విశాఖలో ప్రాణాలు తీస్తున్న ఫార్మా కంపెనీలు

విశాఖ ఫార్మా పరిశ్రమలు ప్రజల పాలిట శాపంగామారుతున్నాయి. వరస ప్రమా దాలు జరగడం, కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం పరిపాటిగా మారింది. ఏటా లాభాల లెక్కలు వేసుకుంటున్న కంపెనీలు… ప్రాణాలు కోల్పోతున్న కార్మికుల సంఖ్య పెరిగి పోతున్నా సరే ఖాతరు చేయడం లేదు. యాజ మాన్యాలు భద్రతా ప్రమాణాలను తుంగలోకి తొక్కుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. పరిశ్రమల్లో భద్రతా లోపాలు కార్మికుల ప్రాణాలను బలిగొంటున్నాయి. అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మా, అచ్యుతాపురం ప్రత్యేక ఆర్ధిక మండలిలోని పలు పరిశ్రమల్లో తరచూ జరుగుతున్న ప్రమాదాలతో కార్మికలోకం వణికిపోతోంది. యాజమాన్యాల నిర్లక్ష్యంతో చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు,పేలుళ్లతో ఉద్యోగులతో పాటు పరిసర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదాలు జరిగి నప్పుడే అధికారులు హంగామా చేస్తున్నారు. తర్వాత పట్టించుకోవడం లేదు. పరవాడ ఫార్మాసిటీలోని లారస్‌ ల్యాబ్స్‌లో డిసెంబర్‌ 19న జరిగిన అగ్ని ప్రమా దంలో నలుగురు మరణించగా,ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈఘటనతో పారిశ్రామిక ప్రాంతమంతా ఉలిక్కిపడిరది. 2022 జనవరి నుంచి డిసెంబర్‌ ఏడాదిలోనే పది ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. సుమారు పదిమంది వరకు మృత్యువాత పడగా అనేక మంది గాయాలకు గురై దివ్యాంగులగా మారారు.-– గునపర్తి సైమన్‌
విశాఖ జిల్లాలో ఫార్మాకంపెనీల్లో తర చూ ప్రమాదాలు జరుగుతున్నాయి.కార్మికుల భద్ర త,రక్షణపై పరిశ్రమల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ప్రాణాధార మందులు తయారుచేసే ఫార్మా పరిశ్రమలు అక్కడ పనిచేసే ఉద్యోగుల, సిబ్బంది ప్రాణాలను తోడేసే మృత్యుకుహరాలుగా మారడం దారుణం. యాజమాన్యాల తప్పి దాలు,డెవలపర్‌గా ఉన్న సంస్థ నిర్లక్ష్యం, తనిఖీ లు నిర్వ హించి ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన పలు విభాగాల అధికార యంత్రాంగం వైఫ ల్యం…వెరసి విలువైన ప్రాణాలను బలిగొంటు న్నాయి. అనకా పల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ లారస్‌ ల్యాబ్స్‌లో తాజా ప్రమాదం నలుగురిని బలిగొనడం,మరొ కరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండటం బాధాకరం. ఇలాంటి ఘటనలు జరిగిన వెంటనే…మృతుల కుటుం బాలకు,క్షతగాత్రులకు నష్ట పరిహారం చెల్లిం చడం,గంభీర ఉపన్యాసాలు చెప్పి చేతులు దులు పుకోవడం ఆయా కంపెనీల యాజమాన్యాలకు, ఉన్నతాధికారులకు,పాలకులకు పరిపాటిగా మారిపోయింది.ఈఏడాదిలోనే ఈఫార్మా సిటీ లో పది ప్రమాదాలు జరిగాయంటేనే నిర్లక్ష్యం ఏ మేరకు మేటలు వేసిందో అర్థం చేసుకోవచ్చు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఇజెడ్‌లో మూడు వేల ఎకరాల్లో ఉన్న ఫార్మా పరిశ్రమల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. పెద్దపెద్ద కొలి మిలతో పనిచేసే పరిశ్రమలకు కూడా…సొం తంగా ఒక్క అగ్ని మాపక వాహనం కూడా లేదంటే భద్రతపై వాటి నిర్లక్ష్యాన్ని అర్థం చేసు కోవచ్చు. పరిశ్రమల్లో భారీ ప్రమాదాలను గుర్తు చేసుకుంటేనే మానవ ప్రాణాలపట్ల ఎంత నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తున్నారో,పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో కళ్లకు కడుతుంది. రెండేళ్ల క్రితం ఎల్‌జి పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి విషవా యువులు లీకై పరిసర ప్రాంతాలకు చెందిన 12 మంది మరణించగా, వందలాదిమంది ఆసుపత్రి పాలైన ఘటనను తలచుకుంటేనే కలవరం కలుగు తుంది. పరవాడ ఫార్మాసిటీ లోనే అజిక బయో ఫోర్‌లో ఐదేళ్ల క్రితం నాటి ప్రమాదంలో ఐదుగు రు,సాయినార్‌ ఫార్మాలో గత ఏడాది మరో ఘటన లో ముగ్గురు బలయ్యారు. సీడ్స్‌ దుస్తుల పరిశ్రమలో విషవాయువులు లీకై 200మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటివరకూ పరవాడ ఫార్మాసిటీ లోని ఔషధ పరిశ్రమల్లో జరిగిన 70 ప్రమాదాల్లో49మంది ప్రాణాలు కోల్పోగా, 93 మంది క్షతగాత్రులయ్యారు.ఈ పరిశ్రమల్లో పని చేస్తున్న ఉద్యోగులతోపాటు పరిసర గ్రామాల ప్రజలు సైతం ఈ ప్రమాదాల పట్ల, లీకవుతున్న విషవాయువులు,వ్యర్థజలాలపట్ల ఆందోళన చెందు తున్నారు.ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది,ఉద్యోగులు సైతం విషవాయువులను పీల్చి అనేక జబ్బులకు గురవుతున్నారు. పరిశ్రమల్లో ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌, బాయిలర్‌ ఇన్‌స్పెక్టర్‌ సంయుక్తంగా తనిఖీలు చేప ట్టాల్సి ఉంది.ఎప్పటికప్పుడు నివేదికలను రూపొం దించి, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్ట్లాలి. ప్రమాదాలు జరిగినప్పుడు హడావిడి చేయడం మినహాయిస్తే… ప్రమాద కారణాలపై నివేదికలను విడుదల చేసిన పరిస్థితి కూడా లేదు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పేరిట ప్రభుత్వ శాఖల నుండి జరగవలసిన తనిఖీలు దాదాపు నిలిపివేశారు. దాంతో కంపెనీల ఇష్టారాజ్యంగా ఉంది. ఫార్మా పరిశ్రమల్లో వినియోగించే హానికరమైన రసాయ నాలపై ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి పూర్తి అవగా హన కల్పించడం, రక్షణ పరికరాలు సమకూర్చడం తదితర చర్యలన్నింటినీ పరిశ్రమలు గాలికొదిలే శాయి. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ రసాయనా లను శుద్ధిచేయడం,పర్యావరణ పరిరక్షణకు, వాతా వరణంలో విషవాయువుల మోతాదును తగ్గించ డానికి గ్రీన్‌ బెల్ట్‌ను ఏర్పాటు చేయడం, రహదారు లను నిర్మించడం…లాంటి చర్యలను డెవలపర్‌గా ఉన్న సంస్థ చేపట్టాలి. పరిశ్రమల నుంచి విడుదల వుతున్న వ్యర్థ రసాయనాలను కొంతమేర శుద్ధి చేయకుండానే సమీపంలోని చెరువుల్లోకి, సముద్రం లోకి విడిచిపెట్టడం వల్ల భూగర్భజలాలు విషతు ల్యమవుతున్నాయని,అర్ధరాత్రి సమయంలో విష వాయువులను విడిచిపెడుతున్నారని ఆరోపణ లొస్తున్నాయి. ఇప్పటికైనా…ఉద్యోగుల, సిబ్బంది ప్రాణాలను కాపాడటం…పరిసరప్రాంతాల వారికి సైతం కాలుష్యం నుంచి ఉపశమనం కలిగిం చేందుకు అవసరమైన అన్ని చర్యలను పరిశ్రమల యాజమాన్యాలు, సెజ్‌ డెవలపర్‌ సంస్థ చేపట్టాలి. చట్టబద్ధంగా, అన్ని ప్రమాణాలను పాటిస్తున్నారో లేదో ప్రభుత్వ అధికారులు తనిఖీ చేసి పర్యవేక్షిం చాలి. కార్మికుల ప్రాణాలకు,ప్రజల జీవనానికి అవసరమైన పర్యావరణాన్ని కాపాడడం ప్రభుత్వ బాధ్యత. అందుకు పటిష్ట చర్యలు చేపట్టాలి.
భద్రతా లోపాలు..కార్మికులే సమిధలు
పరిశ్రమల్లో భద్రతా లోపాలు కార్మి కుల ప్రాణాలను బలిగొంటున్నాయి. అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మా,అచ్యుతాపురం ప్రత్యేక ఆర్ధిక మండలిలోని పలు పరిశ్రమల్లో తరచూ జరుగుతున్న ప్రమాదాలతో కార్మికలోకం వణికిపో తోంది.యాజమాన్యాల నిర్లక్ష్యంతో చోటు చేసుకుం టున్న అగ్ని ప్రమాదాలు,పేలుళ్లతో ఉద్యోగులతో పాటు పరిసర ప్రజలు భయాందోళనకు గురవుతు న్నారు. ప్రమాదాలు జరిగినప్పుడే అధికారులు హంగామా చేస్తున్నారు. తర్వాత పట్టించుకోవడం లేదు. పరవాడ ఫార్మాసిటీలోని లారస్‌ ల్యాబ్స్‌లో డిసెంబర్‌19నజరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు మరణించగా,ఒకరు తీవ్రంగా గాయ పడ్డారు. ఈఘటనతో పారిశ్రామిక ప్రాంతమంతా ఉలిక్కిపడిరది.గతంలో పరవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మా సిటీలోనైనా,హెటిరో ఫార్మా పరిశ్ర మలోనైనా కార్మికుల భద్రతపై యాజమాన్యాలు తగిన శ్రద్ధ తీసుకోవడం లేదు.నక్కపల్లి హెటిరో ఫార్మా కంపెనీలో మొన్నజరిగిన ప్రమాదంలో ఓ కార్మి కుడు మృతి చెందారు. హెటిరో డ్రగ్స్‌ కంపెనీ డీఎం ఎస్‌వో ప్లాంట్‌లో ఇటీవల పేలుడు సంభవిం చింది.భారీగాశబ్ధం రావడంతో కార్మికు లు భయంతో పరుగుతు తీశారు.రియాక్టర్‌ పేలడం తోనే ప్రమాదం జరిగినట్టు కార్మికులు చెబుతు న్నారు.రియాక్టర్లు పేలకుండా ప్రెజర్‌ రిలీఫ్‌ వాల్వ్‌, రప్చర్‌ డిస్క్‌ నియంత్రిస్తాయి. ఈ రెండు సరిగా పనిచేయకపోవడంతోనే రియాక్టర్‌ పేలినట్టు పరి శ్రమలో సిబ్బంది చెబుతున్నారు.రియాక్టర్‌ పేలుడు తో విడుదలైన వాయువులు..కార్మికుల ప్రాణాలను బలిగొంటున్నాయి. సాధారణంగా ప్రమాదకర వాయువులు వెలువడే అవకాశమున్నచోట కార్మికు లకు రెస్పిరేటరీ మాస్క్‌లు ఇవ్వాలి. అయితే కార్మి కులకు రెస్పిరేటరీ మాస్కు లు హెటిరో యాజ మాన్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు విన్పిస్తు న్నాయి. పదేళ్ల కాలంలో హెటిరో పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో తొమ్మిది మంది కార్మికులు మృతిచెందారు. 2013లో ఐదుగురు, 2015, 2016,2020లో,2022ఫిబ్రవరి23న ఒక్కొ క్కరు చొప్పున ప్రమా దాల్లో ప్రాణాలు కోల్పోయారు. మరెందరో తీవ్ర గాయాలపాలయ్యారు. పరిశ్ర మలో అన్ని ప్రమా దాలు జరుగుతున్నా…కార్మికుల భద్రత, రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కార్మిక నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా కంపెనీల ప్రమా దాలకు సంబంధించి, భద్రతా ప్రమాణాల నిర్వహణపై 2020 జులై16 న అప్పటి కలెక్టర్‌ వినరు చంద్‌ నాలుగు బృందా లను నియమించారు.ఆ మేరకు కార్మికులకు కార్మి కుల భద్రత, ఫైర్‌ సేఫ్టీ, ఎలక్ట్రికల్‌ సేఫ్టీ అంశాలతో పాటు నింబంధనల అమలుతీరుపై నాలుగు నివేది కను ఇచ్చింది. అయితే పరిశ్ర మల్లో లోపాలను సరి చేసే దిశగా మాత్రం ప్రయ త్నాలు చేయక పోవడంతో ప్రమాదాలు ఆగడం లేదు.హెటిరో ఫార్మాలో జరిగిన ప్రమాదంపై సమ గ్ర విచారణ జరపాలని కార్మిక సంఘాలు, రాజకీ య పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి.ప్రమాదంలో మృతి చెందిన అల్లాడ సాయిరాం కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం,వారి కుటుంబంలో ఒకరిఉద్యోగం ఇచ్చి న్యాయం చేయాలనిపట్టు బడుతున్నాయి. క్షతగ్రా తులకు మెరుగైన వైద్యం అందించాలని పట్టుబడు తున్నాయి. సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం తోనే ప్రమాదాల్లో కార్మి కులు మృత్యువాతపడుతు న్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు…ఆ తరువాత పట్టనట్టు వ్యవ హరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాలుష్య నిబంధనలు,భద్రతా ప్రమాణాలు పాటించక పోయినా పట్టించు కోవ డం లేదని మండిపడుతు న్నారు. ఉన్నతాధికారు లు జోక్యం చేసుకొని హెటిరోలో ప్రమాదాలు పునరావృతం కాకుండా సమగ్ర విచారణ చేపట్టా లని కోరుతున్నారు. ఫార్మా కంపెనీల్లో వరస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అధి కారులు సమగ్ర విచారణ చేపడుతారా? లేక ఎప్పటిలాగే ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హాడావడిచేసి ఊరుకుంటారా?అనేది వేచి చూడా ల్సిందే.
వెంటాడుతున్న ప్రమాదాలు
ా రెండేళ్ల క్రితం ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి స్టైరిన్‌ అనే విషవాయువు లీకయి 12మంది మృతిచెందారు. వీరంతా పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నవారే.
ా గతేడాది నక్కపల్లిలోని హెటిరో మందుల పరిశ్రమలోని పీఎంఎస్‌వో సాల్వెంట్‌ తయారీ యూనిట్‌ వద్ద రియాక్టర్‌ పేలి ఒకరు చనిపోగా,నలుగురు తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఈ పరిశ్రమలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
ా అచ్యుతాపురం సెజ్‌లోని కొన్ని ఫెర్రో పరి శ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో ఓ ఫెర్రో కంపెనీలో కొలిమి పేలి 13మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ా రాంబిల్లి పరిథిలోని ఏషియన్‌ రంగుల పరిశ్ర మలో ప్రమాదం జరిగి ఒకరు మరణించారు.
ా గతేడాది సీడ్స్‌ దుస్తుల తయారీ పరిశ్రమలో వరుసగా రెండుసార్లు వాయువులు లీకై వందలాది మందిమంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.
నిత్యం భయం!
అచ్యుతాపురం సెజ్‌లోని సుమారు 9,2 97ఎకరాల్లో ఫార్మా కంపెనీలకు మూడువేల ఎకరాల వరకు కేటాయించారు. పరవాడ ఫార్మాతో పోల్చుకుంటే సెజ్‌లో భూమిధర తక్కువగా కేటా యించడంతో ఎక్కువ ఫార్మా కంపెనీలు ఏర్పాటవు తున్నాయి. పరవాడా ఫార్మాకంపెనీలతో పోల్చితే సెజ్‌ల్లో చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నా యి. ఫార్మాసిటీ చుట్టూ తక్కువ జనాభా గ్రామాలు ఉండగా సెజ్‌ని అనుకొని రాష్ట్రంలోని అతిపెద్ద మత్స్యకార గ్రామమైన పూడిమడక ఉంది.ఈ ఒక్క గ్రామంలోనే 20వేల జనాభా నివాసం ఉంటు న్నారు. పరిశ్రమల్లో తరచూ జరుగుతున్న అగ్నప్ర మాదాలు,రసాయనవ్యర్ధాల నిర్వహణలో లోపాలు, గ్యాస్‌ లీకేజీలు సమీప గ్రామస్థులను భయపెడు తున్నాయి.అచ్యుతాపురం సెజ్‌లో పెద్దపెద్ద కొలిమి లతో కూడిన ఫెర్రో పరిశ్రమలున్నాయి. వాటికి సొంతంగా ఒక్కఅగ్నిమాపక వాహనం కూడా లేకపోవడం గమనార్హం. సెజ్‌లో ఎటువంటి అగ్ని ప్రమాదం జరిగినా ఏపీఐఐసీ వాహనమే దిక్కువు తోంది. సెజ్‌లోని యూనిఫార్ట్స్‌ కంపెనీలో కూడా గతంలో అగ్ని ప్రమాదాలు జరిగాయి.
ఒక్క ఏడాదిలో పది ప్రమాదాలు
2022 జనవరి నుంచి ఇప్పటి వరకూ పరవాడ ఫార్మాసిటీలో 10ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా డిసెంబర్‌ 19న లారస్‌ ల్యాబ్స్‌ యూనిట్‌3లో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు మృతిచెందగా ఒకరు తీవ్రంగా గాయ పడ్డారు. ఫిబ్రవరి 7న అక్టోనస్‌ ఫార్మాలో రియాక్టర్‌ వద్ద ప్రమాదం జరిగింది.ఈనెల 17న ఎమ్మె న్నార్‌ ఫార్మాలో,ఏప్రిల్‌ 23న ఎస్‌ఎన్‌ఎఫ్‌ ఫార్మాలో,మే 7న ఎస్‌ఈజెడ్‌ అలివిర ఫార్మాసంస్థలో,మే 25న లారస్‌ ల్యాబ్స్‌ యూనిట్‌3లో,జూన్‌ 13న గ్లాండ్‌ ఫార్మాలో,జూలై 28నసాయిశ్రేయాష్‌ పార్మా కం పెనీలో,ఆగస్టు 22న ఆప్టిమస్‌ ఫార్మాసంస్థలో అగ్ని ప్రమాదాలతోపాటు గ్యాస్‌ లీకేజీలు జరిగా యి. సెప్టెంబరు 10న కోరి ఆర్గానిక్స్‌ రియాక్టర్‌ వద్ద ప్రమాదం జరిగిగోడలు కూలిపోయాయి. ఈ ప్రమా దాల్లో ఆస్తినష్టం తప్ప ఎవరికీ ఏమీ కాక పోవడం తో కంపెనీ యాజమాన్యాలు ఊపరి పీల్చు కున్నా యి. ఇప్పటికైనా కర్మాగారాల,అగ్నిమాపక శాఖ అధికారులు స్పందించి ఫార్మాసిటీలో భద్రతా ప్రమా ణాలు పక్కగా అమలయ్యేలా చర్యలు తీసు కోవాలని కార్మిక నాయకులు,ఉద్యోగులు కోరు తున్నారు.

అడవితల్లికి గర్భశోకం

ఆదివాసుల సంప్రదాయ హక్కులపై ఆదినుంచి పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. బ్రిటీష్‌ ప్రభుత్వం 1878లో అడవులపై ఆదివాసుల సంప్రదాయ హక్కులపై ఆంక్షల విధింపుతో అసంబద్ద సంప్రదాయం ప్రారంభమైంది.దాన్ని వ్యతిరేకిస్తూ విప్లవవీరుడు అల్లూరి సీతారామారాజు ఆదివాసులకే అడవిపై హక్కుకోసం పోరాటం చేశారు. తర్వాత 1932లో జమీందారు వ్యవస్థ హాయంలో ప్రముఖ సామాజికవేత్త రెబ్బాప్రగడ మందేశ్వర శర్మ విశాఖ మన్యప్రాంతాన్ని సందర్శించి అమాయక గిరిజనులు దోపిడికి గురవుతున్నట్లు గుర్తించారు. ఆతర్వాత ఐఎఫ్‌ఎస్‌ అధికారి రెబ్బాప్రగడ కృష్ణారావు అటవీ సంరక్షణ అధికారిగా చింతపల్లి,మినుములూరు,అనంతగిరి,పాడేరు,మారేడిమిల్లి వంటి గిరిజనప్రాంతాల్లో విధులునిర్వర్తించారు. ఆయన హాయంలోనే కాఫీతోటలు పెంపకాన్ని ప్రవేశ పెట్టి జీవనప్రమాణాలు మెరుగుపరిచారు.నేను చిన్నప్పటి నుంచే నాన్నగారితోకలసి ఆదివాసుల జీవనవిధానాలతో మమేకమ య్యాను. తరాలుగా అడవితల్లినీడలో బతుకుతున్న అటవీభూములపై హక్కుమాత్రం వారికి ఎండ మావిగానే మిగిలాయని గుర్తించాను. ఈనేపథ్యంలోనే సమత పుట్టికొచ్చింది.గిరిజనలకు రాజ్యాంగం కల్పించిన చట్టాలు,హక్కులు పరిరక్షణపై గత ముప్ఫైరెండేళ్ల నుంచి పోరాడుతుంది. విశాఖమన్యంలో బాక్సైట్‌,ఖనిజనిక్షేపాలు ప్రైవేటు కంపెనీలకు ధారతత్తం చేసినవైనాన్ని గుర్తించి అటుప్రభుత్వం,ఇటు ప్రైవేటు బహుళజాతికంపెనీలకు వ్యతిరేకంగాపోరాడిరది.ఆదివాసులకు రాజ్యాంగం కల్పించిన రక్షణ చట్టాలు,హక్కులు నిర్వీర్యమైపోతున్నాయంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిగా గిరిజనుల హక్కులను పునరుద్దరిస్తూ సర్వోన్నత (న్యాయస్థానం) సుప్రింకోర్టు చరిత్రాత్మకమైన1997లో సమత తీర్పు నిచ్చింది. నేడు ఈతీర్పుఫలితంగా భారతదేశంలోని షెడ్యూల్‌ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీ ప్రజలకు రక్షణ గా నిలిచింది.స్థానికులైన గిరిజనుల భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడిరది. సామా జిక,ఆర్ధిక న్యాయం కోసంపోరాడే ఆదివాసులకు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన సమత తీర్పు ఎంతో మనో నిబ్బరం కలిగించింది.ఈతీర్పును ఉల్లంఘించడానికి ప్రభుత్వాలు యథాశక్తి ప్రయత్నాలు సాగిస్తూనే వస్తోంది.అధికారంలోఉన్న ప్రభుత్వంఅటవీ సంపద మొత్తం కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేయడానికి రక్షణ చట్టాలను సవరించడం తీరని అన్యాయం.
అడవులతో గిరిజనులకు పెనవేసుకుపోయిన అనుబంధాన్ని విచ్ఛిన్నం చేసేందుకు పాలకులు చేయని ప్రయత్నమంటూ లేదు. అమాయకాదివాసుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగంలోని అయిదో షెడ్యూలులో పొందుపరిచన సూత్రావళి స్పూర్తిని మన పాలకులు అడ్డంగా విస్మరిస్తున్నారు. అడవులు,ఆదివాసులు అధికంగాఉన్న ఆంధ్రప్రదేశ్‌,ఛత్తీషఘడ్‌,ఒరిస్సా,జార్ఖండ్‌ రాష్ట్రాల్లో భారీ పరిశ్ర మల ఏర్పాటుకు,ఖనిజతవ్వకాలకు విచ్ఛలవిడిగా లాకులెత్తుతున్నారు.ఆస్మదీయుల,పెట్టుబడిదార్ల జేబులు నింపే కార్యక్రమాన్ని చేపట్టి ఆదివాసుల అగ్రహానికి గురవుతున్నారు.అడవులవృద్ధి,పరిరక్షణద్వారా ఒనగూడే ఆర్ధికప్రయోజనాలను గిరిజనులకు చేర వేయాలంటూ స్వాతంత్య్రానంతరం నిర్ధేశించుకున్న లక్ష్యాలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి.
ప్రభుత్వం వేసే ప్రతి అడుగూ,తీసుకునే ప్రతినిర్ణయమూ సామాన్యునికి ఎంతోకొంత ఉప శమనం కలిగించాలి.వారి సమస్యలకు పరిష్కారంచూపాలి. కానీ,నేడు గిరిజన సంక్షేమం,అడువుల పరిరక్షణ పేరిట పాలకులు చేపడుతున్న చర్యలు ఆదివాసులకు న్యాయం చేయడం లేదు సరికదా..,వారి ఆందోళనను మరింత పెంచుతున్నాయి. అటవీ వనరులను అయినవారికి దోచిపెట్టడానికి,ప్రకృతి వనరుల పరిరక్షణపేరిట నిధులుస్వాహాలు,సర్కారీ పెద్దలుతెగబడుతున్న నైచ్యం నేడు బహిరంగ రహాస్యం.తమకు నిలువ నీడలేకుండా పాపం చేస్తున్నదెవరో గ్రహించలేనంతటి అమాయకత్వంలో ఈనాటి గిరిజనులులేరు.వారుఅన్నీ చూస్తున్నారు. అర్ధం చేసుకుంటున్నారు. అక్రమార్కులకు వంతపాడుతూ అడవి బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్న పెద్దలు తీరు మార్చుకోవాల్సిన తరుణమిది!- రెబ్బాప్రగడ రవి,ఎడిటర్ 

తుఫాన్లు..కష్టాలు

తీర ప్రాంత ప్రజానీకానికి తుపాన్లు, వాటి వల్ల వచ్చే కష్టాలు కొత్త కాదు. కానీ, ఆ కష్టాలను పూర్తి స్థాయిలో నివారించలేక పోవడమే బాధాకరం. తాజాగా విరుచు కుపడిన మాండూస్‌ తుపాన్‌ కూడా తీర ప్రాంత ప్రజానీకానికి తరగని కష్టాలను మిగిల్చింది. తుపాన్‌ ప్రాంతానికి పలు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లినట్లు వార్తలు వస్తున్నాయి. అధికారికంగా నష్టతీవ్రతను ఇంకా ప్రకటించలేదు. ఎన్యూ మరేషన్‌ ఇంకా ప్రారంభమే కాకపోవడంతో ఈ ప్రక్రియ పూర్తయి, బాధితులకు నష్ట పరిహారం అందడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఆలోగా అరకొర సాయంతోనే బాధితులు నెట్టుకురావాల్సి ఉంటుంది. తుపాన్లు వంటి ప్రకృతి వైప రీత్యాలు చోటు చేసుకున్నప్పుడు గతంలో మరణాల సంఖ్య భారీగా ఉండేది. పెరి గిన సాంకేతికతతో పాటు అధికార యం త్రాంగం అప్రమత్తత కారణంగా ఇటీవల కాలంలో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది.-సైమన్‌ గునపర్తి
మాండూస్‌ తుపాన్‌ సమయంలోనూ ఈ విష యాన్ని గమనించవచ్చు. మూడు,నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసినప్పటికీ,దక్షిణ కోస్తా జిల్లాలో నదులు,వాగులు పొంగి ప్రవహించినప్పటికీ మన రాష్ట్రంలో ఒక్కరే మరణించారు. అది కూడా వర్షాలకు నానిన గోడ కూలడం కారణంగా సంభవించింది. సకాలంలో సహాయ చర్యలు చేపట్టినందున మరణాల సంఖ్యను నలుగురికి పరిమితం చేయగలిగామని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడులోనూ సంభవించిన ఆస్తి, పంట నష్టం మాత్రం అపారం. రాష్ట్రాలు కష్టాల్లో చిక్కుకున్నప్పుడు స్పందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే! తక్షణ సాయం ప్రకటించడంతో పాటు, పూర్తిస్థాయి నష్టం అంచనా వేయడానికి బృందాన్ని పంపడం, ఆ బృందం ఇచ్చే నివేదికను, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని మరిన్ని నిధులను మంజూరు చేయడం వంటి పనులు కేంద్ర ప్రభుత్వం సాధారణంగా చేస్తుంది. ఈ తరహా స్పందన ఎంత త్వరగా వ్యక్తమైతే బాధిత ప్రజానీకానికి అంత త్వరగా ఊరడిరపు లభిస్తుంది. అయితే,తాజా తుపాన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుండి ఇటువంటి స్పందన నామమాత్రంగా కూడా వ్యక్తం కాలేదు. సాయం సంగతి అలా ఉంచి,కనీసం బాధిత ప్రజానీకానికి కేంద్ర ప్రభుత్వ పెద్దలనుండి ఊరడిరపు మాటలు కూడా వ్యక్తం కాకపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది.తమ సొంత ప్రభుత్వాలు ఉన్నచోటో,ఎన్నికలు వచ్చినప్పుడో దీనికి భిన్నంగా ఉరుకులు, పరుగుల మీద సాయం అందడం ప్రజానీకం గమనిస్తున్న విషయమే. ఈ తరహా వివక్షా పూరిత వైఖరిని కేంద్ర ప్రభుత్వం తక్షణం మానుకోవాలి. మాం డూస్‌ తుపాన్‌ కారణంగా చిత్తూరు, తిరుపతి,కర్నూలు నెల్లూరు,ప్రకాశం, బాపట్ల,గుంటూరు,కృష్ణ,ఉభయ గోదావరి జిల్లాల్లో లక్షలాది ఎకరాల పంట దెబ్బ తింది. రేపో,మాపోమార్కెట్‌కు చేరాల్సిన ధాన్యపు కళ్ళాల్లోకి వర్షపు నీరు చేరింది. పండ్ల తోటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. వరద నీరు చేరడంతో కొన్ని చోట్ల ఇళ్లకు దెబ్బతిన్నాయి. వీరందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే ! అది జరగాలంటే ముందుగా ఎన్యూమరేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. సోమవారం నిర్వహిం చిన సమీక్షా సమావేశంలో నష్టం అంచనాల ప్రక్రియను వెంటనే ప్రారంభించి, వారం రోజుల్లోపు సాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ఉదారంగా నిర్వహించాలి. రంగుమారినా, తడిసినా ముందుగా ప్రకటించిన రేటుకే కొనుగోలు చేయాలి. ముఖ్యమంత్రి కూడా ఇదే విధమైన ఆదేశాలు జారీ చేశారు.ఈ ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావాలి.దీంతో పాటు అన్ని విధాల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకోవాలి. అప్పుడే రైతులకు కొంతమేరకైనా ఊరట లభిస్తుంది. అదే సమయంలో రాష్ట్రంలోని అధికార పక్షంతో పాటు, ప్రధాన ప్రతిపక్షం కూడా సాయం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలి. అవసరమైతే ఇతర ప్రతిపక్షాలను, శక్తులను కూడా కలుపుకుని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి.
ఆంధ్రప్రదేశ్‌కు పదే పదే ఎందుకీ వరద కష్టాలు….
భౌగోళికంగా గోదావరి, కృష్ణా, పెన్నా లాంటి ప్రధాన నదులకు చివరలో ఉండే ఆంధ్ర ప్రదేశ్‌కు అనేక ముప్పులు పొంచివున్నాయి. నీటి కొరత ఏర్పడినా, నదికి వరదలు వచ్చినా తొలి ప్రభావం ఏపీ మీదనే ఉంటుంది. గడిచిన రెండు మూడు సీజన్లలో ఏటా వరదలతో అపార నష్టాన్ని ఆంధ్రప్రదేశ్‌ చవిచూస్తోంది. రైతులు, తీర ప్రాంత ప్రజలే కాకుండా ప్రభుత్వం కూడా వివిధ రకాలుగా నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది.గోదావరికి చరిత్రలో ఎన్నడూ లేనంత రీతిలో జులైలో అతి పెద్ద వరదలు నమోదయ్యాయి. ప్రస్తుతానికి వరదల తాకిడి తగ్గినా వరద ముప్పు మాత్రం ఇంకా పోలేదు. సహజంగా ఆగష్టులో ఎక్కువగా వరదలు వచ్చే ప్రమాదం ఉండటంతో.. గోదావరి తీరం ఇంకా ప్రమాదం ముంగిట్లో ఉన్నట్టుగానే భావించాలి.సెప్టెంబర్‌ మాసంలో ఎక్కువగా వరదల ప్రమాదం ఎదుర్కొనే కృష్ణా నదీ తీరం కూడా రాబోయే రెండు నెలల పాటు దినదినగండంగా గడపాల్సిందే. అక్టోబర్‌, నవంబర్‌ మాసాల్లో పెన్నా తీరంలో ప్రమాదం పొంచి ఉంటుంది. గత నవంబర్‌లో ఎగువన కురిసిన భారీ వర్షాలకు పెన్నా నదీ తీరం పొడవునా అవస్థలు ఎదురయ్యాయి. ఏటా వరుసగా నాలుగైదు నెలల పాటు ఏదో నదికి వరదల ప్రమాదం అంచున ఆంధ్రప్రదేశ్‌ ఉంటుంది. అయితే, దీర్ఘకాలంగా ఈ సమస్య ఉన్నప్పటికీ..తగిన పరిష్కారం విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడం వల్లనే నష్టం ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా కరకట్టల పరిస్థితిపై ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరాన్ని ఇది చాటుతోంది.ఈ నేపథ్యంలో గోదావరి ఏటిగట్లు, కృష్ణా కరకట్ట, పెన్నా సహా పలు నదీ తీరాల్లో పరిస్థితిపై బీబీసీ పరిశీలన చేసింది.
గోదావరి ముప్పు నుంచి గట్టెక్కినట్టేనా
1986 తర్వాత 2006లో గోదావరికి ప్రమా దకర స్థాయిని మించి వరదలు వచ్చాయి. అపార నష్టానికి కారణమయ్యాయి. అధికా రికంగా 1986లో 300 మందికి పైగా ప్రాణా లు కోల్పోయారు. 2006లో 70మంది మర ణించారు. ఆతర్వాత 2022 జులై16న అత్యధి కంగా నీటిమట్టం నమోదయ్యింది. ఈసారి మాత్రం స్వల్ప సంఖ్యలోనే ప్రాణనష్టంతో గోదా వరి తీరం ఊపిరిపీల్చుకునే అవకాశం దక్కింది. ఇంత పెద్ద వరదల్లో గతానికి, ఇప్పటికీ ఉన్న ఏకైక తేడా ఏటిగట్లు బలోపేతం కావడం. ధవళేశ్వరంలోని కాటన్‌ బ్యారేజీకి ఎగువన అఖండ గోదావరిగా పిలుస్తారు.ఆ ప్రాంతం లో ఏటి గట్ల పొడవు 81.80కి.మీ.ఉం టుం ది.నదికి ఎడమ వైపు కొంత భాగాన్ని అంగు ళూరు ఫ్లడ్‌ బ్యాంకు అంటారు. దాని పరిధి 1.93 కి.మీ..ఇక బ్యారేజీ దిగువన గౌతమి ఏటి గట్లు 204.70కి.మీ.పరిధిలో ఉన్నాయి. వశిష్ఠ గోదావరి గట్లు 246.30 కి.మీ.పొడవు ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వైనతేయ సహా ఇతర నదీపాయల గట్లు కూడా కలిపితే దాదాపుగా 700 కిలోమీటర్లు ఉంటా యి. భద్రాచలం వద్ద 71 అడుగులకు చేరిన నీటి మట్టం కారణంగా,ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద సుమారుగా 27లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలాల్సి రావడంతో గోదావరి నదీ ప్రవాహం నిండుకుండను తలపించింది. అయినప్పటికీ పెద్ద ముప్పు రాకుండా నివారిం చేందుకు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది.రాత్రి, పగలూ వివిధ శాఖల సిబ్బంది పలు చోట్ల పహారా కాయాల్సి వచ్చింది. స్థానికుల సహకారంతో గట్లు పరిరక్షించాల్సి వచ్చింది. ఈ ప్రయత్నాలే గోదావరి వాసులను ముప్పుల నుంచి తప్పించాయని చెప్పాలి. 2006 వరదల సమయంలో అయినవిల్లి మండలం శానపల్లి లంక,పి గన్నవరం మండలం మొండెపులంక వద్ద గట్లు తెగిపోయాయి. వరద ప్రవాహంతో ఊళ్లన్నీ జలమయమయ్యాయి. ఊరూ, ఏరూ ఏకం కావడంతో అపారనష్టం సంభవించింది. ఆ సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నాటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో పాటుగా యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ కూడా పర్యటించారు. ఆ సమయంలో గోదావరి గట్లు ఆధునికీకరిస్తామని శానపల్లిలంకలోనే సీఎం వైఎస్సార్‌ ప్రకటించారు. దానికి తగ్గట్టుగా 1983 వరదల తీవ్రతను ప్రామాణికంగా తీసుకున్నారు. అప్పట్లో దాదాపు 35 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహించిన నేపథ్యంలో అలాంటి వరదలు మళ్లీ వచ్చినా ఎదుర్కోగల సామర్థ్యంతో గట్లు నిర్మించాలని ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. 2006 వరదల నుంచి నేర్చుకున్న పాఠంతో సుమారుగా రూ.600 కోట్ల వ్యయంతో 535 కిలోమీటర్లు మేర ఆధునికీకరణ పనులు జరిగా యి.గట్లు ఎత్తు అందుకు తగ్గట్టుగా పెం చారు. ఆనాటి నీటిపారుదల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ సీతాపతిరావు సారథ్యంలో వరదలు, ఏటిగట్ల ఆధునికీకరణపై సాంకేతిక బృందంతో సర్వేచేసి సమగ్ర నివేదిక ఆధారంగా ఈ పనులు చేశారు. ఇటీవల వరదల నుంచి కూడా కోన సీమ, పశ్చిమ గోదావరిలతో పాటు ప్రస్తుతం 5 జిల్లాల పరిధిలో ప్రజలకు ఉపశమనం దక్కేం దుకు ఆనాటి పనులు తోడ్పడ్డాయి. కానీ రాను రాను గట్ల పరిస్థితికి నానాటికీ తీసికట్టు చందంగా మారుతోంది. అప్పట్లో పనులు పూర్తికాని చోట ఈసారి ప్రమాద సంకేతాలు వెలువడ్డాయి. వశిష్ఠ కుడి గట్టు నరసాపురం, వశిష్ఠ ఎడమ గట్టు పరిధిలో 48వ కిలోమీ టరు నుంచి 90వ కిలో మీటరు వరకు మూడు ప్యాకేజీలు ఆనాటి నుంచి అసంపూర్ణంగా వదిలేశారు.
ఇసుక తవ్వకాలతోనే తలనొప్పులు..
గోదావరి ఏటిగట్లు పటిష్ట పరిచినప్పటికీ వాటి లక్ష్యం దెబ్బతింటోందని ఇటీవలి వరదలు చాటుతున్నాయి. ముఖ్యంగా ఇసుక తవ్వకాలతో నదీ ప్రవాహం, ఒడి పెరగడమే కాకుండా ఏటిగట్లు బలహీన మవుతున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇసుక తవ్వకాల విషయంలో నిబంధనలు అనుసరించకపోతే అనేక అనర్థాలు చవి చూడాల్సి వస్తుందని ఇరిగేషన్‌ నిఫునులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం గోదావరి ఇసుక ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. యంత్రాలు వినియోగించ కూడ దనే నిబంధన కేవలం పేపర్లకే పరిమితం. పైగా గట్లుని ఆనుకుని తవ్వేస్తుండడంతో గ్రోయిన్లు దెబ్బతింటున్నాయి. ఏటిగట్లు బలంగా ఉండేందుకు వాటిని నిర్మిస్తే ఇసుక తవ్వకందా రులు వాటిని కొల్లగొట్టేస్తు న్నారు. గట్లకి రక్షణ లేకుండా పోతోంది. ఏటిగట్లు మీద భారీ వాహనాల రాకపోకల కోసం బాటల పేరుతో గట్లు దెబ్బతీస్తున్నారు. ఫలితంగా వరదలు వచ్చిన ప్పుడు ఇసుక తవ్వకాలు జరిగిన ప్రాంతాల్లో ఎక్కువగా భయాందోళనలు ఎదుర్కోవాల్సి వస్తోందని’’ భావిస్తున్నారు.
కృష్ణా తీరంలోనూ అదే కథ..
గోదావరి వరదల తాకిడికి కోనసీమ వాసులు ఎక్కువగా కలత చెందుతుంటే కృష్ణా వరదల వల్ల అటు గుంటూరు, ఇటు కృష్ణా జిల్లాలు ప్రభావితం అవుతూ ఉంటాయి. ప్రధానంగా ప్రకాశం బ్యారేజ్‌ దిగువ ప్రాంతాలు వరద ముప్పు ఎదుర్కోవాల్సి వస్తోంది. విజయవాడ నగరంలోని పలు ప్రాంంతాలు కూడా వరద తాకిడికి తల్లడిల్లిపోవాల్సిన దుస్థితి నేటికీ ఉంది.కృష్ణా నదికి 2009లో భారీవరదలు వచ్చాయి. ఆ వరదల మూలంగా కృష్ణా తీర మంతా తీవ్ర నష్టాన్ని చవిచూసింది. 2020లో కూడా వరద తాకిడి ఎక్కువగా నమోదయ్యింది. కానీ అంత పెద్ద ముప్పు లేకుండానే ప్రజలు బయటపడ్డారు. 2009 తర్వాత కృష్ణా నది కరకట్ల విషయంలో కూడా కొంత దృష్టి పెట్టారు. కానీ ఇసుక తవ్వకం దారుల తీరుతో నదీగర్భం కొల్లగొట్టడం, కరకట్ట దెబ్బతినడం వంటివి ఎదురవుతున్నాయి. ‘‘రాష్ట్రంలో గోదావరి, కృష్ణా వంటి నదులకు వరదలు తప్పవు. ఒక ఏడాది తప్పినా,ఎప్పటికయినా ముప్పు ఉంటుంది.దానికి మనం సన్నద్ధంగా ఉండాలి. కానీ అనేక అనుభవాల తర్వాత కూడా పాఠాలు నేర్చుకుంటున్నట్టు కనిపించడం లేదు. మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదు. ఏటా వరదలు వస్తున్నాయనగానే వందల గ్రామాలు వణికిపోవాల్సి వస్తోంది. ఇలాంటి వాటికి శాశ్వత పరిష్కారం చూడాలి. అసాధా రణంగా ఎప్పుడయినా వరద వస్తే తప్ప, సాధారణ వరదలకు పెద్దగా భయపడాల్సిన పరిస్థితి లేకుండా చేయాలి. అందుకు కరకట్టలు బలోపేతం చేయడం,వాటిని పరిరక్షించడమే మార్గం.కోట్లు వెచ్చించి పనులు చేసిన తర్వాత ఇసుక కాంట్రాక్టర్ల వ్యాపారం కోసం భారీ వాహనాలతో వాటిని బలహీనపరిస్తే ఏమి ఉపయోగం ఉంటుంది. కాబట్టి యంత్రాంగం అటువైపు దృష్టి సారించాలి’’అన్నారు ఇరిగేషన్‌ రిటైర్డ్‌ ఎస్‌ ఈ పీవీ రామారావు. దేశంలో వరద తాకిడి నుంచి గట్టెక్కడానికి వివిధ రాష్ట్రాల్లో చేసిన ప్రయత్నాలను మనం పాఠంగా తీసుకొవచ్చని ఆయన బీబీసీతో అన్నారు. తమి ళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో వరద నియం త్రణ చర్యలు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ప్రమాదం అంచున పెన్నా తీరం…
గోదావరి, కృష్ణా నదులతో పాటుగా వంశధార, నాగవళి సహా వివిధ నదుల మూలంగానూ వరద ముప్పు ఎదుర్కోవాల్సి వస్తోంది.వాటిలో పెన్నా ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో 2021 నవంబర్‌లో వచ్చిన వరదలు చాటిచెప్పాయి. ఏకంగా అన్నమయ్య డ్యామ్‌ కొట్టుకుపోయే దశ నుంచి, సోమశిల ప్రాజెక్టు పరిస్థితి గురించి ప్రశ్నలు ఎదురయ్యే వరకూ వచ్చింది. భవిష్యత్తులో మరింత ముప్పు తప్ప దనే అంచనాలు ఉన్నాయి. దాంతో దానికి అనుగుణంగా చర్యలు అవసరమనే వాదన ఉంది. ‘‘అన్ని నదులకు కొన్ని సహజ లక్షణా లుంటాయి.20,30ఏళ్లలో ఓసారి అసాధా రణంగా ప్రవాహం వస్తుంది. వాటి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాటికి అనుగుణంగా మనం అప్రమత్తం కావాలి. వరద వచ్చినప్పుడు హడావిడి చేయడం, ఆ తర్వాత దానిని వదిలేయడంవల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. నిరుడు పెన్నా వరదలు, ఈ ఏడాది గోదావరి వరదలు వంటివి మనకు మేలుకొలుపు కావాలి. భారీ వరదలు వచ్చినా తట్టుకునేలా అన్ని నదీ తీరాలను ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేయాలి. వాటిని ఎప్పటి కప్పుడు పరిరక్షణ జరగాలి’’ అంటూ పర్యా వరణ వేత్త సీహెచ్‌ శ్రీనివాసరావు అన్నారు. పోలవరం ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ఎత్తు పెంచడానికి ప్రభుత్వం పూనుకుంది. ఓవైపు వరద నీరు వెల్లువలా వచ్చి పడుతుంటే అప్పటికప్పుడు 2 మీటర్లు ఎత్తు పెంచినట్టు చెప్పడం విస్మయకరంగా కనిపించిందని,వరద నివారణ విషయంలో ప్రభుత్వ సన్నద్ధతను ఈ పరిణామం చాటుతుంది.ఆధునికీకరణలో భాగంగా వరదల నుంచి శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని ఇటీవల సీఎం జగన్‌ ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాం తాలలో పర్యటనలో భాగంగా రాజమహేం ద్రవరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులను ఆదేశించారు. శాశ్వత చర్యలపై దృష్టిపెడతాం. నవంబర్‌ కల్లా మనం టెండర్లు పూర్తిచేసుకుని పనులు మొదలు పెడదాం’’ అంటూ ఆయన అధికారులను ఉద్దే శించి వ్యాఖ్యానించారు.సీఎం ఆదేశా లకు అనుగు ణంగా శాశ్వత వరద నివారణ చర్యలకు సర్కారు సిద్ధమయితే గోదావరి తీర వాసుల భయాందోళనలు తగ్గుతాయి. అదే సమయంలో ఇతర ప్రధాన నదుల వెంబడి కరకట్టల తీరు మీద కూడా దృష్టి పెట్టాలనే అభిప్రాయం వినిపిస్తోంది.

మళ్లీ కరోనా టెన్షన్‌

జన జీవనాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి మళ్లీ జడలు విప్పుతున్నది. మొన్నటి దాకా స్తబ్ధుగా ఉన్న కొవిడ్‌.. కొద్దిరోజులుగా విస్తరిస్తున్నది. ఫలితంగా పాజిటివ్‌ కేసులు మళ్లీ నమోదవుతున్నాయి. వైరస్‌ వ్యాప్తి తగ్గడం, వ్యాక్సిన్‌ తీసుకున్నామన్న భరోసాతో ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించడం మానేశారు. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటిం చాలన్న సోయి మరిచారు. ఫలితంగా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రజలు స్వీయ రక్షణ చర్యలు తీసు కోవాలని సూచిస్తున్నది. వైరస్‌ వల్ల తీవ్ర ఇబ్బందు లు పడిన ప్రజలు ఇక నుంచైనా జాగ్రత్తలు తీసు కోవాలి. అందరూ నిబంధనలు పాటిస్తేనే కొవిడ్‌ వ్యాప్తిని నిలువరించడం సాధ్యమవుతుంది. – జిఎన్‌వి సతీష్‌
కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతుం డటంతో అనేక దేశాలు మళ్లీ ఆంక్షలను విధిస్తున్నాయి. కొన్ని దేశాలు ఇప్పటికే విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. మన దేశంలోనూ వైరస్‌ వ్యాప్తిపై ఆందోళనలు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ లేఖ రాయడం ఆహ్వానించదగిన పరిణామం. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని కూడా నిర్వహించింది. అయితే లేఖతో పాటు సమావేశంలోనూ రాష్ట్రాలకు సూచనలు చేయడం తప్ప కేంద్ర ప్రభుత్వం చేపట్టే నిర్దిష్ట చర్యల ఊసు లేదు. గతాను భవాల దృష్ట్యా ఈ తరహా ధోరణి ఏమాత్రం మంచిది కాదు. కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబు తున్న సమాచారం ప్రకారమే కరోనా వైరస్‌ తాజా విజృంభణకు కారణమైన ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ బిఎఫ్‌-7 కూడా మన దేశంలో వెలుగులోకి వచ్చింది. దేశంలో ఈ రకం వైరస్‌ ముగ్గురికి సోకింది. ఇది బలంగా ఇన్‌ఫెక్షన్‌ కలిగిస్తుందని, ఇంక్యుబేషన్‌ వ్యవధి తక్కువగా ఉండటంతో పాటు ఒకరి నుండి మరొకరికి త్వరగా వ్యాపిస్తుందని, వ్యాక్సిన్ల సామర్ధ్యాన్ని సైతం అధిగమిస్తుందని అంత ర్జాతీయ నిర్ధారణ. అయితే, మన దేశంలో బిఎఫ్‌-7 రకం తొలి కేసును అక్టోబర్‌లోనే గుజరాత్‌లో గుర్తించారు.ఆ తరువాత ఇప్పటి వరకు మరో మూడు కేసులు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. వీటిలో రెండు గుజ రాత్‌ లోనే నమోదుకాగా, మరొ కటి ఒడిశా లో వెలుగులోకి వచ్చింది. జాన్స్‌ హాప్కిన్స్‌ కోవిడ్‌ ట్రాకర్‌ తాజా గణాంకాల ప్రకారం గడిచిన 28రోజుల్లో (డిసెంబర్‌ 21నాటికి) జపాన్‌లో అత్యధికంగా 34లక్షల కేసులు నమోదయ్యాయి. దక్షిణ కొరి యాలో16 లక్షల కొత్త కేసులు,1,385 మరణాలు సంభవించాయి. అమెరికాలో గత 28 రోజుల్లో 15,89,284 మందికి వైరస్‌ సోకింది.కోవిడ్‌ 19 వెలుగులోకి వచ్చినప్పటి నుండి ఆ దేశంలో మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 100 మిలియన్లకు చేరింది. ఫ్రాన్స్‌లో 15,26,427 మంది ఈ కాలంలో కొత్తగా వైరస్‌ బారిన పడ్డారు. బ్రెజిల్‌లో 9, 45,568 మందికి వైరస్‌ సోకగా, 3,125 మంది మరణించారు. చైనాలో 9,17,308 కేసులు నమోదుకాగా, 646 మరణాలు సంభవించాయి. జీరో కోవిడ్‌ పాలసీని సడ లించిన తరువాత చైనాలో వైరస్‌ ఉధృతంగా వ్యాపిస్తోంది. జీరో కోవిడ్‌ విధానాన్ని కార్పొరేట్‌ మీడియా తీవ్రంగా విమర్శించిన సంగతి ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. ఈ సమయంలోనే మన దేశంలో 6,482 మంది వైరస్‌ బారిన పడగా 86 మంది మృతి చెందినట్లు జాన్స్‌ హాప్కిన్స్‌ కోవిడ్‌ ట్రాకర్‌ నమోదు చేసింది.
కరోనా వ్యాప్తితో గత మూడేళ్ల కాలంలో దేశంలో కోట్లాది మంది ఆప్తులను కోల్పో యారు. ఆకస్మిక లాక్‌డౌన్‌ సామాన్యుల జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. కోల్పోయిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇంకా పూర్తిస్థాయి లో పునరుద్ధరణ జరగలేదు. ఆర్థిక సంక్షోభం ప్రజలను వెంటాడుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో వైరస్‌ వ్యాప్తిచెందకుండా చర్యలు చేపట్టడంతో పాటు, కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు వైద్య, ఆరోగ్య వ్యవస్థలను తక్షణమే బలోపేతం చేసుకోవాలి. దానికవసరమైన నిధులను యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రాలకు కేంద్రం ఇవ్వాలి. మందులకు కొరత రాకుండా చూడాలి. వ్యాక్సినేషన్‌ గురించి కేంద్ర ప్రభు త్వం ఎంత గొప్పగా చెబుతున్నప్పటికీ దాదా పుగా 27శాతం మంది ఇంకా మొదటి విడత వ్యాక్సినే అందలేదు. రెండు డోసులు వేసుకోని వారి సంఖ్య 32 శాతం దాకా ఉంది. ఇక బూస్టర్‌ డోస్‌ లెక్కల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. ఈ వాస్తవాన్ని గుర్తించి ప్రజలందరికి ఉచితంగా వ్యాక్సిన్‌ అందించడానికి కేంద్రం ఇప్పటికైనా సిద్ధపడాలి. వైరస్‌ను అడ్డుపెట్టుకుని కార్పొరేట్‌ మిత్రులకు కోట్లు కట్టబెట్టే విధానానికి స్వస్తి పలికి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రాలతో కలిసి కార్యాచరణకు కదలాలి. అటువంటి చర్యలే ప్రజలకు ధైర్యాన్నిస్తాయి. మహమ్మారిని నియంత్రించడంలో వారందరినీ భాగస్వామలను చేస్తాయి.
అకస్మాత్తుగా అలజడి..
కొవిడ్‌ తగ్గడంతో 2020 మార్చి నెలకు ముందు నాటి సాధారణ పరిస్థితులు వచ్చాయనే భావనలో ప్రజలు ఉన్నారు. సాధారణ జీవితానికి ప్రతి ఒక్కరూ అలవాటు పడ్డారు. మొదటి, సెకండ్‌ వేవ్‌లతో తీవ్ర ఇబ్బందులకు గురి కాగా, థర్డ్‌ వేవ్‌ ఇలా వచ్చి అలా వెళ్లడంతో ప్రజల్లో భయమే కనిపించలేదు. వ్యాక్సిన్‌ తీసుకున్నందున తమకేమీ కాదులే అనే ధీమాతో ప్రజలు చెట్టాపట్టాల్‌ వేసుకుని తిరుగుతున్నారు. ఫలితంగా వైరస్‌ జాడ మళ్లీ కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. మాస్కు తప్పనిసరిగా వాడాలని సూచిస్తున్నది.
జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి..
కరోనా కేసులు పెరుగుతున్నట్లుగా గణాంకాలను చూస్తుంటే అర్థం అవుతున్నది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. బయటికి వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా స్వీయ జాగ్రత్తలను పాటించాలి. మాస్కులు వాడడం, భౌతిక దూరం పాటించడంతో పాటుగా చేతులు శుభ్రం చేసుకోవడం అలవర్చుకోవాలి. వైరస్‌ సోకిన వారికి తగిన వైద్యం అందించేందుకు దవాఖాన ల్లో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు చాలా మంది ప్రికాషన్‌ డోసు తీసుకోలేదు. వారంతా మూడో డోసును తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు

1 2