అటవీ హక్కుల చట్టం..ఆదివాసీలకు అన్యాయం

‘‘ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో అడవుల్లో నివసిస్తున్న ఇలాంటి 10 లక్షల కుటుంబాలు అక్కడి నుంచి ఖాళీ చేయాలని సూచించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే దానిపై తానే స్టే తెచ్చుకుంది. అటవీ హక్కుల కోసం వచ్చిన 40 లక్షల దరఖాస్తులను పరిశీలించిన అనంతరం 17 రాష్ట్రాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా సుప్రీం ఈ ఆదేశాలు జారీచేసింది. మూడు తరాలుగా అడవిలోనే నివిసిస్తున్న ఆధారాలుచూపుతూ వచ్చిన దరఖాస్తులను మూడు దశల్లో పరిశీలించిన తరువాత ఈ రాష్ట్రాల్లో సుమారు 18 లక్షల దరఖాస్తులను ఆమోదించారు. వారికి భూపత్రాలు కూడా అందించారు. ఇదే సమయంలో 10 లక్షలకు పైగా కుటుంబాల నుంచి వచ్చిన దరఖాస్తులను తిరస్కరించారు. దీంతో వారంతా అడవులను ఖాళీ చేసి వెళ్లిపోవాలని సుప్రీం ఆదేశించింది. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున గిరిజనులను తరలించాల్సి రావడం అనేది ఇదే ప్రథమమని ఎన్విరాన మెంటల్‌ జర్నలిస్ట్‌ నితిన్‌ శేఠీ అన్నారు. అడవులు ఆక్రమణకు గురవుతున్నాయని.. అడవుల్లో అక్రమంగా నివసిస్తున్నవారి కారణంగా వన్యప్రాణి సంరక్షణ ప్రమాదంలో పడుతోందని వైల్డ్‌ లైఫ్‌ యాక్టివిస్ట్‌లు న్యాయస్థానాలను ఆశ్రయించారు. అటవీ హక్కుల చట్టం అనేది అనాదిగా అరణ్యాల్లో నివసిస్తున్నవారికి భూమిపై హక్కు కల్పించడానికి ఉద్దేశించిందే కానీ భూపంపిణీ, వితరణకు ఉద్దేశించింది కాదని పిటిషన్‌దారులు అంటున్నారు. గిరిజనానికి మద్దతుగా మాట్లాడుతున్న వారు మాత్రం ఈ చట్టం అమలు లోపభూయిష్ఠంగా ఉందంటున్నారు. ..’- గునపర్తి సైమన్‌

భారత్‌ 10కోట్ల మంది గిరిజనులకు ఆవాసం.. ఓచరిత్రకారుడి మాటల్లో చెప్పాలంటే వారు అణగారిన అల్పసంఖ్యాకులు. ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్న రాష్ట్రాల్లోని దట్టమైన అడవుల్లో వీరు మనుగడ కోసం పోరాడుతూ దుర్భర జీవనం గడుపుతున్నారు. దేశంలోని మొత్తం గిరిజన జనాభాలో 40 లక్షల మంది రక్షిత అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దేశంలో సుమారు 500 వైల్డ్‌ లైఫ్‌ శాంక్చ్యురీలు, 90జాతీయ పార్కులు ఉన్నాయి. ఇది భారతదేశ మొత్తం విస్తీర్ణంలో సుమారు 5శాతం ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం 2005డిసెంబర్‌13కి పూర్వం నుంచి అడవిలో నివిసిస్తున్న గిరిజనులకు వారి అనుభవంలో ఉన్న భూమిలో నివసించే హక్కు ఉంటుంది. అడవుల్లోని ఇతర సంప్రదాయ తెగలు ఎవరైనా నివాసం ఉంటే వారు 2005 డిసెంబరు 13కి పూర్వం నుంచి మూడు తరాలు అక్కడ నివసిస్తున్నట్లు ఆధారాలు చూపించాలి. అప్పుడే వారి ఆక్రమణలో ఉన్న అటవీ భూమిపై వారికి హక్కు ఉంటుంది. ఇక్కడ తరం అంటే చట్టంలో 25ఏళ్లుగా తీసుకున్నారు. అంటే.. 2005 డిసెంబరు 13కి ముందు 75 ఏళ్లుగా అక్కడ నివసిస్తున్నవారై ఉండాలి. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో అడవుల్లో నివసిస్తున్న ఇలాంటి 10లక్షల కుటుంబాలు త్వరలో అక్కడి నుంచి ఖాళీ చేయాలని సూచించింది. అటవీ హక్కుల కోసం వచ్చిన 40లక్షల దరఖాస్తులను పరిశీలించిన అనంతరం 17రాష్ట్రాలు ఇచ్చిన సమా చారం ఆధారంగా సుప్రీం ఈఆదేశాలు జారీచేసింది. మూడు తరాలుగా అడవిలోనే నివిసిస్తున్న ఆధారాలుచూపుతూ వచ్చిన దరఖాస్తులను మూడు దశల్లో పరిశీలించిన తరువాత ఈరాష్ట్రాల్లో సుమారు 18లక్షలదరఖాస్తులను ఆమోదించారు. వారికి భూపత్రాలు కూడా అందించారు. ఇదే సమయంలో10 లక్షలకు పైగా కుటుంబాల నుంచి వచ్చిన దరఖాస్తులను తిరస్కరించారు. దీంతో వారంతా అడవులను ఖాళీ చేసి వెళ్లిపోవాలని సుప్రీం ఆదేశిం చింది. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున గిరిజనులను తరలించాల్సి రావడం అనేది ఇదే ప్రథమమని పర్యావరణం, అటవీ సామాజికవేత్తలు అభిప్రాయపడు తున్నారు. అడవులు ఆక్రమణకు గురవుతున్నాయని..