సరికొత్త నవయుగం..యువతతోనే సాధ్యం

ఏ దేశానికైనా శక్తివంతమైన యువత పెట్టనికోట. ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న దేశం మనది. మన దేశానికి ఇదే అతిపెద్ద వనరు. యువత బాగుంటే దేశం బాగుంటుంది. యువత ప్రగతిపథంలో దూసుకెళ్తే దేశం అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలబడుతుంది. ‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం. నా నమ్మకం, ఆశ అంతా యువతపైనే’ అని స్వామి వివేకానంద అన్నట్లుగా సమాజ అభ్యుదయానికి యువత సంకల్పం తీసుకోవాలి.
మానవ సమాజం నిరంతరం ప్రవహించే జీవనది. ఆదిమవ్యవస్థ నుంచి ఆధునిక సోషలిస్టు సమాజం వరకూ వివిధ దశలుగా సాగుతూనే వుంది. వ్యక్తులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ, మానవుడు కొనసాగుతూనే వుంటాడు. మానవజాతికి సుదీర్ఘ చరిత్ర వుంది. పుట్టింది మొదలు చనిపోయే వరకూ మనిషి నిరంతరం పరిణామం చెందుతూనే వుంటాడు. ఒక తరానికి ఇంకొక తరానికి మధ్య మార్పు జరుగుతూ వుంటుంది. ముందు తరాలకన్నా తర్వాతి తరాలు మరొక అడుగు ముందుకేస్తుంటాయి. ఈ క్రమంలో పాత విలువలు, సాంప్రదా యాలను దాటుకొని, కొత్తదనం వైపు యువత పరుగులు పెడుతుంది. ఈ మార్పు కాల ప్రవాహంలో ఒక భాగం. ఏ విలువా స్థిరంగా పాతుకొని వుండదు. అయితే, ఈ మార్పును అర్థం చేసుకోవడానికి చారిత్రక పరిశీలన, శాస్త్రీయ దృష్టి, సామాజిక దృక్పథం అవసరం. సామాజిక శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం మనిషి జీవితం ఐదు దశలుగా సాగుతుంది. ఆ ఐదు దశల్లో అంత్యంత విలువైనది యవ్వనదశ. 15-35 ఏళ్ల మధ్య వయస్సుగల వారిని యువజనులుగా పరిగణిస్తారు. ఇది చురుగ్గా,సృజనాత్మకంగా వుండే దశ.వర్గ,వర్ణ,లింగ భేదం లేకుండా, పేదలు, ధనవంతులన్న తేడా లేకుండా వీరందరూ ఒక సాంఘిక సమూహం. ఇంటిలోనైనా, వీధిలోనైనా ఉరకలెత్తే సమూహం యువతరం.సందడికైనా,సాహసానికైనా ముందు నిలిచే సందోహం యువతరం. వాహనానికి ఇంధనం ఎలాగో దేశానికి యువతరం అలాగ. దేహానికి రుధిరం ఎలాగో సమాజానికి నవతరం అలాగ.ఎక్కడైనా,ఎప్పుడైనా దేన్నయినా శోధించి..సాధించి, అధిగమించి.. అధిరోహించి విజయ పతాకాన్ని ఎగరేయడం యువతరానికి సహజ సిద్ధంగానే సమకూరే విద్య. దానికి సరైన నైపుణ్యమూ,సహకారమూ, లక్ష్యమూ జోడిరచగలిగితే- ఆ విజయాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు.అదేసమయంలో అలా ‘పట్టించుకోనివ్వని’ విధంగా ఎన్నో ప్రతికూల ప్రభావాలూ స్వారీ చేస్తుంటాయి. ‘ఇవాళ్టి యువతను బట్టే.. రేపటి భవిష్యత్తు ఉంటుంది’ అంటారు విల్లీ స్టార్గెల్‌. ‘నేటి బాలలే రేపటి పౌరులు’గా, దేశభవితకు పునాదిరాళ్లుగా ఎదగాలంటే ఎలాంటి యువతరం ఈ దేశానికి అవసరం? నేటి యువతరం ఎలా ఎదుగుతోంది? అన్నది పరిశీలించాల్సిన అవసరం వుంది.
మనం ఎక్కడున్నాం.. అంటే?..
చరిత్రలో అయినా, సమాజంలోనైనా యువత పాత్ర ఎంతో కీలకం. ఏ ఉద్యమం విజయ వంతం కావాలన్నా, ఏ ప్రాజెక్టు ఫలవంతం అవ్వాలన్నా వారి క్రియాశీలత ప్రధానం. అందుకనే వందేళ్ల క్రితం వివేకానందుడు ప్రత్యేకించి యువతరాన్ని మేల్కొలిపే ఉద్యమం చేపట్టాడు. యువతరం పూనుకుంటే దేశాన్ని ముందుకు నడిపించ వొచ్చని స్పష్టం చేశాడు. ‘ప్రశ్న ఆయుధం కావాలి. ప్రతి దానికీ తలూపటం కాదు, తర్కించాలి. హేతు బద్ధంగా లేని దేనినీ నమ్మక్కర్లేదు’ అని చాటిచెప్పాడు. కానీ, ఇన్నేళ్ల తరువాత వెనక్కి తిరిగి చూస్తే.. మనం ఎక్కడ ఉన్నాం? ప్రపంచ దేశాలన్నింటి కన్నా అత్యధిక యువ జనాభా వున్న దేశం భారత్‌. ప్రపంచంలో 180 కోట్ల యువజనులు ఉంటే- అందులో 28 శాతం మన యువతే! మన దేశంలో ఇప్పుడు సగటు వయసు 29 ఏళ్లు. అంటే భారత్‌ నవనవలాడుతున్న ఒక యువజన దేశం. మరి వుండాల్సినంత ఉత్తేజంతో.. ఉత్సాహాలతో మన యువతరం ఉందా? అంటే ప్రశ్నార్థకమే. అధికారిక లెక్క ప్రకారం- దేశంలోని 30 శాతం మంది యువతకు ఉద్యోగం కానీ, ఉపాధి కానీ లేదు. ఈ విషయంలో మనం శ్రీలంక, నేపాల్‌ కన్నా వెనకబడి వున్నాం. సంఖ్య రీత్యా ప్రపంచ జనాభాలో రెండోస్థానంలో వున్న మనం.. ఆ యువశక్తిని పనికి ఉపయోగించుకోవటంలో 103వ స్థానం. యువతరం అంటే కేవలం ఓట్లు కాదు, వనరులు కూడా. ఫలితమూ, ప్రయోజనమూ, ఉత్పాదకత ఉన్న రంగాల్లో యువత నిమగమై ఉండాలన్న మన స్వాతం త్య్రోద్యమ స్ఫూర్తి.. ఆచరణలో అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. చదువులు, సాంకేతికత పెరిగేకొద్దీ ఉత్పాదక రంగాల్లో యువత భాగస్వాములు కావాలి. కానీ, నేడు అందుకు భిన్నమైన దృశ్యం కనిపిస్తోంది. సాంకేతిక విప్లవాన్ని వినియోగించుకొని అజ్ఞానపు సామ్రాజ్యం పెచ్చరిల్లుతోంది. ‘ఎల్ల లోకము ఒక్క ఇల్లై..’ విలసిల్లాలని అభిలషించిన గురజాడ వంటి మహాకవుల మాట ఇప్పుడు..కుల,మత,ప్రాంత విభేదాల దొంతర్ల మోతలో పొల్లుపోతోంది. యువశక్తి దేశ సర్వతోముఖాభివృద్ధికి, శాస్త్రీయ పురోగమ నానికి, సమభావన, సౌభ్రాతృత్వం విలసిల్లే దిశగా దోహదపడాలి.‘ఓ తరం గొప్పదవు తుంది. అది మీ తరమే కావొచ్చు. మీ గొప్ప దనాన్ని వికసింపనివ్వండి’ అంటారు నెల్సన్‌ మండేలా. నవీన పథంలోకి దేశాన్ని మళ్లిం చటానికి ఉపయోగపడాలి. అది ఈ తరమే కావొచ్చు.
ఉపాధి.. ఉద్యమాలు..
యువతరం దేశానికి ఇంధనం. ప్రగతికి రథ చక్రం. చరిత్రలో ఏ మార్పు సంభవించినా అది ఉరకలెత్తే యువత వల్లే సాధ్యం. అలాంటి యువశక్తి నిర్వీర్యమౌతుందన్నది నిష్టురసత్యం. దేశంలో దాదాపు 16శాతం నిరుద్యోగం ఉంది. సామర్థ్యం ఉన్నప్పటికీ చదువుకు తగ్గ ఉద్యోగాలులేక నానా తిప్పలూ పడాల్సి వస్తోంది. పెద్దపెద్ద ప్యాకేజీల గురిం చి వార్తలు వస్తున్నా.. నిజానికి అలాంటి వేత నాలు పొందుతున్న వారి సంఖ్య మూడు శాతానికి మించిలేదు. ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభిస్తున్న సాఫ్ట్‌వేర్‌ వంటి రంగా ల్లో పనిఒత్తిడి, పనిగంటలు దారుణంగా ఉం టున్నాయి. ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో, వచ్చే వేతనంలో ఎంత కోత పడుతుందో అర్థంకాక సీనియర్లను సైతం భయం వెంటాడు తోంది. ఇలాంటి సమస్యలపై 150ఏళ్ల క్రితమే సాధారణ కార్మికులు సంఘటితమై పోరాడారు. చాలా సదుపాయాలు సాధించు కున్నారు. ఇప్పుడు ప్రశ్నించే గొంతులను రాజ్యం నియంతృత్వంగా అణచివేస్తోంది. నయా ఉదారవాద విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ దోపిడీ మరింత పెరిగింది. ఈ మధ్యకాలంలో అమెరికా, ఫ్రాన్స్‌,ఐరోపా దేశాల్లోని యువత తమ హక్కుల కోసం రోడ్లమీదకి వస్తున్నారు. నిరస నల ప్రవాహమవుతున్నారు. ‘యువతరం శిరమెత్తితే..నవతరం గళమిప్పితే/ లోకమే మారిపోదా.. చీకటే మాసిపోదా?’ అన్న కవి ఆశాభావం వృథా పోకుండా.. మన దేశం లోనూ నిరుద్యోగ యువత గళం విప్పాలి. దేశ అభివృద్ధిలో భాగస్వాములవ్వాలి.
పెరుగుతున్న అసంతృప్తి
దేశ ఆర్థిక,రాజకీయ,సామాజిక రంగాల.. దశ, దిశలను అభివృద్ధి వైపు నడిపించాల్సిన బాధ్యత యువతపైనే ఉంది. అటువంటి యువతను మతోన్మాదం వైపు, కులోన్మాదం వైపు.. ఉగ్రవాదం వైపు నడిపిస్తూ.. తప్పుడు వాగ్దానాలతో పాలక వర్గాలు తమ పబ్బం గడుపుకుంటున్నాయి. యువతరం శక్తిసామ ర్థ్యాలను నిర్వీర్యం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా యువతరంలో పెరుగుతోన్న అసంతృప్తిని ఇటీవల ఒక మీడియా రిపోర్ట్‌ తెరపైకి తెచ్చింది.‘రాబోయే రోజుల్లో/ నెలల్లో పెద్ద ఎత్తున వచ్చే తిరుగుబాట్లలో మీరు చురుగ్గా పాల్గొంటారా..?’అనే ప్రశ్నను 35 దేశాల్లోని 18-34ఏళ్ల మధ్య వయస్కులైన సుమారు 5,80,000 మందిని అడిగితే.. ‘పాల్గొంటాం..!’ అని సగం మందికి పైగా చెప్పారట. దీన్నిబట్టి యువతలో ఎంత అసంతృప్తి దాగుందో అర్థం చేసుకోవచ్చు. ఇందుకు మన దేశమేమీ అతీతం కాదు. చదవడానికి సీట్లు రాక,చేయడానికి ఉద్యోగం లేక రగిలిపోతున్న యువతరం పాలకవర్గాల కుటిలనీతిని గుర్తించాలి. ‘క్షణము గడిచిన దాని వెన్కకు మరల్ప సాధ్యమే మానవున కిలాచక్రమందు’ అంటారు గుర్రం జాషువ. మన చుట్టూ జరుగుతోన్న వాస్తవ పరిస్థితులను గుర్తించడంలో ఏమాత్రం ఏమరుపాటు వహించినా ఒక తరం అభివృద్ధి ప్రమాదంలో పడుతుంది. యువశక్తి దేశాభ్యుదయానికి జీవనాడి. ఆ తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా వుంది. దేశం కోసం తమ జీవితాలను తృణప్రాయంగా అర్పించిన భగత్‌సింగ్‌ లాంటి మహనీయుల త్యాగాలను అందుకోవాలి. స్వాతంత్య్రం కోసం వారు చిందించిన నెత్తుటి ధారలను గుండెలకు అదుముకోవాలి. మనకు కావాల్సింది కేవలం రాజకీయ స్వాతంత్య్రమే కాదు.. కోట్లాది భారతీయులు కలలుగన్న ఆర్థిక స్వాతంత్య్రం కూడా. కుల మతాల వివక్షలేని సామాజిక న్యాయం కావాలి. రైతన్నలు పస్తులుండని స్వర్ణయుగం రావాలి. వరకట్న దురాచారం, లైంగిక దాడులు, అవినీతి, దోపిడీలకు ఆస్కారం లేని సమసమాజం కావాలి. అలాంటి మరో ప్రపంచం.. సరికొత్త నవయుగం..యువతతోనే సాధ్యం.
పొంతనలేని మాటలు, చేతలు..
ఎన్నికల హామీలు, రాజకీయ పార్టీల ప్రచారాలలోని వాస్తవాలను యువత అవగతం చేసుకోవాలి. పొంతలేని, ఆచరణ సాధ్యంకాని వారి మాటలు, చేతలను అర్థం చేసుకోవాలి. వాస్తవాలను బేరీజు వేసుకోవాలి. మతము-కార్పొరేట్ల కలయిక దేశానికి హాని కరం. వారే ఇప్పుడు దేశాన్ని నడిపిస్తు న్నారు. వీరి కబంధ హస్తాల్లో చిక్కుకొని దళిత, గిరిజన బలహీన వర్గాల ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఈ వర్గాలకు చెందాల్సిన దేశ సంపదను, ప్రకృతి వనరులను ఒకరిద్దరికే దోచిపెడుతున్నారు. యువశక్తిని నిర్వీర్యం చేయడం ద్వారా రాజకీయాలంటే విముఖత చూపేలా వారిని దూరం పెట్టేస్తున్నారు. మాకెందుకొచ్చిన రాజకీయాలు అని యువత అనుకోవడం వల్లనే అనర్హులు, సంఘవ్యతిరేక శక్తులు రాజకీయాల్లోకి వస్తున్నారు. దేశాన్ని ప్రజలను దోచుకుంటున్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను సమూలంగా నాశనం చేస్తున్నారు. అవినీతి భ్రష్ట రాజకీయాలను ప్రక్షాళన చేయాలంటే.. యువత రాజకీయా ల్లోకి రావాలి. రాజకీయాలకు కొత్త రక్తాన్ని ఎక్కించాలి. నవ యవ్వనంతో తొణికిసలాడే సరికొత్త భారతాన్ని ఆవిష్కరించే శక్తి యువతరానికే వుంది. ఆ దిశగా యువతరం తమ మేధకు పదునుపెట్టాలి.
యువరక్తం.. కవితత్వం..
యువరక్తానికి.. విప్లవానికి, కవిత్వానికి.. గట్టి సంబంధం ఉంది. భగత్‌సింగ్‌, రాజ్‌గురు, చంద్రశేఖర్‌ ఆజాద్‌, రుద్రమదేవి, రaాన్సీ లక్ష్మీబాయి, బుద్ధుడు, శంకరాచార్య, స్వామి వివేకానంద వంటివారు యువకులుగా వున్నప్పుడే ప్రపంచంలో ఒక సుస్థిర స్థానం పొందారు. ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ అని భగత్‌సింగ్‌ నినదించింది, దేశాన్ని కదిలిం చింది 23 ఏళ్ల యువకుడిగా ఉన్న ప్పుడే. అల్లూరి సీతారామరాజు ‘వందేమాతరం’ అని విశాఖ మన్యాన్ని చైతన్యబాటలో కదిలించింది 24 ఏళ్ల వయస్సుకే.‘శీతకాలం కోత పెట్టగ/ కొరడు కట్టీ/ ఆకలేసీ కేకలేశానే’ అనే కవితతో శ్రీశ్రీ ‘జయభేరి’ మోగించింది 23 ఏళ్ల వయస్సులోనే. ‘పద్దెనిమిదేళ్లు దాటేస్తున్నా.. ఒక్క మంచి కవితా రాయలేదే’ అని మహాకవి జాన్‌మిల్టన్‌ మధనపడిరదీ లేలేత ప్రాయం లోనే. సాహిత్యంలో ‘సర్రియలిజం’ ప్రక్రియను ప్రవేశపెట్టిన రaంరaామారుత ఫ్రెంచ్‌ కవి ఆర్థర్‌ రాంబో తన టీనేజ్‌లోనే రాయవలసిం దంతా రాసేసి,20వ ఏట రిటైర్‌ అయి పోయాడు. 80ఏళ్ల వయస్సులో అమెరికా వెళ్ళిన ఇంగ్లీష్‌ కవి విలియమ్‌ వర్డ్స్‌వర్త్‌.. తన పద్యాలు చదువుతున్న కుర్రాళ్లను ఆపి, ‘ఈ మధ్య రాసినవి చదవొద్దు.నా తొలిరోజుల్లో రాసినవి చదవండి. అవే నాకు ఇష్టం’ అని సూచించాడట. టి.ఎస్‌. ఇలియట్‌ తన మాస్టర్‌ పీస్‌ అయిన ‘దివేస్ట్‌ ల్యాండ్‌’ ను, జాన్‌కీట్స్‌ తన అత్యుత్తమమైన కవిత్వమంతా పాతికేళ్ల లోపే రాసేశారు. ‘నూనూగు మీసాల నూత్న యవ్వనమున శాలివాహన సప్తశతి నుడివితి’నని శ్రీనాథుడే స్వయంగా రాసు కున్నాడు. ‘ఎమోషనల్‌ ఫెర్వర్‌ ఉన్నంత కాలం మంచి కవిత్వం వస్తుంది’ అంటాడో పాశ్చాత్య కవి. దానికి కారణం యవ్వనంలో ఉండే దూకుడు,నిలదీత,ఆగ్రహం, తిరుగుబాటు- కవికి భావోద్వేగాల ఆవేశాన్నిస్తాయి. కవిత్వం నీటిబుగ్గలా ఉబుకుతుంది. ఆ స్వచ్ఛత దానికి సజీవత్వాన్నిస్తుంది.తెలుగులో భావ, అభ్యుద య, విప్లవ కవులు,ఆ తర్వాత స్త్రీవాద,దళిత, మైనారిటీ, బహుజన కవులంతా దాదాపుగా అయితే ఉద్యమాల యవ్వనంలో లేదా తాము యవ్వనప్రాయంలో ఉన్నప్పుడో రాసినవే ఎక్కువ.
పెరుగుతున్న నిరుద్యోగం..
నిరుద్యోగ యువత రోజురోజుకు పెరుగుతోంది. ఉపాధి కల్పనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. కేంద్ర బిజెపి ప్రభుత్వం యువతకు తీరని ద్రోహం చేసింది. మోడీ చెప్పిన సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు. నల్లధనం బయటకు రాలేదు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా లేదు. విభజన హామీలు అమలు కాలేదు. కడప ఉక్కు, రామాయపట్నం పోర్టు నిర్మించి వుంటే ఈపాటికి వేలమందికి ఉపాధి లభించి వుండేది. ఉద్యోగాల గురించి అడిగితే బజ్జీలు, పకోడీలు అమ్ముకోండంటూ అమిత్‌ షా యువతకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఏ దేశంలోనైనా యువత యొక్క శక్తి సామర్థ్యాలు సక్రమంగా సరైన మార్గంలో ఉపయోగించుకుంటేనే ఆ దేశం అభివృద్ధి సాధ్యమవుతుంది. గత 77ఏళ్ల స్వాతం త్య్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువత శక్తి సామర్థ్యాలను నిర్వీర్యం చేశాయి. దేశంలో గత 45ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిందని నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ లెక్కలు చెబుతున్నాయి. సిఎంఐఇ చెబుతున్న లెక్కల ప్రకారం..ఐదు కోట్ల మందికి తక్షణమే ఉపాధి కల్పించాలి. లేదంటే దేశం తీవ్ర సంక్షోభంలో పడుతుం దని హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల నిరుద్యోగం పెద్దఎత్తున పెరిగింది. చదువుకు తగ్గ ఉద్యోగాలు రావడం లేదు. ఇంజనీరింగ్‌ చదివిన వారిలో కేవలం 15 శాతం మందికి మాత్రమే వారి చదువుకు తగ్గ ఉద్యోగాలు వస్తున్నాయి. పిహెచ్‌ డి, పీజీలు, బిటెక్‌ చదివినవారు ఉపాధి కోసం చిన్నచిన్న ఉద్యోగాలు చేసు కోవాల్సి వస్తోంది. మరికొందరు ఆటోలు నడుపుకునే పరిస్థితికి నెట్టబడ్డారు. ఇంకొం దరు నిరాశ, నిస్పృహలతో డ్రగ్స్‌కు, నేరాలకు బానిసలవుతున్నారు. దేశానికి బలీయమైన శక్తిగా రూపొందాల్సిన యువతను ప్రభుత్వాలు నేరస్తులుగా,ఉగ్రవాదులుగా మారుస్తున్నది. యువతంటే మార్పును ఆశించే నవతరం. అవకాశాలను అందిపుచ్చుకొని, భవితకు బాటలు వేసుకునే ఆత్మవిశ్వాసం వారి సొంతం. చెడు వ్యసనాలకు బానిసలై పెడదోవ పడితే భవితకే నష్టం. వీరిలో కొందరు యువత ఉన్నత లక్ష్యాలను ఏర్పర్చు కొని కష్టపడుతున్నారు. మరికొందరు లక్ష్యం లేకుండా సరదాలు,సెల్‌ఫోన్లు,సోషల్‌ మీడియా,మద్యం,డ్రగ్స్‌ వంటి అలవాట్లకు బానిసలై విలువైన జీవితాన్ని పాడు చేసుకుం టున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా కొత్తదనపు అనుభూతి కోసంప్రయత్నిస్తున్నారు.
ప్రకటనల ప్రభావం..
ఈ ఆధునిక యుగంలో వివిధ మాధ్యమాలో వస్తున్న ప్రకటనలు ముఖ్యంగా యువతను తీవ్ర ప్రభావితం చేస్తున్నాయి. ఆయా ప్రకటన లలో కనిపించే సెలబ్రిటీలను గుడ్డిగా అనుకరిస్తూ తమ ఆరాధ్యదైవంగా అనుసరి స్తారు. ఈ సెలబ్రిటీల హెయిర్‌ స్టైల్‌ ఎలా వుంటుంది,వారు ఏ బ్రాండ్‌ దుస్తులు ధరిస్తా రు, ఏ బ్రాండ్‌ ఫెర్ఫ్యూమ్స్‌ వాడతారో.. వాటి నే తామూ వాడాలని కోరుకుంటారు. దీని కారణంగా మధ్యతరగతి ఆర్థిక సంక్షోభానికి గురవుతుంది. ప్రతి ఒక్కరూ వారు కోరుకునే అన్ని విలాసాలను కొనుగోలు చేయలేరు. కానీ, బ్రాండెడ్‌ బట్టలు, సౌకర్యాలను పొందాలన్న కోరిక యువతలో ఒత్తిడిని పెంచుతోంది. ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోయినా..ఈ ఒత్తిడి వారికి నచ్చిన వస్తువులను కొనుగోలు చేసే విధంగా వారిని ప్రేరేపిస్తుంది. వివిధ ఆఫర్‌లు, డిస్కౌంట్‌ల ద్వారా ఆకర్షితులవు తున్నందున కొన్నిసార్లు ఈ యువత తమకు అక్కరలేని వస్తువులనూ పెద్దమొత్తంలో కొనుగోలు చేసేందుకు ఉద్యుక్తులవుతారు. కార్పొరేట్‌ కంపెనీలు తమ లాభాలను పెంచుకునేందుకు ఇలాంటి అనేక వ్యూహాలను అనుసరిస్తుంటారు. యువత తమ తొందర పాటుతోనో, ఆయావస్తువులపై వున్న మోజు తోనో కంపెనీల వ్యూహంలో చిక్కుకుంటు న్నారు. వీటితో పాటు సినిమాలు, డ్రగ్స్‌ కూడా యువతపై తీవ్రప్రభావం చూపుతున్నాయి. నేటి యువత తమ ఆలోచనా శక్తికి పదును పెట్టాలి. వీటి నుంచి బయటపడాలి.
సమానత్వం దిశగా..
స్త్రీ-పురుష సమానత్వం సాధించే దిశగా గతంలో ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ ఫలితమే ఇప్పుడు మనం చూస్తున్న ఈపాటి మార్పు. ఈ ప్రయత్నాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం వుంది. కట్నాలు తీసుకోని యువకులు ఈ మధ్య కాలంలో చాలా పెరిగారు. కానీ, ఆ సంఖ్య ఇప్పటికీ అత్యల్పమే. దీనిపట్ల యువతలో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం వుంది. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా మాట్లాడటం, వ్యవహరించడం బాగా పెరగాలి. కానీ, ఈ కాలంలో సైన్స్‌ని, చాదస్తాన్ని కలగలిపి మాట్లాడేవారు పెరిగారు. మనం గొప్పవాళ్లం అని చెప్పుకోవడానికి మన గతమంతా ఘనమైనదేనని జబ్బలు చరుచుకోవడం మంచిది కాదు. తార్కిక దృష్టితో చూస్తే.. మంచి చెడ్డలు రెండూ విడివిడిగా బోధపడ తాయి. గతంలో మంచి కొంచెమేనని, రానున్నది మంచికాలనమని వందేళ్లనాడే ఉద్ఘాటించాడు మహాకవి గురజాడ. వాస్తు, జ్యోతిష్యం వంటివి ఇంతగా అభివృద్ధి చెందని కాలంలో ప్రజలకు కొంత ఉపయోగడ్డ మాట నిజమే. ఇప్పుడు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంతకు మించి అభివృద్ధి చెందింది. ఇంకా వాటిని పట్టుకొని వేలాడ్డంలో ఔచిత్యం లేదు. కొందరు పాత నమ్మకాల్లో ఏదో అంతరార్థం వుందంటూ.. సైన్సుని గుప్పించి చెబుతూ వుంటారు కుహనావాదులు.
నాడే అధికం..
ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్య దేశంగా, అత్యధిక యువశక్తి ఉన్న దేశంగా చెప్పబడుతోన్న మనదేశంలోని చట్టసభల్లో వారికెంత ప్రాధాన్యతనిస్తున్నామో ఆలోచిం చాల్సిన తరుణం ఇది. 2011జనాభా లెక్కల ప్రకారం..66% జనాభా 35ఏళ్లలోపు వారే ఉన్నారు. లోక్‌సభలో ఈ యువతరం శాతాన్ని చూస్తే నిరాశే కలుగుతుంది. మొత్తం 545 మంది సభ్యులున్న ప్రస్తుత 17వ లోక్‌సభలో 35 ఏళ్లలోపు వారి సంఖ్య కేవలం 21 మాత్రమే. పేదరికం విలయ తాండవం చేస్తున్న..అక్షరాస్యత అంతంత మాత్రంగానే ఉన్న సమయంలో ఏర్పడిన తొలి లోక్‌సభ (1952)లో యువ సభ్యుల సంఖ్య 82. ఇప్పటివరకు ఆ రికార్డు అలాగే వుంది. భారత్‌ ప్రపంచ యువ దేశంగా ఆవిర్భవిం చిన ఈ సమయంలోనే..35 ఏళ్లలోపు సభ్యుల సంఖ్య ఎన్నడూ లేనంతగా 21కి పడిపో యింది. తొలి లోక్‌సభలో సభ్యుల సగటు వయసు 46.5 కాగా, ప్రస్తుత లోక్‌సభలో సగటు వయసు 55 ఏళ్లు. అయితే, మహిళల వాటా పెరిగింది. యువతరం పెరగకున్నా సభలో మహిళల వాటా పెరగడం సంతోషిం చాల్సిన అంశం. తొలి సభలో 22 మంది (4.41%) మహిళా ఎంపీలుండగా..ప్రస్తుత సభలో వారి సంఖ్య 78 (14.36%)గా ఉంది. ఇంత మంది మహిళలు లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఏ సభలోనూ లేరు. అయితే, మహిళలు బయటకు రావడానికి అనేక ఆంక్షలున్న రోజుల్లో రాజకీయాల్లోకి ఆమాత్రమైనా వచ్చారంటే.. ఆ సంఖ్య తక్కువేమీ కాదు.
సమాజ సేవలో ….
లే.. మేలుకో.. లక్ష్యం చేరుకునే వరకు విశ్రమించకు అన్నారు స్వామి వివేకానంద. వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం అన్నాడాయన. జాతి నిర్మాణ క్రతువులో యువత భాగస్వామ్యం ఎంతో కీలకం. దేశ సంపదను పెంచి పోషించే చోదక శక్తి యువతే. మేము సైతం సమా జానికి సేవ చేయాలనే భావన యువతలో అధికమవుతున్నది. కొంతమంది ఇప్పటికే వివిధ సంఘాలు స్థాపించి, లేదా గ్రామాల్లో ఒక్కటిగా అయి తమ సమీపంలో ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తున్నారు. సరదాలు.. షాపింగ్‌ సినిమా.. యువత అంటే ఇంతేనా? కాదు.. అంతకుమించి అని నిరూపి స్తున్నారు ఈ యువకులు. కష్టాల్లో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించి పెద్ద మనసు చాటు కుంటున్నారు. మానవత్వం మురిసేలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ యువకులు ఆదర్శంగా నిలుస్తున్నారు.– (రాజాబాబు కంచర్ల)

జనం ప్రేమ గెలుచుకున్న కోయ దొరసాని

అనసూయ అలియాస్‌ సీతక్క నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సాధారణ మహిళ లేదా రాజకీయ వారసత్వం అందుకున్న మహిళ అయితే అందులో ప్రత్యేకత ఏమీ లేదు.కానీ మావో యిస్టుగా ఉండి తర్వాత జనజీవన స్రవంతిలో కలిసి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తర్వాత మంత్రి కావడం అంటే ఆషామాషీ కాదు. అందులోనూ ఒక గిరిజన మహిళ అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొని,కేసులను తలపడి.. చివరకు రాజ్యాంగాన్ని రచించే టీంలో భాగస్వామ్యులవుతున్నారంటే ఒక్క సీతక్కకే సాధ్యం. ప్రజల్లో ఉంటూ..నిత్యం వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడే వాళ్లకు ఎక్కడా అపజయం ఉండదు అనడానికి సీతక్క జీవితమే ఉదాహరణ…
ఆదివాసీ సమూహాలలో ఇప్పటికీ చాలావరకు మాత్రుస్వామిక కుటుంబ వ్యవస్థ తాలూకు లక్షణాలు కొనసాగుతున్నాయి. వాటిలో ‘కోయ’ తెగ ఆదివాసీ తెగ మాతృస్వామిక సంస్కృతికి ఒక ఆదిమ జాడ వంటిది. అమ్మాయి ఇతర కులం అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అతని నాలుకమీద కాల్చిన ఇనపకడ్డీతో వాత పెట్టి,అల్లుడికి తమ ఇంటిపేరు ఇచ్చినాకగానీ వాళ్ళు అతన్ని ఇంట్లోకి రానివ్వరు…అటువంటి తెగలో పుట్టిన ఆమె ఓ కొండ దొరసాని…ఆదివాసుల సాధికారతను కాలరాసిన మధ్యయుగా లనాటి రాజ్య దురహంకారంమీద వీరోచితంగా పోరాడి తమ స్వాభిమా నాన్ని చాటిన సమ్మక్క,సారలమ్మల పోరు వారసత్వం ఆమెది.ఆమె ‘రణధీర’ తనకి యుద్ధం కొత్తకాదు,ధిక్కారం తన రక్తంలోనే వారసత్వంగా తెచ్చు కుంది. అందుకే చిన్నతనంలో కత్తిపట్టి అడవి బాట పట్టినా ఎమ్మెల్యే అయ్యాక తన మనుషుల ఆకలి తీర్చడానికి కొండలు కోనలు దాటినా జనం కోసమే! ఆమె పేరు ‘ధనసరి అనసూయ’ అలియాస్‌ ‘సీతక్క’.అడవిలో పుట్టి అడవిలో పెరిగిన సీతక్కకి కష్టాలు,కడగండ్ల గురించి పుస్తకాలలో చదవా ల్సిన పనిలేదు. గ్రంధాలయాలలో వుండే పుస్తకా లకు మించిన జ్ఞానం ఆమెకి అనుభవాలనుంచి అబ్బింది. పట్టణాలకు, గ్రామాలకు దూరంగా విసిరేసిన కోయ గూడెంలో అరకొర సౌకర్యాలు, అగచాట్లమధ్య పెరిగిన తనకి ఆకలి రుచి తెలుసు. అలాగే, సాయుధదళాలలో అడవి లోత ట్టు ప్రాంతాలలో తిరుగుతున్నప్పుడు కనీసం తిన డానికి తిండి, తాగడానికి మంచినీరు కూడా లేక పస్తులతో నడిచినరోజులు, పాచి పట్టిన అన్నా న్ని ఎండబెట్టుకుని తిన్నరోజులూ తెలుసు.
అడవిలో దొరికే ఆకూ,అలమా ఏరు కొచ్చుకుని,పోడు వ్యవసాయంలో పండిన రాగి గింజలతో అంబలి కాసుకుతాగే ధనసరి సమ్మక్క, సమ్మయ్యల రెండవ సంతానం‘అనసూయ’. తన కంటే ముందు అన్న‘సాంబయ్య’ వున్నాడు. సమ్మ క్క, సమ్మయ్యల బిడ్డగా మొదలైన అనసూయ ‘సీతక్క’ గా మారడం వెనకవున్నది బతుకునుంచి వచ్చిన తిరగబడే తత్వమే! వుమ్మడి వరంగల్‌ జిల్లా, (ప్రస్తుత ములుగుజిల్లా) ములుగు మండ లం, జగ్గన్నపేటలో పుట్టింది. అటవీ గ్రామమైన తమ గూడెంకి తరచూ ‘అన్నలు’ వచ్చి కరప త్రాలు పంచి, పాటలు పాడి, జనానికి దొరల దౌర్జన్యాలను ప్రశ్నించే చైతన్యాన్ని అందించేవారు. అనసూయ మేనమామ ఆమె బాల్యంలోనే అన్న లలో కలసిపోయాడు. ఆమె అన్న‘సాంబయ్య’ కూడా జనశక్తి పార్టీ కొరియర్‌గా వున్నాడు. హై స్కూలు రోజులనుంచే విద్యార్ధి ఉద్యమాలలో క్రియాశీలకంగా వుండే అనసూయ పదో తరగతి అయ్యాక జనశక్తి పార్టీ వుద్యమకారిణిగా సాయుధ దళాలలోకి వెళ్ళింది. అక్కడే వుద్యమ తరగతు లకు హాజరై సిద్ధాంతపరమైన పుస్తకాలు, సాహి త్యం చదివింది. ఆయుధాలు ఉపయోగించడం, దళాలను ఆర్గనైజ్‌ చెయ్యడంలో నేర్పుగలిగిన కార్యకర్తగా గుర్తింపు పొందడంతోపాటు తక్కువ సమయంలోనే దళ కమాండర్‌ స్థాయికి ఎదిగి మూడు జిల్లాలకు తన కార్యక్రమాలను విస్తరింప జేసింది.దళ కమాండర్‌గా వున్నప్పుడు తన మారు పేరు ‘రణధీర్‌’.నల్లగా,పొడుగ్గా,చలాకీగా ఖాకీ యూనిఫారంలో అచ్చం అబ్బాయిలాగే వుండేది. అయితే అక్కడ వుండే పితృస్వామిక ధోరణి ‘రణధీర్‌’ని ‘సీత’ని చేసింది.ఉద్యమ పెద్దలు ‘కుంజా రాము’ అనే నాయకుడితో పెళ్లి చెయ్యాలని నిర్ణయించి,పార్టీ పద్ధతుల్లోనే పెళ్లి జరిపినా, ఆ రాముడికి సహచరిగా ఆమె‘సీత’,‘సీతక్క’ అయ్యిం ది.ఖమ్మం జిల్లాకొత్తగూడెం వాడైన రాము కూడా కోయ జాతికి చెందిన తన దూరపు బంధువు కావడం విశేషం.
సీత గర్భవతిగా వున్నప్పుడు పోలీసు లకి చిక్కిఅరెస్టై, జైలు జీవితం గడిపింది. ప్రసవం సమయానికి బైటికొచ్చి పుట్టిన రెండునెలల బాబుని బంధువులకు అప్పగించి మళ్ళీ రసహ్య జీవితం లోకి వెళ్ళింది. తర్వాత బంధువుల నుంచి బాబు ని ఆమెతల్లి తీసుకెళ్ళి పెంచి హాస్టల్‌లో చేర్చింది. సుమారు ఎనిమిదేళ్ళు జనశక్తి నక్సలైట్‌గా,దళ కమాండర్‌గా వుద్యమానికి అంకితమై చావైనా, బతుకైనా జనం కోసమే అనుకున్న సీతక్కకి పార్టీ లో ఏర్పడిన సిద్ధాంతపరమైన విభేదాలు, చీలిక లు ఆమెని జనజీవన స్రవంతిలోకిరాక తప్పనిస్థితి కలిగించాయి. ఈలోపల తనభర్త రాముతో కూడా విభేదాలు వచ్చి విడిపోయింది. రాము జనశక్తి పార్టీలోనే కొనసాగి కొన్నాళ్ళ తర్వాత ఎన్కౌంటర్‌ లో చనిపోయాడు. తన ఉద్యమ సహచరులంతా తలోదారి చూసుకున్నప్పుడు సీతక్క కూడా బైటి కొచ్చి మధ్యలో ఆగిపోయిన చదువుని కొనసాగిం చింది. హైదరాబాద్‌లో ఒక చిన్న రూమ్‌ తీసు కుని ఐదుసంవత్సరాల న్యాయశాస్త్రంలో ఎల్‌ ఎల్‌బీ పూర్తి చేసింది.తన ఖర్చులు,చదువు కోసం ఆదివాసుల సమస్యలమీద పనిచేసే ‘యక్షి’ అనే ఒక ఎన్‌.జి.ఓలో వుద్యోగంలో చేరింది. నక్సలైట్‌ గా తెలంగాణలో బాగా గుర్తింపు పొందిన సీతక్క బైట ‘లా’ స్టూడెంట్‌ ‘ధనసరి అనసూయ’గా మళ్ళీ రహస్య జీవితం గడపాల్సి వచ్చింది. అయినా పాత కేసులు ఆమెని ప్రశాంతంగా బతకనివ్వ లేదు. ఎప్పుడుబడితే అప్పుడు పోలీసు స్టేషన్లకి పిలిపించేవారు.ఒకవైపు ఆర్ధికఇబ్బందులు, మరో వైపు కేసులు…ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరాల్సిందిగా ఆ పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన పిలుపు ఆమె రాజకీయాలను అనూహ్య మైన మలుపు తిప్పాయి.‘లా’ పూర్తయ్యాక వరం గల్‌ వెళ్లి గతంలో తనకేసులు వాదించిన సీని యర్‌ అడ్వకేట్‌,వెంకటస్వామిరెడ్డిగారి దగ్గర జూనియర్‌ లాయర్‌గా చేరి కొన్ని నెలలు పని చేశాక 2004 ఎలక్షన్లకు ముందు కొందరు మిత్రుల ప్రోద్బలంతో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించింది. ఆ బూర్జువా పార్టీకి కూడా జన సామాన్యంలో పాపులారిటీ వున్న ‘సీతక్క’ అనే మాజీ నక్సలైట్‌ ఇమేజ్‌ మీదనే మక్కువ కాబట్టి మళ్ళీ ‘ధనసరి అనసూయ’ ప్రజానాయకురాలు ‘సీతక్క’ అయ్యింది.
తెలుగుదేశం పార్టీ(టీడీపీ) తరపున పోటీ చెయ్యడానికి పార్టీలో ఎప్పటినుంచో కొన సాగుతున్నా సీటు దక్కని వాళ్ళున్నప్పటికీ ప్రజా జీవితంలో మమేకమై గుర్తింపు పొందిన సీతక్కకి ములుగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో షెడ్యూలు ట్రైబ్స్‌కి రిజర్వు అయిన ములుగు అసెంబ్లీ నియోజ కవర్గం సీటురావడం సులభతరం అయింది. కానీ,2004లో రాజశేఖర్‌ రెడ్డి ప్రభావంతో ఆమె కాంగ్రెస్‌ అభ్యర్ధి‘మోదం వీరయ్య’చేతిలో ఓడి పోయింది. అయినప్పటికీ ఆమె వెనుకంజ వెయ్య కుండా అటు జనంలోనూ,ఇటు పార్టీలోనూ తన ప్రభావం పెంచుకుంటూ 2009 అసెంబ్లీ ఎన్నిక ల్లో అదే మోదం వీరయ్య మీద బంపర్‌ మెజారిటీ తో గెలిచింది.అయితే అప్పటికే మలి దశ తెలం గాణా ఉద్యమం ఊపందుకుంది. తాను ఎమ్మెల్యే గా గెలిచినప్పటికీ తమపార్టీ ఓడిపోవడంతో ప్రజలకు సీతక్క ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే స్థితి లేకపోగా తాను తెలంగాణా బిడ్డగా తన ఆంధ్రా పార్టీ అభీష్టానికి వ్యతిరేకంగా తెలంగాణా ఉద్యమానికి సంఫీుభావం ప్రకటించాల్సి రావడం ఆమెని తీవ్ర ఘర్షణకు లోను చేసింది. అయిన ప్పటికీ తన తెలంగాణా అస్తిత్వ ప్రకటన చేస్తూ కాకతీయ యూనివర్సిటీ విద్యార్ధుల సమ్మెకి మద్దతు పలికి వారితో పాటు ఎనిమిది రోజుల ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొని అరెస్టై రెండు రోజులు జైలు శిక్ష అనుభవించింది.2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విడిపోయి ప్రత్యేక తెలం గాణా రాష్ట్రం ఏర్పడినా సీతక్క తెలుగుదేశం పార్టీలో వుండడం వలన ఆమెకి రాజకీయ లబ్ది జరగలేదు. తెలంగాణా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తన అస్తిత్వాన్ని కోల్పోయింది. ఈ క్రమం లోనే ఆమెకి కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒకవైపు, తెలంగాణా రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) నుంచి ఒకవైపు ఆహ్వానాలురావడం, ఆమె తెలంగాణాని ఇచ్చిందనే అభిమానంవల్ల,టీడీపీ రేవంత్‌ రెడ్డి కుటుంబంతో సీతక్కకి వున్న సాన్నిహిత్యంవల్ల ఆమె కాంగ్రెస్‌ పార్టీవైపే మొగ్గుచూపింది. మళ్ళీ ములుగు నియోజకవర్గం నుంచే కాంగ్రెస్‌ అభ్యర్ధి గా పోటీచేసి ఈసారి కాంగ్రెస్‌ ప్రభావం తగ్గి పోవడం వలన తన ప్రత్యర్ధి టీడీపీ అభ్యర్ధి చందూ లాల్‌ చేతిలో ఓడిపోయి 2018 అసెంబ్లీ ఎన్ని కలలో అదే చందూలాల్‌ మీద కాంగ్రెస్‌ అభ్యర్ధిగా గెలిచి రెండోసారి ఎమ్మెల్యే అయింది. సీతక్క. మొదట తెలుగుదేశం పార్టీ పాలిట్‌ బ్యూరో సభ్యు రాలి స్థాయికి ఎదిగిన ఆమె తర్వాత కాంగ్రెస్‌ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై జనబాహుళ్యంలో గొప్ప ప్రాబల్యం, చరి ష్మా కలిగిన నాయకురాలిగా, తనపార్టీలోనేకాక తెలంగాణా రాష్ట్రంలోనే ఒక ప్రజామోదం పొం దిన మేటి నాయకురాలిగా గుర్తింపు పొందు తుంది.
పోరాట పటిమకు మారుపేరు సీతక్క పట్టుదలకు, పోరాట పటిమకు మారు పేరైన సీతక్క విప్లవ పార్టీలలోనే కాక బూర్జువా పార్టీల ప్రత్యక్ష రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేసింది. ఆమె విప్లవ పార్టీలో నక్సలైట్‌ గా సీతక్క బాగా సాహసోపేతమైన నాయకురాలి గా, రెబల్‌ గా పేరుతెచ్చుకుంది. తన నాయకత్వం లోని దళం ఆడవాళ్ళమీద దౌర్జ్యన్యాలు చేసే మగ వర్గశత్రువులకు మర్మాంగాలను తెగ్గోయడం, గుండు కొట్టించి ఊరేగించడంవంటి శిక్షలు విధిం చేవారు. ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చాక ప్రతి పక్ష పార్టీలో ఉన్నప్పటికీ ఆదివాసుల సమ్మక్క, సారలమ్మ దేవతల మేడారం జాతరలో కోయ తెగవారికి భాగస్వామ్యం లేకపోవడంపై ప్రభుత్వ అధికారులతో చర్చించి ఆదేవతల వారసులకు జాతరలోచోటు కల్పించడానికి కృషి చేసి సాధిం చింది. అలాగే ఆదివాసుల స్వయం ప్రతిపత్తికి సంబంధించిన ‘వన్‌ ఆఫ్‌ సెవెంటీ’ చట్టంపై అసెంబ్లీలో తరచుగా ఆలోచనాత్మకమైన చర్చ లేవనెత్తుతూ వస్తుంది. ఆదివాసీ తెగల ప్రధాన సమస్యలైన మౌలిక వసతులు లేకపోవడంపైన అసెంబ్లీలో గళమెత్తింది. ఆదివాసులు నివసించే అటవీ ప్రాంతంలో రవాణా సౌకర్యాలు, రోడ్లు, మంచినీరు,పాఠశాలలు,హాస్పటళ్ళు లేకపో వడం పైన ఆమె నిత్యం అధికారులతో చర్చించి కొంత మేరకు సాధించగలిగింది. అడవి లోపల గూడే లలో జీవించేవారికి రేషన్‌ కార్డులు, ఆధార్‌ కార్డు లు లేకపోవడంపై ఆమె ఆందోళన చేస్తుంది. ఆమె ఎమ్మెల్యే గా గెలిచిన రెండుసార్లూ తానున్న పార్టీలు గెలవక ఆమె ప్రతిపక్షంలోనే ఉండాల్సి వచ్చినా ఎప్పుడూ బాధ పడలేదు. తన స్వభావమే అధికార,ఆధిపత్య వ్యవస్థలకు వ్యతిరేకమైన ప్రతి పక్ష ధోరణి కాబట్టి ఎక్కడున్నా ప్రజా సమస్యల మీద గొంతెత్తి మాట్లాడడాన్ని కొనసాగించింది. తెలంగాణా రాష్ట్రం వస్తే అన్ని సమ స్యలు పరిష్కారమౌతాయని ప్రజలకు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన అధికార పార్టీ రాష్ట్రం ఇచ్చిన వారితోపాటు ప్రజల్ని కూడా వంచించి తమ కుటుంబ పాలనని కొనసాగిస్తున్నదని సీతక్క ఆరోపణ. నీళ్ళు,నిధులు,నియామకాలు వస్తాయ ని చెప్పే ముఖ్యమంత్రి,ఆయన సహచర మంత్రు లు వాటిని గాలికి వదిలెయ్యడమే కాక ప్రజా సమస్యల మీద మాట్లాడేవారిని నేరస్తులని చేసి శిక్షిస్తున్నారని, హైదరాబాద్‌ లో ఒకప్పుడు ప్రజలు తమ నిరసనని వ్యక్తం చేసుకునే ధర్నా చౌక్‌ కూడా లేకుండా పోవడమే ఆపరిస్థితికి చక్కటి తార్కాణం అని ఆరోపిస్తుంది. ప్రజలు ఆశించిన తెలంగాణా రాలేదని, ఇది దొరల పాలన అని ఆమె విమర్శ. కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్నా ఇక్కడి పాలకులు ప్రజలకు కనీసం మాస్కులు కూడా పంపిణీ చెయ్యడం లేదని, బైట వ్యాపారులు మాస్కులను అధికరేట్లకు అమ్ముతున్నారని అసెంబ్లీ లో సీతక్క మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి ఇంత మంది మంత్రులకు లేనిబాద ఈమెకెందుకని ఆమె మాటలకు ఎగతాళిగా నవ్వి హేళన చేసి నప్పుడు సీతక్క అవమానంగా భావించింది. నవ్విన నాపచేనే పండుతుంది అనుకుని లాక్దౌన్‌ ప్రకటించి నాక తన స్నేహితులు, శ్రేయోభిలాషులు ఇచ్చిన ఆర్ధిక సహకారంతో ములుగు నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల ప్రజలకు,ముఖ్యంగా రవాణా సౌకర్యాలు లేని ఆదివాసీ తండాల ప్రజ లకు నిత్యావసర వస్తువులు పంపిణీ మొదలు పెట్టింది.గత మార్చి 23నుంచి ఇప్పటివరకు సుమారు నాలుగొందలు గ్రామాల ఆదివాసులకు, దళితులకు సరుకులు పంచింది. మాస్కులతో పాటు బియ్యం,కూరగాయలు,నూనె సబ్బులు ట్రాక్టర్‌, జీపులలో వేసుకుని అటవీ ప్రాంతంలో వెళ్ళగలిగినంత మేరకు వాహనాలలో వెళ్లి ఇంకా లోతట్టు గూడేలకు తన సహచరులతోపాటు స్వయంగా తానుకూడా సరుకుల మూటలు మోస్తూ ఎగుడు దిగుడు అడవి బాటల్లో, వాగులు, వంకలు దాటుకుని వెళ్తుంది. అడవి బిడ్డలకు పౌష్టికా హారం గురించి, కరోనా వ్యాధి సోకకుం డా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిశుభ్రతలను వివరిస్తుంది. ఆడవాళ్ళను, పిల్లల ను కూర్చోబెట్టుకుని నేను కూడా ఇటువంటు గూడేలలో సరైన తిండి, వసతి లేకుండా పెరిగిన దాన్నే అని వారిలో ఒకదానిగా వివరిస్తుంది సీత క్క. ఆమె సేవగురించి పత్రికలూ,సోషల్‌ మీడి యా వేనోళ్ళ కొనియాడుతుంటే అధికార పార్టీకి అక్కసుగా ఉండి ఆమెమీద అవాకులూ, చవాకు లూ పేలుతుంది.మరికొందరు గిట్టనివాళ్ళు ఆమె తన సొంత డబ్బుతో సరుకులు ఇస్తుందా? అని విమర్శిస్తున్నారు.సీతక్కకి మోతాదు మించి ప్రచా రం లభిస్తున్నదని అసూయతో తప్ప ఆమెలా జనంతో మమేకమయ్యే నాయకులు దాదాపు లేరనే చెప్పాలి.ప్రధాన స్రవంతి రాజకీయాలలో వున్న ప్పుడు కొన్ని ఎత్తుగడలు వెయ్యాల్సిరావడం ఎవరి కైనా తప్పదు. అంతమాత్రాన తన నియోజకవర్గ ప్రజలపట్ల, ఆదివాసీ బిడ్డల పట్ల ఆమెకున్న శ్రద్ధ, ప్రేమలను సీతక్క పనితీరును దగ్గరగా గమనించిన వారెవరూ కాదనలేరు. సీతక్క అంటే ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడి కనీస సౌకర్యాలకు నోచు కోని అభం శుభం తెలియని ఆదివాసీ ప్రజలకు తమజాతిలోంచి ఉద్భవించిన ఒక మణి మాణి క్యం.సీతక్క చైతన్యవంతమైన సాహిత్యాన్ని చదవడమేకాక ‘వెన్నెల’ అనే కలం పేరుతో కవి త్వం రాసేది.‘యక్షి’ అనే సంస్థలో పనిచేస్తున్న పుడు ఆదివాసీల ఉనికిమీద వ్యాసాలు కూడా రాసింది. ‘వన్‌ ఆఫ్‌ సెవెంటీ’ చట్టంమీద, ఆదివా సుల హక్కులమీద ఆలోచనాత్మకమైన వ్యాసాలు, కవితలు రాసింది. ఆమెకి కష్టపడి పనిచెయ్యడం ముందునుంచీ అలవాటే! నక్సలైట్‌ గా బైటికొచ్చి హైదరాబాద్‌ లో చదువు కొనసాగించేటప్పుడు కూడా తనసొంత ఊరెళ్ళి తునికాకు పనికి, వ్యవ సాయ పనులకి వెళ్లి వచ్చిన కూలి డబ్బులతో ఫీజులు కట్టుకునేది. బాబు ‘సూర్య’ని కష్టపడి ఎం.టెక్‌ దాకా చదివించింది, తనుకూడా తల్లి కష్టం చూసి బాగా పట్టుదలతో చదివి నాగపూర్‌ ట్రిపుల్‌ ఐటిలో సీటు తెచ్చుకున్నాడు. ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చాక సీతక్క ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొలిటికల్లో సైన్స్‌ లో ఎమ్మే పూర్తిచేసి ఇప్పుడు అదే యూనివర్సిటీలో గొత్తి కోయల జీవన ప్రమాణాలు-స్థితిగతులమీద పీహెచ్‌.డీ చేస్తుంది.
సీతక్కది అచ్చమైన ఆదివాసీ స్వాభి మానం, స్వయం పాలనని, స్వేచ్ఛని ప్రేమించే గుణం.నగరంలో వుండి ఎమ్మే,ఎల్‌.ఎల్‌.బి చేసినా,ఎమెల్యే అయినా ఆదివాసి సంస్కృతి అంటే తనకి సహజాతంలా వచ్చిన ప్రేమ వెలిసిపోలేదు. రెండేళ్లకోసారి వచ్చే వనదేవతల మేడారం జాతరతోపాటు ఆదివాసుల గూడేలలో జరిగే పండగ పబ్బాలకు, శుభకార్యాలకు, చావులకు ఆమె తప్పకుండా హాజరవ్వడమే కాక వారి సంస్కృతిలో భాగమైన ఆట, పాటలలో పాల్గొం టుంది. పెళ్ళికి,చావుకీ తప్పనిసరిగా మోగే డోలు వాయిద్యమంటే ఆమెకి ఇష్టం,డోలు శబ్దం విన గానే అప్రయత్నంగానే తనకాళ్ళు చిందేస్తాయి. అందుకే, తన కొడుకు ‘సూర్య’ వివాహానికి చత్తీస్‌ ఘడ్‌ నుంచి డోలు వాయిద్యకారులైన గొత్తికోయ లను పిలిపించింది. నక్సలైట్‌గా తను తిరిగిన అటవీ గ్రామాలే కాదు,మైదాన ప్రాంతాలలో కూడా ప్రతివూరు,పల్లె,వాగు,వంకా తనకి పరిచ యమే. తన నియోజకవర్గంలో వుండే సుమారు వంద ఏజెన్సీ గ్రామాలలో ప్రతి చిన్న ఆదివాసీ గూడెం పేరును గుర్తు పెట్టుకుంటుంది. అగ్రకుల బూర్జువా పార్టీలలో చేరినప్పటికీ సీతక్క జనంతో తనకున్న ప్రత్యక్ష సంబంధాలను మాత్రం వదులు కోలేదు. ఆమెని తమ బిడ్డగా భావించే ములుగు ప్రాంతపు గ్రామాలలో ఆమె జనంలోకి చొచ్చుకుని పోతుంది. అందరితో ప్రేమగా వారి పరిస్థితు లను లోపలి వ్యక్తిగా అర్ధం చేసుకునే సీతక్కకి తనని ఎవరన్నా ‘మేడం’ అని సంబోధిస్తే ఇష్టం ఉండదు, ‘మేడం’అంటే దూరం పెట్టినట్టుగా, ‘అక్క’ అంటే ఇంట్లోవాళ్ళం అన్నట్టు వుంటుంది అని తను కూడా తన పార్టీ కార్యకర్తలను, అనుచ రులను ‘అన్నా, అక్కా’ అనే పిలుస్తుంది.
తనకి మామూలు అర్ధంలో దేవుడు, మతం అనేవాటిపైన నమ్మకం లేదు,గుళ్ళూ, గోపురాలకు వెళ్ళదు. కానీ, ఆదివాసీ అస్తిత్వాన్ని చాటే ఆదివాసుల పిత్రుదేవతారాధన,ప్రకృతికి సంబంధించిన జాతరలలో ఇష్టంగా పాల్గొం టుంది. సీతక్కది అసలైన ఆదివాసీ రూపంబీ నల్లని రంగుతో సాదాసీదా ముతక చీరలు కట్టు కుని జనంతో కలసిపోయే సీతక్క అంటే అడవి బిడ్డలకు ఒక సమ్మక్కనో,ఆమె బిడ్డ సారలమ్మనో చూసినట్టుంటుంది. జనం ప్రేమలను గెలుచుకున్న కోయ దొరసాని ఆమె. ఆమె ఆదివాసీ సాధికార తకు ప్రతీక, ముందునుంచీ స్వతంత్ర వ్యక్తిత్వం, ధైర్య సాహసాలు ఆమెకి పెట్టని ఆభరణాలు. తాను గన్‌ పట్టినా,గన్‌ మెన్‌తో వున్నా ఆమెది పోరాటదృష్టే! ఒకపుడు తనవెంట పడిన పోలీ సులు ఇప్పుడు తనకి రక్షణగా వెంట నడవడం చూసి నవ్వుకుంటుంది ఈ అడవి చుక్క. ఆమె మాటల్లోనే ‘ఎన్నిసార్లు చంపినా మళ్ళీ మళ్ళీ పుట్టడం/ఎన్నిసార్లు పడినా మళ్ళీ మళ్ళీ లేచి నిలబడడం’ ఆమె నైజం.
‘అనంతయానం’లో తొలి ఆదివాసీ కేబినెట్‌ మంత్రి` సీతక్క
గత ముప్పై ఐదేళ్ల క్రితం ఆదివాసుల సమస్యలను ఎదిరించడానికి అడవిబాట పట్టిన ‘ఆమె’ నేడు అధికార పక్షంలో ఒక ముఖ్యమైన పాలనాదీశురాలు.తెలంగాణ రాజకీయ చరిత్రలో ఆమె మకుటం లేని మహారాణిగా నిలిచింది. నేటి ప్రజా ప్రభుత్వంలో ఆమె తెలంగాణ కేబినెట్‌ మంత్రి. ఆమె పేరే ధనసరి అనసూయ అలియాస్‌ సీతక్క. డిసెంబర్‌ 7న మూడో శాసన సభలో కొలువుదీరిన ఆమె ఎల్బి స్టేడియంలో హర్షద్వా నాల మధ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ  శాసనసభలోనే ఇప్పటివరకు సీతక్క తొలి ఆదివాసీ మంత్రి కావడం విశేషం. ములు గు ప్రజలకే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కు సీతక్కగా సుపరిచితమైన డాక్టర్‌ ధనసరి అనసూ య రాజకీయ రంగంలో అంచెలు అంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వం లో పంచాయతీరాజ్‌,మహిళా,శిశు సంక్షేమ శాఖా మంత్రిగా కొలువుదీరారు. డాక్టర్‌ అనసూయ నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టింది. ఆది వాసీ కోయతెగకు చెందిన ఆమె ఉమ్మడి వరంగల్‌ జిల్లా ములుగు దగ్గరలోని జగ్గన్నగూడెంలో ధనసరి సమ్మక్క, సమ్మయ్య దంపతులకు 1971, జులై 9న జన్మించింది. బాల్యం నుంచి బాగా చదుకోవాలని పట్టుదలతో బడికి వెళుతున్న సంద ర్బంలో ఆమెకు కొన్ని ఆటంకాలు వెంబడిర చాయి. తన14ఏళ్ళ వయసులోనే అన్నయ్య సాం బయ్య ను పోలీసులు అకారణంగా ఎన్‌ కౌంటర్‌ చేశారు. ఈ సంఘటనతో కలత చెందిన ఆమె ప్రజా వ్యతిరేక శక్తులను ఎదిరించడానికి 1988 లో అన్నల బాట (అడవి దారి) పట్టింది. అప్పుడే ఆమె అడవిలో ‘సీతక్క’గా మారింది. కొన్నాళ్ళ తర్వాత పోలీసుల చేతికిచిక్కి కొద్ది రోజులు జైలు జీవితం గడిపింది.జైలు నుండి విడుదలయ్యాక ఇంటర్‌, డిగ్రీ దూరవిద్య ద్వారా పూర్తి చేసుకొని అప్పటి పరిస్థితులను బట్టి మళ్ళీ బుల్లెట్‌ పట్టింది. వార్‌ ఉద్యమంలో కమాండర్‌ స్థాయికి ఎదిగింది. తన సహచరుడు అయిన కొత్తగూడ మండలం మోకాళ్లపల్లికి చెందిన కుంజా రామును పెళ్లి చేసుకుంది. కుమారుడు సూర్య జన్మించాక అమ్మ మ్మ ఇంట్లోనే పెట్టి ఉద్యమాన్ని,కుటుంబాన్ని వేరుగా చూసింది. 2001లో బుల్లెట్‌ను వీడి ప్రజా జీవితంలోకి ప్రవేశించింది. తన కుటుం బాన్ని చూసుకుంటూనే ప్రజా సమస్యల పరిష్కారా నికి బ్యాలట్‌ వైపు మొగ్గు చూపింది.అప్పటి ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ములుగు (ఎస్టీ)టికెట్‌ను సీతక్కకు కేటాయించారు. తెలం గాణ అసెంబ్లీలో ఆదివాసీల తరపున అటవీ హక్కులు, గూడేలా అభివృద్ధి గురించి ప్రశ్నించే గొంతుకగా మారింది. మరోవైపు 2014లో మహాకూటమి నుండి ఓడిపోగా 2017లో కాంగ్రెస్‌ పార్టీలో చేరినారు. అనంతరం సీతక్కకు ఏ.ఐ.సి.సి.అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏ. ఐ.ఎన్‌.సిమహిళా కమిటీలో ప్రధాన కార్యద ర్శిగా నియమించారు.తను రాజకీయ జీవితాన్ని అనుభ విస్తూ కూడా న్యాయ శాస్త్రంలో పోస్ట్‌ గ్రాడ్యు యేషన్‌ ( ఎల్‌ఎల్‌ ఎం ) చదువుకున్నారు. 2018 లో కాంగ్రెస్‌ నుంచి గెలిచినా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వచ్చింది. మొక్కవోని దీక్ష లాగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ మరోపక్క ఉస్మానియా యూనివర్సిటీ నుండి పొలిటికల్‌ సైన్స్‌లో ‘‘ తెలం గాణకు గొత్తి కోయలు వలస రావడానికి గల సామాజిక అంతరాలు ‘‘ అనే అంశం మీద పి. హెచ్‌.డి పట్టా పొందినారు.ఎమ్మెల్యే గా ఉంటూ డాక్టరేట్‌ పొందిన తొలి ఆదివాసీ మహిళ మరి యు డాక్టర్‌ సీతక్కగా రికార్డ్‌ సొంతం చేసుకు న్నారు.  2019-20 మధ్య కరోనా మహ మ్మారికి కకావికలమైన ఆదివాసులు మంగపేట, వెంకటాపురం పరిధిలోని అడవిలో నిరాశ్రయు లుగా మిగిలారు.బంధాలు,బంధుత్వాలు తెగి పోయిన పరిస్థితుల్లోనూ‘‘నేనున్నా’’నంటూ కాలి నడక నడుస్తూ గోత్తికోయలను ఆదుకున్నది ఈ సీతమ్మ.2022,ఏప్రిల్‌ 28న మంగపేట మండ లంలోని శనిగకుంట అనే ఆదివాసీ గ్రామంలో ఎరగడివల్ల సుమారు 40దగ్ధం అయినవి. సర్వం కోల్పోయి నిలువ నీడలేని ఆదివాసులకు సీతక్క అండగా నిలిచింది.ఈ సంఘటనను తను సోషల్‌ మీడియాలో ప్రచారం చేయడంతో వారికి తగిన పునరావాసం కలిగింది. ఈఏడాది (2023) ఆగష్టులో కురిసిన భారీ వర్షాలకు ములుగు నియోజకవర్గంలోని ఏటూరునాగారం మండలం మల్యాల,కొండాయి,దొడ్ల తదితర ఆదివాసీ గ్రామాలు నీట మునిగినవి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్ష నాయకురాలి హోదాలోనూ పునరావాస సేవలు స్వశక్తితో అందించారు. ప్రభు త్వం నుండి  ఆదివాసులకు ఎలాంటి సహా యం అందలేదు.తన నియోజక పరిధిలోని కొన్ని ఏజెన్సీ గ్రామాల్లోని పాఠశాలల విద్యార్థులకు నోట్‌ బుక్స్‌,స్టడీ మెటీరియల్‌, ఎగ్జామ్స్‌ మెటీరియల్‌ పంచి పెట్టారు. అక్కడి జనాలని కదిలిస్తే ‘‘ మాతరం లో  కాకతీయుల ఆరాచకాలపై తిరగబడ్డ వీరవనితలు సమ్మక్క సారక్కలను చూడలేదు కాని ప్రజా సమస్యలపై వీర్చోతింగా పోరాడుతూ నేడు తెలంగాణ సేవకురాలిగా నిలిచిన సీతక్క ను చూడటం తమ అదృష్టంగా భావిస్తున్నామ’’ ని ఆదివాసులు,గిరిజనేతరులు సైతం పేర్కొనటంవిశేషం.నేడుతెలంగాణ మంత్రి మండలిలో సీతక్క డిసెంబర్‌ 14(2023) న పంచాయతీ రాజ్‌, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రిగా విధులు స్వీకరించారు. భవిష్యత్తులోనూ మరిన్ని సంక్షేమ కార్యక్రమాలతో యావత్తు తెలం గాణ ప్రజలకు సేవచేస్తారని,ప్రత్యేకించి గిరిజనుల హక్కులకు భరోసా కల్పిస్తారని ఆశిద్దాం!- (చల్లపల్లి స్వరూపరాణి/గుమ్మడి లక్ష్మీనారాయణ)

శతాబ్దాల సాంస్కృతి సమాహారం

స్వచ్ఛమైన సెలయేళ్లు..దట్టమైన అడవులు.. గంభీరమైన కొండలు.. పక్షుల కిలకిలారా వాలు. పచ్చని ప్రకృతి అందాలు వీటి మధ్య శతాబ్దాల సంస్కృతులకు గుర్తుగా, వెనకబాటుత నానికి సజీవ సాక్ష్యంగా. పాలకుల ఆలన కోసం ఎదురు చూస్తూ అమాయక ఆదివాసీ జనం నివసి స్తోంది. అడవితల్లి బిడ్డలుగా ,ప్రకృతి ఒడే అవాసంగా దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుని, ప్రకృతి ప్రసాదిత ఫలాలతో సహవాసం చేస్తోంది. విద్య,వైద్యం వంటి మౌళిక సదుపాయాలకు నోచుకోని గూడే లెన్నో కనిపిస్తాయి. ఇప్పుడిప్పుడే వారి జీవితాల్లో వెలుగులు నింపే సర్కారు వచ్చింది.వారి కష్టాలు తీర్చేందుకు బృహత్తర కార్యక్రమాలు అమలు చేస్తోంది.-(భమిడిపాటి గౌరీశంకర్‌)
జాతులు..భాషలు
జిల్లాలో 2.36 లక్షల మంది గిరిజనులున్నారు. వీరిలోట్రైబల్‌ సబ్లన్‌ మండలాల్లో నివసించే సంఖ్య1.87 లక్షలుగా ఉంది. గిరిజనుల్లో 36 జాతులున్నాయి.ఉత్తరాం ధ్ర జిల్లాల్లో సవర, కొండదొర, గదబ, వాల్మీకి,జాతాపు, కోయ, భగత జాతులు ప్రధానమైనవి. సవరభాష శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకేలాఉంటుంది. వీరి అభ్యున్నతికి ఏర్పాటైన ఐటీడీఏకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు కేటాయిస్తున్నాయి. సగటున ఒక్కో ఐటీడీఏకి ఏటా రూ.300 కోట్ల నిధులు వస్తున్నాయి. కానీ అందులో గిరిజనులకు ఈ నిధుల్లో చేరేది నామమాత్రమే. నిక్కచ్చిగా ఈ నిధులన్నీ గిరిజనులకే ఖర్చుచేసి ఉంటే గిరిజనుల ఎప్పుడో మారిపోయి ఉండేవి.
సజీవ సంప్రదాయాలకు నిలయం
గిరిజన జీవనం విభిన్నంగా ఉంటుంది. సంబరాలు, వివాహ వేడుకలు, ఆరాధనల ఆచారాలు, మనిషి మూలాలను తేటతెల్లం చేస్తుంటాయి. తరాలు మారినా వారి అలవాట్లు, కట్టుబాట్లు ఇప్పటికీ మారలేదు. ఇక్కడ జరిగే వివాహ వేడుకల్లోని సంప్రదాయాల్లో భాగంగా చెట్టును ఆరాధిం చే విధానాలు ప్రపంచ శాంతి సౌభాగ్యానికి సందేశాన్ని పంపుతుంటాయి. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని ఏ పల్లెకు వెళ్లినా సవరజాతి గిరిజనుల సంబరాలు, పండుగ సందడులన్నీ ఒకే రకంగా కొనసాగితే పెళ్లిళ్లు మాత్రం ప్రకృతి ఆరాధనతో ముడిపడి ఉంటాయి. ప్రాణాధారమైన నీరు, అది లభించడానికి అవసరమైన చెట్టు చుట్టూనే వారి తంతు తిరుగుతుంది. సవర భాషలో పాటలు, థింసా నృత్యాలు ఇక్కడి గిరిజనుల పండుగలు, శుభకార్యాల్లో భాగం.ఆడవేషంలోవున్న యజ్ఞుడు అనే పురోహితుని పాత్రలో పెళ్లితంతు నిర్వపి వధూవరులను మేనమామలు భుజాలపై ఎక్కించుకొని నృత్యం చేస్తూ ఊరేగించడం నేటికీ కొనసాగుతున్న సంప్రదాయం.
కనీస సౌకర్యాలు కరువు
నేటికీ గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపా యాలు లేవు. కనీసం తాగునీరు, రోడ్డు మార్గం లేదు. వైద్య సదుపాయాలు లేక ఏటా వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. గర్భిణులు, వృద్ధులు అత్యవసర సమయాల్లో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. నేటికీ వైద్యం కోసం, విద్య కోసం గిరిజనులు కొండలు గుట్టలు దాటి కాలినడకనచ,డోలీ సాయంతో మైదాన ప్రాంతాలకు రావాల్సిందే. వీరి తండాలకు విద్యుత్‌ సౌకర్యం లేదు.ఉండ టానికి ఇళ్లు లేవు. ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా వారి వనరులను లాక్కుంటున్నారు. క్వారీలు నడుపుతూ ఖనిజ సంపదను కొల్లగొడు తున్నారు. బాక్సైట్‌, గ్రానైట్‌ దోచుకుంటున్నారు. పిండిచేసి గిరిజనులకు పోడు వ్యవసాయం చేసి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఈ పరిస్థితులను మార్చేందుకు సీఎం వైఎస్‌ జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. గిరిజనుల జీవితాల్లో మార్పునకు సీఎం వైఎస్‌ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. తొలిత కురుపాం,సాలూరు గిరిజన రిజర్వర్డు నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్టు ఇచ్చారు. ఎన్నిక ల్లో గెలిచిన వెంటనే తన తొలి కేబినెట్లో కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణికి స్థానం కల్పించారు. గిరిజన శాఖ మంత్రి పదవిని ఇవ్వడంతో పాటు ఉపముఖ్యమంత్రి హోదానిచ్చి ఉన్నత స్థానం కల్పించారు. తర్వాత సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరకు గిరిజిన సంక్షేమశాఖ మంత్రి పదవినిచ్చారు. గత ప్రభుత్వాలు ఎస్టీ సప్లాన్‌ నిధులను ఇతర ఖర్చులకు వాడేసేవి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరులో దళితతేజం సభ నిర్వహణకు సబ్‌ ప్లాన్‌ ఖర్చు చేశారు. ఇలాంటి వాటిని అరి కట్టడానికి అధికారం గిరిజనుల చేతుల్లో ఉండాలి. గిరిజనులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండా లని గిరిజనులు ఎప్పటి నుంచో కోరుతుండే వారు. సాంఘిక సంక్షేమ శాఖలో మిళితమై ఉండటంవల్ల గిరిజనులకు అన్యాయం జరుగు తుందని వేడుకునేవారు. వారి గోడువిన్న జగన్‌ గిరిజనులకు ప్రత్యేక మంత్రిని ఇచ్చారు. గిరిజనుల బతుకులు బాగుచేయాలనే ఉద్దేశం తో గిరిజన సలహామండలిని ఉపముఖ్యమంత్రి నేతృత్వంలో,గిరిజన ఎమ్మెల్యేల భాగస్వా మ్యంతో సీఎం ఏర్పాటు చేశారు. గత ప్రభు త్వంలో అప్పటి పాలకులు పదవిలో ఉన్నన్నా ళ్లూ గిరిజన సలహా మండలి ఊసెత్తలేదు. ప్రజా సంకల్ప యాత్రలో ఎస్సీ,ఎస్టీలకు ఉచిత విద్యుత్‌ అందిస్తానని హామీ ఇచ్చి, సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే దానిని నెరవేర్చారు.200 యూనిట్ల వరకూ విద్యుత్‌ వినియోగాన్ని ఉచితం చేశారు.దీనివల్ల రాష్ట్రంలో ఉన్న ఎస్సీ కుటుంబాలకు ప్రయో జనం చేకూరుతోంది.
సవరల సంస్కృతి మరియు సంప్రదాయాలను పరిరక్షించే ప్రయత్నాలు
గిరిజనులకు సమాజంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది, వారి ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయం మరియు భాషకు ధన్యవాదాలు. వారి స్వంత లిపి లేనప్పటికీ, ప్రత్యేకమైన వారసత్వం ఏదో ఒకవిధంగా శతాబ్దాలుగా తరువాతి తరానికి అందించబడుతోంది.కానీ ప్రస్తుత తరం ఆంగ్లం,తెలుగు ఒడియా భాషలలో సాధారణ విద్య,అధ్యయనానికి ప్రాధాన్యత ఇస్తుండటంతో, సవర కమ్యూనిటీకి చెందిన గిరిజన పెద్దలు తమ సంస్కృతి, సంప్రదాయం భావితరాల కోసం భాషను పరిరక్షించడంపై ఆందోళన చెందుతున్నారు.
సవర సంస్కృతీ దర్పణాలు గిడుగు కథలు
సవర భాష కోసం నిరంతరం పరిశ్రమించిన పండిత మాన్యుడు గిడుగు రామమూర్తి పంతులు.సవరల భాష, యాస, సంస్కృతుల పట్ల ఆయనకు 1880లోనే ఆసక్తి కలిగింది. మన్యప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పనిచే యటం ఇందుకు ప్రధాన కారణమనిపిస్తుంది. కొందరు ఆలోచించి వదిలేస్తారు. కొంతమంది మాత్రమే ఆలోచించి ఆచరిస్తారు.అతి కొద్ది మంది మాత్రమే లోతైన అధ్యయనంతో విజయం సాధిస్తారు. గిడుగు రామమూర్తి ఇటువంటివారే. సవరభాషకు ఓ లిపిని ఏర్పాటు చేయడమే కాక, వారి జీవనసంస్కృతి మూలాల లోనికి దగ్గరగా వెళ్ళారు. అధ్యయనం చేశారు. వారి జీవితాలను చరిత్రగా రికార్డు చేశారు. సవరభాషకు నిఘంటువు, వ్యాకరణం కూర్చారు. పాటలని సేకరించారు. వాచకాలను రూపొందించారు. సవరభాష నేర్చుకోవటం తేలిక అనేది ఆయన భావన. గిడుగు రామమూర్తి పాండిత్యం ఎంతో నిర్మాణాత్మమెనది. గ్రాంథిక భాషను ఖండిరచడం వెనుక ఉన్నది ఈ అంశమే! సవర భాష విషయంలో ఆయన చేసిన స్వయంకృషి శ్లాఘనీయం.
సవరల జీవన విధానంలోని సంస్కృతి సంప్రదాయాలను వ్యక్తిగమెన కార్యనిర్వహణ రంగాలను గిడుగువారు దగ్గరగా పరిశీలించారు. వాటిని ‘సవర కథలు’గా రాశారు. ‘సవర భాషలో నేను వ్రాసిన మొదటి పుస్తకంలోని కథలకు ఇంచుమించుగా సరైన తెలుగు చేసి ఈ పుస్తకం వ్రాసినాను. ఈ సవర %-పుస్తకంలోని కథలన్నీ ఇంగ్లీష్‌లో ఉన్న ఈసపు కథలను పట్టి వ్రాసినాను’ అని ఆయన ఆ పుస్తకం ముందుమాటలో చెప్పారు. ప్రతి వాక్యాన్ని సవరలకు వినిపించి, వారి సవరణలు, సలహాలు, సూచలను అనుసరించి తిరగ రాశారు. కథలలోని విషయాలు సవరల వ్యవహారాన్ని అనుసరించి వాళ్ళకు తెలిసేటట్లు చేర్పులు మార్పులు చేశారు. కనుక ఈ సవర కథలు సవరల నిజజీవన చిత్రణ దృశ్యాలు.. సాక్ష్యాలు. ‘కోదుల భాషలో ముగ్గురు నలుగురు కొన్ని పుస్తకములు వ్రాసినారు. కాని.. సవర భాషలో ఇదివరకు ఎవరూ పుస్తకాలను వ్రాయలేదు. నేను వ్రాసినవే మొదటి పుస్తకాలని’ గిడుగువారు చెప్పుకున్నారు. ఫిక్షన్‌ అండ్‌ ది రీడిరగ్‌ పబ్లిక్‌’ అనే పుస్తక రచయిత క్యు.డి.లీవీస్‌ కథను గూర్చి చెబుతూ కథ ప్రధాన లక్షణమైన క్లుప్తత కేవలం రూపానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. జీవితానికి, జీవిత దృక్ప థానికి రూపం. జీవితంలోని ఒక ముక్కను తీసుకుని దానికి వ్యక్తిత్వం ఇవ్వాలన్న ఆకాంక్ష లోంచి కథకు రూపం వచ్చిందంటారు. కథల్లో కొద్దిమంది లేదా ఒక జీవితం కొన్ని శకలా లుగా గోచరమవడం పాఠకులకు కొత్త కాదు. కానీ తనకు తెలియని ప్రపంచంలోని భాష, వ్యక్తులు, జీవన విధానాలను కథలుగా మలచడంలో ఎన్నో ఇబ్బందులున్నాయి. చదువరి వీటిని తనవిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరో గురించి వారంటే తెలియని వారు ఎందుకు తెలుసుకోవాలి? అటువంటి కథలు ఎందుకు చదవాలి? ఇవి సామాన్య చదువరుల ప్రశ్నలు. ప్రపంచీకరణ నేపథ్యంలో సాహిత్యం కొత్త సిద్ధాంతాలను, వాతావరణాలను సృష్టించుకుంటూ వస్తున్నది. మన చుట్టూ ఉన్న సమాజం నాగరికత ఆనవాళ్ళు అభివృద్ధి పరంగా శరవేగంగా మార్పుకు లోనవుతున్నది. కాని అలాలేని జీవితాలున్నాయి. జీవన గమనాలున్నాయి. ఎటువంటి కృతక వర్ణాలను అంటించుకోని స్వచ్ఛమైన మన్యాలున్నాయి. వాటిలో ప్రజాసమూహాలున్నాయి. ప్రకృతి వారికి పాఠశాల..కూడు, గుడ్డ, భాష కూడా అక్కడ నుంచి వచ్చినదే. భయంకమెన క్రూరమృగాలు, సాధు జంతువులు వారిని దగ్గరగానే చూస్తాయి. వారు కూడా వాటితో సహజీవనం చేస్తారు. సవరలు ఇందుకు మినహాయింపు కాదు. సవర దక్షిణ ముండాభాష. ఆస్ట్రో-ఏషియాటిక్‌ భాషా కుటుంబంలో ఒక శాఖ ముండాభాషలు. ఒడిషాలోని గంజాం జిల్లాలో ఆంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా కనిపించే సవరల జనాభా ఐదులక్షలకు పైనే. వీరు పోడు వ్యవసాయం చేస్తారు. వీరి గృహాలు ఒకదానికెదురుగా మరొకటి ఉంటాయి. వీరి భాషలో గ్రామాన్ని గొర్భాం అంటారు. అంటువ్యాధుల వల్ల, పులి, అగ్ని వంటి వాటి ప్రమాదాల వల్ల జనం చనిపోతే ఆ గ్రామాన్ని వదిలి వేరే చోటుకు వెళ్ళిపోతారు. నేటికీ వారిని అనాగరికులుగానే సభ్య సమాజం గుర్తిస్తుంది. మనిషికి ఆత్మకు మధ్య ఉన్న సంబంధాన్ని గాఢంగా నమ్ముతారు. ఆత్మల్లోకి మనుషులు ప్రవేశించగలరనే విశ్వాసాలు ఉన్నాయి వారికి. వీటిని గిడుగువారు దగ్గరగా చూశారు. తనవిగా భావించారు. వారితో కలసిమెలసి సవరభాషకు ఓ శాశ్వతను తీసుకువచ్చారు. వీటినే ‘సవర కథలు’ ద్వారా అందించారు. ‘సవర కథలు’ చాలావరకు చిన్న పిల్లల కథలు వలే ఉన్నా సవరల మనస్త త్వాన్ని చెబుతాయి. సవరల జీవితాల్లోని ఓ తాత్వికతతో కూడిన విశ్వాసాలున్నాయి. వాటి వెనుక నీతివంతమైన వ్యవహారా లున్నాయి. కష్టపడే తత్వాన్ని నీతి ఆవహిస్తే స్వచ్ఛత కనిపిస్తుంది. ఇది ప్రకృతి గుణం. ‘నక్కా-గద్దా’,‘మూడు పిల్లులు- కోతి’,‘గొప్ప వాడి కథ’, ‘అత్యాశగల ఒక మనిషి’ వంటి కథలలోని నీతిని సవరల జీవనవిధానంలోని భాగంగా భావించడం కన్నా,వారి మనస్త త్వాన్ని, మానవతా దృక్పథాన్ని పరోక్షంగా చెబుతాయి. ఈ కథలలోని రెండవ పుస్తకం ముందుమాటలో ‘ఇందులోని కథలు అన్నీ సవర వాళ్ళు నాఎదుట చెప్పినవే. ఇంచు మించుగా వాళ్ళ మాటలే’ అంటారా యన. ఈ సంపుటంలోని కొన్ని కథలు వారు విన్నవి. కొన్ని కల్పనలు. కొన్ని కథలు వారివే. సవరలు పచ్చిబూతులు యథేచ్ఛగా ఉపయోగిస్తారు. అవి ఈ కథల్లో లేకుండా చూశారు గిడుగువారు. ఈ కథల్లో సవర జీవన విధానంతో పాటు వారి భాషను కూడా ఆయన సహజంగా గిడుగువారు ప్రతిపాదిం చారు. నాలుగో భాగం సవర కథల్లో పూర్తిగా సవరలకు సంబంధించిన జీవన విధానపు భాషా వ్యవహారం కనిపిస్తుంది.ఇళ్ళు,పొలం,సంత,తగవులు, పూజలు,కల్లు తాగడం,సోది,కేసులు, పోలీసు లు,జడ్జిలు, రోగాలు వంటి సందర్భాల్లో వారి సంభాష ణలోని సహజ త్వాన్ని గిడుగు అందించారు. సవర భాషాలిపికర్తగా,వ్యవ హారిక భాషా ఉద్యమ కారుడిగా చరిత్రకెక్కిన ఆయనకు, వర్తమానం లో ఎదురవుతున్న అవరోధాలన్నిటి నుంచి తెలుగు భాషను కాపాడుకోవటమే మన అర్పించే నిమెన నివాళి.
గిరిజనుల ప్రకృతి ఆరాధనే
వ్యవసాయమే ప్రధాన వృత్తిగా విశేషమైన పశు సంపద తో అటవీ వాతావరణంలో నివసించే గిరిజనులు ఏటా తమ సంప్రదా యాన్ని ప్రతిబింబించేలా సీత్లా పండుగ జరుపుకొంటారు. సామూహిక జీవితంలో అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఐక్యతను చాటేలా నిర్వహించే ఈ పండుగ వారి సంప్రదాయానికి అద్దం పడుతున్నది. పంటలు బాగా పండాలని, పశు సంపద అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పాటు ప్రకృతి ఆరాధన ఆ పండుగ అంతర్లీనంగా ఉం టుంది. అత్యధికంగా తండాలు కలిగిన పాలకవీడు మండలం లోపాటు బొమ్మల రామారం,తుర్కపల్లి మండలాల్లోనూ సీత్లా పండుగ సందడి నెలకొన్నది. లాలితండా, బెట్టెతండా,పాడ్యాతండా,చెర్వుతండా, కల్మటితండా,కొత్తతండా,శూన్యంపహాడ్‌, దేవ్లాతండా,మీగడంపహాడ్‌ తండా, లక్ష్మీతం డాల్లో పండుగలు జోరందుకున్నాయి. గిరిజ నుల తొలి పండుగ సీత్లా. ఆషాఢ మాసం పెద్ద పుష్యాల తొలి పాదంలో ఈ పండుగను జరుపుకొంటారు. తండాలోని కుటుంబాలన్నీ సామూహంగా ఏర్పడి ప్రకృతి దేవతలైన సీత్లా భవానీతో పాటు ఆరుగురు భవానీల ప్రతిమ లను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహి స్తారు. వర్షాలు బాగా కురువాలని పాడి పంటలతో పల్లెలు, తండాలు సస్యశ్యా మలంగా ఉం డాలని కోరుతూ మొక్కులు చెల్లించు కొం టారు. ఏడు రకాల వంట కాలతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని ఆటా పాటలతో గిరిజన సంప్రదాయ నృత్యాలతో సందడి చేస్తారు.ఈ తంతులో కుల పెద్దలు ప్రముఖ పాత్ర పోషిస్తారు. సాయంత్రం వేళ అమ్మ వార్లకు గొర్రె పోతు లను బలి ఇచ్చి,పేగు పైనుంచి పశువులను దాటిస్తారు. దీనినే దాటుడు పండుగ అని అంటారు.

పేదలకు భూ పంపిణీ

పేద రైతులకు భూములపై సర్వ హక్కులు కల్పించింది మీ బిడ్డ ప్రభుత్వమే..శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం రాష్ట్రంలో 1,563 గ్రామాల్లో 951 ఎకరాల ప్రభుత్వ భూముల కేటాయించాం..నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు అంటుంటే ఈ పెత్తందారులకు నచ్చడం లేదు..గజ దొంగల ముఠా మాటలు నమ్మి మోసపోవద్దు.. చంద్రబాబు ఏనాడూ ప్రజలకు మంచి చేసి అధికారంలోకి రాలేదు.. నూజివీడు బహిరంగ సభలో సీఎం జగన్‌.
పేదలభూములపై వారికి సర్వ హక్కు లు కల్పించింది మీ బిడ్డ ప్రభుత్వమే అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.రైతుల భూసమస్యలకు పరిష్కారం చూపించామని, 2003 నాటి అసైన్డ్‌ భూములకు హక్కులు కల్పిస్తున్నామని,కొత్తగా డీకేటి పట్టాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. పేదవాళ్లకు వెన్నుదన్నుగా ఉంటే పెత్తందా ర్లకు నచ్చడం లేదని,పేదవర్గాలపట్ల బాధ్యతగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంటే ప్రతిపక్షం కుట్రలు చేయా లని చూస్తోందని ఆరోపించారు. ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్‌ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46, 463.82ఎకరాలకు సంబంధించి42,307 మందికి డీకేటీ పట్టాలు పంపిణీ చేశారు. నిరు పేదలకుభూముల పంపిణీని ప్రారం­భించడం తోపాటు అసైన్డ్‌ భూములకు యా­జమాన్య హక్కులు కల్పించడం, లంక భూములకు పట్టాలు అందజేశారు. చుక్కల భూములు, షరతుల గల పట్టా భూ­ములు, సర్వీస్‌ ఇనాం భూములను 22 ఏ జా­బితా నుంచి తొలగించడం, భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చిన భూము­లపై హక్కుల కల్పన,గిరిజనులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీని సీఎం జగన్‌ ఈ సభలో ప్రారంభిం చారు.
ఈ సందర్బంగా నవంబర్‌ 17న నూజివీడులో ఏర్పా టు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశలో 18లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశామని, రెండో దశలో 24.6లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశామని,నాలుగువేల గ్రామాల్లో రీసర్వే పూర్త యిందని,సర్వే పూర్తైన గ్రామాల్లో అక్కడి సచి వాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చుని, భూ తగాదాల సమస్యలను పరిష్కారం చూపిస్తూ రికా ర్డులు అప్‌డేట్‌ చేశామని తెలిపారు. వేల మంది సర్వేయర్లతో వేగంగా సర్వే చేపడుతున్నామని, అసైన్డ్‌ భూములకు భూ హక్కులు కల్పిస్తున్నామని, చుక్కల భూములకు సైతం పరిష్కారం చూపించా మన్నారు.శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం రాష్ట్రంలో1,563 గ్రామాల్లో 951 ఎకరా ల ప్రభుత్వ భూమిని కేటాయించారు. -జిఎన్‌వి సతీష్‌

మిచౌంగ్‌ తుఫాన్‌…

ఓ వైపు చలికాలం కొనసాగుతూ ఉంటే మరో వైపు మిచౌంగ్‌ తుఫాను ముంచేసింది. వరిరైతుల ఉరేసింది. ఈ విపత్తు అన్నదాత ఆశల్ని ఊడ్చేసినంది. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో వరి నేలవాలింది. కోతకొచ్చిన లక్షల ఎకరాల వరిని నేలమట్టం చేస్తూ ఆరబెట్టిన లక్షల టన్నుల ధాన్యాన్ని నీటముంచుతూ.. మిచౌంగ్‌ తీవ్ర తుఫాను తీరందాటింది. చేతికొచ్చేసినట్లే అనుకుంటున్న వరి రైతుల ఆశల్ని తుఫాను తుడిచిపెట్టేసింది. రాయలసీమ,కోస్తా జిల్లాలో ఉద్యాన పంటలకూ తీరని నష్టాన్ని మిగిల్చింది. తీవ్ర తుఫాన్‌ కారణంగా వ్యవసాయ,ఉద్యాన పంటల నష్టమే రూ.10వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా.అతి భారీ వర్షాలు, గంటలకు వంద కి.మీ.వేగంతో వీచిన గాలుల తీవ్రతకు వందల గ్రామాలు వణికిపోయాయి. 8 జిల్లాలో 60మండలాల్లో తీవ్ర తుపాను ప్రభావం చూపింది. శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు వరకు వరి రైతులకు అపార నష్టం వాటిల్లింది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు గుండం క్రమాంగా మిచౌంగ్‌ తుఫాన్‌గా ఏర్పడిరది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో ఎక్కువగా చూపిస్తుంది. ఇప్పటికే భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సాధారణంగా ప్రకృతిలో అనేక మార్పుల వల్ల భూకంపాలు, తుఫాన్లు వస్తుంటాయి. వాతా వరణ ప్రభావం వల్ల తుఫాన్‌ ఏర్పడి అది సృష్టించే బీభత్సం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరుగుతుంది. అయితే ప్రతి తుఫాన్‌ కి వాతావరణ శాఖ వారు ఒక పేరుపెట్టడం ఆనవాయితీగా వస్తుంది. బంగాళా ఖాతం, అరేబియా మహాసముద్రంలో ఏర్పడి అల్ప పీడనం కారణంగా క్రమేణా వాయు గుండంగా మారి తుఫాన్‌ రూపం దాల్చు తుంది. దీని ప్రభావం దేశంలోని పలు రాష్ట్రా ల్లో భారీ వర్షాలు పడుతుంటాయి.ఈ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగి పోతాయి. విపరీతమైన గాలులు వీయడంతో కట్టడాలు నేటమట్టం అవుతుంటాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలను వణికి స్తున్న మిచౌంగ్‌ తుఫాన్‌కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం.వివరాల్లోకి వెళితే..
తుఫాన్‌ అంటే ప్రజలు భయంతో వణికిపోతుంటారు. ప్రతి ఏటా ప్రపంచ వాతావరణ సంస్థ (%ఔవీూ%) సైక్లోన్‌ పరిస్థితిని బట్టి ఈ పేరును పర్యవేక్షిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ సముద్ర పరివాహక ప్రాంతాల్లో ఏర్పడే తుఫానులను ఆ ప్రాంతాలలోని ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాలు, ఉష్ణ మండల తుఫాన్‌ హెచ్చిరికల కేంద్రాల నుంచి పేర్లను సేకరించి వాటికి అనుగుణంగా తుఫాన్‌ పేరును సూచిస్తాయి. 2021లో ఏర్పడిన తౌటే తుఫాన్‌కి మయన్మార్‌ పేరు పెట్టింది. మయన్మార్‌లో తౌటే అంటే పెద్ద శబ్ధం చేసే బల్లి అని అర్థం.ఈతుఫాన్‌ భారీ శబ్ధాలు చేస్తూ రావడంతో మయన్మార్‌ వాతావరణ శాఖ తమ దేశంలో ప్రత్యేకంగా ఉండే బల్లి పేరును పెట్టింది.ఆతర్వాత ఏపీని వణికిం చిన హుద్‌ హుద్‌ తుఫాన్‌ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ దీని ఎఫెక్ట్‌ ఆ ప్రాంతం లో కనిపిస్తూనే ఉంది. హుద్‌హుద్‌ తుఫాన్‌ కి ఆపేరు ఒమన్‌ సూచించింది. ఇది ఇజ్రా యెల్‌ జాతీయ పక్షి హుపో.హుద్‌హుద్‌ అంటే ఆఫ్రో-యురేషియా అంతటా కనిపించే రంగుల పక్షి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు, తమిళనాడును వణికిస్తున్న తుఫాన్‌ కి మిచౌంగ్‌ అని పేరు పెట్టారు. ‘మిగ్గామ్‌’ అని ఉచ్చరించే మిచాంగ్‌ పేరును మయన్మార్‌ సూచించింది. మిచాంగ్‌ అంటే ‘బలం’ లేదా ‘స్థిరత’ అని అర్థం. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా మిచౌంగ్‌ తుఫాన్‌ గా ఏర్పడిరదని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం నుంచి దీని ప్రభావం విపరీతంగా చూపిస్తుంద. గంటకు 8 కిలో మీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతుంది. మిచౌంగ్‌ తుఫాన్‌ కారణంగా ఏపీలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావం మరో రెండు రోజులు ఉండ వొచ్చని.. ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తుంది. ఈ తుఫాన్‌ ప్రభావం తమిళనాడులో భారీగా చూపించింది. చెన్నైలో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. ఇప్పటికే స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌రంగంలోకి దిగి సహాయకచర్యలు ప్రారంభించింది.
మిచౌంగ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌..142 రైళ్లు రద్దు!
బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్‌ తుఫాను తీవ్ర రూపం దాలుస్తోంది. ఈ తుఫాన్‌ కోస్తావైపు కదులుతున్నట్టు వాతా వరణశాఖ ప్రకటించింది. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుఫాన్‌ పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని నైరుతి బంగాళా ఖాతం లో కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాన్‌ సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం లోపు నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశ ముందని ఐఎండీ వెల్లడిరచింది.ఇక తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 90-110 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. తీర ప్రాంత ప్రజలను, మత్స్యకారులను జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కోస్తా, రాయలసీమలో సోమ మంగళవారాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ ప్రకటించింది. ఈ క్రమంలో ఆప్రాంతాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావం రైళ్లపై పడిరది. ఈ తుపాను నేపథ్యంలో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే విభాగం అప్రమత్తమైంది.ఈ నేపథ్యంలో దాదాపు 142 రైళ్లను రద్దు చేస్తున్నట్టు శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 3వ తేదీ నుంచి 6 తేదీ వరకూ ఈ రైలు సర్వీసులు రద్దు చేసినట్టు సీపీఆర్‌వో సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్ప పీడనం శుక్రవారం వాయుగుం డంగా మారింది. మిచౌంగ్‌ తుఫాన్‌ ఆదివారానికి తుపానుగా బల పడిరది. దీంతో నేడు, మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అలానే మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిరది.ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణి కులను దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్‌) హెచ్చరిక జారీ చేసింది. మిచాంగ్‌ తుపాన్‌ తీరాన్ని దాటనున్న నేపథ్యంలో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలో తిరిగే 142 రైళ్లు రద్దు చేశామని సీపీఆర్‌వో సీహెచ్‌ రాకేశ్‌ చెప్పారు. ఈ నెల 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకూ ఈ రైలు సర్వీసులు రద్దు చేశామని, ప్రయాణి కులు గమనించాలని కోరారు. మరికొన్ని రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు ఆయన తెలిపారు.
మిచౌంగ్‌ తుపాను ఎఫెక్ట్‌.. చెన్నై విమానా శ్రయం మూసివేత!
మిచౌంగ్‌ తుపాను ప్రజలను వణికిస్తోంది. పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చెన్నై నగరాన్ని మిచౌంగ్‌ తుపాను అతలాకుతలం చేస్తోంది. తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలవల్ల చెన్నై ప్రజల జీవనం దెబ్బతింటోంది. కాలనీలు, ప్రధాన రహదారులు అన్నీ జలాశయాలను తలపిస్తున్నాయి. ఎవరూ బయటకు రావొద్దంటూ అధికారులు హెచ్చరి స్తున్నారు. విద్యుత్‌ సరఫరా, ఇంటర్నెట్‌ సేవలకు కూడా అంతరాయం వాటిల్లింది. ఇప్పుడు చెన్నై విమానాశ్రయాన్ని కూడా మూసేశారు. విమాన రాకపోకలను తాత్కాలి కంగా నిలిపివేసినట్లు వెల్లడిరచారు. ప్రస్తుతం మిచౌంగ్‌ తుపాను కారణంగా చెన్నై ప్రజా రవాణాకు అంతరాయం ఏర్పడిరది. రోడ్లన్నీ వరద నీటితో మునిగిపోయాయి. ఎవరూ కూడా బయటకు రావడం లేదు. ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేశారు. దేశవ్యాప్తంగా తుపాను ప్రభావిత ప్రాంతాలకు రైళ్ల సేవలను నిలిపివేశారు. రోడ్డు మార్గాన కూడా చెన్నైకి రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా జాతీయ రహదారులు కూడా వర్షపు నీటితో నిండిపోయాయి. ఇప్పుడు విమాన రాకపో కలకు కూడా అంతరాయం ఏర్పడిరది. రన్‌ వేని క్లోజ్‌ చేస్తున్నట్లు చెన్నై విమానాశ్రయ అధికారులు వెల్లడిరచారు. రాత్రి 11 గంటల వరకు విమానాల టేకాఫ్‌, ల్యాండిరగ్‌ జరగదని..రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామంటూ ప్రకటించారు. వాతా వరణం అనుకూలించక పోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ తెలియజేశారు. తుపాను ప్రభావం వల్ల తీర ప్రాంతాలైన చెన్నై, కాంచీపురం,తిరువల్లూర్‌,చెంగలపట్టు ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదు అవుతోంది. ఈ వర్షాల కారణంగానే విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మిచౌంగ్‌ తుపాను కారణంగా ప్రస్తుతం 80 నుంతి 90కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. వర్షపు నీటి వల్ల విమానాలు, రోడ్డు రవాణా మాత్రమే కాకుండా.. రైళ్ల రాకపోకలకు కూడా అంత రాయం ఏర్పడిరది. చెన్నైలో దాదాపు 14 సబ్‌ వేలను వర్షపు నీటివల్ల మూసి వేశారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు, విద్యా సంస్థలకు కూడా సెలవులు ప్రకటించారు. ఇంక ఈ మిచౌంగ్‌ తుపాను వల్ల అటు తెలుగు రాష్ట్రా ల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడిరచారు. ఈ తుపాను నెల్లూరు- మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడిరచింది. ఈ నేపథ్యంలోనే కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. అలాగే ఇక్కడ ఈదురు గాలులు కూడా వీచే ఆస్కారం ఉంది. ఇప్పటికే ఆంధ్రాలో అధికా రులు తీర ప్రాంత జిల్లాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే మరో 28 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తు న్నారు. మరోవైపు మిచౌంగ్‌ తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు, కాలనీలు అన్నీ జలమయం అయ్యాయి. కొన్నిచోట్ల కాలనీల్లో పార్క్‌ చేసిన కార్లు కాగితపు పడవల్లా వరద నీటిలో కొట్టుకుపో తున్నాయి. ఇప్పటికే చెన్నై నగరానికి మంచి నీటిని సరఫరా చేసే రిజర్వాయర్లు అన్నీ నిండిపోయాయి. ఇంకా వర్షాలు కురుస్తూ ఉండటంతో అవి పొంగే ప్రమాదం కూడా ఉందంటూ అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటికే నెట్టింట చెన్నై నగరానికి సంబం ధించిన విజువల్స్‌ వైరల్‌గా మారాయి. అక్కడి ప్రజలు పడుతున్న అవస్థలకు ఆ దృశ్యాలు సాక్ష్యం అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నా రు. మరోవైపు ఏటా ఇలాంటి వరదలు వస్తున్నా కూడా ఎందుకు ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. 5 సెంటీమీటర్ల వర్షం కురిస్తేనే రోడ్లు జలమ యం అవుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తుపానుతో వరి పంటకు తీవ్ర నష్టం
తుపాను వల్ల జిల్లాలో చాలా ప్రాంతాల్లో వర్షం కురవడంతో రైతులు తమ పంటను కాపాడుకోవడానికి నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఇప్పటికే అమ్మకానికి సిద్ధంగా ఉన్న దాన్ని రవాణాకు వాహనాలు లేకపోవడంతో కొంతమంది రైతులు సొంతంగా వాహనాలను ఏర్పాటు చేసుకొని తమ ధాన్యాన్ని తరలించు కుపోయే పనిలో ఉండగా,మరి కొంతమంది రైతులు తమ వద్ద ఉన్న ధాన్యాన్ని టార్పలిన్లతో కప్పి భద్రపర్చుకొంటున్నారు. ఇప్పటికే పొలం లో కోసి ఉన్న పంటను కుప్పలు వేసుకుని పంటను తడవకుండా కాపాడుకునే పనిలో కొంతమంది రైతులు నిమగమైనారు. కల్లాల్లో, పొలాల్లో ఎక్కడ చూసినా రైతులు పండిన పంటను, అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని, బస్టాండ్లో నింపిన ధాన్యాన్ని తరలించే పనిలోనే ఉంటూ తమ పంటను కాపాడుకునే పనిలోనే ఉన్నారు.పాలకొండ: తుపాను హెచ్చ రికతో రైతులకు పాట్లు తప్పటం లేదు. ఓ మోస్తారు వర్షం కురువడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. వరి పొలాలు, కల్లంలో ఉన్న వరికుప్పలను తర్బాన్లనతో రక్షణ కల్పించుకున్నారు. మండలంలో 17 వేల ఎకరాల్లో వరిసాగవుతోంది. అయితే ఈసారి సాగునీరందక వ్యయప్రయాసాలు పడి మోటర్లు సాయంతో సాగునీటిని పొలాలకు అందించారు. పంట చేతిక అందిన సమ యంలో తుఫాన్లు రావడంతో పంట ఏమివుతుందో తెలియక రైతులు గగ్గోలు పెడుతున్నారు. మండలంలో గోపాలపురం, భాసూరు,వి.పి రాజుపేట, అంపిలి తదితర ప్రాంతాల్లో పొలాల్లోనే ధాన్యం కుప్పలు ఉన్నాయి. దీంతో ధాన్యం తడిసి రంగు మారుతుందన్న భయంతో ఆందోళన చెందుతున్నారు. మూడు రోజులపాటు ఈ వర్షాప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏజెన్సీలో మిచాంగ్‌ తుపానుతో రైతుల గుండెల్లో గుబులు పట్టుకుంది. రెండు రోజులుగా ఈ తుపాను ప్రభావం ఉండడంతో అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఏజెన్సీలో చినరామదేవనాపురం, పెదరామం, దోను బాయి తదితర ప్రాంతాల్లో కోతలైపోవడంతో రైతులు ఆదరా బాధరాగా వరి చేను పంట పొలాల్లోనే కుప్పలు వేస్తున్నారు. మరి కొంత మంది వరిచేలపై టార్బన్‌ కప్పుతున్నారు. చేతికి అందించిన పంట చేజారి పోతుందే మోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది 2532 ఎకరాల్లో వరి నాట్లు పడగా,580 ఎకరాల వరకు కోతలు జరిగాయి. కోసిన పంటను సురక్షిత ప్రాంతా లకు తరలించాలని పనిలో రైతులు ఉన్నారు. పొలాల్లో కాస్త మిగిలి ఉన్న వరి పంటను కాపాడుకునేందుకు రైతులు అప్రమత్తమ య్యారు. కోసిన వరి పంట కల్లానికి తీసుకువచ్చి కుప్పలుగా పెట్టి టార్ఫాన్లతో కాపాడుకుంటున్నారు. మరి కొన్నిచోట్ల ఆదివారం రాత్రి నుంచి మిషన్లతో నూర్పులు చేపట్టి పంటను ఇంటికి తీసుకెళ్తున్నారు. సకాలంలో వర్షాల్లేక పంట ఎండిపోయి కరువు ఏర్పడిరదని ఆందోళన చెందుతున్న తరుణంలో మరోవైపు తుఫాను ప్రభావంతో మిగిలిన కాస్త పంటైన దాచుకునేందుకు రైతులు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. అప్రమత్తమైన అధికారులుతుపాను కారణంగా మండలంలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి విపత్తు వచ్చిన సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా గుమ్మిడి లక్ష్మీపురం మండలంలోని 27 పంచాయ తీలు అధికారుల దృష్టి సాధించారు. తుపాను కారణంగా ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దని కోరారు.వాతావరణ మార్పులు రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. ఎక్కడ వర్షం పడుతుందోనని వరిరైతులు వణికిపోతు న్నాయి. ప్రస్తుతం మండలంలో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. పంటను రక్షించుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. కోసిన పనులను సురక్షిత ప్రాంతాలకు చేర్చుతున్నారు. సుమారు 1700 వేల వరిసాగు చేశారు. ముందుగా నాట్లు వేసిన వరి పైరు కోతలు జరుగుతున్నాయి.ఈ పరిస్థితుల్లో వర్షం కురిస్తే వరి పనలు, ధాన్యం పాడైపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు మను షులు తో కొందరు సురక్షిత ప్రాంతాలకు తరలించి వాటిపై పరదాలు కప్పి రక్షణ చర్యలు చేపడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని నిబంధనల పేరుతో ఆపకుండా, గిట్టుబాటు ధరకే కొనుగోలు చేయాలని, వీటిని తరలించేందుకు సరిపడా వాహనాలను ప్రభుత్వం సమకూర్చాలని కోరారు.-గునపర్తి సైమన్‌

పెన్షన్‌ భిక్ష కాదు.. ఉద్యోగుల ..హక్కు..!

ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా చర్చనీ యాంశమైన అంశాల్లో పెన్షన్‌ కూడా ఒకటి.కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రుద్దుతున్న నూతన పెన్షన్‌ విధానాన్ని దేశవ్యా ప్తంగా ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఉద్యోగ విరమణ అనంతరం ప్రశాంతంగా గడవ వల సిన జీవితా లు ఈ విధానంతో ప్రశ్నార్ధకంగా మారుతుం డటమే దీనికి కారణం. శక్తియుక్తులన్నీ ఉద్యోగు లుగా ఖర్చు చేసిన తరువాత, మిగిలిన జీవితాన్ని గౌరవప్రదం గా గడపడానికి ఉద్దేశించిందే పెన్షన్‌! అయితే, అటు వంటి పరిస్థితి నిజంగా ఉందా అంటే లేదు అన్నదే సమా ధానం. అనేక రంగాల మాదిరే ఈ విషయంలో నూ మనదేశానిది అథమస్థానమే. అమెరి కాకు చెందిన కన్సల్టింగ్‌ కంపెనీ మెర్సర్‌, స్వచ్ఛంద సంస్థ సిఎఫ్‌ఎ ఇన్‌స్టి ట్యూట్‌ కలిసి సంయుక్తంగా విడుదల చేసిన తాజా ప్రపంచ పెన్షన్‌ సూచీ (2023)లో భారత దేశ స్థానం చివరి నుండి మూడవది !
మొత్తం47దేశాల్లో ఆసంస్థ సర్వే నిర్వహించగా భారత్‌ 45వ స్థానంలో నిలిచింది. 2022 లో 44దేశాలకుగాను మన దేశం 41 వ స్థానంలో నిలిచింది. అంటే గత ఏడాదితో పోల్చినా మన స్థానం మరింత దిగజారిందన్న మాట. ఇదీ సీనియర్‌ సిటిజన్లకు మనం ఇస్తున్న గౌరవం! ఈవాస్తవాన్ని గుర్తించి, మెరుగైన విధా నాన్ని రూపొందించడానికి మనపాలకులు సిద్ధ పడకపోవడమే విచారకరం. ప్రపంచ ఆకలి సూచీ రిపోర్టును తిరస్కరించినట్టే దీనిని కూడా మోడీ ప్రభుత్వం తిరస్కరించింది.2021లోపెన్షన్‌ సూచీ లో భారత్‌ చివరిస్థానంలో నిలవడంతో పార్లమెం టులో ప్రస్తావనకు వచ్చింది.దీనిపై వివిరణ ఇచ్చిన ప్రభుత్వం ఆ సూచికలో విశ్వసనీయ సమా చారం లేదని,అన్ని అంశాలను పరిగణలోకి తీసు కోలేదని ప్రకటించింది. ఆ తరువాతైనా పెన్షన్‌ విధానంలో మెరుగైన మార్పులు తీసుకువచ్చిందా అంటే అదీ లేదు.ఏటికేడాది దిగదిడుపే !
నిజానికి,మెర్సర్‌-సిఎఫ్‌ఎ ఇన్‌స్టిట్యూట్‌ గత పదిహేను సంవత్సరాలుగా విడుదల చేస్తున్న గ్లోబల్‌ పెన్షన్‌ ఇండెక్స్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తిం పు ఉంది.తాజా సర్వేను 64శాతం ప్రపంచ జనాభాకు ప్రాతినిధ్యం వహించేలా 47 దేశాల్లో ఈ సర్వే జరిగింది. ఆ దేశాల్లోని పెన్షన్‌ విధానా లను సమగ్రంగా అధ్యయనం చేయడంతో పాటు, 50 అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నట్లు నిర్వా హకులు తెలిపారు. ఈ సర్వేలో 85 పాయింట్లతో నెదర్లాండ్స్‌ మొట్టమొదటి స్థానంలో నిలవగా, 83.5పాయింట్లతో ఐస్‌ల్యాండ్‌ రెండవ స్థానం లో,81.3 పాయింట్లతో డెన్మార్క్‌ మూడవ స్థానంలో నిలిచాయి.45వస్థానంలో నిలిచిన భారత్‌కు 45.9పాయింట్లు దక్కగా,42.3 పా యింట్లతో అర్జెంటీనా చిట్టచివరన నిలిచింది. అమెరికాతోపాటు మధ్యస్థంగా ఉన్న అనేక దేశాలు తీసుకురావాల్సిన మార్పులను పేర్కొన్న నివేదిక, చైనా,కొరియా సింగపూర్‌, జపాన్‌ వంటి దేశాలు మెరుగైన విధానాలను అమలు చేస్తున్నాయని తెలి పింది. అదే సమయంలో భారత్‌ పనితీరుపై అది పెదవి విరిచింది. నయా ఉదారవాద విధా నాల ఫలితంగా దుర్భరమౌతున్న బతుకులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన ప్రమాణాల్లో వస్తున్న మార్పులు, అంతకంతకు భారమౌతున్న వైద్య ఖర్చుల తీరును ప్రస్తావించిన నివేదిక వీటిని తట్టుకునే విధంగా పెన్షన్‌ విధానాలను రూపొం దించాలని ప్రపంచ దేశాలకు సూచించింది.
మెరుగైన పెన్షన్‌ విధానం కోసం దేశంలోనూ,ప్రత్యేకించి మనరాష్ట్రంలోనూ ఉద్యోగులు,ఉపాధ్యాయులు సాగిస్తున్న పోరాటాన్ని ఈ నేపథ్యంలోనే చూడాలి.ఈ సందర్భంగా ప్రస్తా వనార్హం.ఉద్యోగ విరమణ అనంతరం గౌరవ ప్రదమైన జీవితంకోసం పాతపెన్షన్‌ విధానం కావాలని ఉద్యోగులు,ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అం టోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి భిన్నం గా కంట్రిబ్యూషన్‌ విధానంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జిపిఎస్‌ను వీరు తిరస్కరిస్తున్నారు. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు పాత పెన్షన్‌ విధానం అమలు చేస్తుం డగా,మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సాధ్యం కాదని,ఖజానాపై పెనుభారం పడుతుందని చెబు తుండటం విచిత్రం! ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ మొండి వైఖరికి నిరసనగా యుటిఎఫ్‌ ఆధ్వ ర్యంలో రాష్ట్ర స్థాయిలో నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభమైనాయి. క్షేత్రస్థాయికి పోరాటాన్ని తీసుకు పోవడంలో భాగంగా జిల్లా, మండల స్థాయిల్లో నూ దీక్షలు చేపట్టనున్నారు. పాత పెన్షన్‌ విధానా న్ని అమలు చేస్తామన్న పార్టీకే రానున్న ఎన్నికల్లో ఓటు వేయాలని ఉపాధ్యాయ నేతలు ఇచ్చిన పిలుపు అత్యంత సముచితమైనది. గౌరవప్రదమైన పెన్షన్‌ ప్రభుత్వం ఇచ్చే భిక్షకాదు.ఉద్యోగుల హక్కు! అని నినదిస్తూ ఇటీవల ఢల్లీిలో భారీర్యాలీ జరిగిం ది. రాష్ట్రంలోనూ అంచెలం చెలుగా ఈ పోరా టం విస్తృతమౌతోంది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. ఉద్యోగులు,ఉపా ధ్యాయల న్యాయసమ్మతమైన డిమాం డ్లను పరిష్క రించాలి.- జిఎన్‌వి సతీష్‌

కంటకాపల్లి రైల్వే ప్రమాదంలో మృత్యుఘటికలు

ఈ ఘోర ఘటన మరువ లేనిది. ఎన్ని రైల్వే ప్రమాదాలు జరిగినా సామాన్యుడు ప్రాణాలే గాల్లో కలిసిపోతున్నాయి. ప్రభు త్వాలకు పట్టడం లేదు. అందుకే పదే పదే ఒకే తరహా ప్రమాదాలు ప్రయాణీకులను బలితీసుకుంటున్నాయి. విజయనగరం జిల్లా కంటకాపల్లి దరిలో జరిగిన ఘటనే తార్కాణం. అక్టోబర్‌ 29న పొద్దు వాలు తున్న సమాయన సంభవించిన ఘోర రైలు ప్రమాదం పదమూడు మంది అమా యకుల ప్రాణాలను కబళించింది. వంద మంది వరకు క్షతగాత్రులను చేసింది. విశాఖ నుంచి పలాస వెళుతున్న ప్యాసిం జర్‌ రైలుకు సిగల్‌ అందక కంటకాపల్లి సమీపంలో ట్రాక్‌పై నిలిపిఉంచగా, వెనక నుంచి అదే పట్టాలపై విశాఖ నుంచి రాయగడ వెళ్లే ప్యాసింజర్‌ రైలు వేగంగా ఢకొట్టిెంది.ఆ ధాటికి రాయగడ రైలు కొన్ని బోగీలు నుజ్జునుజ్జు కాగా మరికొన్ని పక్క ట్రాక్‌లోని గూడ్స్‌ రైలు మీదికి దూసుకెళ్లాయి. ఈ భీతావహంలో చని పోయిన వారిలో ఇద్దరు లోకో పైలెట్లు, గార్డు కూడా ఉండటం విషాదం. ముందుగా వెళ్లిన రైలుకు సిగల్‌ అందని పరిస్థితి ఉండగా వెనుక మరో రైలును అదే ట్రాక్‌పై పంపడం రైల్వే భద్రత డొల్లత నానికి నిదర్శనం. ఇదే రూట్‌లో ఒడిశా లోని బాలాసోర్‌ వద్ద జూన్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 296 మంది మరణించగా 1,200 మంది గాయపడ్డారు. ఆ ఘోర కలిని మర్చిపోక ముందే అదే తరహాలో సిగల్‌ వైఫల్యం కారణంగా మూడు రైళ్లు గుద్దుకు న్నాయి.ఈ నెలలోనే బీహార్‌లో పట్టాలు ఊడి పోవడాన్ని గమనించిన డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయడంతో పెనుముప్పు తప్పింది. నాలుగు మరణాలు,70 మందికి గాయా లతో సరి పోయింది. వరుస రైలు ప్రమాదాలతో రైలు ప్రయాణ మంటేనే ప్రజలను భీతిల్లజేస్తోంది. దుర్ఘటన జరిగిన ప్రతిసారీ ప్రముఖుల సంతాపాలు, పరామర్శలు, తృణమో పణమో పరిహారాలు మినహా ప్రమాదాలపై సమగ్ర విచారణ జరిపి,కారణాలు కనుగొని,పునరావృతం కాకుండాపటిష్ట చర్యలు చేపట్టే విషయంలోకేంద్ర ప్రభు త్వం బాధ్యత తప్పింది.ప్రభుత్వం వైఫల్యాల నుంచి ప్రజలను ఏమారు స్తోంది.రైల్వే భద్రత విషయంలో మోడీ ప్రభుత్వ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యాన్ని 2022లో విడుదల చేసిన కాగ్‌ నివేదిక కుండబద్దలు కొట్టింది.దాదాపు రైలు ప్రమాదాలన్నీ పట్టాలు తప్పడం వల్లనే సంభవిస్తున్నాయని, పట్టాల పునరుద్ధరణకు నిధులు కేటాయించాల్సి ఉండగా, 2017 లో ప్రత్యేకంగా నెలకొల్పిన రాష్ట్రీయ రైలు రక్షణ నిధి నిధులు తగ్గించిన వైనాన్ని కాగ్‌ ఎత్తి చూపింది. అలాగే రైల్వేలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండిరగ్‌ కమిటీ రిపోర్టు ప్రకారం రైలు ప్రమాదాలపై రైల్వే సేఫ్టీ కమిషనర్‌ దర్యాప్తు చేసి సమర్పించిన నివేదికలపై ఎలాంటి చర్యలూ లేవు. ఇదీ ప్రయాణీకుల ప్రాణాలకు మోడీ ప్రభుత్వం ఇచ్చే విలువ. బాలాసోర్‌ ఘటన విషయానికే వస్తే సిబిఐ దర్యాప్తు చేసి ముగ్గురు అధికా రులను అరెస్టు చేసి కోర్టులో ఛార్జిషీట్‌ వేసి మమ అనిపించింది. కానీ సిగలింగ్‌ వ్యవస్థ ఏమాత్రం మారలేదని విజయనగరం ఘటన వలన తేటతెల్లమవుతోంది.కేంద్రంలో బిజెపి వచ్చాక రైల్వేల ప్రైవేటీకరణ దూకుడుగా జరుగుతోంది. వందల ప్రైవేటు రైళ్లొచ్చాయి. అదానీ వంటి కార్పొరేట్లకు రైల్వే ఆస్తులు ధారాదత్తమవుతున్నాయి. రైల్వే ప్రత్యేక బడ్జెట్‌ ఎత్తేశారు. ప్యాసింజర్‌ రైళ్లు రద్దవుతూ వందేభారత్‌, హైస్పీడ్‌ ట్రైన్లు ప్రవేశపెడు తున్నారు. 2022 చివరి నాటికి రైల్వేలలో మూడు లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని స్వయాన రైల్వేశాఖ మంత్రి రాజ్యసభలో వెల్లడిరచారు. రైళ్లల్లో ప్రతి రోజూ రెండున్నర కోట్ల మంది గమ్యస్థానాలకు చేరుతున్నారు. ఒక వైపు రైల్వేల ద్వారా ఏడాదికి రూ.2.40 లక్షల కోట్ల ఆదాయాన్ని మోడీ ప్రభుత్వం ఆర్జిస్తూ మరో వైపు ప్రయాణీకుల భద్రతకు ఏడాదికి రూ.5 వేల కోట్లు కూడా కేటాయిం చడం లేదు. సిబ్బంది లేని వేలాది లెవెల్‌ క్రాసింగ్‌లు పెట్టుకొని బుల్లెట్‌ రైళ్లనడం మోడీ ప్రభుత్వానికే చెల్లుతుంది. రైలు ప్రమాదాలను మానవ తప్పిదంగానో,కుట్రగానో చిత్రించడం తప్పించుకొనే ఎత్తు. ప్రపంచంలోనే అతి పెద్ద పబ్లిక్‌ రంగ రవాణా వ్యవస్థ మన రైల్వే. అత్యధిక ఉద్యోగులు పని చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థగా మన రైల్వేలకు పేరుంది. రైల్వేలపట్ల ప్రభుత్వ విధానాల్లో మార్పు రానంత వరకు ప్రయాణీకుల ప్రాణాలు గాలిలో పెట్టిన దీపాల చందమే. విజయ నగరం దుర్ఘటనతోనైనా కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ మేల్కోవాలి.ప్రమాద బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలి.
సిగ్నలింగ్‌ వ్యవస్థ లోపాలు..
దేశ రైల్వేలో భద్రతా సిబ్బంది కొరత, సిగలింగ్‌ వ్యవస్థ ఆపరేషన్స్‌ నిర్వహణ విష యంలో కేంద్రంలోని మోడీ సర్కారు నిర్లక్ష్య వైఖరి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దీంతో, గడిచిన ఆరేళ్లుగా తూర్పు కోస్తా రైల్వే పరిధి లోని వాల్తేరు డివిజన్‌లో ప్రమాదాలు క్రమేపీ పెరుగుతున్నాయి. భారీ ఘటనలు చోటుచేసు కున్నాయి. ఇక్కడ సుమారు రెండు వేల మంది ఇంజనీరింగ్‌ సిబ్బంది కొరత ఏళ్ల తరబడి వెంటాడుతోంది. 2013లో విజయ నగరం జిల్లా గొట్లాంలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒక బోగీలో పొగ వచ్చిందని, ఏదో ప్రమాదం జరగబోతుందనే కంగారులో రైలు గొలుసు లాగి పక్కనే మరో రైల్వే ట్రాక్‌లోకి ప్రయాణి కులు వెళ్తున్న క్రమంలో ఆ ట్రాక్‌పై వచ్చిన రైలు ఢకొనెడంతో మృతి చెందారు. 2016 లో కూనేరులో హీరాకుడ్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో 41 మంది మరణించారు. దేశంలోనే అతిపెద్ద రైలు ప్రమాదాల్లో ఒకటైన ఒడిశాలోని బాలాసూర్‌లో ఎదురెదురుగా వచ్చిన రైళ్లు ఢకొన్నె ఘటనలో 298 మంది ప్రాణాలు కోల్పోగా, 500 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. తాజాగా వాల్తేరు డివిజన్‌ పరిధిలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ వద్ద 2023 అక్టోబర్‌ 29 రాత్రి రాయగడ-విజ యవాడ ఎక్స్‌ప్రెస్‌ రైలు పలాస పాసింజరును ఢకొనెడంతో సుమారు 13మంది విగతజీవు లయ్యారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ, మోడీ ప్రభుత్వం రైల్వేల భద్రతను పట్టించు కోకపోవడమే ఈ ప్రమాదాలకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కంటకాపల్లి-అలమండ వద్ద జరిగిన రైలు ప్రమాదంపై రైల్వే ఉన్నతాధికారులు ప్రాథమిక విశ్లేషణ ఇలా ఉంది. వాల్తేరు డివిజన్‌లో ప్రధాన, నిత్యం బిజీగా ఉండే రైల్వే లైను ఇది.మూడు రైల్వే లైన్లు ఇక్కడ ఉన్నాయి. మధ్య లైనులో ఈ తాజా ఘటన జరిగింది. హౌరా-చెన్నరు వెళ్లే రైళ్లు,కోరమండల్‌,కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌, మెయిల్‌,సరుకు రవాణా గూడ్స్‌ రైళ్లు ఈ లైన్లోనే వెళతాయి.వాల్తేరు రైల్వేలో కీలకమైన మూడు లైన్లు ఇవే అయినప్పటికీ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఆదివారం ఘటనపై రైల్వే ప్రాథమిక అంచనాలు ఇలా ఉన్నాయి. స్నిగల్‌ వ్యవస్థల్లో రెడ్‌ (ఎరుపు)-1,గ్రీన్‌ (ఆకుపచ్చ)-2 సిగల్‌ లైట్లు ఉంటాయి. పూర్తిగా రెడ్‌ ఉంటే ఆగడం,గ్రీన్‌ ఉంటే వెళ్లడం చేయాలి.పసుపు లైట్లు రెండు ఉం టాయి. అవి రెండూ వెలిగితే ప్రొసీడ్‌ (2 సెక్షన్లు) లైన్లు క్లియర్‌గా ఉన్నాయని అర్థం. కానీ,ఒక పసుపు లైటు వెలిగి ఉంటే ఒక సెక్షన్‌ క్లియర్‌ అని, ఆగిఆగి వెళ్లాలని సంకే తం.తాజాగా జరిగిన ప్రమాదంలో రాయగడ రైలు లోకో పైలట్‌ కాస్త వేగంగా ప్రొసీడ్‌ అయ్యారని అంచనా వేస్తున్నారు.దీన్నే సిగల్‌ ఓవర్‌ సీగా రైల్వే పరిభాషలో పేర్కొం టున్నారు.
సిఆర్‌ఎస్‌ ఇన్వెస్టిగేషన్‌ ప్రారంభం
కంటకాపల్లి ఘటనపై ఇన్వెస్టిగేషన్‌కు కమిషనర్‌ రైల్వే స్టేఫ్టీ (సిఆర్‌ఎస్‌)ను కేంద్రం సోమవారం నియమించింది. ప్రత్యేక సాంకే తిక నిపుణుల బృందం వాల్తేరు డివిజన్‌లో ఈ మేరకు పరిశీలన చేయనుంది. మూడు రోజుల తర్వాత పేపర్‌ నోటిఫికేషన్‌ కూడా ఆనవాయితీ ప్రకారం విడుదల చేసి ప్రత్యక్షం గా, పరోక్షంగా ఎవరైనా ఈ ఘటనపై వివరాలు అందజేసేవారుంటే ఫలానా చోట కలవాలని ఈ కమిటీ తెలియపరచనుంది. ప్రజలు,రైల్వే సిబ్బంది, ప్రయాణికులందరినీ ఇలా విచారణ చేశాక పదిరోజుల తర్వాత ఈ ప్రమాద కారణాన్ని వెల్లడిరచనున్నారు. నానాటికీ తీసికట్టుగా భద్రత
ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే, సౌత్‌ కోస్ట్‌ రైల్వేల్లో లోకో పైలట్లకు అధిక పని ఒత్తిడి ఉందని కోర మండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదానికి ముందే కేంద్రానికి రైల్వే బోర్డు నివేదించింది.ఈస్ట్‌ కోస్ట్‌ పరిధిలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ట్రాక్‌లకు ఇరువైపులా పెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని బోర్డు చెప్పినా రైల్వే శాఖకు పట్టలేదు. లోకో పైలట్ల పని 12 గంటలకు మించకుండా ఉండాలని సూచిం చింది.కానీ,12గంటలపైనే వీరితో పని చేయించుకుంటోంది.సదరన్‌ రైల్వే పరిధిలో 392 లోకో పైలట్ల పోస్టులు ఖాళీలు ఉన్నా యి.2017 నుంచి 2021 కాలానికి కేంద్ర ప్రభుత్వం భద్రతా నిధి కింద రూ.20వేల కోట్లు ఏర్పాటు చేయాలి. కానీ,రూ.4వేల కోట్ల మేరే జమ చేసింది. ఈ విషయంలో కేంద్ర వైఫల్యంపై కాగ్‌ 2021లో తప్పు పట్టింది.అదే విధంగా రైల్వే లైన్ల మరమ్మ తుల నుంచి సిబ్బంది సంఖ్యను పెంచే అంశం వరకూ వివిధ అంశాలపై వివిధ కమిటీలు, రైల్వే ట్రేడ్‌ యూనియన్లు, ప్రజాసంఘాలు ఇచ్చిన సిఫార్సులు ప్రభుత్వం ముందు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. వర్షాకాలంలో వానలు పడటం,వరదలు రావడం కొత్తేమీ కాదు.అతి తక్కువ రోజుల్లో అత్యధిక వర్ష పాతం నమోదు కావడమూ,ఫలితంగా అనూహ్య వరదలు సంభవించడమూ ఇటీవల కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నదే!ఆ విష యం పక్కన పెట్టినప్పటికీ లైన్లను నిరంతరం కాపలా కాస్తూ, ఎప్పటికప్పుడు అవసరమైన చర్యల కోసం హెచ్చరికలు చేసే గ్యాంగ్‌మెన్ల వ్యవస్థ రైల్వేశాఖకు ప్రత్యేకం. కీలకమైన ఈ వ్యవస్థలో నియమకాలు కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయాయి.ఉన్న వారిని కూడా ఏదో రకంగా వదిలించుకోవడానికే రైల్వేశాఖ ప్రయత్నాలు చేస్తోంది. సమాచార సాంకేతిక విప్లవానికి ఆకాశమే హద్దుగా మారిన ప్రస్తుత రోజుల్లోనూ తాతల కాలం నాటి బూజు పట్టిన విధానాలనే రైల్వేశాఖ అమలు చేస్తోంది.ఫలితంగా రైలు పట్టాల వెంట నిరం తరం పహరా కాయాల్సిన గ్యాంగ్‌మెన్లపై పని భారం విపరీతంగా పెరుగుతోంది. ఒక్క గ్యాంగ్‌మెన్ల విషయంలోనే కాదు, ప్రయాణీ కుల భద్రతతో ముడిబడిన డ్రైవర్లు, గార్డులు, సిగలింగ్‌ సిబ్బంది, తదితర ఉద్యోగాల భర్తీ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వానిది ఇదే వైఖరి. ప్రయాణీకుల భద్రతపై ఏ మాత్రం ఆలోచించే ప్రభుత్వమైనా మొట్టమొదట ఈ విషయంపై దృష్టి సారించాల్సి ఉంది. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ఇదే విషయమై విమర్శల వర్షం కురిపించిన బిజెపి నేతలు అధికారం లోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వానికన్నా అధికంగా ప్రైవేటీకరణ రాగాన్ని ఆలపిస్తు న్నారు. ఉట్టికెగిరే సత్తా లేకపోయినా ఆకాశాని కెగిరేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. మోడీ ప్రభుత్వం ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లో అట్టహాసంగా ఆవిష్కరించిన బుల్లెట్‌ ట్రైన్‌ విన్యాసమూ ఆ కోవలోనిదే. దేశవ్యాప్తంగా అత్యధిక రైలు ప్రమాదాలు పట్టాలు తప్పడం కారణంగానే జరుగుతున్నాయి. నిర్వహణ, నాణ్యత లోపాలే దీనికి కారణమని వివిధ కమిటీల నివేదికలు ఇప్పటికే నిగ్గు తేల్చాయి. గడిచిన దశాబ్ద కాలంలో సగటున ఏడాదికి 150కి పైగా ఈ తరహా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రెండవ స్థానంలో లెవెల్‌ క్రాసింగ్‌ల వద్ద జరిగిన ప్రమాదాలు నిలి చాయి. వీటిలో అత్యధిక భాగం ప్రమాదాలకు సిబ్బందినే కారణంగా చూపుతున్న రైల్వేశాఖ వారికి అవసరమైన ఆధునిక సదుపాయాలను, తగిన సంఖ్యలో మానవ వనరులను కల్పిం చడంపై మాత్రం దృష్టి సారించ డంలేదు. ఈ ఏడాది బడ్జెట్‌లోనూ అత్యాధునిక ప్రమాద హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని రైల్వేమంత్రి ఊరించినప్పటికీ ఆదిశలో ఇప్పటి వరకు అడుగులు పడలేదు. ఆధునిక ట్రాక్‌ను ఏర్పాటు చేస్తామని, వెల్డింగ్‌లో నూతన విధానాలను అనుసరించి రైళ్లు పట్టాలు తప్పడాన్ని నిరోధిస్తామని చెప్పిన మాటలకూ ఇంతవరకు అతీగతీ లేకపోవడం విచారకరం. రైల్వే మంత్రిత్వ శాఖే నియమించిన డాక్టర్‌ అనిల్‌ కకోడ్కర్‌ నేతృత్వంలోని హైలెవల్‌ కమిటీ ఐదు సంవత్సరాల కాలంలో భద్రతా ప్రమాణాల పెంపు కోసం లక్ష కోట్ల రూపా యలను ఖర్చు చేయాలని రెండు సంవత్సరాల క్రితం సూచించింది. ఇప్పటి వరకు ఆ దిశలో కేటాయింపులు నామమాత్రమే! భద్రతకు సంబంధించిన మౌలిక వనరుల కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేయాలని, అడ్వాన్స్‌డ్‌ సిగలింగ్‌ వ్యవస్థ కోసం మరో రూ.20 వేల కోట్లు కేటాయించాలన్న ఆ కమిటీ సిఫార్సులు కాగితాలకే పరిమితమ య్యాయి. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని చేసిన సిఫార్సులను ఏ మాత్రం పట్టించుకోని ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశలో చేసిన సూచనల అమలుకు మాత్రం తహతహ లాడుతోంది. – గునపర్తి సైమన్‌

విశాఖ వైపు మెట్రో పరుగులు

ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా కార్యనిర్వాహక రాజధానిగా ఎంపికైన విశాఖలో అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విశాఖలో ఇప్పటికే వందల కోట్ల వ్యయంతో సుందరీకరణ,అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం.. తాజాగా పెండిరగ్‌లో ఉన్న మెట్రో రైల్‌ ప్రాజెక్టునూ పరుగులు పెట్టించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మెట్రో రైలు పరిధిని 75 కిలోమీటర్లుగా నిర్ణయించిన ప్రభుత్వం నాలుగు కారిడార్లుగా దీన్ని అభివృద్ధి చేయబో తోంది. ఇందుకోసం సమగ్ర వివరాలతో డీపీఆర్‌ను త్వరలోనే విడుదల చేసేందు కు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారా యణ ప్రకటించారు.అంతే కాకుండా ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌. జవహర్‌రెడ్డి విశాఖ రాజధాని అభి వృద్ధిపై అధికార్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలోనూ మెట్రో ప్రాజెక్టుపై చర్చిలు నిర్వహించిన విషయం తెలిసిందే. నగరంలో మెట్రో రైల్‌ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మ కంగా తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర చరిత్ర, సంస్కృతి,సంప్రదాయం ప్రతిబింబిం చేలా మెట్రో పిల్లర్లు నిర్మాణం చేపట్టే దిశగా ఆలోచన చేస్తోంది. మరోవైపు తొలి విడతలో76.90కి.మీ.మేర లైట్‌ మెట్రో నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈలోగా నిధుల సమీకరణను వేగవంతం చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌ రెడ్డి మెట్రో రైల్‌ కార్పొరేషన్కు మార్గదర్శకాలు జారీ చేశారు.
విశాఖ మెట్రో పరిధి ఖరారు పారిశ్రా మికంగా అభివృద్ధి చెందిన విశాఖ నగరం ఏపీలోని ప్రస్తుతం మరే ఇతర నగరాల కంటే కూడా మెరుగైన స్ధితిలో ఉంది. ఇక్కడ కొత్తగా వస్తున్న ప్రాజెక్టులతో పాటు ఇప్పటికే కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వ సంస్ధలకు చెందిన ఉద్యోగులతో నగరం కిటకిటలాడు తోంది.ఈ రద్దీని తట్టుకునేందుకు ఎప్పటి నుంచో మెట్రోరైల్‌ ప్రాజెక్టు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరిగినా అవి అరకొరగానే మిగిలిపోయాయి. ఇప్పుడు వైసీపీ సర్కారు వాటిని దుమ్ముదులిపి ఎలాగైనా మెట్రో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అడుగులు వేస్తోంది.కార్యనిర్వాహక రాజధానిగా ఎంపికైన విశాఖ నగరంలో అభివృద్ధిని పరుగులు పెట్టించాలంటే మెట్రో ప్రాజెక్టు తప్పనిసరి అని భావిస్తున్న ప్రభుత్వం 75కిలోమీటర్ల మార్గంలో దీన్ని అభివృద్ధి చేసేందుకు తుది ఆమోద ముద్ర వేసింది.
ప్రజారవాణా వ్యవస్థ మెరుగుదలపై దృష్టి

2021 అంచనాల ప్రకారం విశాఖ మహా నగరంలో 25లక్షలకుపైగా జనాభా ఉంది. మెట్రో నిర్మాణ ప్రతిపాదనలు ఉన్న శివారు ప్రాంతాలతో కలిపితే మొత్తం జనాభా 41లక్షలు. లాభనష్టాలతో సంబంధం లే కుండా కేవలం ప్రజలకు రవాణా సౌకర్యా లను మె రుగుపరిచేందుకు మెట్రోపై దృష్టి సారించింది.సీఎం వైఎస్‌ జగన్మోహన్రెడ్డి దసరా తర్వాత విశాఖ కేంద్రంగా పరిపాలన సాగించేందుకు అడుగులు పడుతున్న తరు ణంలో నగరంలో ప్రజారవాణా వ్యవస్థ మరింత మెరుగు పరచాల్సిన అవసరం ఉంది. మెట్రో రైలు రాకతో ట్రాఫిక్‌ సమస్య తీరడం తోపాటు సమయం కూడా ఆదా అవుతుంది..
నాలుగు కారిడార్లుగా విభజన…
విశాఖలో ప్రస్తుతం ఉన్న రద్దీని దృష్టిలో ఉంచుకుని 75 కిలోమీటర్ల మెట్రో రైల్‌ ప్రాజెక్టును నాలుగు కారిడార్లుగా విభజిం చారు. స్టీల్‌ ప్లాంట్‌ గేటు నుంచి కొమ్మాడి జంక్షన్‌ వరకూ,గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసు వరకూ,తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకూ, కొమ్మాడి జంక్షన్‌ నుంచి భోగాపురం వరకూ నాలుగు కారిడార్లు ఏర్పాటు కానున్నాయి. ఈ నాలుగు కారిడార్ల ఏర్పాటుకు అవసరమైన డీపీఆర్‌ సాధ్యమై నంత త్వరగా సిద్ధం చేయాలని విజయ వాడలో నిర్వహించిన సమీక్షలో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆధేశించారు. వచ్చే ఏడాది కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు నాటికి మెట్రో పనులను ఎట్టి పరిస్ధితుల్లోనూ ప్రారంభం కావాలని ప్రభుత్వం ఆశిస్తోంది.
2025 నాటికి రోజుకు ఆరులక్షల మంది ప్రయాణం…
కోవిడ్‌ కారణంగా డీపీఆర్‌ తయారీ ఆలస్యమై నప్పటికీ సాధ్యమైనంత త్వరగా దీన్ని ప్రభు త్వానికి అందించేందుకు అధికారులు సన్నద్దమవు తున్నారు.ఆ తర్వాత దాన్ని వెంటనే ఆమోదించి ప్రాజెక్టును పట్టాలెక్కిం చాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో డీపీఆర్‌ పూర్తి చేసి ప్రాజెక్టు మొదలుపెడితే మూడు నుంచి నాలుగేళ్ల వ్యవధిలో ఇది పూర్తవుతుంది. ఆ లెక్కన చూస్తే 2025 నుంచి రోజుకు సగటున ఆరు లక్షల మంది విశాఖ మెట్రోలో ప్రయాణించేందుకు అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అత్యాధునిక మెట్రోగా ఉన్న హైదరాబాద్‌ మెట్రోరైల్‌ కంటే మెరుగైన టెక్నాలజీతో దీన్ని నిర్మించాలని ప్రభుత్వం ఆదే శాలు ఇచ్చింది.
వచ్చే ఏడాది జనవరి 15న పునాది రాయి
వచ్చే ఏడాది జనవరి 15న మెట్రో రైలు పనులకు పునాది రాయి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల విశాఖలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహన్రెడ్డి నిర్వహించిన అభివృద్ధి పనుల సమీక్షలో మెట్రో రైలు నిర్మాణ అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. పునాది రాయి వేసేలోగా నిధులు సమీకరించేందుకు ఉన్న మార్గాల్ని అన్వేషించాలని ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎండీ యూజేఎం రావుకు సూచించారు. 42 మెట్రో స్టేషన్లతో కూడిన మూడు కారిడార్లను మొదటి దశలో నిర్మించాలని భావిస్తున్నారు. కారిడార్‌-1లో స్టీల్‌ ప్లాంట్‌ గేట్‌ నుంచి కొమ్మాది జంక్షన్‌ వరకు 34.40కి.మీ..కారిడార్‌-2లో గురుద్వార నుంచి పాత పోస్టాఫీస్‌ వరకు 5.07 కి.మీ.,కారిడార్‌-3లో భాగంగా తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకూ 6.75 కి.మీ. మేర లైట్‌ మెట్రో కారిడార్‌ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఆ తరువాత రెండో విడత కింద కారిడార్‌-4లో కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్పోర్టు వరకు 30.67 కి.మీ. మేర నిర్మించనున్నారు. ఈ నాలుగు కారిడార్లలో మొత్తం 54 స్టేషన్లు, రెండు డిపోలు ఏర్పాటు చేయనున్నారు.
బీచ్‌ రోడ్డులో ట్రామ్‌ కారిడార్‌
బీచ్‌ రోడ్డులో ట్రామ్‌ కారిడార్‌ ఒక మణిహా రంగా రాబోతోంది. ప్రధాన జం క్షన్ల నుంచి అభివృద్ధి చెందే ప్రాంతాలకు కూడా ట్రామ్‌ నడిపే యోచనలో ప్రభుత్వం ఉంది. మొత్తం 60.05 కి.మీ. మేర మోడ్రన్‌ ట్రామ్ని నడ పిేందుకు 4 కారిడార్లు గుర్తించారు. కోస్టల్‌ బ్యాటరీ నుంచి భీమిలి వరకూ ట్రామ్‌ కారిడార్‌ ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా స్టీల్‌ ప్లాంట్‌ నుంచి అనకాపల్లి, ఎన్‌ఏడీ జంక్షన్‌ నుంచి పెందుర్తి వరకు కూడా ట్రామ్‌ కారిడార్‌ రాబోతోంది.
శివారుకు మెట్రో.. సీఎం ఆకాంక్ష
ఏపీ ఎగ్జిక్యూటివ్‌, ఫైనాన్షియల్‌ క్యాపిటల్గా, ఐటీ హబ్‌ అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో శివారు ప్రాంతా లు కూడా కోర్‌ సిటీకి సమానంగా అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు అవసరం. అందుకే ఆయా ప్రాంతాలకు మెట్రో స్వా కర్యం కూడా కల్పించాలన్నది సీఎం వైఎస్‌ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష. అందుకు అనుగుణంగా డీపీఆర్‌ లో మార్పులు, చేర్పులు జరిగాయి.
విశాఖ మెట్రో స్వరూపమిదీ..
మొత్తం అంచనా వ్యయం:14.09 కోట్ల
ఫేజ్‌-1లో కారిడార్‌-1, 2,3 నిర్మాణ అంచనా వ్యయం: రూ.9,699 కోట్లు
ఫేజ్‌-2లో కారిడార్‌-4 నిర్మాణ అంచనా వ్యయం: రూ.4,610 కోట్లు ప్రాజెక్టు
విస్తీర్ణం: 76.90 కి.మీ. ఫేజ్‌-1, ఫేజ్‌-2లో నిర్మించే మొత్తం స్టేషన్లు: 54
మోడ్రన్‌ ట్రామ్‌ ప్రాజెక్టు
అంచనా వ్యయం: రూ.5,323 కోట్లు కారిడార్‌ -1 అంచనా వ్యయం: రూ.1,102 కోట్లు,కారిడార్‌-2 అంచనా వ్యయం: రూ.1.879 కోట్లు, కారిడార్‌- 3 అంచనా వ్యయం: రూ.1,321 కోట్లు, కారిడార్‌ – 4 అంచనా వ్యయం: 1.21 కోట్ల, ప్రాజెక్టు విస్తీర్ణం: 60.05 కి.మీ.– (జి.ఎ.సునీల్‌ కుమార్‌)

హరిత విప్లవ పితామహుడు డాక్టర్‌ సోమనాథన్‌

భారతదేశ హరితవిప్లవ పితామహు డు, ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం ఎస్‌ స్వామినాథన్‌ కన్ను మూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన,సెప్టెంబర్‌ 27న చెన్నెలోని తననివాసంలో తుదిశ్వాస విడిచి నట్లు కుటుంబ వర్గాలు వెల్లడిరచాయి. ఆయన వయసు 99ఏళ్లు.అధిక దిగుబడినిచ్చే వరి, గోధు మ రకాలను అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. రెండవ పంచవర్ష ప్రణాళిక (1956- 1961)సమయంలో హరిత విప్లవానికి నాందిపలికారు.స్వామినాధన్‌ ప్రయత్నాలు భారతదేశం తన ఆకలి సంక్షోభా పరిష్కరిం చడంలో సహాయపడిరది. ముఖ్యంగా 1943 లో బెంగాల్‌ కరవు పరిస్థితి తర్వాత స్వామినాథన్‌ ప్రయోగాలకు ప్రాధాన్యతేర్పడిరది. స్వామినాథ నకు భార్య మీనాతో పాటు ముగ్గురు కుమార్తెలు సౌమ్యా స్వామినాథన్‌, మధురా స్వామి నాథన్‌, నిత్యా స్వామినాధన్‌ ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థలో చీఫ్‌ సైంటిస్టుగా ఉన్న సౌమ్యా స్వామి నాథన్‌ ఈయన కుమార్తె కావడం విశేషం.
వైద్యరంగం నుంచి వ్యవసాయంవైపు..
ఎంఎస్‌ స్వామినాథన్‌ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. భారతదేశ హరిత విప్లవ పితామ హుడు. ప్రపంచ ప్రఖ్యా త వ్యవసాయ శాస్త్రవేత్త కూడా.భారతదేశం ఆహార సంక్షోభా న్ని ఎదుర్కొం టున్న వేళ,అధిక న్న వేళ,అధిక దిగుబడినిచ్చే వరి,గోధుమ రకాలను అభివృద్ధిచేసి ఆహార ధాన్యాల సమృద్ధికి బీజం వేశాదు. ఆహారభద్ర తకు మార్గదర్శిగా నిలిచాడు.ఎంఎస్‌ స్వామి నాథన్‌ 1925ఆగస్టు 7న అప్పటి మద్రాసు ప్రెసి డెన్సీలోని కుంభకోణంలో జన్మించారు. ఆయన తండ్రి ఎండే సాంబశివ న్‌ సర్జన్‌, మెట్రిక్యులేషన్‌ పూర్తయిన తర్వాత స్వామినాథన్‌ కూడా తండ్రి బాటలోనే మెడికల్‌ స్కూల్లో చేరారు. కానీ, 1943లో బెంగాల్‌ కరవును కళ్లారా చూసిన ఆయన చలించిపోయా రు. దేశాన్ని ఆకలి నుంచి కాపాడాలన్న లక్ష్యంతో వైద్య రంగం మనసు మార్చుకుని వ్యవసాయ పరిశోధనల వైపు నుంచి తన అడుగువేశారు. త్రివేండ్రంలోని మహారాజా కాలేజీలో జువాల జై నుంచి యూజీ డిగ్రీ పట్టా పొందిన ఆయన.. ఆ తర్వాత. మద్రాసు అగ్రిక ల్చరల్‌ కాలేజీ లో చేరారు. అగ్రికల్చరల్‌ సైన్స్‌ లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారు.ఆ తర్వాత ఢల్లీిలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో పీజీ చదివారు. యూపీఎస్సీపరీక్ష రాసి ఐపీఎస్‌ కు అర్హత సాధించారు. కానీ,ఆ అవకాశాన్ని వదులుకుని యునెస్కో ఫెలోషిప్తో నెదర్లాండ్స్‌లోని అగ్రికల్చ రల్‌ యూనివర్సిటీలో చేరారు.
రీసెర్చి స్కాలర్‌..
1952లో ఇంగ్లండ్లోని క్యాంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ నుంచి జెనటిక్స్లో పీహెచ్‌ పూర్తి చేశారు. అమెరికా లోని విసిస్సన్‌ లో ఆయన పోస్టు డాక్టోరల్‌ రీసెర్చ్‌ చేశారు.జెనటిక్స్‌,నేచర్‌,జర్నల్‌ ఆఫ్‌ హెరిడిటీ, జెనిటీకా,యుఫిటికా,బిబిలియో గ్రాఫికా జెనటికా, అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ బాటనీ, అమెరికన్‌ పొటా టో జర్నల్‌ లాంటి పత్రికల్లో ఆయన రచనలు అయ్యాయి. రీసెర్చి స్కాలర్‌ స్వామినాథన్‌.. ప్రోస్ట్‌ రెసిస్టాంట్‌ అలుగడ్డను డెవలప్‌ చేశారు. అతి శీతల వాతావరణాన్ని తట్టుకునే ఆలు వంగడాన్ని ఆయన అభివృద్ధి చేశారు.తన రీసెర్చ్‌ కెరీర్ను క్రిప్టోజెనటిక్‌ స్టడీస్తో ప్రారంభించారు. నెదర్లాండ్స్లో ఉన్న నాగనీస్‌ఆన్‌ వ్య న వ్యవసాయ యూనివర్సిటీ లో 1949లో ఆయన ఆలుగడ్డపై తన అధ్య యనం చేపట్టారు.
పురస్కారాలు…
స్వామినాథన్‌ అనేక జాతీయ, అంతర్జాతీయ అవా ర్డుల ను గెలుచుకున్నారు. 1987లో వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ అవార్డు దక్కింది. 1971లో రామన్‌ మెగస్సే న్‌ అవార్డు వరించిం – 1986లో ఆల్బర్ట్‌ ఐన్స్టీన్‌ వరల్డ్‌ సైన్స్‌ అవార్డు పొందా రు. ఇందిరాగాంధీ శాంతి బహుమతి,1967లో పద్మశ్రీ, 1972లో పద్యభూషణ్‌,1989లో పద్మ విభూషణ్‌ పురస్కా రాలు అందుకున్నారు. 2007 నుంచి 2013 మధ్య పార్లమెంట్కు నామినేట్‌ ఎంపీగా సేవలం దించారు. 1988లో స్వామినాథన్‌ లాభాపేక్ష లేని రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ను చెన్నైలో స్థాపించారు. అలస్కా ప్రోస్టిస్‌ అన్న వెరైటీతో ఆయన ఫేమస్‌ అయ్యారు.ఆ తర్వాత ఆయన అనేక పంటలకు చెందినఎన్నోహైబ్రిడ్‌ వెరైటీలను డెవలప్‌ చేశారు.
అంతర్జాతీయ కీర్తిప్రతిష్టలు..
20వశతాబ్దంలో ఆసియాలో ప్రభావం చూపిన 20 మందివ్యక్తుల్లో ఎంఎస్‌ స్వామినాథన్‌ ఒకరని టైమ్‌ మేగజైన్‌ కీర్తించింది. మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్‌ ఠాకూర్‌ తర్వాత ప్రభావంతమైన భారతీయ వ్యక్తుల్లో ఆయన్ను ఒకడిగా పేర్కొన్నది. స్వామినాథన్‌ ను ఫాదర్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ ఎకాలజీ అని ఐక్య రాజ్యసమితి కీర్తించింది.వ్యవసాయం లో హరిత విప్లవానికి స్వామినాథన్‌ నాయ కత్వం వహించినట్లు యూఎన్‌ఓ దశలో పేర్కొన్నది. ఆ ఆహార భద్రతకోసం ఐక్యరాజ్యసమితిలో ఆయన ఎన్నోకీలప పదవుల్ని చేపట్టారు. 1980 లో ఏర్పాటు చేసిన యూఎస్‌ సైన్స్‌ అడ్వైజరీ కమిటీలో ఆయన చైర్మెన్‌గా చేశారు. వియన్నా యాక్షన్‌ ప్లాన్లో పాల్గొన్నారు.ఆ ఎఫ్‌ఎవో కౌన్సిల్‌ ఇండిపెండెంట్‌ చైర్మెన్‌గా ఉన్నారు. ప్రకృతి, ప్రకృతివనరుల సంరక్షణ అంతర్జాతీయ సంఘా నికి అధ్యక్షుడిగా చేశారు.వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచరు అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1961 నుంచి 1972 వరకు ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్స్టిట్యూట్‌ కు డైరెక్టర్‌గా ఉన్నారు. 1979 -1980లో భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. 1980 నుండి 1982 వరకు ప్రణాళికా సంఘం లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి కృషిచేశారు. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ డైరెక్టర్‌ జనరల్గా ఫిలిప్పీన్స్లో పనిచేశారు. అన్నదాతలకు ఆప్త మిత్రుడు.
విదేశాల నుంచి గోధుమలను దిగు మతి చేసుకునే దుస్థితి నుంచి మన దేశం వ్యవ సాయ రంగంలో స్వయం పోషకత్వం సాధించ డానికి ప్రధాన కారకుడు వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం.ఎస్‌. స్వామినాథన్‌. అందుకే, ఆయ నను హరిత విప్లవ పితామహుడని శ్లాఘి ఉం టారు. ఆయనకు రుణపడి ఉంటామని అన్నదా తలు అంటూంటారు.వ్యవసాయ రంగంలో సమ స్యల పరిష్కారానికి డాక్టర్‌ స్వామినాథన్‌ సిఫార్సు లను అమలు చేయాలని రాజకీయ పార్టీల నాయకులు తరచూ డిమాండ్‌ చేస్తుంటారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి,తండ్రి బాటలో డాక్టర్‌ అవుదామన్న మెట్రిక్యులేషన్‌ పూర్తి కాగానే మెడిక ల్‌ స్కూల్లో చేరారు. ఆ రోజుల్లో బెంగాల్లో కరవు విలయతాడవం యావత్‌ దేశాన్ని కుదిపేసింది. అవిభక్త బెంగాల్లో ఆకలిచావుల గురించిన వార్తలు దేశ ప్రజలను కలచివేశాయి. స్వామి నాథన్‌ డాక్టర్‌ అవ్వాలన్న తన ఆలోచన మార్చు కున్నా అధ్యయనం చేసి డాక్టరేట్‌ సంపాదించారు. ఆ రోజుల్లో మేధావులు ఏ వృత్తిలో ఉన్నా దేశం గురించే ఆలోచించేస్వామినాథన్‌. సంకరజాతి వరి, గోధుమ వంగడాలను సృష్టించడం ద్వారా అధిక దిగుబడి నిచ్చే వంగడాలను సృష్టించినం దువల్లనే ఆయనను ఈరంగానికి పితా మహుడని కీర్తిస్తున్నారు. వ్యవసాయ రంగం గ్రామాల ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది. వ్యవసాయ రంగం వృద్ధి చెందాలంటే స్వామినాథన్‌ సిఫార్సులు అమలు జరగాల్సిందేనన్నది అధికుల విశ్వాసం. ఆకలిలో మగ్గుతున్న వారు 60శాతం ఉన్నారని డాక్టర్‌ స్వామినాథన్‌,ఆయన గురువు నార్మన్‌ బోర్లోగ్‌ విశ్వసించి, ఆహార లో సాధించిన భద్రత కోసం ఏదైనా చేయాలని పట్టుబట్టి సంకరజాతి గోధుమలను కనుగొన్నారు.అదే సస్యవిప్లవానికి దారి తీసింది. స్వామినాథన్‌ కృషికిఆనాటి ప్రధాని ఇందిరా గ్రహించి గాంధీ సంపూర్ణ సహకారం అందించారు. తమ స్వార్థం కోసం కాకుండా సమాజ హితం గురించి ఆలోచించేవారు.డాక్టర్‌ స్వామినాథన్‌ రోజున తన నిర్ణయాన్ని మార్చుకో కుండా ఉండి ఉంటే దేశానికి ఒక గొప్ప వ్యవసా య శాస్త్రవేత్త లభించి ఉండే వారు కారు. ఆహార సంక్షోభంలో ఉన్న దేశాన్ని ఆహార రంగంలో స్వయం సమృద్ధిగల దేశంగా మార్చిన ఘనత ఆయనదే. అప్పట్లో అమెరికా నుంచి పిఎల్‌ 480 రకం గోధుమలను మన దేశం దిగుమతి చేసు కునేది. ఆ దశలో ఉన్న వ్యవసాయరంగం దిశ,దశ మార్చినవాడు. అందుకే మన దేశాన్ని పాడి పంటల భాగ్యభూమిఅని అభివర్ణించారు. తరత రాలుగా భారత్లో ప్రజలు ఈ రెండిరటిపై ఆధార పడి జీవనోపాధి సాగిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ 60శాతం మందిపైగా ఈ రెండు రంగాలపైనే ఆధారపడు తున్నారు.ఏదేశమైనా అభివృద్ధి సాధించేందుకు ఈ రెండు రంగాల్లో సాధించిన వృద్ధి అసలైన అభివృద్ధికి కొలమానం. ఇప్పుడు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగం పంపిణీ కావడం వృద్ధినే అభివద్ధిగా పరిగణిస్తున్నారు. సాఫ్‌ వేర్‌ ఎగుమతులు కాదు,ఆహారధాన్యాల ఎగుమతులు పేరిగితేనే దేశం అభివృద్ధి చెందినట్టు, ఈ వాస్త వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస వ్యవస్థా పకుడు కె.చంద్రశేఖరరావు అమలులో పెడుతు న్నారు. రంగం రూపురేఖలు మారిపోయాయి. ఆహార ధాన్యాల.అదే ఆయనకు నిజమైన నివాళి.ఉత్పత్తులు 34లక్షల టన్నులకు పెరిగాయి. కేసీఆర్‌ పదేపదే ప్రకటిస్తున్నట్టు దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. స్వాతంత్య్రా నంతరం పాలకులు వ్యవసాయ, పారిశ్రామికరం గాలకు సమానంగా ప్రాధాన్యం ఇచ్చేవారు. తర్వాత వ్యవసాయ రంగంపై దృష్టి తగ్గింది. గ్రామాల్లో ఉపాధి కార్యక్రమాలు లేక అక్కడి జనం గ్రామాలు, నగరాలకు వలసలు రావడం ప్రారంభించారు.దీనిని నిరోధించేందుకు యూపీఏ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది. ఆ పథకం ఇప్పుడు అంతంత మాత్రంగా కొనసాగుతోంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగినా అవి సక్రమంగా లేదు. అందుకే యూపీఏ హయాంలో ఆహార భద్రతా పథకాన్ని అప్పటి ప్రభుత్వం తీసుకుని వచ్చింది. ఆపథకం నీరుగారడం వల్లనే దేశంలో పలు రాష్ట్రాల్లో ఆహార సంక్షోభం ఏర్పడుతోంది. స్వామి నాథన్‌ సిఫార్సులను అమలు చేయడం ద్వారా వ్యవసా య రంగాన్ని,ఇటు రైతులను పరిపుష్టం చేయ వచ్చు.అందుకే కేంద్రప్రభుత్వం చిత్తశుద్దితో పని చేయాలి.అదే ఆయనకు నిజమైన నివాళి.- (కె.సతీష్‌ కుమార్‌)

త్వరలో విశాఖ నుంచి పాలన

రాష్ట్రంలో విజయదశమి కీలక మార్పులు తేనుంది. దసరా పండుగ తర్వాత పాలనా రాజధానికి సీఎంవో తరలనున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుంచి అడుగు ముందుకు పడలేదు. ఎప్పటికప్పుడు తరలింపు తప్పదంటూ నాయకుల ప్రకటనలు మినహా ఆ దిశగా జరిగిందేమీ లేదు. అయితే గతంలోనే సీఎం ముఖ్య కార్యదర్శి, పలువురు అధికారులు విశాఖలో సీఎంవో,హెచ్‌వోడీల కార్యాలయాల కోసం పర్యటనలు చేశారు. నగరం చుట్టు పక్కల ప్రాంతాల్లో భవనాలనూ ఖరారు చేసుకున్నారు.
మూడు రాజధానులకు కట్టుబడి ఉన్న ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో తరలి తీరాలనే పట్టుదలతో ఉంది. అసెంబ్లీలో పాసైన చట్టంపై న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు కావడంతో తరలింపుపై వేచి చూస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా రాజధాని తరలింపు పూర్తిగా రాష్ట్ర పరిధిలోనిదని స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హెచ్‌ఆర్సీ వంటి వాటిని న్యాయ రాజధాని అయిన కర్నూలులో ఏర్పాటు చేయాలని నిర్ణ యించింది. హైకోర్టు తరలింపుపైనా న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తోంది.పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖ నుంచి పరిపాలనను సాగించబోతున్నట్లు ఉత్తరాంధ్ర కీలక నేతలు కూడా చెబుతున్నారు. గతంలో రెండు మూడు సార్లు ప్రయత్నాలు, ప్రచారం జరిగినా వివిధ కారణాల వల్ల అడుగు ముందుకు పడలేదు. ముఖ్య మంత్రి ఎక్కడ నుంచి పరిపాలన సాగిస్తే అదే రాజధాని అని చట్టం చెబుతోందని న్యాయస్థానంలోనూ ప్రభుతవ్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. అలాగే శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుందని స్పష్టం చేసింది. న్యాయపరమైన ఇబ్బందులతో బిల్లును ఉపసంహరించుకున్నా తరలింపునకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి బొత్స పలు వేదికలపై చెప్పారు. అలాగే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా విశాఖే పాలనా రాజధాని అని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే మరో బిల్లుతో వస్తామని పేర్కన్నారు. ఈ క్రమంలో రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. బిల్లు తుది దశలో ఉండటంతోనే సెప్టెంబర్‌ ఒకటిన జరగాల్సిన కేబినెట్‌ను ఏడో తేదీకి వాయిదా వేసినట్లు చర్చించుకుంటున్నారు. కేబినెట్‌ ఆమోదం తర్వాత అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదించుకోనున్నట్లు చర్చ జరుగు తోంది. సీఎం జగన్‌ ఇటీవల పర్యట నలను వేగవంతం చేశారు. రెండుమూడు సార్లు ఉత్త రాంధ్రలోనూ పర్యటించారు. ఈ క్రమంలో విశాఖతో పాటు తాడేపల్లి క్యాంపు కార్యాల యం నుంచి కూడా పరిపాలనను నిర్వహించ నున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. ఆవిధంగా చేస్తే న్యాయపరమైన ఆటంకాలు కూడా ఉం డవని భావిస్తున్నారు. ప్రస్తుతం విశాఖలో పరి పాలనకు అవసరమైన అన్ని భవనాలను ఎంపిక ప్రక్రియ జోరందుకుంది. విశాఖ నుంచి ముఖ్యమంత్రి పాలన ప్రారంభిస్తే ప్రస్తుతానికి హెచ్‌వోడీలు తరలి వెళ్తే సరి పోతుందని చెబుతున్నారు.
అక్టోబర్‌ 23వ తేదీన మూహోర్తం..
విజయదశమికి ఇంకా నెలరోజులు గడవు ఉంది.ఈలోగా అమరావతి ప్రాంతంనుంచి రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకదాని తరు వాత మరొకటి విశాఖపట్నం తరలి వస్తాయని అధికార వర్గాల సమాచారం.విజయదశమి రోజు(అక్టోబర్‌ 23న) రాజధాని నిర్మాణాలకు సీఎం చేతులు మీదుగా శంకుస్థాపనకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. చట్ట బద్ధం గానే మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ సీఎం జగన్‌ గత ఏడాది సెప్టెంబరులో జీఎన్‌ రావు కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అన్ని ప్రాంతాల ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి,పరిపాలన వికేంద్రీకరణకు అనుకూలంగా డిసెంబరు నెలాఖరున నివేదిక సమర్పించింది.దీనిపై ప్రతిపక్షాలు, అమరావతికి 33వేల ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌ కింద ఇచ్చిన రైతుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది.ఆపై బోస్టన్‌ కన్సల్టెన్సీ నివేదిక అంటూ మరోకటి తెరపైకి తీసుకువచ్చింది.దీంతో విశాఖకు పరిపాలన రాజధానిని తరలిం చాలని ప్రభుత్వం నిర్ణయింది. విశాఖలో ఇందుకు అవసరమైన కార్యాలయాలను ఎంపిక చేసుకోవాలని అన్ని శాఖల అధిపతులకు సూచించింది. రెవెన్యూ,ఐటీ, జలవనరులు,ఆర్‌అండ్‌బీ, పురపాలన, పట్టణాభివృద్ధి,రిజిస్ట్రేషన్లు…ఇలా అన్ని శాఖల అధిపతులు ఏదో ఒక సమయంలో విశాఖ పట్నం వచ్చి, తమ శాఖకు అనుకూలమైన భవనాలను పరిశీలించుకున్నారు. కుటుం బాలతో సహావస్తే… ఉండేందుకు రుషి కొండలో ఏపీ టూరిజం నిర్మిస్తున్న ఐదు భవన నిర్మాణాల్లో రెండు భవనాలు సిద్దమవుతున్నాయి.భహుశా ఆభవనాల్లోనే ముఖ్యమంత్రి పరిపాలన కార్యనిర్వహణా కొనసాగించవచ్చని పరిశీలికలు భావిస్తున్నారు.
సీఎం కార్యాలయాలన్నీ భీమిలి నియోజకవర్గ పరిధిలోనే?
విశాఖపట్నంలో పరిపాలన రాజధాని అనగానే..భీమిలి నియోజకవర్గంలోనే రాజధాని కార్యాలయాలు రానున్నాయి.ఈ మేరకు ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు కూడా ఈప్రాంతంలో పర్యటించినప్పుడల్లా ‘ఇదంతా రాజధానిప్రాంతమని అనేవారు.గత సీఎం సలహాదారు అజయ్‌ కల్లం, అప్పటి సీఎం పేషీముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌,రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి… తదితరులు విశాఖలో ప్రభుత్వ అవసరాలకు అనువైన భూములు,భవనాల కోసం అన్వేషిం చారు.మొదట రుషికొండఐటీ పార్కులోని మిలీనియం టవర్‌లో సీఎం కార్యాలయం ఏర్పాటు చేయాలని భావించారు. అప్పటికే అందులో కాండ్యుయెంట్‌ కంపెనీ ఉండడం, వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు పోతా యని ఐటీవర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో అప్పటి ఐటీ సెక్రటరీ కోనశశిధర్‌, స్వర్గీయ ఐటీ శాఖ మంత్రి గౌతంరెడ్డి విశాఖపట్నం వచ్చి…అటువంటిదేమీ లేదని, అందులో సీఎం కార్యాలయం రాదని ప్రకటించారు. అయితే ఆ పక్కనే మిలీనియం టవర్‌-2నిర్మాణాన్ని వేగవంతం చేశారు. దానిని ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించు కోనున్నారు.
పరిపాలన కార్యాలయాలు గతంలో కొన్ని గుర్తింపు..
సీఎం నివాసం,కార్యాలయం,సచివాలయం ఇలా అన్నీ శాఖల కార్యాలయాలు ఏర్పాటుపై గతంలో అప్పటి సీఎంఓ కార్యాలయ ఉన్నతాధికారులు ఒక కమిటీ ఏర్పడి విశాఖలో పర్యటించి కొన్ని భవనాలను గుర్తించారు.ఎక్కడ ఏ కార్యాలయం ఏర్పాటు చేయాలి?అనే అంశాలపై క్షుణ్ణంగా పలు ప్రదేశాలను సందర్శించారు.అప్పట్లో రుషికొండ ఐటీపార్కులో స్టార్టప్‌ విలేజ్‌ భవనాన్ని సీఎం కార్యాలయం కోసం ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. అందులో స్టార్టప్‌ కంపెనీలన్నింటినీ ఏడాది క్రితమే ఖాళీ చేయించారు. ఐటీ పార్కులో ఓరాజకీయ నాయకుడికి చెందిన భవనాన్ని డీజీపీ కార్యాలయం కోసం మాట్లాడారు. మూడు ఎకరాల విస్తీర్ణంలోని ఉన్న ఆభవనంలో మరో అంతస్థు నిర్మించే అవకాశం కోసం పరిశీలిం చారు. కాపులుప్పాడలో గ్రేహౌండ్స్‌ కార్యాల యం ఉంది.అక్కడ భద్రత ఎక్కువ. అందు లోనూ కొన్ని నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు.బోయపాలెంలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అల్లుడికి చెందిన పైడా విద్యా సంస్థల భవనాలను కూడా అజయ్‌ కల్లం,తదితరులు ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగపడతాయని అప్పట్లో పరిశీలిం చారు.అదే విధంగా నగరంలోని ఏలేరు గెస్ట్‌హౌస్‌ను జల వనరులశాఖ రాష్ట్ర కార్యాలయంగా,మర్రిపాలెంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌ స్‌ను ఆ శాఖ ప్రధాన కార్యాలయం కోసం వినియోగించుకుంటారని కూడా అప్పట్లో సీఎంఓ ఉన్నతాధికారులు పరిశీలించడం జరిగింది.రుషికొండ ఐటీ పార్కులో పరిశ్రమలు,ఐటీ శాఖల కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.రాష్ట్ర టౌన్‌ప్లానింగ్‌ కార్యాలయం కోసం మద్దిలపాలెం ఆటోమోటివ్‌ సమీపాన వీఎంఆర్‌డీఏ షాపింగ్‌ కాంప్లెక్స్‌ను అప్పట్లో రిజర్వ్‌ చేసి సీఎంకి నివేదించారు.
అధికారులకు అద్దె ఇల్లులు సిద్దం..
రుషికొండ కేంద్రంగా పరిపాలన సాగితే అందుకు తగ్గట్టుగా అధికారులు నివాసం ఉండటానికి ఇప్పటికే గృహలను గుర్తించారు. ఇరవై రోజులుగా బీచ్‌ రోడ్డు నుంచి రుషికొండ వరకు ఉన్న అపార్టుమెంట్లలో 128ప్లాట్లను అద్దెకు తీసుకోవడానికి ముందుగా సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రవైద్యకళాశాల వైద్యుల క్వార్టర్స్‌ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఎనిమిది డూప్లెక్స్‌ ఇళ్లను సైతం తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే కొందరు మంత్రులు విశాఖలో ఇళ్లు కొనుగోలు చేయగా,మరికొందరు అద్దెకు తీసుకోవడానికి సిద్దమయ్యారు.
మంత్రిత్వశాఖలకు అతిథి గృహాలు..ఖాళీ భవనాలు
మంత్రుల కార్యాలయాలకు ఆయా శాఖల్లోని ఖాళీ భవనాలు,అతిథగృహాలను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. ఆర్టీసీ కాంప్లెక్సులో ఖాళీగా ఉన్న ప్లోరుతోపాటు,అతిథిగృహాన్ని రహణాశాక మంత్రి కార్యాలయానికి, ఆధునీకరిస్తున్నట్టు జిల్లాపరిషత్‌ అతిథిగృహాన్ని పంచాయితీశాఖ మంత్రిత్వశాఖకు,బీచ్‌ రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న అతిథి గృహాన్ని పురపాలకశాఖ కార్యాలయానికి, ఈఎన్‌సీ కార్యాలయంలో జలవనరులశాఖ మంత్రికి,దేవాదాయశాఖ మంత్రికి సింహాచలంలో కార్యాలయాలు కేటాయించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
బృహత్తర ప్రణాళికతో విశాఖ అభివృద్ధి
విశాఖనగర అభివృద్ధికి భవిష్యత్తు అవసరాల దృష్టిలో ఉంచుకొని బృహత్తర ప్రణాళికతో ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)కే.ఎస్‌.జవహర్‌రెడ్డి జిల్లా అధికారులకు దిశనిర్ధేశం చేశారు. విశాఖ మహా ప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎం ఆర్‌డీఏ)పరిధిలో మూడు జిల్లాలో రూ.కోట్లతో చేపట్టే ప్రాజెక్టులు,ఇతర అభివృద్ధి పనులపై జిల్లా అధికారులతో వీఎంఆర్‌డీఏ సమావేశ మందిరంలో ఆయన సమీక్షించారు. విశాకలో చేపట్టే ప్రాజెక్టులతో నగర రూపురేఖలు మారతాయని,అభివృద్ధి పనుల్లో పచ్చదనం,పారిశుద్ద్యాఆనికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. బీచ్‌ కారిడార్‌లో భాగంగా కాపులుప్పాడలో సిగ్నేచర్‌ టవర్‌,ఆధునిక వసతులతో కూడిన కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించాలని జవహర్‌రెడ్డి సూచించారు. మంగమూరిపేట వద్ద జల క్రీడలు,కైలాసగిరిపైన సైన్స్‌ సిటీపాటు నగరంలోని అన్ని ఉద్యానవనాలను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు.
పరిపాలన రాజధాని విశాఖ కొత్త హంగులు
ఇప్పటికే అధికారులు ఆదిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే అందాల నగరంగా గుర్తింపు తెచ్చుకున్న విశాఖకు మరిన్ని కొత్త హంగులు దిద్దేందుకు జిల్లా కలెక్టర్‌,జీవీఎంసీ కమిషనర్‌,కలసి కసరత్తు చేస్తున్నారు.సీఎం నివాసముండే రుషికొండ భవనాల చుట్టూ వంద అడుగుల రహదారులు నిర్మాణమవు తున్నాయి.ఇక్కడ నుంచి నగరంలోకి సీఎం కాన్వాయ్‌ వెళ్లేందకు గీతం వర్శిటీ నుంచి జోడుగుళ్లపాలెం వరకు బీచ్‌ రోడ్డును సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు .విశాఖవ్యాలీ మలుపు నుంచి సీతకొండ వ్యూ ఫాయింట్‌ వరకు విస్తరణకు నోచుకోని బీచ్‌ రోడ్డును అటవీశాఖ అనుమతులు తీసుకొని ఐదువందల మీటర్లు పొడవును విస్తరించే పనులు శరవేగంగా కొనసాగుతు న్నాయి.రుషికొండ నుంచి ఆర్కేబీచ్‌ వరకు బీచ్‌ రోడ్డు ఇరువైపుల పుట్‌పాత్‌లు,విద్యుత్‌లైట్లతో ప్రత్యేక ఆకర్షణగా తయారు చేస్తున్నారు.నగర పరిధిలో ఉన్న ఇరుకైన రహదారులను విస్తరిస్తున్నారు. ఇప్పటికే పూర్ణామార్కెట్‌, ఓల్డ్‌టౌన్‌,కనకమహాలక్ష్మీ టెంపుల్‌,కొత్త రోడ్డు వంటి ఇరుకైన మెయిన్‌ రోడ్డులను విస్తరి స్తున్నారు. అక్కయ్యపాలెం, దొండపర్తి, రైల్వేన్యూకాలనీ తదితర ప్రాంతాల్లో కూడా మెయిన్‌రోడ్డులను విస్తరించి అకర్షణీయంగా నిర్మించేందకు జీవీఎంసీ కమిషనర్‌ దృష్టికేంద్రికరించారు.
వీఎంఆర్‌డీఏ పరిధిలో రహదారులు విస్తరణ,అభివృద్ధి..
ఇప్పుడు విశాఖ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(వీఎంఆర్‌డీఏ) పరిధిలో కూడా పరిపాలనా రాజధానికి కొత్త హంగులు సమకూరబోతున్నాయి.విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి భొగాపురం వరకు మెట్రో ప్రాజెక్టు ఏర్పాటుతో పాటు.భీమిలీ బీచ్‌ నుంచి భోగాపురం వరకు రోడ్డును సుందరంగా తీర్చి దిద్దాలని ప్రణాళికలు సిద్దం చేశారు. అదే రకంగా13 మండలాల వీలీనంతో ీ(వీఎం ఆర్‌డీఏ) పరిధి పెరిగింది.ఇప్పటికే అభివృద్ధిని పరుగులు పెట్టించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రోడ్ల విస్తరణ,అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధంచేస్తోంది.
అడ్డంకులు అధికమించి..
జీఎన్‌ రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్నీ ఇచ్చిన నివేదికలపై హైపవర్‌ కమిటీ చర్చించి కేబి నెట్‌కు నివేదికను సమర్పించింది. చట్టసభ ఆమోదం కోసం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా… ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం నిరసన తెలుపుతూ సభ నుంచి వాకౌట్‌ చేసింది. తరువాత జనవరి 20న అసెంబ్లీ ఆమోదించింది.22న శాసన మండలి ముందుకు బిల్లును తీసుకువచ్చారు. అక్కడ కూడా ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకించారు. మండలిలో తెలుగుదేశానికి ఎక్కువ మంది సభ్యులు ఉండడంతో శాసన మండలిని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి, అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది. తెలుగు సంవత్సరాది ఉగాదినాటికి విశాఖ తరలి రావాలని ప్రభుత్వం మరోయత్నం చేసింది. అది కూడా బెడిసి కొట్టింది. ఆతరు వాత స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, ఎన్నికల కమిషనర్‌ మార్పు,కరోనా వైరస్‌ వ్యాప్తి ఇలా…ఒక దాని తరువాత మరొకటి రావడంతో వేసవి సెలవుల తరువాత కార్యాలయాలు తరలించాలని యోచించారు. ఇదే సమయంలో రాజ్యాంగపరంగా అవసర మైన అనుమతుల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే వచ్చారు. రెండోసారి అసెంబ్లీలో బిల్లును ఆమోదించి, తరువాత ఆమోదం కోసం రాష్ట్ర గవర్నర్‌కు పంపిం చారు. దీంతో విశాఖపట్నం పరిపాలన రాజధానిగా మారినట్టయ్యింది.- గునపర్తి సైమన్‌

1 2 3 4 5 6 11