాగిస్తున్నది. ఇప్పుడు రామజన్మభూమి, రామాలయం వంటి అంశాలను తీసుకువచ్చి ప్రజలను మభ్యపెడుతున్నది. రామాలయాలు దేశమంతటా ఉన్నాయి. రాముడు ప్రజా సంక్షేమాన్ని కాంక్షించాడని చెప్తారు. అన్న మాట కోసం అధికారాన్ని వదిలి అడవులకు పోయాడంటారు. అయితే రామ నామం జపించే పాలకులు చేసిన వాగ్దానాలను ఉట్టి మీదకు ఎక్కించారు. నిత్యావసర ధరలను ఆకాశమార్గం పట్టించారు. సగటు పేద ప్రజలు ఆ ధరలను అందుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇది మోడీ రాజ్యంలో ప్రజల పరిస్థితి.
పదేళ్ల కిందట అధికారంలోకి రాక ముందు మోడీ మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టారు. రైల్వేస్టేషన్‌లో చారు అమ్మినవాడిగా, వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన నాయకుడిగా, అందరి కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా పరిచయం చేసుకుని ప్రచారార్భాటం ప్రారంభిస్తే ప్రజలు నమ్మారు. బిజెపి ని అధికారంలోకి తీసుకొచ్చారు. నాడు మోడీ చేసిన వాగ్దానాలేమిటి? నేడు చేస్తున్నదేమిటి? పేద ప్రజల, కార్మికవర్గ సంక్షేమం, బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. రైతాంగం పట్ల దోపిడీ విధానాన్ని అనుసరించే చట్టాలను సంస్కరణల పేరుతో తీసుకొచ్చారు. కార్మిక వర్గాలను పరిశ్రమల అధిపతులకు, పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చే చేదు మందు లాంటి సంస్కరణలకు చక్కెరపూత పూశారు. యాజమాన్యాలకు కార్మిక వర్గం బానిసలుగా పనిచేసేలా తిరోగమన సంస్కరణలను ముందుకు తెచ్చారు. పెట్టుబడిదారుల లాభాలకు, వారి సంతోషం కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నామని మోడీ ఎప్పటికప్పుడు తన విధానాల ద్వారా తెలియజేస్తూనే ఉన్నారు. కోట్లాది టన్నుల ధాన్యం గోడౌన్లలో మూలుగుతున్నా పేద ప్రజలకు పంచడానికి చేతులు రావడం లేదు కానీ అదానీ, అంబానీ లాంటి వారికి లక్షల కోట్ల రూపాయలను రాయితీలిచ్చి ప్రోత్సహిస్తున్నారు. ఈ దేశంలో నిరుద్యోగాన్ని వేగంగా పెంచి పోషిస్తున్నది ఎవరు, మోడీ కాదా? ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన ఊసెక్కడీ ఉన్న ఉద్యోగాలను ఊడ పీకడమే కాకుండా పకోడీలు అమ్ముకోవడం కూడా ఉద్యోగమే అని సెలవిచ్చిన మోడీ ఈ దేశానికి ‘మహా నాయకుడు’, ‘విశ్వగురు’!
ప్రభుత్వ రంగ పరిశ్రమలను టోకుగా అమ్మడం, బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టడం లాంటి చర్యలను నిస్సిగ్గుగా కొనసాగిస్తున్నారు బిజెపి పాలకులు. ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మింది, బడా పెట్టుబడిదారులకు కట్టబెడితే ఎంత సంపద వచ్చింది గొప్పగా చెపుకుంటున్నారు. కానీ దేశాన్ని దోచుకుని సరిహద్దులు దాటించిన బడా పారిశ్రామిక వేత్తలను గురించి ఒక్క రోజు కూడా మాట్లాడరు! కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును పట్టపగలే బ్యాంకు రుణాల ద్వారా దోచుకున్న విజరు మాల్యా, నీరవ్‌ మోడీ లాంటి వాళ్ళ గురించి అసలు తెలియ నట్లు వ్యవహరిస్తున్నారు. నేడు ప్రపంచంలో మూడవ కుబేరుడిగా గౌతమ్‌ అదానీ ఎది గాడు! ఇది ఎవరి చలువో అందరికీ తెలిసిం దే. కేవలం మోడీ ఈ పదేళ్ల పాలనలో అదా నీలు, అంబానీలు, టాటా బిర్లాలు కోట్లాది ఆస్తులను సంపాదిస్తూ వేగంగా ప్రపంచ కుబేరులను దాటిపోతున్నారు. దగా పడ్డ ప్రజల ఆదాయం, ప్రజల జీవన స్థితులు మాత్రం మారడం లేదు. కారణం, ప్రజల్ని మతం చుట్టూ భ్రమింపజేయడం ద్వారా అంతర్గత వ్యూహాల్ని అమలు చేస్తున్నారు. నూటికి ఎనభై శాతం వ్యవసాయ దేశంలో రైతుల బతుకులు చితికిపోతున్నా వారి గురించి పట్టించుకోరు. ప్రజల సంపద బడా కోట్లాధిపతుల చేతుల్లోకి వెళ్లిపోతున్నా మాట్లాడే పరిస్థితిలో లేరు. ప్రభుత్వ సంస్థలు నిర్వీర్య మైతున్నాయి, క్షీణిస్తున్నాయి. సంబంధ మే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బిజెపి పాలన లో ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను కూడా ఏర్పాటు చేయలేదు. గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ప్రజలకు ఉపయోగమైన దేశానికి ప్రయోజన కరమైన బడా ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేసి అమ్మి వేయడం లేదా అంగడి దుకాణాలు ఇచ్చినట్లు కిరాయిలకు ఇస్తున్నది. ఇది దేశానికి నష్టదాయకమే కాదు, భవిష్యత్తుకు శాపం! ప్రభుత్వ పరిశ్రమలను కొనుగోలు చేసిన పెట్టుబడిదారులు మాత్రం ఒకటికి పదింతలు కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్నారు, డొల్ల కంపెనీలు సృష్టించి దోచుకుంటున్నారు. మన పాలకులు ఆనందపడుతున్నారు. ఇదే అసలైన అభివృద్ధిగా చెబుతున్నారు. మరి అదానీ అసలు స్వరూపాన్ని హిండెన్‌బర్గ్‌ బయట పెడితే దీనిపై స్పందించరేం? ఈ దేశంలో కోట్లాది మంది ప్రజల సొమ్మును కొంతమంది పెట్టుబడిదారులు దోచుకోవడం, దాచుకోవ డం పరిపాటిగా పెట్టుకున్నారు. అందుకు మోడీ అండదండలే కారణమన్నది దేశ పౌరులకు తెలియంది కాదు. ఓవైపు పన్ను ఎగవేతలు, మరోవైపు భారీ కుంభకోణాలు విజృంభిస్తుంటే వాటి నియంత్రణలో కేంద్ర పాలకులు విఫలమయ్యారు.మోడీ అధికారం లోకి వచ్చినప్పుడు రూ.65 లక్షల కోట్ల అప్పు ఉన్న మన దేశం నేడు రూ.కోటి 55 లక్షల కోట్లకు ఎగబాకింది. ఇది మోడీ పాలనలో జరిగిన అప్పుల అభివృద్ధి. అప్పులు తీర్చడానికే కేంద్ర బడ్జెట్‌లో అధిక శాతం వడ్డీలకు కట్టాల్సి వస్తుంది. దేశ ప్రజలపై ఎక్కడలేని భారాలను మోపుతున్నది. దేశ ఆదాయ వనరుగా ఈ దేశంలోని కోట్లాది పేద ప్రజ లను సరుకుగా మార్చుకుంటున్నది. దుడ్డుకర్ర లాంటి వివిధ పథకాలు తెచ్చి మధ్య తరగతి, పేద వర్గాల నడ్డి విరగ్గొడుతున్నది.అధికారం చేతిలో ఉందని తనకు తోచిన విధంగా వెనక ముందు చూడకుండా తిరోగమన విధానాలు అమలు చేస్తున్నది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి చర్యలు దేశాన్ని కుదేలు చేసింది అంద రికీ తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన కరోనా మహమ్మారిని అరికట్టలేక పోవడంతో కోట్లాది మంది అసంఘటిత కార్మికుల ఉసురు తీసింది. రెక్కాడితే గాని డొక్కాడని కార్మికుల, పేద ప్రజలను దిక్కులేని వాళ్ళని చేసింది. పెద్ద నోట్ల రద్దు ద్వారా ఈ దేశంలో ఉన్న నల్లధనం బయటికి తీసకొస్తామని జబ్బలు చరిచింది. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ఈ దేశ ప్రజల జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పింది. ఒక్క రూపాయి నల్లధనం కూడా బయట పెట్టలేక పోయింది. దీనికితోడు ధరల్ని అదుపు చేయడంలో, నిరుద్యోగాన్ని రూపు మాప టంలో, వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో మోడీ పూర్తిగా విఫలమయ్యారు.ఇది దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న మోడీ (రామ) రాజ్యం. ఈ రాజ్యంలో ప్రజా సంక్షేమం లేకపోగా పేదల బాధలు రెట్టింపయ్యాయి. నిరుద్యోగం, ధరల పెరుగుదల తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. కార్మికుల హక్కులు కాలరాయబడ్డాయి. చదువు, వైద్యం కార్పొరేట్ల పరమైంది. మోడీ ప్రభుత్వం వైఫల్యాలను ఎప్పటికప్పుడు సిపిఐ (ఎం) లాంటి వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు ప్రతిఘటి స్తున్నా, ప్రజల దృష్టిని మరల్చేందుకు బిజెపి-ఆరెస్సెస్‌ వేస్తున్న పాచికే రామరాజ్యం. ఇదే పదేళ్లలో మోడీ దేశానికి చేసిన నిర్వాకం. లోక్‌సభ ఎన్నికలకు సమయం ఆసన్నమైన సందర్భంగా మోడీ వేస్తున్న అడుగులను ఈ దేశంలోని యువకులు, ప్రజలు, విద్యావంతులు, మేధావులు గమనించాలి. భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నమైన భారత లౌకికత్వాన్ని ఓటు ద్వారా బలపరచాలి. అంధ విశ్వాసాల నుండి దేశాన్ని కాపాడుకోవాలి.
వ్యాసకర్త సెల్‌ : జూలకంటి రంగారెడ్డి – జూలకంటి రంగారెడ్డి

మత్తు ఉచ్చులో బాలలు

‘‘డ్రగ్స్‌ చట్టంలో మనిషి నుంచి మనిషికి మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా అవ్వడాన్ని కూడా ట్రాఫికింగ్‌ అనే అంటారు. ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి అంటుకునే వ్యాధే ఈ ట్రాఫికింగ్‌. ఒక విధంగా డ్రగ్స్‌ వాడుతున్న వాళ్ళను క్షమించి వారికి కొత్త జీవితాన్ని అందించడానికి ప్రయ త్నాలు చేయడంలో తప్పు లేదు. కానీ సరఫరా చేస్తున్న డ్రగ్‌ మాఫియాను మాత్రం కూకటి వేళ్ళతో పెకలించినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే ఐక్యరాజ్యసమితి సాధారణ సభ జూన్‌ 26, 1987న చేసిన తీర్మానం మేరకు ‘డ్రగ్స్‌’ విని యోగం, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ నడుం బిగించాలని విజ్ఞప్తి చేసింది. ప్రపంచ మానవాళిని మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చైతన్యవంతం చేసేందుకుగాను నడుం బిగించింది. ఈ సంవత్సరం (2023) హానికరమైన మాదక ద్రవ్యాలను వినియోగించే వారు, వారి కుటుంబాలలో అత్యధికులు వివక్షను ఎదుర్కొంటున్నారు. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే పరిస్ధితులకు దారితీస్తుంది. వారికి అవసరమైన సహాయాన్ని పొందకుండా నిరోధించే పరిస్ధితులు బలపడేలా చేస్తున్నాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో ప్రజలు ముందుగా మాదక ద్రవ్యాలు వినియోగించే వారిపై వివక్షతను తొలగించి మాదకద్రవ్యాల దుర్వినియోగం లేని ప్రపంచాన్ని సాధించడంలో సహకారాన్ని బలోపేతం చేయాలనే ప్రధాన లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి ఈ సంవత్సరం ధీమ్‌ ప్రకటించింది.’గునపర్తి సైమన్‌


సరదాగా ఒక్కసారి అన్న భావనతో మత్తుమందుల వినియోగం ప్రారంభించినప్పటికీ వాటిని వినియో గించినప్పుడు కలిగే తాత్కాలిక ఆనందం తరచూ పొందాలని కోరికతో క్రమేపీ అది బానిసలుగా మార్చేస్తోంది. చివరకు మత్తు మందు తీసుకోకుంటే తట్టుకోలేని పరిస్థితికి చేరు కుంటున్నారు. వాటిని సమకూర్చు కోవడానికి ఎంతకైనా తెగించేస్తున్నారు. ఈ విధంగా సరదా గా అలవాటు చేసుకుంటున్న ప్రతి 10 మందిలో ఇద్దరు దానికి పూర్తిగా బానిసలై పోతున్నట్లు, మాదక ద్రవ్యాలను వినియోగించే ప్రతీ ముగ్గురిలో ఒక మహిళ ఉంటున్నట్లు ఈమధ్యనే భారత గ్రామీణ చైతన్య వేదిక చేసిన సర్వేలో తేల్చి చెప్పిం ది.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రంలో మాదకద్ర వ్యాల విని యోగం అత్యంత ప్రమా దకర స్థాయిలో పెరుగుతోంది. పదేళ్ల ప్రాయం నుంచే కొందరు బాలలు వీటికి అలవాటు పడుతున్నారు. ఏకంగా 3.17లక్షల మంది బాలలు ఈ మత్తు వలలో చిక్కుకున్నారు. రాష్ట్రంలో 20.19 లక్షల మంది మాదకద్రవ్యాల వ్యసనపరులు ఉండగా.. వారిలో 15.70 శాతం మంది బాలలే ఉండ టం ఆందోళన కలిగి స్తోంది.బాలల్లో గంజాయి వినియోగం అధికం గాఉన్న రాష్ట్రాల్లో ఏపీ 12వ స్థానంలో ఉండటం మరింత కలవరపెడుతోంది. మాదక ద్రవ్యాల మత్తులో చిక్కుకొని రాష్ట్రంలోని కొందరు బాలలు అల్లాడు తున్నారు.ఓపియం, హెరాయిన్‌, గంజాయి వంటి నాటికీ వారు బాని సలవుతుండటం కలవరం రేపు తోంది. వీటిలో గంజాయి వినియో గం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలోని ఏపీ12వ స్థానంలోఉండగా.. బాలల్లో ఓపయడ్స్‌కు సంబందించిన మాదక ద్రవ్యాల వినియోగంలో పదివస్థానంలోఉంది. సెడెటివ్స్‌ వినియోగంలో ఎనిమిదివ స్థానంలో ఉంది. కేంద్ర సామాజిక న్యాయ సాధి కారిత మంత్రిత్వశాఖ స్థాయీ సంఘం తాజాగా పార్లమెంట్లో నివేదిక సమర్పించింది.
దేశంలో మత్తు పదార్ధాల బారిన పడి త్రీవంగా ప్రభావితమవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటని ఈ నివేదిక వెల్లడిరచింది. ప్రధానంగా బాలల్లో వీటి వినియోగం ఇక్కడ ఎక్కువగా ఉందని పేర్కోంది.మాదకద్రవ్యాల మైకం రాష్ట్రాన్ని ఎంత తీవ్రంగా కమ్మేసిందో చెప్పటానికి ఈ గణాంకాలే సాక్ష్యాలు.దీనివల్ల నేరాలూ పెరుగుతున్నాయి.ముప్పు ఇంతస్థాయిలో ఉన్నా సరే ప్రభుత్వం నియంత్రణకు అవసరమైన కార్యాచరణ కొరవడిరది.
మత్తు ఉచ్చులో విద్యార్థులు..కిక్కు కోసం బానిసలు
రాష్ట్రంలో గంజాయికి బానిసులుగా మారిన వారు 4.64లక్షలమంది ఉన్నారు. వారి లో 21వేలమంది బాలలే.వీరిలో 10నుంచి 17ఏళ్లలోపు వారు గంజాయి రుచిచూస్తున్నారు. మొత్తంగా మాదకద్రవ్యాలు వినియోగిస్తున్న 20.19లక్షల మందిలో 22.98శాతం మంది గంజాయి తీసుకుంటున్నారు. 10నుంచి 17ఏళ్ల మధ్య వయస్సున్న 3.17లక్షల మంది మాదకద్ర వ్యాలకు అలవాటుపడగా..,వారిలో 21వేల మంది గంజాయి సేవిస్తున్న వారే కావటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.18నుంచి 75ఏళ్లలోపువారిలో గంజాయి వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ 11వ స్థానంలో ఉంది.గతంలో మన రాష్ట్రంలో సాగు మాత్రమే ఉండేది.గత నాలుగేళ్లలో దాని లభ్యత, వినియోగం విపరీతంగా పెరిగిపోయాయి. ఎక్కడికక్కడే లభిస్తోంది. విక్రయదారులు, సరఫ రాదారులు ఎవరో తెలిసినా వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసకోవల్లేదు.ఈ ఉదాసీనత ఫలి తంగా దానికి అడ్డుకట్ట పడట్లేదు.ఓపి యోడ్స్‌, ఇన్‌హెలెంట్స్‌,సెడిటిప్స్‌కు సంబంధించిన మాదక ద్రవ్యాల వినియోగం కూడా ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా9.88లక్షల మంది ఓపి యెడ్స్‌కు బానిసలుగా మారారు.
రాష్ట్రంలో గాజాయి ఫుల్‌..చర్యలు నిల్‌
మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిన వారిని దాన్నుంచి విముక్తి కల్పించేందుకు కేంద్రప్రభుత్వం నేషనల్‌ యాక్షన్‌ ప్లాన్‌ ఫర్‌ డ్రగ్‌ డిమాండ్‌ రిడక్షన్‌ కార్యక్రమం అమలు చేస్తోంది. దీని కింద ఏపీలో 201819లో 1,752మంది లబ్దిపొందగా,202021నాటికి వారిసంఖ్య ఏకంగా 8,878కు పెరిగింది. కేవలం రెండేళ్ల వ్యవధిలో 291.57శాతం మంది లబ్దిదారులు పెరిగారు.201920తో పోలిస్తే 20221లో ఏకంగా 233.39శాతంమంది లబ్దిదారులు పెరిగారు.రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం, వాటి బారిన పడుతున్న వారి సంఖ్య ఎంత వేగంగా పెరుగుతుందో ఈగణాంకాలే చెబుతు న్నాయి.
గంజాయి ఊబిలో యువత..జీవితాలు నాశనం
దేశవ్యాప్తంగా 272జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం,ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో సహకారంతో కేంద్రం గుర్తించింది.ఆజాబితాలో ఉమ్మడివిశాఖ, తూర్పు గోదావరి,పశ్చిమగోదావరి,కృష్ణా జిల్లాలు ఉన్నా యి.వీటిలో విశాఖమన్యం గాజాయి సాగు సర ఫరాకు కేంద్రంగా ఉంది. మిగితా జిల్లాలు మీదు గా గంజాయి అక్రమ రవాణా సాగుతోంది. రాష్ట్రంలో మద్యం వినియోగం చాలా తీవ్రంగా ఉంది.మద్యానికి అలవాటు పడి బానిసలైన వారు ఎక్కువమంది ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ ఏడో స్థానంలో ఉంది.3.86కోట్ల మందితో ఉత్తరప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో ఉం డగా..65.09లక్షల మందితో ఏపీఏడోస్థా నంలో ఉంది. పొరుగున ఉన్న తెలంగాణలో మద్యానికి అలవాటుపడ్డవారు ఏపీకంటే తక్కువగానే ఉన్నారు. అక్కడ 50.40లక్షలమంది ఉన్నారు.
డ్రగ్‌ అడిక్ట్స్‌ను గుర్తించడమెలా?
డ్రగ్స్‌కు అలవాటు పడిన వారు స్థిమితంగా ఉండలేరు. ఊరికే ఉద్రేకపడిపోతుం టారు. దేనిపైనా దృష్టి నిలపలేరు. వ్యక్తిగత శుభ్రతపై శ్రద్ధ చూపించరు. మంచి దుస్తులు వేసుకోరు. వేళకు స్నానం చేయరు. మురికిగా కనిపిస్తారు. ఒళ్లు వణుకుతుండటం, మాటలు ముద్ద ముద్దగా వస్తాయి. రక్తనాళాల్లో రక్తప్రసరణ అధికంగా జరుగుతుంటుంది. వారి ధరించిన దుస్తులు నుండి చిత్రమైన వాసన రావచ్చు. కళ్లలో ఎర్రజీరలు కనిపిస్తాయి. కనుపాపలు సాధారణ స్థితి కంటే మరింతగా విప్పారినట్లుగానో లేదా మరింతగా కుంచించుకుపోయినట్లుగానో తయా రవుతాయి. అతిగా తినడం లేకుంటే ఆకలి మంద గించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గంటల తరబడి మత్తుగా నిద్రపోవడం లేదా నిద్రలే కుండా గంటల తరబడి గడపడం వంటి లక్షణా లు, ఫోన్‌ లో రహస్యంగా మాట్లాడటం ఎవ్వరి తోను కలవక పోవడం, ఎక్కువుగా బబుల్‌ గమ్‌, చూయింగ్‌ గమ్‌లు నమలడం, డోర్‌ లాక్‌ చేసు కుని గదిలోనే ఉండిపోవడం. ఇటువంటి లక్షణా లున్న వారు డ్రగ్స్‌ మాయలో చిక్కుకున్నట్లే.
సమిష్టి పోరుతో సత్ఫలితాలు
మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఎన్ని ప్రచారోద్యమాలు కార్యక్రమాలు చేపట్టినా వీటి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని అంతర్జాతీయ సమాజానికి మార్గనిర్దేశనం చేసినా, డ్రగ్స్‌ వినియోగం ఏమాత్రం తగ్గడం లేదు. ఉగ్ర వాదంవల్ల మరణి స్తున్నవారి కంటే ప్రపం చంలో మత్తుమందుల వల్ల కన్ను మూస్తున్నవారే ఎక్కువ ఉన్నారనేది అనేక సర్వేల్లో వెల్లడైంది. అంటే పూర్తిగా అదిప్రభుత్వ వైఫల్యంగానే చెప్పుకో వచ్చు. ప్రభుత్వాలు చేపడుతున్న ప్రతీ సర్వేలోను వీటి వినియోగం పెరిగినట్లు గణాంకాలు వస్తున్నా యి తప్ప అదుపులోకి వస్తున్న జాడ ఏ మాత్రం కనిపించడం లేదు.ఈ సమస్యకు శాశ్వత పరి ష్కారం దిశగా ముందుగా వ్యవస్ధ పునాదులును బలోపేతం చేయాలి. ఒకవైపు కఠిన చట్టాలను అమలుచేస్తూనే పిల్లలను మాదకద్రవ్యాల బారి నుంచి రక్షించుకొనేందుకు ప్రజాచైతన్య కార్యక్ర మాలు ప్రభుత్వాలు చేపట్టాలి.ఈ విషయమై ప్రభుత్వం చేపట్టే కార్యాచరణలో చిత్తశుద్ధి ఉం డాలి.అదే సమయంలో విద్యా వ్యవస్ధలో సమూల మార్పులు చేయాలి అంటే విద్యా బోధనలో నైతిక విద్యకు అగ్రతాంబూలం ఇవ్వాలి. విలువలు లేని విద్యా విధానం ఎన్ని చట్టాలు చేసినా ఇటువంటి విష సంస్కృతలకు ఎప్పటికి చరమ గీతం పాడలేం. యువశక్తిని నిర్వీర్యం చేస్తూ సకల అనర్ధాలకు, అరాచకాలకు అమానుష ధోరణులుకు కారణమై కోట్లాది జీవితాల్ని క్రూరంగా బలి గొంటున్న మాదక ఉగ్రవాదాన్ని ఉపేక్షించడం అనేది జాతి భవితకే తీరని చేటని గుర్తించి తల్లి దండ్రులు,విద్యాసంస్థలు,ప్రభుత్వాలు, సమాజం.. ఇలా అంతా కలసికట్టుగా దీనిపై పోరు సాగిస్తే తప్పక మాదక మహమ్మారిని తరిమి వేయడం సాధ్యం అవుతుంది.ఆనాడే వివేకవంతమైన సమాజం మన కళ్ళముందు సాక్షాత్కరిస్తుంది. ఇక్కడా అక్కడా అని కాదు.. ఇప్పుడు అప్పుడని కాదు.. ప్రపంచ వ్యాప్తంగా నేడు ఈ మాదకద్ర వ్యాల భూతం ఎల్లెడలా పంజా విసురుతూనే ఉంది. ప్రపంచాన్ని వణికిస్తున్న మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగతంగా మనిషి ఆరోగ్యం పైనే కాదు సమాజంపైనా తీవ్ర దుష్పరిమాణాలు చూపుతుంది. అందుచేతనే ప్రస్తుతం మానవాళిని పట్టిపీడిస్తున్న సమస్యల్లో ఉగ్రవాదం తరువాతి స్థానం మాదక ద్రవ్యాలదేనని ఐక్యరాజ్యసమితి స్పష్టీకరించింది. ప్రాధమిక విద్యను అభ్యసిస్తున్న చిన్నారుల నుండి 60సంవత్సరాల వయసు గల పెద్దల వరకూ భాగ్యవంత దేశాల నుండి అభి వృద్ధి చెందుతున్న దేశాల వరకూ అన్ని వర్గాల వారిని ఈమాదక మహమ్మారి మత్తుగా మింగేస్తూ ఉంది. జీవితాలను చిత్తు చేసే ఈ డ్రగ్‌ రక్కసి కోరల్లో మత్తు కోసం చిక్కుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతూ ఉంది. మత్తు కోసం మాదక ద్రవ్యాలకు బానిస అయిపోతారు. ఈ క్రమంలో వీళ్ళు గెలిచినా ఓడినా దానిని మత్తు లోనే పంచుకోవాలి అనే భావం వీరిలో క్రమేపీ బలపడిపోతుంది.
నేటి సమకాలీన సమాజంలో పరిశీలి స్తే పుస్తకాల తోటలో విహరిస్తూ పుస్తకాలు చదు వుతూ జ్ఞానాన్ని ఆర్జించవలసిన ఎందరో విద్యా ర్థులు పుస్తకాల అధ్యయనానికి బదులు పొగ పీలుస్తున్నారు. గురువులు చెప్పేది మెదడులో ఎక్కించుకోవడానికి బదులు మెదడుకు రసాయ నాల మత్తును ఎక్కిస్తూ మత్తులో తాత్కాలిక ఆనందాన్ని పొందుతూ రోజురోజుకు మాదక ద్రవ్యాల ఊబిలో కూరుకు పోతున్నారు. పట్టుమని పదహారేళ్లయినా నిండని ఈ టీనేజ్‌ పిల్లలు కిక్‌ కోసమో, థ్రిల్‌ కోసమో పొగతాగడం, మద్యం తీసుకోవడం వంటివి ముందుగా ప్రారంభిస్తారు. అయితే క్రమంగా ఇవి వదులుకోలేని వ్యసనాలుగా మారిపోతాయి.కానీ కాలక్రమంలో ఈ వ్యసనాన్ని సిగరెట్లతోనో, మద్యంతోనో సరిపెట్టుకోరు. మరింత థ్రిల్‌ కోరుకుంటారు. జీవితంలో తగిలే ఎదురుదెబ్బల నుంచి ఉపశమనం కోసం కొం దరు, స్తబ్దుగా మారిన బతుకులో కొంత ఉత్తేజం కోసం మరికొందరు డ్రగ్స్‌ వైపు అడుగులేస్తారు. సరదా కోసం ఒకటికి రెండుసార్లు వాడితే చాలు, వాటి మత్తులో పూర్తిగా కూరుకుపోతారు.
ఎవరు తెస్తున్నారో.. ఎలా సరఫరా చేస్తున్నారో తెలియదుకానీ డ్రగ్స్‌ మాత్రం బాగా అందుబాటు లోకి వచ్చాయి అనేది మాత్రం వాస్తవం. దేశం లో యువ శక్తిని నిర్వీర్యం చేస్తూ, అత్యంత విలు వైన మానవ వనరులను చీడ పురుగుల్లా తొలి చేస్తూ దేశ భవిష్యత్‌ను పెనుగండంగా మార్చి, మొత్తం సమాజాన్ని విచక్షణా రహితంగా వ్యస నాల ఊబిలోకి డ్రగ్‌ రక్కసి నిర్దాక్షిణ్యంగా నెట్టి వేస్తున్నది. ఈ సమస్యకు కారణం మాదక ద్రవ్యాల వినియోగం కన్నా ఖండాలు దాటి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణాగా చెప్పవచ్చు.
చరిత్ర..
మత్తు కోసం మత్తు కలిగించే పదార్ధా లను వాడటం ఈ మధ్య కాలంలో మొదల య్యింది మాత్రం కాదు. చారిత్రిక కాలం నుంచి ఈతరహా వ్యసనాలు అనేకం కనిపిస్తాయి. అయితే అప్పట్లో వాటికి వినియోగించిన పదార్ధాలు మాత్రం వేరు.మత్తు కోసం ఆనాడు ప్రకృతి సిద్ధం గా లభ్యమయ్యే మద్యం,గంజాయి,పొగాకు, నల్లమందు,మత్తునిచ్చే పుట్టగొడుగుల వంటి పదార్థాలను విరివిగా వాడుతుండేవారు. అయితే గత శతాబ్ద కాలం నుంచి పరిశీలిస్తే సాంప్రదా య మత్తు పదార్ధాలను తలదన్నే రీతిలో సింథటిక్‌ మత్తు పదార్థాలు ఎపిడ్రిన్‌,కొకైన్‌,ఓపియమ్‌ (నల్ల మందు),హెరాయిన్‌, బ్రౌన్‌షుగర్‌,కెటామైన్‌ పేరే దైతేనేం..ఈమత్తు పదార్థాలు ఎక్కువగా వాడుక లోనికి వచ్చేసాయి. గడచిన ఆరేడు దశా బ్దాల్లో వీటి తయారీ, సరఫరా, విక్రయాల విష యంలో మాఫియా ముఠాలు పనిచేయడం,ప్రభుత్వ నియంత్రణలు సత్ఫలితాలు ఇవ్వలేక పోవడం వలన ఈ మాదక ద్రవ్యాలు ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరించాయి. ఈమత్తు పదార్థాల విని యోగానికి క్రమేపీ యువత బానిసలు కావడం నేడు ఆందోళనకరంగామారి వారి పాలిట కాల కూట విషాలుగా పరిణమిస్తున్నాయి. ఫలితంగా యువత ఈ మాదక ద్రవ్యాల విషవలయంలో కూరుకుపోతున్నారు. వాస్తవంగా వీటి వినియోగం ద్వారా తాము బానిసలుగా తయారై జీవితాన్ని నాశనంచేసుకోవాలని ఎవ్వరూ అనుకోరు. అయితే చాలా మంది ఇది ఎలా ఉంటుంది? ఒక సారి రుచి చూద్దాం అనే కోరికతో మొదలై, దానికి బానిసలుగా మారే స్ధితికి వచ్చిన వారే అధికం. వీరితో పాటు డిప్రెషన్‌ కు గురయిన వారు, ఆందోళనలు ఎక్కువుగా ఉన్నవారు, సామాజికప రంగా వెనుకబడి ఉన్నవారు, ఆర్ధికంగా సమస్య లను ఎదుర్కొనే వారు, చదువులో వెనుకబడిన వాళ్ళు, కుటుంబం నుండి ప్రేమ ఆప్యాయతలు పొందలేని వాళ్ళు, తరచూ గొడవలు పడే భార్యా భర్తలు, జీవితంలో ఊహించని ఎదురుదెబ్బల నుంచి ఉపశమనం కోసమని, నిస్సత్తువగా మారిన బతుకులో కొంత ఉత్తేజం పొందాలని, ప్రేమలో విఫలమై ఆ బాధకు ఉపశమనం పొందాలనే ప్రయత్నంలో మాదక ద్రవ్యాలను ఆశ్రయిస్తు న్నారు. ఇంతకన్నా ముఖ్యంగా ఈనాటి ఆధునిక కుటుంబాల్లో దంపతులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండడం కారణంగా పిల్లలపై సరైన పర్య వేక్షణ ఉండడం లేదు. దీంతో తమను గమనించే వారు లేరన్న అవకాశాన్ని సరదా కోసం, ఫ్యాషన్‌, మోజు,స్నేహితుల ఒత్తిడి కారణాలతో మత్తు మందులు వినియోగానికి కొందరు అలవాటుపడు తున్నారు. చివరకు ఇది దీర్ఘ కాలిక సమస్యగా పరిణమించిన తరువాత ఆఉచ్చు నుండి బయట పడటం సాధ్యంకాక నిలువునా జీవితాలను బుగ్గి పాలు చేసుకుంటున్నారు.
భారత్‌లో మాదక ద్రవ్యాలు
మాదక ద్రవ్యాల విష సంస్కృతి మన దేశంలోకి కొంత ఆలస్యంగా వచ్చినప్పటికీ వ్యాప్తి మాత్రం చాప క్రింద నీరులా సాగుతూనే ఉంది. డ్రగ్స్‌ బానిసలు రోజు రోజుకు పెరిగిపోతున్న దేశాలలో భారత్‌ ఒకటి..! ఇటీవల కేంద్రం విస్తృతంగా నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలో యువత కొకైన్‌, హెరాయిన్‌, గంజాయి వంటి మత్తుమందుల వాడకం గత పదేళ్లలో ఐదింతలు పెరిగినట్లు తేలింది. ఇండియా క్రైమ్‌ బ్యూరో లెక్కల ప్రకారం మన దేశంలో డ్రగ్స్‌ తీవ్రంగా వాడడం వలన 14 లక్షల మంది పిల్లలు, 80 లక్షల మంది పెద్దలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారు. మాదకద్రవ్యాల వినియోగం కారణంగా దేశంలో ప్రతిరోజూ 23 మంది మరణిస్తున్నారని చెబుతున్న ఎన్‌సీబీ గణాంకాలు భారతావనిని కలవరపెడుతున్నాయి. మరొక పక్క మన దేశంలో సుమారు 15 కోట్లమంది మాదక ద్రవ్యాలకు బానిసలయ్యారని అంచనా. వీరందరికి ఇవి మొదట పబ్‌లు, క్లబ్‌లు,సినీ పరిశ్రమ ద్వారా సరఫరా అయితే ఇప్పుడు ఇవి నేరుగా విద్యా సంస్ధల చెంతకే అందుబాటులోనికి వచ్చేసాయి. కెల్విన్‌ అనే డ్రగ్‌ సరఫరాదారుడిని అదుపులో తీసుకున్న సందర్భంలో అతని వద్ద ఉన్న సమా చారం చూస్తే దాదాపు 130మంది పబ్లిక్‌ స్కూల్‌ చిన్నారులకు డ్రగ్స్‌ అందిస్తున్నట్లు తెలిసింది. దీనిని బట్టి స్కూల్‌ పిల్లలు కూడా ఈ ఉచ్చులో చిక్కుకు పోయారన్న చేదు నిజం బయట పడిరది.
ఐక్యరాజ్యసమితి విభాగమైన డ్రగ్స్‌ అండ్‌ క్రైమ్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన మాదకద్ర వ్యాలు ఉపయోగించేవారు 0.71శాతం ఉంటే, ప్రపంచ సగటు కంటే ఎక్కువగా ఇండియా లో 2.65శాతం ఈ ప్రమాదకరమైన డ్రగ్స్‌ వాడు తున్నారని తెలిసింది. భారత ప్రభుత్వం 1985లో నార్కోటిక్‌-డ్రగ్‌ అండ్‌ సైకోట్రాపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ చట్టాన్ని అమలులోనికి తెచ్చింది. అప్పటి నుండి పరిస్ధితులకు అనుగుణంగా1988,2001, 2004లో ఈచట్టానికి సవరణలు చేపట్టారు. అయినా డ్రగ్స్‌ ఇండియాలోకి రావడం మాత్రం తగ్గడం లేదు. దేశంలో ముంబై తర్వాత పంజాబ్‌ డ్రగ్స్‌ వినియోగంలో అగ్రగామిగా ఉంది. అక్కడ దాదాపు 30లక్షల మంది డ్రగ్‌ యూజర్లు ఉన్న ట్టు అంచనా.గంజాయిసాగు విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే ముందు వరుసలో నిలిచింది.మన దేశంలో ఒకప్పుడు మెట్రో నగరా లకు మాత్రమే పరిమితమైన ఈ మాదక ద్రవ్యాలు క్రమేపీ ద్వితీయ శ్రేణినగరాలకు చివరకు గ్రామా లకు సైతం విస్తరించి ఎల్లెడలా మత్తు వాసనలు గుప్పు మంటున్నాయి. విదేశాల నుంచి తరలి వస్తున్న డ్రగ్స్‌తో పాటు స్దానికంగా నెలకొన్న ఔషధ పరిశ్రమలలో తయారయ్యే మత్తు పదార్థా లు వీటికి తోడవుతున్నాయి.
గతంలో యువకులు ఏర్పాటు చేసుకునే పార్టీలలో మద్యం ఏర్పాటు చేసుకునే వారు. అయితే ఇప్పటి పార్టీలలో మద్యంకు బదులు మాదక ద్రవ్యాలు చేరాయి. ఉన్నత విద్యా సంస్ధలలో విశ్వ విద్యాల యాల్లో చివరకు పబ్లిక్‌ స్కూల్స్‌లో సైతం మాదక ద్రవ్యం ఉదంతాలు మనం నిత్యంచూస్తూ ఉన్నాం. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం 1985లోనే మాదక ద్రవ్యాల వ్యతిరేక చట్టం‘ఎన్‌డీపీఎస్‌’ తీసుకువచ్చింది. తర్వాత ఎప్పటికప్పుడుపలు సవరణలు చేస్తూ ఈ చట్టాన్ని పటిష్టం చేసింది. అయితే ఈ చట్టం కాగితాలకే పరిమితం అయ్యింది. ఫలితంగా ప్రపంచం మొత్తంమీద మత్తులో జోగుతున్న దేశా ల్లో భారత దేశం ముందు వరుసలో నిలవడం భావి భారతానికి అత్యంత ఆందోళన కలిగించే విషయం.
డ్రగ్స్‌కు ఆకర్షితులు కావడానికి కారణాలు..
ప్రేమపూర్వకమైన వాతావరణం లేని ఇళ్లలోని పిల్లలు, ఆత్మవిశ్వాసంలేని వాళ్లు జీవి తంలో తగిలే ఎదురుదెబ్బల నుంచి ఉపశమ నం పొందాలనుకునే వాళ్ళు, ఒంటరితనం, ఓట మిని తట్టుకోలేని వాళ్ళు, చదువులు బుర్రకు ఎక్కక పోవడం, చెడు స్నేహాలు..ఒత్తిడిని తట్టుకోలేని సున్నిత మనస్కులు. పట్టణాలకు పెరుగుతున్న వలసలు.పెరిగిపోతున్న సామాజిక, ఆర్థిక అంత రాలు.కనుచూపుమేరలో దొరికే మత్తు పదార్థాలు. పరీక్షలో, ప్రేమలో, ఫెయిల్‌ అయినవారు, స్తబ్దుగా మారిన బతుకులో కొంత ఉత్తేజం కోసం ఎదురు చూసే వాళ్ళు పాశ్చాత్య పోకడలు, టీవీ, సినిమా, మీడియా ప్రభావం ఇత్యాదికారణాలవల్ల యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ విలువైన కాలాన్ని, ఆరోగ్యాన్ని, జీవితాన్ని కోల్పోతున్నారు. కిక్‌ కోసమో, థ్రిల్‌ కోసమో ప్రారంభించిన ఈ అలవాట్లు కాల గమనంలో ఇవి వదులుకోలేని వ్యసనాలుగా మారి క్రమేపీ యువత వీటికి బాని సలై బలైపోతున్నారు. ఒక్కసారి ఈడ్రగ్స్‌ విష వలయంలో చిక్కుకుంటే చాలు, మరలా వెనక్కి తిరిగి రావడం చాలా కష్టం. ఈలోపు కెరీర్‌ అంతా సర్వనాశనం అవుతుంది. యువత దీనికి ఎక్కువ ఆకర్షితులవుతున్నారు.డ్రగ్‌ వ్యసనం నుండి వెనక్కి తిరిగి రాలేని వాళ్ళు మరణం పాలవు తున్నారు. కొందరైతే డ్రగ్స్‌ లభించక బలవన్మ రణం పాలవుతున్నారు. మాదక ద్రవ్యాల వినియో గంలో బానిసలుగా చిక్కుకున్న యువతను దాని నుంచి బయటపడేసే విషయంలో ప్రభుత్వాలు సామాజిక సంఘాలు తమ వంతు కృషి జరుపు తున్నప్పటికీ డ్రగ్స్‌ మాఫీయా మాత్రం వెనుకడుగు వేయడం లేదు.ఎవరు తెస్తున్నారో.. ఎలా సరఫరా చేస్తున్నారో తెలియదు కానీ పోలీసులు, నిఘా సంస్ధల కళ్ళు కప్పి రహస్య ప్రాంతాల్లో ఈ డ్రగ్స్‌ దందా నిరాటంకంగా కొనసాగుతూ ఉంది. ఈ విషయంలో స్ధానిక ముఠాలు,అంతర్జాతీయ గ్యాంగులు మార్కెట్‌లో మాదక ద్రవ్యాలను కుమ్మ రిస్తూనే ఉన్నాయి. మాదకద్రవ్యాల ఉత్పత్తి, సర ఫరా,సేవనం విషయంలో కఠిన చర్యలు తీసు కుంలున్నప్పటికీ డ్రగ్స్‌మాఫియా తమ కార్య కలా పాలను మాత్రం నిర్విఘ్నంగా కొనసాగిస్తుంది.
మాదకద్రవ్యాలు తెచ్చే అనర్ధాలు
శారీరక ఆరోగ్యం,మానసిక ఆరో గ్యం,సామాజిక ఆరోగ్యం ఈమూడు కూడా సం పూర్ణ ఆరోగ్యానికి ప్రధాన హేతువులు. అయితే మాదక ద్రవ్యాల వినియోగం ద్వారా ఈ మూడు నశించి పోతున్నాయి. వీటి వినియోగం ద్వారా ప్రాధమికంగా విచక్షణ కోల్పోతారు. మాదకద్ర వ్యాలు,ఉత్ప్రేరకాలకు ఒకసారి బానిసలైన తర్వాత వీటిని పొందటం కోసం ఎంతటి అకృత్యాలు, అత్యాచారాలు, నేరాలు చేయడానికైనా యువత వెనుకాడరు. డ్రగ్స్‌ నేరుగా మెదడుపైన, కేంద్ర నాడీ వ్యవస్థపైన ప్రభావం చూపుతాయి. ఇది డ్రగ్స్‌ వల్ల తలెత్తే తక్షణ దుష్ప్రభావం. వీటిని వాడుతుండే కొద్దీ శరీరంలోని ఇతర వ్యవస్థల పైనా దారుణమైన దుష్ప్రభావాలు పెరిగిపోతా యి. చివరకు అకాల మరణాలకు కారణమవు తాయి. డ్రగ్స్‌ వల్ల శరీరానికి వాటిల్లే ప్రధానమైన అనర్థాలు చూస్తే.. గుండె లేదా ఊపిరితిత్తుల వ్యాధి, కేన్సర్‌, మానసిక అనారోగ్యం, హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ సంక్రమించే అవకాశాలు ఎక్కువ. ప్రదానంగా రోగనిరోధక వ్యవస్థ బాగా దెబ్బతిం టుంది. జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతిని, శరీరం శుష్కించిపోతుంది. లివర్‌పై విపరీతమైన ఒత్తిడి ఏర్పడి, చివరకు అది పూర్తిగా పనిచేయని స్థితి ఏర్పడుతుంది.
ఊపిరితిత్తుల పనితీరు మందగింపు
రక్తనాళాలు కుంచించుకుపోయి, రక్తప్రసరణకు ఆటంకాలు ఏర్పడతాయి. జ్ఞాపకశక్తి క్షీణించ డంతో పాటు ఏకాగ్రత లోపిస్తుంది. మెదడు దెబ్బతిని మూర్ఛ, పక్షవాతం వంటి పరిస్థితులు కూడా తలెత్తుతాయి. మూత్రపిండాలు దెబ్బతిన డం వంటి దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి. ఎదురు గా ఏం జరుగుతోందో అర్థంచేసుకోలేని గందర గోళ పరిస్ధితి ఏర్పడుతుంది. పరిస్థితులను గ్రహిం చి వాటికి అనుగుణంగా స్పందించే శక్తి పూర్తిగా నశిస్తుంది. మత్తుకు బానిసలుగా మారి విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతారు. వైద్య నిపుణుల పరిశోధ నలు ప్రకారం మాదక ద్రవ్యాలకు బానిస అయిన వారిలో 25 శాతం మంది శారీరక సమస్యలకు గురవుతారు.42శాతం ఒత్తిడికి,మానసిక సమస్య లతో బాధపడతారు. 25 శాతం మంది భార్యల నుండి విడాకులు కోరుతున్నారు.40శాతం నేర పూరిత ఆలోచనలతో గడుపుతున్నారు. యువత విషయంలో చూస్తే 45శాతానికి పైగా సెక్స్‌ లో విఫలమవుతున్నారు.24 శాతం మంది స్థూల కాయంలాంటి సమస్యలతో బాధపడుతుంటారు. మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన యువత వారి అలవాట్లను అవసరాలను తీర్చుకునే నేపథ్యంలో సంఘ విద్రోహుల వలలో చిక్కి, అసాంఘిక శక్తులుగా మారుతున్నారు. వీటి ఫలి తంగా ఉత్సాహంతో ఉరకలెత్తాల్సిన యువత, జవసత్వాలు సన్నగిల్లి యవ్వనంలోనే శారీరకం గా మానసికంగా నిర్వీర్యమైపోతున్నారు.ఈ విధంగా డ్రగ్స్‌ మత్తులో పడి యువత నిర్వీర్యమై పోయిన దేశాలు మన కళ్ల ముందే ఎన్నో ఉన్నాయి. మానవ అక్రమరవాణా, దోపిడీలు, హత్య లు, గృహ హింస, వేధింపులు వంటి ఎన్నో నేరాలకు డ్రగ్స్‌ వినియోగమే మూల కారణమవు తోంది. ఏది ఏమైనా ఈ మాదక మహమ్మారి వినియోగం, దానికి బానిస కావడమనేది తల్లిదం డ్రుల కలలనే కాదు, మన దేశ భవిష్యత్తునే కాల రాస్తోందని చెప్పవచ్చు.
నివారణ సాధ్యమే
ఆరోగ్యాన్ని ఛిద్రం చేసి ఆయుష్షును హరించే ఈ మత్తు మహమ్మారి విష వలయంలో చిక్కుకున్న తరువాత దాని నుంచి బయటపడటం కష్టమే కానీ అసాధ్యం కాదనే చెప్పాలి. ఇందుకు అందుబాటులో ఉన్న మార్గాలలో మందులు, కౌన్సిలింగ్‌, బిహేవిరియల్‌ థేరపీ వంటి వాటి ద్వారా బయట పడవచ్చు. కాకపోతే, దీనికి కాస్త సమయం, సహనం, కృషి కావాలి. ఇది దీర్ఘకాల ప్రక్రియ. దీనికి కుటుంబం సహకారంతోపాటు వైద్య నిపుణుల అవసరం కూడా తోడవ్వాలి. ప్రధానంగా మాదకద్రవ్యాల బారి నుంచి బయట పడాలనే గట్టిసంకల్పం డ్రగ్స్‌ వాడే వారిలో ఉండాలి. అయితే ఇలా సంకల్పించిన ప్రతీ సారి ఏదో ఒక విఘ్నం తారసపడుతూనే ఉంటుంది. అటువంటి సందర్భంలో నిగ్రహంగా నిలబడి వైద్యుల సలహాలు కుటుంబ సభ్యుల సహకారం మానసిక వైద్యుల కౌన్సిలింగ్‌ తీసుకోవడం అనేది చాలా కీలక పాత్ర వహిస్తుంది.ఎందుకంటే వీరు డ్రగ్స్‌ వాడకానికి దోహద పడిన కారణాలు విశ్లేషణ చేసి దాని నుండి బయట పడటానికి అవసరమైన కౌన్సిలింగ్‌ మానసిక వైద్యులు అందిస్తారు.మాదక ద్రవ్యాల ఉచ్చు నుండి బయట పడాలంటే ముందుగా దానికి దోహద పడిన కారణాలు నిర్ములించాలి. ఇది కేవలం మానసిక వైద్యుల కౌన్సిలింగ్‌ ద్వారానే సాధ్యమవుతుంది. ఇవన్నీ తీసుకుంటూ సడలని మనో సంకల్పంతో నిలబడగలిగితే ఈవిషవలయం నుండి బయట పడటం అసాధ్యం ఏమీ కాదు. ఇవన్నీ పాటిస్తూ డ్రగ్స్‌కు బానిస అయిన వాళ్ళుకూడా గట్టి సం కల్పంతో ఈ విషవలయం నుండి బయట పడిన వాళ్ళు ఎందరో ఉన్నారు.
తల్లిదండ్రులదే ప్రధాన బాధ్యత
చాలా మంది తల్లి తండ్రులు తమ పిల్లల విషయంలో మార్కులు ర్యాంకులు మాత్రమే పరమావిధిగా చూస్తున్నారు తప్ప తమ పిల్లల మానసిక పరివర్తన వ్యవహారశైలి గురించి పట్టించుకోవడంలో శ్రద్ద చూపడం లేదు.వారికి కావలసిన పాకెట్‌ మనీ అందచేస్తూ వాళ్ళు ఏ విధంగా ఖర్చు చేస్తున్నది అసలు పరిశీలించడం లేదు. తల్లితండ్రులలో ఎక్కువ మంది తమ పిల్లలు బుద్ది మంతులని ఇల్లు బడి తప్ప మరొక ప్రపంచం తెలియదు అంటూ పిల్లలపై అపార నమ్మకం చూపిస్తారు. పిల్లలపై నమ్మకం, ప్రేమ చూపించడంలో తప్పులేదు. చూపించాలి కూడా. అయితే అదే సమయంలో ఆనమ్మకం అతి కాకూడదు. నిజంగా ఆడ్రగ్‌ మహమ్మారి మన ఇంట్లోనే మన పిల్లల చెంత తిష్ట వేసినప్ప టికీ దానిని గమనించే అవకాశాన్ని మనకు ఇవ్వదు. ఈ స్ధితిలో పరిస్ధితి చేయి దాటి పోయిన తరువాత బాధపడి ప్రయోజనం ఉండదు. అందుచేత ప్రతీ తల్లితండ్రులు తమ బిడ్డపై నమ్మ కంతో పాటు బిడ్డ వ్యవహార శైలి బట్టి అను మానం కూడా కలగాలి. అప్పుడే పెను ప్రమాదం నుండి బిడ్డను బయట పడేసే అవకాశం మనకు చిక్కుతుంది.ఈ విషయంలో తల్లి తండ్రులదే కీలక పాత్ర అని చెప్పడంలో ఎటువంటి సందే హం లేదు.డ్రగ్స్‌ బారిన పడిన వారిని దండిర చడం, బెదిరించడం, వారితో వాదించడం వారిని చిన్నబుచ్చకునేలా చేయడం ఆత్మన్యూనత కలిగేలా వ్యవహరించడం వంటి చర్యలు ద్వారా వారిని డ్రగ్స్‌ వ్యసనం నుంచి ఎట్టి పరిస్ధితులలో కూడా బయట పడేయలేమని ముందుగా తల్లి తండ్రులు గుర్తించాలి. డ్రగ్స్‌ వాడకం వలన తలెత్తే దుష్పరి ణామాల గురించి పిల్లలకు చాలా ఓపికగా వివరించాలి. ఈ వ్యసనం నుండి బయటపడితే సమాజంలో మనం తిరిగి గౌరవ ప్రద జీవితాన్ని పొందగలం అనే ఆశాజనకమైన ప్రేరణ కలిగిం చే మాటలు చెప్పాలి. దానివలన ఖచ్చితంగా అనుకూల ప్రభావాన్ని సాదించవచ్చు.
ఔషధం కన్నా కౌన్సిలింగే కీలకం
నేడు వైద్య విధానంలో డ్రగ్స్‌ నుండి విముక్తి చేయడానికి అనేక ఆధునిక ప్రక్రియలు అందుబాటులోనికి వచ్చినా డ్రగ్స్‌ బారిన పడిన వారిని బయట పడేయడానికి ఔషధాలు కన్నా కౌన్సిలింగ్‌ చాలా బలమైన ప్రభావం చూపిస్తుంద నడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మాదకద్రవ్యాలకు బానిస కావడం అనేది ఒక జబ్బు.వాటికి అలవాటు పడిన వాళ్ళను మనం ఒక రోగిలా మాత్రమే చూడాలి తప్ప నేరగాడిలా చూడకూడదు. పిల్లవాడిని నిర్బంధిస్తే ఆ మహ మ్మారి నుంచి బయట పడేయవచ్చు అని భావించే తల్లి తండ్రులు లేకపోలేదు. ఈ తరహా అభిప్రా యం సమస్యను మరింత జఠిలం చేస్తుంది తప్ప పరిష్కారం మాత్రం లభించదు.డ్రగ్స్‌ ఊబి నుంచి బయట పడాలంటే వైద్య సహాయం ఎంత అవసరమో కుటుంబ సభ్యుల సహకారం అంత కన్నా ఎక్కువ అవసరం. అందుచేత వైద్యులు రోగి కన్నా ముందు కుటుంబ సభ్యులకు కౌన్సి లింగ్‌ ఇస్తారు. ఇది వీరు పాటించగలిగితే తప్పక మంచి ఫలితాలు లభిస్తాయి. పిల్లవాడిని నువ్వు చేస్తున్నది తప్పుఅని చెప్పకుండా కౌన్సిలింగ్‌ ద్వారా తాను చేస్తున్నది తప్పు ఈఉచ్చు నుంచి నేను బయట పడాలి అనే సంకల్పం ప్రారంభం అయ్యే విధంగాచూడాలి. ఇదికనుక పిల్ల వాడిలో మనం రప్పించగలిగితే సగం విజ యం సాధించి నట్లే. దీనిని బట్టి ఔషధం కన్నా కౌన్సిలింగ్‌ కీలకం అని వైద్యుల చేపట్టిన అనేక కేసుల ద్వారా స్పష్టం అయ్యింది.
మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ట చర్యలు
విశాఖపట్నంజిల్లాలో మాదకద్రవ్యా ల రవాణాను అరికట్టేందుకు పోలీసుశాఖ తీసు కున్న చర్యల ఫలితంగా దాదాపు రెండేళ్లుగా కేసులు తగ్గుతూ వస్తున్నాయని జిల్లాకలెక్టర్‌ డా.ఎ.మల్లిఖార్జున పేర్కొన్నారు. పోలీస్‌ శాఖ, నగర పోలీస్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వార్షిక నేర సమీక్ష సమావేశం డిసెంబర్‌ 27న ఏయూ కన్వెన్షన్‌ సెంటరులో జరిగిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ డా.ఎ.మల్లిఖార్జునతోపాటు నగర పోలీస్‌ కమిషనర్‌ డా.ఎ.రవిశంకర్‌, జాయింట్‌ కలెక్టర్‌ కె.ఎస్‌.విశ్వనాథన్‌,జీవీఎంసీ కమిషనర్‌ సీఎం సాయి కాంత్‌ వర్మ, డీసీపీలు పి వెంకటరత్నం, కె.ఆనంద్‌ రెడ్డి, కె. శ్రీనివాసరావులు, రెవిన్యూ, జ్యుడీషియల్‌, ఇతర శాఖల అధికారులు హాజర య్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లా డుతూ జిల్లా స్థాయి కమిటీ సభ్యుల సూచనల మేరకు పోలీసు శాఖ తీసుకున్న చర్యల వలన మాదకద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టడంలో, నివారించడంలో ప్రజలు, కళాశాల విద్యార్థుల్లో కూడా అవగాహన పెరిగినట్లు చెప్పారు. వి.ఎం. ఆర్‌.డి.ఏ, జి.వి.ఎం.సి.పోలీసు శాఖల సహకా రంతో నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు తగ్గి ప్రమా దాల సంఖ్య కూడా తగ్గినట్లు కలెక్టర్‌ తెలిపారు. దీనికి పోలీసు, ఇతర శాఖల సహకారం కూడా ఉందన్నారు. నగర పోలీస్‌ కమిషనర్‌ డా.ఎ. రవిశంకర్‌ మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రావ్యల అక్రమ రవాణాను అరికట్టేందుకు గట్టి నిఘాతో పాటు పటిష్ట చర్యలు చేపట్టినట్లు చెప్పారు. నగర పోలీసు అధికారులు మరింత సమర్ధవంతంగా పోలీసింగ్‌ చేయడానికి అవసరమైన విధానాల గురించి పేర్కొన్నారు. తమ శాఖ నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, ఈ ఏడాది కాలంలో నగరంలో లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌, క్రైమ్‌లపై ఆయా అధికారులతో విశ్లేషించిన ఆయన ఉత్తమ పోలీసింగ్‌ కోసం రాబోవు సంవ త్సరంలో తీసుకోవలసిన చర్యలను వివరించారు. సమావేశంలో ఎస్‌.ఇ.బి అడిషనల్‌ ఎస్‌.పి బి.శ్రీనివాసరావు,ఉపరవాణా కమీషనర్‌ జి.సి. రాజరత్నం,ఆర్డీవోలు హుస్సేన్‌ సాహెబ్‌,భాస్కర రెడ్డి, ఎన్‌.హెచ్‌.ఎ.ఐ. ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ప్రభాత్‌ రంజన్‌,డీఈవో కె.చంద్రకళ, సమగ్రశిక్ష ఏ.పి.సి శ్రీనివాసరావు, నగర ఏ.డి.సి.పిలు, ఏ.సి.పిలు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

విధి విసిరే చివరి అస్త్రం ముసలితనం

వృద్ధాప్యపు బందిలదొడ్డిలో నువ్వు ఒంటరివి.వృద్ధోపనిషత్‌లోని ప్రతీ పేజీ ‘మసకే’, సాయం తక్కువ. సలహాలు ఎక్కువ. మనిషి ఏడో ఋతువే ‘‘వృద్ధాప్యం’’.కాలధర్మంలో దేహధర్మమే ‘‘వృధ్ధాప్యం’’.మంచం మీద వెల్లకిలా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటావు. గగనంలో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి. ఈ లోకంలో పుట్టిన ప్రతీవాడు’’వృద్ధోపనిషత్‌’’లో భాగస్వామి కాక తప్పదు.
జీవితం భళ్లున తెల్లవారుతుంది. మెల్లగా చీకటి పడుతుంది. వృద్ధుడికి వెన్నుపై కళ్ళుంటాయన్న ఓ నానుడి వుంది. అంటే వృద్ధాప్యంలో వెనుక చూపే తప్ప ముందు చూపు వుండదు. జీవితంలో మనం ఎన్నో సాధించి ఉండవచ్చు గాక.
మన కీర్తి నాలుగు దిక్కులా ప్రసరించి ఉండొచ్చుగాక అయితే వృద్ధాప్యంలో దాన్నెవరూ గుర్తించరు. అసలు పట్టించుకోరు. ఓసారి సీనియర్‌ సిటిజన్‌ బడిలోకి అడుగుపెడితే సమాజం మనగురించి పట్టించు కోదు. పాత వస్తువులా ఓపక్కన పడేస్తుంది.‘‘ఆరోజుల్లో నేను’’ అంటూ గత వైభవ చర్విత చర్వణం తప్ప భవిష్యత్‌ ఆలోచన వుండదు.
కాళ్ళు,కీళ్ళు,ఒళ్ళు సడలి,కదల్లేక,మెదల్లేక,దేహాన్ని వదల్లేక, ఏమీ చేయలేక, వృద్ధులు పడే మనోవ్యధ అంతా ఇంతాకాదు.వృద్ధాప్యం అనేసరికి అదేదో శాపంగా భావిస్తుంటారు జనం. నిజానికి వృద్ధాప్యం శాపమోపాపమో కాదు. అది ప్రకృతి పరమధర్మం. వృద్ధాప్యంరాగానే బయటి వాళ్ళు సరే కుటుంబసభ్యులు కూడా చులకనగాచూస్తారు. నిన్న మొన్నటిదాకా తలొంచిన వానపాములు సైతం తలెగరేసి, నిలదీస్తాయి. లెక్కలు అడగటం మొదలెడతాయి. ‘‘ఏమండీ / నాన్నగారూ.’’ అంటూ విధేయంగా వుండే భార్యాపిల్లలు కూడా ధిక్కరించడం మొదలు పెడతారు. వాళ్ళేదో పుడిరగులన్నట్లు లేనిపోని సలహాలు, సూచనలిస్తుంటారు. ఏంమాట్లాడినా,యేం చేసినా వాళ్ళకు నచ్చదు సరికదా ‘చాదస్తం’ అంటూ కరివేపాకులా తీసిపారేస్తారు. లోకువ గా చూస్తారు. మధ్యతరగతి కుటుంబం అయితే,మనం సంపాదించిన డబ్బు ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా? లేక చూసీ చూడనట్టు మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో మన పక్క గదిలో మనవాళ్ళే చర్చిస్తూ ఉంటారు.అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకువ వస్తుంది. పక్క గదిలోని వారికి నిద్రాభంగం చేయాలా వద్దా అన్న ఆలోచన తోనే తెల్లవారుతుంది. ఆరాత్రి నిద్ర కరువవుతుంది.
చివరి మజిలీ !!
మనిషి జీవన ప్రయాణంలో చివరి మజిలీ వృద్ధాప్యం. మనం కాదనుకున్నా కూడా కోరి వస్తుంది వృధ్ధాప్యం. మనిషి జీవితం ఋతువు లతో ముడిపడి వుంటుంది. వసంత ఋతువుతో మొదలయ్యే కాలం శిశిరంతో ముగుస్తుంది. వసంతకాలం మన పుట్టుక అనుకుంటే,శిశిరం వృద్ధాప్యం. వసంతంలో ప్రకృతి ఆకుపచ్చగా,రంగురంగుల పూలతో మురిపిస్తుంది.మనసు ఉల్లాసభరితమవుతుంది. ఇక శిశిరానికొచ్చేసరికి ఆకులు పండి, ఎండి, రాలి, చెట్లు మోడులవుతాయి. అలాగే వృద్ధా ప్యంలో మనిషి దేహం కూడా ఒడలి, ఎండిన మోడవుతుంది. అయితే వృద్ధాప్య దశకు చేరుకున్నారంటే జీవితంలో వాళ్ళు ఎన్నెన్ని చూసివుంటారు. ఎంత అనుభవంగడిరచి వుంటారో!ఒక్క సారి ఆలోచిస్తే తెలుస్తుంది. అందుకే వృద్ధుల్ని భారంగా కాకుండా గౌరవంగా చూడాలి.వారి అనుభవాన్ని యువతరం చూపుడువేలుగా తీసుకొని ముందుకు నడవాలి.అప్పుడు వాళ్ళ భవిష్యత్తు మహత్తరంగా వుంటుంది.కానీ దురదృష్టం యేమంటే, వృద్ధుల్ని గౌరవించడం అటుంచి అసలు లెక్కేచేయరు. కొందరైతే ముసలాళ్ళను భరించలేక వృద్ధాశ్రమాల పాలు చేస్తారు. ఇవాళ మనం చేసిందే రేపు మన పిల్లలు కూడా చేస్తారన్న సోయి ఏమాత్రం వుండదు. ఏతావాతా వృద్ధాప్యం శాపంగా మారుతుంది. యవ్వనంలో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ మానేసి ఆ డబ్బు పిల్లల కాలేజీ ఫీజు కట్టేస్తాం. మధ్య వయసులో సంపాదించింది ఖర్చుపెట్టి పిల్లల్ని విదేశాలకు పంపుతాం. నాకొడుకు అమెరికా లోనో, ఇంకేదో దేశంలో వున్నాడనో, కూతురు ఆస్ట్రేలియా లోనో ఇంకేదో దేశంలో ఉన్నదనో గర్వంగా చెప్తూ ఫాల్స్‌ ప్రిస్టేజి ఫీలవుతాం. అంతా బాగానే వుంటుంది. పిల్లలూ విదేశా ల్లో సెటిలైపోయి బాగుంటారు. మన వృద్ధా ప్యంలో మాత్రం వాళ్ళు కనీసం చూడటానికి కూడా రారు. అప్పుడప్పుడు సీజనల్‌గా వచ్చే సెల్‌ ఫోన్‌ కాల్స్‌ తోనే సరిపెట్టుకోవాలి. తృప్తి పడాలి. కొడుకో, కూతురో,మనవడో గుర్తొచ్చి, వాళ్ళతో మాట్లాడాలని ఫోన్‌ చేస్తే ‘సారీ.! బిజీ.’ అంటూ సమాధాన మొస్తుంది.పుట్టిన కొత్తలో పక్క మీద శిశువు నెలల తరబడి కదలకుండా ఎలా ఉంటుందో, వృద్ధాప్యంలో తిరిగి అదే పరిస్థితి సంభవిస్తుంది. అయితే ఒకటే చిన్నప్పుడు ఆలనాపాలనా చూసుకోవ టానికి కన్నతల్లి ఉంటుంది. వృద్ధాప్యంలో ఎవరూ వుండరు. అదృష్టం బాగుంటే అప్పుడ ప్పుడూ వచ్చి పలకరించే కూతురు తప్పదన్న ట్టు సేవలు చేసే కోడలూ వుండొచ్చు. అనాథా శ్రమంలో అయితే వాళ్ళుకూడా ఉండరు. అయితే ఇది అందరికీ జరుగుతుందని కాదు.కొందరుంటారు అదృష్టవంతులు తల్లిదండ్రుల్ని ప్రేమించే పిల్లలూ వుంటారు. అలాంటివాళ్ళు తల్లిదండ్రులు వృద్ధులైనా నెత్తిన పెట్టుకొని ఎంతో ప్రేమతో చూసుకుం టారు. బతుకంతా బుద్ధిబలం మీద ఆధార పడ్డ వారికి ముసలితనం కన్నా పెద్ద శిక్ష వుండదేమో? బాగాబతికిన మహామహులే ముసలితనం రాగానే దిగజారి హీనమై పోవడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి అవస్థనుతలుచుకుంటేనే భయమేస్తుంది. భగవాన్‌.!ఇలాంటి దురవస్థ ఎవరికీ రాకూడదు. ఇందులో నుంచి అందర్నీ తప్పించు తండ్రీ.
వృద్ధాప్యం శాపం కాదు..ఓ వరం.
ఏకాంతంలో సంగీతాన్ని వింటూ కాలక్షేపం చెయ్యొచ్చు.ఓపిక, సదుపాయముంటే పెరటి మొక్కల్ని పరిరక్షిస్తూ కాలం గడపోచ్చు.చిన్న పిల్లలుంటే కొద్ది సేపు వారికి ఇంటరెస్టు ఉన్న టాపిక్స్‌ కబుర్లు చెప్పుకోవచ్చు, ఆడుకో వచ్చు.ఏం చేసినా అఫెక్షన్‌ బ్యాంక్‌లో ఆప్యాయతని క్రెడిట్‌ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే మనం మానసికంగా ఇలా ప్రిపేర్‌ అవుతామో?మన వృద్ధాప్యాన్ని ఓ పది సంవత్సరాలపాటు వాయిదా వెయ్యొచ్చు. సో..ఇప్పటికే సీనియర్‌ సిటిజన్స్‌ అయిన వారు, భవిష్యత్తులో సీనియర్‌ సిటిజన్స్‌ కాబోయేవారు జీవితాల మీద ఓలుక్కేసి వుంచుకోండి.!?
వృద్ధాప్య సంరక్షణ కోసం కొత్త దృష్టి
భారతదేశం పెరుగుతున్న పట్టణీకరణ మరియు కుటుంబాలు చిన్న యూనిట్లుగా విడిపోవడంతో,వృద్ధుల కోసం గృహాలు పుట్టుకొచ్చాయి. వృద్ధుల సంరక్షణ అనేది వృద్ధాప్య సేవలపై ఆసక్తి ఉన్న నిపుణులు లేదా స్వచ్ఛంద సంస్థలచే నిర్వహించబడు తుంది. అర్బన్‌ మరియు సెమీ అర్బన్‌ ఇండి యాలో ఇటువంటి సంరక్షణ గృహాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ గృహాలు చెల్లించ బడతాయి లేదా ఉచిత లేదా సబ్సిడీ సేవను అందిస్తాయి. సాధారణంగా, ఇటువంటి గృహాలు ప్రభుత్వం నుండి మద్దతుతో ఎన్‌జీఓ లు మతపరమైన లేదా స్వచ్ఛంద సంస్థలు లేదా స్థానిక పరోపకారిచే నిర్వహించబడ తాయి.వారు తమ నివాసి తులకు వసతి, సకాలంలో సంరక్షణ మరియు భద్రతా భావాన్ని అందిస్తారు.ఈ గృహాలకు నియం త్రణ పర్యవేక్షణ లేకపోవడంతో సేవ యొక్క నాణ్యత మారుతూ ఉంటుంది. చాలా గృహా లలో స్పష్టంగా స్థాపించబడిన ప్రామా ణిక ఆపరేటింగ్‌ విధానాలు లేవు మరియు ఆరోగ్య సంరక్షణకు వారి రిఫరల్‌ మార్గాలు అనధికారి కంగా ఉంటాయి. వారి నివాసితుల మానసిక ఆరోగ్యంపై ఈగృహాల ప్రభావంతో సహా అటు వంటి సంస్థలలో జీవన నాణ్యతను అర్థం చేసుకోవడం అత్యవసరం.వృద్ధుల గృహాలకు అధికారిక విధానం భారతదేశానికి ఒక ముఖ్యమైన విధానం మరియు ప్రణాళిక సమస్య. భారతదేశం యొక్క వృద్ధాప్య జనాభా (60 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) 2050 నాటికి దాదాపు 8% నుండి దాదాపు 20%కి పెరుగుతుందని వరల్డ్‌ పాపులేషన్‌ ఏజింగ్‌ రిపోర్ట్‌ పేర్కొంది.2050 నాటికి, వృద్ధుల శాతం 326 పెరుగు తుంది, 80 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయ స్సు ఉన్న వారి సంఖ్య 700 పెరగ నుంది, దీనితో వారు భారతదేశంలో అత్యంత వేగం గా అభివృద్ధి చెందుతున్న వయస్సు గల సమూ హంగా మారతారు. ఈ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, మా పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ మరియు సామాజిక ప్రతిస్పందనలు ఈవాస్తవి కతకు అనుగుణంగా ఉండటం చాలా అవసరం. వృద్ధాప్యం అంటే భారమేనా?
జీవన ప్రమాణాలు పెరిగినందుకు సంతోషించాలా? వయోభారాన్ని పెద్దలు మరికొంతకాలం మోయాల్సి వస్తున్నందుకు చింతించాలా? అత్యాధునిక వైద్య పరిజ్ఞా నానికి మురిసిపోవాలా? కార్పొరేట్‌ దవాఖా నల మోతలను తలుచుకునివణికి పోవాలా? ఎలా చూసినా.. వృద్ధాప్యం సంక్షోభంలో పడుతున్న ఛాయలే కనిపిస్తున్నాయి.వయసుతో పాటు వచ్చే ఆరోగ్య సమస్యలతో పాటు.. ఆర్థికం నుంచి సామాజికం వరకు అనేకానేక సవాళ్లు చిరాకుపెడుతుంటాయి. వాటన్నిటికి పరిష్కారాలు అసాధ్యం కానేకాదు. ముందు జాగ్రత్తతో, పరిపూర్ణ అవగాహనతో ఆ సంక్షో భాన్ని దాటేయవచ్చు. వి.ఎస్‌.అచ్యుతా నందన్‌! భారతీయ ఫిడెల్‌ క్యాస్ట్రోగా పేరు పొందిన ఈ కమ్యూనిస్టు నేత ముఖ్యమంత్రి పదవి చేపట్టే సమయానికి, ఆయన వయసు 83 ఏండ్లు. లాటరీ మాఫియా, అక్రమ కట్టడాల కూల్చివేత లాంటి విషయాల్లో దూకుడుగా వ్యవహరించారు.97ఏండ్లు వచ్చే వరకూ పార్టీలో క్రియాశీలకంగానే ఉన్నారు. మన్మోహన్‌ సింగ్‌! చరిష్మా లేకున్నా, మాటల మాంత్రికుడు కాకున్నా వ్యక్తిత్వంతో, మేధస్సు తో అత్యున్నత స్థానానికి చేరుకున్న వ్యక్తి. 82 ఏండ్ల వయసులోనూ దేశాన్ని నడిపించిన మౌని. మన్మోహన్‌ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రతి పక్ష నేతగా ఉన్న అద్వానీ కూడా ఎనిమిది పదులు దాటినవారే. ఇలాంటి నేతలెందరో, వయసును ఓ సంఖ్యగానే భావించారు. చురుకైన ప్రజా జీవితం గడిపారు. ఆ మాట కొస్తే నేతలే కాదు అన్నా హజారే లాంటి సామాజిక కార్యకర్తలు సైతం రాజీలేని పోరుతో సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. మిలీనియల్‌ తరం మధ్య ఉంటూనే తాము నమ్మిన విలువల కోసం పోరాడుతున్నారు. గుల్జార్‌, శ్యామ్‌ బెనెగల్‌,రోమిలా థాపర్‌..80 ఏండ్లు దాటినా తమవైన రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఓ వ్యక్తిగా కాకుండా, వ్యవస్థకు మార్గ దర్శిగా ఉన్న వృద్ధుల జీవితాలు ఏమేరకు సౌకర్యంగా ఉన్నాయి? అనే ప్రశ్నకు సవాళ్లే జవాబుగా నిలుస్తున్నాయి.
వైద్యం.. ఖరీదైన వ్యవహారం
వృద్ధుల ఆరోగ్య సమస్యల గురించి చాలా మందికి అవగాహన ఉండే ఉంటుంది. కణ విభజనలో లోపంవల్ల వయసుతో పాటు అవయవాలూ బలహీనపడుతూ ఉంటాయి. ఇక డయాబెటిస్‌ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు, వార్ధక్యంలోని ఒంటరితనంతో వచ్చే కుంగుబాటు లాంటి సమస్యలు సరేసరి. ఆ వయసులో వీటికి మందులు వాడటమే ఆర్థికంగా పెను భారం. ఇక హాస్పిటల్‌లో చేరాలన్నా, శస్త్రచికిత్స అవసరమైనా..ఆస్తుల మీద ఆశ వదులుకోవాల్సిన పరిస్థితి. కారణం! ఆసుపత్రి ఖర్చులకు అండగా నిలిచే ఆరోగ్య బీమా వీరికి అంత తేలికగా వర్తిం చదు. ఓఅయిదు లక్షల పాలసీ తీసుకో వాలన్నా.. నెలనెలా వేలకు వేలు ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. ఇక దీర్ఘకాలిక అనారో గ్యం ఉన్నవారిని బీమా సంస్థలు అంత త్వరగా కరుణించవు. ఓ ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ టారిఫ్‌ ప్రకారం..రక్తపోటు, మధుమేహం ఉన్న ఎనభై ఏండ్ల వ్యక్తికి పదిలక్షల మొత్తానికి ఆరోగ్య బీమా కావా లంటే వార్షిక ప్రీమియం అక్షరాలా 84వేలు. మరేదో కంపెనీ అందులో సగానికి సగం ప్రీమియం వసూలు చేసినా.. నెలకు దాదాపు నాలుగు వేలు చెల్లించాల్సి ఉంటుంది. దశా బ్దాల క్రితమే రిటైర్‌ అయిపోయి..అప్పటి లెక్కల ప్రకారం పెన్షన్‌ పొందుతున్న వృద్ధు లకు ఇదంతా ఎంత భారం! ఈ సమస్యకు పరిష్కారాలు లేకపోవు. అప్పటికప్పుడు కాకుండా, తక్కువ వయసులోనే పాలసీ తీసుకుంటే.. ప్రీమియంలో రాయితీ వస్తుంది. మిత్రులంతా కలిసి గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునే సౌలభ్యం కూడా ఇప్పుడిప్పుడే మొదలవు తున్నది. ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి..ఆస్తిలో, ఆదాయంలో కొంత భాగాన్ని వైద్యానికి దాచి ఉంచడం మరో పద్ధతి. ఇలాంటి సందర్భాల్లో సమా చారమే కీలకంగా మారుతుంది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు మధుమేహం, క్యాన్సర్‌, కుంగుబాటు తదితర సమస్యల మీద కృషి చేస్తూ ఉంటాయి. వాటిని సంప్రదిస్తే తగిన సూచనలు, సలహాలు ఇస్తాయి. ఆ ఎన్జీవోలు నిర్వహించే వైద్య శిబిరాలను కూడా వినియో గించుకోవచ్చు. వృత్తిపరమైన సంఘాల్లో సభ్యు లుగా కొన్ని రాయితీలు దక్కించుకోవచ్చు.ఇక ప్రభుత్వాల తరఫు నుంచి కూడా ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన,ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ఉన్నాయి. అవి ఎంతవరకు వర్తిస్తా యి అనే అవగాహన కూడా ముఖ్యమే.
టెక్నాలజీ ఆసరా
కంప్యూటర్ల ప్రవేశంతో సాంకేతికత విస్తరిం చింది. కంప్యూటర్‌ వాడని కార్యాలయం.. స్మార్ట్‌ ఫోన్‌ లేని ఇల్లు కనిపించడం లేదు. టెక్నాలజీ ఊసే లేకుండా చదువు, కెరీర్‌ దాటేసిన తరం..హఠాత్తుగా వాటి మీద పట్టు సాధించడం కష్టమే. అందుకు చాలా కార ణాలే ఉన్నాయి.గతంలో ఎన్నడూ పరిచయం లేని క్లిష్టమైన విషయాన్ని నేర్చుకునేందుకు సంకోచించడం.దృష్టి సమస్య కారణంగా.. స్క్రీన్‌ మీది అక్షరాలను చదవలేకపోవడం. ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ ప్రకారం 23 శాతం మంది వృద్ధులు ఈ ఇబ్బందితోనే ఆన్‌లైన్‌కు దూరంగా ఉంటున్నారు. చేతులు వణకడం లేదా వేళ్లు మొద్దుబారిపోవడంవల్ల టచ్‌ స్క్రీన్‌ ఉపయోగించలేకపోవడం.
-(జి.ఎ.సునీల్‌ కుమార్‌)

మహిళల శ్రమకు కొలమానం ఏదీ?

జాతీయ సమయ వినియోగ సర్వే’ ప్రకారం 81.2 శాతం మహిళలు ఎటువంటి చెల్లింపు లేని ఇంటి చాకిరిలో నిమగమై ఉన్నారు. అదే పురుషుల విషయానికి వచ్చేసరికి 26.1 శాతం మాత్రమే అటువంటి పనిలో వున్నారు. పురుషులు వారానికి సగటున 42 గంటల పాటు సాంప్రదాయకంగా ఆర్థిక కార్యకలా పంగా పరిగణించే ఉత్పత్తి పనుల్లో పాల్గొంటారు. స్త్రీలు 19 గంటలు పాల్గొం టున్నారు. అయినప్పటికీ మహిళలు గృహ నిర్వహణ, పిల్లలు-వృద్ధుల సంరక్షణ, కుటుం బంలో జబ్బు పడిన వారి కోసం 34.6 గంటలు వెచ్చిస్తారు. పురుషులు ఈ విధమైన పనులకు వెచ్చించేది 3.6 గంటలు. అంటే స్త్రీలు పురుషుల కంటే 10 రెట్లు ఎక్కువగా కుటుంబ నిర్వహణ పనులలో వుంటారన్న మాట. నేడు భారతదేశంలో మహిళా కార్మిక భాగస్వామ్య రేటు…ప్రభుత్వ గణాంకాల ప్రకారం 32.8శాతం వుండగా, ప్రపంచ బ్యాంకు ప్రకారం 24శాతం వుంది. అదే చైనాలో 61శాతం,బంగ్లాదేశ్‌లో 38శాతం, నేపాల్‌లో 29శాతం,పాకిస్తాన్‌లో 25శాతం వుంది. మహిళా సాధికారతను కల్పించేందుకు శ్రమలో స్త్రీల వాటా పెంచాలని భారత్‌ భావించినట్లయితే…మహిళల పనికి సంబంధించిన అపోహలు తొలగిపోవాలి. స్త్రీల పనిని సముచితంగా లెక్కించాలి. వారు శ్రమ చేయడానికి మద్దతు ఇవ్వాలి.
తల్లిదండ్రులు ఇంటి బయట పని చేస్తున్నప్పుడు వారి బిడ్డల ఆలనాపాలనా చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలనేది విశ్వవ్యాప్తంగా అంగీకరించిన సత్యం. భారతదేశంలోని కుటుంబ నిర్మాణాలు చారిత్రాత్మకంగా తరచూ ఈ అవసరాన్ని పూరించాయి. తండ్రులు ఇంటి వెలుపల పని చేస్తారు. పిల్లలు, పెద్దల సంరక్షణ పనులను తల్లులు చేస్తారు. అయితే, ఈ విధమైన కుటుంబ నిర్మాణం…పెరుగుతున్న భారత దేశ ఆశయాలకు అనుకూలంగా లేదు. దేశం 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగా లంటే, మహిళల భాగస్వామ్యం వుండాలి. అందుకు రెండు ప్రత్యేక మార్గాలు ఉన్నాయి: మహిళల పని (తరచుగా పిల్లలు, పెద్దల సంరక్షణ పని)ని సక్రమంగా విలువ కట్టాలి. ఇంటి బయట ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి మహిళలకు తగిన మద్దతు ఇవ్వాలి. మహిళలందరూ పని చేస్తారు. కానీ వారందరికీ జీతం అందదు. 2023 నోబెల్‌ గ్రహీత, ఆర్థికవేత్త క్లాడియా గోల్డిన్‌ అమెరికా చరిత్రపై చేసిన కృషి ఈ అంశాన్నే తెలియ చేస్తుంది. నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ 2020లో విడుదల చేసిన భారతదేశపు మొట్టమొదటి ‘జాతీయ సమయ వినియోగ సర్వే’ ప్రకారం 81.2 శాతం మహిళలు ఎటువంటి చెల్లింపు లేని ఇంటి చాకిరిలో నిమగమై ఉన్నారు. అదే పురుషుల విషయానికి వచ్చేసరికి 26.1 శాతం మాత్రమే అటువంటి పనిలో వున్నారు. పురుషులు వారానికి సగటున 42 గంటల పాటు సాంప్రదాయకంగా ఆర్థిక కార్యకలాపంగా పరిగణించే ఉత్పత్తి పనుల్లో పాల్గొంటారు. స్త్రీలు 19 గంటలు పాల్గొంటున్నారు. అయినప్పటికీ మహిళలు…గృహ నిర్వహణ, పిల్లలు-వృద్ధుల సంరక్షణ, కుటుంబంలో జబ్బు పడిన వారి కోసం 34.6 గంటలు వెచ్చిస్తారు. పురుషులు ఈ విధమైన పనులకు వెచ్చించేది 3.6 గంటలు. అంటే స్త్రీలు పురుషుల కంటే 10 రెట్లు ఎక్కువగా కుటుంబ నిర్వహణ పనులలో వుంటారన్నమాట. దీనికి రెండు ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి- శ్రామిక మహిళలు భయంకరమైన ‘’రెట్టింపు భారాన్ని’’ ఎదుర్కొంటారు. ఇక్కడ ఇంటి బయట పని చేయడం, కుటుంబ ఆదాయానికి తోడ్పడడం వల్ల వారి ఇంటి చాకిరి ఏమీ తగ్గదు. రెండు-పిల్లలు, వృద్ధుల సంరక్షణకు వారు చేసే పనులేవీ ఆర్థిక కార్యకలాపాలుగా లెక్కించబడవు. ఈ పనులతో అలసిపోయిన మహిళలకు పురుషులతో పోల్చుకుంటే వారంలో అతి తక్కువ విశ్రాంతి సమయమే మిగులుతుంది. ఎస్‌బిఐ నివేదిక ప్రకారం ఎటువంటి చెల్లింపు లేకుండా మహిళలు చేస్తున్న పని ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నది. ఇది జిడిపిలో 7.5 శాతానికి బాధ్యత వహిస్తుంది. మరో మాటలో చెప్పా లంటే, మహిళలు ఇంటి పని భారాన్ని మోయడమే కాకుండా, ఈ ప్రక్రియలో వారు జిడిపిని కూడా పెంచుతారు. అయినా అధికారిక రికార్డుల ప్రకారం వారు పనిచేయనట్టే లెక్క.మహిళలు చేసే శ్రమను లెక్కించే విధానాన్ని ప్రభుత్వాలు మార్చు కోవాలి. అంతర్జాతీయంగా నిర్వచించబడిన ‘జాతీయ ఖాతాల వ్యవస్థ’ ప్రమాణాలలో మార్పు కోసం భారతదేశం పిలుపు ఇవ్వ వచ్చు. ఆ కృషికి నాయకత్వం వహించవచ్చు. తద్వారా జిడిపి గణన నుండి జనాభా గణనకు ఉద్దేశించబడిన ప్రశ్నాపత్రాలన్నింటిలో మార్పులు, చేర్పులు చేయవచ్చు. లెక్కించనప్పుడు మహిళల చాకిరీ కనిపించదు. దీని ప్రభావం కార్మిక, ఉపాధి విధానాలపై ఉంటుంది. శ్రమ లెక్కల్లో కనిపించకపోవడంతో ఇంటి చాకిరి చేసే వీరు ‘’రక్షిత కార్మిక చట్టాల పరిధి వెలుపలే’’ వుండిపోతారు. అంతేగాక ఇది పనిదినాన్ని పరిమితం చేస్తుంది. కార్మిక పరిస్థితులను నియంత్రిస్తుంది. భారతదేశంలో స్త్రీలు పురుషుల కంటే రోజుకు 1.5 గంటలు ఎక్కువ పని చేస్తారు. అది కూడా ఏ విధమైన జీతం లేకుండా, అపరిశుభ్రమైన పరిస్థితుల్లో పని చేస్తారు.
ఈ అంశానికి మరొక కోణం ఉంది. అదే-ఇంటి వెలుపల పని చేసే మహిళలకు మద్దతు ఇవ్వడం. తక్కువ-ఆదాయ కుటుంబాలలో, ఒక్కరే ఆదాయ వనరుగా వుండడమనేది అసంభవం. తల్లిదండ్రులు ఇద్దరూ పని చేయాల్సి ఉంటుంది. అంటే, డబ్బు సంపాదిం చేవారికి, కుటుంబ సంరక్షణ చూసే వారికి ఇప్పటి వరకు వున్న నమూనా విచ్ఛిన్నం కావడం ప్రారంభమవుతుంది. తక్కువ ఆదాయ మహిళలు మనం ఊహించన దానికంటే ఎక్కువగా ఎవరి మద్దతు లేకుండానే పని చేస్తున్నారు. అయితే ఈ పనిలో కనిపించే అస్థిరత కారణంగా వీరి శ్రమ గణాంకాల్లో ప్రతిబింబించదు. మహి ళల పని కాలానుగుణంగా వుంటుంది. చెదురుమదురుగాను, క్రమరహితంగా కూడా వుంటుంది. వీరు తరచుగా ఇంట్లోంచే కుటుంబ వ్యాపారాలకు తోడ్పాటునందిస్తారు. నాలుగు నెలల వ్యవధిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు దాదాపు 44 శాతం మహిళలు శ్రామిక శక్తిలో భాగంగా వున్నారని ఒక అధ్యయనం వెల్లడిరచింది. అయితే దానికి కొనసాగింపుగా నాలుగు సంవత్సరాల వ్యవధిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు కేవలం 2 శాతం మహిళలు మాత్రమే లెక్కల్లో వున్నారు. ఇంటి బాధ్యతలు వారిని సాధారణ ఉద్యోగం నుండి దూరంగా ఉంచు తాయి. వారు పని చేసినప్పుడు సాధారణంగా పిల్లలు వెంటే వుంటారు. నిర్మాణ ప్రదేశాలలో ప్రమాదకరమైన పరికరాలు, అధిక కాలుష్యం నీడలో పిల్లలు ఆడుతున్నారని 2013లో హార్వర్డ్‌ పరిశోధకులు వివరించారు. ఇది మెదడు అభివృద్ధికి అత్యంత కీలకమైన వయస్సులో (మూడేళ్ల లోపు) వారి జీవితా లను, ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది. విద్య, ఆరోగ్యం, నైపుణ్యం కోసం ఉద్దేశించిన అన్ని తదుపరి ప్రయత్నాలు, ప్రజా నిధులు బలహీనమైన పునాదిపైనే నిర్మితమయ్యాయి. పిల్లల కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రపం చంలోకెల్లా అతి పెద్ద ప్రజా వ్యవస్థ-అంగన్‌వాడీ వ్యవస్థను నడుపుతోంది. 14 లక్షల అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఆరు సంవత్సరాలలోపు 8 కోట్ల మంది పిల్లలకు ఈ సేవలు అందుతాయి. అయినప్పటికీ, ఈ కేంద్రాలు ఉదయం 9నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి. కాబట్టి, మహిళలు పూర్తిగా ఎనిమిది గంటల పని చేయాలంటే వారికి అదనంగా సంరక్షణ కేంద్రాలు అందుబాటులో వుండడం అవసరం. వేగంగా పట్టణీకరణ చెందుతున్న భారతదేశంలో మహిళలు శ్రమ చేసేందుకు వీలుగా వీరికి పలు సౌకర్యాలు కల్పించాలి. క్రెచ్‌లు ఒక పరిష్కారాన్ని అందిస్తాయి. 2020 నాటికి ‘జాతీయ క్రెచ్‌ పథకం’ దేశవ్యాప్తంగా దాదాపు 6,500 క్రెచ్‌లను నిర్వహిస్తోంది. తల్లులు ఒక స్థిరమైన వృత్తిని/ఉద్యోగాన్ని ఎంచుకుని పని చేయడానికి ఈ క్రెచ్‌లు సహాయ పడతాయి. అలాగే పిల్లలు సురక్షి తంగా, ఆరోగ్యకరంగా ఎదిగే వాతావరణాన్ని అందిస్తాయి. ప్రైవేట్‌ రంగం ఈ అవసరాన్ని గుర్తించి అధిక-ఆదాయ కుటుంబాలకు ఈ సేవలను అందిస్తుంది. పిల్లల సంరక్షణ/ప్రీస్కూల్‌ అనేది రూ.31,256 కోట్ల పరిశ్రమ. 2028 నాటికి వార్షిక రాబడి (సిఎజిఆర్‌) 11.2 శాతం వరకు వృద్ధి చెందుతుందని అంచనా. కాబట్టి ఆదాయ అసమానతను అధిగమించడానికి, అందరికీ నాణ్యత కల్గిన బాలల సంరక్షణ సేవలు అందిం చడానికి…ప్రభుత్వ రంగం ఇప్పటికే మొదలెట్టిన ప్రయత్నాలను వేగవంతం చేయాల్సి వుంది. నేడు భారతదేశంలో మహిళా కార్మిక భాగస్వామ్య రేటు…ప్రభుత్వ గణాంకాల ప్రకారం 32.8 శాతం వుండగా, ప్రపంచ బ్యాంకు ప్రకారం 24 శాతం వుంది. అదే చైనాలో 61 శాతం, బంగ్లాదేశ్‌లో 38 శాతం, నేపాల్‌లో 29శాతం, పాకిస్తాన్‌లో 25 శాతం వుంది. మహిళా సాధికారతను కల్పించేందుకు శ్రమలో స్త్రీల వాటా పెంచా లని భారత్‌ భావించినట్లయితే…మహిళల పనికి సంబంధించిన అపోహలు తొలగిపోవాలి. స్త్రీల పనిని సముచితంగా లెక్కించాలి. వారు శ్రమ చేయడానికి మద్దతు ఇవ్వాలి.
భారత్‌లో మహిళల స్థితిగతులు చట్టాలు
భారతీయ సమాజం మహిళను ఆకాశంలో సగం అన్నట్లుగా పురుషునితో సమానంగా వర్ణించింది. కానీ ఆచరణలో మహిళపై అడుగడుగునా ఆంక్షలు విధించింది. మహి ళను అనాదిగా ఇంటికే పరిమితం చేసి అబలగా చిత్రించింది. నేటి ఆధునిక కాలంలో కూడా ఆ వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇంత సామాజిక నిర్భందంలోనూ ఎంతోమంది మహిళా మేధావులు తమ ఉనికిని గొప్పగా చాటారు. పురుషునితో పోల్చితే మహిళ ఎందులోనూ తక్కువ కాదని నిరూపించారు. కానీ పురుషాధిక్య సమాజంలో అంత త్వరగా మార్పు లేదు. గృహ హింస, దాడులు, అణచివేత కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితి నుంచి మహిళకు చట్టపరమైన రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు అనేక చట్టాలు చేశాయి. లింగపరమైన స్తరీకరణ: మానవ సమాజం మొదటగా స్త్రీలు, పురుషులు అని స్తరీకరిం చబడిరది. అందుకే ఇయాన్‌ రాబర్ట్‌సన్‌ కులాలు, వర్గాలు, వర్ణాల కంటే ముందు మగవారికి ఉన్నత స్థానాన్ని, స్త్రీలకు సమాజంలో రెండో స్థానం ఇచ్చారని గమనించవచ్చు.
ా ఈ లింగపరమైన స్తరీకరణ ఒక తరం నుంచి మరొక తరానికి సంస్కృతిలో భాగంగా అందించబడుతుంది.
ా ఇందులో ప్రధాన కారణాలు లింగ పరమైన పాక్షిక అభిప్రాయాలుస్మెల్‌సర్‌ అభిప్రాయంలో
ా జైవికపరమైన తేడాలు
ా లింగపరమైన గుర్తింపు
ా లింగపరమైన ఆదర్శాలు
ా లింగపరమైన పాత్రలు పాటించడాన్ని బట్టి లింగపరమైన స్తరీకరణ చోటు చేసుకున్నదని అభిప్రాయపడ్డారు. లింగపరమైన శ్రమ విభజన
సమాజంలో పురుషులు మాత్రమే చేయాల్సిన పనులని, స్త్రీలు మాత్రమే చేయాల్సిన పనులని, లింగం ఆధారంగా సామాజిక పాత్రలు, బాధ్యతలు విభజించడం. తక్కువ శ్రమ, తక్కువ విలువ, గృహసంబధ శ్రమను స్త్రీలకు ఆపాదించి సమాజంలో రెండో స్థానం పొందటానికి కారణమైంది. రిచర్డ్‌ ఫ్లెక్స్‌నర్‌ ప్రకారం లింగతత్వం అంటే ఒక లింగం వారికంటే మరొక లింగంవారు అధికమయ్యే టువంటి పాక్షిక భావనలు, గుడ్డి నమ్మకాలు, విచక్షణ పూరిత వైకరులు. లైంగికత, లింగంఅనేవి వేర్వేరు అంశాలు, లైంగికత అనేది ఎటువంటి సామాజిక, చారిత్రక పరిస్థితుల్లోనైనా మార్పు చెందదు. దానికి సంబంధించి నిర్వహించే పాత్రలు మారవు. కానీ ఆధారంగా ఆయా స్త్రీ, పురుషులు అనుసరించాల్సిన సామాజిక, సాంస్కృతిక పాత్రలను తెలుపుతుంది.స్త్రీవాదులు స్త్రీలంటే భయంమిసోగని అంటే స్త్రీల పట్ల తగని ద్వేషంఫిలోగని అంటే పురుషుల పట్ల తగని ద్వేషం భారతీయ సమాజంలో స్త్రీల స్థానంవేదకాలంలో స్త్రీ-పురుషుల మధ్య అసమా నతలు లేవుస్త్రీల పట్ల విభిన్న వైఖరిని ప్రదర్శించినవాడు మనువు స్త్రీలకు విద్య అవకాశాలున్నాయి. బాల్య వివాహాలు లేవు, స్త్రీలకు కూడా బ్రహ్మచర్య ఆశ్రయం, ఉపన యన సంస్కారం కూడా ఉంది.స్వయం వరాలు, గాంధర్వ వివాహాలున్నాయి. బహు భార్యత్వం కేవలం ఉన్నతవర్గాల వారికే పరిమితం.రుషులతో పాటు రుషీమణులు కూడా ఉన్నారు. వితంతు వివాహాలను వియోగ అనే పద్ధతిలో పాటించేవారు. వరకట్నాలు లేవు.కుటుంబమే ఉత్పత్తి కేంద్రం కనుక స్త్రీలు పురుషులతో సమానంగా ఉత్పత్తి లో పాలు పంచుకొనేవారు. స్త్రీలకు వారసత్వ హక్కులు లేవు. కానీ స్త్రీధనంపై పూర్తి హక్కులు కలవు.వేదానంతర కాలంలో స్త్రీల స్థాయి ఆదర్శ స్త్రీ లక్షణాలు చిత్రించబడినవి ఉదా..రామాయణంలో సీత పురాణాలు, ఇతిహాసాల ప్రాధాన్యంతో స్త్రీల స్థాయి,స్వేచ్ఛ హరించిపోయాయి. తొలి, మధ్య యుగాల నుంచి విదేశీ సంస్కృతులతో సమ్మేళనం, భూస్వామ్య లక్షణాలు, వేదాలకు వక్రభాష్యం వంటి కారణాలవల్ల సతి ఆచారం, పరదాపద్ధతి, బహుభార్యత్వం లాంటివి ప్రారంభమయ్యాయి. ఇందుకు ఆర్యులకు, అనార్యులకు మధ్య జరిగిన వివాహాలు, ప్రతిలోమ వివాహాలు, బ్రాహ్మణ భావజాలం కూడా కారణాలుగా పనిచేశాయి. మధ్య యుగంలో జైన, బౌద్దం బలహీనపడటంతో రాజపుత్రులు, ఇస్లాం రాజ్యాల విస్తరణ జరగడంతో స్త్రీల స్థాయి వారి వారి సాంస్కృతిక విధానాలకు అడుగడుగునా దిగజారుతూ వచ్చింది.భారత జాతీయవాది అరవింద్‌ఘోష్‌ మొదటిసారిగా 1893లో భారతదేశంలో ఉద్భవించిన నూతన సామా జిక వర్గాన్ని మధ్య తరగతి వర్గం అని పిలిచారు.
ఈ సామాజిక వర్గం ఏర్పడటానికి కారణాలు..

  1. పరిశ్రమల ఏర్పాటుతో కులవృత్తులతో, భూ సంపదతో సంబంధం లేకుండా సంపద, హోదాని పొందే అవకాశాలు రావడం.
  2. బ్రిటిష్‌ వారు తమ పరిపాలనలో భాగంగా ఎంపిక చేసుకున్న భారతీయ అధికారగణం.
  3. లార్డ్‌ మెకాలే విద్యావిధానంతో ఆధునిక విద్య, వృత్తి విద్య అభ్యసించి ఉద్భవించిన నూతన భారతీయ మేధావి వర్గం. ఇలా పై కారణాలతో మొదటిసారి భారతీయ సమాజంలో సామాజిక సంబంధం లేని (వర్ణం, కులం) ఆర్థిక హోదా, నైపుణ్యాలు, వృత్తి వర్గాలు ఏర్పడ్డాయి.
    గృహహింస నిరోధక చట్టం..
    గృహంలో చిన్న పిల్లలకు సంబంధించిన హింసా చర్యలకు కూడా వర్తిస్తుంది. దేశంలో మొదటిసారిగా ఈ చట్టం గృహ హింసను సమగ్రంగా నిర్వచించింది.కింది అంశాలన్నీ గృహ హింస పరిధిలో వస్తాయి.వరకట్నాన్ని డిమాండ్‌ చేయడం. (అదనపు కట్నం) మానసిక, శారీరక, లైంగిక, మౌఖిక పరమైన ఇబ్బందులకు గురిచేసే చర్యలు.భార్యను కొట్టడం, శారీరకంగా హింసించడం.చట్టాన్ని అతిక్రమించినవారికి ఏడాది వరకు జైలుశిక్ష, రూ. 20 వేల వరకు జరిమానా.ఈ చట్టం కింద జిల్లా స్థాయిలో ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ నియామకం జరుగుతుంది. వారు బాధితురాలికి అవసరమైన న్యాయ, పునరావాస, నివాసపరమైన అంశాల్లో మార్గదర్శకత్వాన్ని అందించాలి. ఈ చట్టం కింద బాధిత మహిళలకు షెల్టర్‌ హోమ్స్‌, గృహహింస కౌన్సెలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.పనిచేసే చోట లైంగిక వేధింపుల చట్టం-2013 మహిళలు పనిచేసే చోట లైంగిక వేధింపులను నిరోధించడం, నియం త్రించడం, మహిళలపై వేధింపులకు సంబం ధించిన సమస్యలను సత్వరమే పరిష్కరించడం కోసం 2013లో ఈ చట్టాన్ని రూపొం దించారు.2013 డిసెంబర్‌ 9 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది.స్వేచ్ఛగా జీవించే హక్కు,1979 ని ప్రపంచవ్యాప్తంగా ఆమోదించారు. ఈ కన్వెన్షన్‌పై 1993 జూన్‌ 25న భారత్‌ సంతకం చేసింది. దీనికి కొనసాగింపుగానే పనిచేసే చోట లైంగిక వేధింపుల చట్టాన్ని తీసుకొనివచ్చింది. ఈ చట్టం దేశీయంగా ఇళ్లలో పనులుచేసే మహిళలకు (%ణశీఎవర్‌ఱష ఔశీఎవఅ ఔశీతీసవతీం%), ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మహిళలకు, కాంట్రాక్టు మహిళా కార్మికులకు, ఒప్పంద మహిళా కార్మికులకు, మహిళా శిక్షకులకు వర్తిస్తుంది.సెక్షన్‌- 4 ప్రకారం 10మంది కంటే ఎక్కువ మంది మహిళలు పనిచేస్తున్న చోట వారికి ఉద్యోగాన్ని ఇచ్చిన ఎంప్లాయర్‌ తప్పకుండా ఇంటర్నల్‌ కైంప్లెంట్‌ కమిటీని ఏర్పాటు చేయాలి.
    ఆ సంస్థకు చెందిన సీనియర్‌ మహిళని విచారణ అధికారిగా, ఇద్దరు ఇతర ఉద్యోగులను, స్వచ్ఛంద సంస్థలకు చెందిన ఒక ప్రతినిధిని కలిపిని ఏర్పాటు చేయాలి.వచ్చిన కైంప్లెంట్స్‌పై 90రోజుల్లో విచారణ పూర్త య్యేలా కమిటీ చర్యలు చేపట్టాలి.నమోదైన కేసులకు సంబంధించి సంస్థలోని ఏ ఉద్యోగికి అయినా నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆజ్ఞ జారీచేయవచ్చు.కేసుకు సంబంధించి ఏవిధమైన డాక్యుమెంట్‌ను అయినా సంస్థ నుంచి కోరవచ్చు.-జి.ఎన్‌.వి.సతీష్‌

పాలస్తీనాకు సంఫీుభావ ప్రకటన

లుపు,గోధుమ మరియు స్వదేశీ ప్రజలను పునర్వినియోగపరచలేని అన్యాయ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యమాలుగా,జాత్యహంకార మరియు వలసవాద దోపిడీ మరియు ఆధిపత్య వ్యవస్థలచే బలిదానంచేయబడుతున్నాయి,ఆక్రమణ మరియు వర్ణవివక్షకు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజల పోరాటాన్ని మాసమిష్టిలో భాగంగా మరియు పార్శిల్‌గా చూస్తాము.వాతావరణం,జాతి,ఆర్థిక మరియు రాజకీయ న్యాయం కోసం మరియు అణచివేత లేకుండా ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించే హక్కు ఉన్న ప్రపంచం కోసం పోరాటం.
అక్టోబరు 7 నుండి జరిగిన పాలస్తీనియన్‌ మరియు ఇజ్రాయెల్‌ – – పౌరులందరి ప్రాణా లను కోల్పోవడం పట్ల మేము ఆగ్రహంతో ఉన్నాము మరియు సమానంగా దుఃఖిస్తున్నాము మరియు వారి చర్యలకు బాధ్యులు బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు.అనేక ఉత్తర ప్రభుత్వాలకు, పాలస్తీనియన్‌ జీవితాలు ఇజ్రాయెల్‌ పౌరుల వలె తక్కువ విలువ మరియు విలువైనవిగా పరిగణించబడుతున్నాయనే వాస్తవాన్ని మేము ఖండిస్తున్నాము. ఇది పదివేల మంది పాలస్తీనియన్లను చంపడానికి అనుమ తించింది.పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ అక్రమ ఆక్రమణ ఫలితంగా దశాబ్దాలుగా శిక్షార్హత లేకుండా ఉంది. ప్రపంచ దక్షిణాదిలోని మన ప్రజల వంటి వారి పేర్లు మరియు కలలు వలసవాదానికి త్యాగం చేసిన వ్యక్తులు.గాజాపై తాజా విచక్షణారహిత బాంబు దాడిలో, ఇజ్రాయెల్‌ ఇప్పటికే 5000కంటే ఎక్కువ మంది పాలస్తీనియన్లను చంపింది, తూర్పున 2360 మంది పిల్లలతో సహా,1మిలియన్‌ మందికి పైగా ప్రజలను స్థానభ్రంశం చేసింది, ఇది పాలస్తీనా ప్రజలను సమిష్టిగా శిక్షిస్తుంది. కేవలం ఒక వారం,7-12అక్టోబర్‌ మధ్య, ఇజ్రాయెల్‌ తన అక్రమ ఆక్రమణలో నివసిస్తున్న పాలస్తీనా ప్రజలపై 6,000 బాంబులను జారవిడిచింది, ఆఫ్ఘనిస్తాన్‌పై యుద్ధంలో ఖూ ఒక సంవత్సరం మొత్తంలో వేసిన దానికంటే ఎక్కువ. హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ ఇజ్రా యెల్‌ నిషేధిత రసాయన ఆయుధాన్ని-వైట్‌ ఫాస్పరస్‌-గాజా స్ట్రిప్‌లోని పౌర ప్రాంతాలలో ఉపయోగించిం దని, దీనివల్ల తీవ్ర మైన కాలిన గాయాలు మరియు అదుపు చేయలేని మంటలు ఉన్నా యని ధృవీకరించింది.
మహిళలు,పిల్లలు,వైద్యులు,నర్సులు మరియు ఇజ్రాయెల్‌ ప్రతీకార బాంబు దాడి నుండి ఆశ్రయం పొందుతున్న వారితో సహా 471 మంది గాయపడిన మరియు అనారోగ్యంతో ఉన్న పాలస్తీనియన్లను చంపిన గాజాలోని అల్‌-అహ్లీ అరబ్‌ హాస్పిటల్‌పై బాంబు దాడి చేయడంతో మేము విధ్వంసానికి గురయ్యాము.ఈరోజు వరకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య కార్యకర్తలపై 76 దాడులను నమోదు చేసింది,17ఆసుపత్రులతో సహా 26 ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు దాడి చేయబడ్డాయి, అలాగే పాలస్తీనియన్లు భద్రత కోసం ఆశ్రయం పొందుతున్న ఖచీ పాఠశాలలపై దాడులను నమోదు చేసింది.
ఆక్రమిత పాలస్తీనియన్‌ టెరిటరీ ఆఫ్‌ గాజా‘‘పూర్తి ముట్టడి’’ని ఎదుర్కొంటోంది, అంతర్జాతీయ చట్టం ప్రకారం యుద్ధ నేరాలుగా పరిగణించబడే ఆసుపత్రులు మరియు పాఠశాలలు వంటి పౌర మౌలిక సదుపాయాలపై ఉద్దేశపూర్వక లక్ష్యంతో ఉంది. ఇజ్రా యెల్‌ కూడా బందీలుగా ఉన్న 2.3 మిలియన్ల పాలస్తీని యన్లకు ఆహారం, నీరు, ఇంధనం మరియు ఔషధాలను అడ్డుకుంటుంది, వీరిలో సగం మంది పిల్లలు, యుద్ధ ఆయుధంగా ఉన్నారు. వెస్ట్‌ బ్యాంక్‌ ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో ఉండగా, ఇజ్రాయెల్‌ మొత్తం దిగ్బంధనాన్ని విధించింది. గాజా స్ట్రిప్‌లో మారణ హోమాన్ని నిరసిస్తున్న పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్‌ సైన్యం ప్రాణాంతకమైన సైనిక బలంతో దాడి చేస్తోంది మరియు పాలస్తీనియన్లపై దాడి చేసి చంపుతున్న వెస్ట్‌ బ్యాంక్‌ లోపల ఇజ్రాయెల్‌ స్థిరపడినవారికి వేల ఆయుధాలను అందిస్తోంది. ఇజ్రాయెల్‌ బహిరంగంగా ‘గాజా శిథిలావస్థకు చేరుకుంటుంది’ మరియు పాలస్తీనియన్లను ‘మానవ జంతువులు’అని జాతి నిర్మూ లన ప్రకటనలు చేసింది. వాతావరణ న్యాయ ఉద్యమాలుగా మేము జాత్యహంకారం మరియు వలసవాదం యొక్క భాషను గుర్తిం చాము. ఇది గ్లోబల్‌ సౌత్‌ అంతటా మన ప్రజలలో చాలా మందిని బలి ఇవ్వడం మరియు చంపడాన్ని సమర్థించడానికి ఉపయోగించ బడిరది.
గాజాలో ప్రస్తుత యుద్ధం ఒక వివిక్త సంఘటన కాదు కానీ కొనసాగుతున్న వలసరాజ్యంలో లోతుగా పాతుకుపోయింది.చట్టవిరుద్దమైన ఆక్రమణ,వ్యవస్థాగత అన్యాయాలు మరియు వర్ణవివక్ష రాజ్యం ద్వారా పాలస్తీనాపై చారిత్రక అణచి వేత,పౌరులకు రక్షణ కల్పించాలనిడిమాండ్‌ చేసే అంతర్జాతీయ మానవతా చట్టం మరియు మానవహక్కుల సూత్రాలను ఇజ్రాయేల్‌ పదేపదే విస్మరించింది. ముఖ్యంగా సంఘర్షణ ప్రాంతాలలో,దాని తీవ్రతరం గాజాలో మారణోమ దాడులు.ఇజ్రాయెల్‌ ఉత్తర గాజాలో పాలస్తీనియన్లను విచక్షణారహితంగా చంపే ఉద్దేశంతో భూదాహానికి ప్రణాళిక చేస్తోంది: మరియు 1948లో 750,000 మంది పాలస్తీనియన్లు వారి ఇళ్ల నుండి బహిష్కరించబడినన నక్బా (అరబిక్‌లో ‘విపత్తు’) కంటే ఒకే రోజులో ఎక్కువ మంది పాలస్తీనియన్లను జాతిపరంగా ప్రక్షాలన చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. లేదా పాలస్తీనాలో వారి కొనసాగుతున్న స్థిరనివాసుల`వలసవాద ఆక్రమణలో ఏరోజు అయినా.గాజాలోని పాలస్తీనియన్లలో అత్యధికులు నక్బా నుండి వచ్చిన శరణార్థులు.
పరిస్థితి ఇంతకంటే అత్యవసరం కాదు.యునైటెడ్‌ నేషన్స్‌ రిలీఫ్‌ అండ్‌ వర్క్స్‌ ఏజెన్సీ ఫర్‌ పాలస్తీనియన్‌ శరణార్థుల (ఖచీRఔA) డైరెక్టర్‌ మాటలలో,‘‘గాజా జీవితం లేకుండా పోతోంది’’.ముఖ్యమైన వనరులు అయిపోయినందున మరియు గాజు యొక్క 16ఏళ్ల దిగ్భందనం మరియు కాలాగుణ బాంబు దాడులతో దెబ్బతిన్నాయి. ‘మన కళ్ల ముందు కుప్పకూలడం’గాజా యోక్క మిగిలిన ఆసుప్రతులు శవాగారాలుగా మారుతున్నాయి.
మేము తక్షణ కాల్పుల విరమణ కోసం మరియు అంతర్జాతీయ సమాజం దిగ్బంధనాన్ని విచ్ఛిన్నం చేయాలని మరియు పాలస్తీనా ప్రజల సామూహిక శిక్షను ముగించాలని పిలుపునిస్తున్నాము. వర్ణవివక్ష మరియు వృత్తిని మనం అంతం చేయాలి.
గాజా స్ట్రిప్‌కు మానవతావాద సహాయాన్ని అనుమతించడానికి కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానాలకు మద్దతు ఇవ్వడానికి ఖూ మరియు ఖఖ నిరాకరిం చడం పట్ల మేము విస్మయం చెందాము. ఇజ్రాయెల్‌ ఈ చర్యలను శిక్షార్హత లేకుండా నిర్వహించడంలో శక్తివంతమైన పాశ్చాత్య దేశాలు సహకరించడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఆధారాలు పెరుగుతున్నప్పటికీ, ఈ దేశాల నుండి ఇజ్రాయెల్‌కు సైనిక మరియు ఆర్థిక సహాయాన్ని అందించడం నిరాటంకంగా కొనసాగుతోంది.పాలస్తీనా ప్రజల జీవితాలను నిర్లక్ష్యం చేయడం క్షమించరానిది మరియు ఇజ్రాయెల్‌పై వారి ఆయుధాలను ముగించడం మరియు మానవ హక్కులకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ దేశాలపై బాధ్యత.
పాలస్తీనియన్‌ ప్రజల ఇస్లామోఫోబిక్‌ వాక్చాతుర్యాన్ని మరియు అమానవీయీకరణకు ఆజ్యం పోస్తున్న ఉత్తరాది మీడియా నేతృత్వంలోని రాజకీయ నాయకులు మరియు అంతర్జాతీయ మీడియా పాత్ర మరియు పక్షపాతాన్ని కూడా మేము పిలుస్తాము.ద్వేషపూరిత ప్రసంగం మరియు నకిలీ వార్తలు.
ఉత్తరాది ప్రభుత్వాలు-జర్మనీ,ఫ్రాన్స్‌ నుండి ఖఖ వరకు,మా ఉద్య మాలను నేరంగా పరిగణించి,పాలస్తీనా కోసం న్యాయం కోసం పిలుపునివ్వకుండా మా ఉద్యమాలను నిషేధించడానికి ప్రయత్నించడాన్ని మేము ఖండిస్తున్నాము. నిరసన తెలిపే మన హక్కుపై జరుగుతున్న దాడులు ఈ అన్యాయాలకు అత్యంత బాధ్యత వహించే దేశాలలో జరుగుతున్న వాతావరణ నిరసనలపై దాడులకు అద్దం పడుతున్నాయి.
మేము గాజా ప్రజలకు మరియు క్రూరత్వానికి గురైన వారందరికీ అచంచలమైన సంఫీుభావాన్ని తెలియజేస్తున్నాము మరియు అమాయక పౌరులను రక్షించడానికి అంతర్జాతీయ చట్టం మరియు మానవ హక్కుల సూత్రాలను సమర్థించాలని డిమాండ్‌ చేస్తున్నాము.
మేము కూడా పాలస్తీనీయున్లకు సంఫీుభావంగా నిలబడతాము.మరియు ఇజ్రాయెల్‌ను నిరసిస్తూన్న యూదులు గాజాపై బాంబుదాడి మరియు దాని కోసం వాదించడం ప్రాంతాంలో శాంతి రియు న్యాయం. మేము ఖండిస్తున్నాం.
చుట్టూ అనేక ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు ఈ నిరసనలు మరియు అరెస్టులను శాంతియుత ప్రపంచం ఆపాలి.శాంతియుత ప్రదర్శనకారులు.
న్యాయం లేకుండా శాంతి ఉండదు మరియు అది ప్రపంచ సమాజానికి నైతిక అవసరం.పీడితులతో ఐక్యంగా నిలబడతారు.మేము పిలుస్తాము.అన్నీ మన ప్రభుత్వాలు మరియు అంతర్జాతీయ సంస్థలు యుద్దాన్ని ముగించడానకి మరియు అందరినీ తీసుకురావడానికి కలిసి పనిచేయండి.న్యాయానికి యుద్ద నేరాలకు బాధ్యులు.మేము ఆక్రమణ మరియు మారరణోమం అంతం చేయాలని డిమాండ్‌.పాలస్తీనా ప్రజల మరియు పరిష్కారం కోసం కోరాం.అది పాలస్తీనియన్లు మరియు ఇజ్రాయిలీలు భద్రతతో,గౌరవంగా జీవించేలా తీర్మానం చేయాలని కోరుతున్నాము.వర్ణ వివక్షత కలిగిన ఇజ్రాయెల్‌ దేశం గాజాలో కొనసాగుతున్న హింస మరియు భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘనల దృష్ట్యా, మేము ఈ క్రింది అత్యవసర చర్యల కోసం పిలుపునిస్తున్నాము :
జు తక్షణ కాల్పుల విరమణ: గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ మరియు మానవతా మరియు మానవ హక్కుల సంస్థల పిలుపులను మేము ప్రతిధ్వనిస్తున్నాము.
జు చట్టవిరుద్ధమైన దిగ్బంధనాన్ని ముగించండి: పౌరులకు అత్యవసర మానవతా మరియు అత్యవసర సహాయం గాజాలో అందించాలి.గాజా ప్రజలకు వైద్య సామాగ్రి,ఆహారం,నీరు మరియు ఇతర అవసరమైన వనరులు చాలా అవసరం, వీటిని అత్యవసరంగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది.
జు యుద్ధ నేరాలను ఆపండి: ఆసుపత్రులపై దాడులు, బలవంతంగా తరలింపులు మరియు గాజాపై దశాబ్దాలుగా అక్రమ దిగ్బంధనంతో సహా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే చర్యలకు ఇజ్రాయెల్‌ బాధ్యత వహించాలి.
జు ముగింపు శిక్ష: ఇజ్రాయెల్‌ రాష్ట్రంతో సహా యుద్ధ నేరాలకు బాధ్యులైన వారందరినీ నిర్బంధించాలి.వారి చర్యలకు ఖాతా.నేరారోపణ లేదా విచారణ లేకుండా నిర్బంధించబడిన వేలాది మంది పాలస్తీనా రాజకీయ ఖైదీలతో సహా అన్ని పౌర బందీలను విడుదల చేయాలి.పాశ్చాత్య శక్తులు ఇజ్రాయెల్‌కు తమ మద్దతును నిలిపివేయాలి. ప్రత్యేకించి మానవ హక్కుల ఉల్లంఘనల సందర్భంలో ఇజ్రాయెల్‌కు ఆయుధాల విక్రయాలను ముగించాలి మరియు ఇజ్రాయెల్‌కు అన్ని మద్దతు మరియు నిధులను వెంటనే నిలిపివేయాలి. రాజకీయ పొత్తులు మనుషుల జీవితాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు.
జు వర్ణవివక్ష మరియు వృత్తిని ముగించండి: మేము పాలస్తీనా ప్రజల స్వీయ-నిర్ణయానికి మద్దతు ఇస్తున్నాము. మేము వర్ణవివక్ష వ్యవస్థను అంతం చేయాలని మరియు పాలస్తీనా శరణార్థులకు తిరిగి వచ్చే హక్కు మరియు పరిహారం కోసం ఇజ్రాయెల్‌కు పిలుపునిచ్చింది. ఇజ్రాయెల్‌ రాష్ట్రంతో పాటు సురక్షితమైన,సురక్షితమైన మరియు ఆచరణీయమైన పాలస్తీనా రాష్ట్రం కోసం ఖచీ తీర్మానాలను ఎట్టకేలకు సమర్థించాలని మేము అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నాము.
జాత్యహంకారం, ఇస్లామోఫోబియా మరియు సెమిటిజంను ఆపండి: మేము మా కామ్రేడ్‌లకు సంఫీుభావంగా నిలుస్తాము జాత్యహంకార దాడుల పెరుగుదలను ఎదుర్కొంటున్న యూదు మరియు ముస్లిం సంఘాలు. వాతావరణ న్యాయం కోసం పోరాటం జాతి న్యాయం కోసం పోరాటం.-(సేకరణ : సాలిడారిటీ స్టేట్‌మెంట్‌ ఆధారంతో…స్వేఛ్చా అనువాదం..)

ఇటుకల బట్టీల్లో వెట్టి చాకరి

ఇటుకల బట్టీల్లో కూలీల పరిస్థితి దయనీయంగా ఉంది. శ్రమకు తగ్గ ఫలితం లభించకపోగా, కనీస సౌకర్యాలు కూడా యజమానులు కల్పించడం లేదు. బట్టీల వద్దనే చిన్న చిన్న గుడిసెలు ఏర్పాటు చేసుకొని కుటుంబాలతో జీవనం సాగిస్తున్నారు. పగల నకా, రాత్రనకా ఇటుకలు తయారు చేయిస్తున్న యజమా నులు కోట్ల రూపాయలు గడిస్తున్నారు. ఇటుక బట్టీల నిర్వ హణకు మైనింగ్‌, కార్మికశాఖల నుంచి అనుమతులు తీసుకో వలసి ఉన్నా ఆ నిబంధనలేవీ అమలు కావడం లేదు. అధికా రులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండ టం అనుమానాలకు తావిస్తోంది. కార్మికశాఖ నిబంధనల మేరకు దినసరి కూలీలకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. అయితే అధికారుల నిర్లక్ష్యం మూలంగా నిరుపేదలైన కూలీలకు శ్రమకు తగ్గ ఫలితం అందడం లేదు.

ఇటుకల బట్టీల యజమానులు సిండికేటుగా మారి అందినకాడికి దండుకుంటున్నారు. ఒక్కో ట్రాక్టర్‌ ట్రిప్పును రూ.15 వేల నుంచి 20వేల వరకు విక్రయిస్తున్నారు. ఇటుకల తయారీకి అవసరమైన మట్టిని చెరువుల్లో నుంచి అక్రమంగా తరలిస్తూ తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలు ఆర్జిస్తు న్నారు.అక్రమంగా చెరువుల మట్టి,నీరు వినియోగిస్తు ఇటుకలను మాత్రం అధిక ధరలకు అమ్ముతున్నారు. ట్రాక్టర్‌ యజమానులను మచ్చిక చేసుకొని వారికి కమీషన్లు ముట్టజెప్పుతున్నారు. బట్టీల్లో పనిచేసే కూలీలకు మాత్రం అరకొరగా వేతనాలు చెల్లిస్తున్నారు. వెయ్యి ఇటుకలకు రూ.900చెల్లిస్తున్నారు. ఇద్దరు మనుషులు ఒక రోజులో వెయ్యి ఇటుకలు మాత్రమే చేయగలుగుతారు. రోజు వారీ అడ్డా కూలీకి మగవారికి రూ.800,ఆడ వారికి రూ.600లు ఉంది. ఇటుక బట్టీల్లో పని చేసే కూలీలు శ్రమ దోపిడీకి గురవుతున్నారు.
కనీస సౌకర్యాలు కరువు
ఇటుకల బట్టీల్లో మారుమూల ప్రాంతాలకు చెందిన కూలీలు పని చేస్తుంటారు. ఇతర రాష్ట్రాలు,జిల్లాల నుంచి వచ్చి ఇక్కడి ఇటుకల బట్టీల్లో కూలీలుగా చేరుతున్నారు. అలా వచ్చిన వారు ఇటుకల బట్టీల వద్దనే తాత్కాలిక గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. అక్కడ వారికి కనీస ఏర్పాట్లు యాజమాన్యాలు చేయడం లేదు. ఇటుకల బట్టీలు ఊళ్లకు దూరంగా వాగులు,చెరువుల సమీపంలో ఉండగా అక్కడే కుటుంబాలతో కలిసి జీవనం సాగిస్తున్నారు.అనారోగ్యం తలె త్తితో వైద్య సదుపాయం కూడా అందు బాటులో లేదు. అత్య వసర సమయాల్లో ఆర్‌ఎంపీలను పిలిపిస్తూ చికిత్స చేయిస్తు న్నారు. తాగునీటి సౌకర్యం లేకపోవడంతో వాగులు, చెరువుల నీటిపైనే ఆధారపడాల్సి వస్తోంది. కూరగాయలు, రేషన్‌ సామగ్రి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సిన పరిస్థి తులు ఉన్నాయి. తేళ్లు, విష సర్పాల మధ్య జీవనం గడపాల్సి వస్తోంది.
చిన్నారుల పరిస్థితి దయనీయం
ఇటుకల బట్టీల్లో పనిచేస్తున్న కూలీల పిల్లల పరిస్థితి దయనీయంగా ఉంది. పాఠశాలలు అందుబాటులో లేక వారు చదువుకొనే అవకా శాలు లేవు. దీంతో తల్లిదండ్రులతోపాటే ఇటుకల బట్టీల్లో తిరుగుతున్నారు. ఏడెనిమిది సంవత్సరాల పైబడి వయస్సు పిల్లలు తల్లిదండ్రులతోపాటు కూలీలుగా పని చేస్తున్నారు. ఇక్కడ బాలకార్మిక చట్టం అమలు కావడం లేదు. పిల్లలు అనారోగ్యానికి గురైనా ఆర్‌ఎంపీలతో చికిత్స చేయించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. తీవ్ర ఆనారోగ్యానికి గురైన ఓమూడేళ్ల చిన్నారి ఇటుకల బట్టీలోనే మృతి చెందడం విషాదాన్ని నింపింది. అలా తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్న కూలీలు చాలీచాలని వేతనాలు,అరకొర వసతుల నడుమ ఇటుకల బట్టీల్లో పనిచేస్తూ దుర్భర జీవనం గడుపుతున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు
మహా విశాఖపట్నం వంటి మహానగరాల్లో భవన నిర్మాణాలు జోరుగా సాగుతుండడంతో చుట్టుపక్కల పల్లెల్లో ఇటుక బట్టీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. చాలా వరకు అనుమతులు లేకుండానే కొనసాగుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాయి. హుజూరాబాద్‌ మండలంలోని దాదాపుగా 50కి పైగానే ఇటుక బట్టీలు ఉన్నాయి. విశాఖ ఉమ్మడి జిల్లాలోని పద్మనాభం, భీమిలి, ఆనందపురం, అనకాపల్లి, పాయకరావుపేట, రావికమతం,బుచ్చియ్యపేట తదితర గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణకు చెందిన వ్యాపా రులు వ్యవసాయ భూమిని లీజుకు తీసుకొని ఈ వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇటుకలను తయారీ చేయడానికి ఛత్తీస్‌గఢ్‌,ఒడిశా నుంచి కార్మికులను తీసుకువస్తుంటారు.
అనుమతులు లేకుండానే ఏర్పాట్లు
ఇటుక బట్టీల ఏర్పాటుకు ఆయా గ్రామ పంచాయతీలతో పాటు రెవెన్యూ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి నుంచి అను మతులు తప్పకుండా తీసుకోవాలి, కానీ కొందరు వ్యాపారులు మాత్రం నిబంధనలు పాటించడం లేదు. అంతేకాకుండా నిబంధ నలకు విరుద్ధంగా ప్రభుత్వ భూముల్లోనూ బట్టీలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ భూముల్లో ఇటుక బట్టీలు ఏర్పాటు చేయా లంటే నాలా సుంకం చెల్లించాలి. కానీ రైతు లకు డబ్బు ఎర చూపి నాలా సుంకం చెల్లించ కుండానే వ్యాపారం చేస్తున్నారు. వాల్టా చట్టా న్ని ఉల్లంఘించి చెరువులు, కుంటల నుంచి మట్టిని తరలిస్తూ ఇటుకల తయారీకి వినియో గిస్తున్నారు.
ప్రధాన రహదారుల వెంట బట్టీలు
పద్మనాభం,అనకాపల్లి,భీమిలి,ఆనందపురం మండలంలో రహదారుల పక్కనే ఇటుక బట్టీలు ఏర్పాటు చేయడం వల్ల వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలికి బూడిద కొట్టుకువచ్చి కండ్లల్లో పడడం, ఇటుకు బట్టీల నుంచి వెలువడుతున్న పొగతో రోడ్డు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నా యని ఆందోళన చెందుతున్నారు.
బట్టీల్లో బాల్యం
ఇటుక బట్టీల్లో బాల్యం బుగ్గి అవుతుండగా ఆ చిట్టిచేతులు చక్కని రాతకు, చదువుకు దూర మవుతున్నాయి.చేతిలో బలపం పట్టి చదుకోవాల్సిన చిన్నారులు ఇటుకలు మోస్తూ బట్టీల్లోనే మగ్గిపోతున్నారు. చాలిచాలనీ జీతాలు చెల్లించి కార్మికుల శ్రమను యాజమానులు దోచుకోవడంతో పాటు చిన్నారులను శ్రమ జీవులుగా మార్చి వేస్తు న్నారు. ఇటీవల ప్రభుత్వం విద్యాశాఖ సిబ్బందితో చేపట్టిన సర్వేలో ఎక్కువ మంది బడికి వెళ్లకుండా బట్టీల్లోనే పనులు చేస్తూ కనిపించడంతో వారిని దగ్గరలోని పాఠశాలల్లో చేర్పించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమంలో కూడా చాలా వరకు బట్టీల్లో పని చేస్తున్న చిన్నారులను గుర్తించారు. ఇదిలా ఉంటే ఇటుక బట్టీల నిర్వాహకులు నిబంధనలకు నీళ్లొదిలి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఊరికి దూరంగా ఉండ డంతో పాటు రహదారులకు దూరంగా ఉండి వాహనదారులకు ఆ బట్టీల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాల్సింది పోయి రోడ్డు పక్కనే బట్టీలను నిర్వహిస్తూ ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలుగజే స్తున్నారు. మరోపక్క బట్టీల్లో పనిచేసే కార్మి కులకు కల్పించాల్సిన వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహించడమే కాదు.ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదు. అయినా కార్మికశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌,ఒడిశా నుంచి కార్మికులను తీసుకు వస్తుంటారు. ఇందులో బాల కార్మికులే ఎక్కు వగా ఉండడం గమ నార్హం. ప్రతి ఇటుక బట్టీ వ్యాపారి వద్ద సుమారు నలుగురు నుంచి ఐదు గురు వరకు బాల కార్మికులు పని చేస్తుంటారు.
ముందుస్తు ఒప్పందాలతో వెట్టిచాకిరి
జిల్లాలో వందల సంఖ్యలో ఇటుక బట్టీలు ఉన్నాయి. ఇందులో పని చేయడానికి బట్టీల యజమానులు ఒరిస్సా,చత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్ర, బీహార్‌, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాల నుంచి వలస కూలీలు కుటుంబాలతో సహ వచ్చి ఇటుక బట్టీల్లో పని చేస్తుంటారు. ఇటుక బట్టీల యాజమాన్యం ఆయా రాష్ట్రాలకు వెళ్లి కూలీలకు అడ్వాన్స్‌ చెల్లించి పనికి తీసు కోచ్చుకుంటారు. ఇదే అదునుతో విద్యాహక్కు, కార్మిక, వాల్టా చట్టాలను తుంగలో తొక్కుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలు స్తోంది. రోజుకు 8 గంటలు పని చేయాలనే నిబంధన ఉన్నా రాత్రింబవళ్లు పని చేయించు కుంటున్నారు. ఒప్పందం ప్రకారం కార్మికులకు వాయిదాల ప్రకారం జీతాలు చెల్లిస్తున్నారు. ఈ వాయిదాల్లో వారు ఎలాంటి అనారోగ్యా నికి గురైనా, ప్రాణాలుపోయినా యజమానులు పట్టించుకోవడం లేదు. ప్రమాదాలు జరిగితే నష్టపరిహారం సైతం అందించకపోగా వారికి ఇచ్చిన అడ్వాన్స్‌లోనే కోతపెడుతున్నారు. బీమా సౌకర్యం కల్పించడం లేదు. ఊరు కాని ఊరు కావడం, బట్టీలు దాటి బయటకు వెళ్లే దారి కనిపించకపోవడంతో తమపై దౌర్జ న్యాలు, వేధింపులు జరుగుతున్నా ఎవరికి చెప్పుకోలేని దుర్భర పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నారు. గతంలో కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో ఓ కార్మికునికి సైతం ఇదే తరహాలో బట్టి నిర్వాహకులు వేధిం పులకు గురిచేయడంతో ప్రాణాపాయస్థితికి చేరుకున్నాడు. ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ లాంటి ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో విద్యాహక్కు చట్టంకు తూట్లు పొడుస్తూ చిన్నా రులతో పని చేయించుకోవడమే కాకుండా నిబంధనలను ఎక్కడా కూడా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
అనారోగ్యం బారిన
ఇటుక బట్టీలు జనావాసాలకు సమీపంగా వెలుస్తుండడంతో ఇటుకలను కాల్చినప్పుడు వచ్చేపొగ వల్ల కార్మికులతో పాటు, వాటి సమీప గ్రామ ప్రజలు అనారోగ్యానికి గురవు తున్నారు. ఇటుకల నుంచి వచ్చే పొగను పీల్చ డం వల్ల చాలా మంది అస్తమా, ఉబ్బసం వంటి రోగాల బారిన పడుతున్నారని తెలు స్తోంది. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వారికి ఆరోగ్య పరీక్షలు ప్రతీనెల చేయించాల్సి ఉండగా అది ఎక్కడా కానరావడం లేదు. ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడేలా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. జనావాసాలకు దగ్గర గా ఇటుక బట్టీలు వెలుస్తున్నా అనుమతి లేకుండా నడుస్తున్న కార్మికశాఖ,స్థానిక రెవె న్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసు కోక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
తూతూ మంత్రంగా తనిఖీలు
బడీడు పిల్లలు బడుల్లో చదువుకోవాలనే ఉద్దేశ్యంతో 6-14 సంవత్సరాల వరకు ప్రభుత్వం నిర్బంధ విద్యను అమలుచేస్తుంటే వాటిని అమలు పరుచడంలో అధికారులు మాత్రం విఫలమవుతున్నారు.కార్మిక, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారులు బట్టీల్లో నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తున్న పిల్లలను గుర్తించేందుకు పలు సందర్భాల్లో తనిఖీలు చేపడుతున్నా అవి తూతూ మంత్రంగానే ఉంటున్నాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతీ ఏటా ఆపరేషన్‌ స్మైల్‌ పేరుతో చిన్నారు లను గుర్తించడం సంబంధిత ఇటుక బట్టీల నిర్వాహకులకు చిన్నపాటి జరిమానాలు విధించి ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడకపోవడం, కఠిన చర్యలు చేపట్టక పోవడంతోనే బట్టి నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు. ఇటీవల విద్యాశాఖ అధికారులు చేపట్టిన బడి బయట పిల్లల సర్వేలో జిల్లాలోనే బట్టీల వద్దనే చిన్నారులు పాఠశాలలకు వెళ్లకుండా తమ తల్లిదండ్రులతో కలిసి పనులు చేయడం గుర్తించారంటే ఏ స్థాయిలో ఇతర విభాగాల పనితీరు ఉందో అర్థం చేసుకోవచ్చు.
బట్టీ కార్మికులకు భద్రత కరవు
బతుకు భారమై పొట్ట చేత పట్టుకొని ఒడిషా నుండి తెలంగాణకు తరలి వస్తున్న కార్మికుల దైనందిన జీవితం దుర్భరంగా ఉంది. ఒడిషా కార్మికులపై ఇటుక బట్టీ యజమానుల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒక్కో ఇటుక బట్టీల్లో దాదాపు 11వేల మంది ఒడిషా వలస కార్మికులు పనిచేస్తున్నారు. అక్కడ వీరికి కనీస వసతులు లేవు. పలువురు పనిభారం ఎక్కువై అనారోగ్యం బారిన పడుతున్నారు. కూలీ చేయలేని పరిస్థితిలో ఉన్న వారిని కొట్టి మరీ పని చేయిస్తుండటం విషాదం. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితం జిల్లాలోని పెద్దపల్లిలో కూలీ గర్భవతి నూర్జాజాహ్రాను బట్టీలోని గుమస్తా కొట్టిన దెబ్బలకు మరణించడంతో మరోసారి ఒడిషా కార్మికుల దుర్భర జీవితం తెరపైకి వచ్చింది. 2014లో చొప్పదండి పట్టణ శివారులోని ఇటుక బట్టీలో ముగ్గురు యువతులపై యజమాని లైంగిక దాడులకు పాల్పడ్డ సంఘటన రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సంఘటన మరవకముందే మరో దారుణం పెద్దపల్లిలో జరగటం ఒడిషా కార్మికుల జీవన పోరాటం ఎంతటి దుర్భ రంగా ఉందో అర్థం అవుతుంది. ఒడిషా సర్దార్లు ఎక్కువ కమీషన్లకు కక్కుర్తిపడి కార్మికులను నమ్మించి బట్టీల యజమానులకు తక్కువ కూలీతో అప్పగిస్తున్నారు. తెలం గాణలో పనిచేసే వారికి రోజు కూలీ 2వం దల రూపాయలకు పైగా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన ఒడిషా కూలీలు మాత్రం శ్రమదోపిడీకి గురౌతున్నారు. రోజంతా పనిచేస్తే కనీసం 30రూపాయలైనా ఇవ్వడం లేదు. యజమానులు ఇరుకు గదుల్లో కార్మికు లను బంధించడం, వేతనం ఇవ్వకపోవడం, చిన్న పిల్లలతో పనులు చేయించడం, లైంగిక దాడులులాంటివి దారుణ అకృత్యాలు జరిగినా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. మరోప్రక్క కూలీల పనికి అంతుపొంతన లేదు. కార్మిక చట్టం ప్రకారం రోజుకు 8గంటల పని చేయాలన్న నిబంధనలు ఇక్కడ అసలే ఉండవు. ప్రధానంగా భవన నిర్మాణరంగం, కంపెనీలు, ప్రయివేట్‌ ఏజెన్సీలు, నాపరాతి గనుల్లో నేటికీ వెట్టి కొనసాగుతోంది. వారిని ప్రభుత్వం ఆదుకున్న దాఖలాలు శూన్యం. ఉద్యోగ భద్రత కరువు, వేధింపులు తప్పడం లేదు. చివరకు తమ సమస్యలు చెప్పుకు నేందుకు సంఘాలనూ ఏర్పాటు చేసుకునే పరిస్థితి లేకుండా కొన్ని కంపెనీలు నిరంకుశ విధానాలు అవలంభిస్తున్నాయి. సమస్యల కోసమే కాదు.. సంఘాల కోసమూ సమ్మెలు చేయాల్సిన దుస్థితిని పాలకులు కల్పిస్తున్నారు. సంఘాలు పెడితే పనిలో నుంచి తొలగించే పరిస్థితిని ప్రభుత్వాలే కల్పిస్తున్నాయి.
అందులో ప్రధానమైంది అసంఘటిత రంగం. ఈ కార్మికుల జీవితాలకు భద్రత కరువైంది. దుర్భరస్థితిలో కార్మికుల జీవితాలు కొనసాగు తున్నాయి. అసంఘటిత కార్మికులకు రంగారెడ్డి జిల్లా నిలయంగా మారింది. తాండూరు ప్రాంతం నాపరాతి గనులు పాలిషింగ్‌ యూనిట్లు సుద్ధగనులకు నిలయమైతే, తూర్పు రంగారెడ్డి జిల్లా, మహబూబ్‌నగర్‌, నల్గొండ, మెదక్‌ జిల్లాల నుంచి వచ్చే వసల కార్మికులకు నిలయం.భవననిర్మాణరంగం,ఆటో,ఇటుకల బట్టీలు, క్రషర్లు, కంపనీల్లో రోజువారి కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న కార్మికుల సంఖ్య లెక్కేలేదు. ఫలితంగా ఈ ప్రాంతానికి ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది కార్మి కులు వలసొచ్చి జీవనం గడుపుతున్నారు. మరో పక్క సిమెంట్‌ ఫ్యాక్టరీలు, స్పిన్నింగ్‌ మిల్లులు వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసంఘటిత కార్మికులు వేల సంఖ్యలో ఉన్నారు. కానీ వీరి జీవితాలకు భద్రత కరువైంది. ప్రభుత్వం ఏవిధమైన చర్యలు చేపట్టడం లేదు. ప్రభుత్వ చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు. నాపరాతి గనుల్లో ఉపాధి పొందుతూ జీవితాలను గడుపుతున్న కార్మికుల స్థితిగతులు తెలుసుకునే అధికారులు, ప్రభుత్వా ధినేతలు కరువయ్యారు. కనీసం నివసించేం దుకు కావాల్సిన వసతులు కల్పించడంలో యజమానులు పట్టించుకోరు. ప్రాణాలకు ప్రమాదకరమైన స్థితి ఉన్నచోటే కార్మికులు జీవిస్తున్నారు. గుడారాలే నివాస కేంద్రాలు. లోతైన గనుల్లో నాపరాతి తవ్వకాలను చేపడు తున్నారు. అనేక సందర్భాలలో కార్మికులు ప్రమాదాలకు గురై ప్రాణాలు గాలిలో కలిసిన సందర్భాలనేకం. కరన్‌కోట్‌, ఓగ్గిపూర్‌, మల్క పూర్‌,బషీరాబాద్‌ మండలాల్లో నవల్గా, కొర్విచేడ్‌, మాసాన్‌పల్లి, జీవన్గి, బషీరాబాద్‌ గ్రామాలలో నాపరాతి గనులున్నాయి. పెద్దేముల్‌ మండలంలో నాగులపల్లి, పెద్దేముల్‌, మారేపల్లి గ్రామాల్లో సుద్ధ గనులున్నాయి. ఈ సుద్ధ గనులకు సమీపంలోనే చిన్నచిన్న కర్మాగారాలు నెలకొల్పారు. క్రషర్లూ ఉన్నాయి. మరోవైపు తాండూరు మండలంలోనే పెద్దపెద్ద సిమెంట్‌ కర్మాగారాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం లో వివిధ కర్మాగారాలు ఉన్నందు వల్ల కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, రాష్ట్రాల నుంచి వందలాదిగా కార్మికులు వలసొచ్చి తమ జీవితాలు కొనసాగిస్తున్నారు. అంతే కాకుండా తాండూరు పట్టణంలోని చుట్టూరా పాలిషింగ్‌ యూనిట్లూ వెలిశాయి. సుమారు 500 పాలిష్‌ యూనిట్లలో 3వేలకు పైగానే కార్మికులు రాత్రీపగలు పనిచేస్తున్నారు. వీరి భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వలస కార్మికులతో యజమా నులు వెట్టిచాకిరీ చేయించుకోవడంలో తమ దైన పద్ధతిని కొనసాగిస్తున్నారు. కార్మికులకు ముందస్తుగానే వడ్డీ లేకుండా డబ్బులు ఇవ్వడం ఒకవేళ కార్మికుడు అనారోగ్యానికి గురై పనిచేయని పరిస్థితి ఉంటే కార్మికులను చితకబాది బలవంతంగా పనిచేయించుకునే దుస్థితి. సుద్ధగనుల్లో పొద్దంతా కష్టపడి సుద్ధను తవ్వినప్పటికీ వారికి తగిన కూలీ పడడం లేదు. ఇలా అసంఘటిత కార్మికుల జీవితాలకు భద్రత కరువైంది. మరోవైపు కార్మికశాఖ పనితీరు చూస్తే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఉంటుంది. ప్రభుత్వా లకు అసంఘటిత కార్మికులన్నా, వారి జీవిత లన్నా ఏ మాత్రం పట్టడం లేదు. కానీ కార్మి కుల ఓట్లతోనే అధికారం చేపట్టిన పాలకులూ వారి సంక్షేమం గురించి మరిచారు. ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలో ఇటుకల బట్టీల్లో మగ్గుతున్న కార్మి కులూ ఉంటే, మేడ్చల్‌, శామీర్‌పేట, హయ త్‌నగర్‌,కీసర, ఘట్‌కేసర్‌ ప్రాంతాల్లో వంద లాదిగా వలిసిన మైనింగ్‌, కంకర మిషన్లు, క్రషర్లలో తమ జీవితాలను కోల్పోతున్నారు. వీరికి క్రషర్లలోపడి కార్మికులు మృతిచెందిన వారికి ఇఎస్‌ఐ,పిఎఫ్‌ వంటివి వర్తించవు. -గునపర్తి సైమన్‌

మారని ఆదివాసీల బతుకులు

స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటినా ఆదివాసీల బతుకుల్లో ఎటువంటి మార్పు లేదు. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపలేకపోతున్నాయి. ఇప్పటికీ జిల్లాలోని పలు మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. కిలో మీటర్ల మేర కాలినడకన, గుర్రాలపై వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఆస్పత్రులకు డోలీల్లోనే తరలించాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. జిల్లాలోని 22 మండలాల పరిధిలో తొమ్మిదిన్నర లక్షల మంది గిరిజనులు జీవిస్తున్నారు. వారిలో ఏడు లక్షల మంది గిరిజనులు పాడేరు ఏజెన్సీలో, మిలిగిన రెండున్నర లక్షల మంది రంప ఏజెన్సీలో ఉన్నారు. ప్రాంతాలు వేరైనా వారందరిదీ ఒకే రకమైన వేదన బతుకులే కావడం గమనార్హం.
రవాణా వ్యవస్థల్లో ఎంతో మార్పు చోటు చేసుకున్న ఈ రోజుల్లో సైతం ఆదివాసులు రోగులను డోలీల్లో మోయడం, తమ ప్రయా ణాలకు గుర్రాలను వినియోగిస్తుండడం గిరిజన ప్రాంతంలో రవాణా వ్యవస్థ దుస్థితికి అద్దంపడుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో సగానికిపైగా గిరిజన పల్లెలకు కనీస రోడ్డు సౌకర్యం లేని పరిస్థితి. ఏజెన్సీలో మారు మూల పల్లెలు అధికంగా ఉన్న ముంచంగి పుట్టు, పెదబయలు, జి.మాడుగుల, చింత పల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో వందలాది గ్రామాలకు చెందిన ఆదివాసులు ఇప్పటికీ గుర్రాలపైనే రాకపోకలు సాగిస్తు న్నారు. గుర్రాలను కొనుక్కోలేని పేద గిరిజనులు కాలినడకనే తమ ప్రయాణాలు సాగిస్తున్నారు. ఏజెన్సీలో మండల కేంద్రాలు, కాస్త రోడ్డు పక్కన గ్రామాలకు మాత్రమే రోడ్డు, రవాణా సదుపాయాలున్నాయి.
అందనంత దూరంలో ప్రాథమిక వైద్యం
జిల్లాలోని పాడేరు ఏజెన్సీలో ఉన్న ఏడు లక్షల మంది గిరిజనులకు వైద్య సేవలు అందిం చేందుకు ఏజెన్సీ వ్యాప్తంగా 36 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాడేరులో రెండు వందల పడకల జిల్లా ఆస్పత్రి, అరకులోయలో వంద పడకల ఏరియా ఆస్పత్రి,చింతపల్లిలో 50, ముంచంగిపుట్టులో 30పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాలు,గిరిజన పల్లెలో 202 ఆరోగ్య ఉపకేంద్రాలు, గ్రామానికి ఒకరు చొప్పున 3,800 మంది ఆశ కార్యకర్తలు న్నారు. కానీ నేటికీ గిరిజనులకు సాధారణ జ్వరం వ చ్చినా సకాలంలో వైద్యం అందని దుస్థితి కొనసాగుతోంది. గిరిజనుల వైద్యంపై సర్కారు నిర్లక్ష్యం, అధికార యంత్రాంగం అలసత్వంతో వైద్య సేవలు సకాలంలో అందడం లేదు. ఏజెన్సీ 11మండలాల్లో ఉన్న ఆస్పత్రులు, సిబ్బందిని పర్యవేక్షించాల్సిన ఐటీడీఏ పీవో,డీఎంహెచ్‌వో,ఏడీఎంహెచ్‌వో వంటి అధికారులు సైతం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. క్షేత్ర స్థాయిలో వైద్యసేవలు అందించే ఆశ కార్య కర్తల వ్యవస్థను పటిష్ఠం చేయకపోవడం, పారా మెడికల్‌ సిబ్బందిపై పర్యవేక్షణ లేమి కారణంగా గిరిజనులకు వైద్య సేవలు సక్రమంగా అందడం లేదు.
పల్లెల్లో కానరాని మౌలిక సదుపాయాలు
ఆదివాసీలు జీవించే పల్లెల్లో కనీస మౌలిక సదుపాయాలు సైతం లేని దుస్థితి నెలకొంది. రోడ్డు, రవాణా,తాగునీరు,విద్య,విద్యుత్‌ వంటి సదుపాయాలు సంపూర్ణంగా లేని పరిస్థితి. ప్రధానంగా తాగునీటి సదుపాయాలు అధ్వా నంగా ఉండడంతోనే గిరిజనులు తరచూ వ్యాధుల బారినపడుతున్నారని తెలిసినా పాలకులు రక్షిత తాగునీటి సదుపాయాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధపెట్టడడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలో భౌగోళిక మార్పుల కారణంగా అధిక సంఖ్యలో గ్రామాల్లోని బోర్లు, బావులు, గ్రావెటీ నీటి పథకాలు అడుగంటి ఇంకిపోతున్నాయి. దీంతో గతి లేక అందు బాటులో ఉన్న ఊటగెడ్డల్లో నీటిపైనే ఆధారపడుతున్నారు. సాంకేతికతను వినియో గించి గిరిజనులకు అవసరమైన రక్షిత నీటిని అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. కనీసం పంచాయతీ కేంద్రాల్లోనైనా రక్షిత తాగునీటిని అందించేందుకు కృషి చేయాలనే డిమాండ్‌ చాలా కాలంగా ఉంది. అలాగే రోడ్డు, రవాణా విషయాలకు వస్తే మరింత దారుణ మైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. నేటికీ ఏజెన్సీలో వందల సంఖ్యలోని పల్లెలకు రోడ్లు లేకపోవడంతో ఆయా ప్రాంతాలకు రవాణా సదుపాయాలు కల్పించని దుస్థితి నెలకొంది. దీంతో గిరిజనులు కాలినడకనే రాకపోకలు సాగిస్తున్నారు. ఇక విద్య విషయానికి వస్తే అంతా మేడిపండు చందంగానే ఉంది. ఏజెన్సీలో నేటికీ పదుల సంఖ్యలోని బడులకు భవనాలను లేని పరిస్థితి నెలకొనగా, ఉన్న పాఠశాలల్లోని గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదనే వాదన వినిపిస్తున్నది. ప్రధానంగా డీఈవో, ఏజెన్సీ డీఈవో కార్యాలయాల్లోనే ఇప్పటికీ అనేక కీలక పోస్టులు ఖాళీగా ఉండడంతో గిరిజన విద్యా భివృద్ధి మేడిపండు చందంగా ఉందనే విమర్శలున్నాయి.
వ్యవ‘సాయం’ కరువు
గిరిజనుల జీవనాధారమైన వ్యవసాయంపై పాలకుల నిర్లక్ష్యం చెప్పలేనిది. ఏజెన్సీలో దాదాపు 80 శాతం మంది భూమిపై ఆధారపడి జీవిస్తున్నప్పటికీ, ఆ స్థాయిలో గిరిజన రైతులకు ప్రభుత్వాల నుంచి సాయం అందడం లేదు. లోకమంతా వ్యవసాయ రంగంలో దూసుకువెళుతుంటే గిరి రైతులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే చందంగానే ఉన్నారు. గిరిజన ప్రాంతంలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు ఎంతో అనుకూలమైనప్పటికీ, కేవలం ప్రభుత్వాల ప్రోత్సాహం లేని కారణంగా ఊహించిన స్థాయిలో వ్యవసాయం అభివృద్ధి చెందడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక స్వయం ఉపాధి, చిన్నతరహా పరిశ్రమల గురించి మన్యంలో మాట్లాడుకోవడానికే అవకా?శం లేని పరిస్థితి. దీంతో గిరిజనుల జీవితాల్లో ఆశించిన స్థాయిలో వెలుగులు ప్రసరించడం లేదనేది పలువురి వాదన. గిరిజనాభివృద్ధిపై పాలకులకు చిత్తశుద్ధి లేనంత కాలం ఎన్ని ఆదివాసీ దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నా… తమ బతుకుల్లో మార్పురాదని ఆదివాసీలు ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు.
విశాఖ జిల్లాలోని 9 మండలాల్లో 95 వేల జనాభా గల 320 గిరిజన గ్రామాలకు స్వాతంత్య్ర ఫలాలు అందడం లేదు. విద్య, వైద్యం,రవాణా సౌకర్యం, రక్షిత మంచి నీరు అందని ద్రాక్షే. సుదీర్ఘ ప్రాంతాల నుండి గెడ్డల్లో ఊటనీళ్లు, డోలిమోతలు తప్పడం లేదు. ఏజెన్సీని ఆనుకొని ఉన్న నాన్‌ షెడ్యూల్డ్‌ గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్డ్‌లో చేర్చడంలో పాలకవర్గాలు బాధ్యతగా వ్యవహరించడం లేదని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. జిల్లాలోని మూడు వందల పైచిలుకు గిరిజన గ్రామాలను ఐదవషెడ్యూల్‌లో చేర్చకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని గిరిజనులు ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. వీటిని షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్పిస్తామని అధికార పార్టీ తియ్యనిమాటలు చెప్పిందేగానీ..అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించింది. గిరిజన సలహా మండలి (ట్క్రెబల్‌ ఎడ్వయిజరీ కమిటీ) 112 గిరిజన గ్రామాలకు పరిమితం చేస్తూ ఏడాది క్రితం తీర్మానం చేసింది. దీనిపై గిరిజన, ప్రజాసంఘాలు ఆందోళనకు దిగడంతో మరల తహసీల్దార్లతో క్షేత్రస్థాయి నివేదిక తెప్పించుకుంటామని పాలకులు చెప్పారు. ఇది కూడా ఏడాదికాలంగా నానుతుందే తప్ప అమలుకు నోచుకోలేదు. వందశాతం గిరిజన పంచాయతీలు ఉంటేనే ప్రతిపాదనలు పంపిస్తామని, గిరిజనేతరులతో కలిసి ఉన్న గ్రామాలను పంపించేదిలేదని తహసీల్దార్లు తెగేసి చెబుతున్నారు. నిజానికి శివారు గిరిజన గ్రామాల్లో వందశాతం గిరిజనులు నివసిస్తున్నారు. దీనిని ఇప్పుడు గుర్తించకపోతే తీవ్రనష్టం జరుగుతుందని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే 1956,1976లో రెండుసార్లు రాష్ట్రపతి ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్లో విశాఖ జిల్లాలోని తొమ్మిది మండలాల్లో గిరిజనులకు అన్యాయం జరిగిందని, ఇప్పుడు మళ్లీ అదేవిధంగా చేస్తే గిరిజనులు నష్టపోతారని ఆందోళన చెందుతున్నారు. ప్రతి శివారు గిరిజన గ్రామాన్ని గుర్తించి తహసీల్దార్లు ప్రతిపాదనలు పంపించి జిల్లా కలెక్టర్‌, ఐటీడీఏ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం పొందాలని, తరువాత అసెంబ్లీలో తీర్మానం చేసి%ౌౌ%రాష్ట్రపతి ఆమోదం ద్వారా గిరిజన గ్రామాలను ఐదవషెడ్యూల్డ్‌లో చేర్చాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. మాయ మాటలు చెప్పడం మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్డ్‌లో చేర్చక పోవడంతో ఆ గ్రామాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఐటీడీఏ ద్వారా వచ్చే సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు కోల్పోతున్నారు. 1/70 భూబదలా యింపు చట్టం వర్తించడం లేదు. స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న పాలకులు గిరిజన గ్రామాలకు కనీస సదుపాయాలు కల్పించకపోవడం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు.
గిరిజన బతుకులు నేటికీ చికట్లోనే..
గిరిజనులు అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీఠ వేస్తుందని ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు చేస్తున్న ప్రకటనలు పత్రికలకే పరిమితం తప్ప ఆచరణ సాధ్యం కావడం లేదు. ఏటా గిరిజనులు అభివృద్ధికి కోట్లాది రూపాయిలు ప్రభుత్వం కేటాయిస్తున్నప్పటికీ నేటికీ గిరిజనులు బతుకులు మారని గ్రామాలు అనేకం వున్నాయని చెప్పకతప్పదు. అందులో భాగంగా ఉత్తరావల్లి పంచాయతీ మధురా గ్రామం గదబపేట అని చెప్పవచ్చు. ఈ గ్రామంలో పూర్వం నుండి 10 కుటుంబాలు కొండలు, తోటలు మధ్య అడవితల్లిని నమ్ముకొని జీవనాన్ని సాగిస్తున్నారు. వారి బతుకులు దయనీయంగా వుండటంతో పాటు అగమ్యగోచరంగా వున్నాయని చెప్పకతప్పదు. నిన్నమొన్నటి వరకు తోటలు మధ్యలో పూరిపాకల్లో తలదాచుకునేవారు. అయితే ఇటీవల కాలంలో నాలుగు ఇళ్లులు ప్రభుత్వం మంజూరు చేయగా, పునాదులు ప్రాప్తికి మూడు ఇళ్లకు బిల్లులు అందగా ఒక ఇంటికి ప్రభుత్వం బిల్లులు మంజూరుచేసిన దాఖాలాలులేవు అయితే గిరిజనులు బతుకులు చూసిన ప్రతీ ఒక్కరికీ గుండె చలించక తప్పదు.గ్రామంలో మినీవాటర్‌ ట్యాంక్‌ వున్నప్పటికీ రెండు నెలలకోసారినీరు సరఫరా కావడంతో కిలో మీటరు దూరంలో వున్న బావికి వెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. తాగునీరు కోసం గిరిజనులు పడుతున్న బాధలు అన్నీఇన్నీకావు. అలాగే వీధి దీపాలు గత కొన్ని నెలలుగా వెలగక పోవడంతో అంధకారంలోనే కాలాన్ని గడుపుతున్నారు. పలుమార్లు ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ గ్రామం వైపు కనీసం కన్నెత్తి చూసిన పాపాన పోలేదని గిరిజనులు వాపోతున్నారు. గ్రామంలో వున్న రెండు విద్యుత్‌ స్థంభాలకు రెండు బల్బులు వేయటానికి నెలలుగడపటం అధికారులు నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పకతప్పదు.
అనుకోని రీతిలో అనారోగ్యం సంబవించినా, 108కి ఫోన్‌ ద్వారా సమాచారం అందినప్నటికీ రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి అవసరం వచ్చినా మూడు కిలోమీటర్లు దూరంలో వున్న ఉత్తరావల్లి వెళ్లాల్సిందే. రోడ్డు సౌకర్యం అంతంత మాత్రంగానే వుంది. ఈ పది కుటుంబాలు ప్రభుత్వం పంపిణీ చేస్తున్నా పింఛన్లు, రేషన్‌ బియ్యం, అడవినుండి తెచ్చిన కట్టెలను అమ్ముకొని జీవనాన్ని సాగిస్తున్నారు. ఇంతదారుణంగా గిరిజనులు బతుకున్నప్పటి కీ పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే గిరిజనులు అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.
వర్ణణాతీతంగా ఏజెన్సీలోని గిరిజనుల కష్టాలు
ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి బతుకులు మాత్రం మారడం లేదు. వారి కష్టాలు తీరడం లేదు. విశాఖలోని గిరిజనుల కష్టాలు వర్ణణాతీతమనే చెప్పాలి. ముఖ్యంగా ఆనారోగ్య సమస్యలు వస్తే.. అంబులెన్స్‌ వెళ్లే పరిస్థితి కూడా లేదు. –(జి.ఎ.సునీల్‌ కుమార్‌)

ప్రకృతి వైఫరిత్యాలు..పెరుగుతున్న మార్పులు

ప్రకృతి ప్రకోపానికి ప్రపంచ దేశాలు అల్లకొల్లోల మవుతున్నాయి. మొన్న అమెరికాలో సంభవించిన ఐస్‌ తుఫాన్లు, నిన్న టర్కీ,సిరియా రెండు దేశాల్లో సంభవించిన వరస భూకంపాలుతో సుమారు 4,500మంది మృతిచెందగా వేలాది మంది క్షతగాత్రులుగా మిగిలారు. నేడు ఆఫ్రికా దేశం లిబియా లోని డెర్నా నగరంలో సంభవించిన డేనియల్‌ తుఫాన్‌ కారణంగా ఏర్పడిన వరదల ధాటికి లిబియా దేశం అతలాకుతలమైంది. ఓ వైపు భారీ వర్షాలు,మరోవైపు ఆకస్మిక వరదలు లిబియాలో పెను వివిధ్వంసాన్ని సృష్టించాయి.ఈ క్రమంలోనే డ్యామ్‌లు పగిలిపోవడం తో ఏకంగా డెర్నా నగరం పూర్తిగా మునిగిపోయింది. రాత్రి నిశ్శబ్ధంగా ఉన్న నగరంలో ఉదయం వరకు తుఫాన్‌ విలయం సృష్టించింది. ఎటు చూసినా కూలి పోయిన బిల్డింగ్‌లు, కొట్టుకుపోయిన శవాలు, వాహనాలతో భీతావహ దృశ్యాలు కనిపి స్తున్నాయి. సుమారు 20వేల మంది మృత్యువాత పడ్డారు. ఇంకా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది.మెరుపు వరదల ధాటికి వేల మంది తీరానికి కొట్టుకొస్తున్నాయి. దీంతో సముద్ర తీరంలో శవాలు కుప్పగా మారింది. ఇప్పటికే టెర్రరిజం, అశాంతితో నిత్యం ఘర్షణలు జరిగే డెర్నా నగరంలో డేనియల్‌ తుఫాన్‌ మరింత పరిస్థితులు దిగజారాయి. ప్రస్తుతం డెర్నా నగరంలో తుఫాన్‌ బీభత్సానికి సంబం ధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడి యాలో వైరల్‌గా మారాయి. కొండలు, గుట్టల మధ్య నుంచి డెర్నా నగరం గుండా ప్రవహించే నది పరిసరాల్లో ఉన్న ఇళ్లు, భవనాలు పూర్తిగా నేల మట్టం అయ్యాయి. ఎన్నో అపార్ట్‌మెంట్‌లు బురదలో కూరుకుపోయినట్లు సోషల్‌ మీడియా ద్వారా తెలుస్తోంది.
భూకంపం,తుఫాను,వరదలు,సునామీ మొద లైన ప్రకృతి వైపరీత్యాలు మానవ నియంత్రణా పరిధికి ఆవల ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు,అనేక ప్రకృతి వైపరీత్యాలతో విధ్వంసానికి గురౌతున్నాయి. తీవ్రమైణ ఆస్తి,ప్రాణనష్టాలు జరు గుతున్నాయి. కొన్ని రకాల వైపరీత్యాలను ఎదుర్కొన డానికి, ముందుగా సిద్ధం కావటానికి మానవ చైత న్యం అవసరం.పునరావాస పనులు,ప్రథమ చికిత్స, ఆహారం,బట్ట్‌లు,మందులు,రక్షణ చర్యలు, ఆశ్రయం, మొదలైన అంశాల గురిం చి ప్రజలు తగినంత అవగాహన కలిగి వుండాలి.ప్రకృతి విపత్తులు ఎక్కువగా సంభ వించేది గాలి-నీరు వలనే. తుఫాన్‌, అతి భారీ వర్షాలు, వరదలు, ఈదురు గాలులు ఇంకా సునామీ వంటి విపత్తులు మనవాళికి తీవ్ర నష్టం చేస్తూ ఉంటాయి. సముద్ర గర్భంలో జరిగే విపరీత చర్యలు వలన సునామీ ఏర్పడితే, తీర ప్రాంతం అంతా నీటిమయం అవుతుంది. తీరప్రాంతాలు అన్నీ నీట మునుగుతాయి. ఇటువంటి సునామీలు వలన ఏర్పడే ప్రకృతి వైపరీత్యాలు అపార నష్టం తీసుకువస్తాయి. ఇంకా సముద్రంలో ఏర్పడే అల్పపీడనం వలన తీవ్ర వర్షాలు, అతి భారీ వర్షాలు కురవడం వలన కూడా నదులు విపరీతంగా ప్రవచించి వరదలుగా సంభ విస్తాయి.వరదల వలన ప్రాణ నష్టం, పంటనష్టం,ఆస్తి నష్టం,వ్యవస్థలు స్తంభించడం వంటివి జరుగుతాయి. వాయుగుండం తీరం దాటుతున్నప్పుడు ఈదురు గాలులు, అతిభారీ వర్షాలు చాలా నష్టం కలిగిస్తాయి. వాతా వరణం మార్పులు గమనిస్తూ, ముందస్తు హెచ్చరికలు చేయడం వలన ఒక్కోసారి గాలి-నీరు వలన సంభవించే ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్త వహించినా ఒక్కోసారి ప్రాణనష్టం కూడా సంభవించేది.గాలి-నీరు వలన సంభవించే విపత్తుల నుండి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్త పడగలరు కానీ ఆస్తి నష్టం,ఆర్ధికనష్టం,వ్యవస్థలు స్తంభించడం వంటివి జరగకుండా అడ్డుకోవడం అసాధ్యమే అవుతుంది. అయితే ప్రకృతి వైపరీత్యాలు జరిగిన వెంటనే పునరుద్దరణ చర్యలు తీసు కునే వ్యవస్థ మనకు అందుబాటులో ఉండాలి. అందుకు అందరూ స్పందించి తగినంత సాయం చేయాలి. ఇటువంటి సాయం చాలామంది చేసి ఉన్నారు కూడా.
భూకంపాలు -భూమి కంపించుట వలన ప్రకృతి వైపరీత్యాలు
భూమి అడుగుభాగం వివిధ పొరలతో వివిధ లోహాలతో ఉంటుంది. భూమి లోపల కూడా నీరు, ఖనిజాలు ఉంటాయి. భూమి లోపల చర్యలు జరిగినప్పుడు భూమి ప్రకంపనలకు గురి అవుతుంది. అకస్మాత్తుగా భూమిలోపల ఏర్పడే చర్యలతో లేక విడుదల అయ్యే శక్తి వలన భూమి కంపిస్తుంది. అలా భూమి కంపించినప్పుడు భూమి పగిలి బీటలువారు తుంది.భూమి కంపించడం భూమి పగలడం వలన భూమిపైన ఉండే భవనాలు కూలి పోయే ప్రమాదం ఉంటుంది. అటువంటి ప్రమాదాలు వలన ప్రాణనష్టం, ఆస్తినష్టం, ఆర్ధిక నష్టం జరుగుతూ ఉంటుంది. ఇలా భూమి నుండి ఏర్పడే ప్రకృతి విపత్తుల నుండి రక్షణ కొరకు భూకంపాలను అంచనా వేసే పరికరాల సాయంతో భూకంపం సంభవించే సమయం ముందుగానే పసిగడితే, ముందస్తు చర్యలు వలన ప్రాణనష్టం జరగకుండా చూడవచ్చు.అయితే ఆస్తి నష్టం,ఆర్ధిక నష్టం అడ్డుకోవడం అసాధ్యం.
అగ్ని ప్రమాదాలు వైపరీత్యాలు
అగ్ని వలన జరిగే ప్రమాదాలు ఎక్కువగా మానవ తప్పిదం వలననే జరుగుతాయి.గ్యాస్‌ లీక్‌ కావడం, కెమికల్‌ లీకేజ్‌ తదితర తప్పుల వలన అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. ఇటువంటి అగ్ని ప్రమాదాలు నుండి రక్షణ కొరకు నీరు, ఇసుక, వాయువులు వంటివి అందుబాటులో ఉండడం వలన అగ్ని ప్రమాదాలు పెద్ద ప్రమాదాలుగా పరిణ మించకుండా జాగ్రత్త పడవచ్చు.పెద్ద మొత్తం లో గ్యాస్‌ లీకేజ్‌ వంటివి అపార నష్టం చేయ గలవు. మానవ తప్పిదం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే, అగ్ని ప్రమాదాల నుండి రక్షణ ఉంటుంది.అగ్నిమాపక సిబ్బంది వలన చాలావరకు అగ్ని ప్రమాదాలను ఆర్పిన ఘటనలు ఉన్నాయి.
ప్రకృతి వైపరీత్యాల జరగకుండా చర్యలు
ప్రకృతి వైపరీత్యాల జరగకుండా చర్యలు, అంటే ప్రకృతిలో అసహజత్వం జరగకుండా చూసుకోవడమే అంటారు. సహజంగా ఏర్పడిన పర్యావరణంలో భూమిపై గాలి, నీరు, నిప్పు సాయంతో జంతుజాలం, మానవుడు నివాసం ఉంటారు. జంతువులు కేవలం వాటి ఆహారం, నివాసం విషయంలో ప్రకృతిలో లభించే సహజస్థితిలోనే జీవిస్తాయి. ప్రకృతిని తనకు నచ్చినట్టుగా మార్చుకునే తెలివి, సామర్ధ్యం మనిషికి సొంతం. అటువంటి తెలివి ప్రకృతి సహత్వాన్ని దెబ్బతీసి, ప్రకృతి సమతుల్యత పాడైతేమాత్రం ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయి. ఎంత సహజంగా ప్రకృతి ఉంటే అంతా ఆహ్లాద కరమైన ప్రకృతి, ఎంత అసహజత్వానికి గురి అయితే, అంతటి విపత్తులను పొందుతుంది. అది విపరీత స్వరూపాన్ని పొందితే మాన వాళికి నష్టమే కానీ లాభం ఉండదు.ప్రకృతి విపరీత స్థితికి చేరడానికి గాలి-నీరు ఎక్కువగా సాయపడతాయి. ప్రకృతిలో కుత్రిమ చర్యలు సహజత్వాన్ని పాడు చేయకుండా తగు జాగ్రత్తలు టేసుకోవాలి. మనిషితోబాటు కలిసి జీవించే జంతుజాలం వలన కూడా ప్రకృతి సమతుల్యత ఉంటుంది అని అంటారు. కాబట్టి ప్రకృతిలో జంతుజాలం అంతరించిపోయే చర్యలను కూడా నివారించాలి. ప్రకృతి వైపరీత్యాల నివారణకు, ప్రకృతిని సహజత్వం నుండి దూరం చేయకుండా ఉండడమే ప్రధానం. ప్రకృతి వైపరిత్యాలను మనం ఆపలేం.అయితే వరదలు, తుఫానులు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలవంటి ప్రకృతివైపరీత్యాలు సంభ వించడంవల్ల పర్యావరణం కలుషితమవు తుంది.అనేక రకాల రోగాలు ప్రబలుతాయి. మనుషులతో సహా జంతువులన్నీ కూడా రోగా లబారిన పడ తాయి. కాబట్టి ఇలాంటి సంద ర్భాలలో మనం అప్ర మత్తంగా ఉండడంతో పాటు ఇతరులకు సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉండాలి. బట్టలు, ఆహారపదార్థాలు సేకరించి పంపడం,సేవా క్యాంపులలో పాల్గొనడం చేయాలి. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినపుడు తీసుకో వలసిన జాగ్రత్తల పట్ల అవగాహన కలిగించ డానికి ప్రయత్నం చేయాలి. ప్రకృతి వైపరీ త్యాలు సంభవించి నప్పుడు 12 నుండి 15 సంవత్స రాల వయస్సుగల పిల్లలు చేపట్టగల సహాయ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ా వరదనీటిలోకి ప్రవేశించవద్దు.
ా మురుగునీటి కాలువలు, కల్వర్టులకు దూరంగా ఉండండి.
ా విద్యుదాఘాతానికి గురికాకుండా విద్యుత్‌ స్తంభాలతో పాటు, పడిపోయిన విద్యుత్‌ లైన్లకు దూరంగా ఉండండి.
ా ఓపెన్‌ డ్రెయిన్స్‌ లేదా మ్యాన్‌హూల్స్‌ను గుర్తించి ఆప్రదేశంలో కనిపించే విదంగా చిహ్నాలు,ఎర్ర జెండాలు లేదా బారికేడ్లు ఉంచండి.
ా వరదనీటిలో నడవకండి లేదా డ్రైవ్‌ చేయవద్దు
ా రెండు అడుగుల మేర ప్రవహించే వరద నీరు పెద్ద కార్లను కూడా తోసుకు పోగలవు
ా తాజాగా వండిన లేదా పొడి ఆహారాన్ని తినండి.
ా తినే ఆహార పదార్ధాలపై ఎల్లపుడూ మూతలు వేసి ఉంచండి
ా వేడిచేసిన లేదా క్లోరినేటెడ్‌ నీరు త్రాగాలి.
ా మీ పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి పెద్ద కార్లను కూడా తోసుకుపోగలవు
వరదల వచ్చిన తర్వాత చేయాల్సిన / చేయకూడని పనులు
్చ మీ పిల్లలను వరద నీటిలో ఆడనివ్వకండి
్చ రిపేర్‌కు వచ్చిన విద్యుత్‌ వస్తువులను ఉపయోగించవద్దు
్చ అధికారులు సూచించిన వెంటనే కరెంట్‌కు సంబందిం చిన ప్రధాన స్విచ్లు లను,ఎలక్ట్రిక్‌ ఉపకరణాలను వాడడం మానెయ్యాలి
్చ తడిగా ఉంటే విద్యుత్‌ పరికరాలను తాకవద్దు.
్చ విరిగిన విద్యుత్‌ స్తంభాలు,తీగలు,పదునైన వస్తువులను పరిశీలించండి
్చ వరద నీటిలో కలిసిన ఆహారం తినవద్దు.
్చ మలేరియావంటి వ్యాధులను నివారిం చడానికి దోమతెరలను వాడండి.
్చ వరద సమయంలో పాము కాటు సాధారణంకాబట్టి పాముల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
్చ నీటి మార్గాలు/మురుగునీటిపైపులు దెబ్బతి న్నట్లయితే టాయిలెట్‌ లేదా కుళాయి నీటిని వాడకండి.
్చ నీరు త్రాగడానికి సురక్షితమని ఆరోగ్య శాఖసలహా ఇచ్చే వరకు పంపు నీరు తాగవద్దు.
్చ మీ ప్రాంతంలో వరదలు సంభవించి ఖాళీ చేయవలసివస్తే మంచం,టేబుళ్లపై మీ ఫర్నిచం ఇతర ఉపకరణాలను పెట్టండి.
్చ మీ కరెంట్‌,గ్యాస్‌ కనెక్షన్‌ ను ఆపివేయండి
్చ ఎత్తైన భూ ప్రదేశం లేదా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళండి.
్చ మీ వద్ద ఉన్నఅత్యవసర వస్తు సామగ్రి, ప్రథమ చికిత్స పెట్టె,విలువైన వస్తువులు, ముఖ్యమైన పత్రాలను తీసుకొని వెళ్ళండి.
భూమి వేడెక్కితే ఏం జరుగుతుంది?
గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రపంచానికి పెను విపత్తుగా మారబోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరి స్తున్నారు. మనుషుల చర్యల వల్ల వాతవర ణంలోకి కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉద్గారాలు భారీగా పెరిగాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు కూడా మండుతున్నాయి. ధ్రువాల్లో మంచు కరుగుతోంది.ప్రతికూల వాతా వరణ పరిస్థితులు పెరుగుతున్నాయి. భూమి సగటు ఉష్ణోగ్రత15డిగ్రీసెంటీగ్రేడ్లు.గతంలో ఇది ఇంత కన్నా ఎక్కువగా,తక్కువగా కూడా ఉంది.ఈ ఉష్ణోగ్రతలో మార్పులు సహజమే. అయితే, మునుపటి కన్నా చాలా వేగంతో ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగు తున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌ దీనికి కారణమని వారు చెబుతున్నారు. గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌ అంటే సూర్యుడి నుంచి భూమిపైకి వచ్చే శక్తిలో కొంత భూమిపైనే నిలిచిపోవడం. భూమిపై నుంచి పరావర్తనం చెంది అంతరిక్షంలోకి వెళ్లాల్సిన సౌరశక్తిని గ్రీన్‌హౌజ్‌వాయువులు గ్రహిం చుకుని తిరిగి భూమిపైకి చేరేలా చేస్తున్నాయి. ఫలి తంగా వాతావరణం,భూ ఉపరితంల వేడెక్కు తున్నాయి. ఈఎఫెక్ట్‌ లేకపోతే భూమి ఇంకో 30డిగ్రీ సెంటీగ్రేడ్స్‌ చల్లగా ఉండేది. జీవం మనుగడ కష్టమ య్యేది.అయితే ఈ గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌కు పరిశ్రమలు, వ్యవసాయంవల్ల వెలువడే వాయువులుతోడై మరిం త శక్తిని గ్రహించి, ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీన్నే గ్లోబల్‌ వార్మింగ్‌ (భూమి వేడెక్కడం),వాతావరణ మార్పులు అంటారు.
గ్రీన్‌ హౌజ్‌ వాయువులు ఇవే…
గ్రీన్‌హౌజ్‌ వాయువుల్లో అత్యంత ప్రభా వవంతమైంది నీటిఆవిరి.కానీ,అది వాతా వర ణంలో కొన్ని రోజులపాటే ఉంటుంది. కార్బన్‌ డై ఆక్సైడ్‌ చాలా కాలం ఉంటుంది. అది పారిశ్రా మికీకరణ కన్నా ముందుఉన్న స్థాయిలకు వెళ్లాలంటే కొన్ని వందల ఏళ్లు పడుతుంది. సముద్రాల్లాంటి సహజ జలవనరులు దాన్ని పీల్చుకోగలవు. శిలాజ ఇంధనాలను మండిరచడంవల్లే అత్యధికంగా కార్బన్‌ డై ఆక్సైడ్‌ విడుదలవుతోంది. కార్బన్‌ డై ఆక్సైడ్‌ను పీల్చుకునే అడవులను నరికి,కాల్చేయడంవల్ల కూడా కార్బన్‌ వెలువడుతోంది.గ్లోబల్‌వార్మింగ్‌ ఎక్కువవు తోంది.1750లో పారిశ్రామిక విప్లవం మొదలై నప్పటితో పోలిస్తే కార్బన్‌ డై ఆక్సైడ్‌ స్థాయిలు 30శాతం పెరిగాయి.అయితే,కార్బన్‌డైఆక్సైడ్‌ అం తటి స్థాయిలో అవి లేవు.
గ్లోబల్‌ వార్మింగ్‌కు ఆధారాలు ఉన్నాయా?
పారిశ్రామిక విప్లవం కన్నా ముందు నాళ్లతో పోల్చితే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఇప్పుడు ఒక సెంటీగ్రేడ్‌ పెరిగినట్లు ప్రపంచ వాతా వరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) చెబుతోంది. అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు నమోదైన 20ఏళ్లు..గత 22 ఏళ్లలోనే ఉన్నాయి. 2005-2015 మధ్య సగటు సముద్ర మట్టం 3.6 మిల్లీమీటర్లు పెరిగింది. ఉష్ణోగ్రత పెరగడం వల్ల నీరు వ్యాకోచించి ఇది ఎక్కువగా జరిగింది. ఉష్ణోగ్రత పెరుగుతున్న ప్రాంతాల్లో హిమనీనదాలు కరుగుతున్నాయి. ఉష్ణోగ్రత పెరుగుదలను1.5డిగ్రీ సెంటీగ్రేడ్‌లకు కట్టడి చేసు కోగలిగితే క్షేమంగానే ఉండొచ్చని ఇటీవలికాలంలో శాస్త్రవేత్తలు,నాయకులు అంటున్నారు. గ్రీన్‌ హౌజ్‌ ఉద్గారాల కట్టడి విషయంలో రాజకీయంగా జరుగు తున్న కృషికి ఐరాసనేతృత్వం వహిస్తోంది. ఇప్పటి కిప్పుడు గ్రీన్‌ హౌజ్‌ వాయువుల ఉద్గారాలు గణనీ యంగా తగ్గించుకున్నా, వాతావరణంపై ప్రభావం తప్పదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ప్రభావం ఎలా ఉంటుంది?
వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉంటు దన్నదానిపై స్పష్టత లేదు.ప్రతికూల వాతా వరణ పరిస్థితులు పెరుగతాయి. దీంతో మంచినీటి కొరత ఏర్పడొచ్చు. ఆహారఉత్పత్తి పైనా తీవ్ర ప్రభా వం పడొచ్చు. వరదలు, తుఫానులు, వడగాలులవల్ల మరణాల సంఖ్య పెరగొచ్చు. భూతాపం పెరగడంవల్ల ఎక్కువ నీరు ఆవిరవుతుంది. సముద్ర మట్టాలు పెరుగు తాయి కాబట్టి వరదలు కూడా పెరగొచ్చు. ఈ మార్పులను తట్టుకునే సామ ర్థ్యం లేని పేద దేశాలపై ప్రభావం విపరీ తంగా ఉండొచ్చు. పరిస్థితులకు అంత త్వరగా అలవాటు పడలేవు కాబట్టి కొన్ని రకాల మొక్కలు, జంతువులు అంతరించి పోవచ్చు. మలేరియా లాంటి వ్యాధులు, పోషకాహార లోపాల బారిన కోట్ల మంది పడొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూ హెచ్‌ఓ)అంచనా వేసింది. వాతావరణంలో పెరిగిన కార్బన్‌ డై ఆక్సైడ్‌ను సముద్రాలు ఎక్కువగా పీల్చుకోవడంవల్ల వాటి ఆమ్లత్వం ఇంకా పెరగొచ్చు. కోరల్‌ రీవ్స్‌కు ముప్పు ఏర్పడొచ్చు. వాతావరణ మార్పులపై స్పందించడమే ఈశతాబ్దంలో మానవాళికి అతి పెద్ద సవాలు కాబోతోంది.
`వ్యాసకర్త : వాతావరణ మార్పుల పరిశోధకుడు,సెంట్రల్‌ యూనివర్శిటీ,హైదరాబాద్‌- (మల్లేష్‌ నాయక్‌)

కార్పొరేట్‌ లాభాల కోసమే..అడవుల విధ్వంసం

ప్రస్తుతం మన దేశంలో భూ వినియోగం విషయంలో ప్రైవేట్‌ కార్పొరేట్ల ప్రయోజనాలు సామాజిక ప్రయోజనాలకు పూర్తిగా వ్యతిరే కంగా ఉన్నాయి. ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ అవసరాల కోసం, గోల్ఫ్‌ కోర్సుల కోసం చాలా ఎక్కువమంది పేదలు నివసిస్తున్న భూములను ఖాళీ చేయిస్తున్నారు. స్వల్ప సంఖ్యలో ఉండేవారికోసం అధిక సంఖ్యాకుల ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారు.మోడీ ప్రభుత్వం మార్కెట్‌ అవసరాలకు (కార్పొరేట్ల అవసరాలకు) అనుగుణంగా భూ వినియో గాన్ని మార్చే పనిలో ఉంది. పెట్టుబడి ఆదిమ సంచయంతో ఇటువంటి మార్పులే జరుగు తాయి. భూమితో సహా అన్ని సంపదలూ సమిష్టిగా అనుభవిస్తున్నవిగాని, చిన్న చిన్న యజమానులు అనుభవిస్తున్నవి గాని కొద్దిమంది కార్పొరేట్ల చేతుల్లో చిక్కడమే కాకుండా, ఆ సంపదల వినియోగం తీరు కూడా మారిపోతుంది. చిన్న చిన్న రైతుల చేతుల్లో ఉండే భూమి కాస్తా కొద్దిమంది కార్పొరేట్ల పాలైతే అప్పుడు అక్కడ చిన్న తరహా ఉత్పత్తి విధానం పోయి,భారీ స్థాయి సరుకుల ఉత్పత్తి మొదలౌతుంది.
ఈ మోడీ ప్రభుత్వం నిరంతరం కార్పొరేట్ల ప్రయోజనాలను నెరవేర్చడం కోసం పనిచేస్తూ వుంటుంది. ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌ రంగంలో, ఇతర రంగాలలో ఉన్న కార్పొరేట్లు ప్రాజెక్టులు చేపట్టి లాభాలను పిండుకోవడం కోసం దేశంలోని విస్తారమైన అటవీ ప్రాంతా లను నాశనం చేయడానికి అనుమతిస్తోంది. అందుకోసం అటవీ సంరక్షణ చట్టానికి సవరణలు తెస్తోంది. తద్వారా ప్రభుత్వ సంరక్షణలో ఉండే కొన్ని అటవీ ప్రాంతాలను ఇకముందు అడవులుగా పరిగణించకుండా అటవీ సంరక్షణ చట్టం పరిధిలోంచి తొలగించనుంది.
1996లో సుప్రీం కోర్టు ఒక తీర్పు వెలువరించింది. దాని ప్రకారం అటవీ ప్రాంతంగా ఉన్న భూమిని, అది ఎవరి స్వాధీనంలో ఉన్నప్పటికీ, దానిని ప్రభుత్వ రికార్డుల్లో అటవీ ప్రాంతంగా నమోదు చేయకపోయినప్పటికీ, ప్రభుత్వం సంరక్షిం చాల్సిందే. ప్రభుత్వ రికార్డులు అటవీ ప్రాంతాలను నమోదు చేయడంలో ఘోరంగా వెనుకబడ్డాయి. అడవి అనే నిర్వచనమే చాలా అస్పష్టంగా ఉంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంది. అందువలన సుప్రీం కోర్టు ప్రతీ రాష్ట్రంలోనూ ఒక నిపుణుల కమిటీని నియ మించాలని, రికార్డుల్లో లేని అన్ని అటవీ ప్రాంతాలనూ గుర్తించాలని, వాటన్నింటికీ అధికారికంగా అటవీ ప్రాంతాలుగా గుర్తింపునివ్వాలని, అప్పుడే వాటిని చట్ట ప్రకారం సంరక్షించడం సాధ్యపడుతుందని ఆ తీర్పులో ఆదేశించింది. ఈ తీర్పు వచ్చిన 18 సంవత్సరాల తర్వాత కూడా, అంటే 2014 నాటికి కూడా హర్యానా, బీహార్‌, గుజరాత్‌, మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాల ప్రభుత్వాలు అటవీ ప్రాంతాలను గుర్తించడానికి కాని, వాటిని ప్రభుత్వ రికార్డులలో తగు విధంగా నమోదు చేయడానికి గాని ఏ విధమైన చర్యలూ తీసుకోలేదు. ఈ సంగతి ఒక పాత్రికేయుల బృందం చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ లొసుగుని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది. ఏకంగా చట్టానికే సవరణలు తెచ్చి రికార్డులకెక్కని అటవీ భూములకు ప్రభుత్వ సంరక్షణ లేకుండా చేస్తోంది.
ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించ డమే. నిజానికి కేంద్రం ఇంతవరకూ సుప్రీంకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేసిన రాష్ట్రాలను హెచ్చరించి ఆ తీర్పు అమలు జరిగేలా చూసి వుండాలి. లేదా కేంద్ర ప్రభుత్వమే ఒక నిపుణుల కమిటీని నియ మించి అన్ని రాష్ట్రాలలోనూ నమోదు కావల సిన అటవీ ప్రాంతాలను గుర్తించి అవి ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయాలని ఆ యా రాష్ట్రాలను ఆదేశించి వుండాల్సింది. అలా చేయకపోగా, రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వాన్ని సాకుగా తీసుకుని సుప్రీం కోర్టు తీర్పునే రద్దు చేసేలా చట్ట సవరణకు సిద్ధం కావడం మోడీ ప్రభుత్వ తెంపరితనానికి నిదర్శనం.సుప్రీంకోర్టు ఉత్తర్వుల కారణంగా తమ నిర్వహణలో ఉన్న తోటలను కూడా అడవులుగా గుర్తించే అవకాశం ఉందని ప్రైవేటు యజమానులు భయపడుతున్నారని, తమ భూములను తమకు నచ్చిన విధంగా వినియోగించుకునే హక్కు కోల్పోతామని వారు భావిస్తున్నారని, అందువలన ప్రైవేటు తోటల విస్తరణ ఆగిపోయిందని, దాని ఫలితంగా పచ్చదనం దెబ్బ తింటోందని, ప్రైవేటు యజమానుల భయాలను పోగొట్టి పచ్చదనాన్ని విస్తరించడానికే ఈ సవరణ తీసుకువస్తు న్నామని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్‌ తమ చర్యను సమర్ధించుకున్నారు. ఇది అందరినీ తప్పుదోవ పట్టించే వాదన. మొదటి విషయం: అడవుల, తోటల విస్తీర్ణం పెరగకపోడానికి ఒక కారణాన్ని అది ముందుకు తెచ్చింది. తోటలు పెంచుతున్న, పెంచాలని అనుకుంటున్న ప్రైవేటు యజమానుల మనసుల్లో భయాలు ఏర్పడ్డాయ న్నదే ఆ కారణం. అటువంటిది వాస్తవంగా ఉందో, లేదో, ఉంటే ఎక్కడెక్కడ, ఎవరెవరికి ఉందో చెప్పగల గణాంకాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి. దానిమీద ఎటువంటి స్వతంత్ర అధ్యయనమూ లేదు, ఆధారాలూ లేవు. రెండవ విషయం:ఒకవేళ ప్రైవేటు యజమాను లకు ఆ విధమైన భయాలు నిజంగా ఉన్నా, అడవులకు, తోటలకు మధ్య తేడాను స్పష్టంగా తెలియజెప్పే విధంగా నిర్వచించడమే దానికి పరిష్కారం ఔతుంది. అలా చేయడం పోయి ఏకంగా చట్టాన్నే మార్చేయవలసిన అగత్యం ఏముంది? ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశ్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అడవీ ప్రాంతాలను సంరక్షించడం కాదు దాని లక్ష్యం. విస్తారమైన అటవీ ప్రాంతాలను వ్యాపారానికి అనువుగా మార్చివేయడమే. అలా గనుక జరిగితే పర్యావరణానికి కలిగే నష్టం అపారంగా ఉంటుంది. ఇప్పటిదాకా, దేశంలో అటవీ భూముల విస్తీర్ణం వాస్తవంగా ఎంత ఉందో ప్రభుత్వం అధికారికంగా వెల్లడిరచలేదు. అందులో ఎంతమేరకు ఇప్పుడు వ్యాపారానికి అనువుగా మార్చబోతున్నారో అంచనా వేయడం సాధ్యం కావడం లేదు. ఐతే ఈ రంగంలోని నిపుణులు మాత్రం గణనీయమైన అటవీ ప్రాంతాన్ని కోల్పోనున్నామని హెచ్చరి స్తున్నారు. ఉదాహరణకు హర్యానా రాష్ట్ర పరిధిలోకి వచ్చే ఆరావళీ పర్వత శ్రేణికి చెందిన అటవీ ప్రాంతం అధికారికంగా అడవిగా నమోదు కాలేదు. ఆ ప్రాంతం దేశ రాజధానికి దగ్గర్లో ఉంది. అందుచేత ఆ ప్రాంతంమీద చాలామంది రియల్టర్ల కన్ను పడిరది. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని వ్యాపారాలకు వినియోగించడం జరిగితే దేశ రాజధాని ప్రాంతంలో అత్యంత ఆవశ్యమైన పచ్చదనం కాస్తా కనుమరుగౌతుంది. ఆంధ్రప్రదేశ్‌, కర్నూలు జిల్లాలో శ్రీశైలం,ఆత్మకూరు, వెలుగోడు, మహానంది,శిరివెళ్ల,రుద్రవరం, ఆళ్లగడ్డ మండలాల పరి ధిలోని నల్లమల అటవీ ప్రాంతం ఉంది. టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్టు రోళ్లపాడు, గుండ్ల బ్రహ్మేశ్వరం అభయార ణ్యాలు ఉన్నాయి. వీటిలో లెక్కలేనన్ని జీవజా తులు నివశిస్తున్నాయి. అధికారుల గణాంకాల ప్రకారం 55 జాతుల క్షీరదాలు, 2006 రకాల పక్షులు,18రకాల ఉభయచరాలు, 54 రకాల సరీసృపాలు, 55 జాతుల చేపలు ఉన్నాయి. వివిధ జాతుల క్రిమి కీటకాలెన్నో ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో బయో డైవ ర్సిటీ ఏర్పాటయ్యాక నల్లమల అటవీ ప్రాంతంలో కొన్ని కొత్తరకం జీవరాశులను కనుగొన్నారు. ఈ బయోడైవర్సిటీలో 2001 డిసెంబర్‌లో ఏర్పాటు చేసిన లైబ్రరీలో ఆయా జాతులకు చెందిన పూర్తి వివరాలు పొందుపరిచారు.
అటవీ నిబంధనలు పాటించాలి..
పులి, చిరుతలు తమ ప్రాణాలకు హాని జరుగుతుందేమో అన్న అనుమానం వచ్చే వరకు మనిషిపై దాడిచేయవు. అలాగే ఎలుగు బంటి కూడా, పులిని ఒక సారి మనం చూశా మంటే అది వేయి సార్లు మనల్ని చూసే ఉం టుందని తెలుసుకోవాలి. అది ఎప్పుడూ మనిషిని తప్పుకునే తిరుగుతుంది. చిరుతలు మనుషుల ఆవాసాలకు సమీపంలోనే తమ ఆహారాన్ని వెతుక్కుంటాయని చాలా మందికి తెలియదు. ఇవి గ్రామ సమీపాల్లో రాత్రి పూట రహస్యంగా తిరుగుతూ తనకిష్టమైన కుక్కలను ఎత్తుకుపోతాయి. మనుషులపై దాడి చేయడం అరుదు. మనిషి నడిచి వెళితే పులులు చక్కగా గుర్తిస్తాయి. అతను తమ ఆహారపు మెనూలో లేడన్న విషయం వాటికి తెలుసు. అదే ద్విచక్ర వాహనాలపై వెళ్లిన ప్పుడు అది మొత్తం ఒక జంతువుగా భావించి దాడులు చేస్తాయి. అటవీ ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో వంగి నడవడం, కూర్చోవడం చేయ రాదు. అడవిలో నడిచే సమయంలో చేతిలో కర్ర ఉంచుకోవడం మంచిది. మనిషి చేతిలోని కర్ర ఎత్తినప్పుడు ఎదురుగా ఉన్న అటవీ జంతువుకు మనిషి రెండు రెట్లు ఎత్తుగా కనిపిస్తాడు. దీంతో వన్యప్రాణులు మనిషికి దూరంగా పారిపోతాయి. అటవీ ప్రాంతాల్లో నివాసం ఉండే వారు పెద్ద పెద్ద శబ్దాలు చేయకుండా పరిసరాలను ప్రశాంతంగా ఉంచాలి. వాతావరణ కాలుష్యానికి పాల్పడకుండాఉండాలి. అటవీ నిబంధనలను తప్పకుండా పాటించాలి. వన్య ప్రాణుల ఆవాసాల్లో చొరబడి వాటిపై క్రూరత్వం ప్రదర్శించడం సరైంది కాదని వన్యప్రాణి ప్రేమికులు సూచిస్తున్నా రు. పర్యావరణానికి కలిగే అపార నష్టంతోబాటు ఆ అడవుల మీద ఆధారపడి తమ జీవనాన్ని కొనసాగిస్తున్న ప్రజల గతి ఏమౌతుంది? అడవుల్లో చిన్న తరహా అటవీ ఉత్పత్తులను సేకరించి తమ జీవనాన్ని వెళ్ళదీస్తున్నవారు చాలామంది ఉన్నారు. ఆ అడవులు ధ్వంసం అయితే వారి జీవనోపాధి ఏమౌతుంది? వారికి ప్రభుత్వం ఏ ప్రత్యామ్నాయాన్నీ చూపించకుండా అడవులను ధ్వంసం చేయడానికి అనుమతిస్తే అది వారందరి జీవితాలనూ నాశనం చేయడమే ఔతుంది. ఉమ్మడి సంపదను కొందరు కొల్లగొట్టి పోగేసుకునే ‘’ఆదిమ సంచయం’’ ఫలితంగా అనేకుల జీవితాలు విధ్వంసం అవుతాయని మార్క్స్‌ చెప్పాడు. ఇప్పుడు అదే జరుగుతోంది. పలు దళిత, గిరిజన సంఘాలు మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన చట్ట సవరణను బలంగా వ్యతిరేకించడంలో ఆశ్చర్యప డాల్సిందేమీ లేదు. అటవీ భూములను ప్రైవేటీకరించే ఈ ప్రయత్నం ఒక పెద్ద సవాలును ముందుకు తెచ్చింది. అది కేవలం అడవీ భూములకు సంబంధించినదే కాదు, మొత్తం భూమికి సంబంధించినది. మన దేశంలో భూమి కొరత చాలా ఉంది. అంతే కాదు, ఆ కొరతను భర్తీ చేయడం కూడా అసాధ్యం. అటువంటప్పుడు ఆ పరిమితమైన భూమిని ఏ విధంగా వినియోగిస్తున్నారు అనేది ఉపాధి, ఆహార భద్రత, తదితర సామాజిక లక్ష్యాలపై ప్రభావం చూపుతుంది. ఆ లక్ష్యా లను సాధించడంలో భూమి వినియోగం కీలకం ఔతుంది. అందుచే త అటువంటి కీలకమైన భూమి వినియోగాన్ని ప్రైవేటు వ్యక్తుల ఇష్టాలకు వదిలిపెట్టకూడదు. భూమిని మొత్తంగా సమాజపరం చేయలేకపోవచ్చు. కాని భూ వినియోగాన్ని మాత్రం సామా జికంగా నియంత్రించాల్సిందే. వరిసాగులో ఉన్న భూములను ఇతరత్రా వినియోగించడాన్ని నియంత్రిస్తూ కేరళ రాష్ట్రంలో చేసిన చట్టం వెనుక ఉన్న తర్కం ఇదే.దీనర్ధం ఏమిటి? ఒకరివద్ద నుండి మరొకరు కొంత భూమిని కొంటున్నప్పుడు ఆ లావాదేవీని అనుమతించా లంటే ఒక షరతు విధించాలి. ఆ భూమి చేతులు మారాక దాని వినియోగం మారితే (పంట పొలంగా ఉన్నది కాస్తా ఇళ్ళ నిర్మాణా నికో, ఫ్యాక్టరీ కట్టడానికో ఉపయోగిస్తే) అలా మారిన వినియోగం సమాజానికి మోదయో గ్యంగా ఉండాలి అన్నదే ఆ షరతు. ఈ సూత్రా న్ని అనుసరించే 1996లో సుప్రీం కోర్టు అటవీ భూములను వేరే విధంగా వినియోగించడాన్ని నిరోధిస్తూ తీర్పు చెప్పింది. పర్యావరణ రక్షణ దృష్ట్యా, స్వేచ్ఛా మార్కెట్‌ (కార్పొరేట్లను) కార్యకలా పాలను నియంత్రిం చడం అవసరమేనని అందరూ ఒప్పుకుం టారు. కాని మొత్తం సమాజం ప్రయోజనా లను కాపాడాలంటే ప్రైవేట్‌ కార్పొరేట్ల ప్రయోజనాలను నియంత్రించాల్సిందే అన్న సాధారణ సూత్రం లో ఇదొక అంతర్భాగ మేనని అందరూ గమనించాలి.ప్రస్తుతం మన దేశంలో భూ వినియోగం విషయంలో ప్రైవేట్‌ కార్పొరేట్ల ప్రయోజనాలు సామాజిక ప్రయోజ నాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ అవసరాల కోసం, గోల్ఫ్‌ కోర్సుల కోసం చాలా ఎక్కువ మంది పేదలు నివసిస్తున్న భూములను ఖాళీ చేయిస్తున్నారు. స్వల్ప సంఖ్యలో ఉండేవారి కోసం అధిక సంఖ్యాకుల ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారు.ఇప్పుడు దేశంలో భూ విని యోగాన్ని సామాజిక ప్రయోజనాల దృష్ట్యా నియంత్రించడానికి ఏ విధమైన పద్ధతులను ప్రవేశ పెట్టాలన్న ప్రశ్న మనల్ని వెనక్కి లాగే యకూడదు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి మార్కెట్‌లో అమ్మకానికి వచ్చే ఏ భూమినైనా మొదట ఆ కార్పొరేషన్‌కే అమ్మజూపాలి అన్న నిబంధన విధించాలి. అప్పుడు ఆ కార్పొరేషన్‌ ఆ భూమిని కొని దానిని తిరిగి మరొకరికి అమ్మేటప్పుడు ఆ కొనుగోలుదారులు దాన్ని సామాజికంగా ఆమోదయోగ్యంగా ఉండే విధంగా వినియోగించే షరతును అమలు చేయగలుగుతుంది. లేదా, నేరుగానే ఇద్దరు వ్యక్తుల మధ్య భూ లావాదేవీ జరిగినప్పుడు దానిని కొనేవారు సామాజికంగా ఆమోద యోగ్యమైన రీతిలోనే వినియోగిం చాలన్న షరతును విధించవచ్చు. ఆ షరతును ఉల్లంఘిస్తే భారీ జరిమానా విధించవచ్చు.ఐతే ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఇందుకు పూర్తి వ్యతిరేక దిశలో అడుగులు వేస్తోంది. మార్కెట్‌ అవసరాలకు (కార్పొరేట్ల అవసరాలకు) అను గుణంగా భూ వినియోగా న్ని మార్చే పనిలో ఉంది.పెట్టుబడి ఆదిమ సంచయంతో ఇటు వంటి మార్పులే జరుగు తాయి. భూమితో సహా అన్ని సంపదలూ సమిష్టిగా అనుభవిస్తు న్నవిగాని, చిన్న చిన్న యజమానులు అనుభ విస్తున్నవి గాని కొద్ది మంది కార్పొరేట్ల చేతుల్లో చిక్కడమే కాకుండా,ఆ సంపదల విని యోగం తీరు కూడా మారి పోతుంది. చిన్న చిన్న రైతుల చేతుల్లో ఉండే భూమి కాస్తా కొద్ది మంది కార్పొరేట్ల పాలైతే అప్పుడు అక్కడ చిన్న తరహా ఉత్పత్తి విధానం పోయి, భారీ స్థాయి సరుకుల ఉత్పత్తి మొదలౌతుంది. నల్ల వ్యవసాయ చట్టాలు ఈలక్ష్యం కోసమే రూపొం దాయి. తమ తమ స్వంత వినియోగం కోసం గాని,ఎఫ్‌సిఐద్వారా దేశ ఆహార అవసరా లను తీర్చడం కోసం గాని ప్రధానంగా పంటలు పండిరచే చిన్న ర్కెటతుల నుండి భూమి కార్పొరేట్ల పరం చేసి సంపన్న పెట్టు బడిదారీ దేశాల అవసరాలను తీర్చే వాణిజ్య పంటలు పండిరచడానికిఆ చట్టాలు తోడ్పడ తాయి. ఇప్పుడు అటవీ సంరక్షణ చట్టానికి చేస్తున్న సవరణ కూడా అటవీ భూముల వినియోగాన్ని మార్చి స్వదేశీ, విదేశీ సంపన్ను ల అవసరాల కోసం మళ్ళించడానికే ఉప యోగపడుతుంది.ఆ అడవుల మీద ఆధారపడి జీవిస్తున్న ఆదివాసులను అడివికి దూరం చేస్తుంది. (స్వేచ్ఛానుసరణ) – (ప్రభాత్‌ పట్నాయక్‌)

మనువాదం వర్సెస్‌ మానవాదం

మన దేశానికి సంబంధించి ఆలోచిస్తే, ఇక్కడ వేళ్ళూనుకుని ఉన్న మను వాదాన్ని తిరస్కరిస్తూ మానవ వాదాన్ని బలపరుస్తూ ముందుకు సాగాల్సి ఉంది. పార్టీలు వేరైనా, వారు రాజకీయ ప్రత్యర్థులయినా దేశ ప్రధాని మొదలుకొని కొందరు ముఖ్య మంత్రుల వరకు చేసే పనులన్నీ ఒకటే! ప్రజా ధనాన్ని ఒకరు ఒక దేవాలయం మీద ఖర్చు పెడితే, మరొకరు మరో దేవాలయం మీద ఖర్చుపెడుతున్నారు. పూజలకు, యాగాలకు ప్రాధాన్య మిస్తున్నారు. వాటి వల్ల సామాన్యులకు ఒరిగేదేమిటి? మూఢత్వంలోంచి వారు బయటికి రాకుండా అణిచిపెట్టడమే కదా ?
ఇవాళ ప్రపంచంలో మూడు అతి పెద్ద భారీ వ్యాపార వస్తువులు ఉన్నాయి. ఒకటి-ఆయుధాలు, రెండు- మాదకద్రవ్యాలు, మూడు-ఆధ్యాత్మికత.ఆయుధాలు, మాదక ద్రవ్యాల తయా రీలో ఎంతోకొంత పని చేయాల్సి ఉంటుంది. ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఆధ్యా త్మికతలో ఇవ్వాల్సింది ఏమీ ఉండదు.చేయా ల్సింది కూడా ఏమీ ఉండదు. అందుకే భారత దేశంలో ఆధ్యాత్మికవేత్తలు ఎక్కువ. ఈ ఆధ్యాత్మిక సూపర్‌ మార్కెట్‌లో అడిగిన వెంటనే నిర్వాణం దొరుకుతుంది.ఈమెయిల్‌లో మోక్షం అందు తుంది.ఆత్మసాక్షాత్కారంలో క్రాష్‌ కోర్సు ఉం టుంది.నాలుగైదు సులభ వాయిదాలలో విశ్వ చైతన్యం లభిస్తుంది.ఈఆధ్యాత్మిక సూపర్‌ మార్కె ట్‌కు ప్రపంచ వ్యాప్తంగా గొలుసు దుకాణాలు న్నాయి. అశాంతితో ఉన్న ఉన్నత వర్గాలు, సంపన్న కుటుంబాలు ఆ దుకాణాలలో ఆధ్యాత్మి కత పేరుతో దొరికే ఫాస్ట్‌ఫుడ్‌ కొనుక్కుని తింటూ ఉంటాయి.అదేమిటో పూటపూటకూ రెక్కలు ముక్కలు చేసుకునే వారికి దీని అవసరమే ఉండదు.
నిజాలు చెప్పినప్పుడు ఎవరి మనోభా వాలైనా దెబ్బతింటే, వారు-వారి మనోభావాల్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నిజాలు ఎప్పుడూ మారవు. వాటిని మార్చి చెప్పి కొందరికి సంతోషం కలిగించాలను కుంటే అవి, అప్పుడు నిజాలుగా ఉండవు కదా? నిజాలు తెలుసుకోవా లనుకున్న నిజాయితీ గలవారు మనోభావాల్ని మూసి పెట్టుకుని,నిజాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి! కృష్ణా కాన్షస్‌నెస్‌కు సంబం ధించిన ఓ స్వామి, మనల్ని ఎలా ఆలోచించమని చెపుతున్నాడో చూడండి…దేవాలయాల అవసరం చాలా ఉంది అని,మనతోనే చెప్పించాలని చాలా తాపత్రయ పడుతున్నాడు. ఆయన ఇలా అన్నా రు… ‘దేవాలయాలు కట్టడానికి అనవసరం గా ధనం ఎందుకు ఖర్చు చేస్తున్నారూ? అని కొందరు అంటూ ఉంటారు. దేవాలయాలు కట్టడంకంటే పేదల ఆకలి తీర్చవచ్చు కదా? పాఠశాలలు, ఆసుపత్రులు కట్టొచ్చుకదా? అవసరమైన వారికి అవసరమైన రీతిలో ఖర్చు చేయవచ్చు కదా?’’ అని ప్రశ్నిస్తుంటారు. నిజమే! కానీ, క్లబ్‌లు, పబ్‌లు, సినిమా హాళ్ళు,క్రికెట్‌ల మీద ఎందుకు ఖర్చు చేస్తున్నారు-అనేది మాత్రం ఆలోచించరు. మనిష న్నాక ఎంటర్‌టెయిన్‌మెంట్‌ అవసరం కదా అని అంటారు.కానీ,ఎన్‌లైట్‌మెంట్‌ కూడా అవసరమని ఆలోచించరు.మనిషైన వాడికి ఆధ్యాత్మిక చింతన, ప్రశాంత జీవనం అవసరమే కదా? మానసిక వేదనలతో రోజుకు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదుపుతప్పిన ఆవేశాలతో ఎందరో ఎన్నో దుర్మార్గాలు చేస్తున్నారు. వారిని సన్మార్గంలో పెట్టాల్సిన పనిలేదా? దైవ చింతనతో గడుపుతూ జీవితాన్ని సక్రమ మార్గంలో పెట్టు కోవాల్సిన పనిలేదా? మా హరేరామ హరేకృష్ణ మిషన్‌ లాంటివి పేదలకు ఉచిత భోజనం కూడా అందిస్తున్నాయి. మత పరమైన విహార యాత్రలు పెరిగితే,ఆర్థిక వనరులు పెరుగుతాయి.వాటి చుట్టూ మరెన్నో వ్యాపారాలు పెరుగుతాయి. ఇవన్నీ ఎందుకు ఆలోచించరూ?’’ అని స్వామి ప్రశ్నించారు. ఇందులో మనం ఎన్‌లైట్‌మెంట్‌- జ్ఞానోదయం గురించి మాట్లాడే పనేలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని మతాల ప్రార్థనా స్థలాల్లో ‘పూజారులు’గా ఉన్నవారికే జ్ఞానోదయం కాలేదు. ఇక ఓ గంట కోసమో, పూటకోసమో ఇలా వెళ్ళి అలా వచ్చేవారికి ఏం జ్ఞానోదయం అవుతుందీ? హరేరామ హరేకృష్ణ వాళ్ళు, సిక్కు గురుద్వార వాళ్ళు, సంత్‌సంగ్‌ల వాళ్ళు వాళ్ళదగ్గరికి వచ్చిన వారికి భోజనం పెడుతుంటారు. ఎందుకంటే వారి దగ్గరికి వచ్చినవారి సంఖ్య తగ్గిపోగూడదని! అది వారి జాగ్రత్త!! జనం ఆకలి తీర్చాలంటే మురికివాడల్లో తిండిలేక మలమల మాడుతున్న వారి దగ్గరికి వెళ్ళాలి. దేవాలయాల ముందు, మెట్ల మీద అడుక్కునేవారు ఉంటారు. వారి ఆకలి తీర్చాలి కదా ?
క్రికెట్‌, పబ్స్‌, సినిమాహాళ్ళూ ఎలా వ్యాపార కేంద్రాలో- అలా అన్ని మతాల అన్ని ప్రార్థనా స్థలాలు, దేవాలయాలు కూడా వ్యాపార కేంద్రాలేనని మొదట ఒప్పుకోండి! ఎన్ని ఆత్మహ త్యలు ఈ దేవాలయాలు ఆపగలిగాయి? ఎన్ని అత్యాచారాల్ని, ఎన్ని హత్యల్ని, ఎన్ని డ్రగ్స్‌ దం దాల్ని ఈ దైవ క్షేత్రాలు ఆపగలిగాయీ? ఎవరైనా లెక్కలివ్వగలరా? ఈ ఆధ్యాత్మికత ఎందమందికి ప్రశాంతత ఇవ్వగలుగుతోంది? ఎంతమందికి ఆత్మస్థయిర్యాన్ని ఇవ్వగలుగుతోంది? ప్రపంచంలో ఎక్కడా లేని ఆధ్యాత్మిక కేంద్రాలు ఈ దేశంలో ఎక్కువ! మరి ఏ దేశంలోనూ లేని అల్లకల్లోలం ఈ దేశంలో ఎందుకుందీ? ఆత్మవిమర్శ చేసుకో వాలి కదా? దేవుడొక్కడే అని చెపుతున్నప్పుడు ఇన్ని రకాల ప్రార్థనా స్థలాలు ఎందుకున్నాయీ? వాటి మధ్య విభేదాలెందుకున్నాయి? వాటి కారణంగా జనం ఎందుకు విడిపోతున్నారూ? జనం మధ్య రాజకీయాలు చొరబడి అగాధాలు ఎందుకు పెంచుతు న్నాయీ? జనం మధ్య చిచ్చు పెట్టి ఘర్షణలకు ఎందుకు దారి తీస్తున్నాయీ? ఏ మత కేంద్రంలోనైనా ‘మానవత్వం’ అనే మాట వినిపించదు ఎందుకూ?మనిషి ప్రమేయం లేకుం డా ఏ మతానికి చెందిన ఏదేవుడైనా ఏమీ చేయ లేడని ఎందుకు ప్రకటించరు?జ్ఞానోదయం సంగతి తర్వాత చూద్దాం ముందు మీరు చెప్పే దేవదేవుణ్ణి ‘నిజం’ చేసి చూపండి.
దేవుడే అబద్దం! అబద్దానికి బంగారు కిరీటాలుపెట్టి,పట్టుబట్టలు కట్టి, గుళ్ళూ గోపురాలు కట్టి,పూజలు, భజనలు చేసినంత మాత్రాన అబ ద్దం నిజమైపోతుందా?కల్పించుకున్న దేవుడు శక్తిమంతుడైపోతాడా?ఒకవైపు దేవుణ్ణి శక్తిమం తుణ్ణి చేయడానికి-మరోవైపు మనుషుల్ని విభజించి శక్తిహీనులుగా తయారు చేయడానికి రాసుకున్నదే‘మనుధర్మశాస్త్రం’.ఇది మనుషులంతా ఒక్కటే అని చెప్పే ఆధునిక మానవవాదం ముందు నిలవదు- మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏ ప్రార్థనా స్థలమూ అక్కరలేదు. ఏ నది ఒడ్డునో, చెరువు గట్టునో,చెట్ల మధ్యో గడిపితే చాలు. ఏదీ లేకపోతే డాబామీద పడుకుని ఆకాశం, నక్షత్రాలు చూస్తూ ఆనందించగలిగితే చాలు.దేవాలయాల చుట్టూ,ప్రార్థనా స్థలాల చుట్టూ తిరిగి ఎన్‌లైట్‌ మెంట్‌ పొందిన వాడు ఎవడైనా ఉన్నాడా? వేల వేల మందితో కలిసి, క్యూలలో నిలబడి, దైవద ర్శనం గోలలో పడి, ఒళ్ళు హూనమై తల నొప్పు లు తెచ్చుకునే వారికి నిజంగానే జ్ఞానోదయం కావాలి.కానీ అవుతోందా? ఆధ్యాత్మిక ప్రశాం తత-అక్కడ లభిస్తోందా?ఎవరికి వారు ఆలోచిం చుకోవాల్సిన విషయం. పారసిటమాల్‌ బిళ్ళవేసు కుంటే జ్వరం తగ్గినట్టు-ఏ ప్రార్థనా స్థలానికో పోయి కూచుంటే జ్ఞానోదయమైన ఉదంతాలు న్నాయా? దేవాలయాల నిర్మాణం కన్నా పాఠశా లలు కట్టండి! ఆసుపత్రులు కట్టండి!! అని చెప్పేది ఎందుకంటే భావితరాల కోసం. ఇప్పటి పిల్లల్ని రేపటి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడం కోసం. ఇక ఆసుపత్రులుంటేనే అందరి ఆరోగ్యాలు బావుంటాయి గనుక ! ప్రార్థనా స్థలాలకు వెళితే చదువురాదు,ఆరోగ్యమూ బాగుపడదు.లేని దేవుణ్ణి నమ్మి, మూఢభక్తికి అలవాటు పడి జీవితాన్ని అబద్దంగా మార్చుకోవడం జరుగుతోంది. జబ్బు లకు వైద్యం చేయించుకోకుండా దేవుడికి మొక్కు కున్నంత మాత్రాన, ముడుపులు కట్టినంత మాత్రాన, ఉపవాసాలున్నంత మాత్రాన ఎవరికీ ఏ జబ్బూ ఎప్పుడూ తగ్గలేదు.తగ్గినవి ఉంటే నిరూపించి చూపాలి కదా?ప్రార్థనా స్థలాన్ని కానీ, దైవ క్షేత్రాన్ని కానీ దర్శించుకుని వస్తే శరీరం నుంచి నెగటివ్‌ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్‌ ఎనర్జీ వస్తుంది-అని కొందరు విశ్వాసకులు దుష్ప్రచారం చేస్తుంటారు.వ్యక్తిగతంగా మనిషి ఆలోచనా విధా నాన్ని బట్టి పాజిటివ్‌,నెగటివ్‌లు ఉంటాయి తప్పితే ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఏమీ ఉండదు.మొక్కులు, ముడుపులు ఎంత హాస్యా స్పదంగా ఉంటాయో చెప్పడానికి ఇక్కడ ఒక వాస్తవ సంఘటనని గుర్తుచేస్తున్నాను. ఒకసారి ఒకతను అడవిలో నడుస్తూ ఉండగా చెప్పు తెగి పోయింది. తెగిన చెప్పుతో ముందుకు నడవలేక అతను ఒకచిలిపి పనిచేశాడు. దాని పక్కన గల ఒక చెట్టుకు తెగిన చెప్పులు తగిలించి, చెట్టు పక్కనఉన్న బండ మీద బొగ్గుతో ఇలా రాశాడు… ‘’ఈ చెట్టు కొమ్మమీద మీ చెప్పులను వేలాడదీస్తే మీ భార్య మీ చెప్పుచేతల్లో ఉంటుంది’’ అని… రాసి వెళ్ళిపోయాడు. అంతే! కొన్నాళ్ళకు ఆ చెట్టు కొమ్మలకు వందలచెప్పులు వేలాడబడ్డాయి. తెగిన చెప్పులు కాదు, వాడుకుంటున్న మంచి జతలు, కొత్తగా కొన్నవీ, అన్నీ చెట్టుకొమ్మల మీదికి చేరా యి. ఆ ప్రాంతంలో అదొక ఆచారమైంది. తర్వా త కాలంలో ఆ చెప్పుల చెట్టును వెతుక్కుంటూ జనం రాసాగారు. కొంతకాలానికి ఆ చెట్టు ఎటు వైపు ఉందో చూపడానికి డైరెక్షన్‌ బోర్డులు వెలి శాయి. చెప్పులచెట్టు-తిరనాళ్ళ అయ్యింది. ప్రతి సంవత్సరం జనం గుమిగూడి ఉత్సవం చేయడం ప్రారంభించారు. సంప్రదాయాల పేరుతో మూర్ఖత్వం ఎలా వ్యాప్తి చెందుతుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ! ఇలాంటివి దేశంలో అనేక చోట్ల అనేక ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి.
‘ప్రపంచం మారాలని మనం కోరుకో వడం కాదు, మార్పు మనతో మొదలైతే ప్రపంచం అదే మారుతుంది’అన్నాడు ప్రపంచ ప్రసిద్ధ రష్యన్‌ రచయిత లియో టాల్‌స్టారు. మన దేశానికి సంబం ధించి ఆలోచిస్తే, ఇక్కడ వేళ్ళూనుకుని ఉన్న మను వాదాన్ని తిరస్కరిస్తూ మానవ వాదాన్ని బలపరు స్తూ ముందుకు సాగాల్సి ఉంది. పార్టీలు వేరైనా, వారు రాజకీయ ప్రత్యర్థులయినా దేశ ప్రధాని మొదలుకొని కొందరు ముఖ్యమంత్రుల వరకు చేసే పనులన్నీ ఒకటే! ప్రజా ధనాన్ని ఒకరు ఒక దేవాలయం మీద ఖర్చు పెడితే, మరొకరు మరో దేవాలయం మీద ఖర్చుపెడుతున్నారు. పూజలకు, యాగాలకు ప్రాధాన్యమిస్తున్నారు.వాటి వల్ల సామాన్యులకు ఒరిగేదేమిటి? మూఢత్వంలోంచి వారు బయటికి రాకుండా అణిచిపెట్టడమే కదా? ఒకసారి ఆలోచించండి!
వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్‌ – (డా.దేవరాజు మహారాజు)

1 2 3 4 5 6 13