ఏజెన్సీ స్వరాజ్య సింహం` చింతల చెరువు వెంకటాద్రి

‘‘దేవభక్తుని నందీశ్వరుడు’’ తదితరులతో కలిసి చర్లలో క్రీడా,సాంస్కృతిక, సేవా,కార్యక్రమాల్లో ఆయన చేసిన కృషి నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాల్సి ఉంది. ఆయన స్వరాజ్య, సంఘ సేవ కృషికిగాను 1982 సంవత్సరంలో నాటి మన ప్రధాని ఇందిరాగాంధీ హైదరాబాదులో సమరయోధులకు ఇచ్చే తామ్రపత్రం అందించారు. 1983 అక్టోబర్‌ 2న ‘‘మహాత్మా గాంధీ శతజయంతి సేవాసదన్‌’’ వారు మహాత్ముని జ్ఞాపికతో సత్కరించారు ‘‘ఏజెన్సీ లయన్‌’’ అనే బిరుదును ప్రదానం చేశారు. కడదాకా గాంధేయవాదంతో, ఖద్దరు వస్త్రధా రణతో, సేవ భావమే జీవనంగా బ్రతికిన ‘‘చింతలచెరువు వెంకటాద్రి’’ తన 96వ ఏట 15 జూలై 1986 న తన అభిమాన పుత్రుడు, సంఘసేవ వారసుడు, సి.వి.కె.రావు ఇంట చర్లలోని రైసుపేటలో తనువు చాలించి, మన్య ప్రాంతానికి ‘‘స్వరాజ్య పోరాట సింగమైనిలిచారు’’.

గిరిజన ప్రజలకు నెలవైన గోదావరి పరివాహక ప్రాంతం భద్రాచలం ఏజెన్సీలో ఒకసాధారణ గ్రామం చర్ల. మన దేశంలో ఒకేపేరుతో అనేక గ్రామాలు ఉన్నాయి కానీ ‘‘చర్ల’’ అనే రెండు అక్షరాల పేరుతో మరెక్కడ ఒక్కగ్రామం లేకపోవడం ఒక విశేషం!! అలా ఎన్నో విశేషాలకు సాక్షి భూతమైన చర్ల ప్రాంతంలో తొలిసారిగా స్వరాజ్య ఉద్యమస్ఫూర్తిని అందించడానికి గిరిజనగ్రామాలలో కాలి నడకన,సైకిళ్లు,ఎడ్లబండ్ల, సాయంతోతిరిగి స్వరాజ్య స్ఫూర్తిని ఉద్యమ చైతన్యం నింపిన నాటి ఏజన్సీ‘‘స్వరాజ్య సింహం చింతలచెరువు వెంకటాద్రి’’.
గుంటూరు జిల్లా వినుకొండ తాలూకా మృత్యుంజయ పురంలో ‘‘చింతలచెరువు వెంకట్రామయ్య – లక్ష్మమ్మ’’ దంపతులకు 5వ సంతానంగా 1889 నవంబరు20న వెంకటాద్రి జన్మించారు. పన్నెండేళ్ళ వయసులోనే తండ్రిని కోల్పోయిన ఆయన ఆలనాపాలనా అన్న గార్ల మీదేపడిరది, బ్రతుకుతెరువు కోసం మిత్రుల సహాయ సలహాలతో వీరి పెదనాన్న వెంకటప్పయ్య గారు భద్రాచలం డివిజన్లోని వెంకటాపురంలో 1896సంవత్సరం పట్వారి ఉద్యోగంలో చేరారు, దానితో మిగతా కుటుంబ సభ్యులంతా వెంకటాపురం చేరుకొని ఆనాటి సాధారణ ఉద్యోగాలైన పట్వారి పనులు చేస్తూ కొందరు, మరికొందరు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించారు. పట్వారి ఉద్యోగం చేసేవారు వ్యవసాయం చేయడం ఆ రోజుల్లో నిషేధం.
వెంకటాపురం సమీపంలోని ఆలుబాకలో ఉండి వ్యవసాయం చేసుకుంటున్న వెంకటాద్రిగారు, సోదరుని వద్ద సాధారణ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని స్వయంకృషితో తెలుగుతోపాటు ఇంగ్లీష్‌, హిందీ భాషలు నేర్చుకొని చక్కని సాహిత్య పరిజ్ఞానం కూడా పెంచుకున్నారు. అన్నగారి సాయంతో 1908 సంవత్సరం లో కొత్తగా ఏర్పడ్డ ‘‘పడిగాపురం’’(వాజేడు సమీపంలో ప్రస్తుతం అంత రించిన గ్రామం) సర్కిల్లో ‘‘పట్వారి’’ కొలువులో చేరారు.
గుంటూరుకు చెందిన మహాలక్ష్మమ్మని పెళ్లి చేసుకున్నారు వెంకటాద్రి,ఆమె అక్క గారు ఏలూరులోని ప్రముఖ ప్రచురణ సంస్థ వెంకట్రామా అండ్‌ కంపెనీ యజమాని ‘‘ఈదర వెంకట్రావు’’ గారి భార్య, దరిమిలా వెంకటాద్రిగారి తోడల్లుడు ద్వారా సాహితీవేత్తలతో పరిచయం. సాహిత్యంపై మక్కువ పెరిగాయి. దాని ద్వారా అందిన సామాజిక స్పృహ ఆయనను జాతీయోద్యమం వైపు నడిపించింది. 1908 సంవత్సరంలో భద్రాచలం డివిజన్‌ మద్రాసు రాజధాని పరిధిలో ఉండేది. బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా అక్షర పరిజ్ఞానం లేక పూర్తి స్తబ్ధతతో ఉన్న ఈగిరిజన ప్రాం తంలో వెంకటాద్రి వారిని చైతన్య పరచడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఉదర పోషణ కోసం ఉద్యోగం చేస్తున్న ఆయన ఆలోచనంతా సమాజ శ్రేయస్సు కోసమే ఉండేది.
ఆ రోజుల్లో వెలువడుతున్న ఒకేఒక తెలుగు దిన పత్రిక ‘‘ఆంధ్రపత్రిక’’దానిని ఈ ప్రాంతంలో పోస్టు ద్వారా తెప్పించుకున్న ఏకైక వ్యక్తి వెంకటాద్రి, నాటి స్వరాజ్య ఉద్యమ వార్తలు నాయకుల ప్రసంగాలు, ప్రకటనలు, చదివి తాను స్ఫూర్తి పొందడం కాక గాంధీజీ పట్ల ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితులై ఉద్యమంపట్ల మక్కువ పెంచుకున్నారు. గ్రామగ్రామాన తిరిగి గిరిజనులకు నాటి దేశ పరిస్థితులు,బ్రిటిష్‌ వారి అరాచకాలు వివరించేవారు. కాలక్రమేణా ఆయనకు ఉద్యోగం కన్నా సమాజ సేవే ముఖ్య మని దేశ స్వరాజ్యమే ప్రధానం అనే భావన కలిగింది, ఈయన చర్యలు ఎప్పటికప్పుడు గమని స్తుండే పైఅధికారులు అతని పై తీవ్ర ఒత్తిడి తెచ్చేవారు. 1921 డిసెంబరులో అహ్మదాబాదులో భారత జాతీయ కాంగ్రెస్‌ ‘‘పన్నుల నిరాకరణ ఉద్యమా నికి’’ పిలుపునివ్వడంతో వెంకటాద్రి తన గ్రామ కర్నికానికి రాజీనామా చేసి పూర్తి స్థాయి ఉద్యమంలో ప్రవేశించారు. నాటి ప్రముఖ స్వరాజ్య ఉద్యమ నాయకులతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడుపుతూ తన ‘‘ఉద్యమ స్నేహరాజ్యం’’ విస్తరించుకున్నారు. ఆయనలోని స్వరాజ్య కాంక్ష పట్టుదల మాట తీరు తదితర లక్షణాలు తెలిసిన దేశభక్త కొండా వెంకటప్ప య్య గారి పిలుపు మేరకు అష్టకష్టాలు పడి కాలినడకన ఇల్లందు చేరి అక్కడ నుంచి రైల్లో గుంటూరు వెళ్లి వెంకటప్పయ్య గారి నాయక త్వంలో ‘‘సహాయ నిరాకరణోద్యమంలో’’ పాల్గొన్నారు. అక్కడ టంగుటూరి ప్రకాశం, కళావెంకట్రావు,భోగరాజు పట్టాభి సీతారా మయ్య, కొండా వెంకటప్పయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, వంటి పెద్దలతో పరిచయాలు ఏర్పడ్డాయి. అనంతర కాలంలో వారితో కలిసి వెంకటాద్రి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. పది నెలల పాటు అక్కడే స్వరాజ్య ఉద్యమంలో గడిపి తిరిగి వెంకటాపురంచేరి తాను గుంటూరులో పొందిన ఉద్యమస్ఫూర్తితో గిరిజన గ్రామాలు తిరుగుతూ జాతీయోద్యమ అవసరాన్ని తనదైన వాక్చాతుర్యంతో ప్రచారం చేశారు.వెంకటాపురం నుంచి వి.ఆర్‌.పురం (వరరామచంద్రపురం) వరకు వెంకటాద్రి గారికి స్వరాజ్య ఉద్యమ అనుచరగణం ఉండేది. ఆ రోజుల్లో గోదావరి రేవు ప్రాంతం ‘‘దుమ్ముగూడెం’’ పెద్ద వ్యాపార కేంద్రంగా ఉండేది. స్వరాజ్య ఉద్యమకారులకు అదే కేంద్రంనిలయం. ఆప్రాంతానికి చెందిన ప్రముఖ రచయిత రంగూన్‌ రౌడీ నాటకకర్త ‘‘సోమరాజు రామానుజరావు’’ భద్రాచలంకు చెందిన కురిచేటి శ్రీరామ్మూర్తి,ఆర్‌.కొత్తగూడెం చెందిన భూపతిరాజు బుచ్చి వెంకటపతిరాజు, మొదలైన వారంతా ఆయన ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించే వారు. ఈ క్రమంలో వెంకటాద్రి గారి కుటుంబాలకు అనివార్య కారణాలతో చర్లకు చెందిన భూస్వామి ‘‘ముత్యాల వెంకట స్వామి’’ స్నేహం లభించింది. ఆయన సలహా మేరకు చర్లకు చేరి వ్యవసాయ భూములు ఏర్పాటు చేసుకుని వ్యవసాయం ద్వారా జీవనం సాగించేవారు, దీనితో వెంకటాద్రి గారి స్వరాజ్య పోరాట కేంద్రం చర్లకు మారింది. ఆయన కార్య దీక్షను తెలుసుకున్న విప్లవం వీరుడు’’అల్లూరి సీతారామరాజు’’తన అజ్ఞాత పర్యటనలో భాగంగా ఒకరాత్రి చర్లకు వచ్చి తన పోరాటానికి సహకరించమని వెంకటాద్రి గారిని కోరారు, కానీతాను మొదటి నుంచి గాంధేయవాదానికి అహింస సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పి రామరాజు అభ్యర్థులను సున్నితంగా తిరస్కరించారు.1926 సంవత్సరములో మన్యం ప్రాంతపు పోలవరం గ్రామంలో ‘‘పునులూరు కోదండరామయ్య’’ నేతృత్వంలో ‘‘స్వరాజ్య ఆశ్రమం’’నెలకొల్పారు 1929 మే 9న గాంధీజీ ఆ ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు వెంకటాద్రి తన అనుచరగణంతో పోలవరం వెళ్లి మహాత్ముని తొలిసారి దర్శనభాగ్యం చేసుకుని ఆయన ఆశీస్సులు అందుకున్నారు.
ఆ స్ఫూర్తితో ఆశ్రమం చేపట్టే ప్రతి ఉద్యమ కార్యక్రమాల్లో ఆయన పాత్ర ప్రముఖంగా ఉండేది. 1929 డిసెంబర్‌లో లాహోర్లో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ మహాసభలకు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వెళ్ళిన వెంకటాద్రి అక్కడి నాయకుల ప్రసంగాలతో తనలో అచంచలమైన ఆత్మవిశ్వాసం పెంచుకున్నారు.1930 సంవత్సరంలో గాంధీజీ ఉప్పుసత్యాగ్రహంకు పిలుపునిచ్చి దండి యాత్ర ప్రారంభించారు. సముద్ర తీర ప్రాంతాల ఉద్యమకర్తలు తమ ప్రాంతాల్లో ఉద్యమానికి మద్దతుగా ‘‘ఉప్పుతయారీలు’’ మొదలుపెట్టారు సముద్రానికి దూరంగా మన్యం ప్రాంతంలో ఉన్న వెంకటాద్రి గారికి ఏం చేయాలో అర్థంకాక చివరికి చౌడు మట్టి నుంచి ఉప్పు తీయవచ్చని ఆలోచనతో పాత చర్లలోని చెరువు దగ్గర ఆయన ఉప్పు సత్యాగ్రహ దీక్షకు శ్రీకారం చుట్టారు. బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఈ ఉద్యమం పెను సవాలుగా నిలిచింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంకటాద్రి గారి దీక్షను భగ్నం చేసి లాఠీలతో కొట్టి చిత్రహింసలకు గురి చేసి భద్రాచలం తీసుకువెళ్లి అక్కడి నుంచి రాజమండ్రి కేంద్ర కారాగారానికి పంపించారు. అక్కడ ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించి వచ్చారు. అనంతరం 1932లో జరిగిన శాసనోల్లంఘన ఉద్యమంలో కూడా పాల్గొని ప్రముఖ పాత్ర పోషించారు.రాజాజీ మంత్రివర్గములో మద్రాసు రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ఉన్న టంగుటూరి ప్రకాశం 1938 సంవత్సరంలో ‘‘జమిందారి రిపోర్ట్‌’’ తయారు చేయడానికి చర్ల వచ్చినప్పుడు ఆయన లోని కర్తవ్య దీక్షను వెంకటాద్రి ప్రత్యక్షంగా గమనించి ప్రభావితం చెందారు.
1939 సంవత్సరంలో త్రిపురలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ సమావేశాలకు వెంకటాద్రి హాజరయ్యారు. సుభాష్‌ చంద్రబోస్‌ను ప్రత్యక్షంగా అక్కడే దర్శించుకున్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీకి, తూర్పుగోదావరి జిల్లా కమిటీ, సభ్యులుగా ఎన్నికయ్యారు.
1942 వ సంవత్సరంలో జరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ఆయన మన్యం ప్రాంతానికి నాయకత్వం వహించి తన సహచరులతో కలిసి అనేక చోట్ల జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్వరాజ్యఉద్యమ శిక్షణా శిబిరాలు నిర్వహించారు.
స్వాతంత్రానంతరం ఎలాంటి రాజకీయ పదవులు ఆశించకుండా నిస్వార్ధంగా గాంధీజీ సిద్ధాంతాలకు కట్టుబడి తాను నమ్మిన పార్టీలోనే కొనసాగి తన కార్య క్షేత్రమైన చర్ల అభివృద్ధికి తన సొంత ఆస్తులు సైతం అందించిన త్యాగశీలి, 1951 ఫిబ్రవరి 14న చర్లలో ప్రాథమిక సహకార సంఘం, స్థాపించడం శాఖ గ్రంథాలయానికి సొంత స్థలం ఇల్లు వితరణ చేయడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేసిన త్యాగమూర్తి వెంకటాద్రి,
తన సహచరులు ‘‘దేవభక్తుని నందీశ్వరుడు’’ తదితరులతో కలిసి చర్లలో క్రీడా,సాంస్కృతిక, సేవా,కార్యక్రమాల్లో ఆయన చేసిన కృషి నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాల్సి ఉంది.
ఆయన స్వరాజ్య, సంఘ సేవ కృషికిగాను 1982 సంవత్సరంలో నాటి మన ప్రధాని ఇందిరాగాంధీ హైదరాబాదులో సమరయోధులకు ఇచ్చే తామ్రపత్రం అందించారు. 1983 అక్టోబర్‌ 2న ‘‘మహాత్మా గాంధీ శతజయంతి సేవాసదన్‌’’ వారు మహాత్ముని జ్ఞాపికతో సత్కరించారు ‘‘ఏజెన్సీ లయన్‌’’ అనే బిరుదును ప్రదానం చేశారు. కడదాకా గాంధేయవాదంతో, ఖద్దరు వస్త్రధా రణతో, సేవ భావమే జీవనంగా బ్రతికిన ‘‘చింతలచెరువు వెంకటాద్రి’’ తన 96వ ఏట 15 జూలై 1986 న తన అభిమాన పుత్రుడు, సంఘసేవ వారసుడు, సి.వి.కె.రావు ఇంట చర్లలోని రైసుపేటలో తనువు చాలించి, మన్య ప్రాంతానికి ‘‘స్వరాజ్య పోరాట సింగమైనిలిచారు’’.- డా.అమ్మిన శ్రీనివాసరాజు

గిరిజన సంప్రదాల్ని గుర్తించిన పీసా చట్టం

గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాల్లో ముఖ్యమైనది స్వయం పరిపాలన. ఎప్పుడో హిందు రాజులు, మొగల్‌ సామ్రాజ్యం, దాని తరువాత బ్రిటిష్‌ నైజాం నవాబుల పాలనలో స్వయం పరిపాలన అధికారాలు కోల్పోయిన గిరిజనులు నిర్విరామంగా పోరాటాలు చేస్తోనే ఉన్నారు. బ్రిటిష్‌ ప్రభుత్వం అయితే గిరిజన ప్రాంతాలను షెడ్యూలు ప్రాంతాలుగా 1874లోనే గుర్తించి సామాన్య పరిపాలన నుండి తప్పించారు. గిరిజనుల సార్వ భౌమధికారాన్ని కాలరాసేయడం వల్ల అలజడులు వస్తున్నాయని గుర్తించకపోగా హిందు రాజుల ప్రోద్భలంతో వీరు తిరుగుబాట్లు చేస్తున్నారని బ్రిటిష్‌ వారు అభిప్రాయపడ్డారు. సుమారు 150 సంవత్సరాలుగా అదే అభిప్రాయం కొనసాగుతోంది. అయితే అప్పుడప్పుడు అలజడులకు కారణాలు తెలుసుకునేందుకు కమీటీలను వేసి వాటి ద్వారా విషయాలు సేకరించేవారు. అయినా గిరిజన ప్రాంతాలను చీకట్లో ప్రాంతాలుగా చిత్రీకరించడం మానలేదు. అందువల్ల శాంతిని నెలకొల్పేందుకు పోలీసు బలగాల ఉపయోగం పెరిగింది. కాని మొదట షెడ్యూలు ప్రకారం శాంతి, సుపరి పాలన జరిగేందుకు ప్రయత్నాల చేయడం యాదృచ్చికమే! ఒకానొక సమయంలో ఐదవ షెడ్యూలు ప్రాంతంలో చాలా భాగం కల్లోలిత ప్రాంతంగా కేంద్రహోంశాఖ గుర్తించింది. మరోపక్క రాజ్యాంగం 46వ ఆర్టికల్‌ ప్రకారం గిరిజనులకు రక్షణ కల్పిస్తూ విద్య, అర్థికా భివృద్ధిని చేపట్టాలని ఉన్నా ఆచరణ మాత్రం అంతంతే. రాజ్యాంగం ఐదవ షెడ్యూలులో ప్రభుత్వ అధికారుల (గవర్నరు) ద్వారా శాంతి, సుపరిపాలన సాధించాలని నిర్దేశించినా అది సాధ్యం కాలేదు. ఎందుకంటే అధికార యంత్రాంగం తమ స్వార్థం కోసమే పనిచేసింది. అక్కడకు బదిలీ అయినవాళ్ళు చాలామంది వెళ్ళకుండా ప్రయత్నం చేసుకుంటే, తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉన్న సంసారాన్ని చెడగొట్టేరు. ఫలితంగా గిరిజనులకే శిక్షపడిరది. ఇదంతా వివరంగా చర్చించిన తరువాత పంచాయితీ రాజ్‌ వ్యవస్థలో గిరిజన ప్రాంతాలలోని పంచాయితీలకు ప్రత్యేక అధికారాలు ఇవ్వాలని 1992 లో నిర్ణయం జరిగింది.
వారి ప్రపంచం వేరు
73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయితీ రాజ్‌ చట్టం, 1992 తీసుకు వచ్చేటప్పుడు ఈ చట్టం షెడ్యూలు ప్రాంతాలకు యధాతధంగా అమలు చేయరాదని నిర్ణయించారు. గిరిజన ప్రాంతాలలో స్వయం పాలనా వ్యవస్థ, ముఖ్యంగా సామాజిక వ్వవహారాల్లో ఇంకా పటిష్టంగానే ఉందనే విషయాన్ని గుర్తించారు. అయితే బయటి ప్రపంచంతో సంబంధాలు ఎక్కువ అవుతున్న సందర్భంలో ఉత్పన్నమౌతున్న సవాళ్ళను మాత్రం సాంప్రదాయక వ్యవస్థ ఎదుర్కోలేక పోతోంది. అందువల్ల షెడ్యూల్‌ ప్రాంతాలలో ఎన్నుకోబడిన పంచాయితీలకు అధికార వికేంద్రీకరణతో పాటు కొన్ని ప్రత్యేక అధికారాలు ఇవ్వాలని కూడా ఆలోచించారు. షెడ్యూలు ప్రాంతంలోని పంచాయితీలకు ఏ ఏ ప్రత్యేక అధికారాలు ఇవ్వాలో నిర్ణయించేందుకు దిలీప్‌ సింఫ్న్‌ ఛూరియా నాయకత్వంలో ఒక కమీటీని నియమించారు. ఈ కమీటీలో గిరిజన ప్రాంతాలలో చాలా కాలం పనిచేసిన నిష్ణాతులు ఉన్నారు.షెడ్యూలు ప్రాంతాలలో పంచాయితీలకు ప్రత్యేక అధికారాలపై ఎన్నో సూచనలు ఇచ్చేరు. అయితే ఆదిలోనే హంసపాదు అన్నట్లు వీటిలో కొన్నింటినే ప్రభుత్వం ఆమోదించి 1996లో కేంద్ర పీసాచట్టం (40వ ఏక్టు 1996)రూపంలో పార్లమెంటు ఆమోదం పొందింది. కేంద్రచట్టం అనుసరించి ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ (సవరణ) చట్టం 1998లో వచ్చింది. ఈ చట్టం అమలుకు కావలసిన రూల్సు 2011 సంవత్సరంలో అంటే 13 సంవత్సరాల తరువాత వచ్చాయి. రాజ్యాంగ సవరణ 1992లో జరిగితే పీసాచట్టం అమలుకు కావలసిన మార్గదర్శకాలు (రూల్సు) వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌లో 19సంవత్సరాలు పట్టింది. డిల్లీ నుండి హైదరాబాదుకు అంతదూరమా? 2011లో రూల్సు వచ్చేసరికి పంచాయతీలు గడువు కాలం తీరింది. 2014లో పంచా యితీ ఎన్నికలు అయినా కనే పీసా పంచాయ తీలు పనిచేసే అవకాశం కలిగింది. పీసా పంచాయతీలను రూల్సు ప్రకారం ప్రకటించవలసిన భాద్యత గిరిజన సంక్షేమశాఖది. దీనికి జిల్లా కలెక్టరు దగ్గరనుండి ప్రతిపాదనలు రావాలి. దీనికోసం మరింత జాప్యం జరిగింది. ప్రభుత్వంలో కొంత మంది విజ్ఞులు ఉంటారు. ఏదైనా పనిచేయకూడదు. అని వారు అనుకుంటే జాప్యం చేస్తే సరి అనే విధానం పాటిస్తారు. పంచాయితీలకు ఇవ్వవలసిన అధికారాలు అన్నీ ఇప్పటికే కొన్ని డిపార్టుమెంటు అధికారులు అనుభవిస్తున్నారు. లాభడుతున్నారు. కూడా. అందువల్ల అధికారాలు బదలాంచడాన్ని ఇష్టపడరు. అలాగని చట్టం అమలు చేయకపోతే ఇబ్బందుల్లో పడతారు. కాలయాపనే మార్గంగా ఎంచుకుంది అధికార వ్యవస్థ. సరే, చట్టం ప్రకారం పంచాయతీలకు సంక్రమిస్తున్న అధికారాలు ఏమిటి? అనేది క్లుప్తంగా తెలుసుకుందాం.
ఆదివాసీ పంచాయితీ అధికారాలేమిటి?
అన్నిటికంటే ముఖ్యమైనది ‘పీసా గ్రామం’ నిర్వచనం. గిరిజనుల ఆచారాల ప్రకారం గుర్తించబడి, వారే పాలన చేసుకునే ప్రాంతాలు: ఆవాసం/శివారు గ్రామాలు/ సముదాయాల పీసా గ్రామాలుగా గుర్తించాలి. అంటే ప్రతి ఆవాసానికి గ్రామ సభ ఉంటుంది. ఇంతకు ముందు గ్రామసభ పంచాయితీ ముఖ్య గ్రామానికే పరిమితం అవుతోంది. ఆ పంచా యితీలో నున్న శివారు గ్రామాలకు ప్రాతినిధ్యం కాగితాలకే పరిమితం రెండవది, అంతే ముఖ్యమైనది పాలనా వ్యవస్థ. గ్రామపంచాయితీ పాలన వారి ఆచార వ్యవహారాలను, సాంస్కృతిక ప్రత్యేకతను రక్షిస్తూ తదనుగుణంగా పరిపాలన చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలకు వ్యతిరేకంగా ఈ పాలన ఉండకూడదు. గిరిజన సంస్కృతికి, చట్టాలకు మధ్య సంఘర్షణ ఉన్నప్పుడు చట్టాలదే పైచేయి అవుతుంది. అటువంటప్పుడు గిరిజన సంప్రదాయక చట్టాలు పనికిరావు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే గిరిజన సంప్రదాయక పరిపాలనా వ్యవస్థను క్రోడీకరించలేదు. అందువల్ల న్యాయవ్యవస్థ గుర్తించదు. ఒడిసా రాష్ట్రంలో నియామ్‌గిరి కొండల్లో బాక్సైటు గనులకు వేదాంతా (బహుళదేశ) కంపెనీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడు ఆ ప్రాంతంలో నివసించే డోంగ్రియా ఖోండులు అనే చాలా వెనుకబడిన గిరిజన తెగవారు అభ్యంతరం తెలిపారు. ఆ కొండల్లో తమ ఆరాధ్య దైవమైన నియామ్‌గిరి రాజు నివసిస్తాడని, బాక్సైటు గనులు త్రవ్వటం వల్ల గిరిజన వ్యవస్థ దెబ్బతింటుందని గ్రామ సభ తీర్మానం ద్వారా తెలిపేరు. దాంతో బాక్సైటు గనుల త్రవ్వకం ఆపేసింది సుప్రీంకోర్టు. అందువల్ల పీసా చట్టం వల్ల గిరిజన సంప్ర దాయాలను కాపాడుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. వీటిని ఉపయోగించుకోవాలి. షెడ్యూలు ప్రాంతాలలో గ్రామసర్పంచులు మండల అధ్యక్షులు గిరిజనులే ఉండాలని, పీసా చట్టంలో ఉందికాని ఎం.పి.టి.సి, జెడ్‌.పి.టిసి వ్యవస్థ దీన్ని దెబ్బతీస్తోంది. గ్రామ ప్రణాళిక తయారు, అమలు, పర్యవేక్షణ, లబ్దిదారుల ఎన్నిక గ్రామ సభదే. అయితే బయటి వారి ప్రమేయం ఎక్కువగానే కనిపిస్తుంది. దీనికి తోడు అధికారుల దొంగ లెక్కలు కలుస్తే అబ్దిదారులు జాబితా తప్పులు తడకలే. షెడ్యూలు ప్రాంతాలలో భూసేకరణ, పునరావాస ప్రణాళిక, అమలులో గ్రామసభ, ఆ పై పంచాయితీ రాజ్‌ వ్యవస్థల ఆమోదం ద్వారానే జరగాలి. అసలు సంప్రదింపులు కూడా జరగని సందర్భాలు చాలా ఉన్నాయని గిరిజన ప్రజాసంఘాలు చెబుతాయి. షెడ్యూలు ప్రాంతంలో భూమి అన్యాక్రాంతం కాకుండా చూడడం, ఇంతకుముందు అన్యాక్రాంతం అయిన భూమిని గిరిజనులకు తిరిగి ఇప్పించటం లాంటివి చేపట్టేందుకు గ్రామసభకు అధికారాలు ఉన్నాయి. అయితే చట్టం అమలు పరిచే స్థోమత గ్రామసభలకు కల్పించలేదు, చాలాచోట్ల అవగాహనేలేదు. చిన్నతరహా అటవీసంపదపై ఆస్థిహక్కు, మార్కెట్టుపై అజమాయిషీ కూడా గ్రామ సభకు ఉన్నాయి. కాని జి.సి.సి అటవీశాఖలకు కూడా ఈ హక్కులు ఇంకా ఉన్నాయి. గ్రామ సభలకు ఈ వ్యవస్థలను వ్యతిరేకించే స్థోమత లేదు. వడ్డీ వ్యాపారం నియంత్రణకు కూడా గ్రామసభకు అధికారం ఉంది. కాని బ్యాంకులు పనిచేయని చోట్ల వడ్డీ వ్యాపారులే దిక్కు అయినప్పుడు ఈ అధికారం చలాయించడం కష్టమే. ఇక స్థానిక సంస్థలు అధికారులపై అజమాయిషీ హక్కులు ఉన్నా వారిని నియంత్రించే స్థోమత గ్రామ పంచాయితీలకు లేదు. ఉద్యోగులకు బలమైన సంఘాలు ఉన్నాయి. గిరజన పంచాయితీ గ్రామసభలను చైతన్య పరిస్తేనే స్వపరిపాలన సాధ్యం. ఆలోచించండి.
స్వపరిపాలన వారి సంస్కృతికి మూలం
వాడుక భాషలో గిరిజనులు అని పిలువబడే వారిని రాజ్యాంగపరంగా షెడ్యూలు తెగలు అని పిలుస్తారు. మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు గిరిజనుల్ని వివిధ పదాలతో పిలిచేవారు. వనవాశి, గిరిజన్‌, ఆదిమజాతి లాంటి పదాలు ఉపయోగించేవారు. పురాణాలలోను, ఇతిహాసాలలోను గిరిజనుల గురించి ముఖ్యంగా దండకారణ్యం గురించి వివరాలు ఉన్నాయి. గిరిజనుల నాగరికత చాలా పురాతనమైనది. వారికి రాజ్యాలు ఉండేవి. కోటలు ఉండేవి. వారికి భాష ఉంది. సంఖ్యా పరిజ్ఞానం, మాసాలు, ఋతువులు లాంటి లెక్కలు కూడా ఉన్నాయి. సాహిత్యం, సంగీతం, వాయిద్య సహకారం అత్యున్నత స్థాయికి చేరుకుంది. స్వపరిపాలన వారి సంస్కృతికి మూలాలు చాలా గిరిజన సంస్కృతి లో కనిపిస్తాయి. అయితే కాలక్రమేణా వారి రాజ్యాలు, హిందూ రాజులు, మొగలులు, నిజాములు, బ్రిటిష్‌వారి చేతుల్లోకి వెళ్ళిపోయాయి. వారి జీవన విధానానికి తీవ్రమైన ఇబ్బందులు కలిగాయి.1901 జనాభా లెక్కల నాటికి బ్రిటిష్‌ ప్రభుత్వం గిరిజనుల్ని ‘ఏనిమిస్ట్‌’ లుగా పిలిచేవారు. కాని అప్పటి జనాభా కమిషనర్‌ అయిన శ్రీ హట్టన్‌, ఏనిమిస్ట్‌లను హిందువుల నుంచి నేరుగా పరిగణించటం కష్టం అవుతోందని వర్ణించారు. అయితే గిరిజన ప్రాంతాలు మాత్రం మిగిలిన ప్రాంతాలకంటే భిన్నంగా ఉంటాయని, వాటి పరిపాలన సామాన్య పరిపాలనతోటి కలపరాదని భావించి, బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయా ప్రాంతాలను షెడ్యూలు జిల్లాలుగా 1874లోనే ప్రకటిం చారు. అలాగే హైదరాబాద్‌ ప్రభుత్వం 1949 లో నోటిఫైడ్‌ ప్రాంతాలుగా గుర్తించింది. బ్రిటిష్‌వారు వీరిని హిల్‌ట్రెబ్స్‌ అనిపిలిస్తే, హైదరాబాద్‌ ప్రభుత్వం నోటిఫైడ్‌ ట్రెబ్స్‌గా పిలిచారు. వారి భూమి రక్షణకై చట్టాలు కూడా చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత, ముఖ్యంగా 1960నుంచి గిరిజనులు నివసించే మారుమూల కొండ ప్రాంతాలు రోడ్లతో కలుపబడ్డాయి. బయటి ప్రాంతాల ప్రజలు మొదటి వ్యాపారానికి వచ్చి, తరువాత వ్యవసాయానికి స్థిర నివాసం ఏర్పాటు చేసుకు న్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు అమ ల్లోకి వచ్చాయి. గిరిజన సంతలు- బయటి మార్కెట్టు ప్రభావానికి లోనయ్యాయి. భారత రాజ్యాంగంలో 366 ఆర్టికల్‌లో షెడ్యూలు తెగల గురించి నిర్వచించడం జరిగింది. రాజ్యాంగంలో 342 ఆర్టికల్‌ ప్రకారం రాష్టప్రతి ప్రకటించిన గిరిజన తెగలు కాని, సమాజాలు కాని, వాటిలో భాగాలు కాని, గిరిజన తెగలు గుంపులను షెడ్యూలు తెగలుగా గుర్తిస్తారు. కొన్ని తెగలను ఈ లిస్టులో చేర్చడానికి కానీ, తీసివేయడానికి కాని పార్లమెంట్‌కు అధికారం ఉంది. వీరిని రాజ్యాంగపరంగా షెడ్యూలు తెగలు అంటారు. కేంద్ర గిరిజన సంక్షేమశాఖ వారి లెక్కల ప్రకారం దేశంలో 50 షెడ్యూలు తెగలు వున్నాయి. వారిలో 75 షెడ్యూలు తెగలు, ఇంకా పురాతన సాంకేతిక స్థాయిలో ఉండి ఆర్థికంగా, విద్యాపరంగా చాలా వెనుకబడి వున్నాయి. వారిని పి.టి.జి. (ప్రిమిటివ్‌ ట్రైబల్‌ గ్రూప్సు)గా పిలుస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 10.42 కోట్ల షెడ్యూలు తెగల జనాభా ఉంది. అది దేశ జనాభాలో 8.6 శాతం. మధ్య భారతదేశం, దక్షిణ భారతదేశంలో గిరిజన జనాభా ఎక్కువగా ఉంది. ఈశాన్య భారతదేశంలో షెడ్యూలు తెగల జనాభా సాంద్రత ఎక్కువగా వుంది. దేశంలోని గిరిజన జనాభాలో 89.96 శాతం గ్రామీణ ప్రాంతాలలోనే ఉన్నారు.ఏదైనా తెగను కాని, భాగాన్ని కాని, సముహల్ని కాని షెడ్యూలు తెగలుగా గుర్తించేందుకు లోకూర్‌ కమిటీవారు కొన్ని ప్రామాణికాల్ని నిర్ధేశించారు. అవి (1) అతి పురాతన సాంకేతిక విధానం (ఆహార సేకరణ, పోడు వ్యవసాయం), (2) ప్రత్యేక సంస్కృతి (్భష, ఆచారాలు, నమ్మకాలు, కళలు లాంటివి), (3) ప్రత్యేక నైవాశిక ప్రాంతం (అడవి, కొండలు లాంటివి), (4) బయటివారితో కలవడానికి ఇష్టపడకపోవడం, (5) బాగా వెనుకబడి వుండటం (మానవా భివృద్ధి సూచికలు- విద్య, ఆరోగ్యం, ఆదాయం లాంటి వాటివి) ఆర్టికల్‌ 244 (1) ప్రకారం రాష్టప్రతి షెడ్యూలు ప్రాంతాలను ప్రకటిస్తారు. గిరిజనుల సాంద్రత ఎక్కువగా వున్న ప్రాంతా లు, పరిపాలన సౌలభ్యం ఉండే ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడ్డ ప్రాంతాలను షెడ్యూలు ప్రాంతాలుగా గుర్తిస్తారు. అయితే భారత రాజ్యాంగం రాకముందే ఉన్న ఏజెన్సీ ప్రాంతాలే రాజ్యాంగం తరువాత ఇంచుమించుగా షెడ్యూ లు ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది.- తేజావత్‌ నందకుమార్‌ నాయక్‌

ఖరీఫ్‌ సాగు`మెలకవలు

రోహిణిలో రోళ్ళ పగిలే అన్న సామెతను నిజం చేస్తూ, వేసవి (ఎండాకాలం) వెళ్ళిపోయింది. కనీవినీ ఎరుగని రీతిలో భానుడు భగ్గుమని 48 డిగ్రీల ఉష్ణవ్రతాపాన్ని చూపాడు. వర్యావరణం అతలాకుతలమై భూతాపం ఏ స్థాయికి చేరిందో మనం అనుభవించాం. అంతలోనే ప్రతీ చినుకు ముత్యంగా మెరుస్తూ కొంగొత్త ఆశల ఊసులను మోసుకొచ్చింది. ప్రకృతి మాత పచ్చని పచ్చిక బయళ్ళ చీరలో సింగారించుకొని రైతుల ముగింట్లో దర్శనమిచ్చింది. వేసవి ముగిసీ ముగియగానే కాస్త కునుకుపాటు తీస్తున్న రైతన్న ఒక్కసారి మళ్ళీ భూమాతకు భూరి దండాలు పెట్టుకొని వానాకాలం పంటల సాగుకు సర్వసన్నద్దమయ్యాడు. వేసవి దుక్కుల వలన చేలల్లో, చెలకల్లో నీరు ఇంకి తేమ నిలువ ఉండి విత్తనం విత్తడానికి, మొలకెత్తడానికి అనువుగా మారింది.

నాణ్యమైన విత్తనం విత్తి,నమ్మకమైన దిగుబడి సాధించే దిశగా రాష్ట్ర వ్యవసాయశాఖ క్షేత్ర స్థాయిలో పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. వరి,మొక్కజొన్న జొన్న పెసర, కంది,సోయాచిక్కుడు విత్తనాలను సుమారు 6 లక్షల క్వింటాళ్ళు రాయితీపై పంపిణీ చేసింది.
సేంద్రీయ ఎరువులు
నారుమడులు పోయాలనుకున్న భుములకు వేసవి దుక్కికి ముందుగానే హెక్టారుకు 5-10 టన్నుల పశువుల ఎరువును వేయాలి, నారు మడులను పోయడానికి పొలంలో 10వ భాగాన్ని ఎంపిక చేసుకోవాలి.ఎ0పిక చేసుకున్న పొలానికి 5-10 సె0.మీ.నీళ్ళు పెట్టిబాగా కలియ దున్నాలి.తరువాత మట్టెగడ్డలన్ని మెత్తగయ్య్లోలా బాగా దమ్ము చేయాలి. బాగా దమ్ము చేసిన తరువాత పొలం నుండి కలుపు మొక్కలు లేకుందా జాగ్రత్త పడాలి.
విత్తన మోతాదు
నాటే పద్ధతికి 20-25 కిలోలు,వెదజల్లటానికి (గరువు) భూముల్లో) 24-30 కిలోలు, వెద జల్లటానికి (గోదావరి జిల్లాల్లో) 16-20 కిలోలు,గొర్రుతో విత్తటావికి (వర్షాధారపు వరి) 30-36 కిలోలు, శ్రి పద్ధతిలో 2 కిలోలు సరి పోతుంది.
విత్తన శుద్ది
కిలో విత్తనానికి 2.5గ్రాముల కార్చండజిమ్‌ కలిపి 24గంటల తరువాత నారుమడిలో చల్లుకోవాలి. దంప నారుమళ్ళ కైతే లీటరు నీటికి ఒక గ్రాము కార్బండజిమ్‌ కలిపి, ఆ ద్రావణంలో విత్తనాలను 24 గ0టలు నానబెట్టీ ,24 గంటలు మ0డెకట్టీ మొలకలను ద0ప నారుమడిలో చల్లుకోవాలి. కిలో విత్త నాలు నానబెట్టడానికి లిటరు మందు నీరు సరిపోతుంది. పది లిటర్ల నీటికి 1.5 కిలోల ఉప్పు కలుపగా వచ్చిన ద్రావంలో ఎ0పిక చేసు కున్న విత్తనాన్ని పోసి పైకి తేలిన తాలు విత్తనా లను తీసివేయాలి. ఉప్పునీటిలో మునిగిన గట్టీ విత్తనాలను నారు పోయడానికి వాడుకోవాలి. మడిలో చల్లే ము0దు 24గంటల పాటు మంచి నీటిలో విత్తనాలను నానబెట్ఠాలి. విత్తనాల ద్వారా సంక్రమి0చే లెగుళ్ళ నివారణ కోస0 కిలో విత్తనానికి 3 గ్రా. దైరమ్‌ లేదా కాప్టాన్‌ మందును కలిపి విత్తన శుద్ది చేయాలి. నారు మడిలో చల్లేము0దు మొలకెత్తిన విత్తనాన్ని 0.2 శాత0 క్లోరిప్రేరిఫాస్‌ ద్రావణంలో నాసబెట్టీ చల్లుకోవాలి. దీనివల్ల నారుమడిలో ఆకు తినే పురుగులు,ఉల్లికోడు,మొవ్వపురుగు ఆశించకుండా ఉంటాయి.
నారుమడి
దమ్ము చేసిన నేలను 10మీ.పోడవు ఒకమీ. వెడల్పుతో నారుమడిని చేసుకోవాలి. నారు మడిలోని నీరు పోషకాలు బయటపోకుండా ఉండేలా గట్లు వేసుకోవాలి. గట్ట్లును సమంగాను గట్టిగాను పోయాలి.మడిలో చెతాచెదారం లేకుండా జాగ్రత్తపడాలి. నారుమడి బురద పదునులో ఉండాలి.నారుమడులు ఎత్తుగా ఉండేలా జాగ్రత్తపడాలి. రెండు మడుల మధ్యలో 20సెం.మీ వెడల్పులో కాలువ తీయాలి.కాలువలోని మట్టిని తీసి మడిలో వేసి నారుమడిని ఎత్తుగా చేసుకోవాలి. నారుమడి మొత్తం చదునుగా ఉండాలి.
సస్యరక్షణ
విత్తిన 10రోజులకు కార్బోఫ్యూరాన్‌ 3జి గుళి కలు సెంటు నారుమడికి 160గ్రా చొప్పున వేయాలి లేదా మోనోక్రోటోఫాస్‌ 1.6మి.లి లేక క్లోరిఫైరిఫాన్‌ 2.0మి.లి.లీటరు నీటికి కలిపి విత్తిన 10రోజులకు మరియు 17రోజులకు పిచి కారి చేయాలి లేదా నారు తీయటానికి 7 రోజు ల ముందు సెంటు నారుమడికి 160 గ్రా కార్బోఫ్యూరాన్‌ గుళికలు తక్కువ నీటిలో వేయా లి జింకు లోపాన్ని గమని లీటరు నీటికి 2గ్రా జింకు సల్ఫేటు ద్రావణాన్ని పిచికారి చేయాలి. చలిఎక్కువగా ఉండే దాళ్వా వరి సాగులో జింకులోప లక్షణాలు ప్రస్పుటంగా కనిపిస్తాయి.
నాటు
నారు తీసేటపుడు మొక్కలు లేతాకుపచ్చగా వుంటీనే మూన త్వరగా తిరుగుతుంది. నాలుగు నుండి ఆరుఆకులున్ను నారును ఉపమోగిం చాలి.ముదురు నారును నటితే దిగుబడి తగ్గు తుంది. నాటు నాటితే పిలకలు ఎక్కువగతొడిగే అవకాశముంది. నట్టువేసేతప్పుడు భూసారాన్ని అనుసరించి ఖరీప్‌లోచ/మీ/కు 33 మూనలు, రబీలో 44 మూనలు ఉండేలా చూడాలి. నాటిన తర్వాత ప్రతి రెండుమీటర్లకు 20సెం.మీ.బాటలు తీయటం వలన ఫైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడిపిడాల ఉదృతి కొంతవరకు అదుపుచేయవచ్చు. ఎరువులు, పురుగు మందులు,కలుపు మందులు వెయ టానికి ఇంకా ఫైరు పరిస్ధితిని గమనించటానికి ఈ బాటలు బాగా ఉపమోగపడతాయి. వరిరకాల కలపరిమితిని బట్టి కుదుళ్ళు సంఖ్య ను నిర్దారించాలి. భూసారం ఎక్కువ ఉన్న పోలాల్లో తక్కువ కుదుళ్ళు ,భూసారం తక్కువగా ఉన్న పొలాల్లో ఎక్కువ కుదుళ్ళు ఉండేటట్లు నాటాలి. ముదురు నారు నా టిన పుడు కుదుళ్ళు సాంఖ్యను పెంచి,దగ్గర దగ్గరగా,కుదురుకు 4,5 మొక్కలు చొప్పున నాటు వేయాలి. అలా ముదురు నారు నాటి నాపుడు నత్రజని ఎరువును మూడు దఫాలుగా గాక,రెండు దఫాలుగా-అంటే 70శాతం దమ్ము లోను మిగితా30 శాతం అంకురం దశలోనూవాడాలి.
పచ్చిరోట్టి పైర్లు
వరి మగాణుల్లో అపరాలు,జిలుగు ,జను ము,పిల్లిపెసర లాంటి ప్చ్చిరోట్టి పైర్లను వంచి కలియదున్నటం ద్వారా భూసారం పెరుగుడమే కాక సుమారు 20-25శాతం నత్రజని, భాస్వీ రం,పొటాష్లను కూడాఅదా చేయవచ్చు.
సేంద్రియ ఎరువులు
పశువుల ఎరువు,కంపోషు,కోళ్ళు ఎరువులను ,రసాయనిక ఎరువులతో కలిపి వాడినట్లయితే 20-25 శాతం వరకు నత్రజనిని అదా చేయవచ్చు.
రసాయనిక ఎరువులు
భూసారాన్ని బట్టీ రసాయనిక ఎరువుల మోతాదు నిర్ణయంచి నత్రజని, భాస్వరం, ఫొటాష్‌, జి0కు నిచ్చే ఎరువులను సమతు ల్యంగా వాడాలి. నత్రజనిని కాంప్లేక్సు ఎరువుల రూపలలోగాని, యూరియా రూపలలో గాని వాడపచ్చు. నత్రజనిని మూడు సమభాగాలుగా చేసి, నాటుటకు ముందు దమ్మలోను దుబ్బుచేసే దశలోను, అంకురం దశలోను, బురదపదనులో మాత్రమే సమాన0గా వెదజలల్లి 36-48 గంటల తర్వాత పలుచగా నీరు పెట్ఠాలి. 50 కిలోల యూరియాకి 10కిలోల వేపపిండి లేక 250 కిలోల తేమ కలిగిన మట్టిగాని కలిపి, 2 రోజులు నిల్వ ఉంచి వెదజల్లీతే సత్రజని విని యోగం పెరుగుతుంది. మొత్తం భాస్వరం ఎరు వును దమ్ములోనే వేయాలి. పొటొష్‌ ఎరువులను రేగడి నేల్లలో ఆఖరి దమ్ములో పూర్తీగా ఒకేసారి వేయాలి-చల్క (తేలిక) భూముల్లో ఆఖరి దమ్ములో సగం. అకురం ఏరఎడు దశలో మిగతా సగాన్ని వేయాలి.కాంప్లేక్స ఎరువులను ఫైపాటుగా దుబ్బు చేసే సమయంలలో గాని, అంకురం ఏర్చడే దశలోగాని వేయకూడదు. దమ్ములోనే వేయటం మంచిది.
వేప పిండి
50కిలోల యూరియాకి10 కిలోల వేపపిండి లేక 250కిలోల తేమ కలిగిన మట్టిగాని కలిపి,2రోజులు నిల్వ ఉంచివెదజల్లితే నత్రజ నిన వినియోగం పెరుగుతుంది.
నీలి ఆకుపచ్చ శైవలాలు – నాచు
వీటిని వరి పొలంలో వేసి ఎకరాకు 10కిలోల నత్రజని పైరుకురు అందుతుంది. నాచు నేలలో కలిపి సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది. నాచును పొడి చేసి వరినాట్లు వేసిన 10-20 రోజుల మధ్య మడిలో పలుచగా నీరు నిలువ గట్టీ ఎకరాకు 4కిలోల నాచుపొడిని ఇసుకతో కలిపి మడి అంతా సమాసంగా పడేటట్టు చల్లాలి.
సామగ్ర పోషక యాజమాన్యం
భూసార వరిరక్షణకు, ఉత్పత్తి స్తబ్దతను అధిగమమించటానికి రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ లేదా జీవన ఎరువులను వాడి, ప్తెరుకు సమతుల్యంగా పోషక పదార్దాలను అందజేయాలి. పశువుల ఎరువు, కంపోషు. కోళ్ళ ఎరువులను,రసాయనిక ఎరువులతో కలిపి వాడినట్లయితే 20-25శాతం వరకు నత్రజనిని ఆదా చేయవచ్చు. వరి మాగాణురల్లో అపరాలు,జీలుగు,జనుము, పిల్లెపెసర లాంటి పచ్చిరొట్ట ప్తెర్లను పెంచి కలియదున్నటం ద్వారా భూసారం పెరగడమే కాక షుమారు 20-25శాతం నత్రజని, భాస్వర,పొటొష్‌లను కూడా ఆదా చేయ వచ్చు.
-గునపర్తి సైమన్‌

వాక్సిన్‌పై అవగాహన

కరోనా కట్టడికి ఏకైక మార్గంగా భావిస్తున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే,వ్యాక్సిన్లపై ఎన్నో అనుమానాలు, సందేహాలు రాజ్యమేలుతున్నాయి. కొంత మంది ఫేక్‌ప్రచారం వల్ల ప్రజలు వాక్సిన్‌ వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. దేశంలో కరోనా కట్టడికి, ప్రభుత్వ లక్ష్యానికి ఇది అడ్డంకిగా మారింది. అందువల్ల, గ్రామీణ ప్రాంతప్రజల్లో వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించేందుకు ముందుకొస్తున్నారు కొందరు సామాజిక కార్యకర్తలు. తాజాగా,తమిళనాడుకు చెందిన ఒకయువకుడు తన గ్రామప్రజలకు వాక్సిన్‌పై అవగాహన పెంచేందుకు నడుం బిగించాడు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి ఒక బహుమతి ఇస్తూ, ఎక్కువ మంది ప్రజలు టీకాలు తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నాడు. కల్లకూరిచి జిల్లాలోని ఉలుందూర్పేట గ్రామానికి చెందిన ఆర్‌. తంబిదురై అనే స్టూడియో ఫోటోగ్రాఫర్‌,సామాజిక కార్యకర్త ఈకార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.

వ్యాక్సిన్‌ ప్రక్రియలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలు తన గ్రామానికి రాగా.. ప్రజల్లో అవగాహన లేక ఎవరూ వాక్సిన్‌? తీసుకునేందుకు ముందుకు రాలేదు. దీన్ని గ్రహించిన తంబిదురై తన గ్రామ ప్రజలను వ్యాక్సిన్‌ తీసుకోవడంలో ప్రోత్సహించాలనుకున్నాడు. వెంటనే తంబిదురైకి ఒక ఆలోచన వచ్చింది. ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకునేలా ప్రోత్సహించేందుకు ఫ్రీగిఫ్ట్‌ స్కీమ్‌ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఫ్రీ గిఫ్ట్‌లు కొనుగోలు చేసేందుకు తన సొంత డబ్బు ఖర్చు చేస్తున్నాడు. ఆయన తీసుకున్న చొరవ ఇప్పుడు సత్ఫలితాలనిస్తోంది.

ఈకార్యక్రమంపై తంబిదురై మాట్లాడుతూ‘‘కోవిడ్‌-19సెకండ్‌ వేవ్‌ విజృంభనతో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాకట్టడికి సంజీవనిలా భావిస్తున్న వ్యాక్సిన్‌ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మా గ్రామానికి సమీపంలో టీకా డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. కానీ గ్రామస్థుల్లో అవగాహన లేకపోవడం వల్ల వాక్సిన్‌ తీసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో వారిని ప్రోత్సహించేందుకు నా సొంత ఖర్చులతో బహుమతులు ఇవ్వాలని నిర్ణయించుకున్నా. టీకాలు తీసుకున్న వారికి వంట పాత్రలు వంటి బహుమతులను అందజేస్తున్నా. దీనివల్ల ఇప్పుడు ఎక్కువ మంది ప్రజలు వ్యాక్సిన్‌? తీసుకునేందుకు ముందుకొస్తున్నారు’’ అని అన్నాడు. ఫ్రీగిఫ్ట్‌లు అందజేస్తుండటంతో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు టీకా తీసుకొని నా నుండి బహుమతి వస్తువులను అందుకున్నారని సంతోషం వ్యక్తం చేశాడు.

యువకున్ని ప్రశంసిస్తున్న గ్రామస్థులు..
కాగా,మొదటి రోజుటీకా తీసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. అయితే, రెండో రోజు మాత్రం తంబిదురై చొరవతో 94మందికి టీకాలు తీసుకునేందుకు ముందుకొచ్చారు.తంబిదురై అవిశ్రాంతంగా పనిచేస్తున్నందున గ్రామస్థులు,వైద్యులు, ప్రంట్‌ లైన్‌ వారియర్స్‌, స్వచ్చంద సంస్థలు ఆయన్ను ప్రశంసించారు.కోవిడ్‌-19పై పోరాటంలో యువతది చాలా కీలక పాత్ర. ప్రజల్లో ఉన్న అపోహలు,అనుమానాలు తొలగించి వారిని వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ప్రోత్సహించాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి.-రెబ్బాప్ర‌గ‌డ ర‌వి

గిరిజనుల కాలికింద కాజేసే ప్రయత్నం?

గిరిజనులు తమ హక్కుల కోసం నినా దించిన మహత్తరమైన రోజుగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. గిరిజన స్వయం నిర్ణయక హక్కు వివక్ష నుండి స్వేచ్ఛ భూమి ఇతర వనరులపై హక్కులు, గిరిజనుల సాంప్రదాయ,భాషాసంస్కృతి, విశిష్టత, విద్యా, వైద్యం, సమాచార, శ్రమ హక్కులు, అభివృద్ధి ఇతర ఆర్థిక సాంఘిక హక్కులతో పాటు గిరిజనులకు ఎదురవ్ఞతున్న ముప్పుల నుండి రక్షిం చాలనే అంశాలపై అన్ని దేశాలకు ఐక్యరాజ్య సమితి ఈ తీర్మానంలో పేర్కొన్నది. వీటిని గుర్తించాల్సిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వ్ఞన్న హక్కులను కాలరా యడానికి పూనుకుంటున్నాయి. ప్రభుత్వ విధానాల మూలంగా గిరిజనులు అడవ్ఞల నుండి బలవం తగా గెంటివేయబడుతున్నారు. లక్షలాది ఎకరాల గిరిజనుల భూములు అన్యాక్రాంతం అవ్ఞతున్నాయి.
అభివృద్ధి పేరుతో గిరిజన ప్రాంతాల్లో నిర్మి స్తున్న భారీ ప్రాజె క్టులు,పోలవరం వలన వేలాది గిరిజన గ్రామాలు లక్షలాది మంది గిరిజ నులు భూమితో పాటు సర్వ స్వం కోల్పతున్నారు. గిరిజనులకు విద్యా,వైద్యం,విద్యుత్‌,రోడ్లు, మంచినీటి వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవ్ఞ తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా గిరిజనుల జీవిత విధానంలో సారుప్యత కనిపిస్తుంది. ఏ ప్రాంతం లోను కలవిడిలేని ప్రత్యేక సంస్కృతి, సాంప్రదాయం గిరిజనులది. భూమి అటవి వనరులపైనే గిరిజనుల సంస్కృతి,సాంప్రదాయం తమ చుట్టూ ఉన్న అడవి వనరులతోనే పెనవేసుకోని ఉంటాయి ప్రపం చంలోని 90శాతం వరకు గిరిజను లు అటవీ ప్రాంతాలలో వ్యవసాయం,వేట,అటవీ ఉత్పత్తు లపైనే ఆధారపడి జీవిసున్నారు. ప్రపంచంలోని గిరిజనుల సాధక,బాధకాలు తెలుసుకొనుటకు ఐక్యరాజ్య సమితి 1982లో ఒకకమిషన్‌ ఏర్పాటు చేసారు. గిరిజనులస్వయం,పరిపాలన హక్కు సంస్కృ తి,సాంప్రదాయాలు,భాష కాపాడే హక్కు, ఇతర ప్రజలు ఆక్రమించుకున్న భూములను తిరిగి స్వాధీన పరుచుకునే హక్కు, సంఘనిర్మాణం చేసుకొనే హక్కు, భూమిని, ప్రకృతి వనరులను స్వయంగా సర్మించు కునే హక్కును, భూమిపై గిరిజన తెగల యాజ మాన్యం పోకుండా చూసే చట్టాలను చేయవలసి నదిగా ప్రభుత్వాలను కోరేహక్కు,చట్టాల రూపకల్ప నలో గిరిజన తెగలకు కూడా తగు ప్రాతినిధ్యం కల్పించే హక్కు, ప్రభుత్వాల నుండి రాయతీలు పొందే హక్కు, ఐక్య రాజ్యసమితిలో గిరిజన తెగ లకు సభ్యత్వం కలిగివ్ఞండే హక్కు వివిధ దేశాలలో గిరిజన తెగలపై సాగుతున్న హింసాకాండను నిలిపి వేయటం వంటి హక్కులను రాజ్యాంగం కల్పిం చింది. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల మనుగడే ప్రశ్నారక్ధంగా మారుతుంది. షెడ్యూల్డు ప్రాంతా లలో స్వయం పాలన లేకుండా అభివృద్ధి పేరుతో గిరిజనుల ను అడవ్ఞలనుండి తరిమివేసే విధానాన్ని ప్రభుత్వాలు అనుసరి స్తున్నాయి. అటవీ ప్రాంతా లలో ఖనిజ నిక్షేపాలే గిరిజనుల పాలిట శాపాలౌ తున్నాయి. గిరిజనులను బలి పశువులను చేసి అటవి సంపదను కొల్లగొట్టే కార్పొరేట్‌ శక్తులు చట్టా లను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. అటవి,ఖనిజ సంపదను కార్పొరేట్‌ సంస్థలకు, వ్యక్తులకు కట్టబెట్టేందుకు గిరిజన చట్టాలను తుంగ లో తొక్కుతున్నారు. ప్రభుత్వాలకు గిరిజనుల పట్ల చిత్తశుద్ది ఉంటేవారి హక్కులను గౌరవించాలి, పరిరక్షించాలి. గిరిజనుల సంస్కృతికి, వారి జీవన విధానానికి వారిని దూరం చేయ కుండా స్వేచ్ఛగా బ్రతకనివ్వాలి.గిరిజనుల ఆర్ధిక,సామాజిక పునాదు లపైవారి అభివృద్ధిసాగాలి.గిరిజనుల ప్రాం తానికి సంబంధించిన ఏనిర్ణయాలు తీసుకున్న వారి ప్రత్యేక గిరిజన సలహామండళ్ల అంగీకారం తప్పని సరిగా ఉండాలి. గిరిజనుల చట్టాలను పటిష్టంగా అమలు పరచాలి. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత బలహీ నులు, నిస్సహాయలగా ముద్రపడిన వర్గం గిరి జనులు, గిరిజన జాతి తరతరాలుగా అణచివేతకు, దోపిడీకి గురవ్ఞతుంది. రాజ్యాంగం కల్పించిన హక్కులను నిర్దాక్షిణ్యంగా కాలరాస్తున్నారు.
ఒకప్రక్క అభివృద్ధి పథంలో నడిపిస్తాం అం టూనే గిరిజనుల కాలికింది నేలను కూడా లాగేసుకునే దురాఘాతాలు (టి.ఆర్‌.ఎస్‌) ప్రభుత్వం లోనే తీవ్రమౌతున్నాయి. సంస్కరణల పేరుతో గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయం,భాష,ఆచార వ్యవహారలు అంతరించిపోతున్నాయి. ప్రపంచం లోని అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలోని అత్యంత వెనుకబాటుకు గురౌతున్న గిరిజనుల సమగ్రాభివృద్ధికి నేటికీ ఒక సమగ్ర జాతీయ విధానం లేకపోవడం దారుణం. మనదేశంలోని 9 రాష్ట్రాలు గిరిజన ప్రాంతల పరిపాలనలో గవర్నర్లకు, గిరిజన శాసనసభ్యులతో కూడిన గిరిజన సలహా మండళ్లకు విచక్షిణాధి కారాలున్నాయి. రాజ్యంగంలోని 5,6 షెడ్యూళ్ల ద్వారా దఖ లు పడ్డ సదరు అధికారాలను ఏ గవర్నర్‌ వినియోగించుటలేదు. గిరిజన ప్రాం తాల పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలను రాష్ట్రాలలో గిరిజన సలహామండళ్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తుం డాలి. గవర్నర్‌లు గిరిజన సలహా మం డళ్లు గిరిజన ప్రాంతాల పరిపాలన తీరుతెన్నులు, సిఫారుసులతో కూడిన నివేదికలను ప్రతి ఏటా రాష్ట్రపతి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖకు అందజే యాలి. గిరిజన సలహా మండలిని మన రాష్ట్రంలో టి.ఆర్‌.ఎస్‌.ప్రభుత్వం నేటివరకు ఏర్పాటు చేయ లేదు.
గిరిజనులు అంటే ఎవరు?
వాడుక భాషలో గిరిజనులు అని పిలిచే వారినిరాజ్యాంగ పరంగా షెడ్యూలు తెగలు అని పిలుస్తారు. మనదేశానికిస్వాతం త్య్రం రాకముందు గిరిజనుల్ని వివిధ పదాలతో పిలిచేవారు వన వాసి,గిరిజన్‌, ఆదిమజాతి లాంటి పదాలు ఉపయో గించే వారు. పురాణాలలోను, ఇతిహాసాలలోను గిరిజనులు,ముఖ్యంగా దండకారణ్యం వివరాలు ఉన్నాయి.గిరిజనుల నాగరికత చాలా పురాతన మైనది. వారికి రాజ్యాలుఉండేవి. కోటలు ఉండేవి. వారికి భాష ఉంది. సంఖ్యా పరిజ్ఞానం,మాసాలు, ఋతువులు లాంటి లెక్కలు కూడా ఉన్నాయి. సాహి త్యం,సంగీతం,వాయి ద్య సహకారం అత్యున్నత స్థాయికి చేరుకుంది. స్వపరిపాలన వారి సంస్కృతికి మూలాలు చాలాగిరిజన సంస్కృతిలో కనిపి స్తాయి. రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ సాధనకై ప్రజాపోరాటాలు తప్పనిసరైన పరిస్థితులు నెలకొ న్నాయి. గిరిజనులు అందరి పౌరులు లాగానే రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులకు అర్హులు. అదే కాకుండా రాష్ట్రపతిచే ప్రత్యే కంగా ‘షెడ్యూలు తెగలుగా గుర్తింపు వల్ల కొన్ని హక్కులు, రక్షణలు పొందుతారు. షెడ్యూలు ప్రాంతాలలో నివసించే గిరిజనులకు మరిన్ని రక్షణలు, సౌకర్యాలు కల్పిం చేందుకు రాజ్యాంగంలో నిర్ధేశికాలు ఉన్నాయి. ఒకపక్క రక్షణ కల్పిస్తూ,మరో పక్కన మిగిలిన ప్రజల/ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చెందేం దుకు అవకాశాలు కల్పించాలని రాజ్యాంగం సూచి స్తోంది. అయితే ఆచరణలో చిత్తశుద్ధి లేకపోవటం వల్ల అంతరాలు పెరిగి పోయి,పురోగతికి బదులు తిరోగతిని చూస్తున్నాం.-తేజావత్‌ నందకుమార్‌ నాయక్‌

మైనింగ్‌ వ్యతిరేక ఉద్యమంలో‘సూపర్‌ సైకిల్‌’ సిద్ధం చేయండి!

దశాబ్దాలుగా గనుల తవ్వకందారులు కార్పొరేట్‌ వ్యతిరేక కార్యకర్తలకు లక్ష్యంగా ఉన్నారు. ఖనిజాల వెలికితీత కలిగించే పర్యావరణ, సామాజిక ప్రభావాలపై ఉద్యమిస్తున్న వారి దృష్టిని ఆకట్టుకొంటుండగా, ఆతిథ్య దేశాలకు పెద్ద ప్రయోజనాలను చేకూర్చే పరిశ్రమ వాదనలలో వాస్తవం ఏమైనప్పటికీ, సందే హాలకు దారితీస్తున్నాయి.

ఇప్పుడు,వస్తువుల ధరలు పెరగడం ద్వారా ఈ రంగం పునరుజ్జీవింప బడుతున్నం దున, మరింత బలమైన దాడికి సామాజిక శక్తులు సిద్ధపడితే పర్యావరణ,సామాజిక,పాలన ఆధారాల పరంగా పరిశ్రమను మెరుగైన స్థితికి మార్చవచ్చు. మొదటిది వాతావరణ అనుకూల పదార్థాల గురిం చిన పరిశ్రమ కథనానికి వ్యతిరేకంగా పెరుగుతున్న ఎదురుదెబ్బ.ఇంధన ప్రాధాన్యతలు మారుతు న్నందున రాగి,కోబాల్ట్‌,లిథియం వంటి పరిశుభ్రమైన ఖనిజాలు డిమాండ్‌ పెరుగుతుంది. దాని తో చాలామంది ఖనిజ త్రవ్వకందారులు తమ హరిత ఆధారాలను చెప్పుకోవలసి వస్తున్నది. కానీ ఇది పరిశ్రమ దీర్ఘకాల విమర్శకులను వెనక్కి నెట్ట డానికి ప్రేరేపిస్తున్నది. ఉదాహరణకు,గత మార్చి లో,అటువంటి ఖనిజాలను వెలికి తీయడం ‘‘విస్తృతమైన విధ్వంస, మానవహక్కుల ఉల్లంఘనకు అపరిమిత అవకాశాలు కల్పించడం’’గావార్‌ ఆన్‌ వాంట్‌’ఒకవిశ్లేషణనుప్రచురించింది. ఏప్రిల్‌లో,ఎర్త్‌వర్క్స్‌’ మద్దతుతో జరిగిన ఒక అధ్యయనం అటువంటి పదార్థాలను వెలికితీసే అవసరాన్ని తగ్గించ డానికి రీసైక్లింగ్‌ కోసం పిలుపునిచ్చింది. ఇంధన పరిశ్రమను లక్ష్యంగా చేసుకున్న వాతావరణ కార్యకర్తలు, ఇప్పుడు ఎక్కువ ఇంధనం వినియో గించే పరిశ్రమల వైపు, ముఖ్యంగా మైనింగ్‌ వైపు దృష్టి సారిస్తున్నారు.ఒక అంచనా ప్రకారం, ప్రపంచ గ్రీన్‌ హౌస్‌ వాయు ఉద్గారాలలో అవి 4నుండి 7 శాతం వరకు బాధ్యత వహిస్తున్నాయి. రెండవది, కార్యకర్తలు వివిధ పరిశ్రమల ఖనిజాల వినియో గంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. డిజిటల్‌, ఇతర పరికరాల్లో ఉపయోగించే లోహాలను త్రవ్వడంవల్ల పర్యావరణ ప్రభావాలు సాంకేతిక సమూహాలను లక్ష్యంగా చేసుకుని చర్చనీ యాంశం గా మారాయి. మరింత విస్తృతంగా, ప్రపంచం పెట్టుబడిదారీ ‘‘అతిగా వినియోగం’’ ట్రెడ్‌మిల్‌లోకి లాక్‌ చేయబడిరదనే ఆందోళనల మధ్య, మైనర్లు, ఎప్పటికీ అంతం కాని వనరుల వెలికితీతపై తమ దృష్టితో, మృగానికి ఆహారం ఇస్తున్నట్లు కనిపిస్తారు. మైనింగ్‌ రంగం ఎదుర్కొంటున్న మూడవ సవాలు విస్తృత సాంఘిక ఆందోళనలు. ఇక్కడ మహమ్మా రికి ఆజ్యం పోసిన సమాజ స్థితి గురించి ఆందోళన లు చాలా అరుదుగా జరుగుతాయి. ఇది అసమా నత అయినా,పర్యావరణాన్ని దెబ్బతీసినా, మైనారిటీ లేదా కార్మిక హక్కులను ఉల్లంఘించినా, శక్తివంత మైన కంపెనీలు తప్పు చేసినట్లు కనిపించినప్పుడు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. పెద్ద మైనింగ్‌ గ్రూపులకు అయితే మరేమీ కాదు. వారికార్యకలాపాలు తరచు గా విస్తారంగా ఉంటాయి. మారు మూల, కోల్పో యిన, పర్యావరణ సున్నితమైన ప్రాంతాలలో ఉంటాయి. తరచుగా మైనారిటీ సమూహాల జనాభా కలిగి ఉంటాయి. గని విస్తరణకు మార్గం చూపడా నికి పశ్చిమ ఆస్ట్రేలియాలో 46,000 సంవత్సరాల పురాతన పవిత్ర అబోరిజినల్‌ ఆశ్రయాన్ని కంపెనీ ధ్వంసం చేసిన తరువాత రియో టింటో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ గత సంవత్సరం చివర్లో తనఉద్యోగాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. దానితో ఇప్పుడు ప్రపం చవ్యాప్తంగా మైనింగ్‌ ఎగ్జిక్యూటివ్స్‌ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా ఉల్లంఘన జరిగితే, అంతర్లీనంగా సామజిక పరిస్థితులు సున్ని తంగా ఉంటూ ఉండడంతో తాము భారీ మూల్యం చెలింపవలసి వస్తుందని భావిస్తు న్నారు. అయితే ఈమైనింగ్‌ వ్యతిరేక క్రియాశీలత వెనుక ఉన్న ఆందోళనలకు మద్దతు ఇవ్వడానికి ఇదిఏదీ అవస రం లేదు. కొన్ని ఉద్యమాలు స్పష్టమైన ఆధారాల ఆధారంగా ఉండగా,మరికొన్ని. యధాలా పంగా, సైద్ధాంతికంగా ఉంటున్నాయి. సాంఘిక క్రియాశీ లత మునుపటి పరిస్థితులకంటే, ఈ ధోరణి ఖనిజ వ్యాపార నమూనాలను తిరిగి రూపకల్పన చేసే అవకాశం ఉంది. అయితే అవకాశాలతో పాటు నష్టాలను కూడా కలిగిస్తుంది. గతంలో, క్రియాశీ లత ప్రభావం చాలా పరిమితం ఉద్యమాలు సంస్థలకు కొన్ని ప్రతికూల పరిస్థితులను సృష్టించ వచ్చు,స్థానిక వ్యతిరేకతను రేకకెత్తింప వచ్చు. కానీ చాలా పరిమితంగా ఉంటూ ఉండెడిది. ఇప్పుడు, ఇటీవలి రెండు మార్పుల కారణంగా ఖనిజాల త్రవ్వకంవాణిజ్య ఫలితాలను ప్రభావితం చేయ డానికి ఉద్యమ కారులకు ఎక్కువ అవకాశం కలిగి స్తున్నది. పెద్ద పెట్టుబడిదారుల విస్తరించే కట్టు బాట్లు,కార్యకర్తల ప్రచారాలకు తరచుగా సున్ని తంగా ఉంటాయి, మంచి ఇ ఎస్‌ జి పనితీరు ఉన్న సంస్థలకు మాత్రమే మద్దతు ఇస్తాయిబీ టెక్నాలజీ,కార్‌ కంపెనీల వంటి లోహాల పారిశ్రా మిక కొనుగోలుదారులలో పెరుగుతున్న సున్నిత త్వం,వారి సరఫరాదారుల పరపతికి కలిగే నష్టం. ఇప్పటికే, కొంతమంది గనుల తవ్వకందారులు తమ వ్యాపార నమూనాలను సర్దుబాటు చేయడం ప్రారంభించారు. కొందరు, ఉదాహరణకు, తక్కువ ప్రత్యక్ష గ్రీన్‌ హౌస్‌ వాయు ఉద్గారాలు లేదా నీటి వాడకంతో ఆస్తులను కొనాలని కోరుతూ, తమా దస్త్రాలను పున రూపకల్పన చేసే మార్గాలను చూస్తున్నారు.ఇతరులు తమ ఖనిజాలను ‘‘బాధ్యతా యుతంగా తవ్వినవి’’ అని ధృవీకరించడానికి లేదా తాము ఉపయోగించే లోహాలను రీసైకిల్‌ చేయ డంలో సహాయపడటానికి ఉమ్మడి పథకాలను రూపొందించడానికి తమ వినియోగదారులతో కలిసి పనిచేయడం ప్రారంభించారు.
విమర్శలను తగ్గించే మార్గం కాకుండా కస్టమర్లు, పెట్టుబడిదారులతో బలమైన సంబంధాలను ఏర్పరచుకునే మార్గంగా సాధారణ థ్రెడ్‌ ఇ ఎస్‌ జి పరిశ్రమ గురించి ఆలోచించడంలో ఇది ఒక పరిణామం, ఇంకా చాలా దూరం వెళ్ళాలి – కాని ఆ కార్యకర్తలు దుర్వినియోగానికి పాల్పడుతున్నంత కాలం నిర్మాణాన్ని కొనసాగించే అవకాశం ఉంది.
(డేనియల్‌ లిట్విన్‌, సంస్థలకు స్థిరత్వం, భౌగోళిక రాజకీయ ప్రమాదం గురించి సలహా ఇచ్చే క్రిటికల్‌ రిసోర్స్‌ స్థాపకుడు, మేనేజింగ్‌ భాగస్వామి. ‘ఎంపైర్స్‌ ఆఫ్‌ ప్రాఎస్ఫిట్‌: కామర్స్‌,కాంక్వెస్ట్‌, కార్పొరేట్‌ బాధ్యత’ రచయిత)-డేనియల్‌ లిట్విన్‌

కులాల విభజన ఉపాధి హామికే ప్రమాదం

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామిలో కులాలవారి సమాచారంపై కేంద్ర గ్రామీణా భివృద్ధిసంస్థ మార్చి 2, 2021న అడ్వయి జరీ ఫైల్‌ను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. ఉపాధి హామిలో దళితు లు,గిరిజనుల వివరాలు, వారి పనిదినాలను ప్రత్యేకంగా పేర్కొనాలని, ఆ ప్రాతిపదికపై 2021-22వేతనాల చెల్లింపు ఉంటుందని ఆ అడ్వయిజరీ ఫైల్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. 2006లో ఉపాధి హామిని ప్రారం భించిన నుంచి ఇప్పటి వరకు ఇలాంటి సర్క్యులర్‌లు ఏవీ కేంద్రం నుంచి రాష్ట్రాలకు రాలేదు. మొదటి సారిగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉపాధిలో ఈ కులాల విభజన చేయడాన్ని పైపైన పరిశీలిస్తే హిందుత్వ శక్తుల అసలు ఎజెండా అర్థం కాదు. ఎస్సీ, ఎస్టీలకు ప్రయోజనం కలగజేయడానికే ఈ వివరాల సేకరణ అనే ముసుగేసి అంతిమంగా ఉపాధి హామి చట్టం యొక్క మౌలిక లక్ష్యాలనే దెబ్బతి సేందుకు నరేంద్రమోడీ ప్రభుత్వం సిద్ధమైంది.

   దేశంలో అన్ని గ్రామాలకు విస్తరించిన అతి ముఖ్యమైనది ఉపాధి హామి చట్టం. 2004లో ప్రజా సంఘాల ఒత్తిడితో ‘’ఉపాధిహామి’’ పథకంగా కాకుండా చట్టంగా రూపుదిద్దుకున్నది. ఉపాధి హామిలో ఎలాంటి మౌలికమైన మార్పులు చేయా లన్నా పార్లమెంట్‌కే అధికారం ఉన్నది. అలాంటి ఈచట్టాన్ని మోడీ ప్రభుత్వం నీరుగార్చడానికి సర్క్యులర్స్‌,అడ్వయిజరీల పేరుతో దొడ్డిదారిన అనేక మార్పులు చేస్తున్నది. హిందూత్వ శక్తులు ఉపాధి హామిలో తెస్తున్న మార్పులు ఎంత ప్రమాదకరమో అర్థం కావాలంటే చట్టంలో ఉన్న మౌలిక అంశా లను గుర్తుచేసుకోవడం అవసరం. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి వయోజనుడికి కులాలు, మతాలు,ప్రాంతాలు అనేదానితో నిమిత్తం లేకుండా సంవత్సరంలో 100రోజులకు తక్కువ కాకుండా పని కల్పించాలి. వారం,పది రోజుల్లో పని చూపిం చకపోతే నిరుద్యోగభృతి ఇవ్వాలి. యంత్రాలు, కాంట్రాక్టర్లను ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుమ తించవద్దు. పనిప్రదేశాల్లో అన్ని సౌకర్యాలను కల్పిం చాలి. చివరకు పిల్లలకు చైల్డ్‌కేర్‌ సెంటర్స్‌ను కూడా పెట్టాలి. వారంవారం వేతనాలు చెల్లించాలి. సరళీ కృత ఆర్థిక విధానాలవల్ల వ్యవసాయంలో యాంత్రీ కరణ జరగడం, వృత్తులు దివాళాతీసి వ్యవసాయ కార్మికులుగా మారడం, చిన్న-సన్నకారు రైతులు వ్యవసాయ నష్టాలతో కూలీలుగా మారడంతో వ్యవ సాయ రంగంలో సంవత్సరంలో 70-80రోజు లకు మించి పనిదొరకని నేపథ్యంలో ఉపాధి హామి చట్టం వచ్చింది.
  కానీ,29కోట్ల 42లక్షల మంది ఉపాధి కూలీల్లో ప్రస్తుతం 14కోట్ల31లక్షల మందికే ప్రభు త్వాలు పని కల్పిస్తున్నాయి. కేరళ మినహా అన్ని రాష్ట్రాలు పనులు కల్పించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లో గత రెండు, మూడు సంవత్సరాలుగా లక్షల మంది పనికోసం దరఖాస్తులు పెట్టుకుంటే పనులు ఇవ్వకుండా అక్కడి ప్రభుత్వాలు తిరస్కరిస్తున్నాయి. కోర్టులు జోక్యం చేసకున్నా ఫలితం ఉండడం లేదు. ఇన్ని పరిమితుల్లో కూడా2020-21ఆర్థిక సంవ త్సరం లో 389.32 కోట్ల పనిదినాలు ఉపాధిలో దేశ వ్యాపితంగా లభించాయి. కరోనా విపత్తులో కూడా ఉపాధి కూలీలు ప్రాణాలు ఫణంగా పెట్టి పనులు చేసారు. వ్యవసాయంలోనూ కరోనాలో పనులు నిర్వహించడంవల్లనే అన్నిరంగాలు మైనస్‌లో      ఉన్నా ఒక్క వ్యవసాయ రంగం మాత్రమే 4శాతం అభివృద్దిని సాధించింది. ఇలాంటి ఉపాధి హామికి మరింత మెరుగైన చర్యలు తీసుకోవాలి. కానీ బీజేపీ తీసుకొచ్చిన ఈఅడ్వయిజరీ ఫైల్‌, మొత్తం ఉపాధి హామి లక్ష్యాలనే తలక్రిందులుగా చేస్తోంది.
  ఉపాధిలో ఎస్సీ,ఎస్టీల వివరాలను సేకరిం చేది సబ్‌ప్లాన్‌ ద్వారా నిధులిచ్చి మరింతగా ఈ తరగతులకు లబ్దిచేయడానికేనని బీజేపీ చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధం. గత సంవత్సరం కల్పిం చిన పని దినాల్లో ఎస్సీలు 19.86 శాతం, ఎస్టీలు 17.9శాతం పని దినాలు పొందారు.ఎస్సీ, ఎస్టీ లకు కలిపి 37.76శాతం...అంటే 140కోట్లకు పైగా పనిదినాలు లభించాయి. దేశంలో ఎస్సీ, ఎస్టీ జనాభా 24.4 శాతం ఉంటే, జనాభా కంటే 13శాతానికి పైగా అదనంగా ఉపాధి హామి పను లు చేస్తున్నారు. దళిత, గిరిజన ప్రజలకు గ్రామాల్లో ఉపాధి హామి ఒక జీవనాధారం. కానీ ఇప్పుడు సబ్‌ప్లాన్‌ నిధుల్లో జనాభా ప్రాతిపదికపై బడ్జెట్‌లో కేటాయింపులు చూపిస్తున్నారు. ఉపాధి హామికి సబ్‌ప్లాన్‌ నిధులు మరలించాలంటే జనాభా ప్రాతిపదికన 24.4శాతమే ఇస్తారు. మరి అదన మైన 13శాతం పని దినాలకు వేతనాలు ఎక్కడి నుండి వస్తాయి? దేశంలో ఈ స్థితి ఉంటే చాలా రాష్ట్రాల్లో ఉపాధి హామి పనులు 40 నుంచి 60 శాతం వరకు దళితులు, గిరిజనులే చేస్తున్నారు. పంజాబ్‌లో ఉపాధి పనులు 60శాతానికి పైగా ఒక్క దళితులే చేస్తున్నారు. అక్కడి జనాభా రేషియో లో నిధులు ఇస్తే పంజాబ్‌లో ఎస్సీ జనాభా 30 శాతం మాత్రమే. మిగిలిన 30శాతం ఎస్సీ వేత నాల పరిస్థితి ఏమిటి? ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి పని దినాల్లో 33.38శాతం, ఉత్తరప్రదేశ్‌లో 28.5శాతం, తెలంగాణలో 40శాతం ఎస్సీ, ఎస్టీలే ఉన్నారు. కనుక ఎస్సీ,ఎస్టీ ప్రయోజనాలకే ఈ వివ రాల సేకరణ అనేది పచ్చి బూటకం. ఈ పేరు చెప్పి ఉపాధి హామీలో బీజేపీ ప్రభుత్వ హెడన్‌ ఎజెండాను అమలుచేసే కుట్రలకు బీజేపీ తెగిం చింది. సబ్‌ప్లాన్‌ నిధులంటే రెగ్యులర్‌ పథకాల్లో దళిత, గిరిజనులు పొందే సౌకర్యాలకు అదనంగా వాటిని ఉపయోగించాలి. కానీ,ఏకకాలంలో      ఉపాధిని, సబ్‌ప్లాన్‌ను పాతర పెట్టడానికి నరేంద్ర మోడీ సిద్ధమయ్యారు.
  నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉపాధిహామిని బలహీన పర్చడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగి స్తున్నారు. వామపక్షాల మద్దతుతో ఏర్పడిన యుపీఏ ప్రభుత్వం యూనియన్‌ బడ్జెట్‌లో ఈపథకానికి 4శాతానికి తగ్గకుండా నిధులు కేటాయిస్తే, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర బడ్జెట్‌లో 2శాతానికి తగ్గించారు. ఒక్కదెబ్బతో ఉపాధి నిధు లకు అడ్డంగా కోతపెట్టారు. 2021-22 కేంద్ర బడ్జెట్‌లో గత ప్రభుత్వాలు కేటాయించినట్టు కనీసం 4శాతం కేటాయిస్తే 1,44,000 వేల కోట్లకు తక్కువ కాకుండా ఉపాధి హామికి బడ్జెట్‌ కేటాయింపులు జరగాలి. కానీ ఈ సంవత్సరం బీజేపీ ప్రభుత్వం 71వేల కోట్లే ఇచ్చింది. మోడీప్రధాని అయిన దగ్గర నుంచి ఈ తరహాలోనే కేటాయింపులు సగానికి తగ్గాయి. బడ్జెట్‌ తగ్గిపోవడంతోటే ఉపాధి పనుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సగం మందికే పనులు కల్పిస్తున్నాయి. ఉపాధిహామి నిధుల్లో 10 శాతానికి మించి మెటీరియల్‌కు ఖర్చు పెట్టకుండా గతంలో అమలైతే, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 40శాతానికి మెటీరియల్‌ను వినియోగిం చుకోవడానికి అవకాశం ఇచ్చారు. దీంతో యంత్రా లు,కాంట్రాక్టర్లను,మనుష్యులు చేయలేని పనుల పేరుతో ఎంపిక చేయడం జరుగుతుంది. గతంలో ప్రభుత్వాలు దళిత, గిరిజనుల స్వంత భూముల అభివృద్ధికి ఉపాధిహామి నిధులను ల్యాండ్‌ డెవలప్‌ మెంట్‌ పేరుతో వేలకోట్లు వినియోగించాయి. స్వంత భూమిలోపని చేసుకోవడం వలన భూములు సాగులోకి తెచ్చుకున్నారు. కానీ,నరేంద్రమోడీ ప్రభు త్వం ఉపాధి ద్వారా ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ను అటకెక్కించింది. ప్రజలకు ఉపయోగపడే వాటిని పక్కన పెట్టి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మంత్రుల పర్యటనలకు, పార్కులకు, హెలిప్యాడ్‌ల వినియో గానికి కూడా ఉపాధి హామి నిధులను ఉపయోగిం చే స్థితికి ప్రభుత్వాలు దిగజారాయి. చట్టం యొక్క స్పూర్తికే బీజేపీ తిలోదకాలిచ్చింది.
  కేరళతో పాటు, త్రిపురలో వామపక్ష ప్రభు త్వం ఉన్నప్పుడు ఉపాధిహామి పని దినాలు కల్పిం చడంలో దేశంలో అగ్రభాగాన ఉన్నాయి. త్రిపుర అయితే ప్రతి జాబ్‌కార్డుకు సగటున 89పని దినాలు కల్పించి కేంద్ర ప్రభుత్వ అవార్డును అందుకున్నది. దక్షిణాది రాష్ట్రాలు కూడా ఉపాధి హామిని ఐదారు సంవత్సరాలు బాగా ఉపయోగించుకున్నాయి. ఇప్పుడు వామపక్ష ప్రభుత్వాలున్న రాష్ట్రాలు తప్ప, కేంద్రంతో పాటు ప్రాంతీయ పార్టీలన్న తేడా లేకుం డా అని పార్టీల ప్రభుత్వాలూ ఉపాధి హామిని నిర్వీర్యం చేస్తున్నాయి. బీజేపీ పాలక రాష్ట్రాల్లో ప్రారంభం నుండి ఉపాధిహామిపై శ్రధ్ద లేదు. ఉత్తరప్రదేశ్‌లో అయితే ప్రాణాళికాబద్దంగా ఉపాధి హామీనే లేకుండా చేస్తున్నారు.20కోట్ల జనాభా     ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 2.21కోట్ల జాబ్‌కార్డులు, 3. 12కోట్ల ఉపాధి కూలీలను మాత్రమే నమోదు చేసారు. ఉపాధి హామిని బలహీనపరచి దళిత, గిరిజనుల ఆర్థిక మూలాలను దెబ్బతియడానికే బీజేపీ ఈ కుతంత్రాలు చేస్తున్నది. ఉపాధి హామి వల్ల వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలు, ప్రత్యేకించి దళిత,గిరిజనులు,ఓబీసీలకు కొన్ని పని దినాలు దొరికాయి. రెండు,మూడు నెలలు ఆహా రానికి ఇబ్బంది లేని పరిస్థితి ఏర్పడిరది. కొంత కొనుగోలు శక్తి పెరిగింది. ప్రత్యేకించి గ్రామ పెత్తందారులపై పదిఇరవై రూపాయలకు ఆధా రపడే పరిస్థితుల్లో మార్పు వచ్చింది.పేదల భూము లు కొంతమేరకైనా సాగులోకి తెచ్చుకున్నారు. గుడ్డిలో మెల్లగా అమలవుతున్న ఉపాధిచట్టం వల్ల కలిగే ఈ మాత్రం ప్రయోజనాలు కూడా గ్రామీణ ధనిక వర్గానికి కంటగింపుగా ఉన్నాయి. ఈ చట్టాన్ని అమలు జరపడం ఏ కోశానా ఇష్టంలేని పెత్తందా రులు, హిందుత్వవాదులు కలిసి ఉపాధి హామి పీక నులమడానికే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అడ్వయిజరీ ఫైల్‌లో ఉన్న అంశాలు అమలైతే అందరికంటే నష్టపోయేది దళితులు, గిరిజనులే. సబ్‌ప్లాన్‌ పేరు చెప్పి, జనాభా ప్రాతిపదికమీద నిధులిచ్చి దళిత-గిరిజనులు ఇప్పుడు పొందుతున్న పనులు సగానికి తగ్గిస్తారు. తద్వారా దళితులను పూర్వ స్థితికి, అంటే పెత్తందా రులకు ఊడిగం చేసే స్థితికి నెట్టేస్తారు. ఎస్సీ, ఎస్టీల పేరు చెప్పి ఓబీసీ, బీసీలకు కూడా ఉపాధి హామి పనులు లేకుండా చేస్తారు. దేశ వ్యాపితంగా 35నుంచి40శాతం పనులు ఓబీసీ, బీసీలు చేస్తున్నా రు. భవిష్యత్‌లో వారికీ అవకాశం లేకుండా ఈ చట్టాన్ని తలకిందులుగా మారుస్తారు. పని ప్రదే శాల్లో కుల వైశమ్యాలను పెంచుతారు. సమిష్టిగా చేసే ఉపాధి పనులు కుల ఘర్షణలుగా మారు తాయి. దీనిని పెత్తందారులు అవకాశంగా వినియో గించుకుంటారు. కులాల పేరుతో ఏర్పడే గ్రూపులకు గ్రామ పంచాయతీలు ఇష్టానుసారం పనులు ఇస్తాయి. దళిత, గిరిజనులకు కఠినమైన పనులు, తక్కువ వేతనాలు పడేటట్లుగా ఈ ఆధిపత్య వర్గాలు ప్రయత్నిస్తాయి. బీజేపీ తెచ్చిన ఈ అడ్వయిజరీ అమలైతే కులాల వారీగా వేతనాల్లో వ్యత్యాసా లొస్తాయి. పూర్వ కాలంలో, ప్రస్తుతం కూడా కొన్ని ప్రాంతాల్లో దళితులకు, ఇతర కులాల కంటే తక్కువ వేతనాలు ఇచ్చిన నేపథ్యం మన దేశంలో ఉన్నది. ఆస్థితి ఉపాధిలో పునరావృతం అవు తుంది. ఇప్పటి వరకు 50శాతం ఉపాధి పనులను మహిళలు చేస్తున్నారు. కులాల విభజన వచ్చిన తర్వాత మహిళలు చేయలేని పనులను ప్రవేశపెట్టి వీరికి పనులు సగానికి సగం తగ్గిస్తారు. అంతిమం గా ఈ అడ్వయిజరీ వల్ల అందరికంటే దళిత, గిరిజనులు, అన్ని కులాల్లో ఉన్న మహిళలకు తీవ్ర నష్టం కలుగుతుంది. రైతు చట్టాలు, విద్యుత్‌ బిల్లు, కార్మిక చట్టాల కోడ్‌ల కోవలోనే ఉపాధి హామిలో కుల విభజనను చూడాలి. దేశ వ్యాపితంగా రైతాం గం,కార్మికులు,వ్యవసాయకార్మికులు చేస్తున్న చట్టాల వ్యతిరేక పోరాటంలో ఉపాధి హామిలో బీజేపీ తెచ్చిన కులవిభజనను జోడిరచాలి. పోరాడి సాధిం చుకున్న ఉపాధి హామిని కాపాడుకోవడానికి మరో పోరాటమే మార్గం. కులాల విభజన రద్దు, 200 రోజుల పని, రోజు వేతనం రూ.600 కోసం దేశ వ్యాపిత సమరశీల సుదీర్ఘ పోరాటాలకు సిద్ధం కావాలి. రైతాంగ పోరాటాల స్ఫూర్తితో ఉపాధి హామి పోరాటం ప్రారంభం కావాలి.-బి.వెంకట్‌

పర్యావరణం..కరోనా

చిన్న పిల్లల్లో జ్ఞాపక శక్తి ఎక్కువ గా ఉంటుంది. ఏవిషయాన్నైనా ఇట్టే పట్టేసి జ్ఞాపకం ఉంచుకుంటారు. బాల్యంలో విద్యార్ధుల ప్రతిభను గమనించి ప్రోత్సహిం చేది తలిదండ్రులు. తరు వాత గురువులు, స్నేహితులు. ఈ విధమైన ప్రతిభ అనేక విష యాల్లో చూస్తుంటాం. వయసుకు మించి న శక్తి సామర్ధ్యాల్ని కనబరచటం. ఈ ప్రతిభ ను వెలికి తీయటం అనేది కత్తి మీదసామే! చదువు తో పాటు విద్యార్ధిలో నిగూఢమైవున్న కళను బయ టకు తీసుకురావటంలో ఉపాధ్యాయులు ముం దుండాలి. అలా చేయగలిగితే ఆవిద్యార్ధిలో పరి పూర్ణ పరిమళత్వం చూడ గల్గుతుంది. ఈనేపథ్యం లో ఉపాధ్యాయుని ప్రోత్సాహంతో విద్యార్ధి సాధించిన విజయమే ఈనెల బాల వినోదంలో చదవండి. (జన విజ్ఞాన వేదిక ఏప్రి యల్‌ 2021 లో ‘‘పర్యావరణం-కరోనా’’ అనే అంశంపై ఆంధ్రా-తెలంగాణాలలో నిర్వహించిన పోటీలలో పాఠశా లల విభాగంలో తృతీయ బహుమతి పొందిన వ్యాసం )

‘‘ ఆధునిక కాలంలో మన పర్యావరణం ఎక్కువ భాగం,కాలుష్యానికి గురవుతోంది. ప్రపంచ జనాభా పెరుగుతూ ఉండగా,మనుషుల అవసరాలు,వారి కోరికలు పెరుగుతున్నాయి. దీనివల్ల భూమి మీద ఉండే ప్రకృతి వనరులని, మనం ఎక్కువగా వాడటమే కాకుండా భూమిని,దానిమీద ఉండే జీవరాశులన్నీంటినీ కూడా పెద్ద ప్రమాదంలో పడేస్తున్నాము. కర్మాగారాలు బయటకు వదిలే వ్యర్ధపదార్ధాలు, ప్రమాదకరమైన రసాయనాలు,బొగ్గును కాల్చడం ద్వారా వచ్చే కార్బన్‌ డైయాక్సైడ్‌,సముద్రాలలోకి విడుదలయిన ప్లాస్టిక్‌,నేలని ఆక్రమించుకోవటానికి చెట్లు కొట్టి వేయడం ఇవన్నీ పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా వైరస్‌, మన జీవనవిధానాన్ని మార్చే సింది. ఈ ప్రభావంవల్ల కొంత మంచి మరియు కొంత చెడు జరుగుతోంది.. జరిగింది. అవి పెద్దవైన చిన్నవైన,చాలా సంవత్సరాల తర్వాత పర్యావరణంలో ఒక మార్పు కలుగుతుంది ’’
ఆధునిక సమాజం సాంకేతికంగాబాగా అభివృద్ధి చెందినప్పటికీ మానసికంగా మాత్రం ప్రకృతితో ఇతర జీవరాసులతో ఒకసంబంధాన్ని అభివృద్ధి చేసుకోలేక పోయింది. మనుషులు ఒకరికొకరు సంబంధం లేకుండా యాంత్రికంగా జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు కంటికి కనబడని ఈవైరస్‌ రోజురోజుకి వేలల్లో, లక్షల్లో మనుషులకు సోకుతోంది. ఇకపై మనందరం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ప్రకృతితో మమేకమైతేనే మనం బ్రతకగలమని అర్ధమైంది. ఈపరిణామంవల్ల మన సమాజంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి.
కరోనావ్యాధి ప్రపంచ వ్యాప్తంగా మను షులకి సోకటంవల్ల వ్యాపారాలు,చదువులు,ఉద్యో గాలు,దేశాలఆర్ధిక వ్యవస్థలు వీటన్నీటిపై ప్రతికూల ప్రభావం చూపించినా, పర్యావరణంపై మాత్రం అనుకూల ప్రభావమే చూపించింది. కరోనావల్ల అందరూ ఇంట్లోనే నిర్బంధమయ్యారు. ఈసమ యంలో ఎవరూ ప్రయాణాలు చేయక పోయేసరికి కార్లు, విమానాలు, రైళ్లు మరియు ఇతర రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. దీనివల్ల అవి విడుదలచేసే కార్బన్‌ డైయాక్సైడ్‌ ఎమిషన్లు, గాలిలో సుమారుగా17 శాతం తగ్గాయి. మనుషులు ఎవరూ బయటకు రాకపోవటంవల్ల సముద్రాలలో, నదు లలో ఉన్న నీళ్ళు ఇప్పుడు పరిశుభ్రంగా ఉన్నాయి. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్ధాలు మరియు రసాయనాలు, అవి మూతబడటంవల్ల సముద్రా లలోకి నదులలోకి వెళ్ళట్లేదు. ప్రస్తుతం మనభారత దేశానికి చెందిన గంగా నదిలో కూడా, నీళ్ళస్వచ్చత దాదాపుగా50శాతం పెరిగింది. చాలాతక్కువగా కనిపించే పక్షులు,అడవి జంతువులు కూడా బయట ఉన్న వాహనాల రద్దీ,ధ్వనికాలుష్యం తగ్గటంవల్ల అవిరోడ్ల మీద సంచరిస్తున్నాయి. చాలా సంవత్స రాల తర్వాత వాటికి స్వేచ్చ మళ్ళీ వచ్చింది. ఈ విధంగా కరోనావల్ల కొన్ని పర్యావరణ లాభాలు ఉన్నాయి. కరోనా పర్యావరణంపై చూపించిన ప్రభావాలలో చాలానష్టాలు కూడా ఉన్నాయి. కరోనా వచ్చిన తర్వాత,అందరూ ప్రాముఖ్యత నిచ్చింది మాస్కులకే. మాస్కు ధరిస్తే మనల్ని మనము కాపాడుకోవచ్చు అనేది తెలిసిన విషయమే. కానీ ఒక్కసారే వాడిపడేసే ఈమాస్కులవల్ల చెత్త పెరిగి పోతోంది. అవి కూడా ప్లాస్టిక్‌ తోనే చేయబడ్డాయి కాబట్టి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ప్లాస్టిక్‌ చెత్త సముద్రాలకు చేరి వాటిలో ఉన్నటువంటి జల చరాలకు హాని చేస్తాయి. చాలామంది మామూ లు చెత్తలాగా వీటిని కూడా ఎలా కావాలంటే అలా రోడ్ల మీద పడేస్తున్నారు. ఈమాస్కుల్లో వైరస్‌ ఉండటంవల్ల జంతువులకు తర్వాత మనుషులకు కూడా కరోనా వీటి నుంచి సోకుతుంది. ఆన్లైన్‌ షాపింగ్‌ కూడా కరోనా కారణంగా బాగా పెరిగిం ది. షాపులకి వెళ్లలేని మనము,ప్రతిదానికి ఆన్లైన్‌ ఆర్డర్లు చేస్తున్నాము. దీనివల్ల కూడా చాలా ప్లాస్టిక్‌ చెత్త మిగులుతుంది. ఈసమయంలో మాస్కులు లాగానే చేతితొడుగులు (గ్లవ్స్‌) మరియు ఆసుప త్రులనుంచి వచ్చే వ్యర్ధాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇవికూడా మాస్కుల లాగా చెత్త అయ్యి ఇతర జీవులకు హాని కల్గిస్తున్నాయి.
ఇప్పుడు కరోనా కేసులు మళ్లీ పెరగటం వలన,చాలామంది మరణిస్తున్నారు. రోజు రోజుకి మరణాల రేటు పెరుగుతోంది. అంతకుముందు రోజుకు ఐదు-ఆరు శవాలని కాల్చి వేయాల్సి వచ్చేది,కానీ ఇప్పుడు రోజుకి వేల శవాలను కాల్చే యాల్సి వస్తోంది. వీటిని కాల్చటంవల్ల కూడా పర్యావరణం కలుషితం అవుతుంది. ఎందుకంటే శవాల్ని కాల్చటంవల్ల వచ్చే పొగంతాగాలిలో కలు స్తుంది. కరోనాబయటివాళ్లకు సోక కుండా ఉండ టానికి శవాలని ప్లాస్టిక్‌ కంటైనర్లలో పెట్టినప్పుడు, శవాలతో పాటు ప్లాస్టిక్‌ కూడా కాలుతుంది. ఇందు వల్ల కూడా గాలిలోకి హానికరమైన విషవాయు వులు విడుదలవుతాయి. కరోనా కేసులు పెరగటం వల్ల కృత్రిమ ఆక్సిజన్‌ వాడకం పెరిగింది. ఆక్సిజన్‌ సరిపోక ఆసుపత్రులలో చాలామంది చనిపోతు న్నారు కూడా. ఒకఆసుపత్రిలో ఆక్సిజన్‌ లీక్‌ అవ్వ టంవల్ల 20మంది మృతి చెందారు. కృత్రిమ ఆక్సిజన్‌ రోగులకు అందటానికి దేశంలో రోజుకి చాలా ఆక్సిజన్‌ తయారు చేయాల్సి వస్తుంది. ఇది కూడా సరిపోక ఇతర దేశాలనుంచి విమానాలలో తీసుకురావాల్సి వస్తోంది. ముందే మనం కరోనా కేసులు ఇలా పెరగనివ్వకుండా ఉంటే, ఈపరిస్థితి వచ్చేది కాదు. ఈవిధంగా కరోనా పర్యావరణంపై చెడు ప్రభావాన్ని చూపించింది.
కరోనా వల్ల పర్యావరణానికి కల్గిన లాభాలు,నష్టాలు చూస్తుంటే అది మనుషులకు ఒక మంచి గుణపాఠం నేర్పింది. అయినప్పటికీ పర్యా వరణాన్ని ఇంకా కలుషితం చేస్తున్నాము. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం పర్యా వరణాన్ని కాపాడితే, అదే మనల్ని కాపాడుతుంది.-జతిన్‌ జూలకంటి

గమ్యం తెలియని బాలల ప్రయాణం

బంగారు భవిష్యత్తుకు పునాదిపడేది బాల్య దశ. ఇలాంటి కీలకదశలో బాలలు చదువు,ఆటలకు దూరమై శ్రామికులుగా మారడాన్ని బాలకార్మికులంటారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో బాలకార్మిక వ్యవస్థ ఒకటి. బాల్యాన్ని ఆనందంగా అనుభవించడం ప్రతిబిడ్డ జన్మహక్కు. అయితే కుటుంబాల సామాజిక,ఆర్థికపరిస్థితులు కారణంగా అత్యధికబాలలు వ్యవసాయ రంగం లో…మిగతావారు ఇళ్లలో,హౌటళ్లలో,కర్మాగారాల్లో,దుకాణాల్లో పనిచేస్తున్నారు. వీరంతా కూడా అధిక పనిగంటలు తక్కువ వేతనంతో శ్రమదోపిడీకి గురవడంతోపాటు అక్రమ రవాణా, వేశ్యావత్తి, డ్రగ్‌ మాఫియాకి బలవుతు న్నారు. ఫలితంగా వారి భవిష్యత్‌ అంధకారంగా మారింది. ..`

కరోనాతో బాలకార్మికుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చాటు తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా బాల కార్మిక వ్యవ స్థకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన తీసుకురా వడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ)2002లో ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవానికి శ్రీకారం చుట్టింది. ఈ సంవత్సరం ‘’బాల కార్మిక వ్యవస్థ ముగింపునకు ఇప్పుడే చర్యలు’’ అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. ఈదినోత్సవం ప్రధానంగా ఐరాస 2021 సంవ త్సరాన్ని ‘’అంతర్జాతీయ బాల కార్మిక నిర్మూలన సంవత్సరం’’గా ప్రకటించిన నేపథ్యంలో తీసుకో వాల్సిన చర్యలపై దృష్టి సారించనుంది. గతేడాది బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అంతర్జాతీయ కార్మిక సంస్థ సమావేశంలో ప్రపంచదేశాలు సార్వ త్రిక ఆమోదం తెలిపాయి. కరోనా విసిరిన సవాళ్ళ అనంతరం ఇది మొదటి ప్రపంచ దినం. ఇప్పటికే 2025 నాటికి బాలకార్మిక వ్యవస్థకు ముగింపు పలకాలని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలతో (లక్ష్యం8.7) నిర్దేశించుకోవడం జరిగింది. ఈ చర్యల్లో భాగంగా అంతర్జాతీయ కార్మిక సంస్థ బాల కార్మికుల లెక్కిం పునకు సంబంధించిన నూతన అంచనాలు, పోకడ లను విడుదల చేయనుంది. ఇందులో అందరిని భాగస్వామ్యం చేయడానికి వారంపాటు చర్యలు చేపట్టడం జరుగుతుంది. అంతేకాకుండా గత ఏప్రిల్‌ మాసంలో అయాప్రాంతాలు, దేశాలు, సంస్థ వాటాదారులు, వ్యక్తులు ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేసిన ‘’2021కార్యాచరణ ప్రతిజ్ఞల’’ పురోగతిని ప్రదర్శిం చడం జరుగుతుంది.ఈఏడాది పొడవునా తీసు కున్న చర్యలు, తదుపరి 2022లో బాల కార్మికులపై సౌత్‌ ఆఫ్రికాలో జరిగే అంతర్జాతీయ సమావేశానికి మైలురాయిగా నిలువనున్నాయి.
కరోనాతో పెరిగిన బాలకార్మికులు…
అనేక రూపాల్లో కొనసాగుతున్న బాలకార్మిక వ్యవస్థకు అసలు కారణం పేదరికమే. కుటుంబ ఆర్థిక పరిస్థితికి,బాలల జీవనానికి అవినాభావ సంబంధం ఉంది. దీంతో వారు చదువుకోవాల్సిన వయసులో పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు నిరక్షరా స్యత,ఉపాధి నిమిత్తం కుటుంబ వలసలు,జనాభా పెరుగుదల,ప్రపంచీకరణ తదితరకారణాలు కూడా బాలకార్మిక వ్యవస్థకు ఆజ్యం పోస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా గత సంవత్సరన్నర కాలంగా కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభంతో కుటుంబ ఆదా యం పడిపోయి, సామాజిక జీవనం దెబ్బతిన్నది. దీని ప్రభావంపిల్లలపై పడిరది. దీంతో వారు విద్య,వైద్యం వంటి ప్రాథమిక సౌకర్యాలకు దూరమ య్యారు. బడులు మూతపడడం, ఆన్‌లైన్‌ చదువు లతో మెజారిటిపిల్లలు విద్యను పొందలేక పోయా రు. ఫలితంగా బాల్య వివాహాలు,బాలకార్మిక వ్యవస్థలాంటి దుర్లక్షణాలు పెరిగాయని అనేక అధ్య యనాలు చాటుతున్నాయి. గతేడాది ‘’కోవిడ్‌-19, బాలకార్మిక వ్యవస్థ’’ పై అంతర్జాతీయ కార్మిక సంస్థ, యూనిసెఫ్‌ అధ్యయనం బాలకార్మిక వ్యవస్థ పై గత ఇరవై సంవత్సరాల కాలంలో సాధించిన పురోగతి వెనక్కి నెట్టబడిరదని తెలిపింది. ఈ సంక్షో భం కన్నా ముందుతో పోలిస్తే ఈ ఏడాది తీవ్ర పేదరికంలోకి జారుకున్న వారి సంఖ్య 4నుంచి 6 కోట్లు పెరిగిందని,ఒక శాతం పేదరికం పెరి గితే 0.7శాతం బాలకార్మికులు పెరుగుతారని పేర్కొన్నది. అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనాల ప్రకారం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 15.2కోట్ల మంది బాల కార్మికులు ఉండగా…అందులో 7.2 పిల్లలు ప్రమాదకరమైన పనుల్లో నిమగమయ్యారు. అధికంగా బాలకార్మికులున్నా భారతదేశంలో కరోనా అనంతరం వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కైలాష్‌ సత్యార్థి చిల్డ్రన్స్‌ ఫౌండే షన్‌ సర్వే పేర్కొన్నది. పిల్లల అక్రమరవాణా పెరిగే అవకాశం ఉందని, కార్మిక చట్టాలు దుర్వినియోగం అయ్యేప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చర్యలు…
దేశ సంపద అయిన బాలలు బాలకార్మిక వ్యవస్థలో మగ్గిపోతే, దేశ భవిష్యత్తు అంధకారమవు తుంది. సంఘ విద్రోహ కార్యకలాపాలు పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి బాలలకు తగిన విద్యా భ్యాసం,శిక్షణ అందించి విలువైన మానవ వనరులు గా తీర్చిదిద్దాలి. కార్మికులుగా పనిచేస్తున్న బాలల పూర్తివివరాలు సేకరించాలి. ఇందులో ప్రభుత్వంతో పాటు పౌర సమాజం కూడా భాగస్వామ్యం కా వాలి. బాలకార్మిక వ్యవస్థ నిషేధ చట్టం, విద్యా హక్కు చట్టం సక్రమంగా అమలయ్యేలా చూడాలి. బడిబయట ఉన్న విద్యార్థులపై సమగ్ర సర్వే నిర్వహించి పాఠశాలలో నమోదు చేయాలి. వ్యవ సాయ సంస్కరణలు,ఉపాధికల్పన పథకాలు, సాం కతిక నైపుణ్యాలు పెంపొందించటం,అవ్యవస్థీ కత రంగాలను ప్రోత్సహించటం, సహకారసంఘాల ఏర్పాటు,సాంఘిక భద్రతా పథకాల రూపకల్ప న వంటి చర్యలు పరోక్షంగా బాలకార్మిక వ్యవస్థ నిర్మూ లనకు దోహదపడతాయి. ప్రభుత్వాలు వీటిపై ప్రత్యే కంగా దృష్టిసారించాలి. అందుకు దీర్ఘకాల కషి, బహుముఖ వ్యూహం అవసరం. భారతదేశంలో కరోనా మహమ్మారితో చాలా మంది బాలలు అనాధలయ్యారు. వీరి సంరక్షణకై క్షేత్రస్థాయి చర్యలు చేపట్టాలి. విద్యఅంతరాలను తొలగించడానికి డిజి టల్‌ సాధనాలు అందించాలి. నేటి కోవిడ్‌ విపత్కర పరిస్థితులో బాలల హక్కులు సంక్షోభాన్ని ఎదుర్కో వడానికి ప్రపంచదేశాలు సమన్వయం కోసం యూనిసెఫ్‌ ఎజెండా రూపొందించింది. ఇందులో బాలల ఆరోగ్యం కోసం మంచి పౌష్టికాహారం అందివ్వాలని, తాగునీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చింది. పిల్లల విద్యను కొనసాగిస్తూ,వారి సంరక్షణ కోసం కుటుం బాలకు సామాజిక మద్దతు ఇవ్వాలి. బాలలను హింస,దోపిడి,దుర్వినియోగం నుంచి రక్షించాలి. అంతర్యుద్ధాలు,హింస సంఘటనలతో వలస వచ్చిన,శరణార్థులుపిల్లలను రక్షించాలి. ఈ చర్యలు బాల కార్మిక వ్యవస్థకు చమరగీతం పాడి, వారి వికాసానికి దోహద పడతాయి.– డాక్టర్‌ పెంట కృష్ణ