మొక్క‌లు నాటుదాం…ప‌ర్య‌వ‌ర‌ణాన్ని కాపాడుకుందాం..!

కాలుష్య కాసారం ప్రకృతినీ పర్యావరణాన్నీ, మానవ ఆరోగ్యాన్నీ అనేక రూపాల్లో ప్రభావితం చేస్తోంది. ఒకప్పుడు అందంగా… అహ్లాదం గా…. స్వచ్ఛంగా ఉన్న వాతావరణం క్రమంగా కనుమరగైపో తోంది. అవసరంలేని ఆధునికతతో, రకరకాల వ్యర్థాలతో, కాలుష్యాలతో జీవావరణ వ్యవస్థకు ప్రమాదం ఏర్పడుతోంది. ఇప్పటికే అది తీవ్రస్థాయికి చేరిందని పర్యావరణ ప్రేమికులు, శాస్త్రవేత్తలు, ఆందోళనవ్యక్తం చేస్తు న్నారు. మానవ మనుగడ సాఫీగా ఉండాలంటే ప్రకృతిని పదిలంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ప్రకృతి, పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సినన అవసరం ఉంది. పర్యావరణంలో రోజు రోజుకూ వస్తున్న మార్పులు, పొంచి ఉన్న ప్రమాదం, చేపట్టాల్సిన చర్యలు గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
పర్యావరణం విషయానికొస్తే మీకు కొన్ని అంశా ల చెప్పాలి. నాచిన్నప్పుడు యింటి ముందు మట్టి రోడ్లే కానీ తారు రోడ్లు లేవు.స్నేహితులం దరం ఆ మట్టిలో గంటల తరబడి ఆడినా, ఆమట్టి ధూళి పీల్చినా ఏకొంచెం అనారోగ్యం కూడా కలిగేది కాదు. కారణం మట్టిలో ఉన్న సూక్ష్మ జీవులను,కీటకాలను పిచ్చుకలు,కోళ్ళు, పావురాలు పక్షి సమూహాలు ఎన్నో వచ్చి తినేసి పర్యావరణానికి ఎంతో మేలు చేసేవి.ఇక సరు కులకోసం షాపుకెళ్తే షాపు వాళ్ళు న్యూస్‌ పేపర్‌ కాగితాలలో చింతపండు,మిరప కాయలు పప్పు,ఉప్పు,అన్నీ పొట్లాలు కట్టి ఇచ్చేవాళ్ళు ఒక బట్ట సంచీలో వాటిని తెచ్చుకునే వాళ్ళం. కొబ్బరి నూనె అయిపోగానే ఖాళీ సీసా తీసుకు వెళ్తే అందులో.. నూనె కొలిచి ఇచ్చేవారు. కొంచెం సమయం పట్టినా సరుకులు ఇచ్చే విధా నంలో ఎక్కడా పర్యావరణానికి హాని జరిగేది కాదు. కాలుష్యం అనే కాసారానికి ఎంతో దూరంగా పర్యావరణ పరిరక్షణ జరుగుతూ ఎంతో బాగుండేది.అసలు పాలిథీన్‌ కవర్లు 19 80 వరకు మేము ఎన్నడూ చూడలేదు.1978-79లో అంటే అప్పుడు మే8వ క్లాసు/ 9వ క్లాసు లో ఉన్నప్పుడు ‘‘ప్లాస్టిక్కులు’’ అనే తెలుగు పాఠం ఉండేది. బహుశా అప్పటికే రాబోయే సునామీ అది అనే విషయం ఆరోజుల్లో తెలిసేది కాదు, పైగా ప్లాస్టిక్కులవల్ల ఎన్ని లాభాలో ఆపాఠం లో చదువుకున్నాం. ఆరోజుల్లో ఉదయం నిద్రలేపుతూ పాల సీసా బండివాడు బండిపై టక టకా శబ్దం చేస్తూ ..వచ్చేవాడు. వెంటనే పిల్లలమంతా అమ్మ ఇచ్చిన ఖాళీపాల సీసాలు రెండు తీసుకుని వీధిలోకి వెళ్లి బండి ఆయనకు ఇచ్చికొత్త పాల సీసాలు రెండు పట్టుకొచ్చే వాళ్ళం.అమ్మ ఆపాల సీసాల ఢక్కన్‌ (మూత)ను తెరవగానే దాన్నిండా వెన్న ఉండేది. ఆవెన్న తినటానికి మేము అప్పుడప్పుడూ పోటీపడే వాళ్ళం. పాలిథీన్‌ కవర్లలో పాలు అప్పట్లో మే ము ఎరగము..షాపు నుండి సరుకులు తెస్తే అన్నీ పాత ఒవల్టీన్‌/డాల్డా వంటివి చిన్న డబ్బా ల్లో పోసుకునేది అమ్మ. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా భూమిలో కరిగిపోని /కలిసిపోని ప్లాస్టిక్‌ కవర్లే. ప్రతి రెండు అడుగుల భూమికీ ఒకటి చొప్పున రోడ్డుపై కనబడుతున్నాయి. ఆ వ్యర్ధాలు తిని ఆవులు, గేదెలు అనారోగ్యం పావుతు న్నాయి. మొన్నీమధ్యే పేపర్‌లో వచ్చింది ఈవార్త ఏమి టంటే…ఆవ్యర్దాలన్నీ తిన్న ఆవుకు ఆపరే షన్‌ చేసి 25 కిలోల ప్లాస్టిక్‌వ్యర్ధాల చుట్టను బయటికి తీసిఆవుకుప్రాణంపోశారటపశు వైద్యు లు !!! అప్పట్లో చాటలో బియ్యం చేరుగుతూంటే వడ్లు/నూకలు (ఈ కాలం పిల్లలకు ఇవిఏంటో కూడా తెలియదు) తినటానికి పిచ్చుక లెన్నో వచ్చేవి కిచకిచమంటూ రెక్కలు అల్లల్లా డిరచు కుంటూ తినేవి అదిచూసి, మేము ఇంకా బియ్యం వేసే వాళ్ళం.మనసుకు ఎంతో ఆహ్లాదం గా, ఆనందంగా ఉండేది. అప్పట్లో ఇన్ని పెట్రోల్‌/డీసిల్‌ బండ్లెక్కడివి? ప్రతియింట్లో విధిగా సైకిల్‌ ఉండేది. 1980 వరకు స్కూటర్‌లు ఎక్కువ కనిపిం చేవి కావు, బైక్‌లు అసలే లేవు. చిన్న దూరాలకు వాకింగ్‌, పెద్ద దూరాలకు సైకిళ్ళు ఉండేవి. అప్పట్లో మేము ఆడ పిల్లలం కూడా సైకిల్‌ నేర్చుకోవటానికి ఉబ లాట పడే వాళ్ళం. అలా నేను కూడా సైకిల్‌ తొక్కడం నేర్చుకున్నాను. మా చిన్నప్పుడు 3మైళ్ళ దూరం వెళ్ళాల్సి వస్తే రిక్షల్లో వెళ్ళే వాళ్ళం. చార్జి కేవలం 2 రూపాయలు (ఇప్పటి పిల్లలకు అవి బొమ్మ గీసి చూపెట్టాల్సి వస్తున్నది). 1980-85 సమయంలో 5,7,రూపాయలకు దింపే వారు. ఇక వాహన కాలుష్యం ఎక్కడిది? అంతా స్వఛ్ఛమైన గాలే కదా! ఇకదానితో బాటుధ్వని కాలుష్యంకూడా లేదు. ఇప్పుడు ఈ వాహనాల మూలంగా, పొగవల్ల థైరాయిడ్‌ గ్రంథి ó పని తీరు అధ్వాన్న మైంది అందరికి ఇదే జబ్బు. ఇక అస్తమా, బ్రోన్కైతిస్‌ అయితే చెప్పనక్కర లేదు ఇవి చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు వస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ప్రమాదంగా మారిందో చెప్పాల్సిన పనిలేదు. అలాఅవసరం లేకున్నా వాహనాలు చేసే ధ్వని కాలుష్యం (హార్న్‌ శబ్దాలు) వలన తలనొప్పి, అల్జీమర్స్‌, ఒత్తిడి ఆందోళన,మతి మరుపు, నరాల జబ్బులు వస్తున్నాయి ఇళ్ల మధ్యలో ఎక్కడా ఏ చిన్న ఫ్యాక్టరీ కూడా ఉండేది కాదు.పట్నం(హైదరా బాద్‌) మా చిన్నప్పుడు పల్లె శోభతో కళకళ లాడేది. తులసి కోటలోనే కాకుండా బయట కూడా చాలామొక్కలు తులసివనంలాఉండేది. దాంతో మంచి స్వచ్చమైన గాలి పీల్చే వాళ్ళం. వర్షం పడితేచాలువీధిలో గడ్డిపై వెల్వెట్‌ (ఆరు ద్ర పురుగులు) పురుగులు కనబడితే వాటిని అగ్గిపెట్టె లో పెట్టి అందరికీ చూపించే వాళ్ళం. ఇప్పుడు ఇళ్ళ మధ్యలో చిన్న చిన్న ఫ్యాక్టరీలు వెలుస్తు న్నాయి. గ్యాస్‌ ఫిల్లింగ్‌ వంటి వైతే పేలుడు కూడా జరిగే ప్రమాదం లేకపోలేదు. ఇళ్లలో ఉండే మొక్కలవల్ల మంచిగాలి పీల్చే వాళ్ళం. ఇప్పుడు ఫ్లాట్‌లలో ఒక్క చెట్టు కూడా కనబడటం లేదు. అసలే ఓజోన్‌ పొరతరిగి పోతున్నది. దాంతో భూమిపై వాతావరణం వేడెక్కి, భూతాపంవల్ల మనుషులకు డ్రైనెస్‌ గొంతులో,కళ్ళలో మంటలు,హైబిపి జబ్బులు వస్తున్నాయి. ఇప్పటికైనా విరివిగా మొక్కలు, చెట్లు పెంచితే కొంత వరకైనా ఈసమస్య నుండి అధిగమించవచ్చు.జలకాలుష్యం:నదులు, సరస్సు లు పూడుకు పోయాయి ఇసుకమట్టి మాత్రమే కాదు ప్లాస్టిక్కులతో నిండి పోయాయి. నాలాలు మరీ ఘోరంగా తయార య్యాయి ఒకవర్షం వస్తే డ్రైనేజ్‌ పొంగి వీధుల్లో యిళ్ళ మధ్య ప్రవహిస్తూ దోమలతో అనారోగ్యం కలిగిస్తున్నది. ప్లాస్టి కవర్లు భూమి పొరల్లో కరుగక, ఎండా` వానలకు రసాయనాలు విడుదల చేస్తూ కాలు ష్యాన్ని పెంచుతు న్నాయి.అవిపీల్చిన వాళ్లకి భయం కరమైన వ్యాధులు,ఆస్తమా,రక్తపోటు, గుండెదడ,ఉబ్బస వ్యాధులు కలుగుతున్నాయి. కొందరు అజ్ఞానంతో,చెత్తలలో టైర్‌లవంటివి కూడా కాలుస్తున్నారు.దీనివల్ల కీడు ఎక్కువ. ఇవన్నీ ప్రజలకు అవగాహన కలిగించాలి .
ఇలా చేయాలి:
ే నేటి తరానికి, పిల్లలకు మన అంత అందమైన బాల్యం కూడా ఇవ్వలేక పోయాం. కనీసం ఇప్పటి నుంచైనా కళ్ళు తెరిచి, పచ్చని వాతావరణం కల్పించి, ప్లాస్టిక్‌ వాడకం తగ్గించి బట్ట సంచులు వాడేలా చేయాలి.
ే దగ్గరి షాప్‌లకు నడిచో, సైకిల్‌ పై వెళ్ళేలాగో చర్యలు చేపట్టాలి. వాళ్లకి ఈ అవగాహన కల్పించాలి.
ే పిచ్చుకలు,కాకులు ఇతర పక్షి జాతులు మనచుట్టూ ఉండేలా చేసుకొనే ప్రయత్నం చేయాలి.తక్కువ నీరు పీల్చే మొక్కలను సత్వరమే పెంచాలి.
ే మళ్ళీ రిక్షాలను, ఆహ్వానించాలి. తద్వారా పేద వారికి ఉపాధి కూడా కలుగుతుంది.
ే ఇంటి బయట పావురాలకు కాస్త ధాన్యం వేసి, మంచి నీరు ఒక మూకుడులో పెట్టి, ఆకర్షించాలి
ే ప్లాస్టిక్‌ కవర్లు వాడ కూడదు. ప్లాస్టిక్‌ను వీధుల్లో ఎక్కడ బడితే అక్కడ వేసే వారికి జరిమానా వెయ్యాలి. అలాగే పేరుకున్న వాటన్నింటినీ వెంటనే తొలగించే చర్యలు చేపట్టాలి. కాలనీల వారీగా ఈ ప్రయత్నం చేయించాలి.
ే నాలాలను, చెరువులను వర్షా కాలం లోపలే చెత్త రహితంగా చేసుకోవాలి
ే ఇళ్లల్లో ,ఆఫీసుల్లో అవసర మైనంత మేరకే విద్యుత్తు వాడాలి/ స్విచ్‌ ఆఫ్‌ చేస్తూ ఉండాలి. సెల్‌ ఫోన్‌లను రోజుకో గంట స్విచ్‌ ఆఫ్‌ చేయాలి, రేడియేషన్‌ను తగ్గించాలి
ే సౌర శక్తిని విరివిగా ప్లేట్‌లుభవనాలపై నిర్మించి విద్యుత్‌ ఆదా చేయాలి.
ే బియ్యం, కూరలు కడిగిన నీటిని మొక్కలకు పోయాలి.
ే వాహనాల హారన్‌లు ఊరికే మోగించ కుండా చర్యలు చేపట్టాలి
ే ఇళ్ళ మధ్యలో, మైదానాల్లో పార్క్‌లు అభివృద్ధిపరిచే చర్యలు చేపట్టాలి. ఉదయం సాయం సంధ్యలలో వాకింగ్‌ చేస్తూ ప్రకృతిని ఆస్వాదించాలి. చీటికి మాటికి మందులు వేసుకోవటం కూడా తగ్గించినట్లు అవుతుంది
ే పిల్లలకు పట్టే పాలల్లో కూడా పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని ఇటీవల జరిపిన పరిశోధనల్లో వెల్లడైనట్లు వార్తలొచ్చాయి సింథటిక్‌ పాలను, కృత్రిమ పాలనునిషేధించాలి.
ే కంపోస్ట్‌ ఎరువులనే వాడాలి.రసాయ నిక ఎరువులను వాడకుండాచర్యలు చేపట్టాలి
ే సేంద్రీయపధ్ధతిలోపెంచే కూరగాయా లనే వాడేలా, జనరిక్‌ మందులనే వినియోగించేలా ప్రజలకు అవగాహనా సదస్సులు పెట్టి వారిని చైతన్య వంతులను చేయాలి.
ే ధాన్యాల్లో కల్తీని అరికట్టే చర్యలు చేపట్టాలి. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే తప్పకుండా భావితరాలకు స్వచ్ఛమైన గాలిని, నీటిని, వాతా వరణాన్ని అందించ గలుగుతాం.
కార్భన్‌డయాక్సైడ్‌తో నష్టాలు:
వాతావరణంలో కర్బనం రెండు ఆక్సిజన్‌ అణువులతో కలిసి కార్బన్‌ డయాక్సైడ్‌గా మారుతుంది. కార్బన్‌ డయాక్సైడ్‌,గ్రీన్‌ హౌస్‌ ఎఫెక్టు కారణంగా భూమి గడ్డ కట్టుకుపోకుండా ఉంటుంది. కానీ ఇప్పుడు వాడే శక్తి అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎక్కువ మొత్తా ల్లో కార్బన్‌ డయాక్సైడ్‌ వాతా వరణంలో కలు స్తోంది.వాతావరణంలో ఇప్పుడు సగటున మిలి యన్‌కు 380పార్ట్‌ల కార్బన్‌ డయాక్సైడ్‌ ఉంది. పారిశ్రామిక విప్లవం మొదలు కావడానికి ముం దు ఇది280స్థాయిలో ఉండేది.అంటే ఇప్పుడు 36శాతం ఎక్కువైంది.శిలాజ ఇంధనాల నుంచి వెలువడే కాలుష్యాలను తగ్గించకపోతే గనుక 2100 సంవత్సరంనాటికి ఉష్ణోగ్రత3నుంచి 6డిగ్రీల సెల్సియస్‌ పెరుగు తుందని వాతా వరణ నిపుణులు పేర్కొం టున్నారు.భూమిమీద వేడి పెరిగితే మంచు పర్వతాలుకరిగి,సముద్ర మట్టాలు పెరుగుతాయి.దీనివల్ల తీరానఉండే ద్వీపాలు,లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి. గ్లోబల్‌ వార్మింగ్‌ ఇంకా పెరుగుతుంది.ఇది లాగే కొన సాగితే భవిష్యత్తు ప్రమాదకరంగా ఉంటుంది.(జీ.ఏ.ఎస్‌. కూమార్‌ )

మాలి కొండపై ఆదివాసులు దండయాత్ర

ఒడిశాలోని కోరాపుట్‌ అడవుల్లో బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా నిరసనలు పెరుగుతున్నాయి, స్థానిక గిరిజన జనాభా వారి మాలి పర్బత్‌ (కొండ)లో మైనింగ్‌ కార్యకలాపాలను వ్యతిరేకిస్తున్నారు. గత వారం, నవంబర్‌ 22న, ఒడిశా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు దాదాపు 500 కిలోమీటర్ల దూరంలోని కంకదాంబ గ్రామంలో బాక్సైట్‌ తవ్వకాలపై బహిరంగ విచారణను నిర్వహించింది, దీనికి స్థానిక ఆదివాసీల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. స్థానిక నివాసుల ప్రకారం, జరిగిన బహిరంగ విచారణలో సాయుధ భద్రతా దళాలు మరియు అధికారుల సంఖ్య స్థానిక గిరిజన ప్రజల కంటే చాలా ఎక్కువ. విచారణ రోజున, మైనింగ్‌ ప్రాజెక్ట్‌ను అధికారులు రద్దు చేయాలని, కొండ, అటవీ ప్రాంతాన్ని రక్షించాలని డిమాండ్‌ చేస్తూ మాలి పర్వత సురక్షా సమితి (మలి కొండ రక్షణ కమిటీ) సభ్యులు నిరసన చేపట్టారు. ‘‘ఒడిశా స్టేట్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ కంపెనీకి %ళి%హిండాల్కో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌ ఇస్తే, మేము మా ఆందోళనను తీవ్రతరం చేస్తాము’’ అని నిరసన సమూహాలలో ఒకటైన లోక్‌ శక్తి అభియాన్‌ అధ్యక్షుడు ప్రఫుల్ల సమంత్ర గావ్‌ కనెక్షన్‌తో అన్నారు. ‘‘మైనింగ్‌ వల్ల ఈ ప్రాంతంలో భూగర్భజలాలు, గాలి మరియు మట్టికి అంతరాయం కలుగుతుంది. ఇది జరగడానికి మేము అనుమతించము, ’’అని అతను గట్టిగా చెప్పాడు. కోరాపుట్‌ జిల్లాలోని గిరిజనుల ప్రాబల్యం గల సెమిలిగూడ బ్లాక్‌లోని కంకదాంబ గ్రామం వద్ద మాలికొండ చుట్టుపక్కల మైనింగ్‌కు వ్యతి రేకంగా ఆందోళనకారులు నిరసన తెలిపారు. మాలి కొండ చుట్టుపక్కల ప్రాంతంలో 44 గ్రామాలలో నివసించే కొండ,పరాజ,గదబ గిరిజన సంఘాలు ఉన్నాయి. మైనింగ్‌ లీజు పరిధిలోకి వచ్చే ప్రాంతం 268.110 హెక్టార్లలో విస్తరించి ఉంది. మైనింగ్‌ లీజు మరియు పర్యావరణ క్లియరెన్స్‌ హిందాల్కో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌కు 2003లో మంజూర య్యాయి. స్థానిక నివాసితులచే ప్రాజెక్ట్‌ గురించి రిజర్వేషన్లు ఉన్నప్పటికీ, స్థానిక ప్రతిఘటన ఆ ప్రాంతంలో మైనింగ్‌ కార్యకలాపాలను నిరోధిం చింది. లీజు మరియు పర్యావరణ అనుమతి 2013లో ముగిసింది.
ఇప్పుడు పరిశ్రమను తాజాగా 50ఏళ్లలీజుకు తీసుకోనున్నారు. అయితే ఇది స్థానిక ప్రజల నుండి ఆమోదం పొందాలి. దీని కోసం బహి రంగ విచారణ అవసరం.సెప్టెంబర్‌ 22న జరగాల్సిన బహిరంగ విచారణను జిల్లా యం త్రాంగం పెద్దఎత్తున హింసాత్మకంగా జరి గింది. దీంతో అప్పట్లో ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేశారు.తిరిగి నవంబర్‌ 22న పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించారు. అది కూడా భారీ పోలీసు బందోబస్తు నడుమ పబ్లిక్‌ హీరింగ్‌ నిర్వహించారు. అది చెల్లదంటూ గిరిజనులు తమ అడవులను కాపాడాలని కోరుతున్నారు.
మాలికొండ ప్రాంతంలో నివసించే అడవులు ప్రజలు,వృక్షజాలం,జంతుజాలానికి ఏమి జరుగు తుందో అని స్థానిక ఆదివాసీ జనాభా గొంతుతో ఆందోళన వ్యక్తం చేశారు.ముప్పై ఆరు శాశ్వత ప్రవాహాలు మాలికొండ గుండా ప్రవహిస్తాయి మరియు చివరికి కోలాబ్‌ నదిని పోషిస్తాయి. గిరిజన సంఘాలు సాగునీటి కోసం నదీ జలా లను ఉపయోగించుకుంటున్నారు. కొండ లలో మైనింగ్‌ చేయడంవల్ల నది ఎండి పోతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ మాలీపర్వా తాలు ఏనుగు కారిడార్‌తో పాటు అనేక విలువైన ఔషధ వృక్షాలతో దట్టమైన అడవిగా రూపంతరం చెంది ఉంది.బాక్సైట్‌ వెలికితీస్తే ‘‘అటవీ కొండలలో బాక్సైట్‌ తవ్వకం అనేక సహజ ప్రవాహాలు,జలపాతాలు, వాగు లు ఎండిపోవడానికి అవకాశం ఉందని, అంతేకాకుండా కాలుష్యకారకాలతోను,అనేక అనారోగ్యాలకు గురవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే మేము దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నాము’’ అని ఆదివాసీప్రజలు ఆవేదన చెందుతున్నారు.రాష్ట్రంలో ఏనుగు కారిడార్‌లు ధ్వంసం కావడానికి అడవిలో విపరీతమైన మైనింగ్‌ కూడా ఒక ప్రధాన కారణం. జంబోల సంరక్షణ మరియు రక్షణ కోసం డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ ఏడాది ప్రారంభంలో, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (చీGు) ఒడిశా ప్రభుత్వాన్ని రెండు నెలల్లో 14 ఏనుగు కారిడార్‌లను నోటిఫై చేయాలని ఆదేశించిందని ఒడిశా వైల్డ్‌లైఫ్‌ సొసైటీ కార్యదర్శి బిస్వైత్‌ మొహంతి తెలిపారు. ఇంతలో, అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ మారీa ప్రకారం, బహిరంగ విచారణ సందర్భంగా నవంబర్‌ 22న ఈ ప్రతిపాదిత బాక్సైట్‌ మైనింగ్‌ ప్రాజెక్టుకు పెద్ద సంఖ్యలో స్థానిక నివాసితులు తమ సమ్మతిని తెలిపారు.‘‘ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు జిల్లా యంత్రాంగం ముప్పై ప్లాటూన్ల భద్రతా బలగాలను మోహరించింది. ఒడిశా స్టేట్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ త్వరలో పబ్లిక్‌ హియరింగ్‌ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది’’ అని అధికారి తెలిపారు.
మలిపర్బత్‌ మైనింగ్‌ను అడ్డుకోవాలని గిరిజనులు
చైత్ర పండుగ సందర్భంగా కొండపై బాక్సైట్‌ వెలికితీతను వ్యతిరేకిస్తామని బాక్సైట్‌ ప్రభావిత ఆదివాసీ ప్రజలు మాలిపర్వతాలపైకి ఎక్కి ప్రమాణం చేశారు. కంకదాంబ గ్రామ సమీపం లోని చైత్ర పండుగ సందర్భంగా ఏప్రిల్‌ 27న మాలిపర్బత్‌ కొండ వద్ద బాక్సైట్‌ తవ్వకాలను వ్యతిరేకిస్తూ గిరిజనులలోని పర్వతాలపైకి సుదూర ప్రయాణం చేసి అక్కడ దేవతలకు పూజలు చేశారు. మలిపర్బత్‌ కొండ సమీపం లోని పాటలీ గుహలో మౌలిమా దేవత ముందు ప్రతిజ్ఞ చేశారు. మలిపర్బత్‌ సురాఖ్య సమితి(ఎంఎస్‌ఎస్‌)మరియు కోరాపుటియా జన సురాఖ్య మంచ్‌(కెజెఎస్‌ఎం)సభ్యులు,పలువురు సామాజిక సంస్థల కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. చైత్ర పండుగను జరుపుకోవ డానికి కోరాపుట్‌ మరియు రాయగడ జిల్లాల నుండి వేలాది మంది గిరిజనులు మలిపర్బత్‌ కొండ వద్దకు చేరుకున్నారు. మలిపర్బత్‌లో బాక్సైట్‌ తవ్వకాలపై ఉద్రిక్తత మధ్య వారు ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించాలని ప్రార్థిస్తూ సంప్రదాయ ఆచారాలను నిర్వహిం చారు. ఈ పండుగను కోంద్‌, పరాజ మరియు గద్బా తెగలు జరుపుకుంటారు.చాసి మూలీయ ఆదివాసీ సంఘం అధ్యక్షుడు నాచిక లింగం కూడా ఉత్సవంలో పాల్గొని పూజలు చేశారు. ‘‘మేము చెట్లు, నేల, నీటి బుగ్గలు, వృక్షజాలం మరియు జంతుజాలాన్ని ప్రేమిస్తాము మరియు మన ఆచారాలు మరియు సంప్రదాయాలకు అనుగుణంగా జీవించాలనుకుంటున్నాము. గిరిజనులు ప్రభుత్వం నుండి ఎలాంటి సంపదను కోరుకోవడం లేదు. ప్రకృతితో, వనరులతో సహజీవనం చేయాలనుకుంటున్నాం. కానీ ప్రభుత్వ ఏజెంట్లు ఈ ప్రాంతంలో అశాంతిని సృష్టిస్తున్నారు. మైనింగ్‌ వ్యతిరేక మరియు అనుకూల వ్యక్తుల మధ్య విభేదాల కారణంగా గత రెండు నెలలుగా ఈ ప్రాంతం లో ఉద్రిక్తత నెలకొని ఉందని వర్గాలు తెలి పాయి. గిరిజనులకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక మరియు జీవనోపాధికి ప్రాధాన్యతనిచ్చే మలిపర్బత్‌ కొండ నుండి బాక్సైట్‌ తవ్వడానికి హిందాల్కో కంపెనీకి ప్రభుత్వం లీజు మంజూ రు చేసింది. ఒడిశా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మొదటి సమావేశం విఫలమైన తర్వాత విజయ వంతంగా పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించింది. అయితే, విషయం కోర్టుకు వెళ్లడంతో రెండో పబ్లిక్‌ హియరింగ్‌ అనిశ్చితిలో పడిరది. జిల్లా యంత్రాంగం నాలుగు ప్లటూన్ల పోలీసు బలగాలను మోహరించి పండుగ ప్రశాంతంగా సాగింది.
మా కొండలు బంగారు కుండలు
కోరాపుట్‌లోని మాలి కొండలన్నీ బంగారు కుండలు. వాటి జోలికి వస్తే సహించబోం అంటూ గిరిజనులు హెచ్చరిస్తున్నారు. మాలిపర్వాతాలు అనేక ప్రవాహాలకు మూలం. ఔషధ చెట్లకు నిలయం. ఇది ఏనుగు కారిడార్‌. సెప్టెంబర్‌ 22, 2021న ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లాలో ప్రతిపాదిత బాక్సైట్‌ మైనింగ్‌ ప్రాజెక్ట్‌ గురించి చర్చించేందుకు ఏర్పాటు చేసిన బహి రంగ సభ వేదికపై ఆదివాసీలు నినాదాలు చేస్తూ ధ్వంసం చేశారు. గిరిజనులు అధికంగా ఉండే కోరాపుట్‌లోని సిమిలిగూడ బ్లాక్‌లోని కంకదాంబ గ్రామంలోని వేదిక వద్ద పర్యా వరణ కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు మరియు ఇతరులు కూడా ప్రాజెక్టును వ్యతిరేకిం చారు. హిండాల్కో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (హిం డాల్కో)చే ప్రాజెక్ట్‌ యొక్క ప్రదేశం అయిన మాలి కొండ,అడవికి ముప్పు వాటిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మాలి పర్వత్‌ సురక్షా సమితి (సేవ్‌ మాలి హిల్‌ కమిటీ) సభ్యులు ఆ స్థలంలో మైనింగ్‌ను అధికారులు రద్దు చేయాలని కోరుతూ ప్లకార్డులు పట్టుకుని నిరసన చేపట్టారు. మాలి మరియు అటవీ ప్రాంతంలో 44గ్రామాలలో విస్తరించి ఉన్న కొండ,పరాజ మరియు గదబ గిరిజనులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు.సేవ్‌ మాలి హిల్‌ కమిటీ అధ్యక్షుడు బిజయ్‌ ఖిల్‌ మాట్లాడుతూ మాలి కొండ నుండి బాక్సైట్‌ తవ్వకాలకు ఏ కంపెనీని అనుమతించకుండా కొండను మరియు అడవిని రక్షించాలని ఒడిశా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మరియు జిల్లా పరిపాలన అధికారులను మేము కోరాము. ఖిల్‌ తన బృందం కొండను రక్షించడానికి మరియు సంరక్షించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బాక్సైట్‌ తవ్వకాల వల్ల ఆ ప్రాంత పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుందని ఆయన అన్నారు. అటవీ ప్రాంతంలో బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతి ఇవ్వడం చట్ట విరుద్ధం,అనైతికం. ప్రతిపాదిత మైనింగ్‌ ప్రాజెక్ట్‌ టూత్‌ అండ్‌ నెయిల్‌ను మేము వ్యతిరేకిస్తాము’’ అని లోక్‌ శక్తి అభియాన్‌ అధ్యక్షుడు ప్రఫుల్ల సమంతర అన్నారు.మాలి కొండ 36శాశ్వత ప్రవాహాలకు మూలమని,ఇది కోలాబ్‌ నది జలాలను పోషిం చేదని ఆయన తెలిపారు. కోలాబ్‌ నీటితో గిరిజనులు తమ భూమికి సాగునీరు అందించారు. మలి కొండను గనుల తవ్వ కాలకు ప్రభుత్వం అనుమతిస్తే నది ఎండి పోతుందని సమంత అన్నారు. కొండ అనేక విలువైన ఔషధ వృక్షాలకు నిలయం అని ఆయన పేర్కొన్నారు. ఇది ఒక ముఖ్యమైన ఏనుగు కారిడార్‌ కూడా.మైనింగ్‌వల్ల పరిసరాల్లోని భూగర్భ జలాలు,గాలి,మట్టికి భంగం కలుగు తుంది. ఆందోళనకారులు ప్రభుత్వం మరియు కంపెనీ అధికారులకు హెచ్చరికలు చేశారు. తమ ప్రాణాలైనా ఇస్తాంగానీ,మాలి పర్వతాలపై బాక్సైట్‌ తవ్వకాలు చేపట్టనీయమని నినదించారు. ప్రభుత్వం,కంపెనీలు తమ జీవితాలతో ఆటలు ఆడుకోవద్దని, ఆవేదన చెందారు. ఎట్టి పరిస్థితిలోను బాక్సైట్‌ తవ్వకాలు చేయరాదని, చేస్తే తమ ఆందోళనలను మరింత ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు.-(కందుకూరి సతీస్‌ కుమార్‌)

ఉచితాల‌పై అనుచిత ప్ర‌చారం

‘కూత నేర్చినోళ్ళ కులం కోకిలంటారా!? ఆకలేసి అరిచినోళ్ళు కాకులంటారా!?.’’ ప్రాణం ఖరీదు సినిమాలో ఓ పాటలోనివి ఈ వాక్యాలు. ప్రభుత్వ ఉచిత పథకాలు, వ్యయాలపై నేడు వ్యక్తమవుతున్న అభిప్రాయాలు చూస్తుంటే ఇవి గుర్తుకు రాకమానవు. అంటే తమ చాతుర్యాలతో లక్షల కోట్ల దేశ సంపదను ఆశ్రిత అవకాశ వాదంతో కాజేస్తున్న వారేమో ఉన్నతులు, శ్రమకు దగ్గ ప్రతిఫలాన్ని ఆశించకుండా, అడిగినంత ధరలు చెల్లిస్తూ వస్తు సేవలను పొందుతున్న ప్రజలేమో అధములన్న మాట! దేశ సంపదనంతా సామాన్యులకిచ్చే ఉచితాల ద్వారా సర్వనాశనం చేస్తున్నారంటూ వ్యక్తమవు తున్న సదరు అభిప్రాయాలపై జాలి కలుగు తున్నది. ప్రజలని ‘’అలగా జనం’’ అని సంబో దించిన చోట ఇంతకన్నా ఎక్కువ ఆలోచనను ఆశించడం అత్యాశే కాబోలు!. జి.తిరుపతయ్య
ప్రభుత్వాలు ప్రకటిస్తున్న ఉచిత పథకాల వల్ల ఆర్థిక వ్యవస్థకు చాలా నష్టమని, ఇది ఇలాగే కొనసాగితే శ్రీలంక ఎదుర్కొంటున్న ఆర్థిక అత్యవసర పరిస్థితి భారత్‌కూ తప్పదని ప్రధానమంత్రి నిర్వహించిన ఉన్నత అధికారుల సమావేశంలో పలువురు వ్యాఖ్యానించినట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి. లోక్‌సత్తా నాయకుడు జయప్రకాశ్‌నారాయణ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. వీటిని ఆధారం చేసుకుని బూర్జువా పార్టీల ఏజెంట్లు, ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ శ్రేణులు పేదలకు ఇచ్చే ఉచితాలే పెను భూతాలు అనే విధంగా సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలు పెట్టాయి. ఇందులో నిజానిజాలను తెలుసు కోకుండానే దావానలంలా ఆ ప్రచారాన్ని విశ్వవ్యాప్తి చేస్తున్నారు మన మధ్య తరగతి సోషల్‌ మీడియా మిత్రులు! మొదటిది, ఉచిత పథకాలు ఇవ్వమని ప్రజలు ఎప్పుడూ కోరలేదు, లేదా అలాంటి పథకాల కోసమేం వారు ఉద్య మాలూ చేయలేదు. రెండవది, ఈ ఉచితాలను ప్రకటిస్తున్నది ఎన్నికల వాగ్దానాల రూపంలో బూర్జువా పార్టీలు మాత్రమే. నిజానికి ఓట్ల కోసం సామాన్య ప్రజానీకాన్ని ప్రలోభ పెట్టే పాలక పార్టీల పన్నాగాలే ఇవన్నీ. అయితే ఈ ఉచిత పథకాలను అనుభవిస్తున్నది పేదలు మాత్రమే కాదు. కేంద్రం ప్రవేశపెట్టిన కిసాన్‌ సమ్మాన్‌ గానీ, రాష్ట్రం ప్రవేశపెట్టిన రైతుబంధు గానీ భూమి కలిగి ఉన్న పట్టాదారులందరికీ ఇస్తున్నారు తప్ప అర్హులైన, పెట్టుబడికి కొరవడిన పేద రైతులకు మాత్రమే చేరుతున్నాయా? ఇప్పటికీ అత్యధిక భూమి కొందరి చేతుల్లోనే ఉన్నది. అలాంటి ఉన్నత అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు లాంటి వారందరికీ రైతుబంధు అందుతున్నది. ఇక చౌక ధరల దుకాణాల అవకతవకలు అటుంచితే, ఇక్కడ సప్లయి చేయబడుతున్న వస్తువులు ఏవీ ప్రభుత్వానికి భారం కాదు. ఎందుకంటే నేరుగా రైతుల దగ్గర నుంచి తీసుకొని వినియోగ వస్తువులుగా మార్చిన తర్వాత ఇస్తున్న రేటు దాదాపు మధ్యవర్తిత్వం లేకుంటే పెద్దగా సబ్సిడీ ఏమీ ఇవ్వట్లేనట్లే. చివరికి వృద్ధాప్య పింఛన్లు, వికలాంగ పింఛన్లు, వితంతు పెన్షన్లు ఇవేనా ప్రభుత్వాలకు భారమైంది? లేదా 39లక్షల కోట్ల దేశ బడ్జెట్‌లో కేవలం 70వేల కోట్ల రూపా యలు కేటాయించి గ్రామీణ నిరుపేదలకు పని కల్పిస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకమా? అరకొర నిధులు కేటాయించినప్పటికీ గ్రామీణ ఉపాధి హామీ పథకం వల్లనే గ్రామాలలో, కీన్స్‌ అనే ఆర్థిక వేత్త చెప్పినట్లుగా అందరి చేతిలో ఎంతో కొంత కొనుగోలు శక్తి మిగిలివుంది. ఉచిత పథకాల కన్నా వ్యవస్థీకృత లోపాలను సరిదిద్దే దీర్ఘ కాలిక మౌలిక వసతుల ప్రణాళికలు అవసరం. స్కూళ్ళల్లో పరిస్థితిని మెరుగుపరచ కుండా లాప్‌టాప్‌లు అందించడం అర్థరహితం. పాఠశాల విద్యార్థినుల హాజరు శాతాన్ని పెంచడానికి, వారు హాజరయ్యే విధమైన సౌకర్యాలను ఏర్పాటు చేయకుండా, సైకిళ్లను కొనివ్వడం అర్థరహితం. ఇక ఇలాంటి పథకాలకు నిధులు ఎక్కడి నుండి కేటాయించ బడుతున్నాయి, దాని పర్యవసనాలు ఎంటో కూడా పరిశీలించాలి. 2020-21సంవత్స రానికి గాను పరోక్ష పన్నులు స్థూల జాతీయ ఉత్పత్తిలో 5.4శాతం ఉంటే ప్రత్యక్ష పన్నులు 4.7శాతం మాత్రమే ఉన్నాయి. 2.7ట్రిలియన్‌ డాలర్ల(200 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థలో పరోక్ష పన్నుల ద్వారా 10.8 లక్షల కోట్ల రూపాయలు వస్తే ప్రత్యక్ష పన్నుల ద్వారా కేవలం 9.4లక్షల కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి. అనేక అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థల్లో చూస్తే మొత్తం పన్ను రాబడిలో 67.4శాతం ప్రత్యక్ష పన్నుల వాటా ఉంటే భారత్‌లో అది 38.3శాతంగా నమోదు అవుతుంది. (మూలం బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రిక ) ఈ రెండు గణాంకాలను చూస్తే చాలా సులభంగా అర్థం అయ్యేది పరోక్ష పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ అని. మరి అట్లాంటి పరోక్ష పన్నులను చెల్లిస్తున్నది ఎవరు? వినియోగదారులైన ప్రజలు. ఆక్స్‌ ఫామ్‌ నివేదిక ప్రకారం కిందిస్థాయి 58శాతం ప్రజలు కేవలం 13శాతం ఆదాయంతో ఉన్నారు. అనగా అత్యంత తక్కువ ఆదాయం కలిగిన వాళ్ళు అత్యంత ఎక్కువ పన్నులు చెల్లించే పరోక్ష పన్నుల జాబితాలో ఉన్నారు. నిశితంగా గమనిస్తే సామాన్య ప్రజానీకం రెండు రకాల మోసాలకు గురవుతున్నారు. మొదటిది వారికి చెల్లించవలసిన వేతనం చెల్లించకుండా పెట్టుబడిదారులు మధ్యవర్తులు కొట్టేస్తున్నారు. రెండవది వారి నుండి పరోక్ష పన్నుల రూపంలో అధిక పన్నులు వసూలు చేస్తున్నారు. ఈ వాస్తవాన్ని గమనించకుండా ఉచితాల రూపంలో ప్రజలకు పంచి పెట్టడం నేరమని, అది దేశానికి ఘోరమని విపరీత అర్ధాలు తీయడం సరైంది కాదు. అయితే ఉన్నతాధి కారులు చెప్పిన మాటలు అవాస్తవమా? వారికి ఆ మాత్రం అవగాహన లేదా అని మన పాఠకులకు సందేహం రావచ్చు. ఈ బూర్జువా రాజకీయ పార్టీలతో పాటు అత్యంతపై స్థాయిలో ఉన్న బ్యూరోక్రాట్లు కూడా ‘’ట్రికిల్‌ డౌన్‌ థియరీ’’నే (పై వాడి కడుపు నిండిన తరువాత మిగిలిందే క్రింది స్థాయికి చేరాలనేది) నమ్ముతారు. ఎందుకంటే డబ్బు కొందరి చేతుల్లోనే ఉండాలి, ప్రజలకు సౌకర్యాలు అలవాటు కాకూడదు, అలవాటైతే వాటిని తీర్చడం ప్రభుత్వ బాధ్యత కాకూడదు అన్నది వారి ఆలోచన. ఇలా అమాయక ప్రజలకు ఇచ్చే ఆ నాలుగు రూపాయల మీద పడి బాధపడే కన్నా రాబడి మార్గాలను ఎందుకు పాటించడం లేదో ఈ బ్యూరోక్రాట్లు రాజకీయ నాయకులు సమాధానం చెప్పాలి. అనగా ప్రత్యక్ష పన్నుల వాటా పెరగాలి అంటే ఆదాయపన్ను చెల్లించే వారి సంఖ్య పెరగాలి. 6కోట్ల మంది పిఎఫ్‌ ఖాతాదారులు ఉన్నట్లుగా గణాంకాలు చెబుతుంటే 3.7కోట్ల మంది మాత్రమే వ్యక్తిగత ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నారని ఆదాయపు పన్ను అధికారులు తేల్చుతున్నారు. మరి ఈ వ్యత్యాసం ఏంటి? రిటర్నులు దాఖలు చేసిన వారిలోనూ నామ మాత్రపు పన్ను చెల్లించే వారి సంఖ్యే గణనీయం! దీనికి బాధ్యులెవరు? ఇక వ్యాపార వర్గాల నుండి ఆదాయపన్ను రాబట్టడానికి సమగ్రమైన ప్రణాళిక ఇంతవరకు లేదు. వ్యాపార లావాదేవీల్లో లాభాలను ఆర్జిస్తున్న అనేక మందిని పన్ను పరిధిలోకి తీసుకురావడంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. జీఎస్టీ విధానం అమలులోకి వచ్చాక జీరో వ్యాపారాలు పూర్తిగా తగ్గిపోయాయా? అనగా బిల్లులు రాయకుండా నమోదు చేయబడిన నగదు రూపంలోని వ్యవహారాల వల్ల ప్రభుత్వానికి పన్ను రాబడి తగ్గడం లేదా? ఈ వ్యవహారాల వల్ల తప్పుడు మార్గంలో ఎందరికో లబ్ధి చేకూరడం లేదా? వీటిపై అనేక సందర్భాల్లో మేధావులనేకులు హెచ్చరికలు చేసినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ఏమాత్రం దృష్టి పెట్టవు. ఇక కూత నేర్చిన వారు (సంపన్నులు) రెండు రకాలుగా దేశాన్ని, ప్రజలను మోసం చేస్తున్నారు. ఒకటి, బ్యాంకుల్లో అత్యంత తక్కువ వడ్డీ రేటుకు రుణాలు పొందడం, వాటిలో కొంత భాగాన్ని మాఫీ చేయించుకోవడం లేదా ఎగ్గొట్టడం…! ప్రభుత్వం దీనికి బాహాటంగా సహకరించడం జరుగుతోంది!! రెండవది, టాక్స్‌ కన్సెషన్స్‌ (పన్ను మినహాయింపు)గా లక్షల కోట్ల రూపాయలను పొందడం. వీరికోసం కేంద్ర బడ్జెట్‌లో దాదాపు 15శాతం పన్ను మినహాయింపునకు పోతుంది… అంటే ఆరు లక్షల కోట్లు సగటున ప్రతి ఏటా వీరికి రాయితీగా ఇస్తున్నారు. కొందరు వ్యాపారస్తులూ, పారిశ్రామిక వేత్తలకు ఇచ్చే ఈ మొత్తం దేశంలోని అన్ని రాష్ట్రాలు కలిపి అమలు చేస్తున్న ఉచిత పథకాల కన్నా చాలా ఎక్కువ. దీనిపై జయప్రకాశ్‌ నారాయణ, ఇతర మేధావులు నోరు మెదపరెందుకు? ఎందుకంటే వీరు కూడా ఆ ట్రికిల్‌ డౌన్‌ థియరీనే ఇష్ట పడతారు. ఇక ఆదాయ పన్నును క్రమం తప్పకుండా చెల్లించే వేతన జీవులకూ ఈ ఉచితాలపై చాలా కోపం వస్తుంది. అయితే తమ నుండి బలవం తంగా,పన్ను మినహాయిం పులేవీ ఇవ్వకుండా, ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్న ప్రభుత్వా లపై కాకుండా, తాము పని చేసేందుకు ఆధారమౌతూ పేదరికంలో మగ్గు తున్న సామాన్యులపై కోపం రావడం సరికాదు. అందువల్ల, ప్రజల మూలుగుల్ని పీల్చి లాభాలు సంపాదిస్తున్న కార్పొరేట్లకు ఇచ్చే పన్ను మినహాయింపులూ,రాయితీల వల్ల ఆర్థిక వ్యవస్థకు నష్టం తప్ప, వీరి సరుకుల అమ్మకాలకూ, ప్రజల కొనుగోలు శక్తికీ ఆధారమవుతున్న చిన్న చిన్న ఉచిత పథకాల వల్ల కాదు.నిజానికి ఇది ఆర్థిక వ్యవస్థకు రక్త ప్రసరణలా పనిచేస్తుంది.

ఆడ‌బిడ్డ‌ల‌కు ర‌క్ష‌ణ క‌రువు

‘‘ దేశంలో మహిళలు, చిన్నారులపై ఘాయిత్యాలకు అడ్డుకట్ట పడడం లేదు. కఠిన శిక్షలు విధిస్తున్నా కామాంధులు ఆగడాలు కొనసాగుతున్నాయి. చిన్న పిల్లలపై కూడా కొందరు కామంతో కళ్లు మూసుకు పోయి, లైంగిక దాడులకు పాల్పడు తున్నారు. ఆడపిల్లలను గౌరవించేవారు కానీ…వారిని రక్షించేవారుకానీ….వారి హక్కు లను పరిరక్షించేవారు కానీ…. నేటికాలంలో నానాటికీ తగ్గిపోతూ ఉండటం,ఆడపిల్లల పట్ల వివక్ష పెరిగిపోతుండడం చాలా దుర దృష్టకరం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆడపిల్లలపై సామూహిక అత్యాచార ఘటనలు,లైంగిక వేధింపులు పెరుగుతుండటం బాధకరమైన విషయం ’’ జి.ఏ.ఎస్‌.కుమార్‌
‘మాకు సురక్షిత స్థలాలంటూ ఏమైనా ఉంటే అవి అమ్మ గర్భం, సమాధి మాత్రమే’ – నైతిక విలువలకు నిలువునా పాతరేస్తూ, ఆడబిడ్డలకు అడుగడుగునా నరకం చూపిస్తున్న సమాజంపై ఓ చిన్నారి ఛీత్కరింపు ఇది! గతేడాది డిసెం బరులో చెన్నరుకి చెందిన ఆ పదకొండో తరగతి విద్యార్థినిని ఒక ఉపాధ్యాయుడి కొడుకు అను నిత్యం వేధింపులకు గురిచేస్తుండగా.. సహించ లేక ఆత్మహత్య చేసుకుంది. బలవన్మర ణానికి ముందు భావోద్వేగంతో రాసిన లేఖ సమాజం లో మహిళల దుస్థితికి దర్పణం పట్టింది. ఆ చిట్టితల్లి మాటలను నిజం చేస్తూనే గుడిలో, బడిలో,బంధుమిత్రుల ఒడిలో,ఇప్పుడు ఆసు పత్రుల్లో,ఎక్కడైనా సరే,ఆడపిల్లలకు భద్రత లేని దౌర్భాగ్యపూరిత వాతావరణానికి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మతిస్థిమితం లేని ఒక మహిళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన అద్దంపడుతోంది. తరతరాలుగా అమ్మ దేవతలను ఆరాధిస్తూ,పరాయి స్త్రీల వంక కన్నెత్తి చూడటమే మహాపాపంగా భావించాలని చెప్పే నీతులన్నీ ఏమైపోతున్నాయి? దేశంలో మహిళ లకు రక్షణ కల్పించడమే ఒక ప్రధాన సమస్యగా మారిపోవడం సిగ్గుచేటు. మగపిల్లలను ముద్దు చేస్తూ ఆడపిల్లలను ఆంక్షల పంజరంలో బంధి స్తున్న పితస్వామ్య భావజాలం, వ్యక్తిత్వానికి వన్నెలద్దడంలో విఫలమవుతున్న విద్యా విధానం, నేరాల నియంత్రణలో ప్రభుత్వ యంత్రాంగపు ఘోర వైఫల్యాలు కలిసికట్టుగా మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోవడానికి కారణ మౌతున్నాయన్న నిపుణుల మాటలు అక్షర సత్యాలు. హైదరాబాద్‌లో ‘దిశ’ ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి దారు ణాలు జరగనివ్వబోమంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఆ క్రమంలోనే దిశ బిల్లు, దిశ పోలీసు స్టేషన్లు, దిశ వాహనాలు,దిశ యాప్‌ అంటూ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. వీటన్నింటి లోనూ ప్రచార్భాటం తప్ప ఆకృత్యాలను అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో చేపట్టిన చర్యలు కానరావు. ఆదిశ బిల్లు నేటికీ చట్ట రూపం దాల్చలేదంటే పాలకుల చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఇలాంటి అకత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. విచ్చల విడిగా సంచరిస్తున్న మానవ మగాల మాయల్లో చిక్కి విలవిల్లాడే మహిళలకు,చిన్నారులకు లెక్కే లేదు.దేశవ్యాప్తంగా నిత్యం ఇలాంటి ఘోరాలు నేరాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతూనే ఉంది. చిన్నాపెద్దా తేడా లేదు..అడ్డూ అదుపూ అసలే లేదు..ఎన్ని రకాల చట్టాలు వచ్చినా, ఎంత గట్టి శిక్షలు అమలవుతున్నా అత్యంత పైశాచిక ప్రవత్తి కలిగిన మానవ మగాల పీడ వదలడం లేదు. ఉన్న చట్టాలకే చిన్నపాటి సవరణలు చేసి వాటికి నిర్భయ, దిశ అని పేర్లు పెట్టినంతనే మహిళలకు రక్షణ కల్పించినట్లు పాలకులు భావించడం వల్లే నేరస్తులు విచ్చలవిడిగా రాకాసి ప్రవత్తిని కొనసాగి స్తున్నారు. ఇలాంటి ఘటనల్లోని దోషులకు ఎలాంటి కాలయాపనా లేకుండా కఠినశిక్షలు పడేందుకు అవసరమైన చర్యలను ఇప్పటికైనా ప్రభుత్వాలు చేపట్టాల్సి వుంది. అలాగే నానాటికీ సమాజంలో విచ్చలవిడితనానికి ముకుతాడు వేసే చర్యలు చేపట్టాలి. పెడమార్గాలు పట్టిన యువత మత్తు పదార్ధాల ఊబిలో పడిపో తోంది. స్త్రీని ఒక వ్యాపార వస్తువుగా,ఆట బొమ్మగా పరిగణించే అత్యంత హేయమైన విష సంస్కతి నుంచి యువతను బయటపడేసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. మాదక ద్రవ్యాలు, అమ్మాయిల అక్రమ రవాణా, తరచూ బాలల అదశ్యం వంటి సంఘటనల్లోనూ వాటి వెనుకనున్న అరాచక శక్తుల పీచమణిస్తే తప్ప ఇలాంటి ఘోరాలు తగ్గవు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో జరిగిన ఘటన అసాధారణమైనది. ప్రభుత్వ యంత్రాంగపు వైఫల్యం ఈ ఘటనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జనంతో రద్దీగా ఉండే ఆసు పత్రిలో ఒక గదిలో సామూహిక అత్యాచారానికి దుండగులు ఒడిగటుతుండే అక్కడ యంత్రాం గం ఏమైపోయింది? బాధిత తల్లిదండ్రులు ఆ బిడ్డ కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసుల తీరు క్షంతవ్యం కాదు. రెండు రోజుల పాటు ఆసుపత్రిలో నిర్బంధించబడిరదన్న విషయం ఆమె తల్లిదండ్రులు చెబితే తప్ప గుర్తించలేని స్థితిలో ఆసుపత్రి, పోలీసు అధికార యంత్రాం గం మిన్నకుండడం దారుణం. వ్యవస్థలోని ఈ లోపాలన్నిటిని సరి చేస్తేనే మహిళలకు, చిన్నారు లకు రక్షణ దక్కేది. ఇలాంటి దురాగతాలు వెలుగులోకి వచ్చినప్పుడు హడావిడి చేయడం, నష్టపరిహారం ప్రకటించడంతో పాలకులు చేతులు దులిపేసుకుంటే సరిపోదు. ఇప్పటికైనా మహిళల రక్షణకు, చిన్నారుల సంరక్షణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలి. ఇద్దరు పోలీసు అధికారులతోనే పరిమితం కాకుండా విజయవాడ దారుణ ఘటనటకు బాధ్యులైన వారందిరి పైనా కఠిన చర్యలు చేపట్టాలి.
స్త్రీ లేనిదే అసలు సృష్టే లేదు.
నేటి బాలికలే రేపటి స్త్రీమూర్తులు. స్త్రీ లేనిదే సమాజానికి అతీగతీ లేదు. స్త్రీ లేని సమాజాన్ని అసలు ఊహించలేం. ఒక్కమాటలో చెప్పాలంటే స్త్రీ లేనిదే అసలు సృష్టే లేదు. ఇవన్నీ అందరికీ బాగా తెలిసిన విషయాలే. తెలియనిదల్లా ఏమైనా ఉందంటే.. వారిని ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకూడదన్నదే. ప్రపంచ మంతటా పురుషాధిక్యత పెరిగిపోయిన నేటిరోజుల్లో, ఆడపిల్లల పరిస్థితి నానాటికీ మరింత దయనీయంగానే ఉంటోంది. నేటికీ ప్రపంచంలో బడి చదువులకు దూరమైన బాలికలు కనీసం 40 మిలియన్ల మందికి పైగానే ఉన్నారని నిపుణుల అంచనా. అంతేకాదు బాల్య వివాహాలతో నరకప్రాయమైన జీవితాలను అనుభవిస్తున్నవారు ప్రపంచంలో కోట్ల సంఖ్యలోనే ఉన్నారని కూడా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.ఎంతో ఘనమైన సంస్కృతి సంప్రదాయలున్న మన దేశంలో కూడా స్త్రీల పట్ల ముఖ్యంగా బాలికల పట్ల ఎంతోకాలం నుంచి అంతులేని వివక్ష కొనసాగు తూనే ఉంది. ఆడపిల్లలు పుడితే పెద్ద భారంగా పరిణ మిస్తారని, వారిని పెంచి పెద్దచేయడం ఒక సమస్య అని, వారికి పెళ్ళి చేసి ఒక అయ్య చేతిలో పెట్టడం మరింత కష్టమని భావించే వారు పెద్దసంఖ్యలోనే ఉంటున్నారన్నది నిష్టుర సత్యం. మన కుటుంబవ్యవస్థలో బాలికల పట్ల చిన్నచూపు చూసేవారే అధికంగా ఉంటుండం బహిరంగ రహస్యం. అంతేకాదు మనదేశం లోనూ బాలికల పట్ల..మహిళలపట్ల లైంగిక దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి. మహిళలపై నేరాలు ఘోరాలు,దౌర్జన్యాలు పెచ్చరిల్లిపోతూనే ఉన్నాయి. ముక్కుపచ్చలారని బాలికలపై కూడా అమానుషాలు కొనసాగుతూనే ఉన్నాయి. అనుక్షణం అభద్రతాభావంతో తల్ల డిల్లే పసిమొగ్గలు ఎందరో!..ఈ బాధలు పడలేక..’ఆడపిల్లగా పుట్టడం కంటే అడవిలో మానై పుట్టినా బావుణ్ణు’..అని మహిళాలోకం కన్నీరుపెట్టుకునే దుస్థితి ఎప్పటికి పోతుందో ఏమో!..ఆడపిల్లగా పుట్టడమే ఒక పాపంగానో, ఒక శాపంగానో భావించే దుర్గతి ఇలా ఇంకా ఎంతకాలం?పసిపాపగా పుట్టి..చెల్లిగా, ఇల్లా లిగా,తల్లిగా..ఈ కాఠిన్యపు ప్రపంచానికి ఆత్మీ యతాను బంధాలను ప్రేమానురాగాలను నేర్పేం దుకు వచ్చిన దేవతకు..ఈ లోకంలో ఎన్ని కష్టాలో..ఎన్ని కన్నీళ్ళో! చిన్నతనం నుంచే ఆడపిల్లలకు కష్టాలు ప్రారంభమవుతున్నాయి. వారి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా వారిపై అధికారం చెలాయించడం, బాలికలు కదా అని చులకనగా చూడడం అనేక కుటుంబాల్లో సర్వ సాధారణ కృత్యమైపోతోంది. సమాజంలో ఎక్కడ చూసినా ఆడపిల్లల పట్ల చులకనభావమే కనపడుతోంది. అంతేకాదు, పుట్టినప్పుడే ఆడశిశువులను ఏ చెత్తకుప్పలోనే పారవేసే దయనీయ సంఘటనలు.. దృశ్యాలు కూడా మనం అప్పుడప్పుడూ వింటున్నవే..చూస్తున్నవే. బాలికలను అమానవీయంగా వ్యభిచారగృహాలకు తరలించే దౌర్భాగ్య ముఠాలకు కూడా కొదవ లేదనే సంగతి కూడా మనం వింటున్నదే. ఇక పేదింట్లో పుట్టిన ఆడపిల్లల సంగతి మరింత దారుణంగా ఉంటోంది. ఆడపిల్లగా పుట్టి చాకిరీకి, వంటింటి పనులకే పరిమి తమయ్యే వారి సంఖ్య లెక్కకు మిక్కుటంగానే ఉంటోంది. కుటుంబ పోషణను కూడా నెత్తినేసుకుని కూలిపనులకు కూడా వెళ్ళేవారు ఎందరో?.. సరైన పోషకాహారం కూడా లేక చిక్కి శల్యమ వుతున్న బాలికల సంఖ్య కోట్లల్లోనే ఉంది. కుటుంబ వ్యవస్థలో ఆడపిల్లలకు ప్రత్యేకస్థానంతో పాటు మంచి గౌరవం ఇవ్వడం, ఆప్యాయతానురాగాలతో వారిని పెంచి పెద్దచేయడం,వారి జీవితాలకు ఎల్ల వేళలా అండగా ఉంటూ వారిని సంరక్షించుకునే మంచిమనుషులు కూడా సమాజంలో లేక పోలేదు. అయితే పేదరికంతోనో,అవిద్య వల్లనో, అసమానత వల్లనో దేశంలో మరెంతోమంది బాలికల భవిష్యత్తు నేటికీ అంధకారమయంగానే ఉంటోంది.ప్రభుత్వాలు, పాలకులు ఎంతో మంచిమనసుతో బాలికల కోసం,మహిళల కోసం,స్త్రీల కోసం అనేక పథకాలు, వారి రక్షణ కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం ఎప్పటి కప్పుడు అనేకానేక చట్టాలు చేస్తూనే ఉన్నా.. సమాజంలో ఆడపిల్లల పట్ట, మహిళామతల్లుల పట్ల వివక్ష..అఘాయిత్యాలు తొలగిపోవడం లేదు. ఇకనైనా ఈ దుస్థితి..ఈ దుర్గతి మారాలి. ఆడపిల్ల లంటే మన ఇంటికి జీవనజ్యోతులని గ్రహించుకోవాలి. ఆడపిల్లలంటే కేవలం అబలలు కాదని,కాస్తంత ఆత్మవిశ్వాసాన్ని-ప్రోత్సాహాన్ని అందిస్తే చాలు..వాళ్ళు మనల్ని, మన కుటుంబగౌరవాన్ని,దేశ సౌభగ్యాన్ని కూడా నిలబెట్టే ధీరవనితలవుతారని,సమాజాన్ని ఆదర్శ వంతంగా,ప్రతిభావంతంగా తీర్చిదిద్దే ప్రతిభా మూర్తులని కూడా తెలుసుకోవాలి. కేవలం ప్రభుత్వాలు మాత్రమే ఇవన్నీ చూసుకోవాలనే ఆలోచనలు మానుకుని..మనవంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఆడపిల్లలను, ముఖ్యంగా బాలికలను సంరక్షించుకోవాలి. ఆడపిల్ల పుట్టిందంటే మన ఇంట మహాలక్ష్మి పుట్టిందని సంతోషించాలి. వారి మనసును కష్టపెట్టకుండా మంచి చదువులు చెప్పించి, ఇష్టపడే రంగాల్లో ప్రోత్సహించి వారి అభివృద్ధికి బాటలు వేయాలి. ఈ పవిత్ర కర్తవ్యాన్ని నిండుమనసుతో నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ చిత్తశుద్ధితో కృషిచేయాలి. బాలికల పట్ల ఇలాంటి సదవగాహన, సద్భావనలు కలిగించేందుకే ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా ‘అంతర్జాతీయ బాలికల దినోత్సవం’గా ప్రకటిం చింది. అందుకు సార్థకత చేకూరేలా ప్రతి ఒక్కరూ కృషిచేసినప్పుడే మన జీవితాలూ సార్థకమవుతాయి. ముఖ్యంగా.. బాలికలు, మహిళలపట్ల మానవీయతతో.. ఆత్మీయతతో ఉంటూ, వారికి అన్నివిధాలా రక్షణ కలిగించాలి. అప్పుడు వారే కాదు మనం, మన కుటుంబం, మన చుట్టూ ఉన్న సమాజం, మన దేశం..మొత్తంగా ప్రపంచమంతా కూడా ఆనందంతో పల్లవిస్తుంది.. ఎనలేని సంతోష పౌభాగ్యాలతో వెల్లివిరుస్తుంది.కానీ నేటి ఆధునీక సమాజంలో ఆడపిల్లలకు రక్షణ అనేది కరువైంది. ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తెచ్చినా ఆచరణకు నోచుకోవడంలేదు. మహిళలు హక్కులను పరిరక్షించే నాధుడు కరువయ్యారు.-

ధరలు పెంపుపై ప్రజాగ్రహం

ఈ అస్తవ్యస్థ పరిస్థితి కారణంగా ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం కాస్తా పూర్తిగా పోయింది. రేపేం కానుందోనన్న భయాందోళనలు పెరిగిపోయాయి. సరుకుల కోసం ఒక్కసారి సూపర్‌ మార్కెట్ల మీద పడ్డారు. అక్కడ అనివార్యంగా పెద్ద మొత్తంలో సరుకులను కొనకుండా ఆంక్షలు పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. ‘’ఎక్కువ మొత్తంలో సరుకులను కొని మాత్రం ఏం చేయగలం? ఇంట్లో ఫ్రిజ్‌ లో దాచుకోడానికి వీల్లేకుండా పవర్‌ కట్‌ ఉంది కదా’’ ఇది ఒక గృహిణి బాధ అయితే మరొకరు ‘’ఏరోజు వంట ఆరోజే వండుకోవచ్చునని అనుకోలేకుండా వున్నాం. గ్యాస్‌ అయిపోతే పరిస్థితి ఏమిటి? పవర్‌ కట్‌ కూడా ఉంది. ఏమీ తోచడం లేదు’’ అని వాపోయారు.
చాలా కాలం నుండీ శ్రీలంకలో ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో కూరుకుపోయి వుంది.అయితే సకా లంలో తగు చర్యలు తీసుకోకుండా బాధ్యతారహి తంగా గొటబాయ రాజపక్స ప్రభుత్వం వ్యవహరిం చింది. ఆర్నెల్ల క్రితం అప్పుడే మేలుకున్నట్టు హడావుడిగా విదేశీ దిగుమ తులపై ఆంక్షలు ప్రకటించింది. తన వద్దనున్న విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటి పోవడం దీనికి కారణం. ఐతే ఇటువంటి తొందరపాటు నిర్ణయాల పర్యవసానాలు ఎంత వినాశకరంగా పరిణ మిస్తాయో, ప్రజలు ఎటువంటి కష్టనష్టాలను చవిచూడవలసి వస్తుందో ఆ ప్రభుత్వం ఆలోచించే ప్రయత్నం చేయలేదు. పైగా ప్రజల్లో పెల్లుబుకుతున్న నిరసనలను అత్యంత నిరంకుశంగా అణచివేయడానికి పూనుకుంది. అత్య వసర పరిస్థితి ప్రకటించింది.
ఒకవైపు సంపన్నులపై విధించిన పన్నులను బాగా తగ్గించినందువలన ప్రభుత్వ ఆదాయం భారీగా పడిపోయింది. ఇంకోవైపు చర్చిల్లో వివిధ ప్రాంతాల్లో 2019లో జరిగిన పేలుళ్ళలో వందలాది మంది మరణించాక పర్యాటకులు బాగా తగ్గిపోయారు. శ్రీలంకకు వచ్చే విదేశీ మారకద్రవ్యం కూడా దానితో పడిపోయింది. పులి మీద పుట్రలా కోవిడ్‌ వచ్చిపడిరది. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి ఇవి తక్షణ కారణాలు. ఆ దేశానికి కావలసిన ఇంధన అవసరాలన్నీ దిగుమతుల ద్వారా మాత్రమే తీరతాయి. అంతే కాక ఎరువులు, ఆహారధాన్యాలు. పప్పులు, ఖాద్యతైలాలు వంటివి కూడా దిగుమతుల ద్వారానే ఆ దేశం పొందు తుంది. ఎప్పుడైతే ఆ దిగుమతులకు కావలసిన విదేశీ మారక ద్రవ్యం లేకుండా పోయిందో ఒక్కసారి ఆ దేశ జనజీవనం ఛిన్నాభిన్నం అయిపోయింది. పెట్రోలు, గ్యాస్‌ తగినంత లేవు కనుక పని ప్రదేశాలకు ప్రయా ణించడం అసాధ్యం అయిపోయింది. ఇంధనం లేనం దున విద్యుత్తు కొరత తీవ్రం అయింది. రోజుకు 13 గంటల విద్యుత్తు కోత అమలవుతోంది. వంట గ్యాస్‌ కొరత వలన ఇళ్ళలో వంటలు వండుకోవడం సాధ్యం కావడం లేదు. ఈ అస్తవ్యస్థ పరిస్థితి కారణం గా ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం కాస్తా పూర్తిగా పోయింది. రేపేం కానుందోనన్న భయాందోళనలు పెరిగిపోయాయి. సరుకుల కోసం ఒక్కసారి సూపర్‌ మార్కెట్ల మీద పడ్డారు. అక్కడ అనివార్యంగా పెద్ద మొత్తంలో సరుకులను కొనకుండా ఆంక్షలు పెట్టవలసిన పరిస్థితి వచ్చింది.‘ఎక్కువ మొత్తంలో సరుకులను కొని మాత్రం ఏం చేయగలం? ఇంట్లో ఫ్రిజ్‌ లో దాచుకోడానికి వీల్లేకుండా పవర్‌ కట్‌ ఉంది కదా’ ఇది ఒక గృహిణి బాధ అయితే మరొకరు ‘’ఏరోజు వంట ఆరోజే వండు కోవచ్చునని అనుకోలేకుండా వున్నాం. గ్యాస్‌ అయిపోతే పరిస్థితి ఏమిటి? పవర్‌ కట్‌ కూడా ఉంది. ఏమీ తోచడం లేదు’’ అని వాపోయారు. ‘ఇంట్లో డబ్బు పెద్ద మొత్తంలో తెచ్చిపెట్టుకుందామంటే ఈ అల్లక ల్లోలంలో దానిని ఎవరు లాక్కుని పోతారో అన్న భయం ఉంది. పోనీ ఎప్పటికప్పుడు బ్యాంక్‌ ఎటిఎం నుంచి తీసుకుందామంటే పవర్‌ కట్‌ తో ఆ ఎటిఎంలు ఎప్పుడు పని చేస్తాయో తెలియకుండా ఉంది.’’ అని ఓ మధ్యతరగతి కుటుంబీకుడు గోల పెడుతున్నాడు. శ్రీలంకలో ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు బాగా పాపులర్‌. కాని ఇప్పుడు పవర్‌ కట్‌ కారణంగా ఆ సెంటర్ల లోని ఓవెన్లు,హీటర్లు,పని చేయడం లేదు.మరీ పెద్ద సెంటర్ల లోనైతే జనరేటర్లు ఉన్నాయి. కాని వాటికి సరిపడా చమురు లభించడం లేదు. ఇక చిన్న సెంటర్లయితే ఎప్పుడు నడపాలో, ఎప్పుడు మూసేయాలో తెలియని స్థితి ఉంది.‘’పోర్టులో మా కంపెనీ ఆర్డరు చేసిన మెటీరి యల్‌ దిగింది. అక్కడే ఉంటే ఎక్కువ చార్జీలు చెల్లిం చాల్సి వస్తుంది అని ఆ సరుకుని మా గోడౌన్‌ లోకి తెచ్చి దింపాం. కాని ఇక్కడి నుంచి మా వర్క్‌ సైట్‌ కి దీని ని రవాణా చేయడానికి డీజిల్‌ దొరకడం లేదు. మా పని అంతా ఆగిపోయింది.’’ ఓ బడా కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ బాధ ఇది.‘’మా పౌల్ట్రీ లోని కోళ్ళు పూర్తిగా పెరిగిపోయాయి. వాటిని కోసి అమ్మేయకుండా వుంచి మేపాలంటే తడిసి మోపెడౌతోంది. పవర్‌ కట్‌ వలన ఫ్రీజర్లు పని చేయడం లేదు. అందుకే అన్నిం టినీ చంపి పూడ్చిపెట్టేశాం’’ అన్నాడో కోళ్ళఫారం యజమాని. ఇంకోవైపు మార్కెట్‌ లో కోడిమాంసం ధర మాత్రం ఒక్క నెలలోనే రెట్టింపు అయిపోయింది. శ్రీలంకలో మత్స్యకారుల సంఖ్య చాలా ఎక్కువ. కాని వాళ్ళు చేపల వేటకు పోవాలంటే బోట్లు నడవడానికి డీజిల్‌ గాని, కిరోసిన్‌ గాని కావాలి. అవి దొరకడం లేదు. ఒకవేళ అతి కష్టం మీద సంపాదించి చేపలు పట్టి తెచ్చినా,వాటిని అమ్మడానికి మరో వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కెట్‌కి తీసుకెళ్ళాలి. దానికి రవాణా లేదు.అందుచేత చాలామంది మత్స్య కారులు చేపల వేట మానుకున్నారు. దీంతో చేపల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏపనీ లేక పోయినా సెల్‌ ఫోన్‌ పట్టుకుని కాలక్షేపం చేసేయ వచ్చునను కునేవారి పరిస్థితీ ఏమాత్రం బాగులేదు. 13 గంటల పవర్‌ కట్‌ వలన ఆ సెల్‌ ఫోన్లు, సెల్‌ టవర్లు పని చేయడం లేదు. టీవీల్లో దూరి సమయం గడిపేయవచ్చుననుకునేవారి పరిస్థితీ అలాగే ఉంది. ‘మాకు రాజకీయాలు అనవసరం. దేశం ఏమౌతోందో నాకెందుకు? నా పరిస్థితి బ్రహ్మాండంగా సాగిపోతోంది. నా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ చల్లగా ఉంటే చాలు’’ అనుకునే మధ్యతరగతి ప్రబుద్ధులంతా ఇప్పుడు అందరికన్నా ముందు రోడ్ల మీదకి వస్తున్నారు. అధ్యక్షుడి ఇంటి ఎదురుగా వేలాదిమంది నిరసన తెలపడానికి నిల బడితే వాళ్ళని పోలీసులు అరెస్టులు చేశారు. వారిలో ఓ 50 మంది మీద కేసులు పెట్టి కోర్టుకి తెచ్చారు. ఆ 50 మంది కోసం వాదించడానికి 300మంది లాయర్లు తయారైపోయారు. అయినా గొటబాయ రాజపక్స ప్రభుత్వానికి ఇంకా కళ్ళు తెరుచుకున్నట్టు లేదు. ‘’ఇదంతా కొంతమంది అరాచక మూకలు విదేశీ శక్తుల ప్రోద్బలంలో సాగిస్తున్న కుట్ర. దేశంలో అరబ్‌ వసంతం తీసుకొద్దాం అంటూ వాళ్ళు సోషల్‌ మీడియాలో మెసేజ్‌ లు పెడుతున్నారు.’’ అంటూ అధ్యక్షుడి భవనం అధికార ప్రతినిధి ప్రకటించాడు. కాని ఈ ప్రభుత్వాన్ని శ్రీలంకలో ఎవ్వరూ నమ్మడం లేదు. ప్రజలు ఎంత విసిగిపోయారంటే వాళ్ళు ఇప్పుడు ఏ ప్రత్యామ్నాయం గురించీ ఆలోచించడమే లేదు. ఈ గొటబాయ రాజపక్స కుటుంబం. ఈ ప్రభు త్వం దిగిపోతే చాలునని వాళ్ళు ముక్తకంఠంతో డిమాం డ్‌ చేస్తున్నారు. ప్రజలు అక్కడ ప్రతిపక్షాలనూ నమ్మడం లేదు. ప్రతిపక్షాలకు పగ్గాలు అప్పగించడం వలన ఏప్రయోజనమూ ఉండదని వారు భావిస్తున్నారు. ‘’ఒక చేతకాని ప్రభుత్వం బదులు మరో చేతకాని ప్రభుత్వం వస్తే ఏమిటి ఉపయోగం? అని ప్రశ్నిస్తున్నారు. ఆదేశానికి సహాయం కోసం భారత ప్రభుత్వం పంపు తున్న వస్తువులను అక్కడి ప్రభుత్వ అధికారులకు అప్పగించడం బదులు భారత ప్రభుత్వమే నేరుగా మాకు అందించడం మంచిది అని ఆ ప్రజలు అనుకుం టున్నారు. ప్రతిపక్షాలు బలంగా లేకపోవడంతో బాటు శ్రీలంక సైన్యం కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి పూర్తి అండగా ఉంది. ఐతే ఒకవేళ ఈ ప్రభుత్వానికి పార్లమెంటులో మెజారిటీ లేకుండా పోతే ఏంజరుగుతుందో చెప్పలే మంటున్నారు రాజకీయ పరిశీలకులు. గతంలో తమిళుల ఉద్యమానికి భారత దేశం అండదండలివ్వడం వలన శ్రీలంకలో సింహళీ యులలో ఎక్కువ మంది ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశం నుండి వచ్చి శ్రీలంకలో భూముల్ని, ఆస్తుల్ని చౌకగా కొనేసి పెత్తనం చేస్తారేమోనన్న భయాలు కూడా ఉన్నాయి. మోడీ ప్రభుత్వం పొరుగు దేశాలు వేటితోనూ సత్సంబంధాలను నెలకొల్పు కోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా ఈ రకమైన అపనమ్మకాలు కలగడానికి దోహదం చేసింది. అయితే చైనా గురించి వీళ్ళ అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. ‘’చైనాని ఎందుకు నిందించాలి? ఇక్కడి అస్తవ్యస్త పరిస్థితులకి మా ప్రభుత్వ నిర్వాకమే కారణం. ఇక్కడ ఎక్స్‌ప్రెస్‌ హైవే ని చైనా యే నిర్మించింది. కొలంబోలోకి ప్రవేశించే దగ్గర బ్రహ్మాండమైన జంక్షన్‌ (ఇంటర్‌ఛేంజ్‌) నిర్మించింది కూడా చైనా వారే. ఈ నగరానికి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచిన లోటస్‌ టవర్‌ కూడా వాళ్ళు నిర్మించినదే. నగరంలోని పెద్ద పెద్ద ప్రాజెక్టులను ఎన్నింటినో వాళ్ళు కట్టారు’’ అని చైనా గురించి అనుకూలంగానే అక్కడ ప్రజలు మాట్లా డుతున్నారు. 2009 వరకూ శ్రీలంకలో తమిళ ఉద్యమమే అన్ని ఇబ్బందులకూ కారణమని పాలకులు సాకు చూపించు కున్నారు. ఆతర్వాత కూడా కొంత కాలం అదే సాకుని చూపారు. 2019లో చర్చిల్లో బాంబు పేలుళ్ళ తర్వాత ఇప్పుడు ముస్లింల నుండి ప్రమాదం అని చెప్తున్నారు. అయితే ప్రస్తుత సంక్షోభ పరిస్థితిలో పాలకులు ఎన్ని సాకులు చెప్పినా, ఎవరిమీద నెపం మోపాలని చూసినా ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితిలో లేరు. నిరంకుశంగా అణచివేయాలనను కుంటున్నరాజపక్సప్రభుత్వానికి…రాజపక్స కుటుంబ మూ, ఆ ప్రభుత్వం మాత్రమే సంక్షోభానికి కారణం అంటున్న ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోంది.
సామాన్యులే సమిధలా…!
రాష్ట్ర ప్రభుత్వం డీజిల్‌ సెస్‌ పేరుతో ఆర్‌టిసి బస్‌ చార్జీలను పెంచడం దారుణం. నిరుపేదల, సాధారణ ప్రజల ప్రయాణ సాధనాలుగావున్న పల్లె వెలుగు, సిటీ సర్వీసుల కనీస చార్జీలతోపాటు అన్ని స్టేజిలకూ భారం పెంచడం ద్వారా సర్కారు సామాన్యులను సమిధల్ని చేస్తోంది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీస్‌ ప్రయాణికులపై టిక్కెట్‌కు రూ.2, ఎక్స్‌ప్రెస్‌, సిటీమెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌ సర్వీసుల్లో రూ.5, సూపర్‌ లగ్జరీ, ఎసి సర్వీసుల్లో రూ.10 చొప్పున ఈ చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించింది. పల్లెవెలుగు, సిటీ ఆర్డనరీ సర్వీసుల్లో కనీస ధర రూ.10గా చేయడంతో పాటు సేఫ్టీ సెస్‌ పేరుతో అదనంగా మరో రూపాయి వసూలు చేస్తున్నారు. రిజర్వు బ్యాంకుతో, కేంద్ర ప్రభుత్వంతోనూ చర్చించి చిల్లర కొరత నివారించ వలసిందిపోయి కొరత పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రౌండప్‌ చార్జీలను వసూలు చేస్తామనడం మోస పూరితం. తాజా పెరుగుదల వల్ల ఆర్‌టిసికి అదనంగా రోజుకు రెండు కోట్లు, లేదా ఏడాదికి రూ.720 కోట్లు ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నా అది వాస్తవంలో పన్నెండు వందల కోట్లు దాటుతుందని కొందరు నిపుణులు అంటున్నారు. ఇప్పటికే విద్యుత్‌ చార్జీలను పెంచిన ప్రభుత్వం తాజాగా ఆర్‌టిసి ఛార్జీలు పెంచి జనానికి గోరుచుట్టుపై రోకటి పోటు వేసినట్టయింది. 2019లో చార్జీలు పెరిగాయని, అప్పుడు లీటర్‌ డీజిల్‌ ధర రూ.67గా ఉండగా ప్రస్తుతంరూ.107కి పెరిగాయని అధికారులు చెబు తున్న మాట నిజం. అయితే, ఈ పెరుగుదలకు కేవలం మోడీ ప్రభుత్వ విధానాలే కారణం తప్ప వేరేమీ కాదు. అలాంటిది కేంద్ర ప్రభుత్వంతోతలపడి, ప్రజా రవాణా వాహనాలకైనా తక్కువ ధరకు డీజిల్‌ సాధిం చుకు నేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నమూ చేయకుండా ఆ భారాన్ని ప్రజలపైకి మళ్లించడం సబబు కాదు. కనీసం కేంద్రంతో పోరాడి, సాధించలేని స్థితిలో దాన్ని ప్రజలముందు దోషిగా నిలిపినా కొంతవరకు సబబుగా వుండేది. సంస్థకు అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగావున్న ఆర్‌టిసి ఖాళీ స్థలాలను బిఓటి పద్ధతిలో ప్రైవేటువారికి అప్పగించాలనడం మోసపూ రిత ఆలోచన. వివిధ నగరాలు, పట్టణాల నడిబొడ్డు నవున్న ఆర్‌టిసి స్థలాలను ప్రైవేటుకు దఖలుపర్చడం ప్రజల సంపదను అస్మదీయులకు కట్టబెట్టే దుష్ట తలంపే! కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మోనిటైజేషన్‌ పైప్‌లైన్‌ పథకానికి ఇది ప్రతిరూపమే. ఆర్‌టిసి స్థలాలను సంస్థ విస్తరణకు, ప్రయాణికుల సౌకర్యాలకు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ రూపంలోనూ ప్రైవేటుకు అప్పగించడానికి వీల్లేదు. ప్రభుత్వం అందుకు ప్రయత్నిస్తే ప్రజలు, ఆర్‌టిసి ఉద్యోగులు ఉద్యమించి ప్రజల ఆస్తిని కాపాడుకోవాలి. ఇప్పటికే ధరలు పెరిగి పన్నుల భారంతో సతమ త మవుతున్న ప్రజలకు ఇది కోలుకోలేని దెబ్బ. పేద, మధ్యతరగతి, నిరుద్యోగులు, విద్యార్థులు బస్సు ప్రయా ణాలపై ఎక్కువగా ఆధారపడుతున్నందున పెంచిన బస్సు చార్జీలను వెంటనే ఉపసంహరించు కోవాలి. సంస్థ నష్టాలకు కారణాలను పరిశీలించి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం అవసరం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బల్క్‌ డీజిల్‌ ధర పెంచినపుడు ఆర్‌టిసి బస్సులకు తక్కువ ధరకు రిటైల్‌ బంకుల్లో డీజిల్‌ ఫిల్లింగ్‌ చేయించి ఎంతో కొంత పొదుపు చేయగలిగారు. సరుకు రవాణా (కార్గో)పై మరింత కేంద్రీకరిస్తే ఆదా యం పెరచుకో వచ్చు.
ముఖ్యంగా స్టేజి క్యారేజిలు గా తిరుగుతున్న ప్రైవేటు బస్సులను అదుపు చేస్తే ఆర్‌టిసి ఆక్యుపెన్సీ పెరగడంతోపాటు ఆదాయ మూ వృద్ధి చెందుతుంది. అలాగే లాభసాటిగా వుండే అంతర్రాష్ట్ర సర్వీసుల విస్తరణకు కృషి చెయ్యాలి. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో తగు ఒప్పందాలు చేసు కోవాలి. అన్ని విధాలుగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి, సంస్థ ఆదాయం పెంచుకోవడం, దుబారా ఖర్చులు తగ్గించడానికి సకల చర్యలు చేపట్టడంతోపాటు అవినీతి, లీకేజిలను అరికట్టడంపై సర్కారు కేంద్రీకరిస్తే ప్రజలపై భారాలు వేయాల్సిన అవసరమే లేదన్న నిపుణుల మాట ప్రత్యక్షర సత్యం.-(వ్యాసకర్త : పాత్రికేయుడు ఇటీవల శ్రీలంక పర్యటించిన ప్రత్యక్ష కథనం ఆధారంగా) (ఆర్‌.కె.రాధాకృష్ణన్‌ )

తెరపైకి మ‌ళ్లీ ఉత్త‌రాంధ్ర అణువిద్యుత్ కుంప‌టి

ఉత్తరాంధ్ర జిల్లాలు వెనకబాటుకు గుర య్యాయి. ప్రగతి అన్నది ఎరగనివి. వాటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాల్సి ఉంది. ఈ విషయంలో రెండవ మాటకు తావు లేదు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకంగా ఉత్తరాంధ్ర నెత్తిన అణు కుంపటి పెట్టి…ప్రజలకు కంటి నిండా కునుకు కూడా లేకుండా చేయనున్నాయి. కొవ్వాడపై ఇటీవల రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ… శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో 1208మెగావాట్ల సామర్ధ్యంతో 6 రియా క్టర్లతో కూడిన అణు విద్యుత్తు కేంద్రం ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయం గా ఆమోదించిందని…పిఎంఓ కార్యాల యం సహాయ మంత్రి జితేంద్రసింగ్‌ తెలిపారు.
అణు ప్రమాదాల నష్టాన్ని పూడ్చుకునే సామ ర్థ్యం అభివృద్ధి చెందిన దేశమైన జపాన్‌ కే లేకుండా పోయింది. అలాంటిది మన దేశం ఇటువంటి విపత్తులను తట్టుకోగలదా? అసలు ఒక దివాళా తీసిన కంపెనీతో ఒప్పందం చేసుకోవడమేమిటి? ప్రపంచమంతా నిషేధిస్తున్న అణు విద్యుత్‌ మనకు అవసరమా? ఇవన్నీ తెలిసి కూడా మోడీ ప్రభుత్వం ఎందుకు ఉవ్విళ్లూరుతోంది? ఇతరరాష్ట్రాలు నిరా కరించిన అణు విద్యుత్‌ ప్లాంట్‌ పట్ల జగన్‌ ప్రభుత్వ వైఖరి తెలియజేయాలి. కేంద్ర బిజెపి ప్రభుత్వం గుజరాత్‌ లోని మితివిర్ధిలో అణు విద్యుత్‌ కేంద్రం పెట్టాలని 2007లో నిర్ణయించింది. 2013 నాటికి పర్యావరణ,అటవీ అనుమతులు పొందింది. అయినా ఆగమేఘాల మీద2016 జూన్‌4వ తేదీన మితివిర్ధిలో నిర్మించాలనుకున్న అణు విద్యుత్‌ కేం ద్రాన్ని కొవ్వాడకు తరలించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గుజరాత్‌లో ప్రజలు వ్యతిరేకిస్తే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంజిల్లా రణస్థలం వద్ద కొవ్వాడకు తరలించడం ఎవరి ప్రయోజనం కోసం ? ప్రపంచంలోనే అణువిద్యుత్‌ పరిశ్రమలు ఎక్కడా పెట్టడంలేదు. అణువిద్యుత్‌ కేంద్రాల్లో భద్రత లేదని ప్రపంచంలోని అణు నిపుణులు వక్కాణిస్తున్నారు. పార్లమెంట్‌లో మనరాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యులు అడిగినప్రశ్నకు వెస్టింగ్‌హౌస్‌ అనే అమెరికా కంపెనీతో ఒప్పందంఖరారు చివరి దశలోఉందని ప్రభుత్వం తనసమాధానంలో తెలిపింది. ఈ కంపెనీ అమెరికాలో దివాళాతీసి ఐ.పి పెట్టింది. అలాంటి కంపెనీతో నేడుమోడీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని ఎలాఅర్థం చేసు కోవాలి? ఈఒప్పందంలో మరో ప్రమాదక రమైన అంశమేమిటంటే, ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే,ఆకంపెనీకేమీ సంబంధం ఉండదట! బహుళజాతి సంస్థల బండారం ఎలా ఉంటుందో చెప్పటానికి ఇటీవలి విశాఖ ఎల్‌.జి పాలిమర్స్‌ ఉదంతం మన ముందే ఉంది. 1984లో భోపాల్‌లో జరిగిన ఘోర గ్యాస్‌ లీకు ప్రమాదానికి సంబంధించి ఇదే అమెరికాకు చెందిన యూనియన్‌ కార్బైడ్‌ బహుళజాతి సంస్థ సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నా నేటికీ పూర్తిగా పరిహారం చెల్లించలేదు. వారు చెల్లించక,మన ప్రభుత్వాలూ పట్టించుకోక పోవ డంతో నేటికీ వేలాది మంది ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులతో అక్కడ బాధపడుతూనే ఉన్నారు. అదే విధంగా అమెరికాలోని ఐస్లాండ్‌,రష్యాలోని చెర్నో బిల్‌, 2011లో జపాన్‌లోని ఫుకుషిమాలో జరిగిన ప్రమాదంతో ఆరాష్ట్రమంతా తీవ్రంగా నష్ట పోయింది. పూర్తిగా వ్యవసాయమే ఆధారంగా ఉన్న ఆ రాష్ట్రంలో రేడియేషన్‌వల్ల గాలి,భూమి, నీరు విషతుల్యం అయ్యాయి. ఈవిస్ఫోటనం తర్వాత ఏ దేశంలోను అణు విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడంలేదు. ఇప్పటికేవున్న అణు విద్యుత్‌ కేంద్రా లను అనేక దేశాలు మూసివేస్తున్నాయి. మనకు రియాక్టర్లను ఎగుమతి చేస్తున్న అమెరికా తమ దేశంలో 4విద్యుత్‌ కేంద్రాలు మూసివేసింది. జపా న్‌లో 2 అణు విద్యుత్‌ కేంద్రాలు తప్ప మిగిలినవన్నీ మూసివేయడం జరిగింది. కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రంలో ప్రమాదం జరిగితే 170కిలోమీటర్లు విస్తరించి దక్షిణాన కాకినాడ,ఉత్తరాన ఒడిషా లోని చత్రపూర్‌ వరకు జీవకోటి నశిస్తుంది. ఈ ప్రాం తాన్ని సర్వనాశం చేస్తుంది. ఒకేచోట 6 రియాక్టర్లు పెట్టడం అత్యంత ప్రమాదకరమని నిపుణులు తెలియజేస్తున్నారు. వెస్టింగ్‌ హౌస్‌ ఉత్పత్తి చేసే ఎ.పి1000అనే రియాక్టర్లు ఇంత వరకు ప్రపం చంలో ఎక్కడా ఉపయోగించిన దాఖలా లేదు. ఎక్కడా పరీక్షించని రియాక్టర్లను ఆంధ్రప్రదేశ్‌ నెత్తిన అమెరికా రుద్దుతున్నది. అమెరికా కోసం భారత ప్రయోజనాలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తాకట్టు పెడుతున్నాయి. పైగా1208 మెగావాట్ల సామ ర్ధ్యంతో 6 రియాక్టర్లతో కూడిన ఈఅణువిద్యుత్‌ కేంద్రం ఏర్పాటుతో 8వేల మందికి ఉపాధి దొరుకు తుందని సాకుగా చూపుతున్నారు. ఒకవైపు రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర వహిస్తూ ప్రత్యక్షంగా 30 వేల మందికి,పరోక్షంగా లక్షమందికిపైగా ఉపాధి కల్పిస్తున్న విశాఖస్టీల్‌ ప్లాంటును ఎలాగైనా అమ్మి తీరుతామని చెబుతూనే మరోవైపు అత్యంత ప్రమా దకరమైన అణువిద్యుత్‌ కేంద్రంతో 8వేల మందికి ఉపాధి కల్పిస్తామనడంపూర్తిగా అసంబద్ధం కాదా? అణువిద్యుత్‌ కేంద్రాలకు పెట్టుబడి బాగాఅధికం. ఒక మెగావాట్‌ అణు విద్యుత్‌ ఉత్పత్తికి రూ.48 కోట్లు ఖర్చు అయితే ఒకమెగావాట్‌ థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తికి రూ.5కోట్లు ఖర్చు అవుతుంది. సోలార్‌ టెక్నాలజీ నేడు బాగా అభివృద్ధి అవుతున్నది. పర్యా వరణ సమస్య వుండదు. విండ్‌ టెక్నాలజీ కూడా నేడు అభివృద్ధి చెందుతున్నది. పర్యావరణ సమస్య లేని విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలి.
ఎట్టి పరిస్థితుల్లోను రాష్ట్ర ప్రభుత్వం అణు విద్యుత్‌ కేంద్రాన్ని అంగీకరించకూడదు. కేంద్ర ప్రభుత్వనిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా ఒత్తిడి తేవాలి. రాష్ట్రానికి తీవ్ర ప్రమాదకారి అయిన అణు విద్యుత్‌ కేంద్ర నిర్ణయాన్ని ప్రజలు,మేధావులు, పర్యావరణవేత్తలు వ్యతిరేకించాలి.ప్రజలకు చౌకగా విద్యుత్‌ను అందించగలిగే పర్యావరణ హితమైన పవర్‌ప్లాంట్ల ఏర్పాటుపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి.
‘‘రేపు అణు విద్యుత్‌ కేంద్రం వస్తే మీ ఊరే ఎగిరి పోతుంది…ఇంకా రోడ్లెందుకు, స్కూళ్లెందుకు?’’
మీగ్రామం భవిష్యత్తులో మాయమై పో తుంది. అలాంటి గ్రామానికిరోడ్లు,కాలువలు వేయ డం ఎందుకు దండగ.ఇదేమాట గత ఐదేళ్లుగా అధికారుల నోటవింటున్నాం.కానీ,మా గ్రామం మాయమైపోలేదు. ఊరు అభివృధ్ది జరగలేదు’’- ఇది కొవ్వాడ మత్స్యలేశం గ్రామస్థుల ఆవేదన కొవ్వాడ మత్స్యలేశం (కొవ్వాడ)ఒకమత్స్యకార గ్రామం. ఇది శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండ లంలో ఉంది. దేశంలోనే అతిపెద్ద అణువిద్యుత్‌ కేంద్రం ఇక్కడ ఏర్పాటవుతోంది.‘‘మాఊరిలో కరెంట్‌ కంపెనీ వస్తుందని చెప్పారు. అందరు భూములు,ఇల్లు ప్రభుత్వానికి అప్పగించేస్తే… అం దుకు డబ్బులు ఇచ్చి, మరొక చోట ఇల్లు కట్టిస్తామని కూడా చెప్పారు. కొందరం ఒప్పుకున్నాం, మరికొం దరం ఒప్పుకోలేదు. అలా కాలం గడుస్తున్న కొద్దీ మెల్లగా అందర్ని ఒప్పించారు. మీ అందర్ని ఇక్కడ నుంచి తీసుకునివెళ్లి మరోచోట పెడతామని చెప్పా రు. చెప్పి ఆరేడేళ్లు అవుతోంది.కానీ ఇప్పటి దాక అధికారులు అప్పుడప్పుడు వచ్చిపోవడమే కానీ… అసలేం జరుగుతోందో మాకు తెలియడం లేదు. వాళ్లు అన్నట్లుగానే మాగ్రామం ఎప్పుడు మాయమ వుతుందా అని అడిగితే సమాధానం చెప్పడం లేదు.మాపరిస్థితి ఏంటోఅర్థం కావడం లేదు’’ అని 52ఏళ్ల కొవ్వాడ వాసి రాము ఎదుట వాపోయారు.
ఆరు రియాక్టర్లతో అణు విద్యుత్‌ కేంద్రం
కొవ్వాడలో దేశంలోనే అతి పెద్ద అణు విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అమెరికాకు చెందిన వెస్టింగ్‌ హౌస్‌ కంపెనీతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.ఈఒప్పందంలో భాగం గా అణు విద్యుత్‌ ప్రాజెక్టును కొవ్వాడ, దాని పరిసర గ్రామాల్లో నిర్మించేందుకు భూ సేకరణ చేయాలని నిర్ణయించారు. ఇక్కడే ఆరురియాక్టర్లతో అణు విద్యు త్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ప్రాథమికంగా తీర ప్రాంతంలో 2400ఎకరాల్లో విస్తరించి ఉన్న కొవ్వా డ,కోటపాలెం,రామచంద్రపురం,గూడెం,టెక్కలి, గ్రామాలను ఖాళీ చేయించేందుకు నిర్ణయించారు. ఇక్కడే అణు విద్యుత్‌ కేంద్రం రియాక్టర్లు, ఉద్యోగుల కాలనీలు నిర్మించాలని నిర్ణయించారు. ఇదంతా 2012 నుంచి జరిగి,2017 నాటికి ఈ గ్రామా లను ఖాళీచేయించి,పునరావాస కాలనీలకు తరలిం చాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
ఆ తేదీ దాటి ఐదేళ్లయినా…
అణు విద్యుత్‌ ప్లాంట్‌కు సంబంధించిన భూ సేకరణ జరిగి, నిర్వాసితులందరికీ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని ఇచ్చి…వారిని పునరావాస కాలనీలకు తరలించేందుకు కటాఫ్‌ తేదీ2017 ఏప్రిల్‌ 30గా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తేదీ దాటిపోయి ఐదేళ్లు కావస్తోంది. అయినా ఎక్కడ గ్రామాలు అక్కడే ఉన్నాయి. ‘‘మమ్మల్ని పునరావాస కాలనీలకు తరలిస్తామన్నారు.అసలు ప్రాజెక్టు పనులే ప్రారంభం కాలేదు. పైగా మాకు ఇస్తామన్న ప్యాకేజీ లు సైతం ఇంకా అందరికి అందలేదు. మొత్తం రూ.18 లక్షలు ఇస్తామన్నారు. అలాగే కటాఫ్‌ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువతకు సైతం ప్యాకేజీ వర్తింపజేస్తామన్నారు. ఆతేదీకి 18ఏళ్లు దాటిన వాళ్లకి ప్యాకేజీ ఇవ్వలేదు. పైగా అనుకున్న తేదీకి తరలించకపోవడంతో…గ్రామంలో చాలా మందికి 18ఏళ్లు వచ్చాయి. వీరికి ఇప్పుడు ప్యాకేజీ ఇవ్వా లని డిమాండ్‌ చేస్తున్నాం. మమ్మల్ని ఇక్కడ నుంచి తరలించడమో,లేదా మాగ్రామాల్ని అభివృద్ధి చేయ డమో చేయాలి’’అని పెదకొవ్వాడ నివాసి మంగ రాజు చెప్పారు.
‘‘అణు విద్యుత్‌ ప్లాంట్‌ సాకుతో అభివృద్ధి చేయడం లేదు’’
అణు విద్యుత్‌ ప్లాంట్‌ పరిధిలో సుమారు 8వేల మంది గ్రామస్థులు ఉన్నారు. వీరందరూ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇల్లు సరిపోక పోయినా,కట్టుకునేందుకు డబ్బులున్నా, మరొక ఇల్లు కట్టుకోలేకపోతున్నారు.‘‘ప్రభుత్వ పాఠశాల పరిస్థితి దారుణంగా ఉంది.గోడలు బీటలు వారాయి. కొన్ని చోట్ల పెద్ద పెద్ద కన్నాలుపడి, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి ఉంది. గ్రామంలోనిరోడ్ల పరిస్థితి అయితే దారుణం. ఇక విద్యుత్‌, కాలువలు లాంటి మౌలిక సదుపాయాలు వైపు ఏఅధికారి చూడటం లేదు. కారణమడిగితే రేపో మాపోమాయమైపోయే గ్రామం,దీనికి సౌకర్యా లేందుకు,డబ్బులువృథా అని అంటున్నారు. అలాగని తరలించడమూ లేదు’’ అని మత్స్యకార నాయకుడు బి.రాంబాబు చెప్పారు.‘‘అభివృద్ధి పనులైతే లేవు. కటాఫ్‌ డేట్‌ నుంచి అధికారులకు మా గ్రామాలంటే చిన్నచూపు అయిపోయింది. ఆతేదీ నుంచి ఇక్కడ అభివృద్ధి అనేది లేదు. పునరా వాస ప్యాకేజీలో భాగంగా ఇచ్చిన డబ్బులు ఖర్చవు తున్నాయి. కాలనీలు ఇంకా ఇవ్వలేదు. పోనీ ఇల్లు సరిపోవడంలేదు,మరోగదో,చిన్న ఇల్లో కట్టుకుందా మంటే…అది వృథాఅయిపోయే ప్రమాదం ఉంది. వెంటనే ప్రభుత్వం పునరావాస కాలనీలు, ప్యాకేజీల అం శాన్ని క్లియర్‌ చేసి తరలించక పోతే… ఆందోళ న చేస్తాం’’ అని రాంబాబు అన్నారు.
భూసార పరీక్షలు అడ్డుకున్నందుకు అరెస్టులు
నిర్వాసితుల్లో కొందరికి ఇంకా ప్యాకేజీ డబ్బులు అందలేదు. వాటిని ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవారే లేరు.పైగా ఊర్లో రెండేళ్లుగా పెద్ద పెద్ద మిషన్లు తీసుకొచ్చి భూసార పరీక్షలు నిర్వహిస్తు న్నారు. దీనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే అరెస్ట్‌ చేశారని అణువిద్యుత్‌ కేంద్రం నిర్వాసితుల్లో ఒకరైన అప్పన్న చెప్పారు.‘‘ప్లాంట్‌ కు సంబంధించిన పనుల్లో భాగంగా నిర్వాసితగ్రామాల్లో ఎక్కడోఒకచోట రోజూ భూసార పరీక్షలు నిర్వహిస్తుంటారు. కొన్ని సార్లు వాటిని అడ్డుకుంటే మాపై కేసులు పెట్టారు. మాకు ఇస్తామన్న ప్యాకేజీ ఇవ్వకుండా మా మీదే కేసులు పెడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ…మమ్మల్ని ఇక్కడ నుంచి తరలించ నైనా,తరలించాలి. లేదంటే మా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తే వెళ్లకుండా ఇక్కడే ఉంటాం’’ అని అప్పన్న తెలిపారు.
‘‘అణు విద్యుత్‌ ప్లాంట్‌ వద్దే వద్దు’’
కొవ్వాడలో అణువిద్యుత్‌ ప్లాంట్‌ వద్దం టూ వామపక్షాలు,ప్రజా సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఉత్తరాంధ్రను నాశనం చేసే కొవ్వాడ అణువిద్యుత్‌ కేంద్రం ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.‘‘అమెరికా ఆర్థిక సహాయంతో కొవ్వాడలో కేంద్రం తలపెట్టిన అణువిద్యుత్‌ ప్లాంట్‌ ఉత్తరాంధ్రలో పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. ప్రపంచంలోని ఇతర దేశాలన్నీ అణువిద్యుత్‌ను వదలి…ప్రత్యామ్నాయాల వైపు అడుగులు వేస్తుంటే, భారత దేశంలో మాత్రం అణు విద్యుత్‌ ప్లాంట్లను ఎందుకు ప్రొత్సహిస్తున్నారు? ప్రమాదకరమైన వీటిని వెంటనే రద్దు చేయాలి. లేనిపక్షంలో అన్ని పార్టీలు, సంఘాలతో ఉద్యమిస్తాం’’ అని సీపీఎం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు చెప్పారు. బొగ్గు, గ్యాస్‌, జలవిద్యుత్‌, పవన్‌ విద్యుత్‌ తర్వాత దేశంలో విద్యుత్‌ ఉత్పత్తికి వాడే ఐదోపెద్ద వనరు అణు విద్యుత్‌. ప్రస్తుతానికి తమిళనాడు కుడంకుళంలో ఉన్న న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంటే దేశంలో అతిపెద్ద అణు విద్యుత్‌ కేంద్రం.దానిసామర్థ్యం రెండు వేల మెగావాట్లు.కొవ్వాడలో రూ.61వేల కోట్ల అంచనా వ్యయంతో ఆరుఅణువిద్యుత్‌ రియాక్టర్లు నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. దేశంలోనే అతి పెద్ద అణు విద్యుత్‌ ప్రాజెక్టు ఇదే. న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా,అమెరికా రియాక్టర్‌ల నిర్మాణ సంస్థ వెస్టింగ్‌ హౌస్‌ కంపెనీల మధ్య కొవ్వాడలో ఆరు అణు విద్యుత్‌ రియాక్టర్లు నిర్మాణానికి ఒప్పందం కుదిరింది.బొగ్గు,గ్యాస్‌,జలవిద్యుత్‌, పవన్‌ విద్యుత్‌ తర్వాత దేశంలో విద్యుత్‌ఉత్పత్తికి వాడే ఐదో పెద్ద వనరు అణు విద్యుత్‌.ప్రస్తుతానికి తమిళనాడు కుడంకుళంలో ఉన్న న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంటే దేశంలో అతిపెద్ద అణువిద్యుత్‌ కేంద్రం. దాని సామర్థ్యం రెండు వేల మెగావాట్లు. కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రం సామర్థ్యం(ఒక్కొక్కటి1208 వీఔ చొప్పున్న 6రియాక్టర్లు)7,248 మెగావాట్లు. ఇది పూర్తయితే దేశంలోనే అతి పెద్ద అణు విద్యుత్‌ కేంద్రమవుతుంది. ఇది దేశంలోని 22 ఆపరేషనల్‌ న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్లలో 6.780 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కంటే ఎక్కువ. (ఈ సమాచారం పార్లమెంట్‌ సభ్యుడు జీవీఎల్‌ నరసిం హరావు అడిగిన ప్రశ్నకు సహాయమంత్రి జితేం ద్రసింగ్‌ రాజ్యసభలో లిఖిత పూర్వకంగా 31.03. 22 తేదీన తెలిపినది)
శరవేగంగా పనులు జరగాలి: ప్రత్యేక అధికారి
కొవ్వాడ అణువిద్యుత్‌ కేంద్రం నిర్మాణా నికి అవసరమైన భూసేకరణ చాలా వరకు పూర్తయి నట్లు శ్రీకాకుళం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, అణు విద్యుత్‌ కేంద్రం ప్రత్యేక అధికారి ఎం.విజయ సునీత తెలిపారు. కోర్టుకేసులు,పునరావాస ప్యాకే జీల క్లియరెన్స్‌ ఆలస్యం కారణాంగా కొంత భూ సేకరణ మిగిలి ఉందని, న్యూక్లియర్‌ ప్లాంట్‌ కు అవసరమైన 2060 ఎకరాల భూమిలో 1480 ఎకరాలు ఇప్పటికే సేకరించామని తెలిపారు. ‘‘కొవ్వాడలో మౌలిక సదుసాయాలపై కూడా దృష్టి పెట్టాం. ప్లాంట్‌ పనుల ప్రారంభంలో ఆలస్యం జరగడంతో అది గ్రామంలోని మౌలిక సదుపాయల కల్పన పై ప్రభావం చూపింది. ప్లాంట్‌ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి. అంతలోపు… తాత్కలిక మౌలిక సదుపాయలను కల్పిస్తాం. త్వరి తగతిన ఈ ప్రాజెక్టుపూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.నిర్వాసితులను ఎచ్చర్ల వద్ద ధర్మా వరంలో నిర్మించే నిర్వాసిత కాలనీలకు తరలిస్తాం’’ అని విజయ సునీత చెప్పారు.-(అల్లు రాజు)

వ‌ల‌స ప‌క్షులు…మ‌న అతిథులు

ఈ సృష్టిలో పక్షులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. పురాణాల్లో దైవ స్వరూపంగా భావించే పక్షలు మానవుని స్వార్థానికి బలైపోతున్నాయి. పక్షులు సహజ సిద్ధంగా ఏర్పడే ఆహారం.. ఆవాసం.. సంతానోత్పత్తి కోసం ఒక చోట నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం చేస్తుంటాయి. కొన్ని వేల కిలోమీటర్ల వరకు ప్రయాణించి సురక్షిత ప్రాంతంలో కొంత కాలం పాటు నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. వలస పక్షులను పరిరక్షించుకోవడం కోసం ఐక్యరాజ్య సమితి వలస పక్షుల దినోత్సవం నిర్వహిస్తున్నది. ఏలూరు జిల్లా కొల్లేరు ఒకప్పుడు వలస పక్షుల నిలయం.. ఇప్పుడు కొల్లేరులో పక్షులు లేవు.. వేట, ప్లాస్టిక్‌ వ్యర్థాలు అధిక గాడతతో కూడిన క్రిమి సంహార మందుల వాడకం వల్ల పక్షుల సంతతి అంతరించి పోతున్నది. ప్రపంచ వలస పక్షుల దినోత్సవం.. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం…
వలస పక్షల సంరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి ప్రతీ సంవత్సరం మేనెల రెండవ శనివారం, అక్టోబర్‌ నెల రెండవ శనివారాలను ప్రపంచ వలస పక్షుల దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది. 2010 నుంచి వలస పక్షుల దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తు న్నారు. ‘ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి పక్షులను సంరక్షించుకుందాం’ అనేది 2019 ప్రపంచ వలస పక్షుల దినోత్సవ ముఖ్య నినాదం..
పక్షులు ఎందుకు వలస వెళతాయంటాయి?
ప్రపంచ వ్యాప్తంగా పక్షులు తమ సంతానోత్పత్తి కోసం,శీతాకాలంలో తమ ప్రాణ రక్షణ కోసం వలసలకు సిద్ధపడుతుంటాయి. వేలాది కిలో మీటర్లు ఆకాశ మార్గంలో ప్రయాణించి తమ సంతానోత్పత్తికి అనువైన సురక్షిత ప్రాంతాలను అన్వేషించి అక్కడ కొన్ని నెలలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. ధృవ ప్రాంతాల నుంచి శీతాకాలంలో పక్షులు తీవ్ర చలిగాలుల నుంచి రక్షణ కోసం అనువైన ప్రాంతాలకు వలసలు కడతాయి. పక్షులు ప్రతీ సంవత్సరం ఒక ప్రత్యేక సమయంలో ప్రత్యేక ప్రాంతానికి వలసలు కడతాయని పరిశోధకులు చెబుతున్నారు. వలస పక్షులు ప్రత్యేక దారుల గుండా సూర్యగమనం, చంద్రగమనం ఆధారంగా తమ వలస ప్రాంతాలకు దారుల లక్ష్యాన్ని నిర్ధేశించుకుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉత్తర ధృవం నుంచి ధక్షిణ ధృవానికి సైబీరియన్‌ ప్రాంతం నుంచి పక్షుల వలసలు సాగుతుంటాయి .పక్షులు ఆర్కిటిక్‌ ప్రాంతం నుంచి అంటార్కిటికా ప్రాంతానికి వలసలు సాగిస్తుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా పరిశోధకులు తొమ్మిది ప్రాముఖ్యత గల వలస పక్షులదారులను గుర్తించారు. ఉత్తర దిక్కు నుంచి చలికాలంలో దక్షిణ దిక్కున గల ఉష్ణ మండల ప్రాంతానికి వచ్చి గుడ్లు పొదిగి పిల్లలతో తిరిగి తమ ప్రాంతానికి సురక్షితంగా వెళ్తాయి. హిమాలయాలు,ఆండిస్‌ పర్వత ప్రాం తాల్లో కూడా వలస పక్షలు నివాసాలు ఏర్పరుచుకుంటాయి.
ఆంధ్రప్రదేశ్‌లో వలస పక్షుల కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్‌ వలస పక్షులకు నిలయం. పర్యా వరణహితంగా ఉండే ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా తీర ప్రాంతంలో వలస పక్షుల కేంద్రాలు కోకోల్లలుగా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో తేలినీలాపురంలో ఫెలికాన్‌,గుడాబాతు పక్షులు రష్యాలోని సైబీరియన్‌ ప్రాంతం నుంచి వలస వస్తుంటాయి. కృష్ణాగోదావరి జిల్లాల మధ్య ఉండే కొల్లేటి ప్రాంతంలో ఫెలికాన్‌,నైటికేల్‌,టిల్ట్‌ పక్షులు ఆస్ట్రేలియా,ఆసియా ప్రాంతాల నుంచి వలస వచ్చి కొన్ని నెలల పాటు సేదతీరుతుం టాయి.పులికాట్‌ తీరంలో ఫ్లెమింగో పక్షుల కేం ద్రం ఎంతోఆహ్లాదకరంగా ఉంటుంది.నెల్లూరు జిల్లాలోని నేలపాడులో ఫ్లెమింగో,హేలాన్‌ పక్షు లు వలస వచ్చి సేదతీరుతుంటాయి
కొల్లేరు వలస పక్షుల స్వర్గ ధామం
కొల్లేరు ప్రాంతం వలస పక్షులకు స్వర్గ ధామం గా నిలుస్తుంది. ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్ప డిన కొల్లేరు 72కిలోమీటర్ల వైశాల్యంతో సహజ సరస్సుగా ఏర్పాడటంతో సుదూర ప్రాంతాల నుంచి పక్షులు కొల్లేటి తీరానికి అక్టోబర్‌ నెలలో వచ్చి ఐదు నెలల పాటు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. ఇక్కడే సంతానోత్పత్తి చేసుకుని మార్చి నెలలో పిల్లలను తీసుకుని తమ సొంత ప్రాంతానికి పోతుంటాయి. ఆసియా,ఆస్ట్రేలియా ప్రాంతాల నుంచి వచ్చే ఫెలికాన్‌,గుడాబాతు, నత్తకొట్టు,చింతఉప్పు,చిట్టిబెల్ల గువ్వాపక్షులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఫెలికాన్‌తో పాటు టిల్ట్‌,వైట్‌ టైల్‌,భార్గని,రిటెల్‌ గ్రీబ్‌,ఫ్లోవర్‌ మొద లైన పక్షులు హిందూ మహాసముద్రం,బంగాళా ఖాతం మీదుగా ప్రయాణించి కొల్లేరు చేరు కుం టాయి. 2021పక్షుల లెక్కల ప్రకారం కొల్లేటి తీరంలో5నుంచి8ల క్షల వరకు 120రకాల పక్షుల ఆవాస ప్రాంతంగాఉందని లెక్కల్లో తేలింది.
ప్రమాదం అంచున పక్షులు
ప్రపంచ వ్యాప్తంగా పక్షులు మానవుని స్వార్థానికి బలవుతున్నాయి. ప్రతీ సంవత్సరం ఒక మిలియన్‌ పక్షులు మానవుని స్వార్థానికి బలవుతున్నాయి. మానవుడు ప్రతీ సంవత్సరం 300 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ వస్తువులను తయారు చేసి ఉపయోగించుకుని భూమిపై, నీటి వనరుల్లో వదిలేస్తున్నాడు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు మంచినీటి వనరులను సముద్రాల్లో విపరీతంగా కలవడం వల్ల పక్షు లకు సహజసిద్ధ ఆహారంతో పాటు ప్లాస్టిక్‌ను స్వీక రిస్తున్నాయి. ఆస్ట్రేలియా,అమెరికా తీరాల్లో వలస పక్షులు ఈ ప్లాస్టిక్‌ వ్యర్థాలను తిని వంద లాదిగా మృత్యువాతకు గురవుతున్నాయి. పక్షి పరిశోధకులు మృత్యువాత పడిన పక్షులను కోసి చూస్తే వాటి పొట్ట నిండ ప్లాస్టిక్‌ వ్యర్థాలేఉండ టం వారిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. వ్యవ సాయ క్షేత్రాల్లో అధిక గాడతతో కూడిన క్రిమి సంహారక మందులు పక్షులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొల్లేరు ప్రాంతంలో కొంత మంది వేటగాళ్లు శీతాకాల ప్రాంతంలో విషపు ఎరలు పెట్టి వందలాది పక్షులను అంతం చేసున్నారు.
ఫ్లెమింగో పక్షులు మనుగడ ప్రశ్నార్ధకం
జీవ వైవిధ్యానికి ముఖ్యంగా మానవ మనుగ డలో ముఖ్యపాత్ర వహిస్తున్న అనేక లక్షలాది స్థానిక, వలస పక్షులకు తీవ్ర ప్రమాదాన్ని కలుగచేస్తున్నాయి. విద్యుత్‌లైన్లకూ ట్రాన్స్‌ఫా ర్మర్లకు, ఎత్తయిన విద్యుత్‌ స్తంభాలకు తగిలి విద్యుత్‌ఘాతంతో పక్షులు ప్రానాలు కోల్పో తున్నాయి. ఇదేగాక బొగ్గు,నీరు,జీవఇంధనం, సముద్రం,సౌరశక్తి, పవనశక్తి ఉపయోగించి నిర్మించే విద్యుత్‌ కేంద్రాల వలన పక్షులు తమ నివాసాలను, సంతానోత్పత్తి, ఆహార స్థలములను కోల్పోవడం గాని పాడయి పోవటముగాని జరుగుతున్నది. తరగని వనరులు ఉపయోగిం చుట వలన కర్బన ఉద్గారాలు ఉత్పత్తి కాకుండా కొంత మేలయినప్పటికీ విద్యుదుత్పత్తి ప్లాంటు నిర్మాణానికి,విద్యుత్‌ సరఫరాకు సరిjైు్నన ప్రణాళిక, డిజైను రూపకల్పన,నష్టాలను అంచనా వేయటం లేదు. దీనివలన జీవ వైవి ధ్యానికి ముప్పు వాటిల్లటమే కాకుండా లక్షలాది స్థానిక, వలస పక్షులకు తీవ్రప్రమాదం కలుగుతోంది.ఫ్లెమింగోలు,స్టార్కు జాతి కొంగలు పెలికాను పక్షులు, గ్రద్ధ జాతి పక్షులు, ఇతర అనేక జాతుల పక్షులు వాటి సుదూర ప్రయా ణంలో విద్యుత్‌ తీగల గ్రిడ్‌లకు తగిలి విద్యుద్ఘా తముతో చనిపోతున్నాయి. 2011 సంవత్సరం నాటికి ప్రపంచం మొత్తం మీద 70మిలియన్ల కిలోమీటర్ల పవర్‌ లైన్లు ఉన్నట్టుగా అంచనా వేయబడినది.వలస పక్షులకు ఇప్పటికే వాటి నివాస ప్రదేశాలు, ఆహార ప్రదేశాలు సంతా నోత్పత్తి ప్రదేశములు నశించి పోవటం,పాడై పోవటం,గ్లోబల్‌ వార్మింగ్‌వల్ల ముప్పు వాటిల్ల డమే కాకుండా అదనంగా విద్యుత్‌ ఘాతము వలన వాటికి కలిగే ముప్పు తీవ్రతరమౌతున్నది. ఇదిపెద్ద పక్షి జాతులు నశించి పోయేందుకు కారణం. ప్రకృతి సిద్ధంగా వాటి సంతానోత్పత్తి తక్కువగా ఉండటం వల్ల, పెద్ద పక్షులు చనిపో వుట వలన వాటి గుడ్లు పాడై పోవటం,గూటి లోని పిల్లలు చనిపోవటం జరుగుతూ కొన్ని జాతులకు ముప్పు ఏర్పడుతోంది. తూర్పు ఐరోపాలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉందని ‘జాన్‌ ఒసల్లివాన్‌’ రాయల్‌ సొసైటీ పక్షుల పరిరక్షణ సంస్థ మాజీ సభ్యులు తెలిపారు. దక్షిణ ఆఫ్రికాలో ప్రతి సంవత్సరం 12శాతం ‘బ్లూ క్రేన్స్‌’ (ఆ దేశ జాతీయ పక్షి) విద్యుత్‌ ఘాతము వలన చనిపోతున్నట్లుగా తెలిపారు. ఇండియాలోనూ, ఆఫ్రికాలోనూ అధిక మొత్తం లో ఎలక్ట్రిక్‌ పవర్‌ లైనులు వేస్తుండటం వలన ఈ సమస్య తలెత్తబోతుందని తెలిపారు. అయితే ఇండియాలో కూడా ఈసమస్య ఇప్పటికే ఉన్నది. గుజరాత్‌లో ప్రతి సంవత్సరం కొన్ని వందల ఫ్లెమింగో పక్షులు విద్యుత్‌ ఘాతము వలన చనిపోతున్నాయి. ఈవిద్యుత్‌ తీగలను ఫ్లెమింగో పక్షుల నివాస ప్రదేశాలు, ఆహార ప్రదేశాల గుండాను, పక్క నుంచి నిర్మించుట వలన వాటి తలల విద్యుత్‌ తీగలకు గుద్దుకొని చనిపోతు న్నాయి. ఈఫ్లెమింగో పక్షులు వందలు,వేల సంఖ్యలో ఉండి రాత్రి సమయాలలో కూడా ప్రయాణిస్తుండడం వలన కరెంటు తీగలకు చనిపోతున్నాయి. ఊర కుక్కలు వీటి ప్రదే శాలలో చేరి వీటిని చిందరవందర చేయుట వలన ఆ గాభరాలో విద్యుత్‌ తీగలకు గుద్దుకొని మరణిస్తున్నాయి. మన దేశంలో రాబందుల సంఖ్య తీవ్ర ప్రమాద స్థాయికి తగ్గిపోవుటకు కారణాలలో విద్యుత్‌ తీగలే ప్రధానం. అమెరికా, యూరప్‌లలో ఎండిపోయిన ప్రదే శాలలో విద్యుత్‌ ఘాతముచే మంటలతో కాలి పడిపోయిన పక్షుల వలన అగ్ని ప్రమాదాలు జరుగుతున్నట్టుగా ప్రిన్సన్‌’ అనే అధ్యయనవేత్త తెలిపారు. విండ్‌ పవర్‌వల్ల కూడా పక్షులు చని పోతున్నాయి. పాశ్చాత్య దేశాల్లో అధ్యయనం జరిగినట్లుగా భారత దేశంలో అధ్యయనం జరగకపోవడం విచారకరం. పక్షులకు జరిగే తీవ్ర నష్టాన్ని తగ్గించడానికి వాటి సంతానో త్పత్తి, ఆహార ప్రదేశాలకు,నివాస ప్రదేశాలకు దూరంగా విద్యుత్‌ లైనులు నిర్మించాలి. ఇన్సులేటెడ్‌ వైర్లను ఉపయోగించాలి. బల్గేరి యాలో 2009-2013 మధ్యలో గుర్తింపబడిన ‘ఈస్ట్రన్‌ ఇంపీరియల్‌ ఈగల్స్‌’ 67శాతం వరకు విద్యుత్‌ ఘాతం వలన మరణించాయి. అదే విధంగా సూడాన్‌లో కూడా ‘ఈజిప్షియన్‌ వల్చర్సు’ కూడా విద్యుత్‌ తీగల వల్ల చనిపోతు న్నాయి. దాంతో సూడానీస్‌ ఎలక్టిక్ర్‌ కంపెనీ, బల్గేరియా పక్షుల సంరక్షణ సంఘం ఇన్సులేటెడ్‌ తీగలను అమర్చి పక్షులను తీవ్ర ప్రమాదం నుంచి రక్షించడం గొప్ప విషయం. కావున జీవ వైవిధ్యంలో, మానవుని మనుగడలో ముఖ్యపాత్ర వహిస్తున్న పక్షులను రక్షించుటకు, వాటి ఆహార, నివాస, సంతానోత్పత్తి ప్రదేశాలను రక్షించుటకు వీలుగా విద్యుత్‌ ప్లాంట్లు, విద్యుత్‌ లైనుల రూపకల్పన, నిర్మాణం జరగాలి.
వలస పక్షుల దినోత్సవం ప్రత్యేకత
యూనెస్కో 2006 నుంచి వలస పక్షుల దినోత్స వాన్ని నిర్వహిస్తోంది. పక్షుల అవసరాలు, అల వాట్లు, వలస వెళ్లే ప్రాంతాల్లో వాటికి ఎదురవు తున్న సమస్యలను గుర్తించారు. వాటి పరిష్కారా నికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వలస పక్షుల ప్రదేశాల రక్షణ గురించి ప్రచారం చేస్తూ స్తానికుల్లోనూ అవగాహన కల్పిస్తున్నారు. ప్రపంచ వారసత్వ ప్రాంతాలకు వ్యర్థ పదా ర్ధాలు, కాలుష్యం వంటి కారణంగా నష్టం జరుగుతుంది. రోజురోజుకు పర్యాటకం అభివృద్ధి చెందుతోంది. ప్లాస్టిక్‌, ఇతర వస్తువు లను ఇష్టానుసారం వేయకుండా వలస పక్షులను కాపాడాల్సిన బాధ్యత కూడా పర్యాట కులపై ఉందంటూ సూచించింది యూనె స్కో. ప్రపంచ వారసత్వ ప్రదేశాలు పక్షులకు విరామ స్థలాలుగా ఉంటున్నాయి. పలు వారసత్వ ప్రదేశాల్లో జల కాలుష్యం ప్రధాన సమస్యగా ఉంటుంది. ప్లాస్టిక్‌, పారి శ్రామిక వ్యర్థాలు పక్షుల ప్రాణాలకు ముప్పుగా మారాయి. –(కోకా మృత్యుంజయరావు/ ముప్పళ్ళ అప్పారావు)

నైజరు తేనె

ప్రముఖ పరిశోధక రచయిత, విశ్లేషకులు, డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజుథింసా పత్రిక కోసం ప్రత్యేకంగా రాస్తున్న ‘గిరిజన కథావిశ్లేషణ’ ధారావాహికంగా అందిస్తున్న ఈ నెల సంచికలో కథా విశ్లేషణ తెలుగు సాహితీలోకానికి సుపరిచితులైన సుప్రిసిద్ద సాహితీవేత్త ‘బలివాడ కాంతరావు ’ కథా రచన ‘ నైజరు తేనె ’ కథా చదవండి..! – సంపాదకులు
సుప్రసిద్ధ తెలుగు కథా రచయిత బలివాడ కాం తారావు (03-7-1927,06-05-2000) శ్రీకాకుళం జిల్లా మడపాం గ్రామంలో జన్మిం చారు కథారచయితగా సుమారు 400కథలు రాశారు. వాటిలో ఒక గిరిజన కథ ‘‘నైజరు తేనే’’ దీని రచనా కాలం 1977.కథలో ప్రధాన పాత్రధారి కథకుడు కావడం ఒక విశేషం. దీని ద్వారా రచయితకు ఆదివాసి బిడ్డల మీద ఎలాంటి ప్రేమ ఉందో అర్థమవు తుంది. అనుభూతి ప్రధానమైన ఈకథలో గిరిజన జీవితాలు అవి కలుషితం చెందిన, చెండబోయే తీరు గురించి రచయిత కాంతారావు తన దైన బాధ్యతా యుతంగా ఆర్తితో అందంగా వెల్లడి చేస్తారు.
సుప్రసిద్ధ తెలుగు కథా రచయిత బలివాడ కాం తారావు (03-7-1927,06-05-2000) శ్రీకాకుళం జిల్లా మడపాం గ్రామంలో జన్మిం చారు కథారచయితగా సుమారు 400కథలు రాశారు. వారి కథల్లో కొన్ని గిరిజన జీవితాలకు అద్దం పట్టే కథలు ఉన్నాయి.వాటిలో ఒక రిజన కథ ‘‘నైజరు తేనే’’ దీని రచనా కాలం 1977వ సంవత్సరం.
కథలో ప్రధాన పాత్రధారి కథకుడు కావడం ఒక విశేషం.రచయిత తాను అనుభూతి చెందిన సంఘటనల సమాహారమే ఈకథ. దీని ద్వారా రచయితకు ఆదివాసి బిడ్డల మీద ఎలాంటి ప్రేమ ఉందో అర్థమవు తుంది.అనుభూతి ప్రధానమైన ఈకథలో గిరిజన జీవితాలు అవి కలుషితం చెందిన, చెండబోయే తీరు గురించి రచయిత కాంతారావు తన దైన బాధ్యతా యుతంగా ఆర్తితో అందంగా వెల్లడి చేస్తారు. భాష రీత్యా నాటి పలుచని గ్రాంథిక వాతావర ణం కనిపించిన, కథ ఆద్యంతంఉత్తమ పురుషలో కొనసాగడంతో పఠన సౌలభ్యం నిండుగా ఉందనిపి స్తోంది.అలాగే కథ పేరు కూడా ఆడబిడ్డలకు చెందిన ముఖ్యమైన అటవీఉత్పత్తిని ఎంపిక చేయడం, అందునా రచయితకు,అడవి బిడ్డల సంస్కృతిపట్ల ఆందోళనను కథ నామౌచిత్యంతో అన్వ యించి చెప్పడం మొదలైన లక్షణాలన్నీ రచయిత ప్రతిభ కు అద్దం పడతాయి.ఇక కథ విషయానికి వస్తే ఒకసంపన్న కుటుంబానికి చెంది న యువకుడు (రచయిత) తన తాతల నుండి తమ కుటుం బంలో జరిగిన సంఘట నలు గుర్తు చేసుకుం టూ తన ప్రయాణంలో పొందిన ఆనందపు పరవశంతో కథ ప్రారంభ మవుతుంది. నవం బరు నెల ఆఖరి వారంలో…. అంటే చక్కని సోయగాలతో ప్రకృతి అలరారే శీతాకాలపు వేళ,ఈ కథా నాయకుడు అడవి అందాలను ఆస్వాదిస్తూ చేసిన కారు ప్రయాణమే ఈ కథ ల్లోని ఇతివృత్తం.అందుకు ముందు పది సంవ త్సరాల క్రితం తాను మొదటిసారిగా ఈ అడవి మార్గం గుండా ప్రయాణిస్తుండగా పొద్దుగూకే వేళ రోడ్డు పక్క తన కారు చెడిపోవడం, అటుగా వెళుతున్న గిరిజన యువతి తనను చూడటం పడుచు యవ్వనంలోని అడవి బిడ్డ ‘‘పర్బతి’’ అందానికి కథకుడు తనకు తెలియ కుండానే ఆకర్షితుడు కావడం,అంతలోనే ఆ యువతి చేరువలోని తన గిరిజన గూడెం వెళ్ళే దారిలో కలిసిపోవడం జరుగుతుంది. కొద్ది సేపట్లో దేవుడు నుంచి 10మంది దాకా గిరిజ నులు కారు ఆగిన చోటికి రావడం అతనికి వారు మాట్లాడే భాష అర్ధం కాకపోయినా సైగల ద్వారా రాత్రి ఇక్కడ క్షేమం కాదని తమ గుడేనికి రమ్మని పిలిచినట్టు గ్రహిస్తాడు. వారితో కలిసిగూడెం బయలు దేరుతారు, ముందే అనుకున్న ప్రకారం డోలు సన్నాయి నాదస్వరం వాయిద్యాలతో తనకు ఎదురు వచ్చి బంతి పూల దండ వేసి అతనికి స్వాగతం పలికి నృత్యాలతో గూడెం తీసుకువెళతారు, వారి ఆచారం ప్రకారం ఆడామగా కలిసి గదబ నృత్యం చేస్తూ తమ గూడెం వచ్చిన అతిథికి మర్యాదలు చేస్తారు. గూడెం మధ్య మర్రిమాను వద్ద జరిగిన ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కథకుడు ఆరాత్రి గూడెం పెద్ద ఇంటి ముందు ఆతిథ్యం తీసుకుని ఆరాత్రి ఆనందం నిండిన సంతృప్తితో నిద్రపోతాడు. రాత్రి ఆగిరి జన గూడెం ‘‘చిక్కర పార’’లో ఆరుబయట వెన్నెల్లో అతడు పొందిన సంతృప్తి,ఆనందం, తన జీవి తంలో మరి ఎక్కడ దొరకలేదు. సంతృప్తికర రాత్రి నిద్ర అయ్యాక తెల్లవారి పొద్దున పనులు పూర్తి చేసుకోవడానికి ఆగూడెం నీటి ఆధారం చెరువుకు వెళ్లడంతో…. ముందు రోజు సందెకాడ రోడ్డుపక్క తనకు ఎదురైన యువతి నీళ్ల కుండతో కనిపిస్తుంది.అతడిలోని ఆర్తి చూపులు ఆమెకు అందాయి, మూగభాషలో నే గూడానికి ఓమూలనున్న తన ఇంటివైపు రమ్మని సైగల స్వాగతం పలకడంతో అందు కోసమే అన్నట్టు ఎదురు చూస్తున్నా అతని మనసు ఊయల లూగు తుంది,భూమికి పసుపు చీర పరిచినట్టు ఉన్న పసుపు పూల నైజర్‌ నూనె గింజల పంట చేనుకు గుండా నడుస్తున్న అతగాడి చిలిపి మనసు దారిలోనే ఒకసారి దాహం నటిస్తోంది!! తన భుజం మీది నీటి కుండ సాక్షిగా ఆమె అతడి దాహం తీరుస్తుంది. అందమైన అడవి దారి గుండా అంతే అందమైన అడవి యువతి నివాసపు పాకకు చేరిన వారి ప్రయాణం ఎలాంటి కల్మషం లేని స్వచ్ఛమైన అనురాగపు అనుబంధాన్ని పంచి రచయితకు జన్మకు సరిపడా అనుభూతి అందుతుంది.ఆ పడతి సీసాతో ఇచ్చిన ‘‘నైజరు తేనె ‘‘రుచి కూడ అంతే మధురాతి మధురంగా అతడి మనసుకు అల్లుకుపోయింది. అలా ఆనాటి మధుర స్మృతులు మూటగట్టుకుని పదేళ్ల తర్వాత అరమరికలు లేని అడది బిడ్డలతో కొన్నాళ్లు కలిసి ఉండి మనశ్శాంతి పొందాలనే ఆశయంతో అక్కడికి వచ్చిన అతడికి ఎదురైన చేదు అనుభవాలతో ఈ కథ ముగుస్తుంది. రచయితకు ఆడబిడ్డలకు ఆవహించిన ఆధునిక అసమానతలు పట్ల గల ఆవేదన అర్థమవు తుంది.పదేళ్ల తర్వాత అక్కడి అడవి బిడ్డలులో ఆధునిక జీవన విధానం కొట్టొచ్చినట్టు కనిపి స్తుంది. కొత్తగా వచ్చిన కరెంట్‌ వెలుగులు,మట్టి కుండల స్థానంలో స్టీల్‌ బిందెలు,పూరి గుడి సెలున్న చోట పెంకుటిళ్లు, వంటి మార్పులు చూసిన రచయిత ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. వారిలో అంతకు ముందు కాలం నాటి ఆత్మీయతలు అనుబంధాలు లేవు అంతా కృత్రిమత్వం, అభద్రత,రాత్రి గూడెంలో ట్యూబ్‌ లైట్‌ ల వెలుగులో సాగినవారి నృత్యంలో అంతా కృత్రి మత్వమే. అది ఏదో ఆశిస్తూ చేస్తున్న స్వార్ధతత్వం, అడుగడుగునా కనిపి స్తాయి. ఆరాత్రి గూడెంలో అతడు గదిలో నిద్రపోయినా నమ్మకం లేనట్టు ఎవరి ఇంటి తలుపులు వారు గడియలు పెట్టి బిగించు కున్నారు.అంతటా అభద్రతే ఆత్మీయతలు లేని ఆతిథ్యం,అతడిని తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. తెల్లవారి ఉన్న ఒక్క అనురాగపు ఆశకోసం చెరువు గట్టుకు వెళ్ళిన, అతనికి అందమైన మామిడి చెట్లు, నైజర్‌ పంటచేలు, కనిపించ లేదు.చెరువు నీళ్ళకు వచ్చిన వారి చేతుల్లో కుండలు లేవు ఇత్తడి బిందెలు, స్టీలు బిందెలు ఉన్నాయి, అక్కడి వారికి ఉపాధి ముసుగు వేసి కట్టబడ్డ విమానం కంపెనీ సాయంగా అక్కడి అడవి అందాలు అంతర్ధానం అయ్యి కాలుష్యపు మేఘాలు వారికి తెలియ కుండానే అడవికి,వారి జీవితాలకు ఆవహించాయి. ఇంత మారిన తన ఊహల సుందరి ‘‘ప్రేమ తునక’’ పర్బతిలో తాను తొలిసారి చూసిన స్వచ్ఛత ఉంటుందని ఆశ తో అటుగా అడుగులు వేసిన అతనికి పిల్లలకు పాలు పడుతున్న ఆమె కనిపించింది, ప్రేమ తాలూకు పరిమాణం తో సిగ్గుపడుతూ తన వైపు చూసిన, ఆమె పిల్లల్లో తెలియని భయం కోపపు చూపులు,ఆమె శరీరానికి కొత్తగా జాకెట్‌ వచ్చి చేరింది. ఆమె భర్త విమానం కంపెనీలో తోట మాలి మరి, నోరు తెరిచి తానే అడిగాడు ‘‘నైజరుతేనె’’ అని,ఇంట్లోకి వెళ్లి గాజుసీసాలో తేనె తెచ్చి అతని చేతికి అందించి ‘‘దాని విలువతే’’ అన్నట్లు చేయి చాపుతుంది. ఆ తేనె చుక్కలు నోట్లో వేసుకున్న అతడికి మధురం స్థానంలో చిరుచేదు అనిపిస్తుంది. పది రూపాయల నోటు ఆమె చేతికి అందించిన అతడికి భయంకరమైన పళ్ళతో ఆమె ముఖం కనిపిస్తుంది, మొదటిసారి అతని కళ్ళకి ఆమె జలపాతంల కనిపించింది. ఈ పదేళ్లకు ‘‘కుళ్లు కాలవలా’’ తయారయింది. గబగబ ఆ కృత్రిమ గూడెం నుంచి కదిలిపోయి రోడ్డు పక్కన గల తన కారు చెంతకు చేరేసరికి, ఓ పదిమంది గ్రామ పెద్దలు అతడిని వెంబడిరచారు… డబ్బులు ఇమ్మనే చేతులతో. అతడి మనసులో సుడులు తిరుగుతున్న కోపాన్ని దాచుకోలేక పర్సులోని డబ్బంతా కాగితపు ముక్కల్లా వాళ్ళ మీద చల్లి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో కథ ముగుస్తుంది. విభిన్నమైన కల్పితకథనమైన, అక్షరాల వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు అక్షరీకరించడంలో రచయిత బలివాడ కాంతారావు కృతార్థులయ్యారు.అందమైన అడవిబిడ్డల సంస్కృతి సాంప్ర దాయాలకు ఆధునికతతో కూడిన రక్షణ అత్యవసరం. కానీ ఆఅభివృద్ధి తాలూకు మార్పు వారిలోని అసలైన మనుగడకు చేటు రాన్నివ్వ రాదని ఆనాడు ‘‘బలివాడ’’ వారు ఆశించినదే ఈనాడు అందరూ ఆశిస్తున్నాము. ఆవిధంగానే అడవి బిడ్డల మనుగడ,అభివృద్ధి సాయంతో అంత రించి పోకూడదు,అని అందరం కోరు కుం దాం..చక్కని కథా వస్తువు ఎంత చక్కని శైలి అలవర్చిన రచయిత కథా కథనం అందరికీ ఆరోగ్యదాయకమైన విషయ విశేషం.

అటవీ సంరక్షణే పర్యావరణ పరిష్కారం!

పర్యావరణ పరిరక్షణలో అడవులది కీలకపాత్ర అనేది కాదనలేని వాస్తవం.పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా దేశవ్యాప్తంగాకోట్లాది రూపా యలు వెచ్చించి మొక్కలు నాటుతున్నారు. మరొక పక్క విచక్షణారహితంగాఅడవులను ధ్వంసం చేస్తు న్నారు.నాటుతున్న మొక్కల్లో ఎంత శాతంపెరిగి పెద్దవవుతున్నాయో చెప్పలేం కాని ఊహించని రీతి లో అడవుల్లోని భారీ వృక్షాలనుసైతం కూల్చివేసి తరలిస్తున్నారు. అటవీసంపద హరించుకుపోతున్న తీరుపట్ల ఆందోళన వ్యక్తమవ్ఞతున్నది.దేశంలో సగ టున రోజుకుదాదాపు 300ఎకరాలకు పైగా అటవీ భూమి అదృశ్యమైపోతున్నదని గతంలో అటవీ మంత్రిత్వశాఖ వెల్లండిరచిన నివేదికల్లో స్పష్ట మైంది. బొగ్గుగనులు, ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు, పరిశ్రమలు, నదిలోయ ప్రాజెక్టులకోసం అడవులను నరికివేస్తున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌, జార?ండ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర తదితరరాష్ట్రాల్లో ఇతర ప్రయోజనాలకు కూడా భూములను ఉపయోగించు కుంటున్నారు.తెలుగురాష్ట్రాలకు సంబంధించి ఖమ్మం,వరంగల్‌,అదిలాబాద్‌,కరీంనగర్‌ తది తర జిల్లాల్లో వేలాదిఎకరాలు అటవీభూమి అన్యాక్రాంత మైనట్లు అటవీశాఖ అధికారుల రికార్డులు వెల్లడిస్తు న్నాయి.భారత అటవీ సర్వే(ఎఫ్‌ఎస్‌ఐ)సంస్థ గతంలో విడుదల చేసిన ద్వైవార్షిక నివేదిక ప్రకా రం దేశంలో దాదాపు ఏడు లక్షల చదరపు కిలోమీ టర్ల విస్తీర్ణంలో అడువులు ఉన్నాయి.పర్యావరణ జీవావరణ పరిరక్షణతోపాటు ఆర్థిక, సామాజిక జీవన వ్యవస్థలకు అడవులు ఆలంబనగా నిలుస్తు న్నాయి. భూసారాన్ని కాపాడడమేకాకుండా తుపా నులు,వరదలులాంటి దుష్ఫ్రభావాలను అడ్డుకో వడంలో వాటిపాత్ర విస్మరించలేనిది. కోస్తాప్రాం తాల్లో భూమి కోసుకపోకుండా కూడా అడవులు కాపాడుతున్నాయి. భూతాపానికి కారణమయ్యే గ్రీన్‌హౌస్‌వాయువులువాతా వరణంలోకి పెద్ద ఎత్తున విడుదల కాకుండా నిరోధించే శక్తి అడవు లకు ఉంది. బొగ్గుపులుసువాయువు పీల్చుకొని స్వచ్ఛమైన ప్రాణవాయువు అందించడం ద్వారా ఎప్పటి కప్పుడు కొత్తఊపిరులు పోస్తున్నాయి.ప్రపంచ వ్యాప్తంగా160కోట్ల మందికిపైగా ఆవాసం, రక్షణ, జీవనోపాధి కోసం అడవుల మీదనే ఆధారపడు తున్నారు. అభివృద్ధిచెందు తున్నదేశాల్లో ఇంధన వనరులు, పారిశ్రామిక అవసరాల కోసం అటవీ ఉత్పత్తులను వినియోగించుకుంటున్నారు.కొన్ని లక్షలకోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నది. అటవీఉత్పత్తుల ఔషధ ఆరోగ్యపరమైన ప్రయోజ నాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు వాటి విలువ అంచనాలకు అందదు. అందుకే మానవ నాగరికత వికాసంలో అడవుల పాత్ర అత్యంత కీలకమైందని ఏనాటి నుంచో పెద్దలు చెప్తున్నారు. సింధునాగరికత అంతరించి పోవడా నికి ప్రధానకారణాల్లో అటవీ ప్రాధాన్యతను గుర్తించకపో వడమేనని చరిత్రకా రులు స్పష్టం చేస్తున్నారు. అడవులు రానురాను అదృశ్యమైపోతుండడం వల్లనే ప్రకృతి బీభత్సవాలు పెరిగిపోతున్నాయనేది వాతావరణ శాస్త్రజ్ఞుల అభిప్రాయం. తరుచగా వస్తున్న వరదలు, అందు వల్ల జరుగుతున్న బీభత్సం, మరొకపక్క కరువుకాట కాలు కూడా ఈ అడవుల విధ్వంసం వల్లనే జరుగు తున్నదనేది కాదనలేని వాస్తవం. ఇంత జరుగు తున్నా పాలకులు ప్రకటనలతో సరిపెడుతున్నారు తప్ప నిర్దిష్టమైనచర్యలు తీసుకొనలేకపోతున్నారు. అంతెందుకు ప్రపంచంలోనే అత్యంత అరుదైన, విలువైన ఎర్రచందం చెట్లను నరికి విదే శాలకు స్మగ్లింగ్‌ చేయకుండా నిరోధించలేకపోతున్నారు. వందలాది మంది పోలీసులను పెట్టినా చివరకు కాల్పులు జరిపినా ఈస్మగ్లింగ్‌ ఆగడం లేదు. ఇక చెట్లను పెంచే కార్యక్రమం అంతంత మాత్రం గానే ఉన్నది. కాగి తాలపై ఉన్న చెట్లెన్ని క్షేత్రస్థాయి లో అందులో ఎన్ని ఉన్నాయో పరిశీలిస్తే ఆశ్చర్యకర మైన దృశ్యాలు వెలుగులోకి వస్తాయి. ప్రభుత్వం కూడా చెట్ల పెంపకంలో ఒకనిర్దిష్ట విధానాన్ని ఎంపిక చేసుకోవాలి. స్విట్జర్లాండ్‌ లాంటిదేశాల్లో ఇంట్లో పెరటి మొక్కలు పెంచుకునేందుకు ముందుకొస్తేతప్ప ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వ డంలేదు.భూటాన్‌,నేపాల్‌,గాంభియా,తదితర దేశా ల్లో అటవీరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ఆదర్శంగానిలుస్తున్నాయి. బిడ్డ పుట్టినప్పుడల్లా ఒక మొక్క నాట డాన్ని ఫ్రాన్స్‌ ప్రోత్సహిస్తున్నది. భారత రాజ్యాంగంలోని 51ఎ(జి) అధికరణ ప్రకారం అడవ్ఞలు,వన్యప్రాణులు సహా ప్రకృతి సంపదను పరిర క్షించడం,అభివృద్ధిపరచడం ప్రతిపౌరుడి కర్తవ్యం. అడవులు అంతరిస్తున్నబట్టే వన్యప్రాణులు అరణ్యాలు వదిలి జనారణ్యంలోకి ప్రవేశించడం ఆందోళన కలిగించేఅంశం. అడవులు వన్యప్రా ణాన్ని కాపాడటానికి భారత ప్రభుత్వం కృషి చేయా లని 48(ఎ)అధికరణ స్పష్టం చేస్తున్నది. న్యాయ స్థానాలు కూడా అటవీభూమి సంపద విషయాల్లో ఎన్నోసార్లు ఆదేశాలుజారీచేశాయి. భారత ప్రభు త్వం కూడా అడవుల అభివృద్ధికి వేలాదికోట్లు వెచ్చించాలని నిర్ణయించింది. కానీ ఆచరణకు వచ్చేసరికి అది అంతంత మాత్రంగానే ఉన్నది. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరవాలి. అడవుల పెంపకం, పరిరక్షణ, ప్రోత్సాహంతో పాటు హరిత, ఆర్థిక వ్యవస్థను పెంపొందించేలా పరి శ్రమలకు గట్టి నిబంధనలను విధించాలి. అటవీ విధ్వం సానికి దారితీస్తూ వన్యప్రాణుల మనుగడను ప్రశ్నార్థకంగా చేస్తున్న స్మగ్లర్ల విషయంలో ఉక్కు పాదం మోపాలి. అటవీ సంరక్షణలో రాజకీయా లకు అతీతంగా అన్ని పార్టీల నేతలు ఆలోచిం చాలి. స్వచ్ఛంద సంస్థలను ఇందులో భాగస్వాము లను చేయాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.– జి.ఎన్‌.వి.సతీష్‌

లౌకికవాద పటిష్టత – గణతంత్ర పరిరక్షణ

భారత స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించి, రాజ్యాంగాన్ని రూపొందించిన మేథావులకు భారతదేశంలోని బహుళ మతాల, బహుళ సంస్కృతుల లక్షణాలు మరియు భారతదేశం యొక్క సామాజిక నిర్మాణంలో ఉన్న సంక్లిష్టతల గురించి చాలా లోతైన అవగాహన ఉంది. దేశాన్ని ఐక్యంగా ఉంచ డానికి గాను గణతంత్రం యొక్క ప్రాథమిక సూత్రంగా లౌకికతత్వాన్ని ఎంపిక చేశారు. ఒకవేళ లౌకికతత్వాన్ని ఉనికిలో లేకుండా తిరస్కరిస్తే, కష్టపడి సాధించుకున్న దేశ ఐక్యతకు ముప్పు వాటిల్లుతుందనే వాస్తవాన్ని విజ్ఞులైన ప్రజలు తెలుసుకోవాలి. లౌకికతత్వాన్ని బలోపేతం చేసి, గణతంత్రాన్ని కాపాడాల్సిన దేశభక్తియుతమైన బాధ్యత ప్రతీ పౌరునిపై ఉంది.
కర్ణాటక హైకోర్టు హిజాబ్‌ సమస్యను పరిష్కరించలేక పోయింది. పైగా హైకోర్టు ఇచ్చిన తీర్పు హిజాబ్‌ ధరించే ఉడిపి కళాశాల విద్యార్థినులను మరింత రెచ్చగొట్టే విధంగా ఉంది. కోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ వారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు తీర్పు చాలా టెక్నికల్‌గా ఉంది. అది ఒక దరఖాస్తు మాదిరిగా, ఇతరుల వాదనను తిరస్కరించే విధంగా, మోసం చేయాలనే ఆత్రుతతో ఉన్న ట్లుంది. వాదన సరిగా లేదని పేర్కొనడం ద్వారా… ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నాయనే అభ్యర్థనను కొట్టివేసే స్థితికి ఈ అసాధారణ ఆత్రుత వెళ్ళింది. ఈ హిజాబ్‌ సమస్య రాజకీయపరమైనది, రాజ్యాంగ పరమైనది కూడా. దేశ సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగపరమైన కోణంలో పరిశీలించి,ఈ సమస్య పరిష్కారానికి తగిన తీర్పు ఇస్తుందని ఆశించవచ్చు. కానీ హిజాబ్‌ సమస్యకు సంబంధించిన రాజకీయ దృష్టి కోణం…చాలా కాలంగా భారతీయ సమా జాన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆకస్మి కంగా బయటకు వచ్చిన ఈ సమస్య, జారిటీ మతస్థులలో అంతర్గతంగా గూడుకట్టుకున్న అసహనాన్ని ప్రతిబింబి స్తుందన్న వాస్తవాన్ని వెల్లడిరచడానికి గొప్ప పరిశోధనలు చేయాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఉత్తర భారతదేశంలో హిందూ, సిక్కు మహిళలు పెళ్ళిళ్ళు, అంత్యక్రియలు, మతపరమైన వేడుకలు వంటి ముఖ్యమైన సందర్భాలలో తల కనిపించకుండా ముసుగు ధరిస్తారు. వీధుల్లోకి వచ్చి, ఒకరినొకరు ఘర్షణ పడడానికి ఓచిన్న గుడ్డ ముక్క చాలు. అది భారతీయ సమాజంలో సంభవించిన మార్పుకు ఒక కొలమానంగా మారింది. ఇలాంటి అసహన వాతావరణంలో, సాంప్రదాయ బద్ధమైన సహనం, బహుళత్వం, ఉదారబుద్ధి లాంటి వాదనలు విడ్డూరంగా కనిపిస్తాయి.
నైతిక చట్రం
కానీ, ప్రపంచం లోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించి,ఒక స్నేహపూర్వక వాతావరణంలో,శాంతియు తంగా కొన్ని లక్షలాది సంవత్సరాలపాటు జీవించడానికి అనుమతించిన ఘన చరిత్ర భారతదేశానికి వుందన్న మాట వాస్తవం. అన్య మతస్థులను తమ మతం లోకి మార్చే చర్యలు మద్దతుదారులను పెంచింది కానీ, వారు అధిక సంఖ్యాక మతస్థులకు ఎటువంటి సవాలుగా, సమస్యగా తయారవలేదు. బుద్ధుని కారణంగానే ఇతర మతాలకు చెందిన వారి విశ్వాసాల పట్ల సహనం, తోటి మానవుల పట్ల సానుభూతి భారతీయ సాంప్రదాయాల్లో అంతర్భాగంగా మారాయి. ఆయనే భారతదేశానికి ఓ నైతిక చట్రాన్ని అందించాడు. ఆ చట్రంలోనే తోటి మానవులతో మన సంబంధాలు, భావనలు రూపుదిద్దుకుంటాయి. నేడు సంభవిస్తున్న మార్పులు ఆ నైతిక చట్రానికి అవతలనే జరుగుతున్నాయి. మనకు బుద్ధుడు వారసత్వంగా అందించిన గొప్ప జ్ఞానాన్ని అసాధారణ ప్రతీకారంతో వృధా చేస్తున్నారు. భారత రాజ్యాంగం ఆ నైతిక చట్రం యొక్క విధానాన్ని భారతదేశ పరిపాలన కోసం ఆమోదించింది. ఆధునిక యూరప్‌ పునరుజ్జీవ నానికి ఉన్న విధంగానే, సమానత్వం, సమ న్యాయం, సౌభ్రాతృత్వం అనే సూత్రాలు బౌద్ధ సాంప్రదాయాల్లో ఒక భాగంగా ఉన్నాయి. వాస్తవంగా భారతదేశ భవిష్యత్తు, చారిత్రక అనివార్యత (నెహ్రూ, అంబేద్కర్‌ లాంటి గొప్ప నాయకులు రూపొందించిన ఆధునిక దేశ భావాలు) బౌద్ధ మతం యొక్క నైతిక సాంప్రదాయాల్లో, ఆధునిక ప్రపంచ సమానత్వపు ప్రేరణల మూలాల్లో ఉన్నాయి. ఆ విధంగా భారత రాజ్యాంగం ఒకవైపు మత స్వేచ్ఛ, మనస్సాక్షి స్వేచ్ఛ కోసం…మరోవైపు దేశ పాలన కోసం లౌకికతత్వాన్ని సమకూర్చింది. భారతదేశంలో లౌకికతత్వం అంటే అన్ని మతాల పట్ల సమాన గౌరవాన్ని కలిగి ఉండడం అని అనేక మంది చాలా తీవ్రంగా వాదిస్తారు. ఈ తప్పుడు అవగాహనే పాలకులు (మతపరమైన ప్రత్యేక దుస్తులు ధరించి, బహిరంగంగా మతాచారాలను పాటిస్తూ) మతపరమైన ఉత్సవాలకు హాజరయ్యే పరిస్థితులకు దారితీసింది. ఇవి వాస్తవానికి, తమ మత విశ్వాసాలతో ఆచరించే సాంప్రదాయాల కంటే కూడా, ఆ పేరుతో ప్రజలను ఆకట్టుకొని…తద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందే చర్యలని చెప్పవచ్చు.
విభజన
భారత రాజ్యాంగంలో కూడా యూరప్‌లో వలే రాజ్యం నుండి మతాన్ని వేరు చేసే ఒక విభజన రేఖ ఉన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి, యూరప్‌ పునరుజ్జీవన చరిత్రలో ఈ విభజన ఒక ప్రధానమైన పరిణామం. రాజ్యానికి మతం లేదనేది భారత లౌకికతత్వం యొక్క ముఖ్య సారం. ఇది రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 27,28లలో స్పష్టంగా ఉంది. ఏదైనా ఒక మతాన్ని ప్రోత్సహించడానికి ఎటువంటి పన్నులు విధించకూడదని ఆర్టికల్‌ 27చెపుతుంది. అంటే ఏ మతానికి అనుకూలంగా ప్రభుత్వ ఆదాయాన్ని ఖర్చు చేయడానికి అనుమతి లేదు. ప్రభుత్వ నిధులతో నిర్వహించబడుతున్న ఏ విద్యా సంస్థలలో ఎటువంటి మతపరమైన నిబంధనలు పాటించాలని ఆదేశించకూడదని ఆర్టికల్‌ 28 చెపుతుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన లేదా ప్రభుత్వ సహకారంతో నిర్వహించబడుతున్న ఏ విద్యా సంస్థ కూడా మతపరమైన తరగతులకు లేదా ఆరాధనా కార్యక్రమాలకు హాజరు కావాలని ఎవ్వరినీ ఒత్తిడి చేయకూడదని కూడా ఆర్టికల్‌ 28 చెపుతుంది. మతపరమైన ఆచారాలకు సంబంధించిన లౌకిక కార్యక్రమాలను క్రమబద్ధీకరించే అధికారాన్ని ఆర్టికల్‌ 25(2)(ఏ) ప్రభుత్వానికి ఇస్తుంది. మతం పేరుతో ఏవిధ మైన వివక్షతనైనా ఆర్టికల్‌ 15 నిషేధిస్తుంది. అన్నిటినీ మించి మత స్వేచ్ఛ ఇతర ప్రాథమిక హక్కులకు లోబడి ఉండేట్లు చేస్తారు. ఆ విధం గా మన రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ కూడా చట్టం ముందు సమానత్వం, వివక్షతకు గురికాకపోవడం, జీవించే హక్కు, స్వేచ్ఛగా ఉండే హక్కు లాంటి లౌకిక హక్కుల వలె అమలుకు నోచుకోవడం లేదు.పై అంశాలను దష్టిలో ఉంచుకొని, రాజ్యానికి మతం ఉండదనే నియమం ఆధారంగా భారత రాజ్యాంగంలో లౌకికతత్వాన్ని పొందుపరచారని స్పష్టం అవుతుంది. భారత రాజ్యం ఈ ప్రాథమిక సూత్రం ఆధారంగా నిర్వహించబడుతుంది. ఇందిర-నెహ్రూ-గాంధీ వర్సెస్‌ శ్రీరాజ్‌ నారాయణ్‌ అండ్‌ ఏఎన్నార్‌ కేసు విషయంలో ‘’రాజ్యానికి తనకంటూ స్వంతంగా ఎటువంటి మతాన్ని కలిగి ఉండదని’’ భారత సర్వోన్నత న్యాయస్థానం పునరుద్ఘాటించింది.
ప్రజా జీవితంలో మత దురహంకారం
భారతదేశంలో, ప్రజా జీవితంలో తీవ్రమైన మత దురహంకారం కనపడుతుంది. కాబట్టి, మనం చాలా సౌకర్యంగా లౌకికతత్వం యొక్క అర్థాన్ని ‘సర్వ ధర్మ సమభావం’గా మార్చు కున్నాం. ఇది కేవలం అధిక సంఖ్యాకుల ఆధిపత్యానికి దారితీసి, చివరకు మత ప్రాతి పదిక గల రాజ్యం ఏర్పడుతుంది.‘సమ భావం’ అనే భావన వాస్తవానికి నేటి భారతీయ సమా జంలో లేదు. మత ప్రాతిపదికన ఏర్పడిన రాజ్యం,దేశ పతనానికి హామీ ఇస్తుంది.సుమారు 20కోట్ల అల్ప సంఖ్యాక ప్రజలున్న భారత దేశంలో అనేక మతాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. భారత ప్రభుత్వం, దేశంలో ఆరు అల్ప సంఖ్యాక మతాలను గుర్తించింది. కాబట్టి మత ప్రాతిపదికన ఏర్పడిన రాజ్యంలో అధిక సంఖ్యాకుల మతమే రాజ్య మతంగా ఉండడం అనేది ఆచరణ సాధ్యం కాని ప్రతిపాదన.భారతదేశంలో మత ప్రాతిపదికన రాజ్యం ఏర్పాటు అసాధ్యమని చెప్పే మరొక కీలకమైన అంశం ఏమంటే, అధిక సంఖ్యాకుల మతం ఒక సంక్లిష్టమైన, అసమానతలతో కూడిన శ్రేణీగత వ్యవస్థ. అంతేగాక అణచి వేతతో కూడిన సామాజిక నిర్మాణాన్ని కలిగి ఉంది. మత రాజ్యం, మత సూత్రాల ఆధారం గా పని చేస్తుంది. అంటే భారతదేశంలో అయితే ధర్మ శాస్త్రాల ప్రకారం ఒక ప్రత్యేకమైన కులం మాత్రమే పాలించే హక్కును కలిగి ఉంటుంది. అధిక సంఖ్యాక ప్రజలకు అధికారం లో పాలుపంచుకునే హక్కు ఉండదు. వారికి మానవ హక్కులు ఉండవు. అణచివేతకు, అన్యాయానికి వారు శాశ్వత బాధితులుగా ఉంటారు. మత ప్రాతిపదికన ఏర్పడే రాజ్యం మత గ్రంథాలపై ఆధారపడుతుంది. అంటే, భారతదేశంలో రాజ్యం సమానత్వాన్ని, సమాన రక్షణను నిరాకరిస్తుంది. కుల ప్రాతిపదికన వివక్షతను ప్రదర్శిస్తుంది. ఇది శాశ్వత వైరుధ్యా లకు, సమాజ పతనానికి దారితీస్తుంది. కాబట్టి, ఒక దేశంగా భారతదేశం, మతం లేని రాజ్యం గా, ఏ మతాన్ని ప్రోత్సహించని లౌకిక రాజ్యం గానే ఉనికిలో కొనసాగుతుందనే ఒక అనివా ర్యమైన నిర్ధారణకు వస్తాం. విద్యా వంతులైన భారతీయులు లౌకిక వాద్వాన్ని ఎగతాళి చేసి మాట్లాడుతూ, అధిక సంఖ్యాకుల మతం ఆధారంగా ఏర్పడే మతరాజ్య భావనను బలపర్చడమనేది అనాలోచిత చర్య తప్ప మరొకటి కాదు. వారి మానసిక స్థితి నేటి మత రాజకీయ అల్లరిమూకల ఆర్భాటపు ప్రచా రాలతో రూపొందించబడుతుంది. భారత స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించి, రాజ్యాంగాన్ని రూపొందించిన మేథావులకు భారతదేశం లోని బహుళ మతాల, బహుళ సంస్కృతుల లక్షణాలు మరియు భారతదేశం యొక్క సామాజిక నిర్మాణంలో ఉన్న సంక్లిష్టతల గురించి చాలా లోతైన అవగాహన ఉంది. దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి గాను గణతంత్రం యొక్క ప్రాథమిక సూత్రంగా లౌకికతత్వాన్ని ఎంపిక చేశారు. ఒకవేళ లౌకికతత్వాన్ని ఉనికిలో లేకుండా తిరస్కరిస్తే, కష్టపడి సాధించుకున్న దేశ ఐక్యతకు ముప్పు వాటిల్లుతుందనే వాస్తవాన్ని విజ్ఞులైన ప్రజలు తెలుసుకోవాలి. లౌకికతత్వాన్ని బలోపేతం చేసి, గణతంత్రాన్ని కాపాడాల్సిన దేశభక్తియుతమైన బాధ్యత ప్రతీ పౌరునిది. భారత స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించి, రాజ్యాం గాన్ని రూపొందించిన మేథావులకు భారత దేశంలోని బహుళ మతాల, బహుళ సంస్కృ తుల లక్షణాలు మరియు భారతదేశం యొక్క సామాజిక నిర్మాణంలో ఉన్న సంక్లిష్టతల గురించి చాలా లోతైన అవగాహన ఉంది. దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి గాను గణతంత్రం యొక్క ప్రాథమిక సూత్రంగా లౌకికతత్వాన్ని ఎంపిక చేశారు. ఒకవేళ లౌకికతత్వాన్ని ఉనికిలో లేకుండా తిరస్కరిస్తే, కష్టపడి సాధించుకున్న దేశ ఐక్యతకు ముప్పు వాటిల్లుతుందనే వాస్తవాన్ని విజ్ఞులైన ప్రజలు తెలుసుకోవాలి. లౌకికతత్వాన్ని బలోపేతం చేసి, గణతంత్రాన్ని కాపాడాల్సిన దేశభక్తియుతమైన బాధ్యత ప్రతీ పౌరునిపై ఉంది.- (పి.డి.టి.ఆచారి)

1 2