పర్యావరణం..కరోనా

చిన్న పిల్లల్లో జ్ఞాపక శక్తి ఎక్కువ గా ఉంటుంది. ఏవిషయాన్నైనా ఇట్టే పట్టేసి జ్ఞాపకం ఉంచుకుంటారు. బాల్యంలో విద్యార్ధుల ప్రతిభను గమనించి ప్రోత్సహిం చేది తలిదండ్రులు. తరు వాత గురువులు, స్నేహితులు. ఈ విధమైన ప్రతిభ అనేక విష యాల్లో చూస్తుంటాం. వయసుకు మించి న శక్తి సామర్ధ్యాల్ని కనబరచటం. ఈ ప్రతిభ ను వెలికి తీయటం అనేది కత్తి మీదసామే! చదువు తో పాటు విద్యార్ధిలో నిగూఢమైవున్న కళను బయ టకు తీసుకురావటంలో ఉపాధ్యాయులు ముం దుండాలి. అలా చేయగలిగితే ఆవిద్యార్ధిలో పరి పూర్ణ పరిమళత్వం చూడ గల్గుతుంది. ఈనేపథ్యం లో ఉపాధ్యాయుని ప్రోత్సాహంతో విద్యార్ధి సాధించిన విజయమే ఈనెల బాల వినోదంలో చదవండి. (జన విజ్ఞాన వేదిక ఏప్రి యల్‌ 2021 లో ‘‘పర్యావరణం-కరోనా’’ అనే అంశంపై ఆంధ్రా-తెలంగాణాలలో నిర్వహించిన పోటీలలో పాఠశా లల విభాగంలో తృతీయ బహుమతి పొందిన వ్యాసం )

‘‘ ఆధునిక కాలంలో మన పర్యావరణం ఎక్కువ భాగం,కాలుష్యానికి గురవుతోంది. ప్రపంచ జనాభా పెరుగుతూ ఉండగా,మనుషుల అవసరాలు,వారి కోరికలు పెరుగుతున్నాయి. దీనివల్ల భూమి మీద ఉండే ప్రకృతి వనరులని, మనం ఎక్కువగా వాడటమే కాకుండా భూమిని,దానిమీద ఉండే జీవరాశులన్నీంటినీ కూడా పెద్ద ప్రమాదంలో పడేస్తున్నాము. కర్మాగారాలు బయటకు వదిలే వ్యర్ధపదార్ధాలు, ప్రమాదకరమైన రసాయనాలు,బొగ్గును కాల్చడం ద్వారా వచ్చే కార్బన్‌ డైయాక్సైడ్‌,సముద్రాలలోకి విడుదలయిన ప్లాస్టిక్‌,నేలని ఆక్రమించుకోవటానికి చెట్లు కొట్టి వేయడం ఇవన్నీ పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా వైరస్‌, మన జీవనవిధానాన్ని మార్చే సింది. ఈ ప్రభావంవల్ల కొంత మంచి మరియు కొంత చెడు జరుగుతోంది.. జరిగింది. అవి పెద్దవైన చిన్నవైన,చాలా సంవత్సరాల తర్వాత పర్యావరణంలో ఒక మార్పు కలుగుతుంది ’’
ఆధునిక సమాజం సాంకేతికంగాబాగా అభివృద్ధి చెందినప్పటికీ మానసికంగా మాత్రం ప్రకృతితో ఇతర జీవరాసులతో ఒకసంబంధాన్ని అభివృద్ధి చేసుకోలేక పోయింది. మనుషులు ఒకరికొకరు సంబంధం లేకుండా యాంత్రికంగా జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు కంటికి కనబడని ఈవైరస్‌ రోజురోజుకి వేలల్లో, లక్షల్లో మనుషులకు సోకుతోంది. ఇకపై మనందరం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ప్రకృతితో మమేకమైతేనే మనం బ్రతకగలమని అర్ధమైంది. ఈపరిణామంవల్ల మన సమాజంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి.
కరోనావ్యాధి ప్రపంచ వ్యాప్తంగా మను షులకి సోకటంవల్ల వ్యాపారాలు,చదువులు,ఉద్యో గాలు,దేశాలఆర్ధిక వ్యవస్థలు వీటన్నీటిపై ప్రతికూల ప్రభావం చూపించినా, పర్యావరణంపై మాత్రం అనుకూల ప్రభావమే చూపించింది. కరోనావల్ల అందరూ ఇంట్లోనే నిర్బంధమయ్యారు. ఈసమ యంలో ఎవరూ ప్రయాణాలు చేయక పోయేసరికి కార్లు, విమానాలు, రైళ్లు మరియు ఇతర రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. దీనివల్ల అవి విడుదలచేసే కార్బన్‌ డైయాక్సైడ్‌ ఎమిషన్లు, గాలిలో సుమారుగా17 శాతం తగ్గాయి. మనుషులు ఎవరూ బయటకు రాకపోవటంవల్ల సముద్రాలలో, నదు లలో ఉన్న నీళ్ళు ఇప్పుడు పరిశుభ్రంగా ఉన్నాయి. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్ధాలు మరియు రసాయనాలు, అవి మూతబడటంవల్ల సముద్రా లలోకి నదులలోకి వెళ్ళట్లేదు. ప్రస్తుతం మనభారత దేశానికి చెందిన గంగా నదిలో కూడా, నీళ్ళస్వచ్చత దాదాపుగా50శాతం పెరిగింది. చాలాతక్కువగా కనిపించే పక్షులు,అడవి జంతువులు కూడా బయట ఉన్న వాహనాల రద్దీ,ధ్వనికాలుష్యం తగ్గటంవల్ల అవిరోడ్ల మీద సంచరిస్తున్నాయి. చాలా సంవత్స రాల తర్వాత వాటికి స్వేచ్చ మళ్ళీ వచ్చింది. ఈ విధంగా కరోనావల్ల కొన్ని పర్యావరణ లాభాలు ఉన్నాయి. కరోనా పర్యావరణంపై చూపించిన ప్రభావాలలో చాలానష్టాలు కూడా ఉన్నాయి. కరోనా వచ్చిన తర్వాత,అందరూ ప్రాముఖ్యత నిచ్చింది మాస్కులకే. మాస్కు ధరిస్తే మనల్ని మనము కాపాడుకోవచ్చు అనేది తెలిసిన విషయమే. కానీ ఒక్కసారే వాడిపడేసే ఈమాస్కులవల్ల చెత్త పెరిగి పోతోంది. అవి కూడా ప్లాస్టిక్‌ తోనే చేయబడ్డాయి కాబట్టి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ప్లాస్టిక్‌ చెత్త సముద్రాలకు చేరి వాటిలో ఉన్నటువంటి జల చరాలకు హాని చేస్తాయి. చాలామంది మామూ లు చెత్తలాగా వీటిని కూడా ఎలా కావాలంటే అలా రోడ్ల మీద పడేస్తున్నారు. ఈమాస్కుల్లో వైరస్‌ ఉండటంవల్ల జంతువులకు తర్వాత మనుషులకు కూడా కరోనా వీటి నుంచి సోకుతుంది. ఆన్లైన్‌ షాపింగ్‌ కూడా కరోనా కారణంగా బాగా పెరిగిం ది. షాపులకి వెళ్లలేని మనము,ప్రతిదానికి ఆన్లైన్‌ ఆర్డర్లు చేస్తున్నాము. దీనివల్ల కూడా చాలా ప్లాస్టిక్‌ చెత్త మిగులుతుంది. ఈసమయంలో మాస్కులు లాగానే చేతితొడుగులు (గ్లవ్స్‌) మరియు ఆసుప త్రులనుంచి వచ్చే వ్యర్ధాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇవికూడా మాస్కుల లాగా చెత్త అయ్యి ఇతర జీవులకు హాని కల్గిస్తున్నాయి.
ఇప్పుడు కరోనా కేసులు మళ్లీ పెరగటం వలన,చాలామంది మరణిస్తున్నారు. రోజు రోజుకి మరణాల రేటు పెరుగుతోంది. అంతకుముందు రోజుకు ఐదు-ఆరు శవాలని కాల్చి వేయాల్సి వచ్చేది,కానీ ఇప్పుడు రోజుకి వేల శవాలను కాల్చే యాల్సి వస్తోంది. వీటిని కాల్చటంవల్ల కూడా పర్యావరణం కలుషితం అవుతుంది. ఎందుకంటే శవాల్ని కాల్చటంవల్ల వచ్చే పొగంతాగాలిలో కలు స్తుంది. కరోనాబయటివాళ్లకు సోక కుండా ఉండ టానికి శవాలని ప్లాస్టిక్‌ కంటైనర్లలో పెట్టినప్పుడు, శవాలతో పాటు ప్లాస్టిక్‌ కూడా కాలుతుంది. ఇందు వల్ల కూడా గాలిలోకి హానికరమైన విషవాయు వులు విడుదలవుతాయి. కరోనా కేసులు పెరగటం వల్ల కృత్రిమ ఆక్సిజన్‌ వాడకం పెరిగింది. ఆక్సిజన్‌ సరిపోక ఆసుపత్రులలో చాలామంది చనిపోతు న్నారు కూడా. ఒకఆసుపత్రిలో ఆక్సిజన్‌ లీక్‌ అవ్వ టంవల్ల 20మంది మృతి చెందారు. కృత్రిమ ఆక్సిజన్‌ రోగులకు అందటానికి దేశంలో రోజుకి చాలా ఆక్సిజన్‌ తయారు చేయాల్సి వస్తుంది. ఇది కూడా సరిపోక ఇతర దేశాలనుంచి విమానాలలో తీసుకురావాల్సి వస్తోంది. ముందే మనం కరోనా కేసులు ఇలా పెరగనివ్వకుండా ఉంటే, ఈపరిస్థితి వచ్చేది కాదు. ఈవిధంగా కరోనా పర్యావరణంపై చెడు ప్రభావాన్ని చూపించింది.
కరోనా వల్ల పర్యావరణానికి కల్గిన లాభాలు,నష్టాలు చూస్తుంటే అది మనుషులకు ఒక మంచి గుణపాఠం నేర్పింది. అయినప్పటికీ పర్యా వరణాన్ని ఇంకా కలుషితం చేస్తున్నాము. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం పర్యా వరణాన్ని కాపాడితే, అదే మనల్ని కాపాడుతుంది.-జతిన్‌ జూలకంటి

సుప్రీం పీఠంపై తెలుగు తేజం

‘‘ తెలుగువాంతా గర్విస్తున్న సందర్బమిది. ఐదున్నర దశాబ్దాల తర్వాత తెలుగు బిడ్డ దేశంలోనే అత్యున్నతమైన పీఠాన్ని ఆథిరోహిస్తున్నారు.జస్టీస్‌ ఎస్వీ రమణ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవడంతో సామాన్యులంతా తమ ఇంట్లోని వ్యక్తికే ఈ గౌరవం దక్కినంతగా ఆనందిస్తున్నారు. అతి సామాన్య కుటుంబంలో పుట్టి స్వయకృషితో ఎదిగిన ఆయన ప్రస్థానం అందరకీ ఆదర్శం. చిన్నతనంలో కాలినడకన బడికి వెళ్లి చదువుకున్న వ్యక్తి…ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూనే తన లక్ష్యం దిశగా సాగిపోయిన తీరు స్పూర్తిదాయకం. తెలుగు రాష్ట్రాలు పొంగిపోతున్న వేళ ఆయన సొంతూళ్ళో సంబరాలు మిన్నంటుతున్నాయి. .. కష్టాలకు ఎదురీది అత్యున్నత న్యాయస్థాన పీఠానికి జస్టిస్‌ ఎస్వీ రమణ..ఎదిగారు.’’


కృష్ణా జిల్లాలో పుట్టి పెరిగారు! గుంటూరులో చదువుకున్నారు! న్యాయవాదిగా ఎదిగారు. న్యాయమూర్తిగా ప్రస్థానించారు. ఇప్పుడు…భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనే… జస్టిస్‌ నూతల పాటి వెంకట రమణ! అందరికీ… జస్టిస్‌ ఎన్వీ రమణగా సుపరిచితుడు! సాధారణ దిగువ మధ్య తరగతి రైతు కుటుంబానికి చెందిన రమణ… ఇప్పుడు భారత చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణగా మారారు. ఆయన 1957 ఆగస్టు 27న జన్మించారు. తల్లిదండ్రులు… గణపతిరావు, సరోజనీ దేవి. స్వగ్రామం..కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం. ఆయనకు ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. వ్యవసాయం కలిసి రాకపోవడంతో గణపతిరావు కుటుంబం ఆర్థికంగా పలు ఇబ్బందులు పడిరది. స్వగ్రామంలో ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు. బాల్యంలో కష్టాలు ఎదురైనప్పటికీ రమణ పట్టుదలతో కష్టపడి చదువుకున్నారు. కంచికచర్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. గుంటూరు జిల్లా ధరణికోట (అమరావతి) ఆర్‌వీవీఎన్‌ కళాశాలలో బీఎస్సీ చదివారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి 1982లో న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు.
యువరానర్‌ అంటూ…
రమణ 1983 ఫిబ్రవరి 10న రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. కర్నూలు మాజీ ఎంపీ ఏరాసు అయ్యపురెడ్డి వద్ద తొలినాళ్లలో జూనియర్‌గా పని చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి హైకోర్టులో ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు ‘పిల్‌’ రమణగా పేరు తెచ్చుకోవడం విశేషం. ప్రజా సమస్యలపై ప్రజాప్రయోజన వ్యాజ్యాల ద్వారా అనేక అంశాలపై న్యాయ పోరాటం చేశారు. సుప్రీంకోర్టులోనూ వాదనలు వినిపించారు. కేంద్ర, రాష్ట్ర పరిపాలనా ట్రైబ్యునల్స్‌లోనూ వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండిరగ్‌ కౌన్సిల్‌గా పని చేశారు. పలు ప్రభుత్వ సంస్థలకు ప్యానల్‌ అడ్వొకేట్‌గా వ్యవహరించారు. రాజ్యాంగం, క్రిమినల్‌, సర్వీస్‌, ఎన్నికలు, అంతర్రాష్ట్ర నదీ జలాల సంబంధిత కేసులను వాదించారు. రమణ ఆంధ్రప్రదేశ్‌ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ హోదాలో సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించారు.
న్యాయమూర్తిగా…
న్యాయవాదిగా మంచి పేరు తెచ్చుకున్న జస్టిస్‌ రమణ తొలుత ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. 2000 జూన్‌ 27న రాష్ట్ర హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితు లయ్యారు. సుమారు 13 ఏళ్లపాటు హైకోర్టు జడ్జిగా జస్టిస్‌ రమణ వేల కేసుల్లో తీర్పులు ఇచ్చారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకు ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక సీజేగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీ జుడీషి యల్‌ అకాడమీ చైర్మన్‌గా, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా పనిచేశారు.
ఏపీ నుంచి ఢల్లీికి…
జస్టిస్‌ రమణ 2013 సెప్టెంబరు 2న ఢల్లీి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితు లయ్యారు. ఆ తదుపరి ఏడాదే సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా సుప్రీం న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు… భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సౌమ్యుడిగా పేరుపొందిన జస్టిస్‌ రమణ చీఫ్‌ జస్టిస్‌గా నియమితులయ్యే క్రమంలో అనేక అడ్డంకులను ఎదుర్కొన్నారు. వాటన్నింటినీ అధిగమించి అత్యున్నత స్థానాన్ని అధిష్టిస్తున్నారు.
దేశ విదేశాలకు…
జస్టిస్‌ రమణ మహిళా సాధికారత, పర్యావరణం, జుడీషియల్‌ యాక్టివిజమ్‌, జెండర్‌ జస్టిస్‌, సబ్‌-ఆర్డినేట్‌ కోర్టుల పాత్ర, మానవ హక్కులు, దివ్యాంగుల హక్కులు తదితర అంశాలపై జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొని పరిశోధనా పత్రాలు సమర్పించారు. బ్రిటన్‌ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఇంగ్లండ్‌ వెళ్లి, అక్కడి న్యాయవ్యవస్థ తీరును పరిశీలించారు. అమెరికాలో న్యాయపాలనపై అధ్యయనం చేశారు. పేద ప్రజలకు న్యాయం అందుబాటులోకి రావాలని, వారికి ఉచిత న్యాయసేవలు లభించాలని ఆయన కోరుకుంటారు. న్యాయసేవల అథారిటీ చైర్మన్‌గా జస్టిస్‌ రమణ వేలాది మంది పేద ప్రజల కేసులు ఉచితంగా పరిష్కారం అయ్యేలా చూశారు. దేశంలో కోర్టులను ఆధునికీక రించాలని, మౌలిక సదుపాయాలను పెంచాలని, ఇందుకోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఇద్దరూ.. ఇద్దరే..! ఒకరు న్యాయశాస్త్రాన్ని ఔపోసన పెడితే, ఇంకొకరు వైద్యశాస్త్రం లోతులను తరచిచూసినవారు. వారే జస్టిస్‌ ఎన్వీ రమణ, డాక్టర్‌ యార్లగడ్డ నాయుడమ్మ. వీరిద్దరూ వియ్యంకులు. అవిభక్త కవలల శస్త్ర చికిత్సలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డాక్టర్‌ నాయుడమ్మ పేరు ప్రఖ్యాతలు పొందారు. ఆయన కుమారుడు రితేశ్‌తో జస్టిస్‌ రమణ కుమార్తె భువనకు వివాహం జరిగింది.
లాయర్‌ కావాలనుకోలేదు…
న్యాయ వ్యవస్థలో అత్యున్నత పీఠానికి ఎదిగిన జస్టిస్‌ రమణ నిజానికి న్యాయవాది కావాలని భావించలేదు. యాదృచ్ఛికంగానే ఆయన ఈ వృత్తిని ఎంచుకున్నారు. ఆయన కుటుంబం లోనూ ఎవరూ న్యాయవాదులు లేరు. విద్యార్థి దశలో చురుకుగా వ్యవహరిస్తూ, సామాజిక అభ్యుదయం కోసం పలు పోరాటాలు చేశారు. అనేక విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో విద్యార్థులతో నిరసన ప్రదర్శనలు నిర్వ హించారు. ఒక దశలో తాను అరెస్టు నుంచి తప్పించుకున్నట్లు జస్టిస్‌ ఎన్వీ రమణ ఒక సందర్భంలో చెప్పారు.
సుప్రీంకోర్టుకు కొత్త సారథి- తీవ్ర సవాళ్లు
సీనియర్‌ పాత్రీకేయులు,సాహితీవేత్త ప్రముఖ రచయిత తెలకపల్లిరవిగారి తెలియసిన మరికొన్ని వివరాలు ఇలాఉన్నాయి. సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ నూతల పాటి వెంకట రమణ ప్రమాణ స్వీకారం చేశారు. 2013లో సుప్రీం కోర్టు న్యాయ మూర్తిగా నియమితులైన జస్టిస్‌ రమణ అంతకుముందు ఉమ్మడి ఎ.పి హైకోర్టు న్యాయమూర్తిగా, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, ఢల్లీి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. అత్యున్నత న్యాయస్థానంలో ఎనిమిదేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించిన ఆయన సి.జె గా ఏప్రిల్‌ 24 నుంచి 2022 ఆగష్టు 26 వరకూ పదహారు నెలల పాటు పదవిలో వుంటారు. ఏప్రిల్‌ 23న సిజెఐ గా పదవీ విరమణ చేసిన జస్టిస్‌ బాబ్డే సీనియారిటీ ప్రకారమే 48వ న్యాయమూర్తిగా ఆయన పేరును సిఫార్సు చేశారు. సుప్రీం న్యాయమూర్తులలో అత్యంత సీనియర్‌ను నియమించడం సంప్రదాయమైనా సరే నెల రోజుల ముందుగా తన తదుపరి సి.జె పేరు సిఫార్సు చేయడం ఆనవాయితీ. ఏ కారణం చేతనైనా సీనియార్టీ ప్రకారం వున్నవారిని నియమించలేని పరిస్థితి వస్తే ముందే చర్చ చేయవలసి వుంటుంది. జస్టిస్‌ రమణపై ఎ.పి ముఖ్యమంత్రి జగన్‌ కొన్ని ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో కొంత ఆసక్తి నెలకొన్నప్పటికీ ఆయన నియమాకం తథ్యమని ముందే స్పష్టమైంది. సుప్రీం కోర్టులో ఖాళీల భర్తీ పైన, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నాగరత్నను సుప్రీంకు తీసుకు వస్తే 2027లో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అవుతారనే అంశం పైన చర్చ జరిగింది తప్ప తదుపరి సిజెఐ గురించి కొలీజియంలో భిన్నాభిప్రాయాలు వచ్చినట్టు కనిపించదు.
ఆరోపణల తోసివేత
జస్టిస్‌ రమణ పేరును సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు అదే సమయంలో ఆయనపై ముఖ్యమంత్రి జగన్‌ ఆరోపణలను తోసిపుచ్చినట్టు ప్రకటించింది. ఈ విషయంలో అనుకూలంగా వ్యతిరేకంగా రకరకాల వాదోపవాదాలు న్యాయవర్గాల నుంచి వినిపించాయి. ఈ ఆరోపణల విచారణకు సంబంధించి కొన్ని కథనాలు రాగా అంతర్గత విచారణ విషయాలు ఎప్పుడూ బహిరంగ పర్చబోమని వాటిని తోసిపుచ్చింది. అంతిమంగా ఆ ఆరోపణలలో పసలేదని తోసిపుచ్చినట్టు ప్రకటించింది. విచారణ ప్రక్రియ జరిపి తిరస్కరించడం పారదర్శకత లేదనే విమర్శకు సమాధానంగా భావించాల్సి వుంటుంది. అయితే ఆ ఆరోపణలను విచారించింది ఎవరు, ఏం తేల్చారనేది బయిటపెట్టి వుండాల్సిందని సీనియర్‌ న్యాయవాదులు కొందరు రాశారు. ఏమైనా అది ముగిసిన అధ్యాయం.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి నియమితులవటం ఇది రెండవ సారి. గతంలో ఎ.పి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ పని చేసిన జస్టిస్‌ కోకా సుబ్బారావు 1966-67 మధ్య సి.జె గా పనిచేశారు. 1993-94లో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ వెంకటాచలయ్య కూడా ఇప్పటి ఎ.పి లోని లేపాక్షిలో జన్మించిన వ్యక్తి అయినప్పటికీ అది అప్పుడు ఉమ్మడి కర్ణాటక రాష్ట్రంలో భాగంగా వుండేది. మానేపల్లి నారాయణరావు వెంకటాచలయ్య అన్న ఆయన పేరు కూడా అచ్చం తెలుగు వారి పేరే అయినా చదువు కర్ణాటకలో సాగింది. ఈ మధ్య కాలంలో తెలుగువారు అనేకులు సుప్రీం కోర్టులో న్యాయమూర్తులుగా పని చేసినప్పటికీ ప్రధాన న్యాయమూర్తి స్థానం దాకా పయనించే అవకాశం జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణకే దక్కింది. ఆయన పదవీ కాలం కూడా సాపేక్షంగా చాలా మంది సి.జె ల కన్నా అధికంగా వుంటుంది.
సుప్రీం ప్రతిష్టపై నీలినీడలు
చాలా దశాబ్దాల తర్వాత తెలుగు వ్యక్తి ప్రధాన న్యాయమూర్తి కావడం పట్ల సంతోషం వ్యక్తమైనా సుప్రీం కోర్టు ప్రతిష్ట అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఆయన బాధ్యతలు తీసుకుంటున్నారు. ప్రధాన న్యాయమూర్తులుగా ఎస్‌.ఎ.బాబ్డే, అంతకు ముందు రంజన్‌ గొగోరుల హయాంలో అత్యున్నత న్యాయస్థానం కేంద్రం ఒత్తిళ్లకు లోబడిపోయిందనే ఆరోపణ బలపడిరది. వరుసగా ఇచ్చిన తీర్పులు మోడీ సర్కారుకు సంతోషం కలిగించాయి. సిజెఐ గా రంజన్‌ గొగోరు అయోధ్య, రాఫెల్‌ తీర్పులు ఇచ్చారు. పదవీ విరమణ తర్వాత కొద్ది కాలానికే రాజ్యసభ సభ్యత్వం పొంది విమర్శలు మూట కట్టుకున్నారు. ఇక 2019 నవంబరులో ఎస్‌.ఎ బాబ్డే ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టినప్పుడు కీలకమైన ఎన్నో కేసులు న్యాయస్థానం ముందు అపరిష్కృతంగా వుండిపోయాయి. జమ్మూ కాశ్మీర్‌కు రాజ్యాంగం ఇచ్చిన ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించి మూడు ముక్కలు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసిన కేంద్రం నిరంకుశ చర్యను సవాలు చేస్తూ వంద పిటిషన్లు దాఖలయ్యాయి. కాని వాటిపై పూర్తి విచారణ జరగనేలేదు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) పైనా పిటిషన్లు వచ్చాయి. ఢల్లీితో సహా దేశవ్యాపితంగా నిరననలు సాగాయి. ముఖ్యంగా ఢల్లీిలో కుట్రపూరితంగా మత కలహాలు రగిలించి యువతను విద్యార్థులను అరెస్టు చేసి అక్రమ కేసులు పెట్టారు. జామియా మిలియా విశ్వవిద్యాలయం లోనూ దాడులు జరిగాయి. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ లోకి గ్యాంగులు చొరబడి దౌర్జన్యం చేశారు. ఇవన్నీ కళ్ల ఎదురుగా జరుగుతున్నా పలుసార్లు కేసులు వస్తున్నా సుప్రీంకోర్టు న్యాయం చేసేందుకు చొరవ తీసుకోలేదు. హత్రాస్‌ అత్యాచారం ఘటనలో అన్యాయంగా అరెస్టు చేయబడిన కేరళ జర్నలిస్టు సిద్దిక్‌ కప్పన్‌ కేసు వస్తే విచారించి మీడియా స్వేచ్ఛను కాపాడకపోగా ఇలాంటి కేసులు హైకోర్టుకే వెళ్లేలా తాను చర్యలు తీసుకుంటానని ప్రకటించింది. రోహింగ్యా శరణార్థులను ఆదుకునే విషయంలోనూ భారత దేశ సంప్రదాయం, రాజ్యాంగ విలువలు, అంతర్జాతీయ సూత్రాలను బేఖాతరు చేస్తూ జోక్యానికి నిరాకరించింది.
వివాదగ్రస్తమైన తీరు
ఇంతకంటే తీవ్రమైన విషయం ఎన్నికల బాండ్లకు సంబంధించిన కేసును పూర్తిగా పక్కన పెట్టేయడం. ప్రతి ఎన్నికల సమయంలోనూ ఆ బాండ్లపై స్టే విధించాలంటూ పిటిషన్లు వస్తూనే వున్నాయి. ఇవి ఎప్పటినుంచో వున్నాయనీ, ఈ విధమైన అభ్యర్థనలను ఇదివరకటి నుంచి వస్తున్నాయంటూ ప్రతిసారి సుప్రీంకోర్టు ధర్మాసనం వాటిని పక్కన పెడుతూ వచ్చింది. వలస కార్మికుల దుస్థితిపై దాఖలైన వ్యాజ్యాల విషయంలోనూ ఇదే విధమైన స్పందనా రాహిత్యం తాండవించింది. వారికోసం ఏం చేయాలనేది ప్రభుత్వానికే బాగా తెలుసంటూ కేసును చాలా కాలం సాగదీశారు. వలస కార్మికులకు తిండి పెడుతున్నప్పుడు మళ్లీ ఆర్థిక సహాయం దేనికని ఆఖరుకు సి.జె బాబ్డే స్వయంగా ప్రశ్నించారు. ఇదే కాలంలో కార్పొరేట్లకు సంబంధించిన పలు కేసుల్లో సుప్రీం కోర్టు అమితాసక్తి ప్రదర్శించింది. ఢల్లీిలో రైతుల ఆందోళనను పరిష్కరించాలనే కేసు లోనూ ఒక కంటితుడుపు కమిటీని వేసి కాలయాపన చేసింది. ఆ కమిటీ కూడా ప్రభుత్వ అనుకూల వ్యక్తులతో నిండి వుండటం, ఒకరు ముందే నిరాకరించడం దాన్ని మరింత పలచన చేసింది. తీరా ఆ కమిటీ సిఫార్సులు వచ్చి చాలా కాలం గడిచినా ఎలాంటి సానుకూల చర్యలు ఆదేశించింది మాత్రం లేదు. ప్రజల పేదల హక్కులను కాపాడ్డంలో ఈ విధంగా వ్యవహరించిన న్యాయస్థానం కోర్టు ధిక్కార కేసుల పేరిట మాత్రం ఎంతో సమయం వెచ్చించింది. అయోధ్య కేసులో 1991 ప్రార్థనా స్థలాల చట్టం ప్రాతిపదికగా చెప్పిన న్యాయస్థానం ఆ చట్టాన్నే సవాలు చేసే పిటిషన్‌ను అనుమతించడం మరో వైపరీత్యం. ఆ వెంటనే కాశీ, మధుర క్షేత్రాలలో వివాదాలను స్థానిక న్యాయస్థానాలు చేపట్టాయి.
న్యాయమూర్తుల నియామకం స్తంభన
కరోనా కారణంగా ఈ కాలంలో వర్చువల్‌ విచారణ పద్ధతి గొప్ప మార్పుగా చెబుతున్నా వాస్తవంలో అనేక కేసులు విచారణకు నోచుకోకుండానే పోయాయి. కేవలం 25 శాతం మాత్రమే విచారణ జరిగాయి. ఈ పరిస్థితి అనివార్యమైందనుకుంటే ఒక తీరు గాని ఇందుకు సి.జె బాబ్డేను పొగడ్తల్లో ముంచెత్తడం విచిత్రం. ఇప్పటికి వచ్చిన తీర్పులపైనే ఇంత అసంతృప్తి వుండగా కొత్తగా ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ను కూడా ప్రవేశపెట్టేందుకు కోర్టు చర్చలు సాగిస్తున్నది. వాటి పాత్రపై న్యాయమూర్తులకే స్పష్టత వున్నట్టు లేదు. ఈ మొత్తం కాలంలో సుప్రీం కోర్టుకు ఒక్క న్యాయమూర్తిని కూడా అదనంగా నియమించలేకపోవడం పెద్ద లోపం. హైకోర్టుల్లోనూ 400 పైనే ఖాళీలున్నా కొలీజియం, కేంద్రం పరస్పరం బాధ్యతను నెట్టివేసుకుంటూ కాలం గడిపాయి. పదవీ విరమణకు ముందు రోజు సి.జె బాబ్డేతో కూడిన ధర్మాసనం రాజ్యాంగంలోని 224(ఎ) అధికరణాన్ని దాదాపు 60 ఏళ్ల తర్వాత పునరుద్ధరించి, రిటైర్డు జడ్జిలను హైకోర్టులకు నియమించవచ్చునని ఆనుమతినిచ్చింది. క్రమబద్దమైన నియామకాలు పూర్తిచేయకపోగా ఈ విధంగా విచక్షణతో కూడిన నియామకాలు చేస్తే మళ్లీ అదెక్కడికి దారి తీస్తుందోననే సందేహాలు వున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను తొక్కిపడుతూ ఒత్తిడికి గురి చేస్తున్నదనే అభిప్రాయం అందరిలో నెలకొంది. మాజీ సీనియర్‌ న్యాయమూర్తులు అరుణ్‌ మిశ్రా వంటి వారు ప్రధాని మోడీని అదేపనిగా పొగిడి తరించడం, రంజన్‌ గొగోరు రాజ్యసభకు వెళ్లడం ఆ సందేహాలను పెంచింది. తాజా మాజీ సి.జె బాబ్డే కూడా బహురంగాలలో ఆసక్తి వున్నవారు గనక పదవీ విరమణ తర్వాత ఏదైనా చేయవచ్చునని ప్రస్తుత సిజెఐ ఎన్‌.వి.రమణ వీడ్కోలు ప్రసంగంలో చెప్పడంలోనూ సంకేతాలున్నాయి.
భవిష్యత్‌ గమనం?
సిజెఐ గా ఎన్‌.వి రమణ పదవీ కాలం సాపేక్షంగా చాలా మంది కన్నా కొంచెం ఎక్కువగానే వుంటుంది. రాజకీయ నాయకులపై, ప్రజా ప్రతినిధులపై కేసులసు వేగంగా పరిష్కరించాలన్నది గతంలో జస్టిస్‌ రమణ తీసుకున్న కీలక నిర్ణయం. పేదలకు కూడా న్యాయ సహాయం సమానంగా అందేలా చర్యలు తీసుకోవాలన్నది ఈ సిఫార్సుకు ముందు రోజు ఆయన చేసిన ప్రసంగం. నదీ జలాల వివాదాలు రాష్ట్రాల హక్కులకు సంబంధించి కూడా ఆయన తీర్పులను ప్రస్తావిస్తుంటారు. తెలుగు రాష్ట్రాలకే నదీ జల వివాదాలు ఒకవైపు రాష్ట్రాల హక్కులపై కేంద్రం తీవ్ర దాడి మరోవైపు సాగుతున్న ఈ కాలంలో మరి ఆయన తీర్పుల పరంగానూ న్యాయ వ్యవస్థ నిర్వహణ పరంగానూ ఎలాంటి అడుగులు పడేది చూడవలసిందే. చట్టం వ్యవస్థపై ఆధారపడిరదే గాని వ్యవస్థ చట్టంపై ఆధారపడి వుండదన్న కారల్‌మార్క్స్‌ మాట ప్రకారం వ్యక్తులను బట్టి మౌలిక మార్పులకు పెద్ద అవకాశం వుండకపోయినా న్యాయమూర్తులు చేయగలిగింది చాలానే వుంటుంది. మసకబారిన సుప్రీం ప్రతిష్ట రీత్యా కొత్త సిజెఐ జస్టిస్‌ ఎన్‌.వి రమణ ఏం చేస్తారనేది రేపటి నుంచే చూడొచ్చు.
-సైమన్‌ గునపర్తి

వివాహ బంధం పటిష్ట పరచాలి

శక్తివంతమైన వేదమంత్రాలతో ఏర్పడిన వివాహబంధం తో ఒకటైన దంపత్యబంధం శాత్వతం, పవిత్రం. ..జీవితంలో ఎదురయ్యే ఆటుపోటులకు సమన్వయం తో ఒకరికొకరు తోడుగా ఉంటూ పరిష్కారించుకుంటూ ముందు కు సాగాలి. సంసారనౌక సజావుగా ప్రయాణించాలంటే ఓర్పు,నేర్పు, సమయస్ఫూర్తి ఉండాలి…నిర్వచనానికి అందని ఎత్తైన భావన దాంతప్యబంధం…సంతోషంలో భాగస్వామ్యం పంచుకుంటూ ఒకరి దుఃఖం లో మరొకరి ఓదార్పు పంచుతూ సంతానం యొక్క ఆలనా పాలనా చూసుకుని సంతోషపడతారు.. పరస్పర అనుకురాగం, అవగాహన కలిగి కలిసి నూరేళ్ళ జీవిత ప్రయాణమే వివాహబంధం యొక్క లక్ష్యం..అరమరికలు లేని ఆనందం పంచుకోవడం లోనే అంతర్లీనంగా ఒకరిపై మరొకరికి ఉన్న బాధ్యత, బంధం కలిసి ఉంటాయి.కేవలం ఆర్ధిక సంబంధ విషయాల వల్ల ఈ మధ్య వివాహ బంధాన్ని అతి సులువుగా రద్దు చేసేసుకుంటున్నారు…సంస్కృతి సంప్రదాయాలు గౌరవించడం నేటి తరానికి గిట్టనిమాటలు…విచ్చలవిడితనం కూడా పెరిగిపోయి వివాహబంధాన్ని తృణప్రాయంగా తీసిపారేస్తున్నారు… గత శతాబ్దంలో ఈ దుస్థితి లేదు..ఆదర్మవంతమైన జంట సీతారాములు…అరణ్య వాసంలో భర్తతో కలిసి కష్టపడడానికైనా సిద్ధపడినట్లు మనకి తెలుసు… సమస్యలు వచ్చాయని బయటపడకుండా భర్తకి, భార్య..భార్యకి భర్త ధైర్యం చెప్తూ కష్టం లోనూ సుఖంలోనూ తోడుగా నిలిచి ముందుకు సాగడమే దాంపత్య బంధం..
మానవ జీవితంలో ముడిపడిన అన్యోన్య బంధం వివాహం. పెళ్లిళ్లు భారతీయ సంస్కృతికి, సహజీవనానికి ఆనవాళ్ళు. పెళ్లిళ్లకు ప్రత్యేకించినది మాఘమాసం. పురోహితులు సూచించే శుభ ముహుర్తాలను బట్టి పెళ్లిళ్లు జరుగుతుంటాయి. హిందూ సమాజంలో దాగివున్న పవిత్రమైన వేద మంత్రాల సాక్షిగా సాగే వివాహ మహోత్సవానికి మన దేశంలో సముచిత ప్రాధాన్యత,విలువ,గౌరవం ఉంటుంది. ఇప్పటికీ భారతీయులు వైవాహిక జీవిత విలువలను దైవ స్వరూపంగా పాటిస్తారు. ఇలాంటి వివాహ బంధాలు కొన్ని ఈ మధ్య కాలంలో విడిపోతున్న సందర్భాలు కుటుంబ పెద్దలను కలవరపెడుతున్నాయి. లక్షల కట్నాలతో లక్షణమైన సంబంధాలు వెతికి పెళ్లి చేసిన తల్లిదండ్రులకు ఇలాంటి సంక్షోభం మనోవేదనను కల్గిస్తున్నది. ఆలుమగల మధ్య అవగాహన లోపిస్తే, సంయమనం లేకపోతే సంసారం నిస్సారమవుతుంది. భార్యాభర్తల విభేదాలు వివాహబంధాన్ని విడదీస్తాయి. చివరికి విడాకులకు దారి తీస్తుంది. ప్రపంచ దేశాలతో పొల్చితే కేవలం ఒక శాతం విడాకులతో అత్యల్పంగా నమోదైన దేశంగా ఇండియాకు పేరుంది. గరిష్టంగా విడాకులు బెలారస్‌ దేశంలో 68శాతం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా విడాకుల రేటులో చైనా 2.2 శాతం, ఇటలీ 2.7శాతం,కెన్యా 15 శాతం ,బ్రెజిల్‌ 21శాతం,అస్ట్రేలియా 38 శాతం,స్విస్‌ 40శాతం, జర్మనీ 41శాతం , కెనడా45శాతం,అమెరికా 49శాతం, ఉత్తర కొరియా మరియు నూజిలాండ్‌ 53శాతం, బెల్జియం 56శాతం,స్వీడన్‌ 64శాతం,రష్యాలో 65శాతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా విడాకుల పెరుగుదల రేటు 1960లో12 శాతం,1980లో 26శాతం,2000లో 25 శాతం,2010లో41శాతం,2017లో 44 శాతం,2020 నాటికి 51.8 శాతంగా నమోదు కాబడిరది. గత మూడేళ్ళలో వివాకుల రేటు 7.8 శాతం పెరుగుదల గమనార్హం. ఇండియాలో విడాకుల రేటు పూర్వంతో పోల్చితే క్రమంగా పెరుగుతోందని సంబంధించిన నిపుణులు వెల్లడిస్తున్నారు. మనదేశంలో విడాకులకు ముఖ్య కారణాలు- వివాహేతర సంబంధాలు, ఇరువురి మధ్య విశ్వాసం సన్నగిల్లడం, సంక్షోభాలు, బాల్యవివాహాలు, వితండ వాదనలు, ఆర్థిక సమస్యలు, చిర కాలంగా దంపతుల ఎడబాటు , గృహహింస, వరకట్న వేధింపులు, లైంగిక సమస్యలు, అహంభావ దోరణి, మానసిక వైకల్యం, సర్దుకునే దోరణి లేకపోవడం వంటివి ప్రముఖమైనవి. దేశ జనాభాలో 0.11శాతం అనగా1.36 మిలియన్ల మంది వివాహితులు విడాకులు తీసుకున్నారు. వారిలో పురుషుల కన్నా స్త్రీలు అధికం. దేశంలో విడాకుల సంఖ్య రాష్ట్రాల వారీగా మిజోరాం (6.34శాతం), మేఘాలయా (4.11శాతం ),సిక్కిం (2.16శాతం), కేరళ (1.59శాతం), మణిపూర్‌ (1.32శాతం), తమిళనాడు (1.22శాతం), మహారాష్ట్ర (1.08శాతం),వెస్ట్‌ బెంగాల్‌ (1.02శాతం ), ఆంధ్ర ప్రదేశ్‌ (1.12శాతం), గుజరాత్‌లో 1.08శాతంగా ఉంది. ఈ విడాకుల సంఖ్య గ్రామీణుల కంటే పట్టణవాసుల్లో , మద్యతరగతి కుటుంబాలలో, అందులోనూ విద్యాధికుల్లోనే నమోదు అధికం. విదేశీయుల్లో కంటే భారతీయుల్లో విడాకుల సంఖ్య తక్కువ ఉండటానికి ప్రదాన కారణం పూర్వం నుండే విడాకులనేది ఓ సామాజిక దురాచారంగా గుర్తించబడిరది. విడిపోయి జీవించటం అనేది ఒక అసామాజికమైనదిగా, దుస్సంస్కృతిగా భావించబడుతున్నది. వివాహేతర సంబంధాల్లో పురుషులు 75 శాతం,స్త్రీలు 25శాతం విడాకులు తీసుకుంటున్నారు. అందులోనూ 10 నుంచి 15 సంవత్సరాల వైవాహిక జీవితం గడిచిన తర్వాత 53శాతం మంది విడాకులు తీసుకుంటున్నట్లు ఓ సర్వేలో తేలింది. 20ఏళ్ళకు పైగా వైవాహిక జీవితం గడిపిన వారిలో విడాకులు చాలా అరుదుగా కన్పిస్తు న్నాయి. భారత్‌ లో వివిధ మతాల వారు హిందూ వివాహ చట్టం-1955 ను అనుసరిస్తున్నారు. ముస్లిమ్‌ విడాకులు ముస్లిం వివాహ చట్టం -1939, క్రిస్టియన్లకు భారతీయ విడాకుల చట్టం-1963, కుల మతాంతర వివాహాలకు ప్రత్యేక వివాహ చట్టం-1954 చేయబడ్డాయి. ఇతర కారణాలతో పోల్చితే ఉభయుల అంగీకారంతో విడాకులు తీసుకోవడం సులభంగా జరుగుతోంది.
పెళ్ళంటే నూరేళ్ళ మంట కాకూడదు
పెళ్ళంటే రెండువంశాలు కలిసే వేడుక. వేర్వేరు వ్యక్తిత్వాలు ఉన్న ఇరువురిని ఒక బాటపై కలిసి నడవమని పెద్దలు ఏర్పాటు చేసే మొదటి మెట్టులాంటిది. అలాంటి సోఫానం శుభ్రంగా ఉండాలి కాని కలతలు, తగాదాలతో మొక్కుబడిగా చేసేవి, పాచి పట్టిన మెట్టులా తయారు చేయకూడదు. పెళ్ళంటే ఎవరికైనా కంగారు, హడావుడి సహజం. బాగా ధనవంతులైతే ఏమో చెప్పలేం గాని, మధ్య తరగతి, మరికొంచెం స్థితిమంతులైనా ఈ రోజుల్లో పెళ్ళంటే మాటలు కాదు. పెళ్ళి సంబంధాలు వెతకటం ఒక యజ్ఞం. అయితే, పెళ్ళి చేసి పిల్లని అత్తవారింటికి పంపేసరికి పిల్ల తల్లిదండ్రులకి కాస్తోకూస్తో అప్పులు ఆపైన నిందలు. లక్షల్లో చేరిపోయింది. కట్నాల రేంజ్‌. చదువులు ఎంత పెరిగాయో, దానికి సమా నంగా కట్నాలు లాగుతున్నారు అబ్బాయి తల్లిదండ్రులు. పెద్ద చదువులు, సంస్కారం నేర్పడానికి బదులు ఆశలు, దురాశలు నేర్పుతున్నాయి. కట్నాలు వద్దని గొప్పలకు పోయి, దానికి బదులుగా కానుకలంటూ, పదిరెట్లు ఆడపిల్లల తండ్రులు దగ్గరలాగు తున్నారు. పెళ్ళికూతురు మాత్రం పెద్ద చదువు చదవాలి, ఉద్యోగం చేసి రెండు చేతులా సంపాదించి భర్త చేతిలో పోయాలి. పనిపాటలు రావాలి. అత్తగారు ఎలా చెబితే అలా తల ఊపాలి. అంత చదువు చదివిన పిల్ల వ్యక్తిత్వం చంపుకుని ఎవరేం చెబితే అలా తలాడిరచేలా అణగిమణిగి ఉండాలి. కొడుకు ఎక్కడ కోడలి మాట వినేస్తాడోనని అత్తా మామలు కంగారుపడుతుంటారు.కొంతమంది అబ్బాయిల తరఫువారు అనేక రకాలుగా చికాకులు కలిగిస్తుం టారు. అందరికీ కూర్చోవడానికి వేసిన కుర్చీలు బాగోలేవని, భోజనాల్లో ఎక్కువ వెరైటీలు చేయించినా ఇంకా ఏవో తక్కువ అయ్యాయని, పెళ్ళికొడుకు స్నేహితులకి హోటళ్ళలో ఎ.సి. రూములు తీసుకోలేదని, పొద్దున్నే టిఫిన్లు తిరిగి రెండోసారి అడగలేదని వియ్యపురాలికి మాటమాటికి ఏం కావాలి? అని అడగలేదని సతాయిస్తుంటారు. కట్నాలు వద్దు, కానుకలు ఇవ్వండి అనే వారు కొందరు. పెళ్ళి బాగా చేయండి అంటూ పిల్ల తల్లిదండ్రి నుంచి ఎన్ని విధాలుగా రాబట్టాలో అన్ని విధాలా గుంజుకునేవారు కొందరు. మళ్ళీ పిల్లని కన్నతల్లిదండ్రులని గౌరవించరు. ఎంత పెద్ద చదువులు చదివినా సంస్కారం లేదని, ఇలాంటి పెళ్ళిళ్ళు రుజువు చేస్తున్నాయి. మర్యాద ఇచ్చుపుచ్చుకోమన్నారు. ఆడపిల్ల కన్నవాళ్ళని తేలిగ్గా చూసే తీరు మార్చుకోవాలి ఈనాటి వరుడి తల్లిదండ్రులు. ఒకసారి మనసులు బాధపడితే తర్వాత ఎంత మంచిగా మాట్లాడినా, అది నటనగానే ఉంటుంది అవతలి వారికి పెళ్ళిబాగా చేశారు అనే ఒక్కమాట కన్యాదాతకి ఎంత బలమిస్తుందో అబ్బాయి తల్లిదండ్రులు ఆలోచించాలి. గతంలో అయితే పెళ్ళిళ్ళు ఇంటి ముందే పెద్ద, పెద్ద పందిళ్ళు వేసి అందులోనే జరిపేవారు. ప్రస్తుత కాలంలో చిన్నచిన్న ఇళ్ళు, ఇరుకు గదుల్లో ఉండే సందర్భంలో అలాంటి అవకాశా ల్లేవు. కాబట్టి ప్రతిఒక్కరూ కళ్యాణ మండ పాలనే ఆశ్రయిస్తున్నారు. వీటిని కూడా ఆర్థిక తాహతుకు మించి బుక్‌చేస్తున్నారు. పెద్ద పెద్ద మండపాల్లో చేసుకునేబదులు, తక్కువ ఖర్చుతో చిన్నమండపాల్లో చేసుకుంటే కొంత ఖర్చు కలిసివస్తుంది. ఇంకా ఇలాంటి అనవ సరపు వాటికి, ఆడంబరాలకు అదనంగా ఖర్చు చేస్తుంటారు. ఒక విధంగా ఆలోచిస్తే ఇవన్నీ వృధాయే. పెళ్ళిపేరజరిగే కొన్ని ఖర్చులు తగ్గించుకుని, వధూవరులకు అందిస్తే వారు జీవితంలో కొంత ఒడిదుడుకులు లేకుండా, ఆర్థిక అవసరాలకు పనికివస్తాయి. ఒక రోజు జరిగే తంతుకి ఎక్కువ ఖర్చుల జోలికిపోకుండా పొదుపు చేస్తే, తర్వాత ఏఇబ్బంది లేకుండా కొత్తగా పెళ్ళిచేసుకున్న వారి జీవితం హాయిగా సాగిపోతుంది. ఈ విషయాన్ని వధూ వరుల ఇరువైపులవారు ఆలోచించి జాగ్రత్తలు పాటిస్తే పెళ్ళంటే నూరేళ్ళపంట అవుతుంది, లేకుంటే నూరేళ్ళ మంట అవుతుంది
గిరిజన తెగలలో వారి సంస్కృతి, ఆచారాలలో జరిగే వివాహ వ్యవస్థ ఆదర్శవంతమైనవి. భిల్లు, గొత్తికోయ వంటి గిరిజనులు ఆర్థిక వెసులుబాటు లేక సహజీవనంతో సరిపెట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిని అధ్యయనం చేసిన రaార్ఖండ్‌ లోని ‘నిమిట్టా’ అనే స్వచ్చంద సంస్థ 2016లో 200 జంట లను చేరదీసి పెళ్ళి చేసింది. వెంటనే మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌ చేపించడంతోఆ మహిళలకు చట్టబద్దమైన హక్కులు లభించాయి. ఉత్తరాది రాష్ట్రాలలో వివాహ సంప్రదాయాలను పాటించాలని, ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని, పర్యావరణ హితమైన పెళ్ళిగా ‘ రాధాసోమి ‘ అనుసరిస్తున్నారు. ఈ వివాహ సంప్రదాయంలో శుభలేఖ ఖర్చు రూ.5,భోజనాలు ప్లేటుకు రూ. 13కు మించడానికి వీల్లేదు. అమ్మాయి తరపు అతిధితులు 65మంది, అబ్బాయి తరపు బంధువులు 85 దాకా హాజరు కావాలి. ఈ రాథాసోమి అనేది ఉత్తరాధిన బహుళ ప్రాచుర్యం పొందిన అనేక ఆధ్యాత్మిక తెగల్లో ఇదొకటి. ప్రేమ పెళ్లిళ్ల కంటే పెద్దలు కుదిర్చిన వివాహాలు సమాజ ఆమోదయోగ్యంగా ఉంటాయి. భారతీయ సంప్రదాయంలో మూడుముళ్ల వివాహ బంధం పట్ల పవిత్రత, పితృసామ్య వ్యవస్థ, వివాహిత ఇంటికి పరిమితం కావడం, సామాజిక విలువలు, గ్రామపంచాయతీ తీర్పులు, లింగ సమానతలు, పెద్దల మాటలు పాటించటం వంటివి మనదేశంలో విడాకుల రేటు తక్కువ నమోదుకు తోడ్పడుతున్నాయి. భారత హిందూ పవిత్ర వివాహబంధం మూడు పువ్వులు ఆరు కాయటంగా వర్ధిల్లుతూ, కుటుంబంలో నవ్వుల పువ్వులు పూయాలి. ప్రపంచ దేశాలకు బారతీయ వివాహవ్యవస్థ దీప స్తంభం కావాలి. ప్రస్తుత వివాహ వ్యవస్థలో ఆశించిన మార్పులు రావాలంటే సాంస్కృతికంగా సంప్రదాయంగా పెళ్లిల్లు రూపుదిద్దుకోవాలి. బాల్య వివాహాలను నిరోధించడానికి పేద, కార్మిక కుటుంబాలలో వ్యసనాలను తగ్గించడానికి ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. వివాహబంధం పటిష్ఠతకు అవసరమైన కౌన్సిలింగ్‌ కేంద్రాలను గ్రామ స్థాయి వరకు విస్తరించాలి. నవ దంపతులకు ఆర్ధిక, సామాజిక భద్రత కల్పించాలి. అన్ని వర్గాల ప్రజల ఆర్థిక వెసులుబాటును బట్టి మదుపుతో, కాలుష్యానికి తావులేకుండా పర్యావరణ హితంగా,ఆరోగ్యకర వాతావరణంలో పెళ్లిల్లు జరిగితే శుభకరం !
వ్యాసకర్త : –గుమ్మడి లక్ష్మీ నారాయణ, ప్రముఖ సాహితీవేతత 9491318409

నిత్య నూతన ప్రవాహం.. అంబేడ్కర్‌ సిద్ధాంతం

(డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా..)

‘’1950, జనవరి 26న మనం వైరుధ్యాతో కూడిన జీవనంలోకి ప్రవేశించ బోతున్నాం. రాజకీయాలో ఒక వ్యక్తి- ఒక ఓటు, ఒక ఓటు- ఒక మివ అన్న రాజకీయ సమానత్వాన్ని గుర్తించబోతున్నాం. అయితే సామాజిక, ఆర్థిక జీవితంలో మనకున్న సామాజిక, ఆర్ధిక వ్యవస్థ వ్ల ఒక వ్యక్తి – ఒక మివ అన్న సూత్రాన్ని తిరస్కరిస్తూనే ఉంటాం. వైరుధ్యాతో కూడిన ఈ జీవితాన్ని ఎంత కాం భరిస్తూ వద్దాం? ఎంత కాం మన సామాజిక, ఆర్థిక జీవితాల్లో సమానత్వాన్ని సాధించకుండా ఉందాం? ఇలా ఎక్కువ కాం కొనసాగనిస్తే మన రాజకీయ ప్రజాస్వామ్యమే ముప్పునకు లోనవుతుంది. ఈ వైరుధ్యాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి, లేకపోతే అసమానత్వంతో పీడిరపబడుతున్న వాళ్ళు ఈ రాజ్యాంగ సభ కష్టపడి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామిక వ్యవస్థను కుప్పకూుస్తారు.’’ -డాక్టర్‌.బి.ఆర్‌ అంబేద్కర్‌.

సమకాలీనరాజకీయాల్లో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ ప్రస్తావన అత్యంత ప్రాధాన్యతను సంత రించుకుంది. వర్తమాన పరిస్థితుకు తగ్గట్టుగా అంబేడ్కర్‌ అభిప్రాయాను అన్వయించుకోవడం, ఆ మెగులో ప్రస్తుత సమస్యను పరిశీలించడం, వాటి పరిష్కారానికి అంబేడ్కర్‌ నిర్దేశించిన మార్గ దర్శనాను అనుసరించడం అనివార్యంగా మా రింది. గతంలో అంబేడ్కర్‌ను పూర్తిగా తిరస్కరిం చిన రాజకీయాు,సంస్థు,పార్టీునేడు అంబేడ్కర్‌ను విస్మరించే పరిస్థితు లేవంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. భారత రాజకీయ వ్యవస్థలో అటు విప్లవ కమ్యూనిస్టు నుంచి ఇటు పూర్తిగా మితవాద,సనాతన వాద పార్టీ వరకు అంబేడ్కర్‌ వాదం, సామాజిక మార్పుకి ఆయన యిచ్చిన నినాదం ఒక ఎజెండాగా మారిపోయింది. ఈ ఏప్రిల్‌ 14 నుంచి డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ 128వ జయంతి ఉత్స వాు ప్రారంభం అవుతున్నాయి. అందుకే ఒకసారి డాక్టర్‌.బి.ఆర్‌.అంబేడ్కర్‌ సిద్ధాంతాు, అభిప్రా యాు సమాజంపైన ముఖ్యంగా భారత రాజకీ యా పైన ఎటువంటి ప్రభావాన్ని కలిగించాయో పరిశీలించాల్సి ఉంది. నేడు దాదాపు అన్ని పార్టీు అంబేడ్కర్‌ కృషి గురించి, ఆయన సైద్ధాంతిక ప్రాధాన్యతను గురించి మాట్లాడుతున్నాయి. అసు అంబేడ్కర్‌ ఊసే ఎత్తని కొన్నిపార్టీు ప్రత్యక్షంగానూ, మరికొన్ని పార్టీు తమ అనుబంధ సంఘాతో అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాను నిర్వహిస్తున్నాయి. మావో యిస్టు పార్టీతో సహా అన్ని కమ్యూనిస్టు పార్టీు తమ కార్యక్రమంలో దళిత సమస్యను ప్రస్తావించి దాని పరిష్కారానికి కృషి చేయాని నిర్ణయించు కున్నాయి. కు సమస్యను తమ ఎజెండాలో చేర్చు కునే పరిస్థితికి ఆయా పార్టీు నెట్టబడ్డాయి. భూమి సమస్యకోసం పోరాటంలో భాగంగా దళితును, ఆదివాసును సమీకరించాని, కునిర్మూన కోసం కృషి జరగాని, కు నిర్మూన జరిగేంత వరకు రిజర్వేషన్లలాంటి ప్రత్యేక సౌకర్యాు అము కావాని వాళ్ల పార్టీ కార్యక్రమంలో పేర్కొన్నారు. దతాగునీటికి, దేవాయానికి,శ్మశానానికి అందరికీఒకేస్థం ఉండాని పిుపునిచ్చారు. దేశం ఐక్యంగా ఉండాంటే ఇది అత్యవసరమని ప్రకటించారు. అయితే ఈ మార్పు గత రెండున్నర దశాబ్దా దళిత ఉద్యమా ఫలితమేనని చెప్పుకోవాలి. సమకాలీన సమస్య పరిష్కారానికి మార్గనిర్దేశనం చేస్తోన్న అంబేడ్కర్‌ సిద్ధాంతబం కూడా అందుకు దోహదం చేసింది. గతపాతిక సంవత్సరాల్లో అంబేడ్కర్‌ రచను ప్రజకు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా భిన్నరాజకీయాు కలిగిన సంస్థు, వ్యక్తు జరిపిన పరిశోధను, సాగిన చర్చు అంబేడ్కర్‌ను ఒకశక్తిగా నిబెట్టాయి. అంబే డ్కర్‌ సిద్ధాంతాపై ఎంత లోతైనచర్చ జరిగితే అది తరతరా వివక్షనెదిరించేందుకు అంత శక్తిమంతంగా ఉపయోగపడుతుందనడానికి గత 28ఏళ్ళ చరిత్రసాక్ష్యంగా నిుస్తోంది.


బడుగు బహీనవర్గాకు మెగురేఖ
ఈ దేశంలో ప్రజాస్వామిక విప్లవానికి సిద్ధాంతం ఆచరణ బీజాు నాటి ముక్కల్ని పెంచిన తత్వవేత్త ఆచరణ కర్త. భారతదేశం ఆర్థిక అభివృ ద్ధికి ఆర్థిక నమూనా సిద్ధాంతాన్ని అందించిన ఆర్థిక వేత్త. ఈదేశంలో అసమానతకు మూమైన నిచ్చెన మెట్ల కు వ్యవస్థను దాని నిర్మించిన బ్రాహ్మణిజాన్ని మనువాద నిర్మూనకు సామాజిక సమానత్వం పై ఉద్యమించిన సామాజిక ఉద్యమ నేత. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 1891ఏప్రిల్‌14వ తేదీన రాంజీ భీమాబాయి దంపతుకు జన్మించాడు. తల్లిదం డ్రు అతనికి పెట్టిన పేరు భీమ్‌రావు గ్రామ నామాన్ని బట్టి స్కూల్లో అతని ఇంటి పేరు అంబా వదేవకర్‌. తర్వాత ఇతనిని అమితంగా అభిమా నించే ఒక ఉపాధ్యాయుడు ఆపేరును తన ఇంటి పేరు మీదుగా అంబేద్కర్‌ గా మార్పించాడు. ఆ పేరుతో అంబేద్కర్‌ ప్రసిద్ధుడైనాడు. రాంజీ పూర్వి కు కొంకణ ప్రాంతానికి చెందిన వారు. రత్నగిరి జిల్లాలోని మంజన్‌ గడ్‌కు ఐదు మైళ్ళ దూరంలో ఉన్న అంబావదే రాంజీ వంశీయు స్వగ్రామం వీరికి ఆగ్రామంలో ఒక ప్రత్యేక గౌరవం ఉండేది. ప్రతిఏటాజరిగే గ్రామదేవత ఉత్సవాకు ఉప యోగించే ప్లకీ వీరి ఇంట్లోనే ఉంచే వారు. అంబే ద్కర్‌ తాతగారైన మాలోజీ సక్‌పాల్‌మహర్‌ కులానికి చెందినవాడు. నిమ్న జాతి కులాన్నింటిలొనూ మహర్లు కొంతసాహసవంతు గాను బుద్ధి బం, ఉత్సహంకవారుగాను కనిపిస్తారు. సమాజంలో తమకున్న నీచస్థితిని హైన్యాన్ని వారెన్నడు మరు వలేదు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైన్యాన్ని ఏర్పాటు చేసిన కొత్తలో తొుత అందులో చేరినవారు మహార్లు మాలొజీ సక్‌ పాల్‌ మిలిటరీ లో పనిచేసి పదవీ విరమణ చేశారు. అతని సంతానంలో బతికి బట్టకట్టిన ఇద్దరే కొడుకు రాంజీ, కూతురు మీరా. వీరి కుటుంబం కబీర్‌ భక్తి సంప్రదాయాన్ని విశ్వసించేవారు. భక్తిసాంప్రదాయం ప్రవక్తు కు భేదాను పాటించలేదు,ఒప్పుకొనలేదు. రాంజీ సక్‌పాల్‌కు 14మందిసంతానం. వారిలో అంబేద్కర్‌ 14వ వారు. మహాపురుషు జన్మ వృత్తాంతాలో కొన్ని అద్భుత సంఘటను ముడిపడి ఉండటం సాధారణంగా లోకంలో చూస్తున్నాదే. గౌతమ బుద్ధుడు తల్లి గర్భంలో ఉండగా ఆమెకు వింత స్వప్నాు వస్తుండేవాట. ప్రపంచ దేశాు అంబే ద్కర్‌ ను సింబల్‌ ఆఫ్‌ నాలెడ్జిగా అభివర్ణిస్తుంటే మనదేశంలో ఆధిపత్య కుం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య తోపాటు, శూద్ర కుం నుంచి ఎదిగిన ఓసీ కులా నాయకు పాకు దేశానికి గొప్ప నాయకుడిగా కాక ఒక ఎస్సీ కు నాయకుడిగానే చూస్తారు. ఈదేశం సామర్థ్యాన్ని బట్టి గౌరవం కాకుండా కులాన్నిబట్టి గౌరవించే హీనమైన పరిస్థితి మన దేశంలో ఉంది. సబ్బండవర్గా సమ్మి ళితం గా రాజ్యాంగం అంబేద్కర్‌ ఒక దళితు కోసమే కాదు ఈ దేశ ప్రజందరినీ దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగాన్ని రచించారు. రాజ్యాంగాన్ని చదివితే అంబేద్కర్‌ ఎంత గొప్పవాడోనని తొస్తుంది. 1945 వరకు దాదాపు 40డిగ్రీ వరకు ఉన్నత విద్యను అభ్యసించిన వారు అంబేద్కర్‌ ఒక్కడే కావటం విశేషం. అంబేద్కర్‌తో పాటు పొలిటికల్‌ సైన్స్‌, సోషలిజం,ఎకనామిక్స్‌, డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎనిమిదేండ్ల కోర్సును రెండున్నరేండ్లలోనే లోనే పూర్తి చేసిన మొదటివ్యక్తి అంబేద్కర్‌. మన దేశంలో డాక్టర్‌ ఆఫ్‌ సైన్సు చదివింది ఇద్దరు మాత్రమే అందులో ఒకరు అంబేద్కర్‌ అయితే రెండో వ్యక్తి కెఆర్‌నారాయణ (మాజీరాష్ట్రపతి). ఇద్దరు దళిత వర్గం నుంచి చదివినవారు అందుకే అంబేద్కర్‌ ను ప్రపంచ మేధావిగా ఇతర దేశాు గుర్తిస్తుంటే మనదేశంలో మాత్రం కిందిస్థాయికి చెందిన వాడుగా చూస్తారు. అంబేద్కర్‌ కు గొప్పపేరు రావ డం అధిపత్యకులాకు ఇష్టం లేకపోవడం కు వివక్ష పొలేదనడానికి ఒకఉదా మన కరెన్సీ రూపాయినోట్లపై అంబేద్కర్‌ ఫోటోను కాకుండా గాంధీని మాత్రమే వేస్తారు. కారణంగాంధీ అగ్రకుం వ్యక్తి కావడమే. ఇద్దరిలో అర్హత ఎవరికి ఉంది ఒక్కసారి ఆలొచించండి.


అర్థిక వ్యవహారాల్లో నేర్పరి
రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్మాణంలో అంబేద్కర్‌ కీక పాత్ర పోషించాడు. మొదటి నోటుకు రూపాయు అనిపేరు పెట్టింది ముస్లిం చక్రవర్తి షేర్‌ షా. 1540-45లో 1715 అంబేద్కర్‌ అసైన్‌ మెంట్‌ ఇండి యన్‌ కామర్స్‌ అనే సిద్ధాంత గ్రం థాన్ని రచించాడు. 1916 నేషనల్‌ డిపైడిరగ్‌ ఆఫ్‌ ఇండియా ఏహిస్టరిక్‌ అండ్‌ అనేటికల్‌ స్టడీలో పీహెచ్‌డీ, 1920ండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ 1923 ప్రాబ్లమ్‌ ఆప్‌ రుపేస్‌ ఇట్స్‌ ఒరిజిన్‌ అండ్‌ స్యొూషన్స్‌ ఆర్‌ బిఐ ఏర్ప డిరది. బ్రిటిష్‌ వారు రిపోర్టు ప్రకారం రివర్‌ బ్యాంకు నెట్‌ ఏర్పడడానికి కారణం అంబేద్కర్‌. ఈదేశ కార్మిక వర్గా కొసం బ్రిటిష్‌ కాంలోనే చికాగో ఉద్యమంతో ప్రపంచ దేశాు 8 గంట పని దినము చేస్తే ఇండియాలో మాత్రమే 12నుండి 14గంట వరకు పనిచే చేసే పద్ధతి అములో ఉండేది. అంబేద్కర్‌ దానికి వ్యతిరేకంగా పోరాడి 8 గంట పనిదినం అము అయ్యెటట్టు చేసిన వ్యక్తి. బ్రిటిష్‌ కాంలో అనేక కార్మిక చట్టాను రూపొందించి, స్వాతంత్రానంతరం రాజ్యాంగంలో పొందుపరిచారు.
పాకుడిగా కాదు సేవకుడు కావాలి
అంబేద్కర్‌ తాను భారతీయుడు అనే చెప్పాడు గాని హిందూ అని ప్రకటించుకోలేదు. హిందూ మతం పేరుతో దళిత బహుజన వర్గాు మైనార్టీు వివక్షకు గురవుతున్నాయని, అకారణ వెలివేస్తున్నారని ఉద్యమా ద్వారా బహిరంగం చేశారు. నేటికి కూడా దళిత ముస్లిం బహుజనుపై దాడు చేస్తూ చంపడమే బీజేపీ పానలో ఉన్న రాష్ట్రాలో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, రాష్ట్రాల్లో దళిత ముస్లిం బడుగు బహీన వర్గా ప్రజపై నిత్యం దాడు చేయటం, వారి ప్రాణాు బలిగొనటం పరిపాటిగా వస్తోంది. నేటి యువత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ అందించిన అతిపెద్ద ఆటంబాంబు ఓటు హక్కు. దానిని నిజాయితీగా వినియోగించుకొని పాకుడిగా కాకుండా సేవకుడిగా మాత్రమే ఉండాని అంబేద్కర్‌ స్వప్నించేవారు. అంబేద్కర్‌ ఆశయాన్ని ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నిర్లక్ష్యంగా ఉంటే భావితరాు కూడా ఇబ్బందు ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్యాం నుండే ప్లికు మహనీయుత్యాగాు, విద్య ఆవశ్యకత, కష్టపడే తత్వాన్ని బోధించినప్పుడు అంబేద్కర్‌ ఆశయం నెరవేరుతుంది.

రాజ్యాంగసభను ఉద్దేశించి డాక్టర్‌. బి.ఆర్‌ అంబేద్కర్‌ మాట్లాడిన పై వాక్యాు భవిష్యత్తులో సాధించాల్సిన సామాజిక, ఆర్థిక సమానత్వం గురించి స్పష్టంగా పేర్కొంటున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో డాక్టర్‌.బి.ఆర్‌ అంబేద్కర్‌ పేర్కొన్న సామాజిక,ఆర్థిక సమానత్వం కోసం ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసి, అభివృద్ధి క్ష్యాు నిర్దేశించి, సాధించే ప్రయత్నం చేశారు. భూసంస్కరణ అము, జమీందారీ వ్యవస్థ రద్దు, కౌు విధానా సంస్కరణ, భూ పరిమితి విధానాు మొదలైన చర్యు తీసుకొని సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం కృషి చేశారు. ప్రయివేటు బ్యాంకును జాతీయం చేసి, రాజాభరణాను రద్దుచేశారు. సామాజిక, విద్యా సమానత్వ సాధనలో భాగంగానే షెడ్యూల్‌ కులాకు, షెడ్యూల్‌ తెగకు రిజర్వేషన్లు అము చేయబడ్డాయి. సుదీర్ఘ ప్రయాస అనంతరం మండల్‌ కమిషన్‌ సిఫారసు ప్రకారం ఇతర వెనకబడిన తరగతుకు రిజర్వేషన్లు అము చేయబడ్డాయి. ఏక్ష్యాలైతే రాజ్యాంగం నిర్దేశించిందో అట్టి సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం ఆయా ప్రభుత్వాు తమ శక్తి కొది ప్రయత్నించాలి. కానీ ప్రస్తుతం జరుగుతున్నదేమిటి? సామాజిక, ఆర్థిక మార్పు కోసం చేపట్టిన చర్యను కొనసాగిస్తున్నాయా? సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సదుపాయాను పటిష్ట పరుస్తున్నాయా? పేద, ధనికుకు ప్రభుత్వ, ప్రయివేటు సదుపాయాు సమానంగా అందు బాటులో ఉంచే మిశ్రమ ఆర్థిక వ్యవస్థను కొనసాగిస్తున్నాయా? సమాధానం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాజికంగా,విద్యా పరంగా వెనుకబడిన వర్గా కోసం ఏర్పాటు చేయబడిన రిజర్వేషన్లను పొమ్మనలేక పొగ పెట్టినట్టు, ఉన్న ప్రభుత్వరంగ సంస్థను ప్రయివేట్‌ పరం చేస్తూ పరోక్షంగా రిజర్వేషన్లకు మంగళం పాడుతున్నారు. నాడు ఆర్థిక అసమానతకు కారణమైన, సంపద కేంద్రీకృతానికి కారణమైన భూమిని భూసంస్కరణ ద్వారా పునర్‌ పంపిణీ చేస్తే, నేడు ప్రకృతి సంపదను కారుచౌకగా ప్రయివేటు వ్యక్తుకు ధారాదత్తం చేస్తూ, సంపద కేంద్రీకరణకు మార్గం సుగమం చేస్తూ, ఆర్థిక అసమానతు పెంచి పోషిస్తున్నారు. ఉన్న ప్రభుత్వ బ్యాంకును ప్రయివేటు పరం చేస్తూ, పేదవారికి బ్యాంకు సేవను దూరం చేస్తూ, ఆర్థిక, సామాజిక అసమానతనుకు ఆజ్యం పోస్తున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాు తమ తమ పరిధిలో సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం ప్రయత్నిస్తుంటే కర్ర పెత్తనం చేస్తున్నారు. సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం రాజ్యాంగంలో పేర్కొన్న అంశాను నిర్లక్ష్యం చేయడమో లేదా సవరణ ద్వారా మార్పు చేయడమో జరుగుతుంది. రాజ్యాంగ మౌలిక సూత్రాను మార్చే ప్రయత్నాు ప్రారంభించారు. తరతరాుగా బడుగు బహీనవర్గాను అనగదొక్కిన సంస్కృతే ఆదర్శవంతమైనదిగా ప్రచారం చేస్తూ సామాజిక, ఆర్థిక అసమానతు పెంచి పోషిస్తున్నారు. పేదవారిని నిరుపేదుగా మార్చుతూ భారత దేశాన్ని, కోటీశ్వకు బిలియనీర్లకు దోచిపెడుతున్నారు. డాక్టర్‌.బి. ఆర్‌ అంబేద్కర్‌ పేర్కొన్నట్టు సామాజిక, ఆర్థిక అసమానతు రూపుమాపడం అటుంచితే, ప్రభుత్వాు అనుసరిస్తున్న విధానా ద్వారా సామాజిక, ఆర్థిక అసమానతు మరింత పెంచి పోషించబడుతున్నాయి. ధనికు ధనికుగా, పేదు మరింత పేదుగా మారుతున్నారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ చెప్పినట్టు ఈ అసమానతు తగ్గించకపోతే, రాజ్యాంగ సభ ఎంతో కష్టపడి నిర్మించిన ఈరాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థను అసమానతతో పీడిరపబడుతున్న వర్గాు వ్యతిరేకించి, తిరస్కరిస్తాయి. ఆపరిస్థితి రాకుండా చుసు కోవసిన బాధ్యత రాజ్యాంగం ప్రకారం పాలిస్తామని ప్రమాణం చేసిన పాకుపైనే ఉన్నదని గుర్తించుకోవాలి.
(వ్యాసకర్త : దళిత ప్రగతి ఐక్య సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడు.

అల్లుకుపోతున్న అంతర్జాలం

రోజుకు సగటున ఆన్‌లైన్‌లో కుర్రకారు విహరిస్తున్న
సమయం.. 101.4 నిమిషాలు
ఒక సెకనుకు సామాజిక మీడియాలో తెరుస్తున్న ఖాతాలు.. 12
విశ్వవ్యాప్తంగా సామాజిక మీడియాలో ఖాతాలు.. 210 కోట్లు
‘ఫేస్‌బుక్’లో నడుస్తున్న ఖాతాలు.. 100 కోట్లు
‘ఫేస్‌బుక్’లో ఒక్కో ఖాతాదారుడి సగటు స్నేహితుల సంఖ్య.. 200
స్మార్ట్ఫోన్లలో ‘ఫేస్‌బుక్’ వాడుతున్నవారు.. 189 మిలియన్లు
వాట్సాప్ వినియోగదారుల
సంఖ్య.. 91 కోట్లు
‘నెటిజన్ల’లో ట్విట్టర్ వాడుతున్న
వారు.. 23 శాతం
ఇన్‌స్టాగ్రామ్‌లో ‘పంచుకున్న’
ఫొటోల సంఖ్య.. 400 కోట్లు
అతిపెద్ద ‘ప్రొఫెషనల్ నెట్‌వర్క్’గా
అవతరించిన ‘లింక్డ్‌ఇన్’ విస్తరించిన
ఏరియా.. 200 దేశాలు


… ఇవన్నీ అతిశయోక్తులు కావు, అభూత కల్పనలు అంతకన్నా కావు. కుగ్రామాల ముంగిళ్లకు సైతం ‘అంతర్జాల’ సేవలు అందుబాటులోకి రావడంతో అన్నివర్గాల వారినీ సామాజిక మీడియో సమ్మోహన పరుస్తోంది. ‘ఆన్‌లైన్’ను వినియోగించుకోవడం ఇపుడు హోదా కాదు, నిత్యావసరమై పోయింది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణులు, వృద్ధులు.. ఇలా అన్ని వర్గాల జీవనశైలిలో అనూహ్య మార్పులు అనివార్యమవుతున్నాయి. ‘కంప్యూటర్, ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్’ అన్న మాటకు కాలం చెల్లింది. స్మార్ట్ఫోన్లను వాడుతూ అరచేతిలో అంతర్జాలాన్ని వీక్షించడం ఇపుడు సర్వత్రా కనిపిస్తున్న దృశ్యం. విజ్ఞానం,వినోదం, కెరీర్, వ్యాపారం, క్రయవిక్రయాలు.. ఇలా జీవితంతో ముడిపడిఉన్న ప్రతి విషయానికీ ‘ఆన్‌లైన్’ను ఆశ్రయించడం సర్వసాధారణమైంది. మనోభావాలను పంచుకోవడం, సమకాలీన పరిస్థితులపై గళం విప్పడం, నవీన ఆవిష్కరణలకు నాంది పలకడం, సామాజిక సేవకు సంసిద్ధులు కావడం.. వీటన్నిటికీ సోషల్ మీడియా ప్రధాన వేదిక అవుతోంది. ముఖ్యంగా నేటి యువత ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుని కొత్తపుంతలు తొక్కుతోంది. ఆర్థిక పరిస్థితులు, విద్యార్హతలతో సంబంధం లేకుండా కుర్రకారు సామాజిక మీడియాతో మమేకం అవుతోంది. కాలేజీలో చదువుల సంగతేమో కానీ- సెల్‌ఫోన్ వాడని వారే లేరు. ‘టెక్స్ట్‌బుక్’ల ఊసెత్తని వారు నిత్యం ‘ఫేస్‌బుక్’తో బిజీగా కాలక్షేపం చేస్తుంటారు. వాట్సాప్, ట్విట్టర్, యూ ట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్‌ఇన్, గూగుల్ సెర్చి.. వీటిని వాడని వారు అరుదు. సోషల్ మీడియా ‘సమ్మోహన శక్తి’కి యువత ఇంతలా దాసోసం అవుతోంది. అందుకే- ‘జీవితమంటేనే సామాజిక మాధ్యమం’ అనంతలా పరిస్థితి మారిపోయింది.


కబుర్లు చెప్పుకోడానికో, కాలక్షేపానికో కాదు.. సోషల్ మీడియాతో కెరీర్‌ను మేలిమలుపు తిప్పుకున్నవారు, సొంత ఆవిష్కరణలతో అద్భుతాలు సృష్టిస్తున్నా వారూ ఉన్నారు. ‘ఉద్యోగాలను వదిలేస్తాం.. సొంత వ్యాపారాలతో సత్తా చూపుతాం’ అంటూ సంకల్పబలంతో గెలుపుతీరాలకు చేరినవారూ ఉన్నారు. ఇ-కామర్స్ వెబ్‌సైట్లతో, స్టార్టప్‌లతో తాము ఆర్థికంగా ఎదుగుతూ, ఇతరులకు ఉపాధి చూపుతున్న వారూ ఉన్నారు. అనుకూల వాతావరణం తోడవడంతో ‘అంకుర పరిశ్రమల’ను (స్టార్టప్స్) ప్రారంభించేందుకు యువతలో ఉత్సాహం ఉరకలేస్తోంది. అరకొర వసతుల మధ్య ప్రారంభమైన స్టార్టప్‌లు అనతికాలంలోనే కోట్లకు పడగెత్తుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్, బిగ్ బాస్టెట్, ఓలా క్యాబ్స్, పేటీఎమ్.. వంటి స్టార్టప్‌లు అద్భుత విజయాలను సాధించి యువతలో కొత్త ఆశలను చిగురింపజేశాయి.


‘నెట్’లో పడితే జాగ్రత్త..!
ఔను. రోజులు మారిపోయాయి. ‘అంతర్జాలం’లో చిక్కుకుని మనిషి తననితాను మర్చిపోతున్నాడు. ‘నెట్’ను మరిచిపోతే జీవితం నరకప్రాయమవుతుందని భయపడుతున్నాడు. ఇంటర్‌నెట్‌ను వదలలేక, వదలకుండా ఉండలేక ఆన్‌లైన్ జీవితానికి అలవాటుపడిపోతున్నాడు. జీవితంలో మనిషి చేయాల్సిన పనుల్లో చాలామటుకు కంటి ఎదుట కంప్యూటర్ లేదా ఓ స్మార్ట్ఫోన్ పెట్టుకుని, మీటనొక్కి కానిచ్చేస్తున్నాడు. ఆటలు, పాటలు, సినిమాలు, చిందులు ఒక్కటేమిటి సరదా జీవితమైనా, సీరియస్ పనీపాటా అయినా మీటింగులైనా, డేటింగులైనా ‘టింగురంగా’ అంటూ మీటలపైనే మీటవుతున్నారు. కావలసిన వస్తువుల ఖరీదు చేయడమూ, అమ్ముకోవడమూ ఆన్‌లైన్‌లోనే. ఆధునిక జీవితానికి ఇంటర్నెట్ ఓ సాధనమైపోయింది. తప్పనిసరిగా దానిపై ఆధారపడేలా చేసేస్తోంది. సంప్రదాయ జీవనవిధానాన్ని మెచ్చుకునేవారూ దీనిపై ఆధారపడక తప్పడం లేదు. లేదంటే దూసుకువెళుతున్న ఈ విశ్వప్రపంచంలో మనం అంతేవేగంగా వెనకబడతాం. మానవసంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తున్న ఈ కంప్యూటర్ యుగంలో ఇప్పుడు ఆన్‌లైన్ శకం నడుస్తోంది. ముఖ్యంగా గడచిన ఏడాది (2015) ఈ ఆన్‌లైన్ మార్కెట్‌లో అనూహ్య, అప్రతిహత ప్రగతి సాకారమైంది. కొత్తసంవత్సరంలో సరికొత్త మార్కెట్‌ను సృష్టించబోతోంది. ఇంటర్నెట్ ఆధారంగా విశ్వరూపం ప్రదర్శిస్తున్న సామాజిక మాధ్యమాలు, వాటి పోకడపై మన జీవనవిధానం ఆధారపడి ఉంటుంది. ఈ విషయం ఇప్పటికే రూఢీ అయింది. ఇక కొత్తసంవత్సరంలో ఆ అధునాతన వేదికలపై మనం ఏ చేయచ్చో, ఏం చేయబోతున్నామో తెలుసుకోవడం తప్పనిసరి.


వేషభాషలు మారిపోతున్నాయ్…
ఆధునిక జీవితంలో మనిషి పోకడ పూర్తిగా మారిపోయింది. హావభావ విన్యాసాలనుంచి జీవనశైలిలో వినూత్న, వింతైన ధోరణి కన్పిస్తోంది. మొబైల్‌ఫోన్లు, స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లతో కాలక్షేపాలు ఎక్కువైపోయాయి. మనిషి మాట మరిచి మీటపై ప్రేమ పెంచుకున్నాడు. మాటామంతీ కరువైపోయింది. అప్పుడప్పుడు మాట్లాడినా ఆ భాషలోనూ కొత్తకొత్త పదాలు చేరిపోతున్నాయి. కొత్త సాంకేతిక పరిభాషను పాతతరం వారూ ప్రేమిస్తున్నారు. అలాగని ద్వేషిస్తున్న వారూ లేకపోలేదు. ‘లైకులట..కామెంట్లట, షేరింగ్ అట.. ఒకడు ఎఫ్‌బి అంటాడు. మరొకరు వాట్సాప్ అంటాడు. ఇంకొకరు ట్విట్టర్ అంటారు. రీట్వీట్ అట.. ఏమిటీ గోలంతా.. నలుగురం కలిసి మనసువిప్పి మాట్లాడుకోవటం అన్నది లేకుండా పోయింది. ఇదేం జీవితం.’ అని విసుక్కునే వారి వేదనలో కొంత నిజం ఉంది. నిత్యం ఆ ‘నెట్’లో మునిగిపోతే బయటపడటం అంత తేలిక కాదు. ఆరోగ్యమూ దెబ్బతింటుంది. ‘అదేదో టాబ్లెట్ అట. ఆ మాట వింటే భయపడి చచ్చాను. ఏం రోగమని దాన్ని వాడాలన్నారో తెలీలేదు. తీరా చూస్తే అదీ ఓ యంత్రమే. బాగుంది వరస..’ అనే వారూ ఎక్కువే. ఆధునిక సాంకేతిక పరికరాలూ, వాటి పేర్లూ కొత్తతరానికి వింతగానూ, పాతతరానికి రోతగానూ అన్పిస్తే అన్పించవచ్చు. కానీ, ఇష్టాయిష్టాలతో పనిలేకుండా వాటిని వాడుకోవలసిన పరిస్థితులు ఎదురౌతున్నాయి. అవసరం లేకపోయినా వాడుకోవడం తప్పంటూ తప్పుపట్టే తరాన్ని నవతరం పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకూ ఈ ఇంటర్నెట్, దాని ఆధారంగా ప్రపంచాన్ని శాసిస్తున్న ఇతర మాధ్యమాలూ, సదుపాయాలూ కొత్త సంవత్సరంలో ఎలాంటి మార్పులకు లోనవుతాయో, మన జీవితాలను ఎలా మారుస్తాయో అంచనావేయడం తక్షణ కర్తవ్యం. ఈ కొత్తజీవితాన్ని స్వాగతిస్తారా…విసుక్కుంటూ అలవాటుపడతారా అన్నది వేరే విషయం. కానీ ఏం జరగబోతోందో తెలుసుకోకతప్పదు.


ఇంటర్నెట్
కంప్యూటర్ లేదా స్మార్ట్ఫోన్ ఉన్నవారికి ఇంటర్నెట్ ఉండటం నేడు పరిపాటైపోయింది. దీనిద్వారా దేనికి సంబంధించిన సమాచారమైనా క్షణాల్లో తెలిసిపోతుంది. ఆ సమాచారాన్ని తెలుసుకోవడానికి, ఇచ్చిపుచ్చుకోవడానికి ఎన్నోమార్గాలున్నాయి. ప్రపంచంలో అత్యధిక ఇంటర్నెట్ వినియోగదారులున్న దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది. మనదేశం ఇప్పుడు రెండోస్థానంలో ఉంది. 2014 డిసెంబర్ నాటికే మనదేశంలో 30.2కోట్లమంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నవారుంటే 2015 జూన్ నాటికి ఈసంఖ్య 35.4కోట్లకు పెరిగింది. ఇది అమెరికా జనాభాతో సమానం. 2017 నాటికి ఈ సంఖ్య 40కోట్లకు చేరుతుందని అంచనా. ఇక ఇంటర్నెట్‌ను కంప్యూటర్ ద్వారా (డెస్క్‌టాప్) వినియోగిస్తున్నవారికంటే మొబైల్, స్మార్ట్ఫోన్ల ద్వారా వినియోగిస్తున్న వారే అధికం. భారత్‌లో 35.2కోట్లమంది ఇంటర్నెట్ వినియోగదార్లుంటే వారిలో 15.9 కోట్లమంది మొబైల్‌ఫోన్లద్వారా నెట్‌ను వాడుతున్నవారే ఉన్నారు. ఆ సంఖ్య డిసెంబర్ 2015నాటికి 21.3కోట్లకు పెరిగిందంటే ఫోన్ ద్వారా నెట్ వినియోగానికి ఎంత ప్రాధాన్యం లభించిందో అర్థమవుతుంది. వచ్చే రెండేళ్లలో ఈ సంఖ్య 31.4 కోట్లకు పెరుగుతుందని ‘అసోచామ్’ అంచనావేస్తోంది. ఇప్పుడు పట్టణాల్లో విస్తృతంగానూ, పల్లెల్లో ఒకమోస్తరుగాను ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. మున్ముందు పల్లెపల్లెకు ఇంటర్నెట్ సౌకర్యం అందించాలన్న ప్రభుత్వ ఆలోచనకు సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థలు ముందుకొస్తున్నాయి. కొత్త సంవత్సరంలో మరిన్ని ఆవిష్కరణలు వచ్చి భారతావని ఇంటర్నెట్ సామ్రాజ్ఞిగా మార్చేసే అవకాశం ఉంది.


గూగుల్ ముందంజ
ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ సంస్థ గూగుల్‌కు కొత్త సంవత్సరం బాగానే ఉంటుంది. ఇంటర్నెట్ సెర్చ్ ట్రాఫిక్‌లో 64.9 శాతం మార్కెట్‌ను గూగుల్ సొంతం చేసుకుంది. యాహు, బింగ్ వంటివి గూగుల్‌కు దరిదాపుల్లో లేవు.


ఫేస్‌బుక్
కబుర్లు, మాటామంతీ, వ్యాఖ్యలు, వీడియో, ఫొటో షేరింగ్, చాటింగ్‌కు వీలుగా జనం చేతిలో వేదికగా మారిపోయిన ఫేస్‌బుక్ మున్ముందు సరికొత్త సౌలభ్యాలను అందించనుంది. ఇంటర్నెట్ వినియోగిస్తున్నవారిలో 56శాతంమంది విధిగా ఫేస్‌బుక్‌ను వాడుతున్నారు. డిసెంబర్ -2014 నాటికి ఫేస్‌బుక్ వినియోగదారుల సంఖ్య 11.8 కోట్లమంది అయితే గత ఏడాది డిసెంబర్ 2015నాటికి ఈ సంఖ్య 13.2కోట్లకు చేరింది. సోషల్ నెట్‌వర్క్ వినియోగంలో 54.4 శాతంతో ఫేస్‌బుక్ ఈ ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. కొత్త సంవత్సరంలోనూ ఇదే పోకడ ఉంటుంది. కొత్త ప్రాంతాల్లో, ముఖ్యంకా చైనాలో ఫేస్‌బుక్ కొత్త మార్కెట్‌ను సృష్టించుకునే అవకాశాలున్నాయి.


వాట్సాప్
భారత్‌లో ఇప్పుడు వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నవారి సంఖ్య అక్షరాలా 90కోట్లు. టెక్స్ట్, ఫొటో షేరింగ్ యాప్‌ను చిన్నాపెద్దా నిరంతరం ఉపయోగిస్తున్నారు. ఈ విషయంలో మిగతా సామాజిక మాధ్యమాలు చిన్నబోతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ అందుబాటులోకి వచ్చాక స్మార్ట్ఫోన్లు బిజీ అయిపోయాయి. స్నాప్‌చాట్, వియ్‌చాట్, లైన్ వంటి ఇతర ఫొటోషేరింగ్ యాప్‌లు పోటీలో ఉన్నప్పటికీ అది పెద్దగా లెక్కలోకి తీసుకోవడం లేదు. వాట్సాప్ ఇప్పుడు కేవలం, మెసేజింగ్, ఫొటో షేరింగ్, చాటింగ్‌కే పరిమితమైంది. మున్ముందు వీడియో ఛాటింగ్ అవకాశంకూడా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. అదే జరిగితే ప్రభంజనమే. ఇప్పటికే అనేక సేవలు, చాలావరకు ఉచితంగా అందిస్తున్న యాప్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఆన్‌లైన్ మార్కెట్ సంస్థలు యాప్‌ల వల్ల ఇబ్బడిముబ్బడిగా వ్యాపారాన్ని పుంజుకుంటున్నాయి. ఏ సమాచారాన్నైనా, సేవలనైనా యాప్స్‌ద్వారా చాలావరకు ఉచితంగా పొందే అవకాశాన్ని అందించి తద్వారా వ్యాపారాన్ని వృద్ధిచేసేలా కొత్తరకం యాప్‌లను రూపొందిస్తున్నాయి.


యూ ట్యూబ్
వీడియోషేరింగ్ అవకాశం ఉన్న ఈ మాధ్యమానికి ఆదరణ ఉన్నప్పటికీ ఫేస్‌బుక్ కన్నా వెనుకబడే ఉంది. నిజానికి మనదేశంలో 7 నుంచి 13 సంవత్సరాల లోపు పిల్లలు సైతం యూ ట్యూబ్ వినియోగంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా సంగీతం, గేమింగ్, జంతువులకు సంబంధించిన దృశ్యాలను వీరు వీక్షిస్తున్నారు. యూ ట్యూబ్ ఖాతా తెరవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. కానీ, ఈ జనరేషన్ పట్టించుకోవడం లేదు. వివిధ వెబ్‌సైట్లలో వీడియో యాడ్స్ ఇప్పుడు ఎక్కువయ్యాయి. యూ ట్యూబ్ సహాయంతో వీడియోయాడ్ మార్కెట్ మున్ముందు మరింత విస్తృతం కానుంది. బింగ్, యూట్యూబ్ వంటి సంస్థలు ఇప్పటికే వీడియోయాడ్ ప్యాకేజీలు ప్రకటించాయి. వాటికి మంచి స్పందనకూడా లభిస్తోంది. గూగుల్‌కూడా ఇప్పుడు ‘ఇన్-సెర్ప్’ వీడియో అడ్వర్టయిజింగ్ విధానాన్ని తీసుకొస్తున్నది.


ఇన్‌స్టాగ్రామ్
ఈ ఫొటోషేరింగ్ యాప్‌ను వినియోగిస్తున్నవారి సంఖ్య మనదేశంలో 40 కోట్లు. రోజుకు 80 మిలియన్ ఫొటోలను వీరు ఒకరికొకరు పంపించుకుంటున్నారు. ట్విట్టర్ కన్నా దీని వినియోగదారులే ఎక్కువ. మున్ముందు ఈ యాప్ మరికొన్ని సౌకర్యాలు కల్పించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఆదాయాన్ని, మార్కెట్‌ను పెంచుకున్న ఈ సంస్థ సరికొత్త ప్రయోగాలకు వేదికకాబోతోంది.


ట్విట్టర్
ప్రపంచ ఇంటర్నెట్ మార్కెట్‌లో 17శాతంమంది వినియోగదారులు ట్విట్టర్ ఖాతాలను నిర్వహిస్తున్నారు. ఎక్కువమంది ట్విట్టర్‌ను ఉపయోగిస్తున్నవారితో జపాన్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ 2.6 కోట్లమంది నెట్ వినియోగదారులు దీనిని ఉపయోగిస్తున్నారు. 2.2 కోట్లమందితో భారత్ రెండోస్థానంలో ఉంది. మనదేశంలో గతేడాది 1.7 కోట్లమంది ట్విట్టర్ వినియోగదారులుంటే డిసెంబర్-15నాటికి 2.2కోట్లకు ఆ సంఖ్య పెరిగింది. మరో మూడేళ్లలో 16కోట్లమంది ట్విట్టర్ ఖాతాదారులుంటారని అసోచామ్ అంచనావేసింది. గతేడాది ట్విట్టర్‌కు పెద్దగా కలిసివచ్చిందేమీలేదు. వినియోగదారుల సంఖ్య పెరిగిందికానీ ఆదాయంలో గణనీయమైన మార్పు లేదు. కొత్త ఫీచర్లు ప్రవేశపెడితే దశ తిరగవచ్చు. కొత్త ఎమోజీ టూల్స్, అభివృద్ధి చేసిన ‘ఎంగేజ్‌మెంట్ ఆప్షన్స్’ తీసుకొస్తే మంచిరోజులే. ట్విట్టర్‌ను ఈ ఏడాది గూగుల్ కొనుగోలు చేస్తుందని, గూగుల్ ప్లస్‌కు బదులు దీనిని ప్రమోట్ చేస్తుందన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి.


ఏటేటా ఎంతో వృద్ధి..
అంతర్జాల వినియోగం, అంకుర పరిశ్రమల (స్టార్టప్స్) ఆవిర్భావం, సామాజిక మీడియా జోరు, ఇ-కామర్స్‌లో క్రయవిక్రయాలు వంటి విషయాల్లో 2015 సంవత్సరానికి సంబంధించి మన దేశంలో అనూహ్య మార్పులు చోటు చేసుకోగా, కొత్త సంవత్సరంలో వీటి వృద్ధి మరింత అధికం కాబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలపడేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పరిణామాలన్నింటికీ ‘అంతర్జాలం’ కేంద్ర బిందువుగా కనిపిస్తోంది. మన దేశంలో అంతర్జాల వినియోగం 2014లో కంటే 2015లో దాదాపు 49 శాతం వృద్ధి చెందింది. ‘నెట్’ వినియోగదారుల్లో 60 శాతం మంది మొబైల్ ఫోన్ల ద్వారానే ఈ సేవలు పొందుతున్నారు. 2015 అంతానికి ‘నెటిజన్ల’ సంఖ్య 213 మిలియన్లు దాటుతుందని అంచనా వేసి, అందుకు తగ్గట్టుగా టెలికామ్ నెట్‌వర్క్‌ను కేంద్ర ప్రభుత్వం విస్తరింపజేసింది. మన దేశంలో కళాశాల విద్యార్థులు రోజుకు కనీసం 8 గంటలు, వివిధ వృత్తుల్లో ఉన్నవారు 5 నుంచి 8 గంటల సేపు, పాఠశాల విద్యార్థులు వారాంతపు సెలవుల్లో 3-4 గంటలు ‘అంతర్జాలం’తో గడుపుతున్నారు. ఇంటాబయటా ‘నెట్’ వినియోగం పెరగడంతో కార్యాలయాల్లోనే కాదు, పార్కులు, పర్యాటక కేంద్రాల్లో, బస్సుల్లో, రైళ్లలో ‘వైఫై’ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తమ వద్ద వసతి పొందేవారికి ‘ఉచిత వైఫై సౌకర్యం’ అంటూ హోటళ్లు, ఉమెన్స్ హాస్టళ్లు ప్రచారం చేస్తున్నాయంటే ‘నెట్’ వాడకం ఎంతగా అనివార్యమైందో ఊహించవచ్చు. ‘నెట్’ సౌకర్యం కల్పించే టెలికామ్ సంస్థలు కూడా ఎప్పటికప్పుడు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రైవేటు సంస్థల మధ్య పోటీ పెరగడంతో వినియోగదారులన్ని తమ వలలో వేసుకునేందుకు ప్యాకేజీల ఆఫర్లు, రాయితీల తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇవాళ ‘కొత్త’ అనుకుంటున్నది రేపటికి ‘పాత’ అయిపోతోంది. వేగవంతమైన ‘నెట్’ సేవలు అందించేందుకు 2జి,3జి, 4జి.. ఇలా ఎప్పుడు ఏ ‘ప్రోడక్టు’ మార్కెట్‌లో రంగ ప్రవేశం చేస్తుందో, ఏది ఎంత తొందరగా అదృశ్యమవుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఆకట్టుకునే ప్రకటనలతో వినియోదారులను మెప్పించడానికి ‘ప్రచార యుద్ధం’ జోరుగానే సాగుతోంది. విజ్ఞానం, వినోదంతో పాటు పలురకాల సేవలందించేందుకు విభిన్న ‘యాప్స్’ రంగప్రవేశం చేస్తున్నప్పటికీ గూగుల్, ఫైర్‌ఫాక్స్, ఒపెరా వంటి బ్రౌజర్ల హవా మాత్రం ఇంకా కొనసాగుతోంది. ‘నెటిజన్ల’ సంఖ్యతో పాటు వారి ఆకాంక్షలు, అవసరాలు అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో కొత్త ఏడాదిలో స్టార్టప్స్, ఇ-కామర్స్, సోషల్ మీడియా వృద్ధి భారీగానే ఉంటుందన్న అంచనాలు ఊపందుకుంటున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విస్తృత వినియోగంలోకి వచ్చాక అత్యధిక జనాభా ఉన్న భారత్ ఐటీ సంస్థలకు కల్పతరువుగా కన్పిస్తోంది. ప్రభుత్వాల ప్రాధామ్యాలు కూడా వాటికి అనుకూలంగానే ఉన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్‌వంటి సంస్థలు ధారాళంగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఫలితంగా భారత్‌లో మేలిమార్పులు తప్పవు. కొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాక వాటి వినియోగంలో విచక్షణ పాటిస్తే అద్భుతాలు జరుగుతాయి. విపరీతపోకడలకు పోయి దుర్వినియోగం చేస్తే మిగిలేది అనర్థమే.

జీవితంలో చాలా మార్పులు
ఇప్పుడు కరోనా కాలంలో ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో పిల్లల చదువు లు కూడా అంతర్జాలంలోనే సాగుతున్నాయి. అరచేతిలో అంతర్జా లంతో ప్రపంచం కుగ్రామమైంది. అదే సమయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మన జీవితంలో విషాదం చోటు చేసుకోక మానదు. అంతర్జాలం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూ టర్లను కలిపే వ్యవస్థ. అన్ని కంప్యూటర్లకు అందుబాటులో ఉండే కమ్యూనికేషన్‌ టెక్నాలజీ సాధనమే ఇంటర్నెట్‌.

వ్యక్తుల, సంస్థల నుండి ప్రభుత్వపరిపాలన దాకా అంతర్జాలంలోనే సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వేలాది టివి ఛానళ్లు, వార్తా పత్రికలు, అలాగే విద్యార్థుల చదువ్ఞలు, ఫలితాలు, కౌన్సిలింగ్‌, మీసేవా లాంటి సేవలన్నింటిని అంతర్జాలంలో సంబంధం లేకుండా ఊహించలేం. అపరిమిత డేటా ఆఫర్లు వచ్చాక మొబైల్‌ ఇంటర్నెట్‌ వాడకం పెరిగింది. అదే సమయంలో గుర్తింపు, భద్రత లేని యాప్స్‌ ద్వారా మొబైల్‌ యూజర్ల డేటా లీక్‌ అవ్ఞతోంది. ‘మీరు వాడే ప్రోడక్ట్స్‌కు డబ్బులు చెల్లించకపోతే మీరే ప్రొడక్ట్‌ అవుతారు.

అంటే ఏదైనా ఉచితంగా ఉపయోగించాలని చూస్తే మనమే ప్రొడక్ట్స్‌గా మారాల్సి ఉంటుంది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ లాంటి సోషల్‌ మీడియా యాప్‌ లను మనం దాదాపు ఉచితంగానే ఉపయోగిస్తున్నాం. మరి ఇవి నిజంగానే ఉచితంగా సేవలు అందిస్తున్నాయా? అనే ప్రశ్నకు కాదనే సమాధానం వస్తుంది. మన వ్యక్తిగత సమాచారాన్ని అమ్ముకుంటూ ఈ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లు డబ్బులు సంపాదిస్తుంటాయి. భారత్‌లో వాట్సాప్‌కు సుమారు 40 కోట్ల మంది వినియోగదారులు ఉన్నట్లు జర్మనీ డేటా సంస్థ స్టాటిస్టా చెబుతోంది. ఈ దరిమిలా ఇటీవల వాట్సాప్‌ కొత్త ప్రైవసీ విధానం వివాదానికి తెరలేపింది.

భారత్‌తోపాటు ఐరోపాయేతర దేశాల్లో తమ ప్రైవసీ పాలసీలో వాట్సాప్‌ మార్పులు చేసింది. దీనితో వాట్సాప్‌ తమ ఖాతాదారుల సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో పంచుకొని సొమ్ము చేసుకోవాలనే కుయుక్తికి తెర లేపిందని సైబర్‌నిపుణుల అభిప్రాయం. ఈ పాలసీ వినియోగదారులను సమస్యల సుడిగుండంలోకి లాగుతుందని సైబర్‌ చట్టాల నిపు ణుడు ‘వాట్సాప్‌ లా పుస్తక రచయిత వ్యాఖ్యానించారు. భారతీయుల వ్యక్తిగత గోప్యతా హక్కులతోపాటు భారతీయ చట్టాలను సైతం ఈ కొత్త పాలసీ ఉల్లంఘిస్తోందని ఆయన వివ రించారు.ప్రస్తుతం సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసుల నకిలీ మీడియా ఖాతాలు సృష్టించి వసూళ్లకు పాల్పడుతున్నారు.

నకిలీ ఫోన్‌ నెంబర్లను ఉపయోగించి గిఫ్ట్స్‌ ఆఫర్ల పేరుతో మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. వీరు ఎక్కువగా హర్యానా, ఢిల్లీ, కోల్‌కతాలో నకిలీ డాక్యుమెంట్లు పెట్టి సిమ్‌కార్డులు తీసుకొని ఓఎల్‌ఎక్స్‌లో సరసమైన ధరలకు వాహనాలు, ఫోన్లు, ఇతరత్రా వస్తువ్ఞలు ఇస్తామంటూ డబ్బులు పంపించాలని ఫోన్లు చేస్తుంటారు. తీరా ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు పంపించాక ఫోన్‌ ఆఫ్‌ చేస్తారు. రాజస్థాన్‌కు చెందిన ఓ ముఠా ఈ విధమైన మోసాల్లో ఏకంగా ఆర్మీ అధికారుల ఫొటోలు, పేర్లను ఉపయో గిస్తుంది. మొత్తం 18 రాష్ట్రాలలో ఈ ముఠా సభ్యులు మోసా లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆరు నెలల్లోనే ఈ తరహా నేరాలు నాలుగురెట్లు పెరిగాయని పోలీసులు వెల్లడించారు.

‘మీకు కోట్ల విలువైన బహుమతి వచ్చింది. పదివేలు పంపితే మీఇంటికి చేరుతుంది. మేము మీ బ్యాంకు నుండి మాట్లాడుతున్నాం మీ ఆన్‌లైన్‌ ఖాతాలను సరిచేస్తున్నాం, ఓటిపి చెప్పండి. అని నిన్నమొన్నటి వరకు హర్యానా, రాజ స్థాన్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సైబర్‌నేరగాళ్లు దోపిడీలకు పాల్పడే వారు. ఇప్పుడు పంథా మార్చి అందమైన అమ్మాయిలతో హనీట్రాప్‌ చేయిస్తున్నారు. అంతర్జాలంలో అనవసర విషయాల పట్ల మన అమూల్యమైన సమయం వృధా అవుతుంది. కావున మంచి, అవసరమైన విషయాల కోసం మాత్రమే అంతర్జాలాన్ని ఉపయో గించాలి. మీ ఖాతా కోసం పాస్‌ వర్డ్‌ను సృష్టించేటప్పుడు పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు, చిహ్నాలు, అంకెల మిశ్రమాన్ని ఉపయోగించాలని నిర్దారించుకోండి. గుర్తుంచుకోవడం కష్టమైనా అది మీ డేటాను రక్షిస్తుంది.

నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాం కింగ్‌, మొబైల్స్‌, సోషల్‌ మీడియాలకు ఒకే పాస్‌ వర్డును వాడకుండా చూసుకోవాలి. మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్స్‌ వాడే ఫోన్‌లో గేమ్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోకపోవడం మంచిది. ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేటప్పుడు లేదా మీ ఆన్‌లైన్‌ బ్యాంకుఖాతాకు లాగిన్‌ అయినప్పుడు యుఆర్‌ఎల్‌కు బదులుగా హెచ్‌టిటిపితో ప్రారంభమవేతుందని గమనించండి.శాస్త్ర సాంకే తిక విజ్ఞ్ఞానాన్ని సరైనరీతిలో ఉపయోగించడం వల్ల గణనీయ మైన అభివృద్ధిచోటు చేసుకుంటుంది.కాని దానిని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించినప్పుడే అనర్థాలకు దారి తీస్తుంది.
-మధురిమ/గుండు కరుణాకర్

నిత్య నూతన ప్రవాహం.. అంబేడ్కర్‌ సిద్ధాంతం

(డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా..)

‘’1950, జనవరి 26న మనం వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించ బోతున్నాం. రాజకీయాలలో ఒక వ్యక్తి- ఒక ఓటు, ఒక ఓటు- ఒక విలువ అన్న రాజకీయ సమానత్వాన్ని గుర్తించబోతున్నాం. అయితే సామాజిక, ఆర్థిక జీవితంలో మనకున్న సామాజిక, ఆర్ధిక వ్యవస్థ వల్ల ఒక వ్యక్తి – ఒక విలువ అన్న సూత్రాన్ని తిరస్కరిస్తూనే ఉంటాం. వైరుధ్యాలతో కూడిన ఈ జీవితాన్ని ఎంత కాలం భరిస్తూ వద్దాం? ఎంత కాలం మన సామాజిక, ఆర్థిక జీవితాల్లో సమానత్వాన్ని సాధించకుండా ఉందాం? ఇలా ఎక్కువ కాలం కొనసాగనిస్తే మన రాజకీయ ప్రజాస్వామ్యమే ముప్పునకు లోనవుతుంది. ఈ వైరుధ్యాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి, లేకపోతే అసమానత్వంతో పీడిరపబడుతున్న వాళ్ళు ఈ రాజ్యాంగ సభ కష్టపడి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామిక వ్యవస్థను కుప్పకూలుస్తారు.’’

సమకాలీనరాజకీయాల్లో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ ప్రస్తావన అత్యంత ప్రాధాన్యతను సంత రించుకుంది. వర్తమాన పరిస్థితులకు తగ్గట్టుగా అంబేడ్కర్‌ అభిప్రాయాలను అన్వయించుకోవడం, ఆ వెలుగులో ప్రస్తుత సమస్యలను పరిశీలించడం, వాటి పరిష్కారానికి అంబేడ్కర్‌ నిర్దేశించిన మార్గ దర్శనాలను అనుసరించడం అనివార్యంగా మా రింది. గతంలో అంబేడ్కర్‌ను పూర్తిగా తిరస్కరిం చిన రాజకీయాలు,సంస్థలు,పార్టీలునేడు అంబేడ్కర్‌ను విస్మరించే పరిస్థితులు లేవంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. భారత రాజకీయ వ్యవస్థలో అటు విప్లవ కమ్యూనిస్టుల నుంచి ఇటు పూర్తిగా మితవాద,సనాతన వాద పార్టీల వరకు అంబేడ్కర్‌ వాదం, సామాజిక మార్పుకి ఆయన యిచ్చిన నినాదం ఒక ఎజెండాగా మారిపోయింది. ఈ ఏప్రిల్‌ 14 నుంచి డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ 128వ జయంతి ఉత్స వాలు ప్రారంభం అవుతున్నాయి. అందుకే ఒకసారి డాక్టర్‌.బి.ఆర్‌.అంబేడ్కర్‌ సిద్ధాంతాలు, అభిప్రా యాలు సమాజంపైన ముఖ్యంగా భారత రాజకీ యాల పైన ఎటువంటి ప్రభావాన్ని కలిగించాయో పరిశీలించాల్సి ఉంది. నేడు దాదాపు అన్ని పార్టీలు అంబేడ్కర్‌ కృషి గురించి, ఆయన సైద్ధాంతిక ప్రాధాన్యతను గురించి మాట్లాడుతున్నాయి. అసలు అంబేడ్కర్‌ ఊసే ఎత్తని కొన్నిపార్టీలు ప్రత్యక్షంగానూ, మరికొన్ని పార్టీలు తమ అనుబంధ సంఘాలతో అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. మావో యిస్టు పార్టీలతో సహా అన్ని కమ్యూనిస్టు పార్టీలు తమ కార్యక్రమంలో దళిత సమస్యను ప్రస్తావించి దాని పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించు కున్నాయి. కుల సమస్యను తమ ఎజెండాలో చేర్చు కునే పరిస్థితికి ఆయా పార్టీలు నెట్టబడ్డాయి. భూమి సమస్యకోసం పోరాటంలో భాగంగా దళితులను, ఆదివాసులను సమీకరించాలని, కులనిర్మూలన కోసం కృషి జరగాలని, కుల నిర్మూలన జరిగేంత వరకు రిజర్వేషన్లలాంటి ప్రత్యేక సౌకర్యాలు అమలు కావాలని వాళ్ల పార్టీ కార్యక్రమంలో పేర్కొన్నారు. దతాగునీటికి, దేవాలయానికి,శ్మశానానికి అందరికీఒకేస్థలం ఉండాలని పిలుపునిచ్చారు. దేశం ఐక్యంగా ఉండాలంటే ఇది అత్యవసరమని ప్రకటించారు. అయితే ఈ మార్పులు గత రెండున్నర దశాబ్దాల దళిత ఉద్యమాల ఫలితమేనని చెప్పుకోవాలి. సమకాలీన సమస్యల పరిష్కారానికి మార్గనిర్దేశనం చేస్తోన్న అంబేడ్కర్‌ సిద్ధాంతబలం కూడా అందుకు దోహదం చేసింది. గతపాతిక సంవత్సరాల్లో అంబేడ్కర్‌ రచనలు ప్రజలకు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా భిన్నరాజకీయాలు కలిగిన సంస్థలు, వ్యక్తులు జరిపిన పరిశోధనలు, సాగిన చర్చలు అంబేడ్కర్‌ను ఒకశక్తిగా నిలబెట్టాయి. అంబే డ్కర్‌ సిద్ధాంతాలపై ఎంత లోతైనచర్చ జరిగితే అది తరతరాల వివక్షనెదిరించేందుకు అంత శక్తిమంతంగా ఉపయోగపడుతుందనడానికి గత 28ఏళ్ళ చరిత్రసాక్ష్యంగా నిలుస్తోంది.
బడుగు బలహీనవర్గాలకు వెలుగురేఖ
ఈ దేశంలో ప్రజాస్వామిక విప్లవానికి సిద్ధాంతం ఆచరణ బీజాలు నాటి ముక్కల్ని పెంచిన తత్వవేత్త ఆచరణ కర్త. భారతదేశం ఆర్థిక అభివృ ద్ధికి ఆర్థిక నమూనా సిద్ధాంతాన్ని అందించిన ఆర్థిక వేత్త. ఈదేశంలో అసమానతలకు మూలమైన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను దాని నిర్మించిన బ్రాహ్మణిజాన్ని మనువాద నిర్మూలనకు సామాజిక సమానత్వం పై ఉద్యమించిన సామాజిక ఉద్యమ నేత. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 1891ఏప్రిల్‌14వ తేదీన రాంజీ భీమాబాయి దంపతులకు జన్మించాడు. తల్లిదం డ్రులు అతనికి పెట్టిన పేరు భీమ్‌రావు గ్రామ నామాన్ని బట్టి స్కూల్లో అతని ఇంటి పేరు అంబా వదేవకర్‌. తర్వాత ఇతనిని అమితంగా అభిమా నించే ఒక ఉపాధ్యాయుడు ఆపేరును తన ఇంటి పేరు మీదుగా అంబేద్కర్‌ గా మార్పించాడు. ఆ పేరుతో అంబేద్కర్‌ ప్రసిద్ధుడైనాడు. రాంజీ పూర్వి కులు కొంకణ ప్రాంతానికి చెందిన వారు. రత్నగిరి జిల్లాలోని మంజన్‌ గడ్‌కు ఐదు మైళ్ళ దూరంలో ఉన్న అంబావదే రాంజీ వంశీయులు స్వగ్రామం వీరికి ఆగ్రామంలో ఒక ప్రత్యేక గౌరవం ఉండేది. ప్రతిఏటాజరిగే గ్రామదేవత ఉత్సవాలకు ఉప యోగించే పల్లకీ వీరి ఇంట్లోనే ఉంచే వారు. అంబే ద్కర్‌ తాతగారైన మాలోజీ సక్‌పాల్‌మహర్‌ కులానికి చెందినవాడు. నిమ్న జాతి కులాలన్నింటిలొనూ మహర్లు కొంతసాహసవంతులు గాను బుద్ధి బలం, ఉత్సహంకలవారుగాను కనిపిస్తారు. సమాజంలో తమకున్న నీచస్థితిని హైన్యాన్ని వారెన్నడు మరు వలేదు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైన్యాన్ని ఏర్పాటు చేసిన కొత్తలో తొలుత అందులో చేరినవారు మహార్లు మాలొజీ సక్‌ పాల్‌ మిలిటరీ లో పనిచేసి పదవీ విరమణ చేశారు. అతని సంతానంలో బతికి బట్టకట్టిన ఇద్దరే కొడుకు రాంజీ, కూతురు మీరా. వీరి కుటుంబం కబీర్‌ భక్తి సంప్రదాయాన్ని విశ్వసించేవారు. భక్తిసాంప్రదాయం ప్రవక్తలు కుల భేదాలను పాటించలేదు,ఒప్పుకొనలేదు. రాంజీ సక్‌పాల్‌కు 14మందిసంతానం. వారిలో అంబేద్కర్‌ 14వ వారు. మహాపురుషుల జన్మ వృత్తాంతాలలో కొన్ని అద్భుత సంఘటనలు ముడిపడి ఉండటం సాధారణంగా లోకంలో చూస్తున్నాదే. గౌతమ బుద్ధుడు తల్లి గర్భంలో ఉండగా ఆమెకు వింత స్వప్నాలు వస్తుండేవాట. ప్రపంచ దేశాలు అంబే ద్కర్‌ ను సింబల్‌ ఆఫ్‌ నాలెడ్జిగా అభివర్ణిస్తుంటే మనదేశంలో ఆధిపత్య కులం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య లతోపాటు, శూద్ర కులం నుంచి ఎదిగిన ఓసీ కులాల నాయకులు పాలకులు దేశానికి గొప్ప నాయకుడిగా కాక ఒక ఎస్సీ కుల నాయకుడిగానే చూస్తారు. ఈదేశం సామర్థ్యాన్ని బట్టి గౌరవం కాకుండా కులాన్నిబట్టి గౌరవించే హీనమైన పరిస్థితి మన దేశంలో ఉంది. సబ్బండవర్గాల సమ్మి ళితం గా రాజ్యాంగం అంబేద్కర్‌ ఒక దళితుల కోసమే కాదు ఈ దేశ ప్రజలందరినీ దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగాన్ని రచించారు. రాజ్యాంగాన్ని చదివితే అంబేద్కర్‌ ఎంత గొప్పవాడోనని తెలుస్తుంది. 1945 వరకు దాదాపు 40డిగ్రీల వరకు ఉన్నత విద్యను అభ్యసించిన వారు అంబేద్కర్‌ ఒక్కడే కావటం విశేషం. అంబేద్కర్‌తో పాటు పొలిటికల్‌ సైన్స్‌, సోషలిజం,ఎకనామిక్స్‌, డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎనిమిదేండ్ల కోర్సును రెండున్నరేండ్లలోనే లోనే పూర్తి చేసిన మొదటివ్యక్తి అంబేద్కర్‌. మన దేశంలో డాక్టర్‌ ఆఫ్‌ సైన్సు చదివింది ఇద్దరు మాత్రమే అందులో ఒకరు అంబేద్కర్‌ అయితే రెండో వ్యక్తి కెఆర్‌నారాయణ (మాజీరాష్ట్రపతి). ఇద్దరు దళిత వర్గం నుంచి చదివినవారు అందుకే అంబేద్కర్‌ ను ప్రపంచ మేధావిగా ఇతర దేశాలు గుర్తిస్తుంటే మనదేశంలో మాత్రం కిందిస్థాయికి చెందిన వాడుగా చూస్తారు. అంబేద్కర్‌ కు గొప్పపేరు రావ డం అధిపత్యకులాలకు ఇష్టం లేకపోవడం కుల వివక్ష పొలేదనడానికి ఒకఉదా మన కరెన్సీ రూపాయినోట్లపై అంబేద్కర్‌ ఫోటోను కాకుండా గాంధీని మాత్రమే వేస్తారు. కారణంగాంధీ అగ్రకులం వ్యక్తి కావడమే. ఇద్దరిలో అర్హత ఎవరికి ఉంది ఒక్కసారి ఆలొచించండి.
అర్థిక వ్యవహారాల్లో నేర్పరి
రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్మాణంలో అంబేద్కర్‌ కీలక పాత్ర పోషించాడు. మొదటి నోటుకు రూపాయు అనిపేరు పెట్టింది ముస్లిం చక్రవర్తి షేర్‌ షా. 1540-45లో 1715 అంబేద్కర్‌ అసైన్‌ మెంట్‌ ఇండి యన్‌ కామర్స్‌ అనే సిద్ధాంత గ్రం థాన్ని రచించాడు. 1916 నేషనల్‌ డిపైడిరగ్‌ ఆఫ్‌ ఇండియా ఏహిస్టరిక్‌ అండ్‌ అనేటికల్‌ స్టడీలో పీహెచ్‌డీ, 1920లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ 1923 ప్రాబ్లమ్‌ ఆప్‌ రుపేస్‌ ఇట్స్‌ ఒరిజిన్‌ అండ్‌ సొల్యూషన్స్‌ ఆర్‌ బిఐ ఏర్ప డిరది. బ్రిటిష్‌ వారు రిపోర్టు ప్రకారం రివర్‌ బ్యాంకు నెట్‌ ఏర్పడడానికి కారణం అంబేద్కర్‌. ఈదేశ కార్మిక వర్గాల కొసం బ్రిటిష్‌ కాలంలోనే చికాగో ఉద్యమంతో ప్రపంచ దేశాలు 8 గంటల పని దినములు చేస్తే ఇండియాలో మాత్రమే 12నుండి 14గంటల వరకు పనిచే చేసే పద్ధతి అమలులో ఉండేది. అంబేద్కర్‌ దానికి వ్యతిరేకంగా పోరాడి 8 గంటల పనిదినం అమలు అయ్యెటట్టు చేసిన వ్యక్తి. బ్రిటిష్‌ కాలంలో అనేక కార్మిక చట్టాలను రూపొందించి, స్వాతంత్రానంతరం రాజ్యాంగంలో పొందుపరిచారు.
పాలకుడిగా కాదు సేవకుడు కావాలి
అంబేద్కర్‌ తాను భారతీయుడు అనే చెప్పాడు గాని హిందూ అని ప్రకటించుకోలేదు. హిందూ మతం పేరుతో దళిత బహుజన వర్గాలు మైనార్టీలు వివక్షకు గురవుతున్నాయని, అకారణ వెలివేస్తున్నారని ఉద్యమాల ద్వారా బహిరంగం చేశారు. నేటికి కూడా దళిత ముస్లిం బహుజనులపై దాడులు చేస్తూ చంపడమే బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాలలో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, రాష్ట్రాల్లో దళిత ముస్లిం బడుగు బలహీన వర్గాల ప్రజలపై నిత్యం దాడులు చేయటం, వారి ప్రాణాలు బలిగొనటం పరిపాటిగా వస్తోంది. నేటి యువత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ అందించిన అతిపెద్ద ఆటంబాంబు ఓటు హక్కు. దానిని నిజాయితీగా వినియోగించుకొని పాలకుడిగా కాకుండా సేవకుడిగా మాత్రమే ఉండాలని అంబేద్కర్‌ స్వప్నించేవారు. అంబేద్కర్‌ ఆశయాన్ని ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నిర్లక్ష్యంగా ఉంటే భావితరాలు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బాల్యం నుండే పిల్లలకు మహనీయులత్యాగాలు, విద్య ఆవశ్యకత, కష్టపడే తత్వాన్ని బోధించినప్పుడు అంబేద్కర్‌ ఆశయం నెరవేరుతుంది.
రాజ్యాంగసభను ఉద్దేశించి డాక్టర్‌. బి.ఆర్‌ అంబేద్కర్‌ మాట్లాడిన పై వాక్యాలు భవిష్యత్తులో సాధించాల్సిన సామాజిక, ఆర్థిక సమానత్వం గురించి స్పష్టంగా పేర్కొంటున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో డాక్టర్‌.బి.ఆర్‌ అంబేద్కర్‌ పేర్కొన్న సామాజిక,ఆర్థిక సమానత్వం కోసం ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసి, అభివృద్ధి లక్ష్యాలు నిర్దేశించి, సాధించే ప్రయత్నం చేశారు. భూసంస్కరణల అమలు, జమీందారీ వ్యవస్థ రద్దు, కౌలు విధానాల సంస్కరణ, భూ పరిమితి విధానాలు మొదలైన చర్యలు తీసుకొని సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం కృషి చేశారు. ప్రయివేటు బ్యాంకులను జాతీయం చేసి, రాజాభరణాలను రద్దుచేశారు. సామాజిక, విద్యా సమానత్వ సాధనలో భాగంగానే షెడ్యూల్‌ కులాలకు, షెడ్యూల్‌ తెగలకు రిజర్వేషన్లు అమలు చేయబడ్డాయి. సుదీర్ఘ ప్రయాసల అనంతరం మండల్‌ కమిషన్‌ సిఫారసుల ప్రకారం ఇతర వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లు అమలు చేయబడ్డాయి. ఏలక్ష్యాలైతే రాజ్యాంగం నిర్దేశించిందో అట్టి సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం ఆయా ప్రభుత్వాలు తమ శక్తి కొలది ప్రయత్నించాలి. కానీ ప్రస్తుతం జరుగుతున్నదేమిటి? సామాజిక, ఆర్థిక మార్పుల కోసం చేపట్టిన చర్యలను కొనసాగిస్తున్నాయా? సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సదుపాయాలను పటిష్ట పరుస్తున్నాయా? పేద, ధనికులకు ప్రభుత్వ, ప్రయివేటు సదుపాయాలు సమానంగా అందు బాటులో ఉంచే మిశ్రమ ఆర్థిక వ్యవస్థను కొనసాగిస్తున్నాయా? సమాధానం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాజికంగా,విద్యా పరంగా వెనుకబడిన వర్గాల కోసం ఏర్పాటు చేయబడిన రిజర్వేషన్లను పొమ్మనలేక పొగ పెట్టినట్టు, ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేట్‌ పరం చేస్తూ పరోక్షంగా రిజర్వేషన్లకు మంగళం పాడుతున్నారు. నాడు ఆర్థిక అసమానతలకు కారణమైన, సంపద కేంద్రీకృతానికి కారణమైన భూమిని భూసంస్కరణల ద్వారా పునర్‌ పంపిణీ చేస్తే, నేడు ప్రకృతి సంపదను కారుచౌకగా ప్రయివేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ, సంపద కేంద్రీకరణకు మార్గం సుగమం చేస్తూ, ఆర్థిక అసమానతలు పెంచి పోషిస్తున్నారు. ఉన్న ప్రభుత్వ బ్యాంకులను ప్రయివేటు పరం చేస్తూ, పేదవారికి బ్యాంకు సేవలను దూరం చేస్తూ, ఆర్థిక, సామాజిక అసమానతలనుకు ఆజ్యం పోస్తున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ పరిధిలో సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం ప్రయత్నిస్తుంటే కర్ర పెత్తనం చేస్తున్నారు. సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలను నిర్లక్ష్యం చేయడమో లేదా సవరణల ద్వారా మార్పు చేయడమో జరుగుతుంది. రాజ్యాంగ మౌలిక సూత్రాలను మార్చే ప్రయత్నాలు ప్రారంభించారు. తరతరాలుగా బడుగు బలహీనవర్గాలను అనగదొక్కిన సంస్కృతే ఆదర్శవంతమైనదిగా ప్రచారం చేస్తూ సామాజిక, ఆర్థిక అసమానతలు పెంచి పోషిస్తున్నారు. పేదవారిని నిరుపేదలుగా మార్చుతూ భారత దేశాన్ని, కోటీశ్వలకు బిలియనీర్లకు దోచిపెడుతున్నారు. డాక్టర్‌.బి. ఆర్‌ అంబేద్కర్‌ పేర్కొన్నట్టు సామాజిక, ఆర్థిక అసమానతలు రూపుమాపడం అటుంచితే, ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల ద్వారా సామాజిక, ఆర్థిక అసమానతలు మరింత పెంచి పోషించబడుతున్నాయి. ధనికులు ధనికులుగా, పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ చెప్పినట్టు ఈ అసమానతలు తగ్గించకపోతే, రాజ్యాంగ సభ ఎంతో కష్టపడి నిర్మించిన ఈరాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థను అసమానతలతో పీడిరపబడుతున్న వర్గాలు వ్యతిరేకించి, తిరస్కరిస్తాయి. ఆపరిస్థితి రాకుండా చుసు కోవలసిన బాధ్యత రాజ్యాంగం ప్రకారం పాలిస్తామని ప్రమాణం చేసిన పాలకులపైనే ఉన్నదని గుర్తించుకోవాలి.
(వ్యాసకర్త : దళిత ప్రగతి ఐక్య సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడు.

నిత్య నూతన ప్రవాహం.. అంబేడ్కర్‌ సిద్ధాంతం

(డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా..)

‘’1950, జనవరి 26న మనం వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించ బోతున్నాం. రాజకీయాలలో ఒక వ్యక్తి- ఒక ఓటు, ఒక ఓటు- ఒక విలువ అన్న రాజకీయ సమానత్వాన్ని గుర్తించబోతున్నాం. అయితే సామాజిక, ఆర్థిక జీవితంలో మనకున్న సామాజిక, ఆర్ధిక వ్యవస్థ వల్ల ఒక వ్యక్తి – ఒక విలువ అన్న సూత్రాన్ని తిరస్కరిస్తూనే ఉంటాం. వైరుధ్యాలతో కూడిన ఈ జీవితాన్ని ఎంత కాలం భరిస్తూ వద్దాం? ఎంత కాలం మన సామాజిక, ఆర్థిక జీవితాల్లో సమానత్వాన్ని సాధించకుండా ఉందాం? ఇలా ఎక్కువ కాలం కొనసాగనిస్తే మన రాజకీయ ప్రజాస్వామ్యమే ముప్పునకు లోనవుతుంది. ఈ వైరుధ్యాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి, లేకపోతే అసమానత్వంతో పీడిరపబడుతున్న వాళ్ళు ఈ రాజ్యాంగ సభ కష్టపడి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామిక వ్యవస్థను కుప్పకూలుస్తారు.’’

గ్రామీణ ఉపాధి హామీకి తూట్లు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రావటానికి కారణమైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒకవిక్షణ స్వభావం ఉంది. కావాని అడిగిన తరువాత ఒకపక్షం రోజుల్లోఉపాధి అందించాని చట్టం చెబుతోంది. అలా ఉపాధి అందించలేనప్పుడు నిరుద్యోగ భృతి చెల్లించాని కూడా ఈచట్టం చెబుతోంది. ఈచట్టం గ్రామీణ ప్రాంతాకే పరిమితమైందనేది నిజం. అయితే ఇది ఉపాధిని హక్కుగా మార్చింది. బాగా చర్చించిన తరువాత పార్లమెంటు ఈ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. భారత రాజ్యాంగం సామాజిక, రాజకీయ హక్కుకు మాత్రమే హామీ ఇచ్చి ఆర్థిక హక్కును విస్మరించిందనే లోపాన్ని… ఈ చట్టాన్ని రూపొందించి ఆచరణలో పార్లమెంట్‌ సరిదిద్దింది.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో ఒక నూతన పరిస్థితి ఏర్పడిరది. గతంలో కూడా పేదరికం నిర్మూనకు ఉద్దేశించిన పనికి ఆహారం వంటి పథకాున్నాయి. అయితే వాటిలో హామీు ఏమీ లేవు. వాటికి బడ్జెట్‌ కేటాయింపు ఉండేవి. అవి ప్రతి సంవత్సరం మారుతూ ఉండేవి. ఆకేటాయింపు ఒక్కోసారి పెరగటం, మరోసారి తరగటం జరిగేది. అయితే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వీటికి పూర్తిగా భిన్నమైంది. ఈచట్టం ఉపాధికి హామీని ఇచ్చింది. ఆ క్రమంలో ఆర్థిక హక్కును స ృష్టించటమే కాకుండా పౌరసత్వ భావనకు లోతైన అర్థాన్ని ఇచ్చింది. బిచ్చగాళ్ళతో సహా ప్రతి పౌరుడు తాను కొన్న సరుకుపై పరోక్ష పన్ను రూపంలో ప్రభుత్వానికి పన్ను కడతాడు. కానీగతంలో రాజ్యం అందుకు బదుగా ఆచరణలో పౌరుకు ఏమీ చేసేదికాదు. అది పౌరుకు ‘భద్రత’ను కల్పించిందని ఎవరైనా చెబితే అదిచాలా చిన్న విషయం అవుతుంది. ఎందుకంటే పేదకు ‘భద్రత’ కల్పించటం అర్థరహితం అవుతుంది. అందుకు భిన్నంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒక నూతన శకానికి తెర లేపుతున్నానని వాగ్దానం చేసింది. ఈ పథకం ద్వారా రాజ్యం తన పౌరుకు కొంతవరకు ఆర్థిక భద్రతను కల్పించటానికి ముందుకు వచ్చింది. అంటే పేదకు అది ఎంతోకొంత మేు చేస్తుంది.
ఈపథకం కింద ఉపాధిని పొందుతున్నవారిలో 40శాతం దళిత, ఆదివాసీ కుటుంబాకు చెందినవారే. పాక వర్గాకుండే కు వివక్ష,వర్గవైషమ్యా కారణంగాను ఈవాగ్దానం అములో తీవ్రమైన ఒడిదుడుకు ఏర్పడ్డాయి. యుపిఏ-2 పానలో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి చేయవసిన వాస్తవ బడ్జెట్‌ కేటాయింపులో కోతను విధించటం ద్వారా ఈ పథకానికి తూట్లు పొడవటం మొదయింది.
ఈ పథకం డిమాండ్‌ ను అనుసరించి అము చేసేది. కనక అవసరమైతే అదనపు కేటాయిం పు చేయటం జరుగుతుంది. బడ్జెట్‌లో చేసిన కేటాయింపునుబట్టి అభిప్రా యానికి రాకూ డదు’ అంటూ ఈపథక కేటాయింపుకు కోత పెట్టడాన్ని ఆయన సమర్థించుకున్నారు. అయితే అలాచేయటంవ్ల కేటాయింపుకు మించి డిమాండ్‌ ఏర్పడినప్పుడు వేతన బకాయిు పోగుపడ్డాయి. కేటాయింపు కంటే డిమాండ్‌ నిరంతరం పెరుగుతుం డగా ఒకవేళ కేటాయింపును పెంచకపోతే కాక్రమంలో వేతన బకాయిు పెరిగి పోతాయి. ప్రస్తుతం ఈవిషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. వేతన బకాయిు నిరంతరం పెరిగి పోతున్నాయి. అంటే సంవత్సరకాంలో అనేక మంది కార్మికుకు వేతనాు అందవు. అంతే కాకుండా వేతనాను అందుకోవటానికి పట్టే సగటు కాం కూడా నిరంతరం పెరుగుతూ ఉంటుంది. వేతనాు సకాంలో అందని స్థితిలో కార్మికు ఈపథకం నుంచి నిష్క్రమించటం మొదలెడ తారు. తత్ఫలితంగా ఈ పథకంకింద పనికి వుండే డిమాండ్‌ ఏదో ఒక స్థితిలో దెబ్బ తింటుంది. అదే సమయంలో చట్టప్రకారం నిరుద్యో గానికి చేయవసిన చెల్లింపు చెల్లించకుండా, కనీసం తగిన సమయంలో పేర్లు నమోదు చేసుకున్న వారికి కూడా పని ఇవ్వకుండా, దరఖాస్తు దారును రిజిస్టరు చేయకుండా డిమాండ్‌ను తగ్గించే ధోరణి కనపడుతోంది. ఒక ఆర్థిక హక్కుగా ఉండవసిన హక్కును నిర్వీర్యం చేయటం జరుగుతోంది. రాజ్యం దయాదాక్షిణ్యాతో పేదకు ఎంతోకొంత ఉపశమనం అందించే మరో పేదరిక వ్యతిరేక కార్యక్ర మంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మార్చటం జరిగింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేదరిక వ్యతిరేక కార్యక్రమంగా కూడా గణనీయమైన విస్త ృతి ఉంది. ఈకార్యక్రమం మొదయినప్పటి నుంచి దేశం లోని ప్రతి మూడు గ్రామీణ కుటుంబాలో ఒకదానికి ఎప్పుడో ఒకప్పుడు పని దొరికింది. 2017-18లోనే ఈ కార్య క్రమం కింద ఎనిమిది కోట్ల మంది ప్రజకు పనిదొరికింది. ఆసంవత్సరంలో ప్రతి కుటుం బానికి సగటున 46 రోజుపాటు పని దొరికింది. ప్రపంచంలోనే అత్యంత ఉద్యోగితను సృష్టించే పథకం ఇది. అయితే రానురాను ఈ కార్యక్రమానికి చేసే కేటాయింపు తగ్గుతూ వస్తున్నాయి. నిజానికి ఇది ఉపాధి హామీ పథకం అవటం అటుంచి ఉపాధిని సృష్టించే కార్యక్రమంగా కూడా దీని విస్తృతి కుచించుకు పోతున్నది. ఇంతకు ముందే చెప్పినట్టు ఒకవేళ ఈపథకానికి చేస్తున్న కేటాయింపు నికడగా ఉన్నట్టయితే లేక ప్రతిసంవత్సరం కావసిన దానికంటే కేటాయింపు తక్కువగా వుంటే కాక్రమంలో వేతన బకాయిు పెరుగుతాయి. అటువంటి పరిస్థితులో నికర కేటాయింపు, నికర వేతన బకాయిు తగ్గుతాయి. అయితే వాస్తవంలో జరుగుతున్న దేమంటే చేస్తున్న కేటాయింపు లో నికడ ఉండటం లేదు. నికర కేటాయింపు తగ్గటం వన నికర వేతన బకాయిు కూడా గణనీ యంగా తగ్గాయి. ఉదాహరణకు 2017-18 సంవత్సరంలో ద్రవ్య్బోణం సర్దుబాటు చేసిన తరువాత జరిగిన కేటాయింపు 2010-11సంవత్సరంలో జరిగిన కేటాయింపు కంటే తక్కువగా ఉంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2012-13లో కాయాపనతో జరిగిన వేతన చెల్లింపు 39 శాతం ఉండగా 2016-17లో కాయాపనతో జరిగిన వేతన చెల్లింపు 56 శాతంగా ఉండటంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
వేతన బకాయిను కూడా లెక్క లోకి తీసుకోకుండా చేసే స్థూ కేటాయింపులో తగ్గుద స్థూ జాతీయోత్పత్తితో పోల్చి చూసిన ప్పుడు చాలా తీవ్రంగా ఉంది. ఈ కార్యక్రమం సరిjైున రీతిలో నడవాంటే స్థూ జాతీయోత్పత్తిలో 1.7శాతం కేటాయించాని ప్రపంచ బ్యాంకు కూడా అంచనా వేసింది. అందుకు భిన్నంగా 2017-18 సంవత్సరంలో జరిగిన కేటాయింపు (వాస్తవంలో చేసిన వ్యయం కాదు) కేవం 0.28 శాతం మాత్రమే. 2010-11సంవత్సరంలో 0.58 శాతంగాను, 2011-12 సంవత్స రంలో 0.34 శాతంగాను ఉన్న కేటాయింపు కంటే 2017-18 సంవత్సరంలో చేసిన కేటా యింపు తక్కువగా ఉంది. వాస్తవ వ్యయాను, అంతకు ముందటి సంవత్సరా నికర రుణాను చూసినప్పుడు స్థూ జాతీయోత్పత్తిలో అటువంటి నికర వ్యయం వాటా 2012-13వ సంవత్సరంలో 0.36 శాతంఉంటే 2016-17సంవత్సరం కల్లా అది 0.30 శాతం కంటే కిందకు దిగ జారింది. కాబట్టి మనం ఏవిధంగా చూసినప్పటికీ స్థూ జాతీయోత్పత్తిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం కేటాయిస్తున్న నిధు శాతం సాపేక్షంగా చూసినప్పుడు కాక్రమంలో తగ్గిపోతున్నది. అయితే వేతనా చెల్లింపు సకాంలో జరగటం లేదనే వాస్తవాన్ని ప్రభుత్వం అంగీకరించటం లేదు. నిజానికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేసే వేతనా చెల్లింపులో 90శాతం15రోజులోపు జరుగుతున్నా యని ప్రభుత్వం అంటోంది. అయితే ఇది పూర్తిగా అబద్దం. 3500 గ్రామ పంచాయతీను ఒకశాంపిల్‌గా తీసుకుని ఒక పరిశోధకు బృందం సవివరంగా చేసిన అధ్య యనాన్ని జనవరి 4న కొత్త ఢల్లీిలో ఏర్పాటు చేసిన ఒకపత్రికా సమావేశంలో విడుద చేశారు. ఈఅధ్య యనం ప్రకారం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరిగిన పనికి చేయవసిన వేతన చెల్లింపు సగటున 50 రోజు ఆస్యంగా జరుగు తున్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కార్మికుకు ఎదురవు తున్న ఇతర ప్రతిబంధకాకు అదనంగా సకాంలో అందవసిన వేతనాను ఆధార్‌తో లింకు చేయాని అంటున్నారు. తత్ఫలితంగా ఈ కార్యక్రమం కింద భిస్తున్న పనికిగ డిమాండ్‌ మందగిస్తుంది. వాస్తవంలో డిమాండ్‌ చేసిన పనిని కూడా ఇవ్వటంలేదు. అటువంటి పరిస్థితిలో చట్ట ప్రకారం చెల్లించవసిన నిరుద్యోగ భృతి కూడా చెల్లించటం లేదు. నిజానికి మహాత్మా గాంధీజాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒకడిమాండ్‌ ఆధారిత కార్యక్రమంగా పని చేయటం లేదనేది సుస్పష్టం. అందుకోసం అందుబాటులో ఉంచే వనరుపై దాని విస్తృతి ఆధారపడి ఉంటుంది. ఒకడిమాండ్‌ ఆధారిత కార్యక్రమానికి వనయి అందుబాటులో లేకపో వటమనే పరిస్థితిలో వైరుధ్యం ఉంది. అటువంటి కార్యక్రమానికి ముందుగా బడ్జెట్‌లో కేటాయింపు ఉండాలి. నిధు అందుబాటులోఉండటాన్ని బట్టి ప్రజ ఆర్థికహక్కును ప్రతిబింబించే అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించటం జరగ కూడదు. ఇటువంటి పథకానికి నిధును కేటాయించటం కోసం ప్రజ హక్కును ప్రతిబింబించని కార్యక్రమాపై ప్రభుత్వం చేసే వ్యయాన్ని తగ్గించుకోవాలి. అయితే ఆచరణలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉందని మనం గమనిస్తాం. అంటే ఇతర వ్యయాకు ప్రాధాన్యతను ఇచ్చిన తరువాత మిగిలిందే ఈ పథకానికి కేటాయింపు జరుగుతున్నాయి. పర్యవసానంగా పనికిగ డిమాండ్‌ ను అనుసరించి చేయవసిన వ్యయానికి సరిపడా నిధు అందుబాటు లో ఉండటం లేదు. పైన పేర్కొన్న అధ్యయనం ప్రకారం పని కోసం వస్తున్న డిమాండ్‌లో భాగంగా అధికారికంగా రిజిష్టర్‌ చేసుకున్న వారిలో కూడా 68శాతం కంటే ఎక్కువ మందికి వాస్తవంలో పని కల్పించటం లేదు. అధికారికంగా రిజిష్టర్‌ చేసుకున్న పని డిమాండ్‌లో వాస్తవంలో సగం మందికి కూడా అందుబాటులోకి రావటం లేదు. ఈనిష్పత్తి పెరుగుతూ ఉంది. ఆవిధంగా ప్రజ ఆర్థిక హక్కు రద్దవు తోంది. ఇది ఈచట్టాన్ని చేసిన పార్లమెంటుపై దాడితో సమానం అవుతుంది. ఈపథకాన్ని ఉద్యోగితను సృష్టించే సామాన్యమైన కార్యక్ర మంగా తీసుకున్నా దీని విస్తృతి కాక్రమంలో తగ్గిపోయింది. ఇదో విపరీత స్థితి. దేశంలో వేగంగా పెరుగుతున్న నిరుద్యోగితపై చాలా కాం తరువాత దృష్టిని కేంద్రీకరించారు. అటువంటి నిరుద్యోగంపై అన్ని ప్రభుత్వ వ్యయాకంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒక బ్రహ్మాండమైన ఆయుధంగా పని చేయగదు. ఒకవేళ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించాని అనుకుంటే ఈపథకాన్ని నిర్వీర్యం చేయటానికి బదుగా దానిపై మరింతగా వ్యయం చేయాలి. అయితే ప్రస్తుత ధోరణి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేదిగానే ఉంది.
-సైమన్‌ గునపర్తి

గిరిజన.. దళితుంటే ఇంత నిర్లక్ష్యం ఎందుకు..?

రాష్ట్రంలో గిరిజన,దళిత వర్గాల‌పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యవైఖరి అవంబిస్తున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో నెల‌కొన్న‌ పరిస్థితులే దీనికి తార్కాణం. వారిపై జరుగుతున్న దాడు అమానుషమని మేథావు ఆవేదను వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక యుగంలో ప్రభు త్వాలు మారుతున్నా వారి తరాతలు మారడం లేదు. కదా రోజురోజుకు ఆవర్గాల‌ ప్రజలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్నారు. దీంతోవారంతా సామాజికంగా, ఆర్ధికంగా అణచి వేతకు గురవుతున్నారు.

అధికంగా పేదలు, వ్యవసాయ కార్మికులుగా, వల‌స కార్మికలుగా జీవిస్తున్నారు. రాష్ట్రంలో దళితవాడు సుమారు 20వేల‌ వరకు ఉన్నాయి. ఇవి ఊరు చివరఅభివృద్థికి ఆమడదూరంలో ఉంటాయి. ఇదినేటి దళితుస్థితి. దళితును సమా జంలో ఉన్నత స్థాయికి తేవాని రాజ్యాంగంలో కీల‌కమైన ఆర్టికల్స్‌ను రాసుకున్నాం. కానీ వాటి అమలు సక్రమంగా జరగకపోవడంవ‌ల్ల‌ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు దళితల బతుకులు సాగుతున్నాయి. ఆర్టికల్‌16(4)రిజర్వేషన్లు, ఉద్యోగ కల్ప‌న‌, ఆర్టికల్‌ 17అంటరానితనం నిర్మూన, ఆర్టికల్‌ 46 ప్రత్యేక శ్రద్ధతో విద్య, ఆర్థిక సౌకర్యా క్పల్ప‌న, సామాజిక న్యాయం దోపిడీకి గురికాకుండా రక్షణ,ఆర్టికల్‌341,342దళితల‌ అభివృద్థిని గవర్నర్ల సహాయంతో చేయడం,ఆర్టికల్‌ 335 సామర్థ్యం నిర్వహాణ, నియమకాలు, ఆర్టికల్‌ 338 దళితల‌ అభివృద్థికి ప్రత్యేక అధికారాలు, నియామకం, జాతీయ కమిషన్‌, సహాకార కార్పొరేషన్‌ ఏర్పాటు... రాజ్యాంగంలో ఇన్ని హాక్కు ఉన్నప్పటికి అమల‌లో తీవ్రమైన వైఫ్యం జరిగిందనేది స్పష్టంగా కనపడుతుంది. నేటి బీజేపీ పాల‌కల‌ రాజ్యాంగాన్ని సమీక్షించాలి,మార్చాలి,ఆర్టికల్‌16(4)నురద్దు చేయాలి,రాజ్యాంగ స్థానంలో మనువాద ఏజెండాను అమ‌లు చేయాల‌ని తీవ్రప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌, 370 ఆర్టికల్‌ రద్దు, దళితల‌,మైనార్టీలు,మహిళపై దాడు,దౌర్జన్యాల హత్యు అత్యాచారాలు జరుగుతున్నాయి. క్రైమ్‌ ఇన్‌ ఇండియా 2019 నివేదిక ప్రకారం దేశంలో దళితల‌పై నేరాల్లో మొత్తం 7.3 శాతం పెరుగుదల‌ ఉంది. 45935 నేరాలు, దారుణకేసు నమోదు చేయబడ్డాయి. ఉత్తరప్రదేశ్‌లో 11,829 కేసు. ఇది దేశమొత్తం కేసుల్లో 25.8 శాతం,రాజస్థాన్‌ 6794కేసు14.8శాతం, బీహార్‌ 14.2శాతం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితుపై లైంగిక వేదింపు అత్యాచారాలు హత్యల‌కు కిడ్నాప్ లు ఎక్కువగా నమోదయ్యాయి.. అంబేద్కర్‌పై బీజేపీ, ఆర్‌ఎస్‌ ఎస్‌కు ఎంత ప్రేమ ఉందో ఈనేరానుబట్టి అర్థమవుతుంది. రాష్ట్రంలో 2014లో 1104 సంఘటను జరిగితే 2019లో నవంబర్‌18నాటికి1904 సంఘటను జరిగాయి. కిరాతకమైన హత్యలు జరిగాయి. కుల దురంకార హత్యలు 49జరిగాయి. అత్యాచారాలు దౌర్జన్యాలు లైంగిక వేదింపుల‌కు తోడు వీడీసీ పేరుతో ఉత్తర తెంగాణ 4జిల్లా పరిధిలో 200గ్రామాల్లో దాడలు జరిగాయి. అంబేద్కర్‌ విగ్రహా ధ్వంసం, అనేక గ్రామాల్లో గ్రామ బహిష్కరణలు జరిగాయి. కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిస్లిలో దళితుల‌కు ఏమాత్రం రక్షణలేదు. రాష్ట్ర మొత్తం ఇదే పరిస్థితి ఉంది. దళితుల‌కు కల్పించబడ్డ హక్కుల‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘిస్తూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టం 1989ను ప్రభుత్వాలు అమ‌లు చేయలేదు. ప్రభుత్వాలు చట్టాన్ని నీరుగార్చడమే కాకుండా దళితల‌పై పెరుగుతున్న దాడుల‌కు దోహదం చేస్తూ నేరస్థుల‌కు అండగా నిబడుతున్నవి. ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకు బహిరంగ ప్రజా వేదిక నుంచి రిజర్వేషన్‌ విధానాన్ని సమీక్షించా ని డిమాండ్‌ చేస్తున్నారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని పునః‌పరిశీ లించాని కోరుతున్నారు. గ్రామాల్లో హౌదా, గౌరవం భూపరిమాణాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. ఇందులో దళితు పరిస్థితి చూస్తే తెంగాణలో18క్ష కుటుంబాలు ఉండ గా7.12క్ష కుటుంబాకు13.12క్ష ఎకరాల‌ భూమి మాత్రమే ఉంది. రాష్ట్రంలో మొత్తం సాగు భూమి1.65కోట్లఎకరాలు ఉంది. ఇందులో దళితల‌ భూముఎన్ని? రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటిం చినట్టు 3క్ష భూమి లేని కుటుంబాకుగాను, 3ఎకరా భూమి కొనుగోలు పథకం కింద గత 7ఏండ్లలో 6,662 కుటుంబాకు 16544.13 ఎకరాను మాత్రమే కొనుగోుచేసి పంపిణీ చేసారు. ఇందులో 511మందికి 1122.02 ఎక రాకు నేటికి రిజిస్ట్రేషన్‌ చేయకుండా కాల‌యాపన చేస్తున్నారు. ప్రతి ఏటా10వే కోట్లు కేటాయించి ఐదేండ్లలో 50వే కోట్లుఖర్చుచేసి భూమిలేని ప్రతి దళిత కుటుంబానికి భూమి ఇస్తామని ప్రకటించి మాట మార్చిన కేసీఆర్‌ దళితవ్యతిరేకిగా ని బడ్డారు. పైగా గత ప్రభుత్వాు దళితుకు అసైన్డ్‌ చేసిన భూమును అభివృద్ధి పేరుతో ఎలాంటి నష్ట పరిహారం చెల్లించకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తిరిగి తీసుకుంటున్నది. ఈభూముల్లో గ్రామ పార్కుల‌ను,డంపింగ్‌ యార్డు,రైతువేదికల‌కు ,స్మశాన బిల్డిం గ్స్‌,ఇండిస్టీపార్కు నిర్మిస్తున్నారు. ఇది ధనవంతల‌కు, భూస్వాముకల‌కు రియలేస్టేట్‌, పరిశ్రమ అధిపతల‌కు భూముల‌ను ధారదత్తం చేసే భూస్వామ్య,దొర ప్రభుత్వమని తేలిపోయింది. 2014-15ఆర్థిక సంవత్సరం నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరం వరకు ఏడేండ్లలో దళితు ప్రత్యేక అభివృద్ధికి 85913 కోట్లు కేటాయించి 57100 కోట్లు మంజూరు చేసి 47685 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దళితు సంక్షేమం, అభివృద్ధి, రక్షణ నినాదాలు బాగా వినబడుతున్నప్పటికీ 50 శాతంలోపే ఖర్చుచేసి దళితు అభివృద్ధిని సాది స్తామంటే ఏలాసాధ్యం. స్వయం ఉపాధి పథకాకు గత ఐదేండ్లుగా5క్షకుపైగా ధరఖాస్తు పెట్టుకున్నారు.ల‌క్ష20వే మందికి మంజూరు చేసి ల‌క్ష మందికి సబ్సిడీ విడుద చేశారు. 13వంద కోట్లు కేటాయించి 1160కోట్లు ఖర్చు చేశారు. 2019 నుంచి 21వరకు రెంళ్ళ‌‌కు యాక్షన్‌ ఫ్లాన్‌ విడుద చేయలేదు. నిరుద్యోగు ప్రతి సంవత్సరం సుమారు 2క్ష వరకు దరఖాస్తు పెట్టు కుంటున్నారు. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి ఉంది. సరిపడని బడ్జెట్‌ కేటాయించారు. లోన్‌ కోసం విషమ షరతు విధిస్తున్నారు. తిరిగి తిరిగి విసిగి వేసారి లోన్స్‌కు దూరంగా ఉండే దుస్థితి వస్తున్నది. ఏలాంటి షరతు లేకుండా ప్రతి ఏడాది1500కోట్లు కేటాయించి ఖర్చు చేస్తే దళిత నిరుద్యోగుకు న్యాయం జరుగుతుంది. అక్షరాస్య తలో దళితు 50శాతం కూడా లేరు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ళను అభివృద్ధి చేయాలి. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి. వైద్యంపూర్తిగా కార్పొ రేట్‌ శక్తు చేతుల్లోకి వెళ్ళింది. ప్రజారోగ్యోం దెబ్బతినడం వ్ల ఆర్థికంగాలేని దళితుల్లో చిన్న చిన్న జబ్బుకే మరణాలు సంభవిస్తున్నాయి. ప్రజారోగ్యాన్ని బలోపేతం చేయాలి. జీఓ 342 ప్రకా రంగా 101 యూనిట్ల విద్యుత్‌ను ఫ్రీగా దళితుకు ఇస్తున్నారు. ఇది200యూనిట్లకు పెంచాలి. జిఓ1235 ఆధారంగా రెండు ఎకరా భూమిని ప్రతి గ్రామంలోస్మశాన స్థలాకు ఇవ్వాలి. ప్రభుత్వ రంగం వేగంగా తగ్గిపోతున్నది. ప్రయి వేట్‌ రంగం లో రిజర్వేషన్లు లేవు. బ్యాక్‌లాక్‌ పోస్టు భర్తీ చేయడం లేదు. దళిత ప్రజు సాంఘిక సంక్షేమ పథకాపై ఆధారపడి జీవిస్తు న్నారు. ఉపాధిహామీ చట్టం, ప్రజాపంపిణీ,ఆహారభద్రత,ఆసరా ఫించన్స్‌, ఇవి కొంత మేరకు దళిత సమాజానికి ఉపయోగ పడు తున్నాయి. ఈతరుణంలో నయా ఉదారవాద ఆర్థిక విధానా అమువ్ల సాంఘిక సంక్షేమ పథకా క్ష్యం నిరంతరం తగ్గించబడుతున్నది. నిత్యవసర సరుకు ధరు నిత్యం పెరుగు తున్నాయి. అర్థాకలితో జీవి స్తున్నారు. దళితవాడల్లో రక్షిత తాగునీరు, రోడ్లు ఉండవు. గృహవసతి లేనివారు 30శాతం ఉన్నారు. గృహ నిర్మాణ పథకం, డబల్‌ బెడ్రూం పథకాు ఇండ్ల సమస్యను పరిష్కరించలేదు. కులాంతర వివాహాు, కళ్యాణక్ష్మీ పథకాకు నిధును పెంచాల్సిన అవసరం ఉంది. దళితు సమగ్రాభివృద్ధిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాు నిర్లక్ష్యం చేస్తున్నాయి. 

దళితు, ఆదివాసీ కష్టాు` దళిత్‌ శోషన్‌ ముక్తి మంచ్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రామచంద్ర
ఈఏడాది అసెంబ్లీ ఎన్నికు జరగ బోయే పశ్చిమ బెంగాల్‌లో దళితు, ఆదివాసీ పరిస్థితి దయనీయంగా మారింది. శ్రామిక వర్గంలో భాగంగా ఉన్నవారు దశాబ్దాుగా తమ హక్కుకు నోచుకోలేకపోతున్నారు. సామాజికంగా, ఆర్థికం గానూ వారు అణచివేతకు గురవుతున్నారు. అయితే, రాష్ట్రంలో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ), విపక్ష బీజేపీు దళితు,ఆదివాసీను మోసగిస్తు న్నాయి. వారిని కేవం ఓటు బ్యాంకుగానే చూస్తు న్నాయి కానీ వారిహక్కు విషయంలో మౌనం వహిస్తున్నాయి. పశ్చిమబెంగాల్‌లో ఈవర్గా హక్కు,సామాజిక,ఆర్థికన్యాయం కోసం వామపక్షం మాత్రమే దశాబ్దా పాటు పోరాడిరదని దళిత శోషన్‌ ముక్తి మంచ్‌ (డీఎస్‌ఎంఎం) ప్రధాన కార్య దర్శి, మాజీఎంపీ డాక్టర్‌ రామచంద్ర డోమ్‌ గుర్తు చేశారు.
బెంగాల్‌లో దాదాపు 30శాతం ఎస్సీ, ఎస్టీలే..!
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వర్గా మద్దతు కోసం బీజేపీ,టీఎంసీు చేస్తున్న కుటి యత్నాు అనేక సందర్భాల్లో బయటపడ్డాయని చెప్పారు. ‘విభజన’ రాజకీయాతో ఈ వర్గాను మరింతగా బహీనపరిచే కుట్రను కేంద్ర, రాష్ట్రంలోని అధికార పార్టీు చేస్తున్నాయని వివరిం చారు. పశ్చిమ బెంగాల్‌లోఎస్సీ,ఎస్టీ జనాభా గణనీ యంగా ఉన్నది.2011 జనాభా లెక్క ప్రకారం.. ఎస్సీు 1.8కోట్ల మందికి పైగా (23.5శాతం మంది),ఎస్టీు దాదాపు 53 క్ష మంది (5.8 శాతంమంది) ఉన్నారు. అంటే జనాభాలో దాదాపు 30శాతం ఈ రెండు వర్గాకు చెందినవారే.
కులాధారిత వేధింపు అధికం
అయితే, రాష్ట్రంలో కులాధారిత వేధిం పు ఎక్కువయ్యాయని డోమ్‌ వ్లెడిరచారు. ఇందుకు, ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో మెగులోకి వచ్చిన రెండు సందర్భాను ఆయన వివరించారు. ‘’ కోల్‌కతాలోని రవీంద్ర భారతీ యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఎస్టీ వర్గానికి చెందిన సర స్వతి కెర్కెట్టా2019లోనియమితుయ్యారు. అయితే,ఆవర్గానికి చెందినవ్యక్తిగా ఇదిఆమె సాధిం చన గొప్ప ఘనత. కానీ, సాక్షాత్తూ ఆమె విద్యార్థులే ఆమెను ఒకగంటపాటు నిబెట్టారు. ఇంకో ఘట నలో.. జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ హిస్టరీ అసోసి యేట్‌ ప్రొఫెసర్‌గా ఆదివాసీ మరూనా ముర్ము నియమితుయ్యారు. అయితే,ఈమెను కూడా విద్యా ర్థు ఒక విషయంలో దూషించారు’’ అని ఆయన గుర్తు చేశారు.
అగ్రవర్ణాకే ప్రయోజనం
అధికార పార్టీ విభజన రాజకీయా కు ఆకర్షితు వుతున్న ఈ శ్రామిక వర్గా ప్రజు పోరాడటం ద్వారానే తమ హక్కును పొందు తారని డోమ్‌ చెప్పారు. తాగునీరు, భూమి హక్కు, వనయి, విద్య, సాంస్కృతిక, అభివృద్ధికి సంబం ధించిన అనేక విషయాల్లో దళితు, ఆదివాసీ హక్కుకు పోరాటాలే దారిని చూపిస్తాయని వివరించారు. రాష్ట్రంలో టీఎంసీ దాదాపు 10 ఏండ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ.. అటవీ హక్కుచట్టం ప్రకారం ఆదివాసుకు పట్టా ఇవ్వ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అగ్రవర్గా ప్రజు మాత్రమే ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారనీ, ఈ అసమానత దళిత, ఆదివా సీను ఉద్యమాు చేసేలే పురిగ్పొుతుందని తెలిపారు.
‘తీవ్రస్థాయికి ఆహార సంక్షోభం’
బెంగాల్‌లో ఈ రెండు వర్గా ప్రజ పరిస్థితి ఆహార సంక్షోభంతో తీవ్ర స్థాయికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘’2018లో లోధ, షబర్‌ వర్గానికి చెందిన10మంది ఆకలి కారణంగా చని పోయారు. ఆహార సంక్షోభం శ్రామిక వర్గా ప్రజ ను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ గణాం కాను ఎన్‌ఎస్‌ఎస్‌ఓ డేటా కూడా ప్రతిబిం బిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ప్రజు మళ్లీ ఎర్ర జెండా కిందకు వస్తున్నారు’’ అని ఆయన తెలిపారు.
‘లెఫ్ట్‌ ఉద్యమానికి దళిత, ఆదివాసీ మద్దతు’
అయితే,బెంగాల్‌లో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి బీజేపీ శతవిధాలా ప్రయత్ని స్తున్నదనీ,ఇందుకు మత,కురాజకీయాకు తెరలేపి ప్రజల్లోవిభజను తీసుకొస్తున్నదని చెప్పారు. దీంతో,ముఖ్యంగాదళితు,ఆదివాసీు విడి పోతు న్నారని ఆవేదనవ్యక్తంచేశారు. రాజ్యాంగం కల్పిం చిన రిజర్వేషన్లను సైతం ప్రశ్నించేలా బీజేపీ చర్యు న్నాయన్నారు. గుండాయిజం, బెదిరించే ధోరణితో టీఎంసీ చర్యు రాష్ట్రంలో భయభ్రాంతు గురి చేస్తున్నాయని డోమ్‌ వివరించారు. రాష్ట్రంలో మహిళపై లైంగికదాడు, హత్యు, ఆది వాసీ, దళిత యువకును తప్పుడు సాకుతో అరెస్టు చేయడం వంటివి కొనసాగుతున్నాయని ఆయన నొక్కి చెప్పారు. రాష్ట్రంలో వామపక్ష ప్రభు త్వం దూరం అయినప్పటి నుంచి ఈసమస్యు అధికమ య్యాయని చెప్పారు. హక్కు పోరాటాల్లో భాగంగా దళితు, ఆదివాసీ నుంచి వామపక్ష ఉద్యమానికి విస్తృతమైన మద్దతు భిస్తుందని డాక్టర్‌ డోమ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.
-ఆర్‌. వెంకట రాములు

సామాజిక వివక్షే కట్టుబాటుగా…!

ఉత్తరప్రదేశ్‌లో అత్యున్నత స్థాయిలో ఘనీభవించిన కు చట్రంలో మనుగడ సాగించడం పెద్ద సాహసమే. ఇక్కడ కు పక్షపాతం, పితృస్వామిక శక్తు ప్రాబ్యం బంగా వ్యాపించి ఉంది. కులాకు రాజకీయ ప్రతినిధు అండదండుంటాయి. ఉన్నావో మొదు కొని హత్రాస్‌ వరకు హింస పునరావృతం కావడం చూశాం. మృగప్రాయమైన అంశాకు ప్రాధాన్యత నిస్తూ, గొప్పగా చెప్పుకోవడం పరిపాటి.
నుగురు ఠాకూర్లచే హత్యాచారానికి గురైన బాధితురాలిని, ఆమె తల్లిదండ్రు అభీష్టానికి భిన్నంగా, ఆ రాత్రికి రాత్రే అంత్యక్రియు నిర్వహించారు. ఆమె కుటుంబాన్ని నిఘా నీడలో ఉంచి మరీ ఆ దుశ్చర్యకు ప్పాడ్డారు. పట్టణంలో 144వసెక్షన్‌ విధించడం, వారి కుటుంబ సభ్యును పత్రిక వారితో మాట్లాడడానికి అనుమతించకపోవడం, బాధితు రాలి సోదరుడి మొబైల్‌ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయించడం, వారి కుటుంబాన్ని ఇంటికే పరిమి తం చేయడం వంటివన్నీ జరిగాయి. ఠాకూర్‌ కుటుంబీకు బహిరంగంగా నిరసన తెలియ చేయడానికి అనుమతించారు. బాధితురాలి కుటుంబాన్ని మాత్రం బహిరంగంగా బెదిరిం చారు. వారిని పరామర్శించడానికి వెళ్లిన చంద్రశేఖర్‌ రావణ్‌ లాంటి వారికి కూడా హెచ్చరికు చేశారు. బాధిత కుటుంబం భయంతో వణికి పోయింది. హత్రాస్‌ అనేది కులాధిక్యత గ పట్టణం. వారిలో ముఖ్యంగా బ్రాహ్మణు, వైశ్యు వున్నారు. మురికి క్వాు బహిరంగంగా పారే ప్రాంతంలో వాల్మీకు నివసిస్తారు. వారు ప్రధానంగా పారిశుధ్య కార్మికుగా వుంటూ ఠాకూర్ల పంటపొలాల్లో వ్యవసాయ పను చేస్తారు. ఠాకూర్లకు వారితో పని పడినప్పుడు ఒక మధ్యవర్తిని వారి వద్దకు పంపుతారు. దళితవాడకు వెళ్లి పనికి రమ్మని అడగడం తమ గౌరవానికి భంగకరమని భావిస్తారు. దళితు మార్కెట్‌ నుంచి కొనానుకున్నా, షాపు యజమాను దూరాన్ని పాటిస్తూనే సరుకు ఇస్తారు. కరోనా మహమ్మారి వ్ల వాడుకలోకి వచ్చిన ‘సామాజిక దూరం’ అనే పదం అంతకు ముందే ఆప్రాంతంలో పాటించబడుతున్నది.ఉత్తరప్రదేశ్‌లో కులా ఆధారంగా అసమానతనేవి స్పష్టంగా కన్పిస్తుంటాయి. హత్రాస్‌ దీనికి మినహాయింపు కాదు. దళితు అగ్రవర్ణా కానీల్లోకి వెళ్లినట్లయితే సామాజిక దూరాన్ని పాటించ వసిన ఉంటుంది. కు కట్టుబాట్లకు అనుగు ణంగా మసుకోవాల్సి వుంటుంది. కులాంతర చర్చగాని, సామాజిక ఐక్యత గాని లేదు. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ వివేక్‌ కుమార్‌ ఇలా అంటారు. ‘’కు ఆధిపత్య హిందూ సమాజంలో దళితు ఎప్పుడూ బహిష్కృ తుగానే ఉన్నారు. నేటికీ వారు అగ్ర కుస్తు పొలాల్లో పని చేస్తున్నప్పటికీ…వారి దగ్గరకు వెళ్ళడానికి కూడా అనుమతించరు. వారి పశువును కూడా అగ్ర కుస్తు పొలాల్లో మేత మేయడానికి అనుమతించరు. ఉదయం బహిర్భూమికి కూడా సుదూర ప్రాంతాకు వెళ్ళ వసి ఉంటుంది’’. ప్రముఖ సామాజిక శాస్త్ర వేత్త అవిజిత్‌ పాఠక్‌ ఇలా అంటారు. ‘’నీవు ముస్లిమైనా,దళితుడవైనా,ఆధిపత్య శక్తు పరిమితు విధిస్తారు. భారతీయ సమాజంలో ఆధునికత స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, కొన్ని సంవత్సరాుగా భారతీయ సమాజం రోజు రోజుకు తిరోగమన దిశలో పయనిస్తోంది. వినిమయతత్వం పట్ల విపరీతమైన మోజుతో పాటు, తిరోగమన భావాు వ్యాపిస్తున్నాయి. మతమనేది ప్రధానమైనదిగా మారింది. ఉత్తర ప్రదేశ్‌లో అత్యున్నత స్థాయిలో ఘనీభవించిన కు చట్రంలో మనుగడ సాగించడం పెద్ద సాహసమే. ఇక్కడ కుపక్షపాతం, పితృ స్వామిక శక్తు ప్రాబ్యం బంగా వ్యాపించి ఉంది. కులాకు రాజకీయ ప్రతినిధు అండదండుంటాయి. ఉన్నావో మొదుకొని హత్రాస్‌ వరకు హింస పునరావృతం కావడం చూశాం. మృగప్రాయమైన అంశాకు ప్రాధాన్యతనిస్తూ, గొప్పగా చెప్పుకోవడం పరిపాటి’’.ఈ పరిస్థితి ఎప్పుడూ ఉన్నదే. అయినా, హత్రాస్‌ విషాదం తరువాత మీడియా దృష్టికి వచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఫ్న్‌ ప్రారంభం నుంచి క్షత్రియును సమర్థిస్తూ, వారిపై నమ్మకం వుంచుతున్నాయి. దేశ విభజన తరువాత ఈనాడు భారతీయ జనతా పార్టీ అధికారంలో వున్నది కాబట్టి వారు అధికార కుంగానే భావిస్తారు. యు.పిలో కాంగ్రెస్‌ పుకుబడి ఉచ్ఛస్థితిలో ఉన్న సమయంలో, మాయావతితో లేని దళిత కులాను తమ సామాజిక కూటమిగా ఎన్నుకున్నారు. వెనుకబడిన తరగతులో మౌర్యాను మొదుకొని, మల్లాు, పాసీ వరకు నూతన కూటమిని ఏర్పరుచుకున్నారు. కళ్యాణ్‌ సింగ్‌, ఉమాభారతి అధికారంలో ఉన్నంత కాం లోథాు వారితోనే వున్నారు. మల్లాు రామునితో తమకు ఉన్న అనుబంధాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. పరుశురాముని శ్వేదం నుంచి తాము ఉద్భవించినట్టు పాసీు చెప్తారు. ఒకవైపున యు.పిలో 9శాతం ఠాకూర్లు, పూర్తిగా వెనుకబడిన తరగతు నుంచి 32 శాతం ఓటర్లు బిజెపి వైపు ఉన్నారు. ప్రధాన మంత్రిని కూడా వెనుకబడిన తరగతు వాడిగా చెప్పుకోవడానికి ఇష్టపడ తారు! 2017 విధానసభ ఎన్నికల్లో 200 చిన్న సమావేశాు కు ప్రాతిపదికన జరిగాయి. ఈరోజున కు సమీకరణు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే, పై స్థాయిలో ఉన్న పోలీసు అధికారుల్లో, జిల్లా మెజిస్ట్రేట్‌ కోవిడ్‌ పునరా వాస కేంద్రాలో కూడా ఈ సామాజిక గ్రూపు ప్రాబల్యాన్ని గమనిస్తాం. ఈ నభై ఒక్క శాతమే రాష్ట్రంలో ఆధిపత్య శక్తిగా కనబడుతుంది’’ అంటారు ప్రొఫెసర్‌ పాఠక్‌. ఈ కు సమీకరణు…2017 నుంచి ఎన్‌కౌంటర్‌ పేరుతో దళితును, ముస్లింను ఏరిపారేస్తు న్నారనే వాదనకు మినహాయింపు లేని సాక్ష్యంగా వున్నాయి. యు.పి లో హత్రాస్‌ ఒక చిన్ని ప్రాంతం. హత్రాస్‌ ఢల్లీికి అత్యంత సమీపంలో వున్నదనే విషయం మన దృష్టిలో వుండాలి. కాబట్టి హత్రాస్‌లో బిజెపి జరిపే ప్రతి చర్యా ఢల్లీి, రాజస్థాన్‌, బీహార్‌పై ప్రభావం చూపుతుంది. కు, వర్గ అసమానతు, ఆధిక్య తతో కూడిన చైతన్యం మధ్యతరగతిలో గమని స్తామని ప్రొఫెసర్‌ పాఠక్‌ చెప్తారు. తన మాట ల్లోనే చూద్దాం.‘’వస కార్మికు సంక్షోభ సమ యంలో, మధ్యతరగతి ఉన్నత వర్గాు ఏ విధం గా ప్రవర్తించాయో మనం గమనించాం. అప్పుడు కూడా వారు అమెజాన్‌ సరుకు, ఆహారం,చేపు,చికెన్‌ అందుతాయో లేదో అనే దానిపైనే దృష్టి పెట్టారు. అత్యంత నీచమైన అంటరానితనం పాటించారు. పనివారు లిఫ్ట్‌ ఎక్కవచ్చా,కూరగాయు అమ్మేవారు కానీ లోకి ప్రవేశించవచ్చా అనే అంశాు ముందు కొచ్చాయి. కొన్ని సందర్భాలో బిజెపి శాసన సభ్యు అమ్మకందారును అవమానిం చటం, వారి ఆధార్‌కార్డు అడగటం గమనిస్తాం’’. గత కొన్ని సంవత్సరాుగా కు విభేదాు బాగా పెరిగాయి. కేవం సాధార ణమైన కులాధి పత్యమే కాదు, దళిత సమాజంలో కూడా కరుడుగట్టిన కు విభేదాు పొడచూపాయి. ప్రతి విషయం తమ రాజకీయ అవసరా ను బట్టి అంచనా వేయబడుతుంది. అధికార యంత్రాంగం లేక రాజకీయ విభాగం చాలా చురుగ్గా కు, ఉపకు అస్తిత్వ మంటను, రాజకీయాను ఏ స్థాయికి తెచ్చిందంటే ద్విజు (బ్రాహ్మణు) కానివారు, బిఎస్‌పి తో కానీ, ఎస్‌పితో గాని కవడానికి మీలేనంతగా జాగ్రత్త పడిరది. ఈ పరిస్థితుల్లో చిన్న కులాు అవినీతిపై, ఆధిపత్య కులానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాు చేయడం చాలా కష్టం అవుతుంది. ‘’వీటి ప్రభావాను గురించి ఆలోచిం చాల్సిన సమయం ఆసన్నమైంది. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం వాడే భాషనే బిజెపి యేతర ప్రభుత్వాు కూడా అనుసరించే ప్రయత్నం చేస్తున్నాయి.’’ అంటారు ప్రొఫెసర్‌ పాఠక్‌. సామాజిక పునర్నిర్మాణం ఎజెండాగా పని చేయవసిన అవసరం ఉంది. అన్నిటికంటే అభివృద్ధికే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వవసి ఉంది. మనం ఇప్పుడు నేరం ఎవరు చేశారనే దాని ఆధారంగా తీర్పు ఇచ్చే కాంలో జీవిస్తున్నామంటారు బరేలికి చెందిన విశ్రాంత విద్యావేత్త, సామాజిక కార్యకర్త ఇనుమూర్‌ రెహమాన్‌. ఒకవేళ దళిత లేక ముస్లిం యువతిపై అఘాయిత్యం జరిగినట్టయితే మీడియా గాని, అధికార యంత్రాంగంలోని అన్ని విభాగాు గాని కేసు నుంచి పక్కదారి పట్టించడానికే ప్రయత్నిస్తాయి. ముంబైలో రాజ్‌పుట్‌ హీరో ఆత్మహత్య చేసుకున్నప్పుడు యు.పి లోని చానళ్లన్నీ నిరంతరాయంగా ప్రసారం చేశాయి. కానీ గోండా జిల్లాలో ముగ్గురు దళిత యువతుపై యాసిడ్‌ దాడి జరిగినప్పుడు అదే మీడియావారికి వార్తగా కనబడలేదు. హత్రాస్‌లో జరిగింది కు దురహంకార హత్యగా నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతర ప్రదేశాలో వారి ఆత్మగౌరవంపై, మివపై దూషణతో దాడిచేయడం జరుగుతుంది. సెక్స్‌ వర్కర్‌పై అఘాయిత్యం జరిగినా అది అత్యాచారం కిందికే వస్తుంది కదా? కొన్ని శక్తుకు స్వేచ్ఛగా వ్యవహరించే హక్కును కల్పించినట్టుగా కనిపిస్తుంది. వారి కోసం ప్రత్యేకమైన నియమాు రూపొందించబడ్డాయి. హత్రాస్‌, ఉన్నావో ఇతర ప్రదేశాల్లో జరిగే సంఘటను కతపరిచే విధంగాఉన్నాయి. ఇది అధికారాన్ని దుర్వినియోగ పరచడమే. ఇవన్నీ అనాగరికమైన, ఆధిపత్యంతో కూడిన పురుషాధిక్య క్షణాలే. విషపూరిత భావాను, మనుషు మధ్య నిర్మితమైన అడ్డుగోడను, తొగించటానికి మనకు అనేక సంవత్సరాు పట్టవచ్చు. ఈ విధానాు భారతీయ సంస్కృతికి ఎంతో హాని చేస్తాయి. ఈగాయాన్ని మాన్పడానికి సుదీర్ఘకాం పట్టవచ్చు. ఈ సామాజిక క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడాల్సి వుంది. ఎందువ్లనంటే హిందూత్వ శక్తు దూకుడు వ్ల నిన్నటి స్నేహితులే నేటి శత్రువుగా మారిన పరిస్థితిని చూస్తున్నాం. చరిత్ర అదే మార్గం చూపుతుంది. కానీ, చరిత్రే అద్భుతాు సృష్టిస్తుందని, మనం నిస్తేజంగా నిరీక్షించలేం. మనం ఎక్కడో ఒకచోట నుంచి ప్రారంభించాలి. హత్రాస్‌ బాధితురాలికి న్యాయం జరగడమనేది మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. కు సంబంధమైన తప్పుడు మార్గాను తొగించే కార్యక్రమాకు ప్రాముఖ్యతను పెంచాలి. (‘ఫ్రంట్‌లైన్‌’ సౌజన్యంతో `వ్యాసకర్త : జియా ఉన్ స‌లామ్అసోసియేట్‌ ఎడిటర్‌)

1 2 3 4 5 6