క‌రోనా క‌ట్ట‌డిలో ఆచార సంప్ర‌దాయాలు మేలే

భూగోళాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించే ప్రయత్నంలో అరుదైన ఆరోగ్య ప్రదాలైన సంప్రదాయాల్ని ఓసారి మననం చేసుకోవాల్సి ఉంది. పొద్దు పొడవక ముందే ఆడవారు వాకిళ్ళలో చెత్తాచెదారం ఊడ్చేసి నీళ్ళు కల్లాపి చల్లి పేడతో అలికేవారు. తదుపరి ముగ్గు పిండితో చక్కగా ముగ్గులేసేవారు. ఏటవాలుగా పడుతున్న సూర్యరశ్మితో ఆ ఇల్లు తేజోవంతమై ఆహ్లాదంగా ఆరోగ్యకర వాతావరణాన్ని తలపించేది. నేలపై నీళ్లు చల్లడంతో దుమ్ము కణాలు అణగారి- ఆవుపేడ, సున్నంతోపాటు సూర్యరశ్మి తోడై క్రిమికీటకాలను ఆవాసంలోకి రాకుండా అడ్డుకుంటాయి.
మన దేశం సంస్కృతి,సంప్రదాయాలు, ఆచా రాలకు పుట్టినిల్లు. పూర్వం నుంచి మన వాళ్లు పాటించిన ఆచార సంప్రదాయాల వెనుక మనకు తెలియని ఎన్నో ఆరోగ్య రహస్యా లున్నాయి. పూర్వీకులు ఆచరించిన సాంప్ర దాయక, ఆధ్యాత్మిక ఆచారాల చాటున వెనుకటి మర్యాద మన్ననలే కాదు అవి ఆరోగ్యంతో కూడుకున్నవి. భారతీయ సంప్రదాయాచారాలను కొందరు మూఢ నమ్మకంగా కొట్టి పారేస్తారు. దాని మాటున శాస్త్రీయ విజ్ఞానం ఉందని ఆలోచించే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. తీరిక లేని యువతతో పాటు పెద్దలు కూడా నాటి ఆహారపు అలవాట్లు అతిథి మర్యాదలు వంటి పురాతనాచారాలను అవలంబించడంపై శ్రద్ధపెట్టకపోవడంతో అవి కనుమరు గవుతున్నాయి. కరోనా లాంటి మహమ్మారులు సృష్టిస్తున్న కల్లోల సందర్భాల నేపథ్యంలో పూర్వాచారాల అమలుపై దృష్టి పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడిరది. ఆచారాలలో దాగున్న శాస్త్రీయత ఆధారంగా పునరాలోచించి తిరిగి ఆచరిస్తే ఫలితముంటుందని ఆయుర్వేద వైద్యులు, ఆధ్యాత్మిక గురువులు సూచిస్తున్నారు. పెళ్లిళ్లు,వేడుకలు, పండుగలు, వాస్తు సంబంధ విషయాలలో తరచుగా కొన్ని పూర్వాచారాలు గోచరిస్తుంటాయి.
సంప్రదాయక ఆరోగ్య సూత్రాలు
వెనకటి పెద్దలు మార్గనిర్దేశం చేసిన మాటలమాటున దాగున్న ఆరోగ్య సూత్రాలు మాత్రమే నేడు అనుసరిస్తున్నాం. నికార్సయిన కొన్నింటిని విస్మరిస్తున్నాం. భూగోళాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించే ప్రయత్నంలో అరుదైన ఆరోగ్య ప్రదాలైన సంప్రదాయాల్ని ఓసారి మననం చేసుకోవాల్సి ఉంది. పొద్దు పొడవక ముందే ఆడవారు వాకిళ్ళలో చెత్తాచెదారం ఊడ్చేసి నీళ్ళు కల్లాపి చల్లి పేడతో అలికేవారు. తదుపరి ముగ్గు పిండితో చక్కగా ముగ్గులేసేవారు. ఏటవాలుగా పడుతున్న సూర్యరశ్మితో ఆ ఇల్లు తేజోవంతమై ఆహ్లాదంగా ఆరోగ్యకర వాతావరణాన్ని తలపించేది. నేలపై నీళ్లు చల్లడంతో దుమ్ము కణాలు అణగారి- ఆవుపేడ, సున్నంతోపాటు సూర్యరశ్మి తోడై క్రిమికీటకాలను ఆవాసంలోకి రాకుండా అడ్డుకుంటాయి. సహజంగా స్త్రీలు వంటపాత్రలు శుభ్రం చేసే సందర్భంలో ఎక్కువసేపు నీళ్లలోనే కాళ్లు తడపాల్సి వస్తోంది కాబట్టి కాళ్లకు పసుపు రుద్దుకునేవారు. బ్యాక్టీ రియా సోకకుండా యాంటీ సెప్టిక్‌, యాంటీ బయాటిక్‌ గా పసుపు పనిచేస్తుంది. పెళ్ళిళ్ల లోనూ వధూవరులకు నలుగు పెట్టి పసుపు నీళ్ల స్నానం చేయించడం తెలిసిందే. సాధారణంగా శరీరం నలతగా ఉన్నప్పుడు- వేడినీళ్లలో వాయిలాకు వేసి మరిగించిన నీళ్లతో స్నానం చేస్తే…ఎలాంటి నొప్పులున్నా కాస్తంత ఉపశమనం లభిస్తుంది. అలాగే గోరువెచ్చని నీళ్లలో సున్నిపిండితో స్నానం మంచిదని చెబుతారు. అమ్మవారు (వైరల్‌ ఇన్ఫెక్షన్‌) సోకితే పిల్లలకు క్రిమికీటకాల పీడ వదలడానికి వేపాకుల్ని రోగి చుట్టూ రక్షణ కవచంలా పేర్చడం వంటి ఎన్నో పూర్వాచారాల్ని మరచిపోతున్నాం. మన ఇంటికి అతిథులైనా, బంధువులైనా వచ్చారంటే వెంటనే చెంబుతో నీళ్లు ఇచ్చి స్వాగతించడం ఆనవాయితీ. బయటి నుంచి వస్తారు గనుక కాళ్లు కడుక్కుని లోపలికి రావాలని చెప్పేవారు. చెప్పులు కూడా ఆరుబయట వదిలేయడం అప్పటివారి తప్పనిసరి అలవాటు. తద్వారా క్రిములు లోపలికి రాకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. అలాగే వండిన భోజనం వెంటనే తినమని పెద్దలు సూచించేవారు. చల్లారిన పదార్ధంలో క్రిములు చేరతాయని. అప్పట్లో ఆహార పదార్థాల తయారీకి మట్టి,ఇత్తడి,రాగి పాత్రలను ఉపయోగించిన తీరు అద్భుతం. వాటివల్ల పోషకాల నిల్వ పుష్కలంగా సమకూరుతుంది. కాలుష్యం బారిన పడే అవకాశమే లేదు. పర్వదినాల్లో ఇంటి గుమ్మాలకు తప్పనిసరిగా తోరణాలు కట్టేవారు. గతంలో ఇళ్లలో సూక్ష్మ క్రిముల తాకిడికి నివారణగా సాంబ్రాణి పొగ వేసేవారు. హిందూ సంప్రదాయ పండుగల్లో దర్శనమిచ్చే రకరకాల పిండి వంటకాల ప్రత్యేకతల వెనక కొన్ని ఆరోగ్య రహస్యాలు న్నాయి. తెలుగు సంవత్సరాది ‘ఉగాది’ రోజున పచ్చడిలో, శ్రీరామనవమి నాటి బెల్లం పానకం లోనూ శరీరానికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అలాగే దసరా, సంక్రాంతి పండుగ ప్రత్యేక వంటకాల్లో వాడే బెల్లం, నువ్వులు, వాము వంటివి దీని ప్రత్యేకత కలిగి ఉన్నాయి. బతికుంటే బలుసాకు తినొచ్చు నన్న సామెత ఊరకే పుట్టలేదు. పొలాల గట్లమీద, చిత్తడినేలల్లో బలుసాకు అరుదుగా లభిస్తుంది. దీన్ని పల్లెల్లో కొందరు వినాయక చవితి సమయంలో పులుసుగా, పప్పుతోనో వండుకుని తినడం అలవాటు. దీన్ని పచ్చడిగా తింటే అతిసారం తగ్గించడానికి, ఆకలిని పెంచడానికి తోడ్పడుతుంది. ఆషాఢమాసంలో పెట్టుకునే గోరింటాకు శరీరంలో వేడిని తొలగించి ఒత్తిడిని జయిస్తుంది. పూర్వం ఆదివాసులలో సామాజిక దూరం కాస్త కఠినంగా ఉండేది. ఆడపిల్లలు రజస్వల అయితే ఇంటికి దూరంగా ఉంచేవారు. ఏ పద్ధతి పాటిం చిన మానవతా దృక్పథంతో కూడి ఉండేవి. ఆ కాలంలో జనసమూహంలో ఎవరైనా తుమ్మినా అపచారంగా భావించేవారు. దాని చెడు ప్రభావం దృష్ట్యా కొన్ని సామాజిక దూరాలు పాటించేవారు. అలాగే అశుభాలకు సంబంధించిన ఆచారాల్లోనూ అదే జాగ్రత్త కనిపించేది. క్షౌరశాలకు, అంత్య క్రియలకు వెళ్లి వస్తే దేన్నీ తాకకుండా స్నానం చేశాకే ఇంట్లోకి వెళ్లడం అప్పటి సంప్రదాయం. వ్యాధులు సంక్రమించకుండా ఓ జాగ్రత్తగా ఇది సూచించేవారు. పురుళ్ల విషయంలోనూ ఇలాంటి జాగ్రత్తలు ఉండేవి. మైల, అంటు వంటివి పాటించడంతో ఆరోగ్యమే ప్రధాన లక్ష్యం. వాటిని మూఢాచారాలుగా మార్చేసిన కొందరి వల్ల అటువంటి పద్ధతులపై విరక్తి, అనాసక్తి ఏర్పడ్డాయి. అందులోని శాస్త్రీయతను ఆరోగ్య సూత్రాలను కొట్టిపారేయలేం. మానవత్వానికి మచ్చలేని విధంగా ఆనాటి సంప్రదాయాలను పాటించడం, అనుసరించడం నేడు చాలా అవసరం.
ఇవీ ఆరోగ్యకారకాలే
వేకువ జామునే ‘సూర్యనమస్కారాలు’ చేయడం వల్ల శారీరక దృఢత్వం చేకూరటమే గాక శరీరానికి కాంతి కిరణాలు సోకి విటమిన్‌ ‘డి’ సమకూరుతుంది. వ్యక్తులు తారసపడితే చేతులు జోడిరచి నమస్కరించడం ఎంతో ఆరోగ్యకరం. నమస్కరించడంలో రెండు చేతుల వేళ్లు కలిసిపోయి ఆక్యుప్రెషర్‌ జరిగి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు పనితీరూ మెరుగవుతుంది. నుదుటన కుంకుమ బొట్టు ధరించడం హైందవ ఆధ్యాత్మికతకు ప్రతీకనే గాక నుదురులోని నాడులు ఉత్తేజితమై ప్రశాంతత కలుగుతుంది. ఏకాగ్రతతో కూడిన మానసికోల్లాసం ఉట్టిపడుతుంది. పీయూష గ్రంథి ప్రేరేపించబడుతుంది. దీంతో రక్తపోటు, ఒత్తిడి, ఆందోళన వంటివి క్రమంగా తగ్గుతాయి. గుడిలో దైవాన్ని ప్రసన్నం చేసుకునే ముందు గంటలు కొట్టడం ఆధ్యాత్మి కాచారం. గంట మోగించడంతో ఆ ప్రాంతం లో ఓంకార ధ్వని విస్తరించి గాలిలో ఉండే (సూక్ష్మ) క్రిములు నశిస్తాయి. సద్దుల బతుకమ్మ సంస్కృతిలో ఆడపడుచులు సత్తుపిండి పంచిపెట్టడం వెనుక పోషకాల లేమి ఉండ కూడదనే ఆచారం వాడుకలో ఉంది. వీటిని మనం మరిచిపోయాం.ఇంటిలోకి విస్తారంగా గాలి, ధారాళంగా వెలుతురు ప్రవేశించేందుకు వాస్తు పండితులు తగు ప్రణాళికను సూచిస్తుంటారు. కిటికీల ద్వారా చల్లని గాలి (ఆమ్లజని) ప్రవేశిస్తూ, వెంటిలేటర్ల ద్వారా వేడి గాలి (బొగ్గు పులుసు వాయువు) బయటికి వెళ్ళడం వల్ల చల్లటి ఆహ్లాద వాతావరణం. చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. సూర్య కిరణాలు గదులలోకి ప్రసరిస్తే క్రిమి కీటకాలు నశిస్తాయి. పెద్దలు సూచించిన ‘చద్దన్నం’ శరీరానికి చలువ కలిగించడమే గాక కడుపులో అల్సర్లు రాకుండా అడ్డుకుంటుంది. నేలపై చాప పరిచి కూర్చోని భోంచేయడం’ మన సదాచారం. ఇలా చేయడం వలన జీర్ణక్రియ సక్రమంగా జరిగి, అజీర్తి సమస్యలు సమసిపోతాయి. భోంచేసేటప్పుడు కూర్చోవడానికి బాసుపీటలు ఉపయోగిస్తే కాళ్ల నొప్పులు రావు. అరిటాకు భోజనం చాలా శ్రేష్టమైనది. అరిటాకు ద్వారా ఆహారంలోని పోషకాలు యధాతధంగా శరీరానికి చేరతాయి. ఇది కాలుష్యరహితమైనదిగా గుర్తించాలి. పూర్వం రోజుల్లో భోజనం చేయడానికి మోదుగాకులు లేదా పారెటాకులతో చేసిన విస్తరాకులను వాడేవారు. అప్పట్లో మట్టి, రాగి, కంచు పాత్రల్లో భోజనం చేసిన తీరు అద్భుతం. ముఖ్యంగా కంచు పళ్ళెంలో ఆహారం భుజిస్తే జీర్ణశక్తి, మేధోశక్తి పెరుగుతుంది. ఉదరంలో ఆమ్లత్వం గాఢత తగ్గుతుందని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. కరోనా ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఆ తరం అలవాట్లను కొంతమేరకైనా ఒంటపట్టించుకోవాల్సిందే. విలువలతో, శాస్త్రీయతతో కూడిన మరిన్ని ఆచారాలపై భవిష్యత్తరాలకు తెలిసేలా ‘పాఠ్యాంశం’ గా ప్రవేశ పెడితే సమాజ ఆరోగ్యం, నైతిక విలువలు పెంపొందుతాయి.-గుమ్మడి లక్ష్మినారాయణ

వలస కార్మికులకు సామాజిక వంటశాలలు

నేను చిన్నప్పుడు చదువుకొనే రోజుల్లో ఉపాధ్యాయులు చెప్పేవారు. భారత దేశంవ్యవసాయరంగ దేశమని,ఇందులో80శాతం ప్రజలు గ్రామీణులు వ్యవసాయరంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారని అనేవారు. ప్రస్తుతం వ్యవసాయరంగంపై ఆధారపడేవారు మాత్రం20శాతం మంది మాత్రమే. కరోనాతొలివేవ్‌ ఉధృతమైన 2020మార్చి,ఏప్రిల్‌ నెలల్లో,2021 ఏప్రిల్‌ నుంచిసెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న కాలంలో వలస కార్మికులు భారీ ఎత్తున తమ తమ ఊళ్లకు వెళ్లిపోవడం చూసినప్పుడు జాతీయ రాజధాని సరిహద్దుల్లో భారత రైతులు కొనసాగిస్తున్న నిలకడైన పోరాటంతో వలస కార్మికుల జీవితం ముడిపడి ఉందనిపించక మానదు. ప్రస్తుతం కోవిడ్‌19వచ్చిన తర్వాత దేశమంతా వలస కార్మికులపైనే జీవనం సాగుతోంది. ముఖ్యంగా దేశంలో అభివృద్ధి జరుగుతున్నతీరు, అది అమలవుతున్న పరిస్థితులు ప్రాథమికంగా తప్పుమార్గంలో వెళుతోందని గత సంవత్సరం వలసకార్మికుల అనుభవం తెలిపింది. కష్టించి పనిచేసేవారికి అందులో పేదలుగా మారుతున్న వారికి అనుగుణంగా సరిjైున విధానాలు లేవు. ఒకరకంగా చెప్పాలంటే కష్టజీవులను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణమవుతున్న నూతన భారతదేశంలో ఇలాంటివారికి చోటులేదు.భారత్‌లో వలసకార్మికులు ఎదుర్కొంటున్న సమస్య కొత్తదేమీ కాదు. ఈసమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వ విధానాలపై పునరాలోచన చేయాల్సి ఉంటుంది. వలస జీవుల సమస్యను అర్థం చేసుకోవాలంటే విస్తృతస్థాయి దృక్పథం మనకు అవసరమవుతుంది.ఒక రెగ్యులేటరీ చట్రం, సమస్యలను సత్వరంగా పరిష్కరించే యంత్రాంగం లేనిదే వలస కార్మికుల సంక్లిష్ట పరిస్థితులను పరిష్కరించడం సాధ్యం కాదు. దీనిమూలంగానే దేశ అత్యున్నత న్యాయస్థానం వలస కార్మికులవెతలపై జోక్యం చేసుకోవడం అనివార్యమైంది. వలస కార్మికుల ఆకలి కేకలు,కష్టాలనుదృష్టిలో ఉంచుకొని ఢల్లీికి చెందిన బంధువ్‌ ముక్తి మూర్చ అనే సంస్థ 2020లో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం సీరియస్‌గానే జోక్యం చేసుకొని,కేంద్రప్రభుత్వానికి 26.5.2020న మొదటసారి నోటీసులు ఇచ్చింది. తర్వాత రెండువసారి 28.5.2020న మరో నోటీస్‌ పంపింది. వీటికి స్పందించక పోవడంతో ఆఖరిగా 9.6.2020న ఎనిమిది రకాల ఆదేశాలతో ఘాటుగా మూడోవసారి నోటీసు జారీ చేసింది. వలస కార్మికుల చట్టం1979,ఇంటర్‌ స్టేట్‌ మైగ్రేషన్‌ వర్కుమెన్‌ యాక్ట్‌1997, కనస్ట్రక్షన్‌ వర్కర్స్‌ యాక్ట్‌1996,ఆర్గనైజడ్‌ వర్కుర్స్‌ సోషల్‌ సెక్యూరిటీ యాక్ట్‌`2008 వంటి చట్టాలను పరిగణనలోకి వలసకార్మికులకు అను గుణంగా వారి సంరక్షణపై జూన్‌ 29న తీర్పు నిచ్చింది. Read more

పని హక్కును ప్రాధమిక హక్కుగా గుర్తించాలి

నిరుద్యోగ సైన్యం ఎంత ఎక్కువగా వుంటే పెట్టుబడిదారీ విధానంలో అంత దోపిడీ చేయవచ్చు. వంద మంది కార్మికులు జీతాలు పెం చాలని అడిగితే రెండు వందల మంది ఇంకా చౌకగా పని చేస్తామనే విధంగా పెట్టుబడిదారీ వ్యవస్థలో అమలు జరుగు తుంది.దేశంలోని ప్రజలందరికీ చదువు చెప్పాలంటే కోట్లాది మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు దొరుకుతాయి. ప్రజలం దరికీ వైద్యం సమకూర్చాలంటే అనేక కోట్ల మందికి ఉద్యోగాలొస్తాయి. కానీ పెట్టుబడిదారీ విధా నంలో ప్రజలందరికీ కనీస సౌకర్యాలు కల్పించడానికి పాలకవర్గం ప్రయత్నించదు.
ఉపాధి కల్పించడమంటే యువతీ, యువకులను దేశ సంపద సృష్టికర్తల్లో భాగస్వాములుగా చేయ డం.వారి శారీరక,మానసిక శక్తిని ఉపయోగించు కోవడం.‘నేను పని చేస్తాను. నాకు పని కల్పించండి’ అని అడిగితే పని కల్పించలేని స్థితిలో ప్రభుత్వాలు వుండడం దేశాభివృద్ధికి,సౌభాగ్యానికి హానికరం. ఒకప్పుడు అత్యంత వెనుకబడిన దేశంగా వున్న చైనా నేడు అమెరికాతో ఢ కొట్టగలుగుతుందంటే ఆదేశ మానవ శక్తిని ఉపయోగించుకోవడమే కార ణం.‘నేటి భారతదేశం’అనే పుస్తకంలో రజనీ పామే దత్‌ చెప్పినట్లుగా ఒకమనిషికి నోరు మాత్రమే వుండదు. రెండు కాళ్లు, రెండు చేతులు వుంటాయి. ఒక మనిషి సంపదను సృష్టించి పది మందికి పెట్టగలిగిన ఆధునిక పరిజ్ఞానం నేడు పెరిగింది. పెట్టుబడిదారీ వ్యవస్థలో పెరిగిన ఆధునిక పరిజ్ఞా నాన్ని తమ లాభాల పెంపుదలకు పెట్టుబడిదా రులు ఉపయోగించుకుంటున్నారు. మానవ వనరు లు పుష్కలంగా వున్న భారతదేశంలో రోబోట్‌లను ఉపయోగించడమంటే ఇదే. పెట్టుబడిదారులు తమ లాభాల కోసమే యువతీ, యువకులను నిరుద్యోగు లుగా చేసి రోబోట్‌ వంటి యంత్రాలను ప్రోత్సహి స్తున్నారు. ఇదిపెట్టుబడిదారీ విధాన సహజ లక్ష ణం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోవాలి. ఆసౌకర్యం ప్రజలకు కల్పిం చి,పని గంటలు తగ్గించాలి. విశ్రాంతి పెంచాలి. కానీ కాలుష్య కోరల్లోని రసాయన పరిశ్రమల్లో మనుషులతో విషాన్ని మింగించే ఎరువులు, రసా యన కంపెనీల్లో కూడా రోజుకు 8నుంచి12 గంట లు పని చేయిస్తున్నారు. సోషలిస్టు దేశాల్లో ఇటు వంటి పరిశ్రమల్లో వారానికి ఐదురోజులు, రోజుకు ఆరుగంటలు మాత్రమే పని కల్పించే పద్ధతి వుంది. మనుషుల ప్రాణాలకు సోషలిస్టు దేశాల్లో విలువ వుంటుంది.
కరోనా సమస్యను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రజలందరికీ టీకాలు ఇవ్వడంలో తాత్సారం చేసింది. కరోనాతో 2021జూన్‌ 26నాటికి3.94లక్షల మంది ప్రాణా లు కోల్పోయారు. కరోనా మొదటి దశలో మిలట్రీ కర్ఫ్యూలా దేశమంతా లాక్‌డౌన్‌ విధించడంతో లక్షలాది మంది వలస కార్మికులు వేల కిలోమీటర్లు మూటా ముల్లే నెత్తిన పెట్టుకొని సొంత గ్రామాలకు కాలిబాట పట్టారు. దారిలో వేలాది మంది మర ణించారు. అంతేకాకుండా ప్రభుత్వ లెక్కల ప్రకా రం కరోనా కాలంలో 7.7 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఏప్రిల్‌, మే నెలలో 2.2 కోట్లమంది ఉద్యోగాలు కోల్పోయారు. నిరుద్యోగం 12 శాతం పెరిగింది. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రా ల్లో నిరుద్యోగ సమస్యను 20ఏళ్లలో పరిష్కరిం చాలని ఆదేశించారు. 20 ఏళ్ల తరువాత నిరుద్యోగ సమస్య రెట్టింపు అయింది. 75 ఏళ్ల స్వాతంత్య్రా నంతరం నిరుద్యోగం అనేక రెట్లు పెరిగింది తప్ప తగ్గలేదు. కారల్‌మార్క్స్‌ చెప్పినట్లు పెట్టుబడిదారీ విధానం ఉన్నంతకాలం నిరుద్యోగ సమస్య కొనసా గుతుంది. నిరుద్యోగ సైన్యం ఎంత ఎక్కువగా వుంటే పెట్టుబడిదారీ విధానంలో అంత దోపిడీ చేయ వచ్చు. వంద మంది కార్మికులు జీతాలు పెంచాలని అడిగితే రెండు వందల మంది ఇంకా చౌకగా పని చేస్తామనే విధంగా పెట్టుబడిదారీ వ్యవస్థలో అమలు జరుగుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో కూడా ఉపాధి అవకాశాలు మెండుగా వుంటాయి. కానీ పాలకవర్గం ఈ అవకాశాలు కల్పించదు. దేశంలోని ప్రజలందరికీ చదువు చెప్పాలంటే కోట్లా ది మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు దొరుకుతాయి. ప్రజలందరికీ వైద్యం సమకూర్చాలంటే అనేక కోట్ల మందికి ఉద్యోగాలొస్తాయి. కానీ పెట్టుబడిదారీ విధానంలో ప్రజలందరికీ కనీస సౌకర్యాలు కల్పించడానికి పాలకవర్గం ప్రయత్నించదు. ప్రజల సంక్షేమం కంటే తమ లాభాలకు ప్రాధాన్యత ఇస్తారు.‘లియాంటివ్‌’ అర్థశాస్త్రంలో చెప్పినట్లు దేశంలో బొగ్గు ఉత్పత్తి అధికంగా వుంటుంది. బొగ్గుల ఉత్పత్తి ఎక్కువగా జరిగింది కాబట్టి బొగ్గు గనుల కార్మికులను పనిలో నుంచి తొలగిస్తారు. దాంతో కార్మిక కుటుంబం కనీసం చలి కూడా కాచుకోలేక చనిపోతుంది. ఇది పెట్టుబడిదారీ వ్య వస్థ నిజ స్వరూపం. అందుకే ఆర్థిక సంక్షోభాలు ప్రతీ పదేళ్లకు కొనసాగుతూనే వుంటాయి. సోష లిస్టు వ్యవస్థ దీనికి పూర్తి భిన్నం. సోషలిస్టు దేశాల్లో ‘పని హక్కు’ ప్రాథమిక హక్కుగా వుంటుంది. ప్రతి ఒక్కరికీ ఉచితవిద్య ప్రభుత్వమే అందిస్తుంది. 18 ఏళ్లు నిండిన తరువాత అందరికీ ఉపాధి కల్పి స్తుంది. పని హక్కు కల్పించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత. ఓటుహక్కు, భావ ప్రకటనా హక్కు వలె పని కూడా ఒకప్రాథమిక హక్కు. ప్రపంచంలో 143కోట్ల జనాభా కల్గిన చైనాలో గానీ, చిన్న దేశాలైన క్యూబా,వియత్నాం లోగానీ నిరుద్యోగ సమస్య వుండదు. అందరికీ ప్రభుత్వమే ఉద్యోగాలు కల్పిస్తుంది. క్యూబా 95 శాతం ప్రభుత్వరంగం లోనూ,5శాతం కోఆపరేటివ్‌ రంగంలోనూ ఉపాధి కల్పించింది. ఉచిత విద్య, వైద్యం, ఇంటి సౌకర్యం నామమాత్రపు రేట్లతో ప్రభుత్వమే కల్పించడం వల్ల ప్రజలపై భారాలు ఉండవు. ఒకప్పుడు రష్యా తో సహా తూర్పు జర్మనీ వరకు యూరప్‌ ఖండంలో నిరుద్యోగ సమస్య వుండేది కాదు. 1991తరు వాత పెట్టుబడిదారీ విధానం తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత స్పెయిన్‌,గ్రీస్‌ దేశాల్లో 25 నుంచి 30 శాతం వరకు నిరుద్యోగం పెరిగింది. అమెరికా లాంటి అత్యాధునిక దేశాల్లో సైతం నిరుద్యోగం 9శాతం వరకు పెరిగింది. ఇప్పటివరకు ప్రభుత్వ రంగం బలోపేతంగా వుండడం వల్ల ఆర్థిక సంక్షోభ ప్రభావం భారతదేశంలో తగినంతగా లేదు. అయి నా నిరుద్యోగం నేడు విలయతాండవం చేస్తున్నది. డిగ్రీ, పీజీ లు చేసిన వారు బంట్రోతు ఉద్యోగాల కోసం ఎగబడుతున్నారు. అతితక్కువ వేతనం లభించే చిరు ఉద్యోగాలకు లక్షల్లో దరఖాస్తులు చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జూన్‌ 18న జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించింది. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు కల్పించిందీ,వచ్చే ఏడాదిఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పడం మంచిదే. కానీ లేని ఉద్యోగాలు ఇచ్చినట్లు కాకిలెక్కలు చెప్పడం సరైనది కాదు. దశాబ్దాల క్రితం నుంచి ఆర్‌టిసి పర్మినెంట్‌ కార్మికులకు కొత్తగా ఉద్యోగాలు ఇచ్చి నట్లు లెక్కల్లో చూపించడం తప్పు. భర్తీ చేసినట్లు చెప్పిన6,03,756ఉద్యోగాల్లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యో గులు3,99,791మంది వున్నారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ ఉద్యోగుల భర్తీలో చూప డం అన్యాయం. మున్సిపల్‌, విద్యుత్‌ రంగాల్లోని కాంట్రాక్టు,ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులను…ఎ.పి కాం ట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ 93 వేల మందికి పైగా కార్మికులను పర్మినెంట్‌ కార్మికులుగా చూపిం చడం ఆశ్చర్యకరం. రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించినట్లుగా ఉద్యోగాల విప్లవం వస్తుందన్న మాటలు బూటకమని రుజువైంది. గత ప్రభుత్వం ఖాళీలు నింపని ప్రభుత్వ ఉద్యోగాలను ఈ క్యాలెండర్‌లో ప్రకటించలేదు. ఆఖాళీలు హుష్‌ కాకి అయ్యాయి. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగం, రైల్వేలోని లక్షలాది ఖాళీఉద్యోగాలను రద్దు చేస్తున్నది. ఒకవేళ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలుపై ఉద్యోగాలన్నీ పర్మినెంట్‌ ఉద్యోగాలు కల్పించినా, భారతదేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు. నిరుద్యోగ సమస్యను పెట్టుబడిదారీ విధానం పరిష్క రించదు. కార్మికవర్గం నిరుద్యోగానికి వ్యతిరేకంగా పోరాడాలి. తొలగించబడిన, ఉపాధి కోల్పోయిన కార్మికుల గురించే ట్రేడ్‌ యూనియన్లు పోరాడుతు న్నాయి. ఇది సరికాదు. రాజ్యాంగం లోని ప్రాథమిక హక్కుగా గుర్తించి నిరుద్యోగ యువతీ, యువకు లందరికీ పని హక్కు కల్పించేలా పోరాడాలి. అప్పుడే నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం. యువతీ,యువకులు నేడు జరుపుతున్న పోరాటానికి కార్మికవర్గం చేతులు కలపాలి. కార్మికవర్గం అండ వున్నప్పుడే యువతీ, యువకుల పోరాటం మరింత ముందుకు సాగుతుంది. ఇది కార్మికవర్గం బాధ్యత.
ఉపాధిపై కరోనా మహమ్మారి వేటు
కరోనాతో దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరగడమేగాక అనేకమంది జీవనోపాధి కోల్పోయి నట్లు సర్వేలు చెబుతున్నాయి. మహమ్మారి రెండో దశ విజృంభణతో ఆర్థికకార్యకలాపాలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. ఫలితంగా ఉత్పాదకత, సేవా రంగాలు తీవ్రంగా ప్రభావితమై..ఉద్యోగార్థులు, నిరుద్యోగులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.కరోనా సంక్షోభంలో అనేక సంస్థలు ఆర్థిక ఒడుదొడుకులను ఎదుర్కొంటూ, తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. భారాన్ని తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిం చడం, వేతనాల్లో కోత విధించడంవంటి చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే దేశాన్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగ సమస్యకు-ఈ పరిస్థితి ఆజ్యం పోస్తోంది. ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చడానికి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా కొన్ని నిత్యావసర సరకులను అంద జేస్తున్నప్పటికీ,అవి అందరికీ సరిపోవడంలేదు. పిల్లల చదువులు, వైద్య ఖర్చులు వంటి అవసరా లకు సరిపడా ఆర్థిక వనరులు లేక తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. కొన్ని నెలలుగా మెల్లగా కోలుకుం టున్న ఉపాధిరంగంపై-కొవిడ్‌ రెండో దశ వ్యాప్తి తో తీవ్ర ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది. అనేక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న కఠినతరమైన కొవిడ్‌ నిబంధనలు, పాక్షిక లాక్‌డౌన్‌లతో నిరుద్యోగం కనీసం పదిశాతం మేర పెరిగినట్లు అనేక అధ్యయ నాలు వెల్లడిస్తున్నాయి.నైపుణ్య శిక్షణ అవసరం అసంఘటిత రంగంలో పనిచేసే లక్షలాది ప్రజల ఆర్థిక పరిస్థితిలో గతఏడాది కాలంగా పురోగతి లేకపోగా, తిరోగమనం కనిపిస్తోంది. కేంద్ర కార్మిక శాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది మార్చి తొమ్మిదో తేదీ వరకు ఉద్యోగ అవకాశాలను ప్రోత్సహిం చడానికి ప్రారంభించిన ఆత్మనిర్భర్‌ భారత్‌ ద్వారా సుమారు 16.5లక్షల మంది కార్మికులు లబ్ధి పొం దారు. పీఎంజీకేవై కింద38.82లక్షల మంది ఉద్యోగుల ఈపీఎఫ్‌ ఖాతాల్లో రూ.2,567.66 కోట్లు జమ చేసినట్లు ప్రకటించారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం సైతం కరోనా కష్టకాలంలో గ్రామీణ ప్రాంతప్రజలకు ఉపాధి కల్పించడంలో కీలకపాత్ర పోషించింది. ఈ పథ కం ద్వారా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను పెద్ద యెత్తున చేపడితే నిరుద్యోగ సమస్యను కొంతవరకు ఎదుర్కోవచ్చు.‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండి యన్‌ ఎకానమీ’ అంచనాల ప్రకారం భారత్‌లో 4.40 కోట్లమంది నిరుద్యోగులు ఉన్నారు. వీరిలో 2.80కోట్ల మంది ఉపాధి కోసం నిత్యం ప్రయత్నా లు చేస్తున్నారు. మిగతావారు ఉపాధిని కోరుకుం టున్నా దానికోసం తీవ్రంగా ప్రయత్నించడంలేదు. ప్రస్తుతం ఉన్న నిరుద్యోగుల్లో 3.80కోట్లమంది యువకులే. పట్టణాలనుంచి గ్రామాలకు వెళ్లే శ్రామికుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉండటంతో నిరుద్యోగ సమస్య మరింత జటిల మయ్యే ప్రమాదమూ ఉంది.ఈ సంక్షోభ సమ యంలో నిరుద్యోగులను ఆదుకోవడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఉంది. నిరుద్యోగ సమస్య పెరిగేకొద్దీ దేశంలో నేరాలూ పెచ్చరిల్లడం సహజం. ఉపాధి కల్పనపై దృష్టి సారించడం ద్వారా శాంతిభద్రతల సమస్య లనూ గణనీయంగా తగ్గించవచ్చు. ప్రభుత్వ శాఖల్లో అన్ని రకాల ఉద్యోగాల ఖాళీలనూ వేగంగా భర్తీ చేయా ల్సిన అవసరం ఉంది. ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనకు అవసరమైన ప్రోత్సాహకాలను ఇవ్వాలి. స్వయం ఉపాధి కోసం ప్రయత్నించే నిరుద్యోగులకు ఆర్థిక సహాయం అందించాలి. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, శిక్షణను కల్పించాలి. నిరుద్యోగ సమస్యను పరిష్కరించ డానికి స్వయం ఉపాధికోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై విస్తృతమైన అవగాహన కల్పించా ల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. స్థానిక సంస్థలకు కీలక బాధ్యతలు అప్పగించి, స్వయం ఉపాధిని పెంపొందించే పనులకు పెద్ద పీట వేయాలి. నూతన ఆవిష్కరణలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. పట్టణ, గ్రామీణ మానవ వనరులను పూర్తిస్థాయిలో విని యోగించుకోవాలి.ఉపాధి కల్పన పెరిగితే దేశ ఆర్థికాభివృద్ధి రేటు సైతం ఆశించినదానికన్నా మెరు గ్గా ఉంటుంది. వలస కార్మికులకు సంబంధించిన పూర్తిస్థాయి వివరాల్ని స్థానిక ప్రభుత్వాలు విధిగా నమోదు చేసి, ప్రభుత్వ రికార్డుల్లో పొందుపరచాలి. దీనివల్ల శ్రామికులకు అవసరమైన సహాయాన్ని నేరుగా అందించడానికి అవకాశం ఉంటుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరకులు అందరికీ అందేలా చూడాలి.సరఫరా పెంచాలిగత సంవత్సరం కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి- జన్‌ధన్‌ ఖాతా కలిగిన మహిళలకు ఆర్థిక సహా యాన్ని ప్రకటించినట్లుగానే.. ఇప్పుడూ ఆర్థిక సహా యాన్ని సమకూర్చాలి. ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి పెద్దయెత్తున ఆర్థిక వనరులను కూడగట్టాల్సి ఉంటుంది. కరోనా కష్టకాలంలో ప్రజాసంక్షేమం కోసం ఖర్చు చేయడమే పరమావధి కావాలి. ప్రభుత్వ ఖర్చు పెరగడంవల్ల లోటు పెరిగి పోయినప్పటికీ, నేటి పరిస్థితుల దృష్ట్యా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. అందుకే ప్రభుత్వం ఉపాధి కల్పన కార్యక్రమాలకు పెద్దయెత్తున శ్రీకారం చుట్టాలి.కొవిడ్‌ వ్యాక్సిన్‌కు తీవ్రంగా కొరత ఉన్నందువల్ల- టీకాల సరఫరాను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ టీకా వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, రక్షణ రంగం, కొన్ని ప్రైవేటు కంపెనీలు దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు, ప్రజల్లో ధైర్యాన్ని పాదుగొల్పేందుకు పరస్పర సహకారంతో ముందుకు వెళుతున్నాయి. ప్రణాళికాబద్ధంగా ఉపాధి కల్పన, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు అమలు జరిగినప్పుడే ప్రజలు భవిష్యత్తుపై భరోసాతో ఉంటారు. దానివల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటానికీ ఆస్కారం ఉంది.
సమస్య ఎంత తీవ్రంగా ఉందో వెల్లడిరచిన (జవీIజు)
భారత్‌లో నిరుద్యోగ సమస్య ప్రస్తావన వచ్చిన ప్రతీసారి ప్రధాని మోదీ తమ ప్రభుత్వం చాలానే చేసిందని చెబుతున్నారు. ఉపాధి, ఉద్యోగ రంగాల్లో భారత్‌ పురోగమిస్తోందని..గత నాలుగేళ్ల లో 6లక్షల మంది ప్రొఫెషనల్స్‌ ఉపాధి పొందారని ఇటీవల వెల్లడిరచారు. అయితే వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని సర్వేలు,పలు నివేది కలు చెబుతున్నాయి. భారత్‌లో నిరుద్యోగ సమస్య ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ప్రభుత్వ శాఖల్లో ఏచిన్న అటెండర్‌ పోస్టుకు నోటిఫి కేషన్‌ విడుదలైనా..పీజీలు,పీహెచ్‌డీలు చేసిన వారు కూడా దరఖాస్తులు చేసుకుంటున్న పరిస్థితి. దేశం లో నిరుద్యోగానికి సంబంధించి సెంటర్‌ ఫర్‌ మాని టరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ(జవీIజు) సంస్థ తాజాగా ఆసక్తికర విషయాలు వెల్లడిరచింది.2016 సెప్టెం బర్‌ నుంచి ఇప్పటివరకు నమోదైన నిరుద్యోగ రేటును పరిశీలిస్తే..ఫిబ్రవరిలో అత్యధికంగా 7.2 శాతం నిరుద్యోగ రేటు నమోదైంది. గతేడాది 2018, ఫిబ్రవరి నెలలోనిరుద్యోగ రేటు 5.9 శా తం ఉండగా ఇప్పుడది మరింత పెరిగింది. దేశ వ్యాప్తంగా కొన్నివేల ఇళ్లనుంచి సేకరించిన సమా చారం ప్రకారం.. ఈసర్వే నివేదికను తయారు చేసినట్టు (జవీIజు) తెలిపింది.ముంబైలోని థింక్‌ ట్యాంక్‌ సంస్థ ఛైర్మన్‌ మహేష్‌వ్యాస్‌ తెలిపిన వివ రాల ప్రకారం..గతేడాది ఫిబ్రవరి నాటికి ఇండి యాలో 406 మిలియన్ల ఉద్యోగస్తులు ఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అది 400 మిలియన్లకే పరిమితమైంది. భారత్‌లో నిరుద్యోగ సమస్య ప్రస్తావన వచ్చిన ప్రతీసారి ప్రధాని మోదీ తమ ప్రభుత్వం చాలానే చేసిందని చెబుతున్నారు. ఉపాధి,ఉద్యోగ రంగాల్లో భారత్‌ పురోగమి స్తోం దని.. గతనాలుగేళ్లలో 6లక్షల మంది ప్రొఫెషన ల్స్‌ ఉపాధి పొందారని ఇటీవల వెల్లడిరచారు. అయితే వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని సర్వేలు,పలు నివేదికలు చెబుతున్నాయి. నిరుద్యోగానికి సంబంధించి కొన్ని వారాల క్రితం ఓవార్తా పత్రిక కొన్ని లెక్కలను బయటపెట్టింది. అయితే అధికారులు మాత్రం దాన్ని కొట్టిపారేశారు. సదరు పత్రిక బయటపెట్టిన వివరాల ప్రకారం.. దేశంలో గత45ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 2017-18లో నిరుద్యోగ సమస్య తీవ్రమైంది. జవనవరిలో (జవీIజు) విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం..పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు తర్వాత 2018లో దాదాపు 11మిలియన్ల మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు.
ప్రభుత్వం మాత్రం దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. నోట్ల రద్దు ప్రభావం ఉద్యోగా లు, చిన్న తరహా పరిశ్రమలపై ఎలాంటి ప్రభావం చూపించిందన్న దానికి సంబంధించి తమవద్ద ఎలాంటి డేటా లేదని గతనెలలో ప్రభుత్వం ప్రక టించింది.-(సిహెచ్‌. నర్సింగరావు /డాక్టర్‌ చిట్టెడి కృష్ణారెడ్డి)

అడవిలో వెన్నెల

కథ అంటే ప్రధాన పాత్ర దృష్టి కోణం లో కొనసాగి దాని ఆలోచనల ప్రకారం ముందుకు సాగినపుడే సంబంధిత కథకు వాస్తవి కత వస్తుంది అని బలంగా నమ్మే ప్రసిద్ధ తెలుగు కథకుడు బేతి శ్రీరాములు. కథల కర్మాగారంగా యువత చేత తలవబడే అనబడే శ్రీరాములు వారి అనుభవాల ఆలోచనల నుండి 1989 ప్రాంతంలో అక్షయ్‌ హరించబడి కథ ‘‘అడవిలో వెన్నెల’’.

ఆయన జన్మస్థానం కరీంనగర్‌ ప్రాం తపు జగిత్యాల,ఆపక్కనేగల అడవుల జిల్లా అయిన ‘ఆదిలాబాదు’తో అక్కడి గోండుల జీవన పరిస్థి తులతో ఆయనకు గల అవినాభావ సంబం ధాలు, అంతకు మించి ఆయన నిర్వహించిన, పాల్గొన్న అనేక ప్రజా ఉద్యమాలు మొదలైనవి. ఆయనలో అల్లుకుపోయి ఉన్న సామాజిక స్పృహ సృజనాత్మ కతలు,కలిసి అడవిబిడ్డల జీవితాలను సంస్కృతి సంప్రదాయాలను అనేక కథల రూపం లో ఆవిష్క రించారు. ఉద్యమాల నాయకుడిగానే కాక సాంఘిక సంక్షేమశాఖలో ఉద్యోగిస్తూనే.. విశాల సాహితి అకాడమీ సంస్థను స్థాపించి పలు పుస్తకాలు ప్రచు రణ చేశారు. అనేక సాహి త్య కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. అనం త రకాలంలో తెలంగాణ రాష్ట్ర తొలిబీస్సీ కమిషన్‌ చైర్మన్‌గా విధులు నిర్వహించారు. ఆయన కలం నుంచి జాలువారిన ‘అడవిలోవెన్నెల’ కథలోని విశేషాలేమిటో విశ్లేషించు కుందాం!
ఆదిలాబాద్‌ అడవితల్లి సందిట్లో అమాయక జీవనం గడుపుతున్న గోండుల జీవన విధానం,సంస్కృతి,వారు అణచివేతకు గురవుతున్న తీరు, కళ్ల ముందు కదలాడేటట్టు తనదైన సుదీర్ఘ శైలిలో రచయిత ఆవిష్కరించారు.కథ మొత్తం ఇస్రు అతని కొడుకు ఏసు,కూతురు మోతిల కేంద్రంగా నడుస్తుంది. అతి నిరుపేద అయిన ఇస్రు భార్య జ్వరం బారినపడి,అదే సమయంలో వచ్చిన నెలసరి కారణంగా వారి కులాచారం ప్రకారం ఊరి బయ ట ఉండే మైలపాకలో మూడు రోజులుఉండే క్రమంలో చలి గాలులు భరించలేక అక్కడే చనిపో తుంది.తల్లిలేని ఇద్దరు బిడ్డలను తనే పెంచు తూ ఉన్న కొద్ది జొన్న చేను పంట పండిరచుకుం టూ అయిన అప్పులు చెల్లించుకుంటు, తనశక్తికి మించిన శారీరక శ్రమ చేస్తుంటాడు ఇస్రు. యుక్తవయసుకు చేరిన కొడుకు బిడ్డల భవిష్యత్తు కోసం తనసుఖాన్ని వదులు కొని కష్టపడుతూఉంటాడు అతను. ఆరుగాలం కష్టపడుతూ వచ్చిన ఆదాయంతో షావుకారుల అప్పులకుగాను పండిరచిన పంట ధాన్యం, కొలవడం దానితో కూడా అప్పు తీరక పోతే అడవికి వెదురు బొంగులు నరికే కూలికి పోవడం, అక్కడి గోండుల నిత్యకృత్యం.అదే ఆన వాయితీ అయింది ఇస్రుకు అబ్బింది. ఇది చాలదు అన్నట్టు అడవిలో కలపనరికి అవసరాలకు ఉపయోగించుకుంటున్నారనే నెపంతో అటవీ అధికారులు పోలీసుల సాయంతో చేసే దాడులతో కూడా అక్కడి గోండ్లుగోస పడుతుంటారు. అవి వారికితరతరాలుగావస్తున్న తిప్పలు. బాధల నుండి బయటపడే మార్గం లేక అధికారులు షావుకార్లకు ఎదురు చెప్పలేక,నానా అగచాట్లు పడుతూ పేదరి కాన్ని కూడా భరిస్తూ.. తమ ఆచార సాంప్ర దాయా లు,కట్టుబాట్లు,ఎట్టిపరిస్థితుల్లోనూ తప్ప కుండా కాలానికి ఎదురీదుతుంటారు. అక్కడి గిరిజ నులు,అచ్చంగా అదే జీవితం మన కథాకర్త ఇస్రుది కూడా….!!
పేదరికానికి తోడు కాలికి తగిలిన దెబ్బ కు సంబంధించిన అనారోగ్యంతో మరింత ఇబ్బం దులు పడుతున్న ఇస్రు వేదనను రచయిత ఇందులో తనదైన కోణంలో ఆవిష్కరించారు.వాస్తవం ఎలా ఉందో చెప్పడంతో పాటు,ఎలా ఉంటే బాగుం టుందో అని చెప్పడం కూడా సోషలిస్టు వాస్తవి కత అన్నది రచయిత ప్రగాఢ విశ్వాసం. అందుకే అడవిలో వెన్నెల వృధాకాదు అది అడవి బిడ్డలకు ఉపయోగపడుతుంది అక్కడ ఉద్యమ మార్గంలో చైతన్యం వెల్లివిరిసి గోండు బిడ్డలకు ధైర్యంవచ్చి, వారు అందరిలా హాయిగా స్వేచ్ఛాగ జీవనం గడిపే రోజులు వస్తాయనే ఆశయం, ఆశతో కథ ముగించే నేపథ్యంలో భాగంగా తుపాకీ ఉద్యమ సంఘాన్ని వారికి పరిచయం చేసి కథ ముగిస్తూ… ఆలోచనాత్మక ముగింపును అందిస్తారు. కథలో రచయిత స్వీయ శైలి అయిన సుదీర్ఘత కనిపించిన, ఎక్కడ విసుగు రాకుండా గోండుల జీవనంలోని ఆచారవ్యవహారాలు అడుగడుగునా ఆసక్తిని కలిగిస్తూ పాఠకులను చేయిపట్టుకుని నడిపిస్తాయి. రచయితకు అడవిబిడ్డల సంస్కృతి,అలవాట్లపై అపారమైన గౌర వం,సమర్థింపు ధోరణి కనిపిస్తాయి. ఒకానొక సంద ర్భంలో వనవాసుల అలవాట్లుఅయిన లైంగిక స్వేచ్ఛ తదితరాలు,ఆధునిక దేశపు నాగరికుల అల వాట్లతో సరిపోల్చి చెప్పడం ఆశ్చర్యానికి లోనైన అది అసత్యంకాదు అనిపిస్తుంది.గిరిజనులకు సహజ సిద్ధంగా అలవాటైన చేపలవేట,వాటి రుచిపట్ల గల ఆపేక్ష గురించి ఇస్రుపాత్రద్వారా రచయిత అత్య ద్భుతంగా ఆవిష్కరిస్తారు, ఒకపక్క కాలిదెబ్బ పెడు తున్న భరించలేనిబాధను పడుతూనే చేపల వేటకు వెళ్లి తన లక్ష్యాన్ని అందుకోవడంతో ఇస్రుకుగల చేపలవేట ఇష్టత తెలుస్తుంది, ఎన్నో బాధలు భరిం చి ఇల్లు చేరిన తనకు ఇంటి వాతావరణం ఆందో ళన కలిగిస్తుంది. అడవిలో గిరిజనుల జీవాలు మేత మేసినందుకు,వారు ఇంటి అవసరాలకు అడవి నుంచి కర్రలు,కట్టెలు, తెచ్చుకున్నందుకు, వేర్వేరు కారణాలకు గాను ప్రతి కుటుంబం ఫారెస్ట్‌ వాళ్లకు ఏటా 50రూపాయలు చెల్లించాలి, డబ్బులు లేక పోతే అడవికి వెదురు బొంగు నరకడానికి వెళ్లాలి. ఆకూలీ డబ్బులతో వారి బాకీలు తీర్చుకుంటారు. అలా చేయడం ఆలస్యమైతే ఫారెస్టు అధికారులు ఇలా ఇళ్ళ మీద పడి దౌర్జన్యాలు చేయడం, బెదిరిం చడం,కొట్టడం,ఇంట్లో వస్తువుల కు నష్టం కలిగిం చడం విప్పసారా,కోళ్లు, కనిపించినవి కనిపించినట్టు ఎత్తుకుపోవడం, గోండు గూడేల్లో నిత్యం జరిగే తంతులే !! ఇస్రు ఇంట్లో ఆరోజు అదే జరిగింది, అది గతం నుంచి అలవాటైనతను, వారిని బ్రతి మాలి నచ్చజెప్పి అక్కడినుంచి పంపేస్తాడు.కానీ యువకుడైన కొడుకు ఏసుకు ఇదేమీ అర్థం కాదు, అంతకు ముందు ఫారెస్ట్‌ వాళ్ళుతనను కొట్టిన దెబ్బల బాధబరిస్తు తండ్రి నుంచి సరైన సమాధా నం రాక మౌనంగా రోదిస్తాడు. ఆదిలాబాద్‌ ప్రాం తంలోని మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో గోండుల ఆచారాలన్నీ కాస్త విభిన్నంగానే అగుపిస్తాయి. దగ్గరి లోని అహిరి మహారాజును వారి కష్టనష్టాలను కాపాడే పెద్దదిక్కుగా ఆరాధిస్తారు. ముఖ్యంగా దసరా పండుగకు గూడేల నుండి ఇంటికి ఒకరు చొప్పున మహారాజు వద్దకు విధిగా వెళ్లాలి. ఆడ వాళ్లు తప్పకుండా వెళ్లి అక్కడ నాట్యాలు చేయాలి. పేరుకు తమ కష్టనష్టాల గురించి మహారాజుకు చెప్పుకోవడం కోసం వెళ్లడమే కానీ వెళ్ళే ప్రతి ఒక్కరు ఏదోఒక వస్తువు,జంతువు,కానుకగా తీసుకు వెళ్లాలి. అక్కడ ఉండే రెండు రోజులకు సరిపడా తిండి కూడ ఎవరికి వారే తీసుకుపోవాలి. అయినా అక్కడి దసరా ఉత్సవాలకు పోవడానికి అందరూ ఇష్టపడతారు. కారణం వెళ్లకపోతే మనిషిని పది రూపాయల చొప్పున దండుగ పటేలుకు కట్టాల్సి ఉంటుంది. అలాగే ఆరోజు అక్కడ దొరికే లైంగిక స్వేచ్ఛకోసం గూడేలలోని యువత వెళ్లడానికి ఆరాట పడతారు. ఇస్రుకు ఈదసరా ఖర్చు ఒకటి గుర్తుకు వస్తుంది. తన కొడుకు ఏసు,పక్క గ్రామంలోని ధనికుడైన బాబురావు కూతురు లకింబాయి, ఒకరి కొకరు ఇష్టపడతారు.సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేయాలంటే కన్యాశుల్కం తదితర ఖర్చులతో అబ్బా యి తండ్రికి అధికఖర్చు అవుతుంది.అమ్మాయి తన ఇష్ట ప్రకారం ఇంట్లోకి వస్తే కాస్త ఖర్చు తగ్గుతుంది. ఇలాంటి కొత్త జంటలు ఏకం కావడానికి దసరా పండుగ,పంటకోతపండుగ,లాంటివి వారికి అను కూలంగా ఉంటాయి. అందుకే ఖర్చుకు భయపడ్డ ఇస్రు కొడుకు పెళ్లి ముందుగా చేయడానికి ఇష్టం చూపడు. ఎదిగిన తన కూతుర్ని తీసుకుని దసరా పండుగకు వెళ్లడానికి సిద్ధపడతాడు. అక్కడ కూతు రు మోతికి కావాల్సిన పూసల దండలు, పొడిపిం చాల్సిన పచ్చబొట్ల ఖర్చులకు డబ్బులు జమ చేసు కుంటాడు.ఏసు దసరాకు వెళ్ళలేకపోయినా.. తండ్రి లేనివేళ తన లకింబాయిని జొన్న చేనుకు రప్పించు కుని పండగలో పొందే ఆనందం ఇద్దరూ పొందు తారు. ఫారెస్ట్‌వారి దౌర్జన్యాలు జరిగిన ప్రతి రోజు రాత్రి గూడెం వాళ్ళు అంతా ఒక చోటచేరి మహారా జుకు ప్రజలకు మధ్యవర్తిగా ఉండే కుర్దుపటేలుకు తమ గోడువిన్నవించుకోవడం తను అంతా పరిష్కరి స్తానని సర్ది చెప్పడం ఎప్పుడూ పరిపాటే ! ఇలా ఉండగా దసరా ముగిసి పంట కోతల పండుగ వచ్చింది.రాత్రిగూడెం ప్రజలంతా పూజారి సమ క్షంలో పండుగలో పాల్గొంటారు. ముందే పథకం వేసుకున్న లకింబాయి జాకెట్‌ విడిచి ఆరాత్రి యేసు తో కలిసి ఆటపాటల్లో పాల్గొంటుంది, వారి ఆచా రం ప్రకారం అలాచేసి ఆఅబ్బాయి ఇంటికి వెళితే దాన్ని ఇష్టపూర్వకంగా ‘‘ఇల్లుజొచ్చు’’డుగా భావించి ఆఇద్దరికీ పెళ్లి చేస్తారు,పెళ్లి అయిన తరువాత ఛాతి మీద వేరే ఆచ్ఛాదన లేకుండా ఉండటం గోండు స్త్రీలకు ఆచారం. చాలా కొద్ది ఖర్చులతో ఏసు,లకింబాయి ఒక ఇంటివారు అవుతారు. కుల పెద్దలకు ఇచ్చిన బాపతులో భాగంగా ఇస్రు విప్ప సారా తాగి ఆనందం తెచ్చుకునే ప్రయత్నం చేస్తు న్నాడు కానీ కళ్ళముందు కనిపిస్తున్న అప్పులు,ఆడ బిడ్డపెళ్లి,బాధ్యతపట్టని కొడుకు, గురించి ఆలోచి స్తాడు ఆందోళనగ ఆనందానికి దూరమై… కొన్నాళ్లు గడిచాక అనుకున్నట్టే అప్పు పెట్టిన షావు కారు రాజారావు తన మందబలంతో ఇస్రు గుడి సెలమీద పడి దౌర్జన్యం చేసి పండిన జొన్నపంట మొత్తం ఎత్తుకు పోతాడు. కథ అచేతనంగా ముగిసి పోయింది అనుకుంటుండగానే ఊహించని మలుపుతో రచయిత సరికొత్త ముగింపును కలిపి స్తాడు. తుపాకీ దళంను కథలో ప్రవేశపెట్టడమే కాక,ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి అడవులను వేదికలుగ చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్న వారి బాధలు,కష్టాలు,తదితరాలు కూడా సవివరంగా చూపిస్తారు. చివరకు ఒకరాత్రి గూడెం చేరిన దళం కు గోండ్లు భోజనాలు పెట్టడం, తమ మధ్యవర్తి కుర్దు పటేల్‌ ద్వారా తమ గోడు వెళ్లబోసుకోవడం, దానికి వారి సహకారపు హామీ లభించడం, భవి ష్యత్తు మీద ఆశలు పెరగడం, ముఖ్యంగా ఏసు కు కమాండర్‌ తుపాకీ చూపించి ‘‘మనలను చంప వచ్చు మనుషులను కూడా దీనితో చంపవచ్చు’’ అని చెప్పిన మాటల ద్వారా అతని ఆలోచనల్లో మార్పు రావడం. ‘‘అడవి కాచిన వెన్నెల ఆకాశాన్ని కప్పేసిన వృక్షాల్ని చీల్చుకొని అడవినంతా పరుచు కుంటుంది, ఆ వెన్నెల్లో గూడెంలోని గుడిసెలన్ని తడుస్తాయి’’ అన్న వాక్యాలతో కథ ముగించడం, ఇవన్నీ రచయితలోని కట్టుబాట్లకు అర్థం చెబు తాయి, ఒక ప్రాంతపు గిరిజన ఆచారాలను ‘‘అక్షర నిక్షిప్తం’’ చేయడంతోపాటు, సంఘ చైతన్యాన్ని పురికొల్పడం వంటి ప్రయత్నాల ద్వారా రచయిత సఫలీకృతుడయ్యారు.
(వచ్చేమాసం మీకోసం వాడ్రేవు వీరలక్ష్మీదేవి కథ ‘‘కొండ ఫలం’’) – డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు, ఫోను: 77298 83223