వాతావరణానికి ఏమైంది?

వాతావరణం మారిపోయింది. ప్రతి నోటా ఇప్పుడు ఇదేమాట. ఆకస్మిక వరదలతో మహానగరాలు అతలాకుతలం అవుతున్నాయి. అనావృష్టితో ఎడారిని తలపించే అనంతపురం, కర్నూలు వంటి జిల్లాల్లో ఉన్నఫళంగా భారీ వర్షాలు దంచికొడతాయి. చలికాలంలో రోళ్లు పగిలే ఎండలు.. వర్షాకాలంలో ఎముకలు కొరికే చలి.. కాలాలకతీతంగా వాతావరణంలో వైపరీత్యాలు చూస్తున్నాం. శిశిరం, గ్రీష్మం, హేమంత రుతువులన్నీ ఏక మవుతున్న పరిస్థితి. ధ్రువ ప్రాంతాల్లో మంచు మేటలు కరిగిపోతున్నాయి. సముద్ర జలాలు తీరం దాటి ముంచు కొస్తున్నాయి. ప్రపంచమంతటా ప్రకృతి విపత్తులే. భూమం డలంలో సంభవిస్తున్న ఈ వైపరీత్యాలకు భూతాపం పెరిగిపోవడమే ప్రధాన కారణం. మానవాళి కొనితెచ్చు కున్న ఈ విపత్తును నివారించకపోతే వాతావరణ మార్పుల ప్రభావం మానవ మనుగడకే ముప్పు తెస్తుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూతాపాన్ని తగ్గించాలంటే కర్బన ఉద్గారాలను తగ్గించు కోవాలి. పారిశ్రామిక విప్లవ నేపథ్యంలో అమెరికా, బ్రిటన్‌ లాంటి సామ్రాజ్యవాద దేశాలు ప్రపంచంలోని మిగిలిన అన్ని దేశాలకంటే ముందే కర్బన ఉద్గారాలు యథేచ్ఛగా వెదజల్లి పర్యావరణాన్ని పాడు చేశాయి. కర్బన ఉద్గారాల్లో ఇప్పటికీ పెట్టుబడిదారీ దేశాలదే మెజార్టీ వాటా. కానీ పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే త్యాగాలు తప్ప వంటూ … ఆ త్యాగం పేద దేశాలు, వర్ధమాన దేశాలు చేయాలన్నదే అమెరికా, దాని అనుంగు దేశాల వాదన. ప్రపంచ దేశాల మధ్య యుద్ధోన్మాదాన్ని రగిలిస్తూ ఐక్యతను దెబ్బతీస్తున్న ఈ పెట్టుబడిదారీ దేశాలు ఇటు ప్రజలకే కాకుండా పర్యావరణానికి కూడా ప్రధాన శత్రువులే అనేందుకు వారు చేస్తున్న ఈ వాదనే నిదర్శనం.
భూమండలంపై పెరుగుతున్న ఉష్ణో గ్రతలను1.5సెంటిగ్రేడ్‌ డిగ్రీలకు పరిమితం చేయాలన్నది 2015లో పారిస్‌ ఒప్పందంలో ప్రపంచ దేశాలకు నిర్దేశించిన ప్రధాన కర్తవ్యం. కానీ అమెరికా లాంటి దేశాలు ఈ ఒప్పందం నుంచి వైదొలిగి నేలతల్లికి ద్రోహం చేశాయి. జీవా వరణాన్ని ధ్వంసం చేసిన పెట్టుబడిదారీ దేశాలే మిన్నకుండిపోతే ఇక పేద,వర్ధమాన దేశాలు చేసే దేముంది? భూతాపం అందుకే పెను ప్రమాదంగా మారుతోంది. భూతాపాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం ప్రపంచ దేశాలు తీసుకుంటున్న చర్యలు ఏ మూ లకూ చాలవని ఐక్యరాజ్యసమితి సైతం ఆందోళన వ్యక్తం చేసిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. భూమండలం వాతావరణ సంబంధిత తుపానులు, వడగాలులు, వరదలతో ఇబ్బందులు పడుతోందని, ఉష్ణోగ్రతలు కూడా పారిశ్రామిక యుగానికి ముందు నాటి స్థాయిల కన్నా ఎక్కువగా 1.2 డిగ్రీల సెల్సి యస్‌కు చేరుకుందని ఐక్యరాజ్య సమితి వాతావరణ నిపుణులు హెచ్చరించారు. పెట్రోలు, డీజిలు వంటి శిలాజ ఇంధనాల వినియోగంవల్ల గాల్లోకి వెదజల్లే గ్రీన్‌హౌస్‌ వాయువులే భూతాపానికి కారణం. భూమండలానికి రక్షణగా ఉన్న ఓజోన్‌ పొరను ఈ గ్రీన్‌హౌస్‌ వాయువులు ధ్వంసం చేయడం వల్ల సూర్య కిరణాలు నేరుగా భూమిని తాకడంతో భూతాపం పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 1.5 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలను పరిమితం చేసేందుకు అనుసరించాల్సిన పంథాకు కనీసం దగ్గరలో కూడా లేమన్నది ఐక్యరాజ్య సమితి వాతా వరణ మార్పుల విభాగం ఆందోళన. 2010 స్థాయిలతో పోలిస్తే 2030 నాటికి కాలుష్య వాయు వులు43శాతం తగ్గాల్సిన అవసరం వుంది. అప్పుడే పారిస్‌ ఒప్పంద లక్ష్యాన్ని సాధించగలం. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే 2030 నాటికి కాలుష్యాలు 10.6శాతం పెరిగాయని ఐరాస నివేదిక పేర్కొన డం మానవాళి ముందున్న ప్రమాదాన్ని తెలియ జేస్తోంది.శిలాజ ఇంధనాల వినియోగంతో పెరిగి పోతున్న కాలుష్యం ప్రజల ప్రాణాలనూ తోడే స్తోంది. భారత్‌లో 2021లో ఏకంగా 3,30,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ‘ద లాన్సెట్‌’ మెడిక ల్‌ జర్నల్‌ నివేదించింది. ప్రతి రెండు నిమిషాలకు ఒకరు కాలుష్య కాటుకు బలైపోతున్నారన్నమాట. పర్యావరణ, వైద్యారోగ్య నిపుణుల హెచ్చరికలు పారిశ్రామిక యుగంలో తెగబలిసిన పెట్టుబడిదారీ దేశాల ప్రభుత్వాధినేతలకు తలకెక్కడం లేదు. ఈజిప్టులో నవంబరు 6 నుంచి 18 వరకూ కాన్ఫ రెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ (కాప్‌) 27 సదస్సు జరగనుంది. వాతావరణ మార్పుల సమస్యను చక్కదిద్దేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను రూపొందించడమే ఈ సదస్సు ముఖ్యోద్దేశం. బ్రిటన్‌ నూతన ప్రధానమంత్రి రిషి సునాక్‌ ఈసదస్సుకు హాజరుకాబోరని కథనాలు వెలువడ్డాయి. పర్యావరణ పరిరక్షణకు తమ మద్ద తు ఉంటుందని సుభాషితాలు వల్లించే ఆధిపత్య దేశాల అధినేతలు కాప్‌ వంటి సదస్సులకు డుమ్మా కొట్టడం వారి అసలు నైజాన్ని చాటుతోంది. పర్యా వరణం అంటే మన చుట్టూ ఉండే జీవావరణమే. దీనిని రక్షించుకోవడం మనందరి బాధ్యత.
ఎందుకీ అధిక వర్షాలు.. అసలు కారణాలేంటి?
కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా ఒకటేవర్షాలు. అదికూడా రోజుల తరబడి. గతం లో ఎప్పుడూ ఇలాంటి వాతావరణం లేదు. వాగులు పొంగుతున్నాయి. వంకలు పొర్లుతున్నా యి. చెరువులు అలుగులు పోస్తున్నాయి. నదులు ఉప్పొంగుతున్నాయి. పట్టణాలు నీట మునుగుతు న్నాయి. నగరాలు కాకావికలమవుతున్నాయి. కాలం కాని కాలంలో వర్షాలు కురుస్తుండడంతో మనిషి జీవితం అస్తవ్యస్తమవుతోంది. పంటలన్నీ చేతికొచ్చే సమయంలో జలార్పణమవుతున్నాయి.రోడ్లు కొట్టుకుపోతుండటంతో ప్రభుత్వానికి ?కోట్లల్లో నష్టం వాటిల్లుతోంది. గతంలో ఒకటి లేదా రెండు మహా అయితే మూడు రోజుల వరకే వర్షం పరిమి తమయ్యేది. తర్వాత కొంచెం గ్యాప్‌ ఇచ్చి కురిసేది. కానీ కొన్నేళ్ల నుంచి వర్షం కురిస్తే రోజుల తరబడి ఉంటున్నది.
ఎందుకు ఈ అకాల వర్షాలు
వాతావరణంలో ఆకస్మాత్తుగా చోటు చేసుకుంటున్న మార్పులకు అసలు కారణం భూమి వేడెక్కడం..సైన్స్‌ పరిభాషలో చెప్పాలంటే గ్లోబల్‌ వార్మింగ్‌. భూమి మీద వాతావరణం సూర్యరశ్మీని గ్రహించి వేడెక్కుతుంది. ఆ వేడిని చుట్టూ వ్యాపింప చేస్తుంది. ఇదే లేకపోతే భూమిచల్లగా ఉండి అసలు జీవించడానికి పనికొచ్చేది కాదు. అయితే సహజం గా ఏర్పడే ఈగ్రీన్‌ హౌస్‌ ఎఫెక్ట్‌కు మనుషులు చేసే పనులు మరింత వేడిని పెంచుతున్నాయి. ఆధునిక వ్యవసాయం, పురుగు మందుల వాడకం పెరగటం,కాలుష్యంవల్ల మరిన్ని ఉద్ఘారాలు విడు దలై వాతావరణంలో వేడిని మరింత ఎక్కువ చేస్తు న్నాయి. వాస్తవానికి వాతావరణంలో కార్బన్‌ డై యాక్సైడ్‌ సహజంగా ఉంటే ప్రకృతి సమతుల్యం అసలు చెడిపోదు.కానీ పెట్రోలు ఉత్పత్తుల వాడకం పెంచడంతోపాటు వాటి నుంచి వెలువడే కార్బన్డ యాక్సైడ్‌ ను గ్రహించే చెట్లను ఇష్టానుసారంగా కొట్టేస్తుండటంతో కర్బన సంబంధ,సల్ఫర్‌ సంబంధ ఉద్గరాలు పెరిగిపోతున్నాయి.పారిశ్రామిక అభివృద్ధి తర్వాత గాలిలో కార్బన్‌ డయాక్సైడ్‌ స్థాయిలు 30 శాతం,వాయువులు 140శాతంపెరిగాయని పర్యా వరణవేత్తలు చెబుతున్నారు. పైన మండే సూర్యుడు కింద చల్లని సముద్రాలు ఉండగా పర్యావరణానికి మనం కలిగించగల నష్టం ఏపాటిదిలే అనుకున్న మనిషిదాన్ని ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. గనుల్ని ఇష్టానుసారంగా తవ్వడం, పరిశ్రమలు ఏర్పాటు చేసి ఘన, ద్రవ, వాయు వ్యర్థాలను ఇష్టాను సారంగా గాలిలోకి, నీటిలోకి వదలడం వల్ల పర్యా వరణ చక్రం గతి తప్పుతోంది. విద్యుత్‌ అవసరా లకు బొగ్గును మండిచడం, వ్యవసాయ అవసరా లకు,గృహఅవసరాలకు అడవులను ఇష్టాను సారం గా కొట్టేయడం,సముద్రాలను డంపింగ్‌ యార్డ్‌ లుగా మార్చడంవల్ల జరగాల్సిన నష్టంజరిగి పోతోంది.
ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి
మనిషి శరీర ఉష్ణోగ్రత రెండు డిగ్రీలు పెరిగితేనే తట్టుకోలేడు. కొంతకాలంగా భూమి ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తోంది. మనిషి చేస్తున్న విధ్వంస పనులే భూమి వేడిని అంతకంతకు పెంచు తున్నాయి. ఈ ఉష్ణోగ్రతల పెరగడం వల్ల ధ్రువ ప్రాంతాల్లో మంచు వేగంగా కరుగుతోంది. అక్కడ మంచు కరిగితే మనకొచ్చే ముప్పు చాలా తీవ్రంగా ఉంటుంది. అదే తీరిన కరుగుతూ ఉంటే ఈ శతాబ్దం అంతానికి సముద్ర నీటిమట్టం ఒక మీటర్‌ వరకు పెరుగొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తు న్నారు. అదే జరిగితే మాల్దీవులు,సీ షెల్స్‌ వంటి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన దీవులన్నీ మునిగిపోతా యి. లండన్‌, వియత్నాం నెదర్లాండ్స్‌ బంగ్లాదేశ్‌ లాంటి దేశాల్లో చాలా భాగం ముంపునకు గురవు తుంది. అధికంగా సముద్రతీరం ఉన్న మనదేశం లోనూ నష్టం అపారంగా ఉంటుంది. కలకత్తా, చెన్నై,ముంబాయి, కేరళ వంటి వాటిపై ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది.-జిఎన్‌వి సతీష్‌

ప్లాస్టిక్‌ రహితం..ఇంకెంత దూరం.?

దశాబ్దాలుగా ప్లాస్టిక్‌ వినియోగం తీవ్రస్థాయికి చేరుకోవటం ఎన్ని సమస్యలు సృష్టిస్తోందో.. కళ్లకు కడుతూనే ఉంది. నిషేధిస్తున్నా మంటూ ప్రభుత్వాలు ప్రకటించటం..ఈ నిర్లక్ష్యం కారణంగానే ప్రజారోగ్యం బలి అవుతోంది.అటు మూగజీవాల ప్రాణాలకూ ముప్పుపొంచి ఉంటోంది. ఇలా నిత్య జీవన విధానం ఫాస్టిక్‌ మయంగా మారింది.రోజురోజుకీ పెరుగుతోన్న ప్లాస్టిక్‌ వినియోగం అనివార్యంగా మారుతోన్న తరుణంలో మానవ ఉనికినే ప్రశ్నర్థాకంగా మార్చేస్తోంది.
మొన్నటి వరకు సముద్రాలు,నదుల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాల గురించి మాట్లాడు కున్నాం, కానీ ఇప్పుడు మానవ శరీరంలోకి చేరుతోన్న ప్లాస్టిక్‌ గురించి మాట్లాడుకునే రోజులువచ్చాయి. మనుషుల రక్తంలో ప్లాస్టిక్‌ రేణువులను శాస్త్రవేత్తలు గుర్తించారు. తల్లి పాలల్లో దీని అవశేషాలున్నట్లు గుర్తించడం విశేషం. ప్లాస్టిక్‌,కాలుష్యం అధికమై వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. మంచుకొండలు కరిగిపోయి సముద్రంనీటిమట్టం పెరిగిపోతుంది. అకాలతుఫాన్లు ప్రభావంతో యావత్తు ప్రపంచ దేశాలు అతాలకుతలమై పోతున్నాయి.
జశీఅటవతీవఅషవ శీట ్‌ష్ట్రవ ూaత్‌ీఱవం (కాన్ఫెరెన్స్‌ఆఫ్‌ ద పార్టీస్‌)దీనినే షార్ట్‌గా (కాఫ్‌) జూఅని పిలుస్తారు. ప్రతిఏటా197 దేశాలను ఒకచోట చేర్చే సదస్సు ఇది.వాతావరణ మార్పులు,దాని ద్వారా ఏర్పడే సమస్యల గురించి ఈ సదస్సు ప్రధానంగా చర్చిస్తుంది.వాతావరణ మార్పులపై యునైటెడ్‌ నేషన్స్‌ ఆధ్వర్యంలో జరిగే కన్వెన్షన్‌ ఇది. పర్యావరణంపై మానవ కార్యకలాపాల ప్రభావాన్ని పరిమితం చేయడమే లక్ష్యంగా ప్రపంచంలోని ప్రతిదేశం,ప్రతి భూభాగం అంగీకరించి సంతకం చేసిన అంతర్జాతీయ ఒప్పందం కాప్‌.ఇలాంటి సదస్సలు ఇప్పటి వరకు 26 జరిగాయి. కాఫ్‌సదస్సుల్లో ఎన్నినిర్ణయాలు తీసుకున్నా ఏదేశం కూడా అమలు పర్చడంలో నిర్లక్ష్యవైఖరి అవలంబించడం శోచనీయం.
అంతర్జాతీయంగా మానవజాతిని అవహిస్తున్న ప్లాస్టిక్‌ను పూర్తిస్థాయిలో బాన్‌ చేయాల్సిన అవసశ్యకత ఎంతైనా ఉంది.ప్లాస్టిక్‌ను నియంత్రిస్తున్నమని ప్రగాల్బలు పలికే దేశాలు,రాష్ట్రాలు కేవలం ముక్కుబడిగానే అమలు చేస్తున్నాయి తప్పా కఠినమైన వైఖరిని అవలంబించడం లేదనే అందరికీ తెలిసిన విషయమే.ఎందుకంటే ప్రతివ్యక్తి జీవితంతో ప్లాస్టిక్‌ ముడిపిడి ఉంది.దీని నియంత్రణకు చట్టాలు,ప్రభుత్వాలున్నాయి.ఐక్య రాజ్య సమితి సైతం పదేపదే హెచ్చరిస్తూనే ఉంది.అయినా మానవ జాతిలో మార్పులురావడం లేదు. కంటికి కనిపించని సూక్ష్మమైన ప్లాస్టిక్‌ రేణువులు పీల్చేగాలి,చెత్తా ప్లాస్టిక్‌ అంతా డ్రైనేజీ,సముద్రాలు,చెరువులు,నదులు..ఇలా ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలు ఉండిపో తున్నాయి. ఫలితంగా యావత్తు మానవ శిశువులతోపాటుగా,జంతువులు,పక్షులు,జలచరాలు,కీటకాలు అన్ని చనిపోతున్నాయి.ప్రస్తుతం ప్లాస్టిక్‌ వ్యవర్థాలను భూమిపై పడేయడంతో అవి భూమిలో కరిగిపోకుండా ఎంతో ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది.
రెండు దశాబ్దాల క్రితం తూర్పు కనుమల్లో గిరిజన ప్రాంతాలు ప్రకృతి అందాలో ఆహ్లాదక రంగా ఉండేది. ప్రస్తుతం నేడుకొండకోనల్లోను ప్లాస్టిక్‌భూతం అవహించింది.రోజువారీ వాడి పారేసిన వస్తువులు,భూమిలో పూర్తిగా కరిగిపోవడం,పచ్చని పొలాలపై దీని ప్రభావం పడుతోంది. రైతులు పండిరచే పంటలు దిగుబడి తగ్గిపోతోంది. ప్లాస్టిక్‌ నియంత్రణపై పరిపాలనలో మార్పులు రావాలి. ప్లాస్టిక్‌ వాడకం తగ్గాలంటే దీని తయారి పరిశ్రమలను శాశ్వతంగా నియంత్రించాలి. అందుకు ప్రభుత్వాలు నిర్ధిష్టమైన,కఠినమైన నిర్ణయాలు తీసుకొని అమలు పర్చాలి.అలాగే పంచాయితీ స్థాయిలో ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని రూపుదిద్దేలాచర్యలు తీసుకోవాలి. ప్లాస్టిక్‌ రహిత సమాజంగా తీర్చిదిద్దాలి. ఇలాంటి మార్పును ప్రజలు సైతం స్వాగతించకపోతే,కాలుష్యం,ప్లాస్టిక్‌ మానవ జీవితాన్ని మరింతగా కృంగదీసి ప్రమాదాలు సంభవించే అవకాశాలున్నాయి.- రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్. 

నిరుద్యోగంతో..ఆకలి కేకలు

ప్రపంచవ్యాప్తంగా ఆహార అభద్రత నానాటికీ పెరిగిపోతుండటం ఆందోళనకరంగా మారింది. ఐక్యరాజ్యసమితి ఇటీవల విడుదల చేసిన ‘ప్రపంచంలో ఆహార భద్రత, పోషకాహార పరిస్థితి నివేదిక-2019’ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. దీని ప్రకారం ప్రపంచంలో ఆకలితో అలమటిస్తున్నవారు 82 కోట్ల మంది (దాదాపు 11శాతం) ఉన్నారు. అయితే భారత్‌లో కూడా ఆకలి చావులు నమోదవు తున్న నేపథ్యంలో..
దేశంలో ఏటేటా పెరగుతున్న నిరుద్యోగ సమస్యే దీనికి ప్రధాన కారణమని ఐరాస నొక్కి చెప్పడం గమనార్హం.‘2017-18 నుంచి భారత్‌లో పెరుగుతున్న నిరుద్యోగం, దేశ ఆర్థిక పరిస్థితి అంతకంతకూ దిగజారుతుండటం ఆకలి బాధలకు కారణమవుతున్నది’ అని యూఎన్‌ పేర్కొన్నది. భారత్‌లో నిరుద్యోగ సమస్య ఇప్పటిది కాకపోయినా గడిచిన మూడేం డ్లుగా అది మునుపెన్నడూ లేనంతగా పెరిగిపోతున్నది. తాము అధికారం లోకి వస్తే ఏటా రెండుకోట్ల ఉద్యోగాలిస్తామని గద్దె నెక్కినమోడీ సర్కారు. తద నంతర కాలంలో ఆహామీని తుంగలోతొక్కింది.ఉపాధి దొరక్క, తిండి లభించక కోట్లాది మంది పస్తులుంటున్నారు. ఈఏడాది జనవరిలో నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆఫ్‌ ఆర్గనై జేషన్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌వో) గణాంకాల ప్రకారం..దేశంలో నిరుద్యోగిత రేటు 45ఏండ్ల గరిష్టానికి (6.1శాతం)చేరుకున్నది. 2017-18కి సం బంధించిన ఆ నివేదికను తొలుత దాచిపెట్టిన మోడీ సర్కారు..ఎన్నికలు ముగిసిన తర్వాత విడుదల చేయడం గమ నార్హం.2016 నవంబర్‌లో ప్రధాని మోడీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలో వేలాదిమంది నిరుద్యో గులుగా మారారని జాతీయ,అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు గొంతెత్తి మొత్తుకున్నా మోడీ సర్కారు దానిని పెడచెవిన పెడు తున్నది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అసలే ఉద్యోగాలు కోల్పో యి ఇబ్బందులెదుర్కొంటున్న ప్రజలపై బీజేపీ సర్కారు జీఎస్టీ పేరిట మరో మోయలేని భారం మోపింది.‘ఒకే దేశం-ఒకే పన్ను’ అంటూ తీసుకొచ్చిన జీఎస్టీ..చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలను కోలుకోలేని దెబ్బ తీసిందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు…! దీంతో ఆయా రంగాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. పెద్దనోట్ల రద్దు,జీఎస్టీ వంటి ఆర్థిక పరమైన నిర్ణయాలే గాక దేశంలో వ్యవ సాయం మీద మోడీ సర్కారు చూపుతున్న అశ్రద్ద కూడా గ్రామీణ పేదల ఆకలికి కారణమవుతున్నదనేది విశ్లేషకుల వాదన. ఒవైపు వర్షాలు కురవక, వరుస కరువుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరోవైపు రైతాంగంపై అప్పుల భారం వారిని ఆత్మ హత్య లకు ఉసిగొల్పు తున్నది. గిట్టుబాటు ధరల్లేక ఆర్థికంగా చితికి పోయిన రైతులు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తుంటే మోడీ సర్కారు మాత్రం వ్యవసాయా న్ని కార్పొరేట్‌లకు అప్పగించి రైతు ఆదా యాన్ని పెంచుతామని చెబుతుండటం విడ్డూరం.
వేలెత్తి చూపిస్తున్న ఆకలిచావులు
ప్రపంచ ఆరోగ్య సూచీ నివేదిక ప్రకారం భారత్‌లో 2016-18 నాటికి 19.44కోట్ల (దేశ జనాభాలో సుమారు 14.5శాతం) మంది ఆకలితో అలమటిస్తున్నారు. గతంతో పోల్చు కుంటే 2015 వరకు ఆకలి సమస్య కొంతమేర తగ్గినా ఆ ఏడాది నుంచి మళ్లీ అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఆహార అభద్రత కారణం గా జార్ఖండ్‌లో నమోదవుతున్న ఆకలి చావులు విశ్వ యవనికపై భారత్‌ను వేలెత్తి చూపుతు న్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం.. గడిచిన రెండేండ్లలో జార?ండ్‌లో సుమారు 20 మంది ఆకలి బాధలు తట్టుకోలేక మరణించారు. రాష్ట్రంలోని బీజేపీ సర్కారు పేదలకు రేషన్‌కార్డు లివ్వకపోవడం దీనికి ఒక సమస్యైతే, రేషన్‌ కార్డులకు ఆధార్‌ను అనుసంధానం చేయడం కూడా ఈ చావులకు కారణమైందని హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఆకలితో అలమ టించేవారే గాక పోషకాహార లోపం కూడా దేశంలో ప్రధాన సమస్యగా ఉన్నది. అధికారిక లెక్కల ప్రకారం..దేశంలో పదిశాతం పిల్లలు మాత్రమే సమతుల్య ఆహారాన్ని తీసుకుంటు న్నారు. ఆర్నెళ్లలోపు ఉన్న చిన్నారుల్లో 54 శాతం మంది మాత్రమే తల్లిపాలు తాగుతు న్నారు. దీనిని 2025 నాటికి 25శాతానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నా ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పని కాదని న్యూట్రీషన్‌ నిపుణుడు డాక్టర్‌ అంత ర్యామి దాస్‌ తెలిపారు.
ప్రపంచ ఆకలి సూచిక లో దిగజారిన భారత్‌
పాక్‌, బంగ్లాదేశ్‌ కన్నా వెనుకబడ్డ ఇండియా
గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌,2022లో 121 దేశా లలో భారతదేశం ఆరు స్థానాలు దిగజారి 101 నుంచి 107వ ర్యాంక్‌కు పడిపోయింది. యుద్ధంతో దెబ్బతిన్న ఆఫ్ఘనిస్తాన్‌ మినహా దక్షిణాసియాలోని చాలా దేశాల కంటే వెనుక బడి ఉంది. 29.1స్కోర్‌తో,గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ ప్రచురణకర్తలు,యూరోపియన్‌ ఎన్‌జి ఓలు కన్సర్న్‌ వరల్డ్‌వైడ్‌ మరియు వెల్తుంగర్‌ హిల్ఫ్‌, ఆకలి స్థాయిని తీవ్రమైనదిగా ట్యాగ్‌ చేశారు.121 దేశాలGనIలో ఎనిమిది స్థానాలు దిగజారి 84వ ర్యాంక్‌కు చేరుకున్న బంగ్లాదేశ్‌, గతేడాది 76వర్యాంక్‌తో పోలిస్తే చాలా మెరుగు పడిరది. దాదాపు అన్ని పొరుగు దేశాలు బాగా మండిపడ్డాయి. పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌ మరియు మయ న్మార్‌ వరుసగా 99, 64,84,81మరియు 71స్థానాల్లో నిలిచాయి. ఐదు కంటే తక్కువ స్కోర్‌తో మొత్తం 17 దేశా లు సమిష్టిగా1మరియు 17మధ్య ర్యాంక్‌ పొందాయి.
గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ అనేది ప్రపంచవ్యాప్తంగా అలాగే ప్రాంతాల వారీగా మరియు దేశం వారీగా ఆకలిని కొలిచే మరియు ట్రాక్‌ చేసే సాధనం. 2022 గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ అనేక దేశాలలో భయంకరమైన ఆకలి కుంభకోణాన్ని ప్రతిబింబిస్తుంది, అలాగే ఆకలిని ఎదుర్కోవడంలో దశాబ్దాల పురోగతి క్షీణిస్తున్న దేశాలలో మారుతున్న పథం రెండిరటినీ ప్రతి బింబిస్తుంది. ఆకలిసూచిక స్కోర్‌లు నాలుగు కాంపోనెంట్‌ ఇండికేటర్‌ల విలువలపై ఆధారపడి ఉంటాయి: పోషకాహార లోపం, పిల్లల పెరుగుదల,పిల్లల వృధా మరియు పిల్లల మరణాలు. పోషకాహార లోపం తగినంత కేలరీల తీసుకోవడంతో జనాభాలో వాటాను సూచిస్తుంది. ఇండెక్స్‌లో ఎక్కువ స్కోర్‌ అంటే ఆకలి పరిస్థితి మరింత దిగజారడం. సున్నా అనేది ఉత్తమ స్కోర్‌..ఆకలి లేదని సూచిస్తుంది.
ప్రతిపక్షాల విమర్శలు ఆకలిసూచీలో భారత్‌ ర్యాంక్‌ పడిపోవడంపై తెలంగాణ మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ మరియు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ మంత్రి కెటి రామారావు ట్విట్టర్‌లో ఇలా వ్రాశారు. ఇంకో రోజు చీూA ప్రభుత్వం సాధించిన మరో అద్భుతమైన విజయం. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో భారత్‌ 101వ స్థానం నుంచి 107వ ర్యాంక్‌కు పడిపోయింది. వైఫల్యాన్ని అంగీకరించే బదులు, బీజేపీ జోకర్లు ఈ నివేదికను ఇప్పుడు భారత వ్యతిరేక నివేదిక గా కొట్టిపారేస్తారని నేను ఖచ్చితంగా అనుకుం టున్నాను.
కరోనాతో సమస్య..
ఈ సూచీలో భారత్‌ స్థానం 101కాగా, పాకి స్తాన్‌ 92వ స్థానంలో, నేపాల్‌, బంగ్లాదేశ్‌ 76వ స్థానంలో, మయన్మార్‌ 71వ స్థానంలో నిలిచాయి. ఇవి భారత్‌ కన్నా మెరుగ్గా ఉన్నప్ప టికీ.. ఇవి కూడా తమ దేశ ప్రజల ఆకలిని తీర్చడంలో ప్రమాదకర స్థాయిలోనే ఉన్నాయని నివేదిక తెలిపింది. కరోనా కారణంగా చాలా దేశాల హంగర్‌ ఇండెక్స్‌ దిగజారిందని వెల్ల డిరచింది. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆకలిపై పోరాటం సరైన మార్గంలో సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, ఐదేళ్ల లోపు పిల్లల మరణాల విషయంలో భారత్‌ మెరుగైన ఫలితాలను సాధించింది. కరోనా సంబంధిత ఆర్థిక, ఆరోగ్య సవాళ్లు,వాతావరణ మార్పు, ప్రపంచ దేశాల మధ్య ఘర్షణలు.. ఆహార భద్రతను దెబ్బతీస్తున్నాయని ఈ నివేదిక వెల్లడిరచింది. దేశాలు,ప్రాంతాలు,వర్గాల మధ్య అసమానతలు తొలగనంతవరకు సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలను సాధించలేమని స్పష్టం చేసింది.
ఆకలి సూచికలపై కాషాయ దళాల మండిపాటు
తాజాగా ప్రకటించిన 2022 ప్రపంచ ఆకలి సూచికలో మన దేశ స్థానం మరింత దిగ జారింది. గతేడాది 116 దేశాలకు గాను 101వదిగా ఉంటే ఇప్పుడు 121లో 107వ స్థానం. గత ఎనిమిది సంవత్సరాలుగా ఆకలి సూచికలో మనకు దక్కుతున్న స్థానం గురించి ప్రతి ఏటా కాషాయ దళాలతో పాటు మరి కొందరు తప్పు పడుతున్నారు. అసలు ఆ లెక్కలే తప్పు, లెక్కించిన పద్ధతే తప్పు, పరిగణన లోకి తీసుకున్న అంశాలే సరైనవి కాదు, ప్రభుత్వేతర సంస్థలు (ఎన్‌జిఓ) చెప్పే వాటిని లెక్కలోకి తీసుకోనవసరం లేదని వాదనలు చేస్తున్నారు. మూడు వేల మందిని ప్రశ్నించి దాన్నే దేశమంతటికీ వర్తింపచేయటం ఏమిటి అని ఆశ్చర్యం నటిస్తున్నారు. నిజమే ఇలాంటి వాదన లను ప్రభుత్వం కూడా చేస్తున్నది,ఖండి స్తూ ప్రకటనలు చేస్తున్నది. ఐరాసలో 193 దేశాలకు సభ్యత్వం ఉంది, మరో రెండు పరిశీలక దేశాలు, అసలు చేరని దేశాలూ ఉన్నాయి. ఇప్పుడు నివేదిక రూపొందించిన సంస్థలకు సమగ్రంగా తమ సమాచారం ఇచ్చిన దేశాలు 121 మాత్రమే. అది స్వచ్ఛందం తప్ప ఇవ్వక పోతే తల తీసేదేమీ ఉండదు.ఒక్క ఆకలి సూచికనే కాదు, అనేక సూచికలను ఎప్పుడైనా మోడీ సర్కార్‌ లేదా దాని మద్దతుదార్లు అంగీక రించారా? లేదు, ఎందుకంటే అన్నింటా అథమ స్థానాలే. ఆకలి సూచికలను రూపొందిం చేందుకు ప్రాతిపదికగా తీసుకున్న నాలిగింటిలో మూడు పిల్లల ఆరోగ్యానికి సంబంధించినవి, వాటిని మొత్తం జనాభాకు ఎలా వర్తింప చేస్తారు అన్నది కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాల్లో ఒకటి. అయితే అన్ని దేశాలకూ ఒకటే పద్ధతిని అనుసరించారు కదా! పోషకాహార లేమికి గాను కేవలం మూడు వేల మందితో జరిపిన సర్వేను ఎలా ప్రాతిపదికగా తీసుకుంటారు అన్నది మరొక అభ్యంతరం. ఇది కూడా అన్ని దేశా లకూ ఒకటే పద్ధతి. నివేదికను రూపొం దించిన సంస్థలు తాముగా ఎలాంటి సర్వేలు జరపలేదు. ప్రభుత్వం చెబుతున్న మూడు వేల మందిని సర్వే జరిపింది ఐరాస సంస్థలలో ఒకటైన ఆహార మరియు వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ).అది కూడా వేరే సంస్థ ద్వారా చేయించింది. ఆ సమాచారాన్నే నివేదికను రూపొందించిన ‘వెల్ట్‌ హంగర్‌ హిల్ఫ్‌, కన్సర్న్‌ వరల్డ్‌ వైడ్‌’ తీసుకున్నాయి. అనేక అధికారిక సంస్థల సమాచారాన్ని కూడా అవి తీసుకు న్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ నేత అశ్వనీ మహాజన్‌ స్వదేశీ జాగరణ మంచ్‌ సహ కన్వీనర్‌గా పని చేస్తున్నారు.-సైమన్‌ గునపర్తి

1 2