కష్టం కన్పించింది..కలెక్టర్ మనసు కదిలింది

పిలవలేదు.. అయినా పలకరించారు.గోడు చెప్పకముందే గమ నించి… బాధను అర్థం చేసుకున్నారు.అధికారి కాదు.. ఆపన్న హస్తమయ్యారు!..విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ కంటపడిన కష్టం..క్షణాల్లో కదిలిన మానవత్వం చాటుకున్నారు. దిక్కుతోచని తల్లిదండ్రులకు..కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ భరోసాగా నిలిచారు. ఆ ఉన్నతాధికారి కరుణా కటాక్షంతో..ఆ కుటుంబానికి ఆశ చిగురించింది!. అధికారం అంటే ఆదేశాలు ఇవ్వడం మాత్రమే కాదు..ఆపదలో ఉన్నవారి వద్దకు వెళ్లి వారి గోడు వినడమూ మానవత్వమేనని కలెక్టర్ చూపిన ఈ స్పందన పలువురి ప్రశంసలు అందుకుంది.
విశాఖ జిల్లా కలెక్టర్ మెట్లు ఎక్కేందుకు వెళ్తున్న సమయంలో కనిపించిన ఆదివ్యాంగుడిని చూసి ఆగిన కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్..ఆప్యాయంగా పలకరించివారి సమస్యను ఆసక్తిగా విన్నారు. వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి భరోసా ఇచ్చారు. ఆగష్టు 24న ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే పీజీఆరఎస్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కలెక్టరేట్‌కు వచ్చిన కలెక్టర్..తన వాహనం దిగి కార్యాల యానికి వెళ్తున్నారు. అదే సమయంలో రెడ్‌క్రాస్ వాలంటీర్ సహాయంతో లిఫ్ట్ వైపు వెళ్తున్న ఓదివ్యాంగుడు ఆయన కంట పడ్డాడు. వెంటనే అక్కడే ఆగి అతడి వద్దకు వెళ్లిన కలెక్టర్..ఏమైంది..మీ సమస్య ఏమి టి?”.. అంటూ ఆప్యాయంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రూ.6 వేల పింఛన్‌తో ఇబ్బందులు..
భీమిలి మండలం చిప్పాడ గ్రామానికి చెందిన జి.రాంబాబు మానసిక దివ్యాం గుడు. ప్రస్తుతం వికలాంగుల కోటాలో నెలకు రూ.6 వేల పింఛన్ అందుతోంది. రాంబాబు తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుమా రుడి పోషణకు ప్రస్తుత ఆర్థిక సాయం సరిపోవడం లేదని, బెడ్‌రిడెన్ కేటగిరీలో రూ.15 వేల పింఛన్ మంజూరు చేయాలని వారు కలెక్టర్‌ను కోరారు. వారి సమస్యను సానుకూలంగా విన్న కలెక్టర్..సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా “ఇకపై రాంబాబును ఇక్కడికి తీసుకురావద్దు..కష్ట పెట్టొద్దు. మీ ఇంటికే అధికారులు వస్తారు” అని తల్లిదం డ్రులకు భరోసా కల్పించారు.మా దగ్గరకే వచ్చి గోడు విన్నారు’ సమస్యను చెప్పేందుకు కలెక్టర్‌ను ప్రత్యేకంగా కలవాల్సిన అవసరం లేకుండానే..ఆయనే తమ వద్దకు వచ్చి ఆప్యాయంగా పలకరించి గోడు విన్నా రని రాంబాబు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. తమ పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే స్పందించిన కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.- జి ఎస్ సునీల్ కుమార్ 

చిన్న ప్రశ్న.. పెద్ద సామాజిక మార్పుకు నాంది!

విశాఖ ఉమ్మడి జిల్లా అనంతగిరి మండలంలోని బొర్రాగుహల భద్రతపై మొదలైన చిన్న సందేహం..క్రమంగా గిరిజనుల భూమి హక్కులు,మైనింగ్ లీజులు,రాజ్యాంగ రక్షణలు, పర్యావరణన్యాయం,అభివృద్ధిలో ప్రజలభాగస్వామ్యంవంటి విస్తృతమైన ప్రశ్నలుగా మారింది. చివరకు అది ఒక సుదీర్ఘ న్యాయపోరాటానికి నాంది పలిక1989లో బొర్రా ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలు,పేలుళ్లు జరుగుతున్నట్లు గమనించిన నేను అక్కడి సిబ్బందిని ప్రశ్నించారు.‘ప్రభుత్వమే లీజులు ఇచ్చింది’అన్న సమాధానం ఆయనకు ఎదురైంది.అక్కడితో ఆప్రశ్న ముగిసినా..సమస్య మాత్రం సమిసిపోలేదు.1992లో గిరిజన యువతకోసం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో గమ్మెల దేవకుమార్ వేసిన ప్రశ్న ఈసమస్యకు అసలు రూపాన్ని చూపించింది. తరతరాలుగా భూమినిసాగు చేసుకుంటున్న గిరిజనులకు హక్కుపత్రాలు లేవు.అదే భూమిపై మైనింగ్ కంపెనీలకు మాత్రం ప్రభుత్వ లీజులు ఉన్నాయి. తమ భూమిపై తమకే హక్కులు లేకపోతే..ఆభూమిపై మైనింగ్ హక్కులు ఇతరులకు ఎలా వచ్చాయి?అన్న ప్రశ్న న్యాయపోరాటానికి దారితీసింది.
ఈ నేపథ్యంలో సమత న్యాయపోరాటాన్ని ప్రారంభించింది.1997లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక సమత తీర్పు షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజన భూములు,సహజ వనరులు,మైనింగ్ హక్కులపై కీలకమైన రాజ్యాంగసూత్రాలను బలపరిచింది.షెడ్యూల్డ్ ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో ప్రజల హక్కులను పక్కనపెట్టి సహజవనరులను వినియోగించడం సమర్థనీయం కాదనే భావ నకు ఈతీర్పు బలమైన పునాది వేసింది.
అయితే కోర్టు తీర్పుతోనే బొర్రా ప్రజల భూమి సమస్యకు వెంటనే పరిష్కారం లభించలేదు.పాత భూవివాదాల కారణంగా పదిగ్రామాల భూమిసెటిల్మెంట్ ప్రక్రియ సంవత్సరాల పాటు నిలిచి పోయింది.చివరకు భూమి హక్కుల సమస్య పరిష్కారమై ప్రజలకు పట్టాలు అందడం..దశాబ్దాల పోరాటంలో ఒకముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.
నేడు మైనింగ్‌తో పాటు రహదారులు,విద్యుత్ ప్రాజెక్టులు,పరిశ్రమలు,పర్యాటకం,భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు గిరిజనప్రాంతాలపై ప్రభావం చూపుతున్నాయి.అభివృద్ధి స్థానికులకు ఉపాధి ఆదాయం కల్పించాలి.కానీ అదే సమయంలో భూమి, అడవి, నీరు, సంస్కృతి, గ్రామసభ నిర్ణయాధికారం బలహీనపడితే..ఆఅభివృద్ధి ఎవరి కోసం?అనే ప్రశ్న తప్పదు.మైనింగ్ లేదా ఇతర అభివృద్ధి ప్రాజెక్టులవల్ల ప్రభావితమయ్యే ప్రజలను కేవలం ‘బాధితులు’గా చూడకూడదు. వారు హక్కుదారులు.వారు నిర్ణయ భాగస్వాములు.వారు ప్రయోజన భాగస్వాములు.
భూమి,అడవి,నీరు,ఖనిజాలు కేవలం ఆర్థిక వనరులు కావు.అవే గిరిజన సమాజాల జీవ నాధారం,సంస్కృతి,ఆర్థిక భద్రతకుపునాది.అందుకే అభివృద్ధిప్రణాళికల్లో స్థానికప్రజల హక్కులు, వారి అనుమతి,వారి భాగస్వామ్యం,భవిష్యత్ తరాల ప్రయోజనాలు కేంద్రంగా ఉండాలి.బొర్రా కథ మనకు నేర్పేగొప్ప పాఠం ఇదే.ఒకనిజమైన ప్రశ్నను అడగడానికి ధైర్యం ఉంటే..అది ఒక సుదీర్ఘ పోరాటానికి నాందికావచ్చు.ఆపోరాటం పెద్ద సామాజిక మార్పుకు దారితీయ వచ్చు. అందుకే ప్రతిఅభివృద్ధి ప్రతిపాదనముందు..ప్రజల గొంతువినాలి.వారిహక్కులను గౌర వించాలి. వారి భాగస్వామ్యాన్ని నిర్ధారించాలి.ఎందుకంటే ఒకచిన్న ప్రశ్న కూడా..పెద్ద సామాజిక మార్పుకు నాంది కావచ్చు! – రెబ్బాప్రగడ రవి,ఎడిటర్ 

అరకులోయలో సంజీవని ప్రాజెక్టు ప్రారంభం

“ గిరిజనుల ఆరోగ్యం కాపాడుటంతోపాటు వారిని అన్ని విధాల అభివృద్ధిలోకి తీసుకురావడం ప్రభుత్వ బాద్యత. ఆరోగ్యపరంగా,ఆర్దికంగా వారి ఉన్నతికి ప్రాధాన్యమిస్తాం.ఏజెన్సీ ప్రాంతాల్లో అనారోగ్య సమస్యలకు సంజీవని కార్యక్రమం ద్వారా చెక్ పెడతామన్న నమ్మకం గిరిజన తెగల్లో వచ్చింది.సంజీవని రాష్ట్రానికి,దేశానికి ఒక గేమ్ ఛేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అల్లూరి జిల్లా అరకులోయ నియోజకవర్గం గన్నెలలో సంజీవని నిర్వహించడంతోపాటు ఆరోగ్య రథాలను జెండాడ ఊపీ ప్రారంభించారు. డ్రోన్‌ల ద్వారా రక్త నమÖనాల రవాణా విధానాన్ని పరిశీలించారు. పథకం అమలులో భాగంగా ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం సంజీవని లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించారు.” మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వైద్యం కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన అవసరం లేకుండా వైద్యం వారి దగ్గరకు రావాలన్న దే ప్రజా ప్రభుత్వం సంకల్పం అని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికీ నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమని వ్యక్తిగత డిజిటల్ హెల్త్ రికార్డులను రూపోందించేలా చేపట్టిన సంజీవనితో ప్రతీ ఒక్కరి ఆరోగ్యాన్ని సంరక్షిస్తామని సీఎం వివరించారు.ఈప్రాజెక్టును త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణ యించినట్లు తెలిపారు. అరకు లోయ నియోజకవర్గం గన్నెలిలో సంజీవని ప్రాజెక్టు అమలు తీరును ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజా వేదిక వద్ద ముఖ్యమంత్రి ప్రసంగించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రతి కుటుంబ జీవన ప్రమా ణాలు మెరుగుపడాలని, అదే నిజమైన అభివృద్ధి అని చంద్రబాబు అన్నారు. గిరిజన ప్రాంతాలకు మెరుగైన వైద్య సదుపాయాల కోసం రూ.250 కోట్లతో ట్రైబల్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంప్లీషన్ మిషన్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. సికిల్‌సెల్, తలసేమియా బాధితులకు నెలకు రూ.10వేల పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని మండలాల్లో తక్కువ ధరకే మందులు అందించే జన ఔషధి కేంద్రాలు ప్రారంభి స్తామని చెప్పారు. అల్లూరి జిల్లాలో సంజీ వని కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని సీఎం తెలిపారు.గతంలోనే అల్లూరి సీతారామరాజు గిరిజనులకు ఆయుర్వేద వైద్యాన్ని అందించారని గుర్తుచేశారు. అలాంటి మహనీయుడిని నిత్యం స్మరిం చుకునేందుకు కొత్తగా నిర్మించిన ఎయిర్ పోర్టుకు ఆయన పేరు పెట్టామని చెప్పారు. థింసా నృత్యంతో గిరిజన బిడ్డలు గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించడం అభినందనీయ మన్నారు.యోగా,ధ్యానం వంటి కార్యక్ర మాలను ప్రోత్సహిస్తూ ప్రజారోగ్యానికి ప్రాధా న్యత ఇస్తున్నామని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో కనెక్టివిటీ పెంచేందుకు సెల్ టవర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
డ్రోన్లతో అత్యవసర ఔషధాలు,వ్యాక్సీన్లు తరలింపు
ఏజెన్సీ ప్రాంతాల నుంచి రోగుల రక్త నమూనాలను డ్రోన్ల ద్వారా పెద్ద ఆసుప త్రులకు తరలించి పరీక్షలు నిర్వహించి చికిత్స అందించేలా చర్యలు చేపట్టామని సీఎం తెలిపారు. తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా గర్భిణులకు సేవలందిస్తున్నామని, 104 వాహనాల ద్వారా సంచార వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఇంటి వద్దే 41 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసర మైన మందులు అందించేలా చర్యలు తీసు కుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే కుప్పం నియోజకవర్గం,చిత్తూరు జిల్లాలో సంజీవని ప్రాజెక్టును అమలు చేస్తున్నామని, ఇది రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ గేమ్ చేంజర్‌గా మారుతుందని అన్నారు. అత్యవసర వైద్య సేవల కోసం అల్లూరి జిల్లాలో 150వాహనాలతో ఎమర్జెన్సీ లైఫ్‌లైన్ నెట్‌వర్క్ ఉందని చెప్పారు.గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఐదు సూత్రాలతో ప్రణాళికలు రూపొందించామని చంద్రబాబు తెలిపారు.‘అడవి తల్లి బాట’ పేరుతో రూ.1,000కోట్లతో 905 కిలోమీటర్ల రహదారులు నిర్మించామని చెప్పారు. 1.60 లక్షల ఇళ్లకు కుళాయి ద్వారా నీరు అందించడంతో పాటు సోలార్ రూఫ్‌టాప్ లను ఏర్పాటు చేస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి పెంచేందుకు అరకు కాఫీని మరో లక్ష ఎకరాల్లో సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అరకు ప్రాంతానికి పర్యాటకుల సంఖ్య పెరిగిందని, హోమ్‌స్టేల ద్వారా ఆతిథ్యం అందిస్తే గిరిజన కుటుంబాలకు ఆదాయం వస్తుందని చెప్పారు. పరిశ్రమల్లో గిరిజన యువతకు ఉద్యోగాలు దక్కేలా నైపుణ్యాభివృద్ధి కల్పిస్తామని తెలిపారు. వచ్చే మూడేళ్లలో లక్ష మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఆలోచన అన్నారు.- (జి.ఎ.సునీల్ కుమార్)

1 2