విశాఖ ఏజెన్సీలో కాల్సైట్‌ లీజుల కలకలం

‘‘ విశాఖ జిల్లా మన్యప్రాంతం విశాలమైన అడవులతో విస్తరించుకున్న ప్రాంతం. వ్యవసాయం,అటవీ ఉత్పత్తులే ఇక్కడ ఆదివాసీల జీవనాధారం. నిరక్షరాస్యత, అనారోగ్యం,అజ్ఞానం,ఆర్ధికదోపిడి,కనీస సౌకర్యాలలేమి వారు నిత్యం ఎదుర్కొనే సమస్యలు. వీటి కారణంగా గిరిజనులు తమ భూములు,వనరులను కాపాడుకోలేక పోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో, గిరిజనుల్లో తమ హక్కులపట్ల చైతన్యం కలిగించి ప్రభుత్వం గిరిజనేతరుల దోపిడీని ప్రతిఘటించే విధంగా వారిని సమీకరించడంపై ‘సమత’ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ఈనేపథ్యంతోనే గత 30 ఏళ్ళ నుంచి రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలు పరిధిలోకి వచ్చే ఆదివాసీ ప్రజల సమస్యలు,వనరులు, పర్యావరణ పరిరక్షణ,వారి హక్కులను కాపాడుతూ పోరాటం సాగిస్తోంది. స్థానికులైన గిరిజనల భూములు, అన్యాక్రాంతం కాకుండా ఈ షెడ్యూలు రక్షణ కల్పిస్తుంది. అయినా రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖ జిల్లా ఏజెన్సీలో చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా గిరిజనేతరులు గిరిజన భూములను ఆక్రమించుకోవడం ఆగలేదు ’’

విశాఖ మన్యంలో మైనింగ్‌తవ్వకాలపై మరోమారు కలకలం రేపుతోంది. జిల్లాలోని అనం తగిరి మండలం వలాసీ పంచాయితీ పరిధి మారు మూల లోతట్టు గ్రామాలైన కరకవలస,రాళ్లవలస, నిమ్మలపాడులో కాల్సైట్‌ మైనింగ్‌ తవ్వకాల కోసం ప్రభుత్వం ఇచ్చిన లీజులపై అప్రాంత గిరిజన ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన లీజులు తక్షణమే రద్దు చేసి స్థానిక గిరిజన సొసైటీలకే మై నింగ్‌ లీజులు అప్పగించాలంటూ గిరిజన ప్రజలు మళ్లీ ఉద్యమానికి తెర లేపనున్నారు. గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన చట్టాలను బాధ్యతాయతం గా అమలు పర్చవలసిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తుతుంది. మైనింగ్‌ లీజులకు గ్రామసభ తీర్మాణం లేదు.సమతజెడ్జిమెంట్‌,పీసాచట్టం, అటవీహక్కుల చట్టం, నియమగిరి జడ్జెమెంట్‌ వంటి గిరిజనులకు రక్షణగా ఉన్న రాజ్యాంగబద్దమైన చట్టా లను వ్యతిరేకించి..మైనింగ్‌ లీజులు ఇవ్వడంపై గిరిజన ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.         ఆదివాసుల హక్కులు,మైనింగ్‌ తవ్వకా లపై పూర్వంనుంచి సమత పలు ఉద్యమాలు చేపట్టి సుప్రీం కోర్టులో కేసు వేసి విజయం సాధించడం జరిగింది. ఫలితంగా సుప్రీం కోర్టు ఇచ్చిన సమత తీర్పును గౌరవించి అమలు చేయాల్సిన ప్రభుత్వం, అధికార యంత్రాంగాలు కంచెచేనుమేసే చందంగా వ్యవహరింస్తోంది. ఈప్రాంతంలో నాటికి నేటికీ గిరిజన ప్రజల స్థితిగతులు ఏమాత్రం మారలేదు. నేటికీ అన్యాయాలకు,అమయకత్వానికి గురవుతునే ఉన్నారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని మళ్లీ ప్రాంతంలో మైనింగ్‌ తవ్వకాలకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. 

సమత ఉద్యమ నేపథ్యం
ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాలు రాజ్యాంగంలోని ఐదవషెడ్యూల్‌ పరిధిలోకి వస్తా యి. స్థానికులైన గిరిజనుల భూములు అన్యా క్రాం తం కాకుండా ఈషెడ్యూలు రక్షణ కల్పిస్తుంది. గిరిజనుల భూమిని గిరిజనేతరులు స్వాధీనం చేసుకో కుండా భూమి బదిలీ నిబంధనలు నిరోధిస్తాయి. అయినా రాష్ట్రంలో చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా గిరిజనేతరులు గిరిజన భూములను ఆక్రమించుకోవడం ఆగలేదు. గిరిజనేతర భూస్వా ములు,వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి గిరిజనుల భూమిని విడిపించడానికి సమత, గిరిజ నులు నిరసనవంటి అన్ని ప్రజాస్వామ్య ఆందోళనా పద్దతులను అనుసరించింది. గిరిజనులకు బెయిలు కోసమో,షెడ్యూలు ప్రాంతాల చట్టాలను అమలు చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయడానికిగాని సమత అనేక సార్లు కోర్టు గడపతొక్కవలసి వచ్చింది.

Read more

కొండఫలం

భూమిమీద పుట్టిన ప్రతిజీవికి, భూమితో విడదీయరాని సంబంధం ఉంటుంది. అదే అడవి బిడ్డలకైతే!! ఆబంధంమరింత బలంగా ఉంటుంది. వారి బ్రతుకు బండికి జీవ నాధారమైన పంట భూములద్వారా ఆదివాసీలు అనుభవిస్తున్న ఇబ్బం దులు కథావస్తువుగా చేసుకుని ప్రముఖ కథా రచయిత్రి‘వాడ్రేవు వీరలక్ష్మిదేవి’రాసిన కథ‘కొండ ఫలం’.రచయిత్రి బాల్య అనుభవాలనుంచి,ఉద్యోగ రీత్యా,తూర్పు గోదావరి జిల్లా శరభవరం, కాకర పాడు,కొయ్యూరు,గిరిజనప్రాంతాల్లో గడిపిన జీవ నం నుంచి నేర్చు కున్న ప్రత్యక్ష అనుభవపాఠాల సారమే ఈ కథ. రచనా కాలం 1999. ఈమె తండ్రి గిరిజనగ్రామాల్లో కరణీ యకం వృత్తిచేయుడం,నిత్యం అక్కడి గిరిజ నులు, గిరిజనేతరులు,పేదలు,మధ్య జరిగే భూవివాదా లను ప్రత్యక్షంగా చూశారు. ఆయా సంఘటనల ద్వారా తమ భూములను కోల్పోవడం రాజ్యాంగం కల్పించిన రక్షణ చట్టాలున్నా సరే విలువైన ఆస్తులు ఎలా కోల్పోతున్నారో, వివరించారు. ప్రభుత్వాధి కారులు చేసేఅవినీతి,గిరిజన చట్టాలు ఈ సమస్యను మరింత తీవ్రతరం ఎలా చేస్తున్నాయో రచయిత్రి వెల్లడిస్తారు. భూ సమస్యల్లో ఆదివాసీ మహిళలు అనుభవిస్తున్న అగచాట్ల గురించి, కళ్ళకుకట్టినట్టు చెప్పడంలో శతశాతం విజయం సాధించారు. రచయిత్రి మిత్రురాలు యూనివర్సిటీ రీడర్‌ పద్మిని, గిరిజన సమస్యల మీదపరిశోధన చేసింది. ప్రస్తు తం గిరిజన భూసమస్యల మీదప్రాజెక్టు పరిశోధన చేయడం కోసం ఆమె నివసిస్తున్న ప్రాంతానికి తను రాకతో కథప్రారంభమై చివరికి సమస్య పరిష్కా రానికి గిరిజనస్త్రీ విద్యా వంతురాలు కావడమే మార్గమని పరిశోధకురాలు భావించడం తో ముగు స్తుంది.కథఆసాంతం చదివింప చేస్తూ పాఠకులను అడవి అందాలగుండా నడిపించి..అనిర్వచనీ యమైన అనుభూతిని అందిచారు. ఇక కథలోకి వెళితే…!! రచయిత్రి పొద్దున్న పనుల్లో ఉండగా ఏడుపు మొహంతో అక్కడకు చేరిన ‘కొండకాపు యువతి’సీతాలు తనకు జరగ బోతు న్న ప్రమాదం తాలూకు కోర్టువారిచ్చిన నోటీసు తనకు చూపించ వచ్చింది. ఆ గిరిజన గూడెంలో గంగరాజు అనే గిరిజనేతర యువ కునితో కలసి కాపురం చేస్తూ చిన్న హోటల్‌ నడుపుతుంది. రోజువారీ వచ్చే కొద్దిపాటి ఆదాయంతో బ్రతుకు బండి నడుపు కుంటుంది సీతాలు.సర్కారు వారు ఉచితంగా ఇచ్చే ఐదుఎకరాల భూమిని తన కులం సాయంగా పొం దిన ఆమె,భర్త సాయంతో దానిలో జీడిమామిడి పంట సాగు చేస్తూ.. భావి ఖర్చులకు ధనం కూడా పెట్టు కుంటుంది. కానీ సర్కారు వారుఇచ్చిన భూమి అసలు యజ మాని దళితవాడకు చెందిన ఫకీర్‌ రావు,అతను పెట్టుకున్న అర్జీతో ఆభూమిని తిరిగి అతనికే అప్పజెప్పనున్నట్టు, సీతాలుకు ‘గిరిజనకోర్టు వారి చ్చిన నోటీసు’ సారాంశం. సాగుకు పనికిరాని ఆభూమిని సీతాలు దంపతులు రెక్కలకష్టంతో ఒక దారికితెచ్చి జీడిమామిడిపంట సాగుతోదాని ఖరీదు పెంచుకుని సంతోషిస్తున్న వేళ,ఇప్పుడు పిడుగు లాంటి ఈ సంఘటన. గిరిజన గ్రామంలో టీచరుగ పనిచేస్తున్న రచయిత్రికి తన ప్రాంతంలోని గిరిజను లకు సాయపడటం,సలహాలు ఇవ్వటం,నిత్యకృ త్యం అందులో భాగంగానే సీతాలు ఇప్పుడు అక్కడికి వచ్చింది.బాధలోగల సీతాలును ఓదార్చి‘నీభూ మికి వచ్చిన ఇబ్బంది ఏమీలేదు, కోర్టుకు పోయి ‘స్టే’ తెచ్చుకోవచ్చు. అంటూ ఆమెకు సలహా ఇచ్చి ధైర్యం చెబుతుంది టీచరు. తను అక్కడి గిరిజను లతో ఎంతో చనువుగా ఉండేది. ముఖ్యంగా మహి ళల పట్ల అక్కడి వారంతా ఆర్థికంగా చితికి పోయి న, ఆచారాలు సాంప్రదాయాలు వదలలేక, అష్ట కష్టాలు పడేవారు. వారిఅమాయకత్వానికి రచయిత్రి టీచర్‌ జాలిపడేది. తాను ఆగ్రామానికి వచ్చిన కొత్తలో అక్కడి వారి పనులు, అలవాట్లు, చూసి ఆశ్చర్య పడిన, తరువాత తర్వాత అలవాటుపడి, తాను వారిలో ఒకటిగా ఉండడం, వాళ్ళ పెళ్లిళ్లకు అతిథిగా వెళ్ళటం చేసేది, అక్కడి గిరిజనుల పెళ్లిల్లలో పెద్ద వయసు వధూవరులు, పేరంటం అనబడే బట్టలు, వస్తువులు, బంగారం వెండి, నగల ప్రదర్శన అమ్మాయికి ఇంటివారు తినడం మానేసి అయినా బలవర్ధక ఆహారం పెట్టడం
వల్ల, వారి పెళ్లిల్లలో పెళ్లికూతుర్లు బలిష్టంగా కనిపించడం, మొదలైన ఆచారాలన్నీ అక్కడి గిరిజనులకు మాత్రమే సొంతమైనవిగా రచయిత్రి స్వీయ అనుభవం రంగరించి అందంగా చెప్పారు.
కానీ మరో విచిత్రమేమిటంటే ఆప్రదర్శనలో పెట్టిన నగలు,చీరలు, అన్ని ఎరువుగా తెచ్చిన వేనట! అది అక్కడ వారికి సాధారణ వ్యవహారమే!! అని చదివిన పాఠకులకు విచిత్రం కలగక మానదు. తను ఆ ఊరికి వెళ్ళిన కొత్తలో సావిత్రి అనే గిరిజన మహిళ తన పొలాన్ని గవర్నమెంట్‌ వారు స్వాధీనం చేసు కుంటారని అందుకుగాను తనకు అందిన కాగితాలు చూపించడానికి ఒక రాత్రివేళ ఆమె వద్దకు వస్తుం ది. టీచర్‌ అసలు విషయం తెలుసుకోవడానికి గ్రామాధికారి వద్దకు వెళ్ళగా..అతను చెప్పింది ఏమి టంటే,’సావిత్రి భూమి కొనుక్కున్నది గిరిజనేతరుల వద్దని గిరిజన వ్యవసాయ చట్టం ప్రకారం గిరిజను లు కానివారికి అక్కడ భూములు చెల్లుబాటు కావని వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని’. సావిత్రి గిరిజనేతరుడు అయిన కృష్ణమూర్తిని పెళ్లి చేసుకుని మొదట ఎంతో వైభవంగా అనుభవించిన, అది మూడునాళ్ళ ముచ్చటై…తన పెళ్లి పేరంటంలో పెట్టిన బట్టలు,నగలు,మాదిరి ఇప్పుడు తన భర్త భూమి తెచ్చుకున్నతాత్కాలిక వస్తువులెక్క అయి పోయింది. విషయం వివరించి తగిన సలహా టీచర్‌ ఇచ్చిన..ఆశ చావని కృష్ణమూర్తి కోర్టులో కేసు వేసి కోర్టుల చుట్టూ తిరుగుతూ తనఇంట్లోని, తన భార్య ఒంటి మీద,సంపద నగలు పోగొట్టుకుంటాడు. చివరికి ఆకుటుంబం పేదరికంలో కూరుకు పోతోంది. అలా..సావిత్రిభూమి దీనగాథకు సాక్ష్యం అయిన టీచరుకు ఇప్పుడు సీతాలు వ్యధ ఒకటి తోడైంది. గిరిజనేతరుని చేసుకున్న సీతాలుకు మొదట్లో ఆమె పేరు మీద గవర్నమెంట్‌ వారు ఐదు ఎకరాల పంటభూమికి పట్టాఇచ్చారు. గిరిజ నేతరులు బినామీ పద్ధతిలో భూములు సంపాదిం చడం అక్కడి అలవాటుపద్ధతి అయిపోతుంది. అంతేగాక అక్కడ నివసించే వాల్మీకితెగ వారిని మొదట్లో ఎస్సీలుగా గుర్తించి,ఆతర్వాత వారిని ఎస్టీలుగా గుర్తింపు ఇస్తూ ప్రభుత్వాలు, అధికారులు తీసుకున్న నిర్ణయాల వల్లే ఇలాంటి తగాదాలు వారి మధ్య చెలరేగి, కోర్టులచుట్టూ తిరిగి,భూస్వా మి కటికపేదవారుగా మారిపోతున్నారు. ఇప్పుడు జరిగిన విషయం అదే! సీతాలు అనే గిరిజన స్త్రీని ఆమె భూమికి ఆశపడి గంగరాజు అనే గిరిజ నేతరుడు ఆమెను చేరదీయడం, వాళ్లుకొన్న భూమి దారు ఫకీర్రావు భూమి అమ్మినప్పుడు ఎస్సీ వాల్మీకి జాతిగా, ఉండి ప్రస్తుతం యస్‌.టి వాల్మీకి సర్టిఫికెట్‌˜ సంపాదించడం,సీతాలు భర్తగంగరాజు గిరిజ నేతరుడు కనుక,అతడు ప్రస్తుత ‘యస్‌టి వాల్మీకి’ తెగకు చెందిన ఫకీరావు భూమినికొనే హక్కులేదు కనుక,అతని భూమిని అతనికిచట్టప్రకారం అప్ప గించాలి.వాస్తవానికి‘‘ఫకీర్‌ రావు’’చేసింది అన్యా యమే! అయినా తనకు గల సర్టిఫికెట్‌ వల్ల ప్రభుత్వ చట్టం ప్రకారం, అది న్యాయమైనపని అయి పోయింది ప్రస్తుతానికి.అసలు ఆధారాలు చూపించ టానికి గడువు కోరే సమయం అయిన ‘కోర్టుస్టే’ కోసం టీచరమ్మ సాయంతో సీతాలు పట్నం పోయింది.అక్కడ పడరాని పాట్లు పడుతుంది. లాయర్‌ కు విషయం చెప్పి ‘సీతాలు నువ్వు అక్కడే వుండు,వేరేపని గురించి పెళ్లి సాయంత్రానికి తిరిగి వస్తాను’అని చెప్పివెళ్లి వచ్చిన టీచరమ్మకు సీత స్థితి కన్నీరు పెట్టిస్తుంది. వెళ్ళిన కోర్టుస్టే పని కా లేదు,సరికదా పొద్దుటనుంచి తిండి,నీళ్లు, లేక అల మటిచడంతోపాటు అత్యవసరమైన’మూత్ర విసర్జన’ కు,కూడా లాయరు ఇంటివద్దచోటులేక, నరక యాతన పడ్డ సీతాలు స్థితిని రచయిత్రి కరుణ రసాత్మకంగా అక్షరీకరించి కన్నీరు పెట్టించింది. సీతాలు వారం పోయాక లాయర్ను కలవడానికి ఒక్కటే వెళ్లాలట. వెళ్ళేటప్పుడు రెండు వేలు తీసు కుని రమ్మన్నాడు’’అని చెప్పడంతో టీచర్లకు, గిరిజనులు,అటు గిరిజనేతరులు,అధికారులు, లాయర్ల,నుండి ఇలాంటి కష్టాలు పడి ఆస్తులు పోగొట్టుకుని పేదవాళ్లుమారుతున్నారో అర్థమవు తుంది.అటు పకీర్‌ రావు కూడా అప్పులు చేసే అతను ఎస్‌టి సర్టిఫికెట్‌ తెచ్చుకున్నాడు. సీతాలు తన భూమిని కాపాడుకోవడానికి అప్పులే చేసింది. ఇక ఇరువర్గాలు చేసుకున్న పనులవల్ల లాభపడిరది మాత్రం వడ్డీ వ్యాపారులు,అధికారులు, లాయర్లు, గిరిజనుల అభివృద్ధి పేరుతో చేసిన చట్టాలు సాయం తో స్వార్థపరుల ఎత్తులు పై ఎత్తులతోగిరిజనులు ఎలా నష్టపోతున్నారో వివరించబడిరది. చివరికి సీతాలు యస్టి సర్టిఫికెట్ను, ఫకీర్రావు నుంచి అధిక డబ్బులు పొందిన లాయర్‌ కోర్టుకు దాఖలు చేయక తాను గిరిజన జాతిగా కోర్టు ముందు నిరూపించుకో లేక తన పంట భూమిని కోల్పోవడం భూమి కోసమే చేరదీసిన గంగరాజు సీతాలును వదిలివేయడం జరుగుతుంది.ఈ ‘సీతాలు జీడిమామిడి తోట కథ’ని గిరిజన భూసమస్యలపై పరిశోధనకు వచ్చిన,తన స్నేహితురాలు పద్మినికి వివరిస్తుంది,రచయిత్రి టీచరమ్మ.గిరిజన ప్రాంతాల్లో నివసించే గిరిజనులు, గిరిజనేతరులు, ఇద్దరూ సమానంగా మోసగించ పడుతున్న విషయం గమనించిన పద్మిని కి ఇక్కడ పరిస్థితులు మార్చడానికి వారికి అందించాల్సిన ఆయుధం విద్య మాత్రమే అని రచయిత్రి సూచిం చటం,అందుకోసం పద్మిని ఆచరణాత్మకంగా ఆలో చించడంతో ఈకథముగిస్తోంది. –డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు,
ఫోను: 77298 83223

సాతంత్య్ర దినం..అమరుల త్యాగఫలం

‘‘ఎందరో త్యాగమూర్తుల పోరాట ఫలితంగా భారత ప్రజలు నేడు స్వేచ్ఛా వాయువులు పీలు స్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో కొత్త తరం ముందుకు వచ్చింది. భారత ఉపఖండంలో స్వాతంత్య్రం కోసం జరిగిన అనేక ఉద్యమా లనన్నిటినీ కలిపి‘‘భారత స్వాతంత్య్రోద్యమం’’గా చెబుతున్నారు. అనేక సాయుధ పోరా టాలు, అహింసాయుత పద్ధతిలో జరిగిన ఉద్యమాలు భారత స్వాతంత్య్రోద్యమంలో భాగాలు. భారత ఉపఖండంలోని బ్రిటిష్‌, ఇతర వలసపాల కుల పాలనను అంత మొందం చటానికి వివిధ సిద్దాంతాలను అనుసరించే అనేక రాజకీయ పక్షాలు ఉద్యమించాయి ’’
16వ శతాబ్దంలో పోర్చుగీసు ఆక్రమణలకు వ్యతిరేకంగా అబ్బక్కరాణి చేసిన పోరాటాలను, 17వ శతాబ్దం మధ్యలో బెంగాల్‌లో ఈస్ట్‌ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటాలను వలస పాలనపై వ్యతిరేకతకు మొదటి అడుగులుగా చెప్పవచ్చు. మొదటి సంఘటిత సాయుధ పోరాటం బెంగాల్‌లో ప్రారంభమై తర్వాత రాజకీయ పోరాటంగా పరిణామం చెంది భారత జాతీయ కాంగ్రెస్‌ గా ఆవిర్భవించింది. కాంగ్రెసులో అతివాదులైన లాలా లజపతిరాయ్‌, బాలగంగాధర తిలక్‌, బిపిన్‌ చంద్రపాల్‌, (లాల్‌ బాల్‌ పాల్‌) విదేశీవస్తు బహిష్కరణ, సమ్మె, స్వావలంబన మొదలైన పద్ధతులను అవలంబిస్తే, అరబిందో వంటివారు తీవ్రవాద మార్గాలను అవలంబిచారు. మెదటి దశకాలలో సాయుధ విప్లవ పోరాటాలు ముందుకు వచ్చా యి. మొదటి ప్రపంచయుద్ధ సమయంలో జర్మనీ, అమెరికాల్లోని భారత స్వాతంత్ర యోధులు ప్రారంభించిన గదర్‌ పార్టీ సహ కారంతో జరిగిన సంఘటిత భారతసిపాయిల తిరుగుబాటు జాతీయోద్యమంలో వచ్చిన మౌలిక మార్పుగా చెప్పవచ్చు. జాతీయోద్యమం చివరి దశలో జాతీయ కాంగ్రెస్‌ మహాత్మా గాంధీ నాయకత్వంలో అహింసాయుత మార్గాల లో ఉద్యమించింది. ప్రముఖ విద్యావేత్త రాంజీ సింగ్‌ మహాత్మాగాంధీని 20వ శతాబ్దంలో అవతరించిన బోధిసత్వునిగా కీర్తించాడు. అయితే ఇతర నాయకులు సాయుధ పోరాటా లను అవలంబించారు. సుభాష్‌ చంద్ర బోస్‌ సాయుధ సంగ్రామమే సరైనదిగా భావిస్తే, స్వామి సహజానంద సరస్వతి సన్నకారు రైతులు, శ్రామికుల సంపూర్ణ ఆర్ధిక స్వాతంత్రా నికై పిలుపునిచ్చాడు. రెండవ ప్రపంచయుద్ధ కాలానికి ఈ ఉద్యమాలు ఉధ ృతరూపం దాల్చాయి. నేతాజీ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ పేరుతో భారత జాతీయసైన్యాన్ని స్థాపించి తూర్పు ఆసియా నుండి పోరాడగా భారత జాతీయ కాంగ్రెస్‌ క్విట్‌ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చింది. మహాత్మా గాంధీ నాయక త్వంలోని 1947 ఆగష్టు 15న భారత దేశం స్వతంత్ర దేశంగా ఆవిర్బవించింది.1950 జనవరి 26 న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అయితే అప్పటివరకూ బ్రిటీష్‌ వారి పాక్షిక పాలలోనే సాగింది. భారత రాజ్యాంగం భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వా మ్య గణతంత్ర రాజ్యంగా ఆవిర్బవింపజేసింది.
స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రభావితం చేసిన మహిళల స్పూర్తి !
బ్రిటీష్‌ వారి బానిన సంకెళ్లను తెంచి భరత మాత దాస్య విముక్తి కోసం జరిగిన స్వతంత్ర పోరాటంలో ఎందరో మహిళలు స్ఫూర్తిదాయ కంగా పాల్గొన్నారు. ఈ చారిత్రక ఉద్యమంలో పురుషులతో పాటు స్త్రీలు కూడా అద్భుతమైన సాహసాలను ప్రదర్శించారు. మహిళలు బయటికి రావడమే అరుదైన అలనాటి కాలంలో భరతమాత దాస్య సంకెళ్లను తెంచేందుకు స్వతంత్ర పోరాటటం చేస్తూ ఆఉద్యమానికి ఎందరో మహిళలు ఊపిరిగా నిలిచారు. అలనాటి మహిళలలో ప్రధమ వరసలో నిలిచే మహిళా మణి సరోజినీ నాయుడు తమ ప్రసంగాలతో, పాటలతో నాటకాలతో కవి తలతో ఆమె తనదైన రీతిలో స్వాతంత్య్ర సమర స్ఫూర్తిని రగిలించారు. దేశమాతకోసం స్వతంత్య్ర సమరంలో పాల్గొని జైలుకు వెళ్ళిన ధీశాలి దువ్వూరి సుబ్బమ్మ గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. భయం అంటే ఏమిటో తెలియని స్వాతంత్య్ర సమరయోధు రాలు దుర్గాభాయి దేశ్‌ ముఖ్‌. మహిళా సాధికారత కోసం పాటుపడిన సామాజిక కార్యకర్తగా ఆమె పేరుపొందారు. ముఖ్యంగా సుభాష్‌ చంద్రభోస్‌ చేసిన స్వాతంత్ర పోరాటంలో ఆయనకు అత్యంత సన్నిహితు రాలిగా మెలిగిన కెప్టెన్‌ లక్ష్మీ సెహగల్‌ భారత స్వతంత్ర పోరాటంలో ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ తరఫున కదంతొక్కిన వీర వనిత. అభినవ రaాన్సీ లక్ష్మీబాయిగా పేరుతెచ్చుకున్న ధీరవనిత లక్ష్మీ సెహగల్‌ గురించి అనేక నవలలు సినిమాలు కూడ వచ్చాయి. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఇచ్చిన పిలుపు మేరకు ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీలోని రaాన్సీరాణి రెజిమెంట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలిమహిళగా లక్ష్మీ సెహగల్‌ చరిత్రలో నిలిచిపోయారు. ముఖ్యంగా స్వాతంత్రోద్యమంలో గాంధీకి వెన్నుదన్నుగా నిలిచి అర్థాంగి అనే పదానికి అసలైన నిర్వచనం ఇచ్చిన చైతన్యశీలి కస్తూరిబా గాంధీ. మహాత్మా గాంధీతో సమానంగా అంతేకాదు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్న మహిళలకు నాయకత్వం వహించిన మహిళ కస్తూర్భా గాంధీ. ఇక వీరితో పాటు అరుణ అసఫ్‌ అలీ స్వాతంత్రో ద్యమంలో నిర్వహించన పాత్ర గురించి చెప్పుకోవాలి. గాంధీ నమ్మకాన్ని పొంది అనేక ఉద్యమాలకు ఆమె నాయకత్వం వహించారు. అలనాటి హిందూ స్త్రీలతో సమానంగా అనేక మంది ముస్లిం మహిళలు కూడ భారత స్వాతం త్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. వారిలో అవధ్‌ రాణి బేగం హజరత్‌ను అగ్రగామిగా చెప్పుకుని తీరాలి. అలనాటి ముస్లిం మహిళామణుల త్యామయ పోరాట కూడా చరిత్రకు సంబంధిం చిన సమాచారాన్ని బ్రిటీష్‌ అధికారుల డైరీలు, లేఖలు బహిర్గతం చేస్తున్నాయంటే ఆనాటి కాలంలో హిందు మహిళలతో సమానంగా ముస్లిం వీరనారీమణుల ఎలాంటి త్యాగాలు చేసారో అర్ధం అవుతుంది. వీరందరితో పాటు వయస్సులో చాల చిన్న అయినా శ్రీమతి ఇందిరాగాంధీ క్విట్‌ ఇండియా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా అలనాటి బ్రిటీష్‌ పోలీసు లాఠీ దెబ్బలను లెక్కచేయకుండా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మహిళా స్పూర్తికి ఆదర్శంగా నిలిచారు. ఈవిధంగా ఎందరో మహిళా మణుల త్యాగ నిరతితో వచ్చిన స్వాతంత్రాన్ని నేడు అనుభవిస్తున్న అనేకమంది చదువుకున్న మహిళలు కూడ అలనాటి స్వాతంత్రోధ్యమంలో పాల్గొన్న అనేకమంది మహిళల పేర్లు కూడా వారికి తెలియదు అన్నది వాస్తవం..
రాణి వేలు నచియార్‌
బ్రిటిష్‌ వారిపై మొదటి పోరాటంగా మనం చెప్పుకునే 1857 సిపాయిల తిరుగుబాటు కంటే అయిదు దశాబ్దాల ముందే బ్రిటిష్‌ వారిని ధిక్కరించి నిలబడిన ధీర వనితలున్నారు. 1760-1796 మధ్య కాలంలో మొట్ట మొదటగా బ్రిటిష్‌అ ధికారాన్ని ఎదిరించి పోరాడిన మహిళ, బ్రిటిష్‌ వారి నుంచి తమ రాజ్యాన్ని తాము తిరిగి దక్కించుకున్న కొద్ది మంది రాజ్యాధినేతల్లో ఒక యోధురాలిగా ఘనతకెక్కిన మహిళ రాణి వేలు నచియార్‌. తమిళనాడు లోని రామ్‌ నాడ్‌ రాజ్యంలో జనవరి 3, 1730లో మన్నార్‌ సెల్లముత్తు సేతుపతి రాజుకు జన్మించింది వేలు నచియార్‌. ఆమెకు సోదరులెవ్వరూ లేకపోవటం వల్ల రాకుమారుడిలా పెరిగింది. చిన్నతనం నుంచే అనేక రకాల ఆయుధాలను ఉపయోగించటం, గుర్రపు స్వారీ, విలువిద్యతో పాటు అనేక యుద్ధవిద్యల్ని నేటర్చుకుంది. అంతేకాక ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌, ఉర్దూ లాంటి అనేక భాషల్లో ధారా ళంగా మాట్లాడగల ప్రావీణ్యం సంపాదిం చింది. వేలు నచియార్‌ భర్త శివగంగై రాజు. వారికి ఒక కూతురు. 1772లో ఆర్కోట్‌ నవాబుతో కలిసి బ్రిటిష్‌ దళాలు శివగంగైను ఆక్రమించటానికి చేసిన కళైయార్‌ కోయిల్‌ యుద్ధంలో వేలు నచియార్‌ భర్తను హత్య చేశారు. విధి లేని పరిస్థితుల్లో వేలు నచియార్‌ తన కూతురుతో కలిసి రాజ్యాన్ని వదలి పారిపోవాల్సి వచ్చింది. శివగంగైకు చెందిన మరుధు సోదరులు, మరికొంత మంది శక్తివం తమైన సన్నిహితుల సాయంతో దిండిగల్‌ లో నివసించింది. ఆ సమయంలో బ్రిటిష్‌ వారిపై పగ తీర్చుకోవాలనే ధృఢ సంకల్పంతో అనేక మందితో కలిసి సంకీర్ణ సేనలు తయారు చేసింది. 1780 లో మైసూర్‌ సుల్తాన్‌ హైదర్‌ అలీ సాయం తీసుకుని, తాను తయారు చేసుకున్న అత్యంత శక్తివంతమైన సైన్యంతో కలిసి శత ృవులపై దాడి చేసింది. అప్పట్లోనే ఆమె సైన్యంలో ప్రాణాలను ఫణంగా పెట్టిన (తమను తాము నూనెతోనో నెయ్యితోనో ముంచుకుని శత ృ ఆయుధాగారంలోకి జొరబడి తమకు తామే నిప్పంటించుకుని ప్రాణాలర్పించే) మానవ బాంబు, కుయిలీ అనే ఆమె ఉండేది. ఆయుద్ధంలో వేలు నచియార్‌ విజయం సాధించి తన రాజ్యాన్ని తాను చేజిక్కించుకుంది. ఆ రోజుల్లోనే ఆమె తన సైన్యంలో ‘‘ఉదయాళ్‌’’ అనే పేరుతో మహిళలు మాత్రమే గల బృందాన్ని తయారుచేసుకుంది. ఇప్పటికీ తమిళనాడులో జనవరి 3న రాణి వేలు నచియార్‌ జన్మదినాన్ని ఎంతో వేడుకగా జరుపుకుంటారు.31 డిశంబర్‌, 2008 న భారత ప్రభుత్వం ఆమె శాశ్వత గుర్తుగా పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది.
కిట్టూర్‌ చెన్నమ్మ
భారత పార్లమెంటు ఆవరణలో సెప్టెంబర్‌ 11, 2007 లో మన దేశ తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ గారి చేతుల మీదుగా ఒక వీర వనిత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆమె పేరు రాణి చెన్నమ్మ. కర్నాటక రాష్ట్రంలోని కిట్టూర్‌ రాజ్యానికి రాణి. అందుకే ఆమెను కిట్టూర్‌ చెన్నమ్మ అని కూడా అంటారు. మొదటి తరం స్వాతంత్య్ర సమర యోధుల్లో మొదటిగా చెప్పుకోదగ్గ మహిళ. అప్పటి బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ డల్హౌసీ ప్రవేశ పెట్టిన ‘‘డాక్ట్రిన్‌ ఆఫ్‌ లాప్స్‌’’ అనే చట్టానికి వ్యతిరేకంగా పోరాడిరది. బ్రిటిష్‌ సైన్యానికి ధీటుగా గొప్ప విప్లవ దళాన్ని తయారు చేసుకుని సారధ్యం వహించిన మహిళ. బ్రిటిష్‌ వారు భారత పాలకులపై బలవంతంగా విధించే అనేక చట్టాలను పాటించలేమని బలంగా వ్యతిరేకించి అనేక పోరాటాలు చేసింది. చివరకు తన విప్లవ దళంతో కలిసి బ్రిటిష్‌ వారిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. చివరకు జరిగిన యుద్ధంలో ఓడిపోయి వారికి పట్టుబడిరది రాణి చెన్నమ్మ. కానీ, ఆమె చూపిన తెగువ, పట్టు వదలక తిరుగుబాటు చేసిన తీరు తరువాతి తరం స్వాతంత్య్ర సమర యోధులకు ఎనలేని స్ఫూర్తిని అందించింది. రాణి కిట్టూర్‌ చెన్నమ్మ వీరోచిత శౌర్యాన్ని గుర్తు చేసుకుంటూ నేటికీ కర్నాటక రాష్ట్రంలో అక్టోబర్‌ నెలలో బ్రిటిష్‌ వారిపై ఆమె సాధించిన మొదటి విజయాన్ని గుర్తు చేసుకుంటూ ‘‘కిట్టూరు ఉత్సవం’’ పేరుతో ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటారు. ఆమె ధైర్యాన్ని, విప్లవ దళం సాయంతో పోరాడిన తీరు ఇప్పటికీ స్ఫూర్తిమంతమైన నాటకాలుగా, జానపద పాటలుగా, కథలు కథలుగా గానం చేయబడుతోంది. ఇండియన్‌ రైల్వేస్‌ రోజూ బెంగుళూరు నుండి కొల్హాపూర్‌ ప్రయాణించే ఒక రైలుకు ఏకంగా ‘‘రాణి చెన్నమ్మ ఎక్స్‌ ప్రెస్‌’’ అని పేరు పెట్టి ఆమెకు నీరాజనాలు అర్పించారు.
రాజ్‌ కుమారి గుప్త
రాజ్‌ కుమారి గుప్త చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన పేరు. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఆధ్వర్యం లోని తిరుగుబాటు యోధుల బృందా నికి సహకరిస్తూ ఉండేది. వారికి రహస్యంగా సందే శాలను, మారణాయుధాలను చేరవేసేది. అప్పట్లో విప్లవ దళాల మనుగడకై దోపిడీలు చేసేవారు. చరిత్రలో ప్రముఖంగా చెప్పుకునే ‘‘కాకోరీ కాన్‌ స్పైరసీ’’ గా పేరొందిన, లక్నోకి దగ్గరగా గల కాకొరీ ప్రాంతంలో చంద్ర శేఖర్‌ ఆజాద్‌ నాయకత్వంలో జరిగిన ఒక రైలు దోపిడీలో ప్రముఖ పాత్ర పోషించింది రాజ్‌ కుమారి గుప్త. ఒకసారి తన దుస్తులలోదాచు కుని రహస్యంగా ఆయుధాలు చేరవేస్తుం డగా బ్రిటిష్‌ సైన్యానికి తన మూడేళ్ళ కొడుకుతో సహా పట్టుబడిరది.
లిబేగం హజ్రత్‌ మహల్‌
లక్నోలోని అతిపెద్ద ప్రాంతం అవధ్‌ ని ఏలిన రాణి బేగం హజ్రత్‌ మహల్‌. అందాల సౌందర్య రాశి, అత్యంత విలాస వంతంగా జీవితం గడిపిన ఆమె, బ్రిటిష్‌ వారిపై వ్యతిరేకంగా జరిపిన యుద్ధంలో తాను ప్రత్యక్ష్యంగా యుద్ధరంగంలో నిలబడి తన సైన్యంలో ధైర్యం నింపుతూ పోరాడిరది. ఎప్పటికప్పుడు తన శక్తి మేరకు ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడిరది బేగం హజ్రత్‌ మహల్‌. మొదటి తరం స్వాతంత్య్ర సమర యోధులలో ఒకరైన నానా సాహెబ్‌ వంటి వారితో కలిసి పని చేసింది. బలవంతంగా తన రాజ్యాన్ని బ్రిటిష్‌ వారు చేజిక్కించుకోగా రిక్తహస్తాలతో, నేపాల్‌ ప్రధాని పిలుపునందుకుని నేపాల్‌ చేరుకుని మనుగడ సాగించాల్సి వచ్చింది. చివరకు ఊరూ పేరూ లేకుండా 1879లో ఖాట్మండులో మరణించింది. అనంతరం ఆమె సాహస పోరాట పటిమకు గుర్తుగా భారత ప్రభుత్వం మే 10, 1984లో బేగం హజ్రత్‌ మహల్‌ ఫోటో ముద్రించిన పోస్టల్‌ స్టాంప్‌ ను విడుదల చేసింది.
రాణి అవంతి బాయి
1831-1858 మధ్య కాలంలోని మరో మొదటి తరం స్వతంత్ర యోధురాలు రాణి అవంతి బాయి. బ్రిటిష్‌ ప్రభుత్వం అప్పట్లో విధించిన చట్టాలకు అనుగుణంగా, వాటికి తలవంచే అందరు రాజుల్లాగే, తాను కూడా ‘‘వారసులు లేని వారు తమ రాజ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించి భరణం తీసుకోవాలన్న ఆదేశాల’’ ను పాటిస్తూ తన రాజ్యాన్ని అప్పగించి, వారిచ్చే భరణంతో బ్రతకాల్సి వచ్చింది. అది నచ్చని ఆమె రహస్యంగా బృందాలను తయారు చేసి, బ్రిటిష్‌ వారి అరాచకాలను, ఆక ృత్యాలను వారి ద్వారా బహిరంగ పరిచింది. 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్‌ దళాలకు వ్యతిరేకంగా ధృఢంగా పోరాడి అనేక ప్రాంతాలలో విజయం చేజిక్కించుకుంది. కానీ ఆ విజయాలు ఎంతో కాలం నిలవలేదు. దీర్ఘకాలం పోరాడిన తరువాత తన అధికారాన్ని కోల్పోయింది. ఐనా ధైర్యం కోల్పోక, సర్వశక్తులూ ఒడ్డి, మరలా సైన్యాన్ని సమీకరించాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. చివరకు బ్రిటిష్‌ సైన్యం చేతికి చిక్కి చావటం ఇష్టంలేక తన కత్తితో తానే పొడుచుకుని సంహరించుకుని ప్రాణ త్యాగం చేసిన ధీరోదాత్త రాణి అవంతీ బాయి.ఇక రaాన్సీ లక్ష్మీబాయి వీరోచిత గాథ చాలావరకు ప్రజలందరికీ చేరువయ్యిందే.
పార్వతి గిరి
పశ్చిమ ఒరిస్సా ప్రాంతంలో మరో మదర్‌ థెరెస్సాగా పేరొందిన మహిళ పార్వతి గిరి. 16 ఏళ్ళ చిన్న వయస్సు లోనే స్వతంత్ర ఉద్యమం పట్ల ఆకర్షితురాలై అనేక పోరాటాలలో ముందుండి నడిచింది. ప్రత్యేకంగా క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో ప్రముఖ పాత్ర పోషించింది. అందుకామె రెండేళ్ళ జైలు జీవితం కూడా గడిపింది. స్వాతంత్య్రం తదుపరి తన జీవితాన్నంతా ప్రజా సేవకు అంకితం చేసిన మహోన్నత మహిళ పార్వతి గిరి.
భోగేశ్వరి ఫుకనాని
మధ్య అస్సాం ప్రాంతానికి చెందిన భోగేశ్వరి ఫుకనాని 60 ఏళ్ళ వయస్సులో ప్రాణాలను ఫణంగా పెట్టి అమరత్వం పొందిన సాహస మహిళగా ప్రసిద్ధి చెందిన వ ృద్ధ యోధురాలు. ఒక సాధారణ గృహిణి ఐన భోగేశ్వరి స్వాతం త్య్ర పోరాటం పట్ల ఆకర్షితురాలై తాను స్వయం గా ఉద్యమంలో పాల్గొనటమే కాక తన ఆరుగురు కొడుకులను, ఇద్దరు కూతుళ్ళను కూడా పాల్గొనేలా చేసింది. ‘‘భర్భుజ్‌ ’’ అనే పేరుతో చేపట్టిన తిరుగుబాటు కార్యక్రమంలో పాల్గొన్న భోగేశ్వరిని అమానవీయ రీతిలో కాల్చి చంపింది బ్రిటిష్‌ సైన్యం.
కనకలత బారువా
అస్సాంకే చెందిన మరో మహిళ కనకలత బారువా. ఆమెను బీర్బల అని కూడా పిలిచే వారు. క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో ‘‘మ ృత్యు వాహిని’’ అనే సేనలో ప్రాణాలను ఫణంగా పెట్టే దళంలో పని చేసింది. సెప్టెం బర్‌ 20, 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమ బృందం చేపట్టిన, జాతీయ జెండా ధరించి సాగే మార్చ్‌ లో ముందుండి సాగి బ్రిటిష్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో ప్రాణాలు పోగొట్టు కుంది కనకలత బారువా.
మాతంగిని హజ్రా
అంతగా ప్రాచుర్యం పొందని వీర వనిత. క్విట్‌ ఇండియా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిం చింది. తన మాటల ద్వారా, చేతల ద్వారా ప్రజలలో జాతీయతా భావాన్ని అత్యంత వేగంగా వ్యాప్తి చేసింది. ఉద్యమ కాంక్షను రగిలించింది. ఇది గ్రహించిన బ్రిటిష్‌ ప్రభు త్వం ఆమెను ఐంతమొందించాలని ఎదురు చూసాయి. జాతీయ జెండా ధరించి ఉద్యమ పథంలో నడుస్తున్న ఆమెను షూట్‌ చేసారు. తూటా తగిలినా, ధైర్యం కోల్పోక, జెండా విడు వక.. ముందుకు నడుస్తూనే, ‘‘వందే మాతరం’’ అంటూనే నేలకొరిగింది మాతంగిని హజ్రా.
అరుణ అసఫ్‌ అలీ
భారత దేశ అత్యున్నత పురస్కారమైన ‘భారత రత్న’ అందుకున్న అరుదైన స్వాతంత్య్ర సమర యోధురాలు అరుణ అసఫ్‌ అలీ. ఉన్నత విద్యా వంతురాలు. 1942 క్విట్‌ ఇండియాఉద్యమ సమయంలో, ముంబైలోని గవాలియా ట్యాంక్‌ మైదానంలో బ్రిటిష్‌ సైన్యం చూస్తుం డగా జాతీ య జెండా ఎగుర వేసిన ధైర్యం ఆమె సొంతం. తన పోరాటాల ఫలితంగా ఎన్నోసార్లు జైలు జీవితం గడిపింది. తీహార్‌ జైల్లో బంధించి నపుడు ఆమె చేపట్టిన నిరాహార దీక్ష స్వాతంత్య్ర పోరాట చరిత్రలో నిలిచిపోయింది.
దుర్గాబాయి దేశ్‌ ముఖ్‌
చిన్నతనం నుంచే స్వతంత్ర భావాలు గల మరో తెలుగు మహిళ దుర్గాబాయి దేశ్‌ ముఖ్‌. గాంధీ బోధనలకు ఆకర్షితురాలై ఆభరాణాలు విడిచి ఖాదీ ధరించింది. సత్యాగ్రహంలో పాల్గొని మూడుసార్లు జైలుపాలైంది. తరువాత ఉన్నత విద్యనభ్యసించి న్యాయశాస్త్రంలో పట్టా పొం దింది. స్వాతంత్య్రానంతరం ప్లానింగ్‌ కమీషన్‌ సభ్యురాలిగా, రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా, కేంద్రంలో ఆర్థిక మంత్రిగా పలు కీలక పద వులు నిర్వహించిన తెలుగు మహిళ దుర్గాబాయి దేశ్‌ ముఖ్‌. ఇలా ఎంతో మంది ప్రాణ త్యాగా లు చేసిన వారు, తెగువ, ధైర్య సాహసాలు చూపిన మహిళలు. చరిత్రలో నిలిచిన వారు, వెలుగులోకి రాని వారు అనేక మంది. ఈ 75వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా మనం వారందరినీ తలచుకుందాం. అపురూపమైన భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రను భావి తరాలకు తెలియ జేసే ప్రయత్నం చేద్దాం. Saiman Gunaparthi

నిర్వాసితుల నిర్వేదం

‘మా అందరికీ ప్యాకేజీ ఇచ్చిన తర్వాతే, ప్రాజెక్టు కడతామని అన్నారు. కానీ ఇప్పుడు మాకు ఏమీ ఇవ్వకుండానే ప్రాజెక్టు కట్టేస్తున్నారు. అంటే మమ్మల్ని మోసం చేస్తున్నట్టే కదా.మా ఊరికి 30 కిలోమీటర్ల అవతల జీలుగుమిల్లిలో కాలనీ కడతారంట. మాతరతరాలు అక్కడే బతకాలి. కానీ అక్కడికెళ్లి ఎలా బతకాలి. మొత్తం మాకివ్వాల్సింది ఇచ్చేస్తే మేమే వెళ్లిపోతాం’’ భూమికి భూమి ఇస్తామన్నారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ పూర్తిగా రాలేదు. ఇక్కడ పొలాలు, చెట్టూ అన్నీ వదిలేసి వెళ్లి ఏం తినాలి.అని పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలానికి చెందిన భీంపల్లి వాసి ఎం.అబ్బులు ఆవేదన.
పేరుకే కాలనీ.. ఉన్నవన్నీ మొండి గోడలే

‘‘అధికారుల మాటలు నమ్మి ఇక్కడికి వచ్చాం. కానీ అక్కడ మంచినీరు, కరెంటు కనెక్షన్లు కూడా ఇవ్వలేదు. బాత్రూములు లేవు. కుళాయిలు ఇప్పుడు తవ్వుతున్నారు. గోదావరి ఒడ్డున ఉండలేక ఇక్కడికి వచ్చేశాం. ఈసారి వరద మూడు నాలుగు నెలలు ఉంటుందని అంటున్నారు. అందుకే పిల్లలతో అక్కడ ఉండలేక వచ్చేశాం. కానీ మాకు కరెంటు మీటర్లు వేసి, బాత్రూమ్‌ లు కట్టాలి . లేదంటే వరదలు, వర్షాల సమయంలో కష్టమే’’ అని పునరావాస కాలనీకి తరలివెళ్లిన కె.వెంకటలక్ష్మి రోదన.

‘‘అడవిలో ఉంటే ఏదోటి తిని బతికేస్తాం.అక్కడ ఎలా గడపాలి. మాకు జరుగుతున్న అన్యాయం చూస్తామన్న వాళ్లే లేరు. గోదావరి వచ్చేస్తోంది. అందుకే అడవుల్లో ఏవో ఇళ్లు కట్టుకుని చీకట్లోనే గడపాలి ఇక’’ అని చెదల పార్వతి నిర్వేదన
పోలవరంలో ముంపు శాపం…18,622 కుటుంబాలను ముంచేస్తున్నది ప్రవాహమా, ప్రభుత్వమా? చేసిన వెళ్లినవాళ్లను ఇంకా తిప్పుతున్నారు. అందుకే వరదొచ్చినా, వానొచ్చినా ఇక్కడే ఉంటాం. ఈసారి పెద్ద వరద వస్తుందని చెబుతున్నారు. అయినా మేం కదలం. ఇక్కడే కొండలపై ఇళ్లు కట్టుకుని ఉంటాం’’ గిరిజనులు అంటు న్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే మీదుగా గోదావరి నది ప్రవాహాన్ని మళ్లించారు.కాఫర్‌ డ్యామ్‌ పూర్తిగా మూసేశారు. దాంతో సాధారణ నీటి ప్రవాహానికే వరద తాకిడి మొదలైంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి వరద ముప్పు తప్పదని అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. దాంతో పోలవరం ముంపు గ్రామాల నుంచి ప్రజలను ఖాళీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పునరావాస ప్యాకేజీ చెల్లించాలని ముంపు ప్రాంత వాసులు పట్టుపడుతున్నారు.దాంతో పోలవరం నీళ్లు గిరిజన ప్రాంత ఊళ్లను ముంచేస్తున్న తరుణంలో ఎలాంటి పరిణామాలుఉత్పన్నమవు తాయోనన్న ఆందో ళన పెరుగుతోంది.
పెరిగిన పరిహారపు ఖర్చు..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడంతో పునరావాసం చెల్లించాల్సిన బాధితుల సంఖ్య కూడా పెరిగింది. దానికి తోడు 2013 భూసేకరణ చట్టంలో మారిన నిబంధనలు అమలులోకి రావడంతో చెల్లించాల్సిన పరిహారం కూడా పెరిగింది.విపక్ష నేతగా ముంపు ప్రాంతంలో పర్యటిస్తూ జగన్‌ ఇచ్చిన హామీలు కూడా పునరావాసం కోసం వెచ్చించాల్సిన వ్యయం మరింత పెరగడానికి కారణమయ్యాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం వైఎస్సార్‌ హయంలో శంకుస్థాపన జరిగిన నాటికి 2005-06లో బాధితుల సంఖ్య 44,500 మంది అని ప్రకటించారు. వారికి పరిహారంగా రూ.8వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. కానీ ఆ తర్వాత 2011-12 నాటి లెక్కల ప్రకారం పరిహారం కోసం అర్హుల సంఖ్య 80 వేలకు చేరింది. ఆ సమయంలో 18 ఏళ్లు నిండిన వారిని కూడా అర్హుల జాబితాలో లెక్కించడం, కొత్తగా వచ్చిన కుటుంబాలు కలుపుకొని నిర్వాసితుల సంఖ్య పెరిగిందని అధికారులు ప్రకటించారు. ఈ పదేళ్ల కాలంలో వారి సంఖ్య లక్ష దాటిందని చెబుతున్నారు. ప్రాజెక్టు కోసం 2005-06లో 95,700 ఎకరాలు భూసేకరణ చేయాలని లెక్కలు వేశారు. కానీ, 2017-18లో దానిని 1,55,465 ఎకరాలుగా సవరించారు. దాంతో తొలి అంచనాల కన్నా 55,335 ఎకరాలు అదనంగా సేకరించాల్సి వస్తోందని ప్రభుత్వం చెబుతోంది. పోలవరం ముంపు ప్రాంతంలో ఫీల్డ్‌ సర్వే చేయడం వల్ల భూసేకరణ పెరిగిం దని అధికారికంగా ప్రకటించారు. కానీ పోలవరం విలీన మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన తర్వాత ముంపు ప్రాంతం ఎక్కువగా లెక్కిస్తున్నారన్నది నిర్వాసితుల వాదన. నిర్వాసితుల సంఖ్య, సేకరించాల్సిన భూమి కూడా పెరగడంతో పునరావాసానికి వెచ్చించాల్సిన ఖర్చు పెరిగింది. దాంతో తాజాగా ప్రభుత్వం సవరించిన అంచనాల ప్రకారం సుమారు రూ.30 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా.
నీళ్ల నడుమ నిర్వాసితులు-చోద్యం చూస్తున్నపాలకులు
ఉగాది నాటికే కాంటూరు 41.15 మేరకు నిర్వాసితులందరికీ ప్యాకేజీ చెల్లించి, కాలనీలకు తరలిస్తామని కూడా ప్రకటించారు. ఇప్పుడు కాఫర్‌ డ్యామ్‌ గ్యాప్‌ పూడ్చివేశారు కానీ నిర్వాసితులకు ప్యాకేజీ మాత్రం ఇవ్వలేదు. అంటే ఆర్‌ ఆండ్‌ ఆర్‌ అమలు చేయకుండా అది పూడ్చడానికి అనుమతించేది లేదని చెప్పిన పి.పి.ఎ మాట తప్పిందా..లేక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ప్యాకేజీ ఇవ్వకుండానే నిర్వాసితుల ఇళ్లను ముంచేసేందుకు పి.పి.ఎ అనుమతి తీసుకున్నారా లేదా అన్నది స్పష్టత ఇవ్వకుండా కప్పదాటు వైఖరి అవలంబి óస్తున్నారు. మాట తప్పిన కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాల తీరు మూలంగా మన్యం వాసులు బాధితులుగా మిగిలారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు సహా అందరూ నానా ఇబ్బందులు పడుతున్నారు.
పునరావాస ప్యాకేజీ ఇస్తే ఖాళీ చేయాలని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు అనుకుంటున్నారు. ప్యాకేజీ ఇవ్వకుండా ఖాళీ చేయకూడదని ఎ.పి హైకోర్టు కూడా ఆదేశిం చింది. ప్రభుత్వం మాత్రం ఆగష్టు నాటికే 48 గ్రామాలను ఖాళీ చేస్తామని చెబుతోంది. దానికి అవసరమైన నిధుల సంగతి తమకు సంబంధం లేదని కేంద్రం అంటోంది. మొత్తంగా పోలవరం ప్రాజెక్టు వ్యవహారం పెద్ద ప్రహస నంగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవడానికి యత్నిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం దానిని నిలదీసి, నిధులు రాబట్టడంలో విఫలమవుతోంది. బాధితులు మాత్రం నిలువు నీళ్లలో, ఇప్పుడు వరదల సమయంలో చీకట్లో కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ సంగతి ఆ తర్వాత ప్రస్తుతం వరదల సమయంలో సహాయక చర్యలు చేపడదామనే ఆలోచన కూడా ప్రభుత్వాలకు రావడం లేదు.
వరద బాధితులతో ఆటలు…
దశాబ్దాలుగా పోలవరం ప్రాజెక్టు అనేక పార్టీలకు ఎన్నికల హామీగా ఉంటోంది. గత ప్రభుత్వం కూడా 2019 నాటికే ప్రాజెక్టు పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. కానీ దానికి తగ్గట్టుగా పనులు చేయలేకపోయింది. రెండేళ్లు దాటిన వైసిపి ప్రభుత్వం కూడా 2021 నాటికే పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లిస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు దానిని మరో ఏడాదికి పొడిగించింది. స్పిల్‌ వే పూర్తయిన నేపథ్యంలో జూన్‌ నెల మొదటి వారంలోనే నదీ ప్రవాహాన్ని మళ్లించారు. అందుకోసం కాఫర్‌ డ్యామ్‌ పూర్తిగా మూసే శారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం జరగడంతోనే పోలవరం నిర్వాసిత గ్రామాలకు వరద బెడద ఏర్పడిరది. మూడేళ్లుగా కొద్దిపాటి వరదలకే ఊళ్లన్నీ జలమయమవుతున్నాయి. ఈ ఏడాది కాఫర్‌ డ్యామ్‌ మూసేశాక బ్యాక్‌ వాటర్‌ మూలంగా వంద గ్రామాలు జలదిగ్బంధంలో ఇరుక్కున్నాయి.
భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటినా వరద చూడని గ్రామాలు కూడా ఇప్పుడు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో నీటిమయమయ్యాయి. కాఫర్‌ డ్యామ్‌ కారణంగా ఇలాంటి ముప్పు ఉంటుందని ప్రభుత్వాలకు తెలిసినా స్పందించలేదు. వామపక్షాలు, ఇతర నేతలు వరద బాధలను, నిర్వాసితులను ఆదుకోవాల్సిన అవసరం గురించి మొత్తు కుంటున్నా పాలకులు మిన్నకున్నారు. గత ఏడాది వరదల్లో ఆహారం, కిరోసిన్‌ వంటివి కూడా అందించడానికి ఏర్పాట్లు చేయలేదు. అంతకుముందు 2019 వరదల సమయంలో ముఖ్యమంత్రి ప్రకటించిన వరద సహాయం 2020 వరదలు వెళ్లిన తర్వాత చెల్లించారంటే బాధితుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి స్పష్టమవుతోంది. ఈసారి కాఫర్‌ డ్యామ్‌ పూర్తిగా మూసేసిన తర్వాత వరద తాకిడి మరింత ఎక్కువ ఉంటుందని అధికారికంగానే వెల్లడిరచారు. అందుకు అనుగుణంగా సహాయక చర్యలు మాత్రం చేపట్టలేదు. ప్రస్తుతం వరదల్లో చిక్కుకున్న గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్ళు వదిలిపోయేలా చేసే పన్నాగంలో ఉన్నట్టు ఇట్టే అర్థమవుతోంది. ప్యాకేజీ చెల్లించి, నిర్వాసిత కాలనీలు సిద్ధం చేసి బాధితులందరినీ తరలించాల్సి ఉండగా దానికి భిన్నంగా ఏ దారి లేని నిర్వాసితులంతా ఊళ్లు వదిలిపోయేలా చేస్తున్నారు. చట్టాన్ని ప్రభుత్వమే యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం సర్వం వదిలిపోతున్న వారి జీవితాలతో ఆడుకుంటున్నట్టు కనిపిస్తోంది. అందుకే ఈసారి వరదలను ఊహించిన నిర్వాసితులు కొండలపై తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నా అడ్డుకునే యత్నం చేశారు. వరదలు వస్తే తినడానికి అవసరమైన నిత్యావసర సరుకుల కోసం సంతకు వస్తే తిరిగి వెళ్లేందుకు పడవలను కూడా అనుమతించ కుండా అమానుషంగా ప్రవర్తించారు.
మాట తప్పిన ప్రభుత్వాలు
కాఫర్‌ డ్యామ్‌ సిద్ధం చేసిన నేపథ్యంలో దానిని పూర్తిగా మూసేయాలంటే ముందుగా పునరా వాసం చెల్లించాలని పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ ఆదేశించింది. గత డిసెంబర్‌ నెలలో ప్రాజెక్ట్‌ ప్రాంతాన్ని సందర్శించిన డిజైన్‌ రివ్యూ కమిటీ కూడా ఇదే విషయం తేల్చిచెప్పింది. అప్పటి వరకూ కాఫర్‌ డ్యామ్‌ ఖాళీని పూడ్చేసేందుకు అనుమతించేది లేదని కూడా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానిని అంగీకరించింది. ఉగాది నాటికే కాంటూరు 41.15 మేరకు నిర్వాసితులందరికీ ప్యాకేజీ చెల్లించి, కాలనీలకు తరలిస్తామని కూడా ప్రకటించారు. ఇప్పుడు కాఫర్‌ డ్యామ్‌ గ్యాప్‌ పూడ్చివేశారు కానీ నిర్వాసితులకు ప్యాకేజీ మాత్రం ఇవ్వలేదు. అంటే ఆర్‌ ఆండ్‌ ఆర్‌ అమలు చేయకుండా అది పూడ్చడానికి అనుమతించేది లేదని చెప్పిన పి.పి.ఎ మాట తప్పిందా.. లేక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ప్యాకేజీ ఇవ్వకుండానే నిర్వాసితుల ఇళ్లను ముంచేసేందుకు పి.పి.ఎ అనుమతి తీసుకున్నారా లేదా అన్నది స్పష్టత ఇవ్వకుండా కప్పదాటు వైఖరి అవలంభిస్తున్నారు. మాట తప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు మూలంగా మన్యం వాసులు బాధితులుగా మిగిలారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు సహా అందరూ నానా ఇబ్బందులు పడుతున్నారు.
పోలవరం పూర్తి చేసే ఉద్దేశం ఉందా ?
దశాబ్దాలుగా సాగుతున్న పోలవరం ప్రాజెక్టుకి విభజన చట్టం ప్రకారం జాతీయ హోదా దక్కిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశలు చిగురించాయి. గోదావరి నదీ జలాలను కృష్ణా డెల్టాకు తరలించి, అక్కడి నుంచి ఎగువన ప్రకాశం, గుంటూరు జిల్లాకు కూడా వినియోగించుకుంటామని, తద్వారా రాయల సీమలో నీటి కొరతను అధిగమిస్తామని ముఖ్య మంత్రులు భారీ ఆశలే కల్పించారు. కానీ చట్టం ప్రకారం జాతీయ హోదా అమలు చేయాల్సిన కేంద్రం ఇప్పుడు కొర్రీలు వేస్తోంది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 8 బడ్జెట్లలో పోలవరం నిర్మాణం కోసం వెచ్చించిన మొత్తం రూ.11,182 కోట్లు. ఇప్పటి వరకూ పునరావాసానికి రూ.6900 కోట్లు వెచ్చించగా ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం మరో రూ.20వేల కోట్లు అవసరం అవుతాయి. టెక్నికల్‌ కమిటీ ఆమోదం పొందిన డి.పి.ఆర్‌ 2 ప్రకారమే 1.05లక్షల కుటుంబాలకు గానూ రూ.27వేల కోట్లు వెచ్చించాల్సి ఉంది. దాంతో పాటుగా కాలువల నిర్మాణం పూర్తి చేయడం, ఇప్పటికే 15ఏళ్ల క్రితం నిర్మించిన కాలువల్లో శిథిలమవుతున్న వాటిని సిద్ధం చేసేందుకు కనీసంగా మరో రూ. 5వేల కోట్లు కావాల్సి ఉం టుంది. ఇక ఎర్త్‌ కం రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ డిజైన్లను మార్చడం వల్ల ఖర్చు పెరిగిందని కేంద్రమే పార్లమెంట్‌ లో చెప్పింది. దాని ప్రకారం రూ. 5535కోట్ల నుంచి రూ. 7192 కోట్లకు పెరిగింది. ఇక బహుళార్థక ప్రాజెక్టులో భాగంగా పవర్‌ హౌస్‌ అందు బాటులోకి తెచ్చేందుకు మరో ఐదారు వేల కోట్లు కావాలి. అంటే మొత్తంగా ఇప్పుడున్న స్థితిలో పోలవరం పూర్తి కావాలంటే కనీసం రూ. 35వేల కోట్లు ఖర్చు చేస్తే తప్ప అవకాశం లేదు. కానీ కేంద్రం మాత్రం 2014 నాటి అంచనాలకు మించి పైసా కూడా చెల్లించ బోనంటోంది. రాజ్యసభలో జలశక్తి మంత్రి ప్రకటన తాజా తార్కాణం. మరో 9వేల కోట్లు మాత్రమే ఇస్తామని చెబుతోంది. అదే సమ యంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులు రీయంబర్స్‌ చేయడంలోనూ కొర్రీలు వేస్తోంది. కేంద్రం నుంచి రూ. 2300కోట్లు రావాల్సి ఉందని జులై 19న సి.ఎం ప్రకటిస్తే, తాము ఇంకా ఇవ్వాల్సింది రూ.1900 కోట్ల లోపు మాత్రమేనని పార్లమెంటులో కేంద్రం స్పష్టం చేసింది. దాంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దోబూచులాట మూలంగా ప్రస్తుతం అన్యాయమవుతున్న నిర్వాసితులతో పాటుగా ప్రాజెక్టు మీద ఆశలు పెట్టుకున్న రైతాంగం కూడా చేరుతున్నట్టు కనిపిస్తోంది. విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నప్పటికీ పోలవరం నిర్మాణం విషయంలో కేంద్రం కొర్రీలు వేస్తోంది. దానిని ప్రశ్నించి, రాష్ట్ర హక్కులను కాపాడడంలో వైసిపి నీళ్లునములుతోంది. కనీసం విపక్ష టిడిపి కూడా ప్రశ్నించ లేకపోవడంతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగేలా ఉంది. పోలవరం తామే పూర్తి చేస్తున్నామని ఎ.పి లో బిజెపి నేతలు ప్రకటన లు గుప్పిస్తుంటే కేంద్రంలో అదే పార్టీ మంత్రు లు తాము ఎనిమిదేళ్ల క్రితం నాటి అంచనాలకు మించి పైసా కూడా ఇచ్చేది లేదని ఫ్లేటు ఫిరాయిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కలిసి ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తన్నాయి.
వరదలు పెరిగితే వాళ్లంతా ఏం కావాలి ?
సహజంగా జులై మధ్య నుంచి ఆగస్టు ఆఖరు వరకూ గోదావరికి ఉధృతంగా వరద తాకిడి ఉంటుంది. ఈసారి సీజన్‌ ప్రారంభంలోనే వరదల ప్రభావం కనిపిస్తోంది. ఇది రాబోయే నెల రోజుల పాటు మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది. అదే జరిగితే నిర్వాసితులు అనేక అవస్థలు పడాల్సి వస్తుంది. గతంలో గోదావరికి పెద్ద వరదలన్నీ ఆగస్టులోనే వచ్చాయి. కాబట్టి వచ్చే నెల పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అత్యంత కష్టకాలం. ఇప్పటికే అవకాశం ఉన్నవారంతా ఒడ్డుకు చేరారు. కానీ గిరిజనలకు మాత్రం కాలనీలు సిద్ధం చేయక, ప్యాకేజీ అందక వరదల్లోనే గడపాల్సిన దుస్థితి దాపురించింది. ఇప్పుడు వరదల్లో వారికి రవాణా సదుపాయాలు కూడా లేవు. నిత్యావసర సరుకులు కూడా అందుబాటులో ఉంచలేదు. గత ఏడాది ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా ఏర్పడిన సమస్యలపై ముంపు బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పట్లో అధికారులు తప్పిదాన్ని అంగీకరించారు. ఈసారి కూడా గత ఏడాది అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నట్టు లేదు. ఉద్దేశపూర్వ కంగానే ఇలా వ్యవహరిస్తున్నారు. ఆహార పదార్థాలు, కిరోసిన్‌ వంటివి అందుబాటులో ఉంచడం మీద శ్రద్ధ పెట్టలేదు. ఇప్పటికైనా యంత్రాంగం కదలాలి. డి.ఆర్‌ డిపోల ద్వారా నిర్వాసితులకు నిత్యావసరాలు పంపిణీ చేయాలి. పడవలు ఏర్పాటు చేసి రవాణా సదు పాయం కల్పించాలి. వరద సహాయక చర్యలు సమగ్రంగా చేపట్టాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పునరావాస ప్యాకేజీ అమలుకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. దానికి భిన్నంగా సాగితే పోలవరం నిర్వాసితుల ఆగ్రహాన్ని ప్రభుత్వం చవిచూడాల్సి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మొత్తం కేంద్రమే భరించాలి. చట్ట ప్రకారం జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టుని నిర్మాణ వ్యయంపై పరిమితులు విధించడం మానుకోవాలి. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి.-వెన్నెల / జిఎన్‌వి సతీష్‌

గిరిజ‌నుల గోడు వినేదెవ‌రు?

‘’దట్టమైన అడవుల్లో పరవళ్లు తొక్కే నదులు.. ఇనుము, బాక్సైట్‌ ఖనిజ నిక్షేపాల మధ్య బతికే గిరిజనులు ఇప్పటికే గనులు, ఆనకట్టలు, కర్మాగారాల కోసం తమ ఇళ్లను, భూములను కోల్పోయారు. ఇప్పుడు కోర్టు తీర్పు మేరకు ఇల్లూపొల్లూ వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చాలు వారు ఎంత దుర్బల, దుర్భర పరిస్థితుల్లో ఉన్నారో చెప్పడానికి’’.

రిజర్వేషన్లు అభివృద్ధికి గొడ్డలి పెట్టు అన్న వాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా అట్టడుగు వర్గాలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు పాలక వర్గాలు తూట్లు పొడుస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా గిరిజనులకు కల్పించిన భూ హక్కు చట్టం నుంచి రిజర్వేషన్ల వరకూ దేని అమలు పైనా ప్రభుత్వాల్లో చిత్తశుద్ధి లేదు. ఎస్టీ రిజర్వేషన్లలో ఇతరులనూ చొప్పించాలని పాలకులు చూస్తుంటే.. కోర్టుల తీర్పులు వాటికి బలాన్నివ్వడం మరింత బాధాకరం. ఉమ్మడి ఏపీలో ఏజెన్సీల్లోని స్కూల్‌ టీచర్ల నియామకాల్లో గిరిజనులకే 100%రిజర్వేషన్లు కల్పించేందుకు ఇచ్చిన జీవోను ఏజెన్సీల్లోని ఇతర వర్గాలకు అన్యాయం జరుగుతుందనే పేరుతో సుప్రీం కోర్టు రద్దు చేసి ఏడాది కావస్తున్నా, దాని పునరుద్ధరణకు రాష్ట్ర సర్కారు సీరియస్గా ప్రయత్నించకపోవడం దారుణం. మన దేశంలో అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావడం కోసం తీసుకొచ్చిన రిజర్వేషన్లకు పాలకులు తూట్లు పొడుస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను సైతం ఏవో లొసుగులను అడ్డం పెట్టుకుని ఉల్లంఘిస్తున్నారు. ఏపార్టీ పాలనా పగ్గాలు చేపట్టినా సరే వాటిలో అగ్రవర్ణాలు, ఆధిపత్య వర్గాలే పెత్తనం చేయడం వల్ల వారికి ఈ రిజర్వేషన్లపై సానుకూల దృక్పథం కొర వడిరది. రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హక్కులపై సదభిప్రాయం లేకపోవడంతో రాజకీయ అవసరాల కోసం పైపై ప్రచారాలు చేసుకోవడం తప్ప నిజంగా మేలు చేసే ఆలోచన కనిపించడం లేదు.
ఒక వైపే ప్రచారం
మన దేశంలో అధికారంతోపాటు ప్రసార సాధనాలను గుప్పిట పెట్టుకున్న ఉన్నత సామాజిక వర్గాలు పీడిత, బాధిత వర్గాలకు రాజ్యాంగపరంగా కల్పించిన వెసులుబాట్లను ప్రచారం చేసినంతగా వాటి అమల్లో లొసుగులపై చర్చ పెట్టవు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ దుర్వినియోగం గురించి జరిగే ప్రచారం ఆచట్టాన్ని వినియోగించుకోలేక ఇబ్బంది పడుతున్నవారి గురించి చెప్పే విషయంలో జరగదు. ఈచట్టానికి అపప్రద తెచ్చిపెట్టడమే వారి ఉద్దేశం కనుక అణచివేతకు గురవుతున్న బాధితులను వదిలేసి, చట్టం దుర్వినియోగం గురించి పెద్దగా చర్చలు పెడుతారు. కానీ ఏ శక్తుల కారణంగా ఇది జరుగుతుందో విశ్లేషించేందుకు మాత్రం మనసు రాదు.
ఏజెన్సీల్లో యువతకు చేదోడైన జీవో అది
బయటి ప్రపంచం పోకడలకు చాలా దూరంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో జనం జీవన శైలి పూర్తి భిన్నంగా ఉంటుంది. వాళ్లకు చదువులు, ఇతర మౌలిక సదుపాయాలు నేటికీ అంతంత మాత్రంగానే అందుతున్నాయి. పైగా ఏజెన్సీ ప్రాంతాల్లో హాస్పిటల్స్‌, స్కూళ్లలో పని చేయాలన్నా కూడా ఇప్పటికీ మైదాన ప్రాంత వాసులు అంతగా సుముఖత చూపడం లేదన్నది అందరికీ తెలిసిన వాస్తవం. దీంతో 1986లో జీవో నంబర్‌ 275 ద్వారా ఉమ్మడి ఏపీలో నాటి సర్కారు ఏజెన్సీల్లో టీచర్‌ ఉద్యోగాలకు గిరిజనులకే 100% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1989లో ట్రైబ్యునల్‌ మధ్యంతర ఉత్తర్వులు, 1998లో సుప్రీం కోర్టు తీర్పుతో ఆ రిజర్వేషన్లు నిలిచిపోయాయి. అయితే 2000 సంవత్సరంలో నాటి ప్రభుత్వం మళ్లీ జీవో నంబర్‌ 3ద్వారా మళ్లీ 100శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై మళ్లీ కొంత మంది కోర్టుకు వెళ్లారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే గిరిజనేతరులకు అన్యా యం జరుగుతోందంటూ వాదనలు వినిపించారు. అయితే గిరిజన యువతలో చదువుకున్న వాళ్లు తమ ప్రాంతాల్లోని స్కూళ్లలో టీచర్లుగా ఉద్యోగాలు పొంది తమ తర్వాత జనరేషన్‌ పిల్లలకు చదువులు చెబుతూ వస్తున్నారు. వారికి ఉపాధి కల్పించడంతో పాటు తమ ప్రాంతానికి మేలు చేయడంలో ఈ జీవో చేదోడుగా ఉండేది. గతఏడాది ఏప్రిల్లో సుప్రీం కోర్టు ఈ జీవోను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ జీవో అత్యంత వివాదాస్పద ఉత్త ర్వుగా జడ్జిలు పేర్కొన్నారు. జీవో నంబర్‌3 రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చారు. అది చెల్లదంటూ తాము ఇచ్చిన ఉత్తర్వును ఉల్లంఘి స్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా నియామకాలు, పదోన్నతులు చేపట్టినట్టయితే 1986 నుంచి జరిగిన నియామకాలన్నీ తిరగదోడతామని హెచ్చరించడం బాధాకరం. వాస్తవానికి ఆ జీవో రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 5 ప్రకారం ఇచ్చారని, ఇది పూర్తిగా చట్టబద్ధమేనని, దీనిపై జుడిషియల్‌ రివ్యూ చేసే హక్కు కూడా ఉండద ని వాదించి గిరిజన హక్కులను కాపాడ డంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్‌ అయింది. ఏజెన్సీల్లో ఇతరుల జనాభా ఎట్ల పెరిగింది?
జీవో నంబర్‌ 3ని మొదటి నుంచి వ్యతిరేకి స్తోంది ఏజెన్సీల్లోని గిరిజనేతర వర్గాలే. ఈ జీవో వల్ల ఇతర వర్గాలకు అన్యాయం జరుగుతోందని వాదిస్తున్నారు. అసలు పరిశీలించాల్సిన విషయం ఏజెన్సీల్లో ఇతర వర్గాల జనాభా ఎలా పెరిగిందన్నది. వాస్తవానికి 1950 నుంచి 80 దశకం వరకు ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజనుల జనాభా 90 శాతం ఉంటే 90ల్లోకి వచ్చేసరికి వారు మైనారిటీలుగా మారిపోయారు. మైదాన ప్రాంతాల నుంచి వలస వచ్చిన భూస్వామ్య, వ్యాపార, గిరిజనేతర వర్గాలు అక్కడి భూమి, ఆర్ధిక వ్యవస్థను తమ గుప్పిట పెట్టుకున్నాయి. జనాభా పరంగానూ మెజారిటీలుగా మారి పోయారు. ఒక్క ఆదిలాబాద్‌ అనే కాకుండా ఏజెన్సీ విస్తరించిన అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. నిజానికి గిరిజన ప్రాంతాల్లో ఇతరులు భూములు కొనడానికి లేదు.ఆ భూపరి రక్షణ హక్కు చట్టాలకు సైతం ఈ వర్గాలు తూట్లు పొడిచాయి. రాజ్యాంగపరమైన రక్షణ ఉన్నా సరే గిరిజన చట్టాలను ఆధిపత్య వర్గాలు నీరు గార్చేశాయి. పెసాచట్టం నిబంధనలకు నీళ్లు వదిలి పెట్రోలు పంపులు, కర్మాగారాలు, సినిమా హాళ్లు, పిండి మిల్లులు ధాన్యం మిల్లులు, ఐస్‌ ఫ్యాక్టరీలు, మద్యం దుకాణాలు.. ఇలా ఒకటేంటి ఏజెన్సీలో అన్నీ బినామీల పేరుతో నడిపిస్తున్నారు. పేరు గిరిజనులది.. పెత్తనం అగ్రవర్ణాల పెద్దలది. గిరిజనుల వనరులను అడ్డం పెట్టుకుని అడ్డంగా సంపాదించేస్తున్నారు. పైగా చట్టానికి తూట్లు పెట్టేందుకు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు కాబట్టి చాపకింద నీరులా పనుల్ని చక్కబెడుతున్నారు. కానీ జీవో 3 ద్వారా గిరిజనులకు దక్కే గుప్పెడు ఉద్యోగాలపై గిరిజనేతరులంతా ఏకమై పోరాటం చేయడం ఘోరం.
అడుగడుగునా ఉల్లంఘనలే
నిజానికి బ్రిటిష్‌ కాలం నుంచి ఊపిరి పోసు కున్న ఏజెన్సీ చట్టాలన్నీ గిరిజన తెగలను గిరిజ నేతరులు, మైదాన ప్రాంత దోపిడీ నుంచి రక్షిం చేందుకు ఉద్దేశించినవే. స్వాతంత్య్ర అనం తరం రూపొందిన 1/70చట్టం ఇందులో కీలక మైంది. రాజ్యాంగ పరిధిలో 1/70చట్టాన్ని నిర్వ చించినా జీవో నంబరు 3దాన్ని బలోపేతం చేసేందుకు తోడ్పడేదే తప్ప ఎంతమాత్ర మూ ఆ చట్రానికి బాహ్యంగా లేదు.కానీ1/70లో భాగమైన అన్ని చట్టాలు ఏండ్లకు తరబడి అడు గడుగునా ఉల్లంఘనకు గురవుతూ వచ్చాయి.
రివ్యూ పిటిషన్‌ వేసి వదిలేస్తరా?
ఏజెన్సీలో ఎస్టీల రిజర్వేషన్లను వ్యతిరేకించే అగ్రవర్ణ, బీసీ వర్గాలు మైదాన ప్రాంతం వచ్చేసరికి రెండుగా విడిపోతాయి. గిరిజనుల జీవన విధానమేంటి? వారి వెనుకబాటు ఏంటి? వారికున్న ఆర్థిక వనరులేంటి? ఆహార భద్రత ఎంత? మౌలిక వసతులు ఏ మేరకు ఉన్నాయి? వంటి ప్రశ్నలకు సమాధానాలను పరిగణనలోకి తీసుకుంటే జీవో 3 వారి త్యాగా లకు పెద్ద తులాభారమేం కాదు. గిరిజన సంస్కృతి,సంప్రదాయాలను రక్షించాలన్న ఆశయంతో తెచ్చిన రాజ్యాంగ నిబంధనలు, చట్టాలు కూడా ఏనాడూ వారికి భద్రత కల్పించింది లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో యువతకు అంతో ఇంతో ఉపాధి కల్పిస్తున్న జీవో నంబర్‌ 3 విషయంలోనూ తెలంగాణ సర్కారు గిరిజనుల కోసం చేసిందేమీ లేదు. ఏడాది క్రితం జీవో రద్దు చేస్తూ సుప్రీం తీర్పు వచ్చింది. అయితే దాని పునరుద్ధరణ కోసం కోర్టులో ఒక రివ్యూ పిటిషన్‌ వేసి గిరిజన సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని కంటితుడుపుగా ప్రకటన చేయడం మినహా చేసిందేమీ లేదు. దాదాపు ఈఏడాది సమయంలో సీరియస్గా ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు.
గిరిజన భూములు ఆక్రమించేదెవరు?
షెడ్యూల్డ్‌ తరగతులు, ఇతర అటవీ వాసుల (అటవీ హక్కుల చట్టం), 2006 చారిత్రకంగా బాధలు పడ్డ వారి హక్కులను పరిరక్షించడానికి ఉద్దేశించింది. దీనినే అటవీ హక్కుల చట్టం అంటున్నారు. అడవుల్లో ఉంటూ భూముల హక్కుల తిరస్కరణకు గురైనవారందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించాలని సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు గిరిజనుల హక్కులను హరించేదిగా ఉంది. ఈ తీర్పువల్ల 16 రాష్ట్రాలలోని 10లక్షలమంది గిరిజనులకు నష్టం కలిగే పరిస్థితి తలెత్తింది. సుప్రీం కోర్టుకు తమ పరిస్థితి ఇంకా నివేదించాల్సిన వారు అనేక మంది ఉన్నారు కనక వీరి సంఖ్య మరింత ఎక్కువే ఉంటుంది. అటవీ హక్కుల చట్టం న్యాయబద్ధతను ప్రశ్నిస్తూ వైల్డ్‌ లైఫ్‌ ఫస్ట్‌ అన్న స్వచ్ఛంద సంస్థ, ఉద్యోగ విరమణ చేసిన కొందరు అటవీ శాఖ అధికారులు పిటిషన్‌ పెట్టుకున్నందువల్ల ఈ అంశం సుప్రీంకోర్టు పరిశీలనకు వచ్చింది. అయితే సుప్రీంకోర్టు తాము వెలువరించిన తీర్పు అమలును నిలిపివేస్తూ ఉత్తర్వు జారీ చేసింది. అటవీ హక్కుల సం రక్షణ చట్టం కింద కొందరి వాద నను తిరస్కరించడానికి గల ప్రక్రియను వివరించాలని రాష్ట్రాలను ఆదేశించింది. సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వు తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలగజేస్తుంది. సాంప్రదాయికంగా అడవుల్లో జీవనం కొనసాగిస్తున్న వారిని ఖాళీ చేయించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం ఇదే మొదటి సారి కాదు. ఇంతకు ముందు ఇలాంటి అర్జీ దాఖలైనప్పుడు సుప్రీం కోర్టు ఉత్తర్వువల్ల 2002,2004 మధ్య అనేకమంది అటవీ వాసులు నిర్వాసితులయ్యారు. ఇది హింసకు, మరణాలకు, నిరసనలకు దాదాపు మూడు లక్షల కుటుంబాలు నిర్వాసితులు కావడానికి దారి తీసింది. తాజా ఉత్తర్వు ప్రస్తుత ప్రభుత్వం గిరిజనులపట్ల అనుసరిస్తున్న విధానానికి అనువుగానే ఉంది. గిరిజనుల ప్రయోజనాలను ప్రభుత్వ న్యాయవాదులు కనక సమర్థించి ఉంటే ఈ ఉత్తర్వు మరోలా ఉండేది. అడవులు తగ్గిపోవడానికి, అటవీ భూములు ఆక్రమణకు గురికావడానికి గిరిజనులే కారణం అని ఈ పిటిషన్‌లో వాదించారు. గిరిజనులు, అడవుల్లో నివాసం ఉంటున్న వారు అటవీ భూములను ఆక్రమిస్తున్నారన్న వాదన ఎంతవరకు నిలబడగలుగుతుంది? వలసవాద ప్రభుత్వం వారి హక్కులకు భంగం కలిగించింది. అప్పుడు కొన్ని నిబంధనలున్నా గిరిజనులు తమ హక్కులను అనుభవించ గలిగారు. అయితే స్వాతంత్య్రం తర్వాత నూతన అటవీ విధానంవల్ల గిరిజనులకు చాలాకాలంగా ఉన్న హక్కులకు భంగం కలిగింది. దీనికి తోడు దేశంలోని భూభాగంలో మూడిరట ఒక వంతు అడవులు ఉండాలన్న విధానంవల్ల గిరిజనుల హక్కులు హరించుకు పోయాయి. అసలు చెట్లే లేని భూభాగాలు కూడా అటవీ శాఖ అధీనంలోకి వచ్చి ఇవి అమాంతం అటవీ భూములైపోయాయి. అటవీ శాఖ వేలాది కిలోమీటర్ల మేర గిరిజనుల భూములను ఆక్రమించింది. 1980నాటి అటవీ (సంరక్షణ) చట్టం,1972 నాటి వన్యప్రాణి (సంరక్షణ) చట్టం కూడా గిరిజనుల హక్కులకు భంగం కలిగించాయి. అంటే నిజానికి అటవీ భూములను ఆక్రమిస్తున్నది ప్రభుత్వమే. అటవీ భూములు తగ్గిపోవడానికి ప్రధాన బాధ్యత గిరిజనులదా, అడవుల్లో ఉండే వారిదా అన్నది ఇప్పుడు కీలకమైన ప్రశ్న. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి గనుల తవ్వకానాకి, పరిశ్రమలు నెలకొల్పడానికి అటవీ భూములను వాడుకున్నారు. గిరిజనులను నిర్వాసితులను చేశారు. ఉదారవాద ఆర్థిక విధానాలు అనుసరిస్తున్నప్పటి నుంచి మునుపెన్నడూ లేని రీతిలో బడా కంపెనీలు, బహుళజాతి గుత్త కంపెనీలు గిరిజన ప్రాంతాలలో ఉన్న వనరులను కొల్లగొట్టడానికి అడవుల్లో తిష్ఠ వేశాయి. కాని అడవులు క్షీణించడానికి నెపం గిరిజనుల మీద తోస్తున్నారు. ప్రైవేటు ప్రయోజనాలకోసం అడవులను కొల్లగొట్టే వారి మీద ఏ నిందా లేదు. అడవుల్లో పర్యావరణాన్ని, వన్య జీవుల్ని నాశనం చేస్తున్నది ఈ కంపెనీలే. అడవులు క్షీణించిపోవడానికి గిరిజనులే కారణం అని వాదిస్తున్నప్పటికీ ఇప్పటికీ దట్టమైన అడవులున్నది గిరిజనులు ఉండే చోటే ఉన్నాయి. అందువల్ల ప్రస్తుతం అనుసరిస్తున్న అటవీ పరిరక్షణ విధానాలు సక్రమమైనవేనా అని ఆలొచించాలి.అటవీ శాఖ, అధికారులు, అడవులను పరిరక్షించడానికి పాటుపడ్తున్నామని చెప్పుకునే కులీన, పట్టణ ప్రాంత వాసులు అటవీ హక్కుల చట్టాన్ని వ్యక్తిరేకిస్తూనే ఉన్నారు. ఈ చట్టానికి నిబంధనలు తయారు చేసినప్పటి నుంచీ ఇదే ధోరణి. ఈ చట్టం అమలుపై నిరంతరం విమర్శలు వస్తూనే ఉన్నాయి. అటవీ భూములపై హక్కులను గుర్తించడం మూడు దశల్లో జరుగుతుంది. గ్రామసభ ఈ హక్కుల పరిరక్షణకు సిఫార్సు చేస్తుంది. ఆ తరవాత ఈ అభ్యర్థన సబ్‌ డివిజన్‌ వ్యవస్థ స్థాయికి వెళ్తుంది. ఆ తరవాత పరిశీలనకోసం జిల్లా స్థాయి అధికారులకు పంపుతారు. ఇందులో కేవలం అధికారులు మాత్రమే ఉంటారు. ఇందులో అటవీ శాఖ అధికారులు కూడా ఉంటారు. హక్కులు కోరే వారి వాదనను తిరస్కరించడం ఎప్పుడూ అందులోని మంచి చెడ్డలపై ఆధారపడుతుందని కాదు. ఈ తిరస్కరణ చాలావరకు ఏకపక్షంగా ఉంటుంది. గ్రామసభ సిఫార్సును వ్యతిరేకించే వర్గాలు ఉంటాయి. ఈ వర్గాలు అటవీ భూములను ప్రైవేటు రంగం వారికి, వ్యాపరస్థులకు అప్పగించాలని చూస్తాయి. చిన్నా చితక కారణాల ఆధారంగానే గిరిజనుల హక్కులను తిరస్కరించిన సందర్భాలున్నాయని గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖే అంగీకరించింది. ఈ తిరస్కరణను సవాలు చేస్తూ కోర్టుల్లో దాఖలైన లక్షలాది పిటీషన్లు విచారణకే నోచుకోవడం లేదు. తగిన విధానం అనుసరించకుండా ఎవరినీ నిర్వాసితులను చేయకూడదని అటవీ హక్కుల చట్టంలోని 4 (5) సెక్షన్‌ చెప్తోంది. కానీ అధికారులే దీన్ని ఉల్లంఘిస్తుంటారు. చట్టం నిబంధనలను ఖాతరు చేయకుండా తిరస్కరించిన సందర్భాలు కొల్లలుగా ఉన్నాయి. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా తిరస్కరిస్తున్న ఉదంతాలెన్నో! నిబంధనల ప్రకారం అయితే క్షేత్ర స్థాయిలో సర్వే చేసి కాని నిర్ణయించకూడదు. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ కేసును సుప్రీంకోర్టు పరిష్కరించిన తీరు కూడా ఏ మాత్రం నమ్మకం కలిగించేదిగా లేదు. గిరిజనులకు సంబంధించిన అంశాల మీద న్యాయమూర్తులకు, న్యాయవాదులకు అవగాహన ఉన్నట్టు లేదు. రాజ్యాంగం ప్రకారం గిరిజనులను ప్రత్యేకంగా చూడవలసిన అవసరం ఉంది. –మన్నారం నాగరాజు

వైవిద్య జీవ‌నం..అడ‌వులే జీవ‌నాధారం

అడవి మార్గంలో రైలులో ప్రయాణిస్తుండగా దేవులపల్లి భావోద్వేగానికి గురయ్యారట. అందులోంచి పుట్టిన పాట..
‘ఆకులో ఆకునై.. పువ్వులో పుప్వునై.. కొమ్మలో కొమ్మనై.. నునులేత రెమ్మనై.. ఈ అడవి దాగిపోనా.. నేనెటులైనా ఇచటనే ఆగిపోనా..’ అన్నది. అడవి అందాలను ఆస్వాదించాలని ఎవరికి మాత్రం ఇలా అనిపించదు..? పచ్చని చెట్ల నీడన సేదదీరాలని, గలగల పారే సెలయేటి నీటిని దోసిటపట్టి తాగాలని, పక్షుల కిలకిలా రావాలను, పూల సుంగధాలను ఆస్వా దించాలని, చెట్టుపై మాగిన పండ్లను కోసి తినాలని.. ఇలాంటి అనుభవం జీవితంలో ఒక్కటైనా ఉండాలని ఎవ్వరనుకోరు..! ఇంతటి స్వచ్ఛమైన జీవితం అనుభవించే తెగ.. ఆదివాసీ. వారి మనుగడకు ఎన్ని అవాంతరాలు ఎదురవుతున్నా, అభివృద్ధికి దూరంగా ఉంటున్నా.. అడవినే నమ్ముకుని అక్కడే ఉండిపోతున్నారు. వారి జీవనం, సంస్కృతి, సంప్రదాయాలలో వైవిధ్యం ఉంటుంది. నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం. ఈ నేపథ్యంలో నల్లమల గిరిజనుల జీవనంపై ప్రత్యేక కథనం.

  • ా సంస్కృతికి ప్రాణమిచ్చే ఆదివాసులు
  • ా అభివృద్ధి దరిచేరని జీవితాలు
  • ా అందని ప్రభుత్వ పథకాల ఫలాలు
  • ా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఆదర్శంగా నిలుస్తున్న గిరిజనులు
  • ఆదివాసీలు,గిరిజనులు ఏ దేశానికైనా మూలవాసులన్నది మానవ శాస్త్రవేత్తల భావన. సమాజంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న సమూహాలు గిరిజన తెగలు. వీటికి సామా జికంగా, సాంస్కృతి కంగా ప్రత్యేకతలున్నాయి. వీటితో పాటు వైవిధ్య చరిత్ర,సంస్కృతులున్నాయి. జన జీవన స్రవంతిలో భాగంగా కొందరు..దూరంగా ఇంకొందరు జీవనం సాగిస్తున్నారు. తెలంగాణలోని వివిధ ప్రాంతా ల్లోనూ భిన్న తెగలకు చెందిన గిరిజ నులున్నారు. ప్రస్తుతం భారత జనాభాలో దాదాపు 8`9శాతం ప్రజలు వివిధ గిరిజన సమూహాలకు చెందినవారే. ఆంథ్రోపాలజీకల్‌ సర్వే ఆఫ్‌ ఇండి యా అధ్యయనం ప్రకారం ఒక్కో గిరిజన తెగ ఒక నిర్ధిష్టమైన భౌగో ళిక ప్రాంతానికి పరిమితమై ఉంటుంది. ఒక గిరి జన తెగ విభిన్నరాష్ట్రాల్లో విస్తరించి ఉండటం అరుదు. ప్రతి గిరిజన సమూహానికి ఒక నిర్ధిష్టమైన పేరుంటుంది. ఒకేరకమైనభాష,సంస్కృతిఉంటాయి. ఒకేరకమైన ఆచార వ్యవహారాలు కలిగి ఉంటారు. ఒకే న్యాయం,ఒకేచట్టం ఉంటాయి. అంతర్వివాహ పద్దతిని ఆచరిస్తారు. గిరిజన సమూహాలకు ప్రత్యే కమైన మతవిశ్వాసాలు,ఆరాధన పద్దతులు ఉం టాయి. ముఖ్యంగా ప్రకృతి శక్తులను ఆరా ధిస్తారు. వీటితోపాటు ప్రతిగిరిజన సముదాయా నికి ఒక స్వయం ప్రతిపత్తిగల రాజకీయ వ్యవస్థ ఉంటుంది. ఈనాటికీ చాలా తెగలు ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో ప్రవేశించినా,తమను తాము నియంత్రిం చుకునే స్వీయ రాజకీయ వ్యవస్థను(ఆదివాసీ మండలి) కొనసాగిస్తున్నాయి. ఆయా తెగల పెద్దలు ఇందులో సభ్యులుగా ఉంటారు. సామాజిక, ఆర్ధిక, రాజకీయ కార్యకలాపాలను వీరే నియంత్రి స్తుం టారు. అన్నింటికీ మించి ఇవి ఏకరూపత కలిగిన సమూహాలు. వీటన్నింటిలోనూ గోత్ర వ్యవస్థ అంత స్సూత్రంగా పనిచేస్తుంది. గిరిజన సమాజంలోని సభ్యుల ప్రవర్తనను గోత్రవ్యవస్థ నియంత్రిస్తుంది. స్వగోత్రికలు రక్తబంధవులనే భావన కలిగి ఉంటా రు. అందుకే స్వగోత్రీకులు పెళ్లిళ్లు చేసుకోరు. ప్రతి గోత్రానికి ఓటోటెమ్‌ ఉంటుంది. టోటెమ్‌ అంటే మతపరమైన చిహ్నం. గోత్ర సభ్యులంతా ఆ మత పరమైన చిహ్నం నుంచి ఉద్భవించామనే భావనతో దాన్ని పవిత్రంగా భావిస్తారు. ఆరాధాస్తారు. ఈ చిహ్నం ఒక వ్యక్తి కావోచ్చు.. జంతువు,చెట్టు లేదా ప్రకృతిలోని ఏదైనా కావోచ్చు. అది వారి తెగకు గుర్తు.
  • దేశంలో మూడు రకాల తెగలు : భారత్‌లో మనకు మూడు రకాల గిరిజన తెగలు కనిపిస్తాయి
  • 1) దట్టమైన అటవీ ప్రాంతాల్లో,పర్వత ప్రాంతా ల్లో జీవించేవారు. వీరు జనజీవన స్రవంతికి దూరంగా ఉంటారు. అడవులు, అటవీ సంపదపై ఆధారపడి జీవిస్తారు. ఆర్ధికం గా,రాజకీయంగా స్వతంత్రంగా జీవించినప్ప టికీ ఆర్ధికంగా వెనకబడిన తెగలివి.
  • 2) అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్నా,వ్యవసాయం ప్రధానంగా చేసే ఆదిమ తెగలు. వీరికి పాక్షికంగా గిరిజనేతరులతో సంబంధా లుంటాయి. సామా జిక,వ్యాపార సంబంధా లుండే అవకాశముంది.
  • 3) మైదాన ప్రాంతాల్లోని గిరిజన సమూహాలు. జనజీవన స్రవంతిలో భాగంగా ఉండి ఆధునిక జీవన విధానానికి దగ్గరగా ఉంటారు. ప్రభుత్వం కల్పించే చాలా అభివృద్ధి పథకాలు ఈమైదాన ప్రాంతాల్లో స్థిరపడిన,గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు దగ్గరగా ఉన్న తెగలు ఎక్కువగా ఉపయోగించు కుంటాయి. అందుకే వారిలో విద్య,ఆర్ధిక అభివృద్ధి కనిపిస్తుంది. ఉదాహరణకు ఉత్తర భారతదేంలో తీసుకుంటే బిల్లులు,సంతాల్‌(మధ్యప్రదేశ్‌)లు, ముండాలు (బీహార్‌),మహారాష్ట్ర,తెలంగాణలోని రాజ్‌ గోండులు,లంబాడీలు జనజీవన స్రవంతికి చాలా దగ్గరగా ఉండే సమూహాలు. అందుకనే వీరిలో రాజకీయ,ఆర్ధిక,విద్యాపరమైన అభివృద్ధి కనిపిస్తుంది. అదే చెంచు లాంటి తెగలను చూస్తే వారింకా జనజీవన స్రవంతికి దూరంగానే ఉన్నారు.
  • ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీలు అంత రించిపోతున్న తరుణంలో వారి సంరక్షణ దిశగా ఐక్యరాజ్యసమితి చర్యలు చేపట్టింది. ఏటా ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించాలని 1994లో ప్రకటించింది. 1997లో గిరిజనులకు ప్రత్యేక చట్టాలు, హక్కులను కల్పిస్తూ.. ప్రపంచ దేశాల ప్రతినిధులను తీర్మానానికి ఆహ్వానించింది. 143 ఐరాస సభ్యుదేశాలు ఓటింగ్‌లో పాల్గొనగా 125దేశాల ప్రతినిధులు తీర్మానాన్ని ఆమోదిం చారు. 14 మంది తటస్థ వైఖరి తెలపగా, కేవలం నలుగురు వ్యతిరేకించారు. అప్పటి నుంచి గిరిజన హక్కులు, వారికి ప్రభుత్వాలు కల్పిస్తున్న రాయితీల గురించి అవగాహన కల్పించేందుకు ఏటా ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో 5వేల ఆదివాసీ తెగలున్నాయి. 6, 700 భాషలు మాట్లాడుతున్న వీరి జనాభా 40 కోట్ల పైమాటే. ఆదివాసీ తెగలు,భాషలు పలు కారణాలతో అంతరించిపోతున్న నేపథ్యంలో ఆది వాసుల సాంస్కృతిక జీవనాన్ని, వారిహక్కులను పరిరక్షించాలనే లక్ష్యంతో ఆదివాసీ దినోత్సవం జరపాలని ఐక్య రాజ్యసమితి తీర్మానించింది. ఈ తీర్మానం అమలులోకి తెచ్చింది.
  • ఆదివాసీ ప్రపంచం అభివృద్ధి ముసుగులో : మన దేశ పార్లమెంటులో ఎంతో మంది ఆదివాసీ ఎంపీలు ఉన్నా ఆదివాసీ సమ స్యలపై వారేనాడూ నోరు విప్పింది లేదు. ఈశాన్య రాష్ట్రాల్లో ఆదివాసులపై నరమేథం కొనసాగు తోంది. అంతర్యుద్ధం వంటి పరిస్థితుల మధ్యన ఆదివాసులు నలిగిపోతున్నారు. ఆదివాసులను పూర్తిగా అంతరింపజేసి వారి సమాధులపై సామ్రా జ్యాల నిర్మాణం జరుగుతున్న ఆధునిక చరిత్ర నేటికాలంలోనూ సాగుతోంది. రెడ్‌ ఇండియన్‌లను నిర్మూలించిన అమెరికా సంయుక్త రాష్ట్రాల పంథా లో ఆదివాసుల అంతానికి అన్ని దేశాలూ నడుం కట్టిన పరిణామాలను ఇప్పుడు ప్రతి దేశంలోనూ చూడవచ్చు. ఈచరిత్రను మనదేశ పాలకులు కూడా అందిపుచ్చుకున్నారు. మరోవైపున ఆదివాసుల రక్షణకు ఐరాస తీర్మానించిన విధానాలను వివిధ దేశాల ప్రభు త్వాలు పూర్తిగా పక్కనబెడుతున్నాయి. ఈ క్రమం లో ఆదివాసుల ఉమ్మడి జీవన వ్యవస్థ వార సత్వం ధ్వంసమైపోతోంది. మన దేశంలోనూ ఆదివాసీల హక్కులు, రాజ్యాంగ పరమైన రిజర్వే షన్లను అమలు చేయడంలో మన పాలకవర్గాలు తీవ్రంగా విఫలమ య్యాయి. ఆనకట్టలు, ప్రాజెక్టు లు, మైనింగ్‌..ఇలా దేశంలో ఏ భారీ నిర్మాణాలకు పూనుకున్నా బలవు తున్నది ఆదివాసీలే. నిత్యం వీరు ఎదుర్కొంటున్న ప్రాణాంతక వ్యాధులకు చికిత్స లేదు. వీరిభాషకు గుర్తింపు లేదు. ప్రాణా లకు విలువ లేదు. వారి చరిత్రకు గౌరవం లేదు. ఈ విధ్వంసకర అభివృద్ధి నుంచి తమ రక్షణకు ఆదివాసీ తెగలు ఏకమ వ్వాలి. మన దేశ మైనింగ్‌ మాఫియా దోపిడీలో ప్రతి ఆదివాసీ అనాథ అయితే ఓపెన్‌ కాస్టులు వారి శ్మశాన వాటికలు. ఈశ్మశాన వాటికల్లో ఆది వాసులను తగులబె డుతున్న బహుళజాతి కంపె నీలకూ,వారికి వత్తాసుగా నిలుస్తున్న దళారీ పాల కవర్గాలకూ వ్యతిరేకంగా ఆదివాసులు చేస్తున్న పోరాటాలకు సకలవర్గాల ప్రజలూ అండగా నిల వాలి. ఆదివాసులు తమ అస్తిత్వాన్ని, మను గడను కోల్పోతే, ఈసమాజానికీ,చరిత్రకీ,సంస్కృతికీ, సంప్ర దాయాలకూ చాలా ప్రమాదమని భావించక తప్పదు.
  • షెడ్యూల్డ్‌ ప్రాంతంలో గిరిజన చట్టాల ఉల్లంఘన
  • రాజ్యాంగం కల్పించిన 5వ షెడ్యూల్‌లో గిరిజనుల స్వయం ప్రతిపత్తి, గ్రామస్వరాజ్యం గిరిజనులను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలనీ, నీళ్లు, అడవి, భూమి వనరుల మీద గిరిజనులకు సంపూర్ణ హక్కు ఉండాలని చెప్పింది. గిరిజన భాషా, సంస్కృతి, వేష ధారణ, గిరిజన ఆవాసాలు అభివృద్ధి చెందాలంటే 5వషెడ్యూల్‌ చట్టాలు పకడ్బందీగా అమలు కావాలి. అందుకు రాష్ట్ర గవర్నర్‌ ఎప్పటికప్పుడు గిరిజనుల స్థితిగతులపై పర్యవేక్షించాలి. గిరిజనులను సమా జంలో భాగస్వాములు చేయడానికి విధానాలు సవరించుకోవడం కోసం ప్రత్యేక ప్రొవిజన్లు ఏజెన్సీ లో కల్పించబడ్డాయి. గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు రాజకీయ ప్రాతినిధ్యం గిరిజను లకు కల్పించినా సంపూర్ణంగా అమలు కావడం లేదు.
  • పండుగలంటే ప్రాణం : గిరిజనులు సాంప్రదాయ పద్ధతిలో పండుగలు జరుపుకుంటారు. హిందు వులు జరు పుకునే సంక్రాంతి, దసరా, దీపావళి పండుగలతో పాటు గోండులు ప్రతి నెలా ఒకపండుగ చేసు కుంటారు. దసరా అనంతరం గిరిజన గ్రామాల్లో దీపావళి వేడుకలు ప్రారం భమవుతాయి. దీపావళి సందర్భంగా గిరిజన గ్రామాల్లో దండారి నృత్యం చేస్తారు.పక్క గ్రామా లవారితో సంబంధాలు పెంచు కోవడం కోసం దండారి బృందాలు పక్క గ్రామా లకు అతిథులుగా వెళ్లివారి ఐక్యతను చాటిచెబు తారు. చైత్రమాసంలో చెంతు భీమన్న పండుగ జరిపి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. మేలో పెర్సాపేన్‌ పూజలు, జూన్‌ లో మెహతుక్‌ పండుగ, జూలైలో అకోపేన్‌ పూజలు, ఆగస్టులో పొలాల,సెప్టెంబర్‌లో పెత్రమాస (పెద్దలపండుగ) చేసుకుంటారు. అక్టోబర్‌లో దసరా, దీపావళి, డిసెంబర్‌లో సెట్టి పండుగ చేసు కుంటా రు. జనవరిలో సం క్రాంతి,ఉగాది చేసుకుంటారు. గిరిజన జీవన విధా నంలో పండుగలు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరిం చుకుంటాయి.
  • గూడేల్లో కనీస సౌకర్యాలు కరువు : రెండు తెలుగు రాష్ట్రాల గిరిజన గ్రామా ల్లో వర్షాకాలంలో పొంగిపొర్లే వాగులు ఆది వాసీ గ్రామాలను బాహ్య ప్రపంచంతో వేరు చేస్తున్నాయి. వ్యాధులతో బాధ పడుతున్న ఆదివాసులు వాగులు దాటుకొని ఆసుపత్రులకు రావడం కూడా గగనమే. రోడ్డు సౌకర్యం సరిగాలేక గ్రామాల్లో అభివృద్ధి కనిపిం చడం లేదు. కనీసవతసతులైన రోడ్లు,రవాణా, తాగు,సాగునీరు,విద్యుత్‌,విద్యా వైద్యం తదితర వసతులకు ఆదివాసీ గ్రామాలు నోచు కోవడం లేదు.104,108అంబులెన్స్‌లు కూడా వెళ్ల లేని గ్రామాలు ఏజెన్సీలో అనేకంగా ఉన్నాయి. వాగుపై వంతెనలు నిర్మించకపోవడంతో వర్షా కాలంలో వాగులు ప్రవహిస్తే గిరిజనులు బాహ్య ప్రపంచాకి దూరంగా ఉండిపోతున్నారు. ఫలితంగా అంటు వ్యాధులు ప్రబలితే వైద్యం అందక గ్రామా ల్లోనే తనువు చాలిస్తున్నారు. గిరిజన గ్రామాల్లో మంచినీటి వనరులున్నా విద్యుత్‌ సమస్యలతో పథకాలు పని చేయక కలుషిత నీరు తాగుతూ అనారోగ్యానికి గురవుతున్నారు.
  • మారని జీవితాలు :పాలకులు, అధికారులు మారుతున్నా ఆదివాసుల జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదు. గిరిజనుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఐటిడిఎ ఏర్పాటు చేసి కోట్లాది రూపా యలు విడుదల చేస్తున్నా అవి వారిదరి చేరడం లేదు. ఐటిడిఎలో కీలక అధికారుల పోస్టులు కూడా ఖాళీగా ఉంటుండడంతో అభివృద్ధి పథకాల అమ లులో తీవ్ర ఇబ్బందులు ఎదురవు తున్నాయి. ఆదివాసీల సంక్షేమంకోసం ఐటిడిఎ ద్వారా ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు అమలుకు నోచుకోవడం లేదు.ప్రతి ఏడాది ఆదివాసులను జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. వందల సంఖ్యలో గిరిజనులు మరణిస్తున్నా ప్రభుత్వాలు మాత్రం కరు ణించడం లేదు. శాశ్వత పరిష్కారాలను కను గొన డానికి ప్రయత్నించడం లేదు. ఏజెన్సీ ప్రాంతం లోని ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చాలాపోస్టు లు ఖాళీగా ఉన్నాయి.
  • రైతులపై కరువు ఛాయలు : అటవీ హక్కు చట్టంతో కొంతమంది ఆది వాసులకు ప్రయోజనం చేకూరినా వాటి ఫలాలు పూర్తిగా పొందలేకపోతున్నారు. గిరిజనుల భూ సమస్య పరిష్కరించడంలో ఐటిడిఏ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారనే విమర్శ లున్నాయి. వారు పండిరచే పంటకు సరైన మార్కెట్‌ సౌకర్యం కూడా కల్పించడంలో ప్రభుత్వం విఫల మైంది. పంటలు నష్టపోతే నష్టపరిహారం సైతం పొంద లేకపోతున్నారు. గిరిజనుల భూముల సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ స్థానంలో కూడా రెగ్యులర్‌ అధికారి కరువై పోవడంతో ఇన్‌ఛార్జీలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. అయితే ఇటీవల తెలంగాణా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన హరిత హారం పథకం కూడా గిరిజనులకు కష్టాలను తెచ్చి పెడుతోంది. కొన్ని చోట్ల గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వక పోగా, హరితహారం పేరుతో పొలాల్లో గుంతలు తవ్వడం తో గిరిజనులు ఆందోళన చెందు తున్నారు. –గునపర్తి సైమన్‌

మైనింగ్‌ వద్దూ…రాజ్యాంగ చట్టాలే ముద్దు!

దేశానికి స్వాతంత్య్రంవచ్చి 74సంవత్సరాలు అవు తోంది. ఇన్నేళ్లుయినా ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజనుల స్థితిగ తులు మారలేదు. సంస్కృతి,కట్లుబాట్లు,సాంప్రదాయాలు అన్నీ అంతరించి పోతున్నాయి. అభివృద్ధిపేరుతో గిరిజన ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు,డ్యామ్‌లు,రోడ్లువిస్తరణ,మైనింగ్‌ వంటి ప్రాజెక్టుల నిర్మాణం కారణంగా గిరిజనులు వారి భూములను కోల్పోతూ మరింత నష్టపోతున్నారు. అభివృద్ధింటే ప్రజల్ని భాగ స్వాములను చేయాలి. కానీఏజెన్సీ గిరిజన ప్రాంతంలో అది జరగడంలేదు. ప్రభుత్వం వారి మనోభావాలను పక్కన పెట్టి గిరిజనుల వనరులు దోచుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తుంది.

Read more

ఆదివాసులకు పోడు భూములు అందని ద్రాక్షేనా

’పోడు భూముల సమస్య ఎక్కడ లేకుం డా ఉంది?ఖమ్మంలో ఉంది. వరంగల్‌లోఉంది. నిజామాబాద్‌లో ఉంది. 60ఏండ్లుగా ఈపెద్ద మను షులు దీనికి పరిష్కారం చూపలేదు. మేము కొంత వరకు చేశాం. కానీ వచ్చే టర్మ్‌లో ఈ పోడు భూ ములు, గిరిజన భూముల స్టోరీ ఎక్కడోకాడ అయి పోవాలి. అడవుల నరికివేత ఆగాలి. సాగు చేసుకున్న వాటికి హక్కులు రావాలి. తప్పకుండా ఈ పోడు భూములు దున్నుకునే వారికి పట్టాలి ప్పించి వారి హక్కులు కాపాడతాం. నేనే వచ్చి ఆ పని చేయిస్తా’’. ఇది 2018 డిసెంబర్‌లో కుమ్రం భీం-ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూరు నియోజకవర్గానికి ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్బంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ. కానీ జరుగుతున్నదేమిటి?
మోసమంటే తెలియని అమాయక గిరిజ నులకు సొంత ఆస్తి అంటూ ఉందంటే అవి పోడు భూములు మాత్రమే. కానీ ఇప్పుడు ఈ భూములపై పాలకుల కన్ను పడిరది. మోకాలికి బోడు గుండుకు ముడిపెట్టినట్టు అటవీ విస్తీర్ణం తగ్గిపోయిందని, దాన్ని పెంచడానికి పోడు భూముల్లో మొక్కలు నాటడానికి అటవీ శాఖాధికారులు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి టీఆర్‌ఎస్‌ అధికారంలోకొచ్చాక ప్రభుత్వం హరితహారం పేరుతో పోడు భూముల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అటవీ భూముల చుట్టూ కందకాలు తవ్వి గిరిజను లకు వెళ్లనీయకుండా చేస్తోంది. ఐదారేండ్లుగా పోడు భూముల వివాదం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. ప్రతి ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ప్రారం భంలో అటవీ అధికారులు పోడు భూముల్లో సాగును అడ్డుకోవడం, గిరిజనులు ప్రతిఘటించడం జరుగుతోంది. కానీ రెండేండ్లుగా పోడు భూముల వ్యవహారం తారా స్థాయికి చేరింది. తమ భూము ల్లోకి వచ్చిన అటవీ శాఖాధికారులను గిరిజనులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు.
పోడుతోనే అటవీ విస్తీర్ణం తగ్గుతోందా?
గిరిజనులు పోడు వ్యవసాయం చేయ డంతో అడవులు తగ్గిపోతున్నాయని ప్రచారం ఉంది. కానీ ఇందులో ఏమాత్రమూ వాస్తవం లేదు. విసిరేసినట్టు ఉండే గిరిజనగూడాల్లో పదుల సంఖ్య లోనే ఆవాసాలుంటాయి. వారు మహా అయితే పది ఇరవై ఎకరాల్లో పోడు సాగు చేస్తుంటారు. కానీ వారు ఆ ప్రాంతంలో ఉండడం చేత అటవీ సంరక్షణకు ఎంతగానో తోడ్పడుతుంటారు. కానీ పాలకులు గిరిజనులతోనే అడవంతా నాశనమవు తున్నట్టు వారిపై నిందలు మోపుతుంటారు. అనాదిగా అటవీ సంపదపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గిరిజనులు అటవీ ఫలాలు అను భవిస్తూనే అడవులను సంరక్షిస్తున్నారనేది ముమ్మాటికీ వాస్తవం.
కలప స్మగ్లర్ల సంగతేంటి?
అడవుల విస్తీర్ణం నానాటికీ తగ్గిపో తోందన్నది జగమెరిగిన సత్యం. అయితే దీనికి ప్రధాన కారణం కలప రవాణానే అనేది అందరికీ తెలిసిందే. కానీ ప్రభుత్వం అసలు విషయాన్ని పక్కనబెట్టి పోడే కారణమని అసత్య ప్రచారం చేస్తోంది. అటవీ విస్తీర్ణం పెంచడానికి పోడు భూ ముల్లో మొక్కలు నాటడానికి యత్నిస్తోంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలప రవాణా చేస్తూ పట్టుబడిన ఘటనలు రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. ఈవార్తలు లేకుండా దినపత్రికలు వెలువడవని రోజుండదంటే అతిశ యోక్తి కాదు. దీనికి రాజకీయ అండదండలు, ఇంటి దొంగల సహకారం పుష్కలంగా ఉంటోంది. ఇలా వాస్తవాలను మరుగునపడేసి ప్రభుత్వాలు అటవీ విస్తీర్ణం పెంచడానికి గిరిజనులనే సమిధులుగా చేయడం ఆక్షేపణీయం. ఇప్పటికైనా గిరిజనులు కొండకోనల్లో ఉండడంతోనే అడవులు రక్షింపబడ తాయని తెలుసుకోవాలి. వారికి న్యాయం బద్ధంగా పోడు భూములకు హక్కు పత్రాలిచ్చి బతుక్కు భరోసా కల్పించాలి. ఈ విషయంలో వామపక్షాలు నిరంతరంగా పోరాడుతూనే ఉన్నాయి.
– రాపర్తి దత్తాత్రి

ఆదివాసుల ఆపన్న హస్తం సమత సంస్థ

విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వ యంత్రాంగంతో పోటీపడి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించే శక్తి ఎన్‌జీఓ లకు ఉందని సమత నిరూపిస్తోంది. విశాల మైన సామాజిక దృక్పథంతో కరోనావ్యాప్తి లాక్‌డైన్‌ సమయంలో అన్నార్తులకు అండగా నిలిచింది. నిబద్ధతతో సంక్షేమ కోణంలో సేవ లందిస్తున్న సమత సేవలను అటు విశాఖ స్మార్ట్‌ సిటీ మురికివాడ ప్రజలు ఇటు గిరిజ నులు ప్రశంసలు కురిపిస్తున్నారు. బొర్రా గ్రామ పంచాయతీ సర్పంచ్‌ జన్నిఅప్పారావు అధ్యక్ష తన, జరిగిన పంపిణీ బహిరంగసభకు సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీ రెబ్బప్రగాడ రవి ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. ప్రజలు మహ మ్మారి కరోనావల్ల టూరిజం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి కుటుం బాలు దయ నందన పరిస్థితులను ఎదుర్కొంటు న్నారన్నారు. ఈరకంగా నేను ఈసేవ చేయడం సంతోషంగా ఉందన్నారు. సర్పంచ్‌ జన్ని అప్పారావు మాట్లా డుతూ ఈకరోనా సమయంలో సమత సేవలు మరువలేనిది అంటూ అభినందన తెలిపారు. కరోనా మహమ్మారి పుణ్యమా అని ఎంతో మంది ప్రజలు ఉపాధి లేక ఆకలితో ఇబ్బంది పడుతున్న సమయంలో సమత ముందుకు వచ్చి పేద ప్రజల ఆకలి తీర్చిడం వారికి రుణపడి ఉంటామన్నారు. ఈ పంచాయితీలో సుమారుగా 500 మంది పేద తెల్లరేషన్‌ కార్డు కలిగిన కుటుంబాల వారికి సుమా రుగా 1800 వందల రూపా యలు విలువ చేసే నిత్యావసర వస్తువులు ఒక్కొకరికి పంపిణీ చేయడం జరిగింది. ఈసందర్భంగాబొర్రా పంచాయితీ సర్పంచ్‌ జన్నిఅప్పారావు 14 గిరిజనగ్రామాల తరు పున సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రెబ్బా ప్రగడ రవికి పుష్పగుచ్ఛాలిచ్చి ఘనంగా సత్క రించారు. తర్వాత మైనింగ్‌ పోరాట యోధులుగెమ్మెల దేవకుమర్‌, స్వర్గీయ దోనేరు రాము సతీమణి దొనేరు పోల్లు గార్లను రవిగారి చేతుల మీదగా ఘనంగా సత్కరిం చారు. కార్యక్రమంలో గ్రామప్రజలు, వార్డ్‌ నెంబర్స్‌ గైడ్‌ యూనియన్‌ సభ్యులు పాల్గొ న్నారు. విశాఖనగంర మురికివాడ ప్రాంతాలు, జిల్లా గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో సుమారు రూ.50లక్షలతో సుమారు మూడు వేల మంది కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేసింది.
సమతకు కృతజ్ఞతలు -జన్ని అప్పారావు, సర్పంచ్‌,బొర్రా పంచాయితీ
గిరిజన పేదప్రజల ఆకలి తీర్చే నిత్యావసర సరకులు ఐదువందల కుటుంబాలకు పంపిణీ చేసిన సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రెబ్బాప్రగడ రవికి కృతజ్ఞతలు.యావత్‌ భారతదేశ ఆదివాసీ తెగలన్నీ సమతకు రుణపడి ఉన్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా తమ ప్రాంతాల్లో ఉన్న వనరులు పరిరక్షణకు సమత తీర్పు మాకు వజ్రాయుధం లాంటి తీర్పుకు రవి చేసిన పోరాటం గిరిజన భావితరాలకు స్పూర్తిదాయకం.
కందుకూరి సతీష్‌ కుమార్‌

సంస్కరణలు ఎవరి కోసం

‘మీరు సంస్కరణలకు అను కూలమా, లేదా ప్రతికూలమా?’ అని నిరంతరం అడుగు తుంటారు. ఏ సంస్కరణ కూడా సంపూర్ణం కాదు. ప్రతీ సంస్కరణకూ కొంత విషయం వుంటుంది, ఒక ప్రయోజనం వుంటుంది. ఏ నిర్దిష్ట సంస్కరణ కైనా మద్దతివ్వాలా లేక వ్యతిరేకిం చాలా అనేది ఇవి నిర్ణయిస్తాయి. ఈసంస్క రణలనేవి మన ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడ తాయా,వారి జీవనో పాధులు,దేశ ఆర్థిక సార్వభౌమా ధికారం బలోపే తం అవుతుందా అన్నదే ఇక్కడ కీలకమైన అంశంగా వుంటుంది. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకు వచ్చిన ఇన్ని దశాబ్దాల కాలంలో మా వైఖరి ఇలానే వుంటూ వచ్చింది. ఇకపై కూడా ఇలాగే కొనసాగుతుంది’

మూడు దశాబ్దాలుగా భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు కొనసాగుతున్నాయి. ఈ నేప థ్యంలో కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా,కనీస మద్దతు ధరకు చట్ట బద్ధమైన హామీ కల్పించాలంటూ మనరైతాంగం కనివినీ ఎరుగని రీతిలో పోరాటం కొనసాగి స్తూనే వుంది. శతాబ్దం క్రితం బలవంతంగా నీలిమందు మొక్కలను పెంచడానికి నిరసనగా జరిగిన చంపా రన్‌ సత్యాగ్రహం స్మృతులు గుర్తుకు వస్తు న్నాయి. కార్పొరేట్‌ వ్యవసాయం, చిన్న మొత్తాల్లో ఉత్పత్తిని దెబ్బతీయడం (మోడీపెద్దనోట్లరద్దు),ఆహార కొర తలు…ఇవన్నీ కలిసి కరువు కాటకాలు పెంచేలా చేయవచ్చు.
పేదలను పణంగాపెట్టి గరిష్టస్థాయిలో లాభా లు ఆర్జించడం,పెరుగుతున్న దారిద్య్రం,మరింతగా విస్తరిస్తున్న ఆర్థిక అసమానతలు,అన్ని దేశాల్లో తీవ్రంగా పడిపోయిన దేశీయ డిమాండ్‌ పైనే దశా బ్దాల తరబడి సంస్కరణలు ప్రధానంగా దృష్టి పెడుతూ వస్తున్నాయని అంతర్జాతీయ, భారతదేశ అనుభవాలు తెలియచేస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక మాంద్యం,ప్రజలజీవితంపై దానిప్రభావం వినా శకరమైన రీతిలో వుంది. ఇది,కరోనాతో మరిం తగా పెరిగిపోయింది. ఇంకా ఆ ప్రభావం కొనసా గుతూనే వుంది. ఇదిమార్క్స్‌ మాటలను గుర్తు చేస్తోంది:‘పెట్టుబడిదారీ విధానం భారీఉత్పత్తి, మారకపు మార్గాలను సమకూర్చుకుంది. ఇది క్షుద్ర ప్రపంచంలో మంత్రాలు, మాయలతో శక్తులను సృష్టించే మాంత్రికుడి లాంటిది. ఆతరువాత వాటి ని అదుపు చేయడంలో ఆమాంత్రికుడు విఫల మవుతాడు.’ అంతర్జాతీయ ఫైనాన్స్‌ పెట్టుబడి ఆది óపత్యంలోని నయా ఉదారవాద విధాన నిర్మాణంలో అంతర్భాగమే భారతదేశంలో సంస్కరణల క్రమం. ఇక్కడ గరిష్ట స్థాయిలో లాభాలు ఆర్జించడమే లక్ష్యం. ఇది, పెట్టుబడిదారీ విధానం యొక్క అత్యంత అద్వాన్నమైన స్వభావాన్ని తెలియచేస్తోంది. జంతు స్ఫూర్తిని వెల్లడిస్తోంది. పెద్దఎత్తున ప్రభుత్వ ఆస్తు లను, అన్ని ప్రభుత్వ సంస్థలను, సేవలను, ఖనిజ వనరులను ప్రైవేటీకరించడానికి…ప్రజలపై యూ జర్‌ చార్జీల భారాన్ని మోపడానికి దారితీసింది. నయా ఉదారవాదమనేది అంతర్జాతీయంగా, భారత్‌లో కార్పొరేట్లకు పెద్ద లాభదాయకంగా మారింది. నయా ఉదారవాదం ప్రారంభమైనప్పటి నుండి సంపన్నులపై పన్నులు విధించడం అంతర్జా తీయంగా 79శాతం తగ్గింది.2008లోఆర్థిక మాం ద్యం తర్వాత,మూడేళ్ళ లోనే చాలామంది కోటీశ్వ రులు తమసంపదను పునరుద్ధరించు కున్నారు. 2018నాటికి వారి సంపద రెట్టింపు అయింది. ఈసంపద అంతాఉత్పత్తి ద్వారా పెరగలేదు. తీవ్రంగా వున్న ఈ ఆర్థిక మాంద్యం స్టాక్‌ మార్కెట్ల ను ఎందుకు ప్రతికూలంగా ప్రభావితం చేయలేదో వివరించిన స్పెక్యులేషన్‌ ద్వారా పెరిగింది. మరో వైపు,ప్రపంచవ్యాప్తంగా 80శాతం మంది ఆదా యం సంపాదించేవారు 2008ముందు నాటి స్థాయికి కోలుకోలేదు. సంఘటిత రంగంపై, కార్మిక వర్గ హక్కులపై దాడుల ఫలితంగా1979లో ప్రతి నలుగురిలో ఒకరికి ప్రాతినిధ్యం వహించే కార్మిక సంఘాలు… ఈనాడు ప్రతి పదిమందిలో ఒకరికి మాత్రమే ప్రాతినిధ్యంవహించే స్థాయికి క్షీణించాయి.
భారత్‌ : అసమానతల పెరుగుదల
పర్యవసానంగా ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయి.‘షైనింగ్‌ ఇండియా’ (వెలిగిపో తున్న భారతదేశం) ఎల్లప్పుడూ సఫరింగ్‌ ఇండియా (బాధలు పడుతున్న భారతం) పైనే స్వారీ చేసేది. వెలిగిపోతున్న భారత్‌..కమిలిపోతున్న భారత్‌కు విలోమానుపాతంలో వుంటుంది. 2020 మార్చి నుండి భారతదేశం లోని వంద మంది కోటీశ్వరులు తమ ఆస్తులను రూ.12,97,822 కోట్లు పెంచు కున్నారు. అంటే దేశంలోని 13.8 కోట్ల మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి రూ.94,045 చొప్పున చెక్‌ ఇవ్వగలిగేంత. కరోనా సమయంలో ముఖేష్‌ అంబానీ సంపాదించే మొత్తాన్ని ఒకనైపుణ్యం లేని కార్మికుడు సంపాదించాలంటే 10 వేల సంవత్సరా లు పడుతుంది. అంబానీ ఒక సెకనులో సంపాదిం చే మొత్తాన్ని ఈకార్మికుడు మూడేళ్ళకు సంపాది స్తాడని ఆక్స్‌ఫామ్‌ నివేదిక ‘ది ఇనీక్వాలిటీ వైరస్‌’ లోని తాజా భారత్‌ అనుబంధ నివేదిక పేర్కొంది.
మరోవైపు,2020 ఏప్రిల్‌లో ప్రతి గంటకు లక్షా 70వేల మంది తమ ఉద్యోగాలను కోల్పో యారని గణాంకాలు తెలియచేస్తున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో భారత కోటీశ్వరుల సంపద 35 శాతం పెరిగింది. 2009 నుండి చూసినట్లైతే 90 శాతం పెరిగి 42.29 వేల కోట్లకు చేరుకుంది. వాస్తవానికి, కరోనా మహమ్మారి సమయంలో భారతదేశంలో అగ్రస్థానంలో వున్న 11మంది కోటీశ్వరుల పెరిగిన సంపదతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథ కాన్ని పదేళ్ళపాటు లేదా ఆరోగ్య మంత్రిత్వ శాఖను పదేళ్ళపాటు నిర్వహించవచ్చు. పైస్థాయిలో వున్న 20 శాతం లోని 93.4 శాతంతో పోల్చుకుంటే… నిరుపేదలైన 20 శాతంలో కేవలం ఆరు శాతానికే మెరుగైన పారిశుధ్య వనరులు అందుబాటులో వున్నాయి. భారత జనాభాలో దాదాపు 59.6 శాతం మంది ఒక్క గదిలోనో లేదా అంతకంటేచిన్న జాగాలోనో బతుకు తున్నారు. ప్రభుత్వ వ్యయం వాటాను బట్టి చూసి నట్లైతే ప్రపంచంలోకెల్లా అత్యంత తక్కువ ఆరోగ్య రంగ బడ్జెట్‌వున్న దేశాలలో భారత్‌ నాల్గవ స్థానం లో వుంది. కరోనా సమయంలో పెరిగిన తమ సంపదపై కనీసం ఒక శాతం పన్నును దేశంలోని పైస్థాయిలో వున్న 11 మంది కోటీశ్వరులు కట్టినా కూడా ‘జన్‌ ఔషధి’ పథకానికి కేటాయింపులను 140 రెట్లు పెంచడానికి సరిపోతుంది.ఈ పథకం వల్ల పేదలు, అట్టడుగు వర్గాల వారికి మందులు అందుబాటులో వుంటాయి. భారతదేశంలో దశాబ్దాలుగా అమలవు తున్న సంస్కరణలు ఆర్థిక అసమానతలను తీవ్రంగా పెంచుతున్నాయి. ప్రజలను దృష్టిలో వుంచుకుని వారికి అనుకూలమైన రీతిలో కాకుండా.. పెట్టుబడి దారులు లాభాలు ఆర్జించే రీతిలో సంస్కరణలు తీసుకు వస్తున్నారు. సంపద సృష్టికర్తలను గౌరవిం చాలని ప్రధాని మోడీ మనకు ఉద్భోదిస్తున్నారు. సంపద అంటే విలువను డబ్బు రూపంలోకి మార్చడమే. ఆ విలువను సృష్టించేది కార్మిక వర్గమే. మన ప్రజల సర్వతోముఖ సంపదకు విలువను సృష్టించే వారిని గౌరవించాల్సిన అవసర ముంది.
దారిద్య్రం : అపార వృద్ధి
ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడంతో పాటు మోడీ ప్రభుత్వం,స్వాతంత్య్రం సము పార్జించి నప్పటి నుండి భారతదేశం అనుసరిస్తూ వచ్చినదాన్ని (దారిద్య్ర స్థాయిని లెక్కించడానికి మౌలికమైన పోషకాహార నిబంధనను) విడిచిపెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తికి రోజుకు 2200 క్యాలరీల పోషకాహారం వుండాలి. పట్టణభారతంలో అయితే అది 2100 క్యాలరీలుగా వుండాలన్నది నిబంధన. దీని ప్రకారం చూసినట్లైతే 1993-94లో గ్రామీణ ప్రాంతాల్లో 58 శాతం మంది, పట్టణ ప్రాంతాల్లో 57శాతం మంది ఈ దారిద్య్ర రేఖకు దిగువున వున్నారని ఎన్‌ఎస్‌ఎస్‌ నమూనా సర్వే తెలియచే స్తోంది. 2011-12లో మరోసారి నిర్వహించిన ఎన్‌ఎస్‌ఎస్‌ సర్వేలో ఈశాతాలు వరుసగా 68, 65కు పడిపోయాయి.తిరిగి 2017-18లో మరో సారి విస్తృతంగా నమూనా సర్వే నిర్వహించారు. కానీ మోడీ ప్రభుత్వం వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు ఈ ఫలితాలను వెల్లడిరచకుండా తొక్కిపట్టింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన డేటాబేస్‌ సంస్థలను కూడా ఈ ప్రభుత్వం నాశనం చేస్తోంది. గ్రామీణ భారతంలో తలసరి వాస్తవ వినిమయం వ్యయం (కేవలం ఆహారమే కాదు) కేవలం 9శాతంగా మాత్రమే వుందని మీడియాకు లీకైన డేటా తెలియ చేసింది. కరోనా మహమ్మారి తలెత్తడానికి ముందు గానే గ్రామీణ, పట్టణభారతాల్లో సంపూర్ణ స్థాయిలో దారిద్య్రం అనూహ్యంగా పెరిగిందన్నది సుస్పష్టం. అప్పటి నుండి పరిస్థితి మరింత అద్వాన్నంగా మారింది.
కోవిడ్‌ మహమ్మారి విజృంభణ…ప్రజల ప్రాణాలను,వారిఉపాధులను కాపాడేందుకు అరకొరగా వున్న ఆరోగ్య సంరక్షణ సదుపాయాల ఇబ్బందులు…పరిస్థితులను బహిర్గతం చేశాయి. ఈనాడు మనం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక మాం ద్యం అంతర్జాతీయ నయా ఉదారవాద విధానంలో భాగమే. ఏదోవిధంగా ప్రజలను తీవ్ర స్థాయిలో దోపిడీ చేయడం ద్వారా లాభాలను గరిష్టంగా ఆర్జించాలన్నదే ఈ నయా ఉదారవాద విధానం. పొదుపు చర్యల నుండి వేతనాల్లో కోతల వరకు, ఉద్యోగాల లేఆఫ్‌లు, మరీ ముఖ్యంగా చిన్న స్థాయి లో ఉత్పత్తిని దెబ్బ తీయడం (భారత్‌లో ఇది పెద్ద నోట్ల రద్దు ద్వారా జరిగింది) వంటి చర్యల ద్వారా ప్రజలను దోపిడీ చేస్తారు. ఆర్థిక కార్యక లాపాలకు సంబంధించిన అన్ని మార్గాలను ఆక్రమించు కోవడం, ఇప్పుడు కార్పొరేట్‌ లబ్ధికోసం భారత వ్యవ సాయ రంగాన్ని నాశనం చేయడం, కాంట్రాక్ట్‌ వ్యవ సాయం,ఫలితంగా ఆహార కొరత వంటివి ఈవిషయాన్ని మనకు స్పష్టంగా తెలియ చేస్తు న్నాయి. ఈనాడు, అంతర్జాతీయ ఆకలి సూచీ భారత్‌ను ‘తీవ్రమైన కేటగిరీ’లో నిలిపింది. పోషకా హార లోపం ప్రమాదకర స్థాయిలో పెరిగిపో తోందని,మరీ ముఖ్యంగా పిల్లల్లో ఇది ఎక్కువగా వుందని, ఫలితంగా శిశుమరణాలు ఎక్కువగా నమోదవుతు న్నాయని ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5 తెలియ చేసింది.
మతోన్మాదం-కార్పొరేట్ల బంధం
2014 తరువాత కార్పొరేట్‌, మత రాజకీ యాల యొక్క విషపూరిత బంధం ఆవిష్కృతమైంది. జాతీయ ఆస్తులను దోపిడీ చేయడం ద్వారా గరిష్టం గా లాభాలను ఆర్జించడమన్నది చాలా దూకుడుగా అమలు చేశారు. ప్రభుత్వ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రైవేటీకరించారు. ప్రభుత్వ సంస్థలను, గనులను కూడా ప్రైవేటీకరించారు. ఫలితంగా అనూహ్యమైన స్థాయిలో ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం, రాజకీయ అవినీతి పెరిగిపోయింది. దీనికి తోడు ప్రజల ప్రజాస్వామ్య హక్కులపై, పౌర హక్కులపై, మానవ హక్కులపై నిర్దాక్షిణ్యంగా దాడులు చేశారు. అస మ్మతివాదులందరినీ జాతి వ్యతిరేకులుగా ముద్ర వేశారు. నిరంకుశ యుఎపిఎ, దేశద్రోహ చట్టం కింద ప్రజలను నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమం ఇటు భారత రాజ్యాం గాన్ని,అటుప్రజలకు ఇచ్చినహామీలను దెబ్బతీసింది.
ప్రపంచ ఆర్థిక స్వేచ్ఛా సూచీ (గ్లోబల్‌ ఎకనామిక్‌ ఫ్రీడంఇండెక్స్‌)భారత్‌ను105వ స్థానం లో నిలిపింది. గతేడాది కన్నా ఇది అద్వా న్నమైన స్థితి. గతేడాది 79వస్థానంలో వుంది. మానవ హక్కుల సూచీలో భారత్‌ 94నుండి 111కి పడిపో యింది. యుఎన్‌డిపి మానవ వికాస సూచీ మనల్ని ఇంకా కిందకు..అంటే గతేడాది వున్న 129 నుండి 131వ స్థానానికి దింపేసింది. మెజారిటీ ప్రజలకు పెరుగుతున్న ఇబ్బందులతో పాటుగా పెరుగుతున్న నియంతృత్వం…ముస్సోలిని ఫాసిజానికి చెప్పిన నిర్వచనం ‘పాలనతో కార్పొరేట్ల కలయికకు’ దగ్గరగా ఉంది. ఆర్థిక వ్యవస్థలను పునరుద్ధరించడంలో నూతన ఆర్థిక విధానాలు విఫలమయ్యాయన్న సంగతి ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడుతోంది. అసమానతలు వృద్ధికి ఆటం కం కలిగించి, అసమ ర్ధతను పెంచే స్థాయికి చేరుకు న్నాయి’ అని ‘ది ఎకానమిస్ట్‌’ పత్రిక పేర్కొంది.
నయా ఉదారవాద సంస్కరణల దివాళా
పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యయాలతో కూడిన ఉద్దీపన ప్యాకేజీలను అభివృద్ధి చెందిన దేశాలన్నీ ప్రకటించాయి. ఇవి నయా ఉదారవాదానికి శాపం గా పరిణమిస్తాయి. దేశీయ డిమాండ్‌ను, ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడానికి ఈ చర్యలు ఉద్దేశించబడ్డాయి. ‘’నేను కమ్యూనిస్టును కాను, కానీ….’’ అంటూ ప్రభుత్వ వ్యయం పెంచడాన్ని సమర్ధిస్తూ ఇటీవలే బ్రిటీష్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రసంగించారు. అయితే, మోడీ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ వ్యయం పెంచడం గురించి ఎక్కువగా మాట్లాడడం లేదు. కానీ తన ఆశ్రితులు చెల్లించని పెద్ద మొత్తంలోని రుణాలను మాత్రంరద్దు చేస్తోం ది. రోజువారీ పెట్రో ధరల పెంపు ద్వారా ప్రజ లపై భారాలు మోపుతోంది. ఫలితంగా ద్రవ్యో ల్బణం పెరిగిపోతోంది. దీనివల్ల దేశీయ డిమాండ్‌ మరింతగా క్షీణిస్తోంది. ఫలితంగా ఆర్థిక మాంద్యం పెరుగుతోంది. భారత్‌లో ఈ సంస్కరణల పంథా ను మనం తీవ్రంగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. మన ప్రాధాన్యాలేంటనేది పున: నిర్వచించుకోవాల్సి వుంది. వ్యవసాయాన్ని బలో పేతం చేయాలి. ఆహార భద్రతను పటిష్టపరచాలి. ఆరోగ్యం,విద్యపై పెట్టుబడి పెంచాలి. ప్రస్తుతం మనకు ఎంతగానో అవసరమైన-ఆర్థిక, సామాజిక-మౌలిక సదుపాయాల నిర్మాణంపై ప్రభుత్వ పెట్టు బడులు పెద్దఎత్తున పెరగాలి.అప్పుడే ఉద్యోగాలు సృష్టించబడతాయి.దేశీయ డిమాండ్‌ పెరుగు తుంది. కేవలం మానవతావాద ఆందోళనల తోనే కాకుండా, సమానమైన ఆర్థిక పునరుద్ధరణకు కూడా ఇదొక్కటే మార్గం. అస్పష్టత,అహేతుకత,మన సమా జాన్ని అమానవీయం చేసేలా, మనసామాజిక సామ రస్యతను దెబ్బతీసే అన్ని విచ్ఛిన్నకర ధోరణులను తిరస్కరించడం అన్నింటికంటే ముఖ్యమైనది. ప్రజా ప్రయోజనాలే కీలకమైన అటువంటి సంస్కర ణలు ఈనాడు భారతదేశానికి అవసరం. అంతేగానీ కార్పొరేట్‌ లాభార్జనే థ్యేయంగా గల సంస్కరణలు కాదు. ఇటువంటి సంస్కరణల దిశను సాకారం చేయగలిగే వేదిక ప్రజా పోరాటాలను బలోపేతం చేస్తుంది. ప్రత్యామ్నాయ సంస్కరణల పంథాను సూచించగల ప్రజాఉద్యమాలు,సమీకరణలు తగి నంత బలాన్ని పుంజుకోవాల్సి వుంది. మన ప్రజల పై మరిన్ని భారాలను మోపుతున్న, వారిని దెబ్బ తీస్తున్న భారత పాలకవర్గాల ప్రస్తుత దిశను మార్చ గలిగేలా ఈఉద్యమాలు వుండాలి. భారత దేశం లోని మూడు దశాబ్దాల సంస్కరణల క్రమం సరైన దిశ లోకి మారడానికి ఇదే సముచితమైన సమయం.
(సీతారాం ఏచూరి)(ప్రజాశక్తి సౌజన్యంతో)

1 2