సెకండ్‌ వేవ్‌..కరోనా చెబుతున్న నిజం

కరోనా సృష్టిస్తున్న విలయానికి నేడు పేదోడికి అరవై గజాల ఇంటి స్థలం కాదు, స్మశానంలో ఆరడుగుల నేల ఓకలగా మారింది. దేశంలో రెండోదశ కరోనా వ్యాప్తి ప్రకంపనలు సృష్టిస్తున్నది….. ప్రమాదఘంటికలు మోగిస్తున్నది. అదే సందర్భంలో మన ప్రభుత్వ పెద్దల పగటి వేషాలనూ,ప్రచార వ్యామోహా లనూ,ఉత్తరకుమార ప్రగల్భాలనూ పట్టి చూపిస్తున్నది.‘వట్టి మాటలు కట్టిపెట్టోరు గట్టిమేల్‌ తలపెట్టవోరు’ అన్నాడు మహాకవి గురజాడ. కానీ ఇప్పుడు గట్టిమేలును కట్టిపెట్టి వట్టిమాటలు పలుకుతున్న పాలక నేతల బండారాన్ని నిట్ట నిలువునా బట్టబయలు చేస్తున్నది కరోనా.

దేశవ్యాప్తంగా కరోనావైరస్‌ సెకండ్‌ వేవ్‌ విలయతాండవం చేస్తోంది. నిత్యం మూడు లక్షలకు పైగా కొత్త కేసులు,వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. కరోనాపై పోరు సాగిస్తున్న వైద్యులు ఈ మహమ్మారి కాటుకు బలవుతున్నారు. కోవిడ్‌పై పోరు సాగిస్తూ నిరంతరం శ్రమిస్తూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వైద్యులు ముందుండి సేవలందిస్తున్నారు. అయితే.. కరోనా బారిన పడిన రోగుల ప్రాణాలను కాపాడుతున్న క్రమంలో వైద్యు లు కూడా ఈమహమ్మారి కాటుకు బలవు తున్నారు. కరోనా కారణంగా గతేడాది దేశ వ్యాప్తంగా 730 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పో యారని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ వెల్లడిర చింది. సెకండ్‌ వేవ్‌లోనూ ఈమహమ్మారి వైద్యులపై పంజా విసురుతోందని పేర్కొంది.అయితే.. కరోనా సెకండ్‌ వేవ్‌లో ఈ సంఖ్య భారీగా పెరుగుతుందని ఐఎంఏ ఆందోళన వ్యక్తంచేసింది. ఒక్క రోజులో 50 మంది వైద్యులు మరణించారని మెడికల్‌ అసోసియేషన్‌ ఆవేదన వ్యక్తంచేసింది. సెకండ్‌ వేవ్‌లో ఈ ఏడాది ఇప్పటివరకు 244 మంది వైద్యులు కరోనా కారణంగా మరణించినట్లు భారత వైద్య సంఘం వెల్లడిరచింది.
కరోనా సెకండ్‌ వేవ్‌ లక్షణాలేంటో తెలుసా?
భారతదేశంలో కోవిడ్‌-19తీవ్రంగా చాలా మం దిని ప్రభావితం చేస్తోంది. మొదటి వచ్చిన వైరస్‌తో పోల్చుకుంటే ఈవైరస్‌ చాలా ప్రమాదమని నిపు ణులు కూడా చెబుతున్నారు. వైరస్‌లో కొత్త వేరియంట్స్‌ కూడా మనం చూస్తు న్నాం. అనుకోని లక్షణాలు కూడా చాలా మందిలో వేధిస్తున్నాయి. సాధారణంగా శ్వాస ఆడకపోవడం,కొద్దిగా జ్వరం ఉండడం,దగ్గు,తలనొప్పి,ఒళ్లునొప్పులు,గొంతు బాగా లేకపోవడం,రుచి తెలియక పోవడం,వాసన తెలియకపోవడం,నాసల్‌ కాంజిషన్‌,నీరసం, అల సట వంటి లక్షణాలు కన బడుతున్నాయి.
శ్వాస ఆడకపోవడం
శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం చాలా మందిలో కనుగొనడం జరిగింది. చాలా మంది కరోనా బారిన పడిన వాళ్ళు శ్వాస సంబం ధిత సమస్యలకు గురవుతున్నారు. నిజంగా దీని వల్ల చాలా మంది మరణిస్తున్నారు కూడా. ఒక పక్క చూస్తే అక్సిజన్‌ కొరత కూడా ఉన్నట్లు మనకి తెలుస్తుంది. దీంతో నిజంగా ఈ సమస్య నుండి బయట పడటం కష్టమని అనిపిస్తోంది. అలాగే శ్వాస అందకపోవడంతో పాటు గుండెల్లో గట్టిగా పట్టేసినట్టు వంటివి కూడా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు.దీనితో ఊపిరితిత్తుల సమస్యలు కూడా అధికమవుతున్నాయని రోగులు అంటు న్నారు.
గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌
కరోనా వైరస్‌ బారిన పడిన వాళ్ళలో గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌ కూడా వస్తున్నాయి ముఖ్యంగా అరుగుదల,నోరు,ఫుడ్‌ పైప్‌, కడుపు నొప్పి, పెద్ద పేగులో ఇబ్బందులు రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం మరియు పూర్తి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడడం లాంటివి వస్తున్నాయి. గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌ కారణంగా వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలకు కూడా దారి తీస్తుంది.
వినబడక పోవడం
కొంతమందిలో వినబడడం లేదట. కొంత మందికి అసలు వినబడకపోవడం మరికొందరిలో కొద్దిగా మాత్రమే వినపడడం లాంటి సమస్యలు వస్తున్నాయి. కరోనా వైరస్‌ సోకిన మొదటి వారంలో ఈలక్ష ణాలు చూడొచ్చు. ఆతర్వాత ఇన్ఫెక్షన్ని బట్టి ఈ సమస్య ఎదురవుతోంది. ఇలా ఈ లక్షణాలు కూడా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
చాలా నీరసంగా ఉండడం
కరోనా వైరస్‌ బారిన పడిన వారిలో నీరసం ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. అదే విధంగా రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, అలసటగా అనిపించడం, నీరసంగా అనిపించడం లాంటివి కనబడుతున్నాయి. ఇవి కూడా కరోనా వైరస్‌ సోకినట్లు లక్షణాలు అని గుర్తించాలి.
కళ్లు ఎర్రబడటం
కరోనా వైరస్‌ సోకిన వాళ్లలో కళ్లు ఎర్రబడటం, వాపు ఉండడం లాంటి లక్షణాలు కూడా కనబడు తున్నాయి. కళ్ళు దురద పెట్టడం, ఎర్రగా అయి పోవడం, కళ్ళల్లో నుండి నీరు కారడం లాంటివి కూడా కరోనా లక్షణాలు అంటున్నారు. అయితే ఈ రెండిటికీ మధ్య కనెక్షన్‌ ఏమిటి అనేది చూస్తే… మామూలుగా వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి గాలి ద్వారాకానీ డ్రాప్లెట్స్‌ద్వారాకానీ ఎవరైనా మాట్లా డినా,తుమ్మినా,దగ్గినావ్యాపిస్తుంది అని తెలుసు. అయితే ఇన్ఫెక్షన్‌ ఎవరికైనా సోకితే వాళ్ళు చేతులు కళ్ల మీద పెట్టుకోవడం వల్ల కంటి ఇన్ఫెక్షన్స్‌ కూడా వస్తాయని అదే విధంగా ముక్కు నోరు కూడా ఇన్ఫెక్ట్‌ అవుతాయని అంటున్నారు. కాబట్టి కళ్ళల్లో ఇరిటేషన్‌, ఐసెన్సిటివిటీ లాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.
నోరు ఆరిపోవడం
నోరు ఎక్కువగా ఆరి పోవడం లాంటివి కూడా కరోనా కి కొత్త లక్షణాలు అని చెప్తున్నారు. జీర్ణానికి నోరు సహాయ పడుతుంది అదే విధంగా పళ్ళు కూడా జీర్ణానికి అవసరం. అయితే ఒక వేళ కనుక సరైన సలైవా ప్రొడ్యూస్‌ అవ్వక పోతే అప్పుడు నోరు ఆరి పోతుంది దీని కారణంగా పంటి సమస్యలు మరియు దంతాల సమస్యలు వస్తాయి.
కరోనా వైరస్‌ సోకిన వాళ్ళకి నోరు ఆరి పోవడం కూడా కొత్త లక్షణంగా గుర్తించారు. అది మ్యూకస్‌ లైనింగ్‌ ఏర్పాటు చేస్తుంది దీని కారణంగా ఇది ప్రొడ్యూస్‌ అవ్వదు దీంతో నోరు ఆరిపోతు ఉం టుంది. గొంతు కూడా ఆరిపోయినట్లు ఉంటుంది కాబట్టి కరోనాకి ఇవి కూడా కొత్త లక్షణాలను గుర్తించాలి.కరోనా వైరస్‌ సోకిన వాళ్ళల్లో డయేరియా సమస్య కూడా వేధిస్తోంది. ఇది ఒకటి నుంచి 14రోజుల వరకు ఉంటుంది. అజీర్తి సమ స్యల కారణంగా డయేరియా సమస్య కూడా రావచ్చు. కాబట్టి కరోనా పాజిటివ్‌ వచ్చిన వాళ్ళల్లో డయేరియా వస్తుంది గుర్తించండి.
తల నొప్పి
తలనొప్పి కూడా కరోనా వైరస్‌ వచ్చినట్టు లక్షణం. మామూలుగా వచ్చే తల నొప్పి కంటే ఇది ఎక్కువ సేపు ఉంటుంది. కరోనా వైరస్‌ వచ్చిన వాళ్లకి తల నొప్పి కూడా తీవ్రంగా వేధిస్తున్నట్లు గుర్తిం చారు. కరోనా వైరస్‌ వచ్చిన వాళ్లకి చర్మ సమస్యలు కూడా ఉంటున్నట్లు గుర్తించారు.
యువతనూ వదలట్లే
మంచి ఆరోగ్యంతో ఉన్నవారు,యువకులకూ కరోనా సోకడం సెకండ్‌ వేవ్‌ లో ఎక్కువగా జరుగుతోంది. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వారినీ కరోనా వదలట్లేదని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి అందరూ మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. కొత్త మ్యూటెంట్ల మీద వ్యాక్సిన్‌లు అంతగా పని చేయక పోవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయినా సరే టీకా వేయించుకోవాలని డాక్టర్లు సూచి స్తున్నారు. దీని వల్ల వైరల్‌ లోడ్‌ తగ్గడంతో పాటు ఇన్ఫెక్షన్‌ బారిన పడకుండా ఉండొచ్చని చెబుతు న్నారు. దీంతోపాటు మాస్కులను కట్టుకుంటూ.. చేతులను, ముట్టుకున్న వస్తువులను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేసుకుంటూ ఉండాలని సలహాలు ఇస్తున్నారు.
పాలకుల అస్త్రసన్యాసం – ప్రజలకు ప్రాణసంకటం
దేశవ్యాప్తంగా కోవిడ్‌ రెండో దశ వ్యాప్తి గురించి ఆందోళనకరమైన వార్తలు వినపడుతున్నాయి. ఆదివారం ప్రధాన పత్రికలన్నీ కనీసం నాలుగు పేజీలకు తక్కువగాకుండా కోవిడ్‌ వ్యాప్తి గురించిన వార్తలు ప్రచురించాయి. శనివారం సాయంత్రం ప్రధాని జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్య అవసరాలకు వినియోగించే ఆక్సిజన్‌ ఉత్పత్తి, సరఫరా గురించి సమీక్షించినట్టు టీవీలు వార్త ప్రసారం చేశాయి. గత నాలుగు రోజులుగా హైదరాబాద్‌లో ప్రధాన కార్పొరేట్‌ ఆస్పత్రులు తమవద్ద ఉన్న ఆక్సిజన్‌ నిల్వలు కరిగిపోయాయనీ, రోగులు వేరే ఆస్పత్రుల్లో భర్తీ కావాలని హెచ్చరిస్తున్నాయి. తాజాగా ఢల్లీి రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రుల్లో తగినంత ఆక్సిజన్‌ లేనందున అత్యవసర లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు రాజస్థాన్‌ ప్రభుత్వంకూడా 15రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌లలో రాష్ట్ర ప్రభుత్వాలు కోవిద్‌ నియంత్రణ విషయంలో ఘోరంగా విఫలమయ్యాయని ఆయా రాష్ట్ర హైకోర్టులు చివాట్లుపెట్టాయి. కోవిడ్‌ కారణంగా ఎంతమంది చనిపోతున్నారో వివరాలు కూడా ఇవ్వకుండా మూకుమ్మడి దహన సంస్కారాలు స్వయంగా ప్రధాని ప్రాతినిధ్యం వహించే వారణాసితో సహా ఉత్తరప్రదేశ్‌ అంతటా నిత్యకృత్యంగా మారాయి. స్మశానాల్లో శవాలు కాల్చే స్థలం లేక వచ్చిన శవాలను కుప్పలు పోసి కాలుస్తున్న వీడియోలు వాట్సాప్‌లో వైరల్‌ అవుతున్నాయి. అయినా గత ఏడాది ఇదే సమయంలో రోజువారీ విలేకరుల సమావేశాలు నిర్వహించిన కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇప్పుడేమి చేస్తుందో ఎవ్వరికీ అంతుచిక్కటం లేదు. పోయిన ఏడాది కనీసం వందకుపైగా జీఓలు, సర్కులర్‌లు జారీ చేసిన కేంద్ర హౌంశాఖ చేష్టలుడిగి చూస్తోంది. ప్రధానంగా దేశంలో వాక్సిన్‌ కొరతకు మూడు కారణాలున్నాయి. గతంలోనే ఫైజర్‌, స్పుత్నిక్‌లు తమ వాక్సిన్‌ భారతదేశంలో సరఫరా చేయటానికి వీలుగా అత్యవసర అనుమతులు కావాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నాయి. కానీ అప్పటికే భారత్‌ బయోటెక్‌తో లోపాయికారీ ఒప్పందం పెట్టుకున్న కేంద్రం దేశంలోకి మరే ఇతర వాక్సిన్‌ దిగుమతి కానీయకుండా అడ్డుకుంది. ఇది మొదటి కారణం. కేంద్రం రూపొందించిన వ్యాక్సిన్‌ పంపిణీ ప్రణాళిక రెండో కారణం. ఈ ప్రణాళికకు మూడు లక్ష్యాలున్నాయి. మొదటిది దేశంలో కోవిడ్‌ నియంత్రణ, రెండోది విదేశాలకు ఎగుమతి. ఈ రెండూ మౌలిక లక్ష్యాలు. ఈ రెండిరటి పర్యవసానంగా విదేశాలకు వ్యాక్సిన్‌ అవసరాలు తీర్చటం ద్వారా దౌత్య సంబంధాల్లో పై చేయి సాధించాలన్నది మూడో లక్ష్యంగా ఉంది. సోకాల్డ్‌ సంపన్న దేశాలు దీనికి భిన్నంగా ఏకైక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. అమెరికా, రష్యాలు ముందుగా తమ దేశంలోని పౌరులందరికీ కావల్సినంత వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో వ్యవహరించాయి. మచ్చుకు ఓ ఉదాహరణ. దేశంలో జరుగుతున్న రైతు ఉద్యమానికి కెనడా ప్రధాని, పార్లమెంట్‌ మద్దతు ప్రకటించాయి. నాలుగు నెల్ల తర్వాత భారతదేశం నుంచి కోవ్యాక్సిన్‌ దిగుమతి చేసుకున్న కెనడా ప్రభుత్వం రైతు ఉద్యమం పట్ల తన వైఖరిని మార్చుకుంది. దీన్నే దౌత్య విజయంగా బీజేపీ వర్గాలు ప్రచారం చేస్తూ సంబరం చేసుకున్నాయి. విదేశాల్లో అమ్ముకోవటానికి భారత్‌ బయోటెక్‌కు అనుమతించేందుకు వీలుగా దేశంలో వ్యాక్సిన్‌ వితరణ కార్యక్రమాన్ని దశలవారీ కార్యక్రమంగా మార్చారు. తొలుత మొదటి డోసుకు, రెండో డోసుకు మధ్య మూడు వారాల వ్యవధి అని నిర్ణయించారు. కానీ కావల్సినంత వ్యాక్సిన్‌ అందుబాటులో లేకపోవటంతో ఈ వ్యవధికి పెంచారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత యువశక్తి కలలిగిన దేశమని గొప్పలు చెప్పుకుంటూనే దేశంలో యువతకు వ్యాక్సిన్‌ అందించే విషయంలో ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది. వ్యాక్సిన్‌ కొరత ఏ స్థాయిలో ఉందంటే ఒక్క శనివారం నాడు తెలంగాణలో లక్షన్నర డోసుల అవసరం ఉంటే కేవలం ఐదువేల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, అందువలన వ్యాక్సిన్‌ వితరణ కార్యక్రమాన్ని నిలిపి వేస్తున్నట్లు తెలంగాణ వైద్యశాఖాధికారులు ప్రకటించారు. మార్చి 24 నాటికి భారతదేశం విదేశాలకు ఆరు కోట్ల డోసులు ఎగుమతి చేస్తే స్వదేశంలో ప్రజలకు ఇచ్చింది మాత్రం ఐదు కోట్ల డోసులే. అంటే దేశంలో ప్రజల ప్రాణరక్షణ కంటటే విదేశీ వ్యాపారమే ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యత కలిగిన పనైంది. కూతవేటు దూరంలో వ్యాక్సిన్‌ తయారవుతున్న తెలంగాణ పరిస్థితే ఇలా ఉంటే మిగిలిన రాష్ట్రాల దుస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దేశ ప్రజల ప్రాణ రక్షణ కంటే విదేశాల్లో మోడీ ఫ్లెక్సీలు కట్టించుకోవటానికి వ్యాక్సిన్‌ ఎగుమతి చేసిన ఫలితమే నేడు దేశంలో వ్యాక్సిన్‌ కొరత ప్రదాదకర స్థాయికి చేరింది. చివరి కారణం వ్యాక్సిన్‌ తయారీ పూర్తిగా ప్రైయివేటు రంగానికి వదిలేయటం. దేశంలో వ్యాక్సిన్‌ తయారీ కేంద్రాలు నాలుగు. చెన్నైలోని కింగ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ అండ్‌ రీసెర్చ్‌, బీసీజీ వ్యాక్సిన్‌ లాబ్‌లు, కసౌలిలోని సెంట్రల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌, కూనూర్‌లోని పాశ్చర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా. కేంద్రం అనుసరిస్తూ వచ్చిన ప్రయివేటీకరణ విధానాలతో ఈ సంస్థలు మూతపడ్డాయి. 2012లో ప్రజా ప్రయోజన వాజ్యం ద్వారా మూడు సంస్థలు పున్ణప్రా రంభించినా వాటిని పని చేయించటానికి కావల్సినన్ని నిధులు కేంద్రం సమకూర్చక పోవటంతో కుదేలయ్యాయి. కానీ కోవాక్సిన్‌ తయారు చేయటానికి ప్రయివేటు సంస్థలకు వేల కోట్ల రూపాయలు వివిధ మార్గాల్లో సమకూర్చిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వ్యాక్సిన్‌ తయారీ వంటి ప్రాణరక్షణ సేవలను సైతం ప్రయివేటీకరించటం నేటి వ్యాక్సిన్‌ కొరతకు మూడో కారణం. ఇక ఆక్సిజన్‌ కొరత గురించి. కేంద్రం శాసనసభ ఎన్నికల పర్వంలోనో పాండిచ్చేరి ప్రభుత్వాన్ని కూల్చే పనిలోనో లేక గత పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు తనవంతు సహకారాన్ని అందించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్‌ అరోరాను గోవా గవర్నర్‌గా నియించే పనిలోనో తీరుబడిలేనంతగా తలమునకలై ఉంది. దాంతో దేశాన్ని చట్టుముడుతున్న కోవిడ్‌ రెండో ఉప్పెన ప్రభుత్వం కంటికి కనిపించలేదు. కేవలం 150కోట్ల రూపాయల ఖర్చయ్యే ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్‌ నిర్మాణానికి కావల్సిన టెండర్లు పిలవటానికి అమాత్యులు ఆర్నెల్ల పాటు ఫైలు నడిపారంటే ఇక్కడ ప్లాంట్‌ నిర్మాణం లక్ష్యం ఏమిటో అర్థమవుతుంది. మార్చి 24, 2020న ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటిస్తూ దేశాన్ని లాక్డౌన్‌లోకి నెట్టిన కేంద్రం గత సంవత్సరం అక్టోబరు 21వరకూ కోవిడ్‌ చికిత్సకు కీలకమైన ఆక్సిజన్‌ సరఫరా మీద దృష్టి పెట్టలేదు. టెండర్లు ప్రకటించిన తర్వాత కూడా కాంట్రాక్టు ఖరారు చేసి ప్లాంట్‌ నిర్మాణం మొదలు పెట్టలేదు. ఈ వైఫల్యాలన్నీ కప్పిపెట్టుకోవటానికి ఓ వంద ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లకు అనుమతిస్తున్నట్టు ప్రధాని గత వారం ప్రకటించారు. గత ఏడాదే దేశంలో వైద్య సేవలకుపయోగించే ఆక్సిజన్‌ తయారీ కొరతను గమనించిన ప్రభుత్వం రెండో ఉప్పెన సమయానికి కూడా తగినంత ఆక్సిజన్‌ నిల్వలు సిద్ధం చేసుకనేందుకు ప్రయత్నం చేయకపోవటం క్షమించరాని నిర్లక్ష్యం. కోవిడ్‌ నియంత్రణలో పాలకుల అస్త్ర సన్యాసం కారణంగా భారతదేశం కోవిడ్‌ నియంత్రణలో ఘోరంగా విఫలం కావటం ఓవైపు ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేస్తుంటే మరోవైపున ప్రజలకు ప్రాణగండంగా మారింది.- సైమన్‌ గునపర్తి

ఎన్నాళ్ళీ…మండేకాలం…..?

కార్పొరేట్ల కోసం పాలకులూ, పాలకుల కోసం కార్పొరేట్లు! క్విడ్‌ ప్రొకో ఆట యధేచ్ఛగా సాగిపోతోంది మన దేశంలో. ఈ ఆటను దాపరికం లేకుండా బట్టబయలు చేసారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌. ”అన్నీ అమ్మివేయడమే మా విధానం” అంటూ పార్లమెంటు సాక్షిగా కుండబద్దలు కొట్టారు. ”లాభాల్లో ఉన్న సంస్థలను కూడా అమ్ముతున్నారెందుకు?” అన్న పలువురు సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా.. ”అసలు మా అమ్మకాలకు లాభనష్టాలు ప్రాతిపదికే కాదు, ప్రయివేటీకరించాలనుకున్నాం అదే చేస్తున్నాం” అంటూ ప్రభుత్వ ఉద్దేశాన్ని మరోసారి స్పష్టం చేసారు. ఉద్యోగులూ కార్మికులూ ఈ ప్రయివేటీకరణకు తమ నిరసనలను తీవ్రం చేస్తున్న వేళ… ఒకటీ రెండూ కాదు, సమస్త ప్రభుత్వరంగాన్ని తెగనమ్మడమే తమ విధానమని పార్లమెంటులోపలా వెలుపలా ప్రధాని సహా మంత్రులంతా ఇదే బృందగానాన్ని పదే పదే ఆలపిస్తున్నారు. ఇక ఆలోచించుకోవాల్సింది ప్రజలే. అంతెకాకుండా మండుతున్న మండువేస‌వి సాక్షిగా ధ‌ర‌లు పెంచేసి ప్ర‌జ‌ల న‌డ్డి విరిస్తున్నారు.

ఇది ”మంటలకాలం”. ఒకవైపు ఎండలు మండుతున్నాయి. ఈ మంటలకు ముందునుండే ధరలు మండుతున్నాయి. ఆకలితో ప్రజల కడుపులూ మండుతున్నాయి. ఇరుగున సీతమ్మ పుట్టిల్లని చెప్పుకునే నేపాల్‌లో, పొరుగున రావణరాజ్యం అని భావించే శ్రీలంకలోనూ లేని మంటలు… మోడీగారి రామరాజ్యంలో మాత్రం ప్రజలను మలమల మాడుస్తున్నాయి. అందుకని ఇది ఎండాకాలం మాత్రమే కాదు, మండేకాలం. అంతేకాదు, కడుపు మండి మిడతలు కూడా దండయాత్రలు చేస్తున్న కాలం. మరి బతుకులే మండుతుంటే మనుషులేం చేయాలో తేల్చుకోవాల్సిన కాలం…
తాజాగా మోడీ సర్కార్‌ వంటగ్యాస్‌ ధర పెంచి ఈ మంటలను మరింత ఎగదోస్తోంది.. ఫలితంగా గ్యాస్‌బండ కాస్తా గుదిబండగా మారింది. వేయికి చేరువలో మోయలేని భారమై కూర్చుంది. ఎట్లా బతుకాలో అర్థం కాక ప్రజలుంటే.. అధికారపార్టీ నేతలేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట, ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరో మాట వల్లిస్తూ ప్రజలను మాయజేస్తున్నారు. నాడు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పెరిగిన చమురు ధరలపై మోడీ ఏమన్నారు? ”ఇది ముమ్మాటికీ యూపీఏ ప్రభుత్వ వైఫల్యం మాత్రమే” అన్నారు. అది నూటికి నూరుపాళ్లూ నిజం కూడా. మరిప్పుడు పెట్రోల్‌ వాత, గ్యాస్‌ మోత లేకుండా దినం గడవని స్థితికి చేరింది మోడీ పాలన..! దీనికి ప్రధానిగా, ప్రభుత్వాధినేతగా ఏం సమాధానమిస్తారు? విచిత్రమేమిటంటే ఇప్పుడు కూడా ఆయన, ఆయన భక్తబృందం ఇది గత ప్రభుత్వ వైఫల్యమేనని సెలవిస్తారు..! ప్రజలు ఎంత అమాయకులని భావిస్తే ఇంత పచ్చిగా అబద్ధాలు ఆడగలరు..!? ఆయన మొదటిసారి ఢిల్లీ పీఠంపై కొలువుదీరే నాటికి (2014) 14.2కిలోల డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ. 414. అదిప్పుడు అక్షరాలా ఎనిమిదివందల డెబ్బయ్యొక్క రూపాయల యాభై పైసలు. అంటే ఈ ఏడేండ్ల మోడీ పాలనలో అది ఏకంగా రూ.457.50 పెరిగింది. ఇక పెట్రోల్‌, డీజిల్‌ ధరల సంగతి చెప్పనవసరం లేదు, వాటిది విరామమెరుగని పరుగు… మరి ఇది ఎవరి వైఫల్యం..? ప్రజలు నిజం తెలుసుకోవాలి?
”స్వేచ్ఛా విపణి” కోసం మోడీ సర్కార్‌ వెంపర్లాటను 2017 జూన్‌ మధ్య నుంచి దినసరి ధరల యంత్రాంగం (డైలీ ప్రైస్‌ మెకానిజం)తో లింక్‌ చేసారు. అంతర్జాతీయ ధరల 15రోజుల సగటుపై ఇది నిర్ణయమవుతుంది. మన దేశంలో క్రూడ్‌ ఆయిల్‌ విస్తృతంగా లభిస్తుంది. సహజవాయువూ దొరుకుతుంది. వాటిని బయటికి తీసే ఖర్చు, శుద్ధి చేయడానికయ్యే ఖర్చు, ఆ కంపెనీ లాభం, రిటైల్‌ రవాణా ఖర్చుతో కలుపుకున్నా రూ.40 దాటదు. నేడు మనం చెల్లిస్తున్న ధరలో 60శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న పన్నులే కావడం గమనార్హం. ఇక అంతర్జాతీయంగా ధరలు పెరిగితే మన దేశంలోనూ పెరుగుతాయి, తగ్గితే తగ్గుతాయి అన్నారు. కానీ అంతర్జాతీయంగా ముడి చమురు ధర పీపా 25డాలర్లకు తగ్గినప్పుడు కూడా మన దేశంలో నయా పైసా తగ్గలేదు. ఈ పాపం మోడీ సర్కారుది కాదా..?!

చమురు ఉత్పత్తుల ధరలు పెరిగితే ఆ ప్రభావం కేవలం వాటి వినియోగదారుల మీద మాత్రమే ఉండదు. అది మొత్తం రవాణా వ్యవస్థనే ఖరీదైనదిగా మార్చడంతో పాటు, ఆ రవాణా మీద ఆధారపడిన సకల సరుకుల ధరలనూ మండిస్తుంది. ఫలితంగా ప్రజారవాణే కాదు, సమస్త వస్తువులూ సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతాయి. ప్రత్యేకించి నిత్యావసరాలు భగ్గుమంటాయి. ఇప్పటికే ఈ నిరంతర పెరుగుదల పరంపరలో నింగినంటిన నిత్యావసరాలు పేదల కడుపుల్లో అగ్గిరాజేస్తున్నాయి. ఒకవైపు ఆర్థికమాంద్యం, మరోవైపు కరోనా మహమ్మారి దెబ్బకు ఉపాధికోల్పోయి, ఆదాయాలు క్షీణించి కనీస అవసరాలకు కూడా అల్లాడుతున్న జనంపై ఇది పెనుభారం. ప్రపంచ ఆకలి సూచిలో దేశం అట్టడుగు స్థానంలో ఉండటమే ఇందుకు తిరుగులేని నిదర్శనం. అయినా ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల కనికరమన్నదే లేదు. లాక్‌డౌన్‌ సమయంలో కూడా కేవలం ఏడు నెలల్లో (2020 ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు) కేంద్ర ఎక్సయిజ్‌ పన్ను ద్వారా చమురు ఖాతా నుంచి రూ.1,96,342కోట్లు పిండుకున్నారు. అంతకు ముందు సంవత్సరం అదే వ్యవధిలో దండుకున్న మొత్తం రూ.1,32,899కోట్లు కావడం గమనార్హం. అంటే కరోనా కాలంలో కూడా జనాన్ని మరింత పీల్చి పిప్పి చేసిన ఘరానా ప్రభుత్వమిది.
జీవితావసరాల నుంచి నిత్యం భావోద్వేగాల వైపు దృష్టి మళ్లిస్తూ ప్రజలను దొంగదెబ్బ తీయడంలో ”మహాగొప్ప నైపుణ్యం” ఈ ప్రభుత్వానిది. నొప్పి తెలియకుండా కడుపులో కత్తులు దించగల ”నేర్పు” ఈ ప్రభుత్వాధినేతలది. ఎంతటి భారాలూ ఘోరాలనైనా అతి సహజమైన విషయాలుగా చెప్పి ప్రజలను వంచించగల తెలివితేటలు వారివి..! లేదంటే మండుతున్న ధరలు తగ్గించమంటుంటే మందిర నిర్మాణానికి చందాలు అడుగడాన్ని ఏమనాలి..?! ఉద్యోగాలు కావాలని జనమడుగుతుంటే ఉపాధిరంగాన్నంతా ధనవంతులకు తెగనమ్మడాన్ని ఎలా అర్థంచేసుకోవాలి..?! తాము ఏం చేసినా దేశం కోసమేనంటూ ‘దేశభక్తి’ ముసుగులో జనాన్ని నమ్మించి గొంతుకోయడం వారికి ఓ అలవాటుగా మారింది. అందుకే ”ఏ మాటల వెనుక ఏ వర్గప్రయోజనాలున్నాయో తెలుసుకోలేనంత కాలం జనం మోసపోతూనే ఉంటారు” అంటారు లెనిన్‌.
అంగట్లో దేశం..
కార్పొరేట్ల కోసం పాలకులూ, పాలకుల కోసం కార్పొరేట్లు! క్విడ్‌ ప్రొకో ఆట యధేచ్ఛగా సాగిపోతోంది మన దేశంలో. ఈ ఆటను దాపరికం లేకుండా బట్టబయలు చేసారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌. ”అన్నీ అమ్మివేయడమే మా విధానం” అంటూ పార్లమెంటు సాక్షిగా కుండబద్దలు కొట్టారు. ”లాభాల్లో ఉన్న సంస్థలను కూడా అమ్ముతున్నారెందుకు?” అన్న పలువురు సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా.. ”అసలు మా అమ్మకాలకు లాభనష్టాలు ప్రాతిపదికే కాదు, ప్రయివేటీకరించాలనుకున్నాం అదే చేస్తున్నాం” అంటూ ప్రభుత్వ ఉద్దేశాన్ని మరోసారి స్పష్టం చేసారు. ఉద్యోగులూ కార్మికులూ ఈ ప్రయివేటీకరణకు తమ నిరసనలను తీవ్రం చేస్తున్న వేళ… ఒకటీ రెండూ కాదు, సమస్త ప్రభుత్వరంగాన్ని తెగనమ్మడమే తమ విధానమని పార్లమెంటులోపలా వెలుపలా ప్రధాని సహా మంత్రులంతా ఇదే బృందగానాన్ని పదే పదే ఆలపిస్తున్నారు. ఇక ఆలోచించుకోవాల్సింది ప్రజలే.
సామ్రాజ్యవాదులపై రెండు శతాబ్దాలుగా పోరాటంలో పాల్గొన్నవారికి ఆనాటి స్థితిగతుల్లో మార్పు కోసం ఎన్నో స్వప్నాలు, మరెన్నో ఆకాంక్షలు. అవే స్వాతంత్య్రానంతరం ప్రభుత్వరంగమై వెలిసాయి. ఇది సంపన్నదేశాల ప్రభుత్వరంగం వంటిది కాదు. 1947నాటికి ఒక అత్యంత వెనుకబడిన, వ్యవసాయక దేశంలో ఆవిర్భవించిన ప్రభుత్వరంగం. ఇది రెండు కర్తవ్యాలను నిర్వర్తించాల్సి ఉంది. మొదటిదీ కీలకమైనదీ, దెబ్బతిన్న పెద్దపులిలాంటి సామ్రాజ్యవాదం తిరిగి పంజా విసరకుండా దేశాన్నీ, దేశ సార్వభౌమత్వాన్నీ కాపాడటం. రెండవది భారతదేశ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడటం. అయితే సహజంగానే స్వాతంత్య్రానంతర భారత పాలకులకుండే ”వర్గ”నైజం రీత్యా భారత పెట్టుబడిదారులకవసరమైన మౌలిక సరుకులు, గనులు, భారీ యంత్రాలు, విద్యుత్‌, నౌకా నిర్మాణం, చమురు తవ్వకం, శుద్ధి చేయడం మొదలైనవన్నీ ప్రభుత్వరంగంలో చేస్తూ, వినిమయ సరుకుల ఉత్పత్తి మాత్రం పెట్టుబడిదారులకే వదిలేసారు. మొదట్లో పాలకులు దీన్ని మిశ్రమార్థిక వ్యవస్థంటూ ముద్దుగా పిలుచుకున్నా దేశంలో నిర్మితమైంది ఫక్తు పెట్టుబడిదారీ విధానమే! అయితే జాతీయోద్యమ ఆకాంక్షల ఫలితంగా నిర్మితమైన ప్రభుత్వరంగానికి లాభనష్టాలు ప్రాతిపదిక కానే కాదు. సామాజిక న్యాయం, ప్రజల ప్రయోజనాలు, దేశ శ్రేయస్సు మాత్రమే ప్రాతిపదిక. ప్రయివేటు సంస్థలకు సొంత ప్రయోజనాలూ, లాభాలవేటే ఏకైక లక్ష్యం అన్నదాంట్లో ఎవరికీ ఏ సందేహమూ లేదు. కానీ ప్రభుత్వసంస్థలకు ఉత్పత్తితో పాటు, ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, దేశ సంపదను పెంచడమే లక్ష్యం. ఈ లక్ష్యసాధనలో మన ప్రభుత్వరంగం విజయవంతమైంది కూడా. కానీ ఈ సంపద సృష్టికి ప్రభుత్వరంగం వేసిన దారులు, కార్మికవర్గం ధారపోసిన నెత్తురే కారణమన్న చారిత్రక సత్యాన్ని కావాలనే విస్మరిస్తోంది నేటి ప్రభుత్వం. పైగా పెట్టుబదిదారులే సంపద సృష్టికర్తలంటూ వారికి సాగిలపడుతోంది. సర్కారువారి అంతరంగమేంటో తెలుసుకోవడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి?
పారిశ్రామికరంగాన్నే కాదు, దేశానికి జీవనాధారమైన వ్యవసాయరంగాన్ని కూడా అమ్మకానికి పెడుతూ మూడు వ్యవసాయ చట్టాలనూ, నూతన విద్యుత్‌ సవరణ చట్టాన్నీ తెచ్చిందీ ప్రభుత్వం. రైతును భూమినుండి తరిమేసి విదేశీ స్వదేశీ కార్పొరేట్ల ముంగిట కట్టుబానిసగా నిలబెట్టే కుట్ర చేస్తున్న సర్కారు, ఉద్యోగ, కార్మికవర్గాలను బజారుకీడ్చే కుతాంత్రాన్ని కూడా ఇప్పుడు మరింత వేగవంతం చేసింది. ఇది పసిగట్టిన రైతాంగం మూడున్నర నెలలుగా ఢిల్లీ సరిహరుద్దుల్లో పోరాడుతున్నారు. ఇప్పుడీ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగ కార్మికసంఘాలు కూడా ఉద్యమిస్తున్నాయి. అయినా తాము దేశాన్ని అమ్మేయడానికే కట్టుబడివున్నామని నిస్సిగ్గుగా ప్రకటిస్తోంది మోడీ ప్రభుత్వం. ఈ దేశానికి ఉరి బిగించడానికి పాలకులు అమ్ముడు పోయారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?
ఇలా ప్రభుత్వరంగమన్నదే లేకుండా పోతే ప్రజాసంక్షేమానికి దిక్కెవరు? అన్నీ ప్రయివేటు పరం చేసేవాడు ప్రజలకు ఎలా బాధ్యత వహించగలడు? కంపెనీలన్నీ అమ్మేసేవాడు వారికి ఉద్యోగాలేమివ్వగలడు? ప్రభుత్వాల కనీస బాధ్యతైన విద్యా వైద్యరంగాలను కూడా పెట్టుబడికే అప్పచెప్పేవాడు రేపు పిల్లలకు చదువులు చెప్పగలడా? ప్రజల ఆరోగ్యాల్ని కాపాడగలడా? బ్యాంకుల్ని తెగనమ్మేవాడు ప్రజల డబ్బుకు హామీ ఇవ్వగలడా? రైళ్లూ, బస్సులతోపాటు రోడ్లు, విమానాశ్రయాలను కూడా అమ్ముకునేవాడు ప్రజలకు చౌక రవాణా ఇవ్వగలడా? వ్యవసాయాన్ని కూడా వ్యాపారానికి ముట్టజెప్పాలనుకునేవాడు ప్రజల ఆకలి ఎలా తీర్చగలడు? చివరికి రక్షణ రంగాన్ని సైతం పెట్టుబడికి తాకట్టు పెట్టేవాడు దేశాన్ని మాత్రం ఎలా రక్షించగలడు? సమస్త ప్రకృతి వనరులతోపాటు మానవ వనరులను కూడా కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తే ఇక ప్రజల మౌలిక అవసరాలు తీర్చెదెవరు? భారత రాజ్యాంగం ఈ దేశానికి సంక్షేమరాజ్యాన్ని వాగ్దానం చేసింది. ప్రభుత్వరంగమన్నదేలేనప్పుడు ఈ సంక్షేమానికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రజలకు బాధ్యత వహించలేని ప్రభుత్వాలకు పాలించే అర్హత మాత్రం ఉంటుందా..?! దేశంలో మేడిపండు స్వాతంత్య్రమే వర్థిల్లు తోంది…! కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ దేశానికి తీరని ద్రోహం చేస్తున్న ఈ ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టడాన్ని మించిన దేశభక్తి మరొకటి లేదిప్పుడంలో సందేహం లేదు!
సైమ‌న్ గున‌ప‌ర్తి

మ‌హిళా మేలుకో..!

‘‘ మహిళలు అవనిలో సగం, ఆకాశంలో సగం అని చెప్పుకుంటాం. కానీ వారికి అవకా శాలు ఏపాటిగా ఉంటాయో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. సృష్టికి మూలం ఆమె అని పూజిస్తాం, గౌరవిస్తాం, గుడులు కడతాం. కానీ ఆడ‌పిల్ల‌‌ తల్లి గర్భం నుంచి బయటకు రాకుండానే చిదిమేస్తాం. వీటన్నింటిని ఎదుర్కొని వచ్చిన వారు గృహిణిగా, తల్లిగా,ఉద్యోగిగా,ప్రజాప్రతినిధిగా,అన్ని రంగా ల్లోనూ ప్రతిభావంతంగా పని చేస్తున్నారు. అయినా ఆమెకు అవకాశాల్లో మాత్రం అడుగడుగునా అందని ద్రాక్షలే. ’’

మహిళలు లేనిదే ప్రపంచం లేదు. మహిళలంటే అవనిలోసగం, ఆకాశంలో సగం అని చెప్పు కుంటాం. కానీవారికి సమాజంలోఉద్యోగాు చేయడానికి ఏపాటిఅవకాశాలు ఉంటాయో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. సృష్టికి మూలం ఆమె అని పూజిస్తాం,గౌరవిస్తాం,గుడు కడతాం. కానీ ఆడ‌పిల్ల‌ల‌ను తల్లి గర్భం నుంచి బయటకు రాకుండానే చిదిమేస్తాం. వీటన్నింటిని ఎదుర్కొని వచ్చిన వారు గృహిణిగా,తల్లిగా, ఉద్యోగిగా,ప్రజాప్రతినిధిగా,అన్నిరంగాల్లోనూ ప్రతిభావంతంగా పని చేస్తున్నారు. ప్రతి ఏడాది మహిళ‌లు జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టింది.

్క 908మే 3వ తేదీన తక్కువ పనిగంటు,పనికి తగిన వేతనం,ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్‌ సిటీలో15 వే మంది మహిళు ప్రదర్శన చేశారు.
1909 ఫిభ్రవరి 28న మహిళ డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. రెండవ అంతర్జాతీయ సామ్యవాద సమావేశానికి ముందుగా ఆగస్టు 1910లో,అంతర్జాతీయ మహిళా సమావేశం కోపెనహాగెన్‌ లో నిర్వహించారు. అమెరికా సామ్యవాదుచే ఉత్తేజితులై, జర్మన్‌ సామ్యవాది లూయీస్‌ జియట్జ్‌ వార్షిక అంతర్జాతీయ మహిళాదినోత్సవం జరపాని ప్రతిపాదించగా సహజర్మన్‌ సామ్యవాది క్లారా జెట్కిన్‌ సమర్ధించారు.
1911మార్చి19న పదిక్షమందిపైగా ఆస్ట్రియా,డెన్మార్క్‌,జర్మనీ,స్విట్జర్లాండ్‌ దేశాలో మహిళా దినోత్సవం జరుపుకున్నారు. ఇందులో బాగంగా ఆస్ట్రో-హంగేరియన్‌ రాజ్యంలో 300 పైగా ప్రదర్శను జరిగినవి. వియన్నాలో రింగ్‌ స్ట్రాసెలో ప్రదర్శన చేశారు. మహిళు ఓటుహక్కు, ప్రభుత్వ పదవుహక్కు అడిగారు. ఉపాధిలో లింగ విచక్షణ పద్ధతును ప్రతిఘటించారు. అమెరికాలో ఫిభ్రవరి చివరి ఆదివారం నాడు మహిళా దినోత్సవం జరుపుకుంటూనే ఉన్నారు.
1913లో రష్యను మహిళు వారి మొదటి మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి చివరి ఆదివారం జరుపుకున్నారు.
1914వరకు మహిళా సమస్య గురించి ఎన్నో ఆందోళను జరిగాయి. అప్పటి నుంచి మార్చి 8ని మహిళా దినోత్సవంగా ప్రకటించుకున్నారు. ఆతరువాత అన్నిదేశాల్లోనూ మార్చి8 నే మహిళా దినోత్సవంగా తీర్మానించారు.1914లో జర్మనీ జరుపుకున్న మహిళాదినోత్సవాన్ని మహిళా ఓటు హక్కు కోసం అంకితమిచ్చారు. 1917 యుద్ధ సమయంలో రష్యా మహిళు ఆహారం-శాంతి డిమాండ్‌ చేస్తూ సమ్మెకు దిగారు. నాుగు రోజు తర్వాత అప్పటి రష్యా సామ్రాట్‌ నికోస్‌ జా 2 సింహాసనాన్ని వదుకోవాల్సి వచ్చింది. అప్పుడు తాత్కాలి కంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది. మహిళు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్‌ క్యాలెం డర్‌ ప్రకారం ఫిబ్రవరి23 ఆదివారం. గ్రెగోరి యన్‌ క్యాలెండర్‌ ప్రకారంచూస్తే అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి8వ తేదీన అంతర్జా తీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నా రు. దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి, ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 1917సోవియట్‌ విప్లవం తరువాత రష్యా కూడా దీనిని ప్రకటిచింది. చాలా మటుకు కమ్యూనిస్టు, సోషలిస్టు దేశాల్లో దీన్ని పాటించేవారు.
1922 నుంచి చైనావారు,1936 నుంచి స్పానిష్‌వారు దీనిని అధికారికంగా ప్రకటించు కున్నారు.
1977 తరువాత అంతర్జాతీయ మహిళా దినోత్సవం బహుళ ప్రాముఖ్యత సంతరించు కుంది. అప్పడు మార్చి 8ని మహిళా హక్కు, ప్రపంచ శాంతి దినంగా ప్రకటించాని యునై టైడ్‌ నేషన్స్‌ జనరల్‌ అసెంబ్లీ పిుపునిచ్చింది.
1980 దశకంలో రినీ కోట్‌ అనే చరిత్రకారిణి అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఆవిర్భావం గురించి పరిశోధించింది.
2011లో అంతర్జాతీయ మహిళా దినో త్సవ శతాబ్ది వేడుకు కూడా జరిగాయి. సాంకే తికంగా చెప్పా ంటే..ఈ ఏడాది జరిగేది 108వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సామాజి కంగాను, రాజకీయా ల్లోనూ,ఆర్థిక రంగంలోనూ మహిళలు ఎంత మేరకు ఎదిగారో తొసుకుని, వేడుక చేసుకునే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మారిపోయింది. భారతదేశంలో మహి ళాహక్కు పోరాటం భారతదేశంలో తొలిగా అహ్మదాబాద్‌లో అనసూ యా సారాభాయ్‌ టెక్స్‌టైల్‌ లేబర్‌ అసోసియేషన్‌ అనే పేరుతో కార్మికసంఘం ప్రారంభించింది. భారత కార్మికోద్యమంలో కార్మిక స్త్రీను సంఘటితం చేసినమహిళా నేతలో సుశీలా గోపాన్‌,విమలారణదివే,కెప్టెన్‌ క్ష్మి సెహగల్‌, అహల్యారంగ్నేకర్‌, పార్వతీకృష్ణన్‌ ప్రముఖు. ఈ పోరాటా ఫలితంగానే స్వాతంత్య్రం తరువాత కార్మికు బ్రతుకు మెరుగయ్యాయి. కార్మికు పని పరిస్థితు,వేతనాు,మహిళాకార్మికు గురించి చట్టాను చేయబడినవి.1991లో ప్రారం భమైన సరళీకరణ విధానా ప్రభావంవన ప్రైవేటు రంగం బపడడంతో మహిళా కార్మికు చట్టా అము కుంటుబడుతున్నది.దీనికి వ్యతిరే కంగా పోరాటాలో మహిళు పాల్గొ నడం మరి యు నేతృత్వం వహించడం మెరుగు పడవసి వుంది. యు.ఎస్‌.ఎలో అధికారిక గుర్తిం పు మానవ హక్కు ఉద్యమకారిణి,నటిబేతా పోజ్నియక్‌ మహిళా దినోత్సవంగా అధికారిక గుర్తింపును, ప్రభుత్వ సెవుదినాన్ని సాధించేందుకు లాస్‌ ఏంజిల్స్‌ నగరానికి మేయరు, కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్‌, యునైటెడ్‌ స్టేట్స్‌కాంగ్రెస్‌ సభ్యుతో కలిసి కృషి చేశారు.1994లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా గుర్తించేలా బ్లిును రూపొందించడానికి సాకారం చేశారు. 2011అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2011 అంతర్జాతీయ మహిళాదినోత్సవ సందర్భంగా ఆఫ్ఘన్‌ మహిళతో యు.ఎస్‌. ఆర్మీ అధికారిణి, ుటినెంట్‌ కర్నల్‌ పామ్‌ మూడీ సుమారు వందకు పైగా దేశాలో ఈదినోత్సవం జరుపుకున్నారు.దేశ చరిత్ర నిర్మాణంలో మహిళ పాత్రని గుర్తించాని అమెరికన్లకు పిుపునిచ్చారు. రాజ్యకార్యదర్శి హ్లిరీ క్లింటన్‌ ఈసందర్భంగా‘‘100మహిళ ఇన్షి యేటివ్‌: అంతర్జాతీయ ఎక్స్చేంజెస్‌ ద్వారా మహిళు మరి యు బాలిక సాధికారత’’,ఈదినోత్సవాన్ని పునస్క రించుకుని ప్రారంభించారు. ఇదే సందర్భంలోనే మహిళపై జరుగుతున్న అత్యాచార,లైంగిక వేధిం పుని అరికడుతూ తీసుకుంటున్న నివారణ చర్య పై ఎటువంటి జాప్యం చేయకూడదని తమ రాజ్యాకు పిుపునిచ్చారు. పాకిస్థాన్లో పంజాబ్‌ ప్రభుత్వంవారు గుజ్రాన్‌ వాలా లింగ సంస్కరణా కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 2011మహిళా దినోత్సవాన్ని గిఫ్ట్‌ యూని వర్సిటీ గుజ్రాన్‌ వాలాలో ఘనంగా నిర్వహించారు. శ్రీమతిషాజియా అష్ఫాగ్‌ మత్తు,జి.ఆర్‌.ఎ.పి.అధికారి ఈవేడుకల్ని చక్కగా నిర్వహించారు. ఈజిప్ట్‌లో మాత్రం ఈదినం విషా దాన్నే మిగిల్చింది. తాహిర్‌స్వ్కేర్‌లో హక్కు కోసం నినదీస్తున్న మహిళల్ని పురుష సమూహాు చెదర గొట్టాయి. ఇదంతా పోలీసు, మిలిటలీ బగా కళ్ళెదుటే జరిగింది. హదీల్‌-ఆల్‌-షల్సీఎ.పి. కిరిపోర్టురాస్తూ ఆ సంఘ టనని ఇలా వర్ణించారు-‘‘బురఖాలో జీన్స్‌లో వివిధదుస్తుల్లో ఉన్న మహి ళు కైరో సెంట్రల్‌ లోని తాహిర్‌ స్వ్కేర్‌కి మహిళా దినోత్సవం జరుపు కోవడానికి చేరుకున్నారు. కానీ అధిక సంఖ్యలో పురుష మూకు అక్కడికిచేరుకుని వారిని చెదరగొట్టారు’’.2012అంతర్జాతీయ మహిళా దినోత్సవం..2012 అంతర్జాతీయ మహి ళా దినోత్సవం సందర్భంగా యునైటెడ్‌ నేషన్స్‌ ‘‘గ్రామీణ మహిళా స్వశక్తీకరణ ఆకలి పేద రిక నిర్మూన’’ని థీమ్‌ గా ఎంచుకుంది. 2012 మహి ళా దినోత్సవం సందర్భంగా ఐ.సి.ఆర్‌. సి.వారు, సైనిక దళాల్లో చని పోయిన వారి త్లు భార్య సంక్షేమానికి కలిసి కట్టుగా పనిచేయాని పిుపు నిచ్చారు. ఇలా సైనికుల్లో తప్పిపోయిన వారి మహి ళకు సమాజంలో చాలా ఆర్థిక మరియు సామాజిక సమస్యు ఎదురవుతుంటాయి.ఐ.సి.ఆర్‌.సి. వారు,తప్పిపోయిన వారి ఆచూకి వారి కుటుంబ సభ్యుకి తెపడం చాలాముఖ్యమని నొక్కి వక్కా ణినించారు. 2013అంతర్జాతీయ మహిళా దినో త్సవం..‘‘ప్రమాణంచేసాక వెనుతిరగడం లేదు మహిళపై హింసనిర్మూలించడం కోసం పని చేద్దాం’’అని2013 అంతర్జాతీయ మహిళా దినోత్స వం థీమ్‌ని యునిటేడ్‌ నేషన్స్‌వారు ఏర్పరచు కున్నారు.
ప్రపంచవ్యా ప్తంగా మహిళ దినోత్సవాన్ని ఎలా జరుపు కుంటారు?
ఇటలీలో అంతర్జాతీయ మహిళా దినో త్సవం లేదా‘ఫెస్టా డ్లె డొన్న’ను మిమోసా అనే చెట్టుకు కాసేపువ్వును బహూకరించి జరుపు కుంటారు. ఈ మిమోసా పువ్వును పంచే సంప్ర దాయం ఎప్పుడు ప్రారంభమైందో స్పష్టంగా తెలి యదు కానీ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రోమ్‌లో ఇది ప్రారంభమైందని భావిస్తుంటారు. చైనాలో మార్చి8వ తేదీన స్టేట్‌ కౌన్సిల్‌ సిఫార్సు మేరకు చాలామంది మహిళకు సగం రోజు పని నుంచి సెవు భిస్తుంది. కానీ,ఇంకా కొన్ని సంస్థ ు తమ మహిళా ఉద్యోగుకు ఈ సగం పనిదినం అవకాశాన్ని ఇవ్వట్లేదు. మార్చి8కి ముందు, తర్వాత మూడు నాుగు రోజు పాటు రష్యాలో పువ్వు కొనుగోళ్లు రెండిరతు అవుతుంటాయి.
మహిళా దినోత్సవంఎందుకు? చరిత్రలో ఏం జరిగింది?
మహిళు అవనిలో సగం, ఆకాశం లో సగం అని చెప్పుకుంటాం. కానీ వారికి అవకా శాు ఏపాటిగా ఉంటాయో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. సృష్టికి మూం ఆమె అని పూజిస్తాం, గౌరవిస్తాం, గుడు కడతాం. కానీ ఆడప్లి తల్లి గర్భం నుంచి బయటకు రాకుండానే చిదిమేస్తాం. వీటన్నింటిని ఎదుర్కొని వచ్చిన వారు గృహిణిగా, తల్లిగా,ఉద్యోగిగా,ప్రజాప్రతినిధిగా,అన్ని రంగా ల్లోనూ ప్రతిభావంతంగా పని చేస్తున్నారు. అయినా ఆమెకు అవకాశాల్లో మాత్రం అడుగడుగునా అందని ద్రాక్షలే.
అమ్మాయి పుట్టినప్పటి నుంచి కుటుం బంలో,సమాజంలో ఎన్నోఆంక్షను ఎదుర్కొం టుంది. వెనకబడిన దేశాల్లోనే కాదు, అగ్రరాజ్యా ుగా దూసుకెళ్తున్న సమాజాల్లోనూ చాలా వరకూ మహిళకు అవకాశాు తక్కువే ఉన్నాయి. నేటి మహిళు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తూ తమ సత్తా చాటుకుంటున్నారు. సైన్యంలో, సైన్సులో, రాజకీయాల్లో, కళల్లో మెరుపు మెరిపిస్తున్నారు. మగవారితో సమానంగా అవకాశాు,జీతాు, పని సమయం,భావ ప్రకటన స్వేచ్ఛ అన్నీ అందుకుం టున్నారు. ఏదేశంలో చూసిన రాజ్యాంగం, చట్టాలు అన్ని మహిళకు సమానగుర్తింపు ఇస్తూ.. వారికి హక్కు,రక్షణ కల్పించానే నినాదంతో ముందుకు వెళ్తున్నాయి. కానీ ఆచరణ విషయానికి వచ్చే సరికి మాత్రం అంతరం చాలానే ఉంది. నేటికి వారిపట్ల వివక్ష పోవడం లేదు. మహిళా దినోత్సవానికి పునాది వేసిన అమెరికాలోనే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒక మహిళ అధ్యక్ష పదవికి ఎన్నిక కాకపోవడమే పురుషుకు,స్త్రీకు మధ్య ఎంత అంతరం ఉందో అర్థం అవుతుంది. మన దేశంలో మహిళు కేవం గృహిణుగానే మిగిలి పోతున్నారు. ఎలాంటి ప్రతిఫం లేకుండా సుమారు ఆరుగంట పాటు ఉచిత సర్వీసు అంది స్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ సమానమైన వేతనం,కూలీు ఇవ్వడం లేదన్నది సుస్పష్టంగా కనిపిస్తుంది. నేటికీ మహిళగానూ, శ్రామిక మహిళగానూ, పౌరురాలిగానూ దోపిడీకి గురౌతూనే ఉంది. ఇన్ని సమస్యున్నా కొందరు విజయం వైపు దూసుకెళ్తూ దేశానికి గర్వకారణంగా నిుస్తున్నారు. దీనికి తోడు చట్ట సభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాని33శాతం రిజర్వేషన్లు అము చేయాని భావించారు. కానీ రకరకా కారణావ్ల ఇవి ఇంకా కగానే మిగిలిపోయింది.
(మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా…)
-సైమన్‌ గునపర్తి 

వ్యవసాయ చట్టాలు కార్పొరేట్‌ ప్రయోజనా !

	ఎం.ఎస్‌. స్వామినాథన్‌ కమిషన్‌ లోని ముఖ్య సిఫార్సులైన కనీస మద్దతు ధర,పెట్టుబడిపై యాభై శాతం లాభం వంటి అంశాలే నేడు రైతుఉద్యమ క్ష్యాయ్యాయి. మోడీ2014లో అధికారం చేపట్టిన తరు వాత రైతుకు పెట్టుబడిపై యాభైశాతం లాభం వాచ్చే విధానాు అము చేస్తామని ఇచ్చిన హామీ నీటి మూటే అయ్యింది. 2016వచ్చే సరికి...లాభం సంగతి అటుంచి కనీస మద్దతు ధరను అము చేయటం కూడా క్రమంగా నీరు గార్చారు. ప్రస్తుతం కనీస మద్దతు ధరను అము చేసిన రైతుకు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితు నెకొన్నాయి. ఇలా పథకం ప్రకారం కనీస మద్దతు ధరను అము చేయకపోవటం, ప్రభుత్వ కొనుగోు కేంద్రాను తగ్గించటం, వున్న కేంద్రాలో సైతం కొను గోళ్లు సరిగా చేయకపోవటం వెనుక గ ప్రయోజనం ఏమిటి? ఇదిఒక ఎత్తైతే కోవిడ్‌ మహమ్మారి వేళ హడా విడిగా చట్టాు చేయటం వెనుక అసు ఉద్దేశం ఏమిటి?
అసు ఉద్దేశం
	చ్లిర వర్తకంలో సాధించగలిగే అధిక లాభాు బడా పెట్టుబడిదారుకు ఎప్పుడూ నోరూరించే విషయమే.1991నుండి ప్రారంభమైన ఆర్థిక సంస్కరణ నేపథ్యంలో వచ్చిన క్రమానుగత మార్పు... 2007 నాటికి బడా కార్పొరేట్ల దృష్టి చ్లిరవర్తకంపై పడేటట్లు చేసింది. అయితే చ్లిరవర్తకంలో అమ్మే వస్తువును స్థూంగా రెండు రకాుగా విభజించవచ్చు. ఒకటి పారిశ్రామిక ఉత్పత్తు, రెండు వ్యవసాయ ఉత్పత్తు. పారిశ్రామిక ఉత్పత్తును టోకున చవక ధరకు కొనవచ్చు. అధిక ధరకు అమ్మవచ్చు. బడా కార్పొరేట్లకు వచ్చిన చిక్కంతా వ్యవసాయ ఉత్పత్తుతోనే. ముందే చెప్పినట్లు 2007 నుండే అంబానీు, టాటా,బిర్లాతోపాటు రహేజాగ్రూపు,ఆర్‌పిజిగ్రూపు, ఫ్యూచర్‌ గ్రూపు కూడా చ్లిర వర్తకం లోకి పెద్దఎత్తున ప్రవేశించాయి. ఎక్ట్రానిక్‌ వస్తువు,దుస్తు వ్యాపారంలో ఆర్జించినట్టుగానే పెద్దఎత్తున లాభాు ఆర్జించ వచ్చునని వాటికి ఆశ కలిగింది. అయితే ఇతర పారిశ్రామిక ఉత్పత్తు ద్వారా కలిగే లాభాు కిరాణా సరుకు నుండి కూడా భించాంటే వ్యవసాయ ఉత్పత్తును పెద్దమొత్తంలో చవక ధరకుకొనటం వీయితే తప్పసాధ్యం కాదు. అందువ్ల ఆచరణలోచాలా గ్రూపు చ్లిర వర్తకంలో విఫం చెందాయి. అందువ్లనే ఇతర పారిశ్రామిక ఉత్పత్తు నుండి ఆర్జించిన కొద్దిపాటి లాభాతోనే నెట్టుకొస్తున్నాయి. కొన్ని కంపెనీు దివాళా తీశాయి కూడా. ఫ్యూచర్‌ గ్రూపు తన వాటాను మే2012లో ఆదిత్యబిర్లా గ్రూపుకు అమ్ము కోవాల్సి వచ్చింది. చ్లిర వర్తకం లోకి ప్రవేశించిన బడా కార్పొరేట్‌ శక్తు ఏడెనిమిదేళ్ల తరువాత గ్రహించిన అనుభవం నుండి నిత్యావసర సరుకు, వ్యవసాయ ఉత్పత్తు నుండి పెద్ద ఎత్తున లాభాు ఆర్జించాంటే వ్యవసాయ ఉత్పత్తును తక్కువ ధరకు కొంటే తప్ప సాధ్యం కాదని తొసుకున్నాయి. పండిరచిన పంటను అతి తక్కువ ధరకు కొనా ంటే ప్రధాన ఆటంకం ఎపిఎంసి లే అని, అవి సరిగానే గ్రహించాయి. కనీస మద్దతు ధర వ్ల చ్లిర వర్తకంలో కార్పొరేట్లకు అనుకున్నంత లాభాు రావటంలేదు. కనుక చేయాల్సింది ఏమిటి?ఎపిఎంసిను నిర్వీర్యం చేయటమే. అధికా రికంగా ప్రభుత్వపరంగా అమవుతున్న ఎపిఎంసి  ద్వారా కొనుగోళ్లను నిలిపివేయటం, లేదా నిర్వీ ర్యం చేయటం చేయకుండా చ్లిర వర్తకం లోకి బడా కార్పొరేట్ల ప్రవేశం లాభసాటి కానేరదు. ఇలా కనీస మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం నిర్వ హిస్తున్న కొనుగోు కేంద్రాను మూసివేస్తే తక్షణ ఫలితంగా జరిగేదేమిటంటే సాధారణ రైతుకు వ్యవసాయం భారమౌతుంది. భారత దేశంలో సుమారు 80శాతం రైతువి చిన్న కమతాలే. ఇలాంటి వారికి ఎంఎస్‌పి అనేదే లేకపోతె వ్యవ సాయం ఎంతమాత్రం జరుగుబాటు ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తమభూమిని సాగుచేసు కోవటం కంటే ఎవరికైనా కౌుకు ఇవ్వటం మేనే ఆలోచన రాకమానదు. ఈ పర్యవసానాన్ని గ్రహించి చేసిందే మొదటి వ్యవసాయ చట్టం. ఈ అవసరాన్ని తీర్చటం కోసం, కార్పొరేట్లు అలాంటి భూమును కాంట్రాక్టు పద్ధతిలో చేజిక్కించుకోవటం కోసం     ఉద్దేశించబడిరదే ఈచట్టం. ఇక ఇలా ఎపిఎంసి ను రద్దు చేయటం ద్వారా మిగిలే సొమ్మును వ్యవసాయాన్ని నిర్వహిస్తున్నందుకు కార్పొరేట్లకు రుణంగా ఇవ్వవచ్చు. రెండవ ఫలితంగా రైతుకు చేసే రుణ మాఫీ సొమ్మును కూడా పరిశ్రమను స్థాపించినందుకు ఇచ్చినట్లుగానే...కార్పొరేట్‌ సాగుకు కూడా ప్రభుత్వ పూచీకత్తుతో రుణంగా పొందవచ్చు. ఇక కార్పొరేట్లు అన్నాక వారికి సరు కు అమ్ముకునే దుకాణాను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసుకుంటేనే లాభం. మరితాము కాంట్రా క్టు సేద్యం ద్వారా పండిరచిన పంట ఒక చోటి నుండి మరో చోటికి (మరో అవుట్లెట్‌కు) చేరవేయా ంటే రైతు తమ పంటల్ని ఎక్కడైనా అమ్ము కోవచ్చనే సౌకర్యం చాలా ముఖ్యమైన అవసరంగా మారుతుంది. దీనికోసం చేసిందే రెండో వ్యవసాయ చట్టం. ఇలా నేరుగా వ్యవసాయ రంగాన్ని కార్పొ రేట్లకు అప్పజెప్పటం కోసం చేసినవే మొదటి రెండు కొత్త చట్టాు. అయితే కేవం వ్యవసాయదాయి గాక వ్యవసాయ కూలీు, నిరుపేదు, దళితుూ ఉద్యమంలో పాల్గొనటానికి కారణం ఏమిటి? నిజానికి గుంట భూమి లేని నిరుపేదకు కూడా ఈ వ్యవసాయ చట్టాతో పెద్ద నష్టమే జరగబోతు న్నది. మొదటి రెండు చట్టా వ్ల కార్పొరేట్లకు కలిగే ప్రయోజనం, తాము కాంట్రాక్టు వ్యవసాయం ద్వారా పండిరచిన పంటను తమ రిటైల్‌ దుకా ణాల్లో అమ్ముకోవటంతోనే పరిపూర్ణం అవుతుంది. అంటే వారి రిటైల్‌ దుకాణాల్లో అమ్ముకోవటానికి కావాల్సిన సరుకును ఎంతైనా న్వి చేసుకుంటేనే ఇది సాధ్యపడుతుంది. కార్పొరేట్ల దుకాణాలో సరుకు కొరత ఉండకూడదంటే వారి గోదాము ఎప్పుడూ నిండుగా ఉండాలి. సరిగ్గా అందుకోసం రూపొందించిందే మూడవ నిత్యావసర సరుకు సవరణ చట్టం.
అగ్ర తాంబూం అదానీకే
	ఈమూడు చట్టా పర్యవసానాు ఇలాగే ఉంటాయనుకోవటానికి బలాన్ని చేకూర్చే ఉదాహరణున్నాయి. ఈ మూడు ఆర్డినెన్సు చేసిన జూన్‌ 2020కి నె ముందు దేశం మొత్తం లాక్‌డౌన్‌ లో మునిగి వున్నప్పుడు సంగతి. అదానీ గ్రూపుకు చెందిన అదానీ అగ్రి లాజిస్టిక్స్‌ లిమిటెడ్‌ సంస్థకు వ్యవసాయ ఉత్పత్తును న్వి చేసుకు నేందుకు సుమారు 75,000 టన్ను సామర్థ్యం కలిగిన గోదాము నిర్మాణానికి ప్రభుత్వం అను మతి ఇచ్చింది. 22ఎకరా భూమిని వాణిజ్య పరంగా వాడుకోవటంకోసం అనుమతించింది. హర్యానా రాష్ట్రపు డైరెక్టరేట్‌ అఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ నుండి అనుమతి పొందిందే తడ వుగా అదానీ గ్రూపు అక్కడ గోదాము నిర్మాణం చేపట్టింది. ఈచట్టావ్ల జరగబోయే నష్టం పంజా బ్‌, హర్యానా రైతుకు తెలిసింది అందువ్లనే. భూమున్నీ, పంటన్నీ కార్పొరేట్ల పరమైతే ప్రమా దమని, ఆహార భద్రత కూడా ఉండదని అక్కడి రైతు సంఘా నాయకత్వం కలిగించిన చైతన్యం వ్ల వారికి పరిస్థితి తీవ్రత అర్థమైంది. నిజానికి కోవిడ్‌ లాక్‌డౌన్‌ కాంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ఒకే ఒకమంచి పని ఏదైనా ఉన్నదంటే అది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిరుపేదకు తిండిగిం జు ఇవ్వటమే. ఎపిఎంసి ద్వారా ప్రభుత్వం కొనుగోు,న్వి చేయటం వ్లనే ఇది సాధ్యం అయింది. మరి ఎపిఎంసిు అనేవే లేకపోతే ఆహార భద్రత ఎలా అమలౌతుంది. ఈ విషయాన్ని తెలియజెప్పటం వ్లనే నిరుపేదు, రైతు కూలీు సైతం ఆందోళనలో పెద్ద ఎత్తున పాుపంచు కుంటున్నారు. అంతే కాదు. హర్యానా లోని పాని పట్‌ జిల్లాలోని ఇస్రానా తాూకా నాథు, జోందా గ్రామాల్లో పైన చెప్పిన గోదాము నిర్మాణం కోసం 2017లోనే ఎకరాకు రూ.30క్ష నుండి 2 కోట్ల దాకా చెల్లించి 22ఎకరా భూమిని అదానీ గ్రూపు కొనటం ఇప్పుడు వారి కనువిప్పుకు కారణ మైంది. అయినా ఈ గోదాము వ్యవసాయ ఉత్పత్తు న్వి కోసం కాదని నిస్సిగ్గుగా అబద్ధం ఆడుతున్నది అదానీ గ్రూపు.
	‘పంజాబ్‌ స్టేట్‌ ఫార్మర్స్‌ కమిషన్‌’ సంస్థ 2008లో చేపట్టిన అధ్యయనం ప్రకారం 89శాతం కమతాు ఎప్పుడూ అప్పుల్లోనే ఉంటాయి. వ్యవసాయ రం గంలో సబ్సిడీను ఎత్తివేయాని, ప్రభుత్వం మద్దతు ధరలిచ్చి తిండిగింజు కొనకూ డదని డబ్ల్యుటిఓ ఒత్తిడికి వ్యతిరేకంగా ఆనాడే పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టిన అనుభవం పంజాబ్‌, హర్యానా రైతుకు ఉన్నది. అందుకే వారు ఇప్పుడు రెండు రాష్ట్రా రైతునే కాదు మొత్తం దేశాన్నే మేల్కొ ుపుతున్నారు. దేశాన్ని తెగనమ్ముతున్న ‘దేశభక్త’ పాకు అసు రంగును బయట పెడు తున్నారు. ఇప్పుడుఢల్లీి సరిహద్దులో సమర భేరి మోగిస్తున్న రైతుబిడ్డలే దేశానికి దిక్కు.
రైతాంగ ఉద్యమానికి సంపూర్ణ సంఫీుభావం
	దేశ వ్యవసాయ రంగాన్ని,రైతు ఉనికిని దెబ్బ తీసే వ్యవసాయ చట్టాను ఉపసం హరించు కోవాని, గిట్టుబాటు ధర గ్యారెంటీ కోసం చట్టం చేయాని రెండు నెలుగా సాగుతున్న రైతాంగ ఉద్యమానికి రైతు ఉద్యమ సంఫీుభావ సదస్సు సంపూర్ణ సంఫీుభావం ప్రకటించింది. ఉద్యమం సందర్భంగా అశువుబాసిన 126మంది రైతుకు సదస్సు సంతాపాన్ని ప్రకటించింది. ఈమేరకు వామ పక్షా ఆధ్వర్యంలో న్ల చట్టా రద్దుకై విజయవాడ ఎం.బి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ‘’రైతు ఉద్యమ సంఫీుభావసదస్సు’’తీర్మానం చేసింది. సద స్సులో తీర్మానాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పిమధు ప్రవేశపెట్టారు. సదస్సు తీర్మా నాన్ని ఏకగ్రీ వంగా ఆమోదించింది. సదస్సుకు హాజరు కాలేక పోయిన ఆర్‌ఎస్‌పి,బిఎస్‌పి ు తమ మద్దతును తెలిపాయి.
తీర్మానం వివరాు...
	బిజెపితప్పుడు ప్రచారానికి చెంపపెట్టు గా దేశవ్యాపితంగా వివిధ తరగతు ప్రజా నీకం నుండి వివిధ రూపాలో ఈ ఉద్యమానికి సంఫీు భావం విస్తారంగా వ్యక్తమవుతోంది. రైతు, కౌు రైతు, వ్యవసాయ కార్మిక,కార్మిక సంఘాు, సంస్థు ఈఉద్యమంలో పాల్గొంటున్నాయి. మహిళా, యువజన,విద్యార్థిసంఘాు మద్దతు ప్రకటించాయి. దళిత, ఆదివాసి, వృత్తి తరగతు ఉద్యమాన్ని బపరుస్తున్నాయి. మేధావు,ఆర్థిక వేత్తు ఈచట్టాను ఉపసంహరించు కోవాని పెద్ద సంఖ్యలో ప్రభుత్వాన్ని కోరాయి. మాజీ సైని కు స్పందించి ఉద్యమానికి అండగా నిబడ్డారు. బిజెపి మిత్ర పక్షాుసైతం వ్యతిరేకించాయి. ప్రపం చంను మూల నుండి సంఫీుభావం వ్యక్తమవు తోంది. ఇంతటి స్థాయిలో ఉద్యమానికి మద్దతు భిస్తున్నా, ప్రజాభిప్రాయాన్ని లెక్క చేయ కుండా మోడీ మొండిగా వ్యవహరించడాన్ని ఈ సదస్సు ఖండిరచింది. ఇప్పటికైనా ఈన్ల చట్టాను ఉపసంహరించుకొని రైతుకు మేు చేసే ‘గిట్టు బాటు ధర చట్టం’ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాని సదస్సు డిమాండ్‌ చేసింది. లేని పక్షంలో ప్రతిఘటనోద్యమం ఇంకా తీవ్రతరమ వుతుందని హెచ్చరించింది. రైతును ఢల్లీిలో అడుగు పెట్టనీయకుండా నిరోధించడానికి నీటి ఫిరంగు, బాష్పవాయువు, లాఠీచార్జీతో సహా తీవ్ర నిర్భందాన్ని ప్రయోగించింది. అయినా రైతు మొక్కవోని పట్టుదతో ముందుకే సాగడంతో ఢల్లీి పొలిమేరల్లో వారిని అనుమతించక తప్పలేదు. క్షలాది మంది అక్కడే శాంతియుతంగా అసా ధారణ రీతిలో ఎముకు కొరికే చలి, భారీ వర్షా ను లెక్క చేయకుండా ఆందోళనను కొనసాగి స్తున్నారు. ఆధునిక ప్రపంచ చరిత్ర లోనే ఇదొక అపూర్వ ఘట్టం. ఈ చట్టా వ్ల రైతు హక్కుగా పొందుతున్న కనీస మద్దతు ధర విధానం (యం. ఎస్‌.పి) రద్దవుతుంది. పంట ధరు తగ్గితే ప్రభు త్వం మార్కెట్టులో కొనుగోు చేయదు. స్వదేశీ, విదేశీ కార్పొరేట్‌ కంపెనీు కాంట్రాక్టు వ్యవసాయం చేపట్టి రైతు పైన, వారి భూము పైన ఆధిపత్యం వహిస్తాయి. రైతు నుండి కారుచౌకగా వ్యవసా యోత్పత్తును కొని వినియోగదారుపై భారం మోపి అధిక లాభాు క్లొగొడతారు. అప్పు పాలై దివాళా ఎత్తి రైతు ఆత్మహత్యు ఇంకా పెరుగుతాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ బహీన పడుతుంది. నిత్యావసరా ధరు పెరుగుతాయి. ప్రజకు తినడానికి తిండి కూడా కరువవుతుంది. కార్మికు, ఉద్యోగుపై ధర భారం పడుతుంది. ఇది ఆకలిచావుకు కూడా దారితీస్తుంది. ఈ చట్టా పర్యవసానంగా రైతు భూము కోల్పో తారు. కౌురైతుకు చేసుకోవడానికి భూము దొరకవు. విద్యుత్‌ ఛార్జీు పెరుగుతాయి. యాంత్రీ కరణతో గ్రామీణ నిరుద్యోగం వసు పెరుగు తున్నాయి. పట్టణాల్లో ఉపాధి ఒత్తిడి పెరిగి శ్రామికు దారుణ దోపిడీకి గురవుతారు. వేతనాు పడిపోతాయి. కార్మిక హక్కు హరించ బడతాయి. వ్యవసాయ చట్టా మాదిరే, లేబర్‌ కోడ్‌ పేరుతో కార్మికు హక్కురద్దు చేయ బడ్డా యి. రిటైల్‌ వ్యాపారం దెబ్బ తినడం ఇప్పటికే ప్రారంభం అయ్యింది. చిన్న వ్యాపార సంస్థు, పరిశ్రము మూత పడుతున్నాయి. విద్యా, వైద్యంలో కార్పొరేట్‌ ఆధిపత్యంతో ఫీజు పెరుగుతాయి. వ్యవసాయ చట్టాు కొనసాగడమంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థను కొద్దిమంది క్లొగొట్టడమే. వ్యవ సాయం, విద్య, విద్యుత్‌పై చట్టాు చేసే హక్కు రాష్ట్రాది. కానీ ఈకొత్త చట్టాతో కేంద్రం రాష్ట్రా  హక్కుల్ని హరించింది. కేంద్ర బిజెపి రాజ్యసభ లో ప్రజాస్వామ్యం గొంతు నులిమి ఈ చట్టాను ఆమోదింపచేసుకుంది. పార్లమెంటు సభ్యుకు చర్చించడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. కరోనా కష్టకాంలో ప్రజు ఇబ్బందు పడుతుంటే వాటిని పట్టించుకోకుండా దొడ్డిదారిన ఈ చట్టాకు ఆర్డినెన్సును తెచ్చింది. రైతు, రైతు సంఘాతో చర్చించలేదు. తీవ్రంగా సాగుతున్న ఉద్యమాన్ని అణచాన్న ఎత్తు పారకపోవడంతో చర్చు మొద లెట్టింది. ప్రజాగ్రహాన్ని పక్కదారి పట్టించడానికి కోర్టుల్ని ఉపయోగించుకోవాని చూస్తున్నది. చట్టా ను బపరిచేవారితో కమిటీ వేయడమంటే అసు సమస్యను నీరుగార్చడమే. ఈచారిత్రాత్మక ఉద్య మానికి రాష్ట్రంలో యావత్‌ ప్రజానీకం-కుం, మతం,ప్రాంతం,పార్టీతో నిమిత్తం లేకుండా- అండగా నివాని ఈ సదస్సు విజ్ఞప్తి చేసింది. అఖి భారత రైతు సంఘా సమన్వయ సమితి (సంయుక్త కిసాన్‌ మోర్చా) ఇచ్చే పిుపున్నింటినీ జయప్రదం చేయాల్సిందిగా కోరింది. రాష్ట్రంలోని రాజకీయ పార్టీన్నీ-ప్రత్యేకించి వైఎస్సార్‌సిపి, తొగుదేశం-ప్రత్యక్షంగా ఈఉద్యమానికి మద్దతు నివ్వాని విజ్ఞప్తి చేసింది.
చాలా ప్రమాదకర ధోరణి ఇది
	దేశంలో రైతు వ్యవసాయాన్ని తీసుకు పోయి కార్పొరేట్లకు సమర్పించడానికి తీసుకువచ్చిన వ్యవసాయ చట్టా రద్దు కోసం రైతుంతా పోరాడు తున్నారు. ఈ పోరాటంపై మోడీ ప్రభుత్వం తప్పుడు ప్రచారానికి పూనుకుంది. ఈ వ్యవసాయ చట్టాను వ్యతిరేకిస్తున్నది కేవం ఒక రెండు రాష్ట్రా రైతు మాత్రమేనని, తక్కిన రాష్ట్రా లోని రైతుంతా ఈచట్టాను స్వాగతిస్తున్నారని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. దేశానికి ఓమూనున్న కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఒకప్రత్యేక సమావేశం జరిపి ఈ చట్టాను వ్యతిరేకిస్తూ తీర్మానించడం కేంద్ర ప్రభుత్వ వాదన ఎంత బూటకమో తేల్చిచెప్పింది. తమిళనాడు, ఒడిశా,మహారాష్ట్ర,పశ్చిమబెంగాల్‌,మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌,ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రా నుండి రైతు ఇప్పటికే దేశ రాజధానిలో పోరాడుతున్న రైతుతో భుజం భుజం కలిపి ముందుకు నడుస్తు న్నారు. ప్రభుత్వ వాదన మోసపూరితమని చాటి చెప్తున్నారు.అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం చెప్తున్నట్టు ఒకటో, రెండో రాష్ట్రా  రైతు మాత్రమే ఈచట్టాను వ్యతిరేకిస్తే అప్పుడు ఈచట్టాను కేంద్ర ప్రభుత్వం జారీ చేయడం సరైనది అవుతుందా? మైనారిటీ రాష్ట్రా రైతు వ్యతిరేకిస్తున్నారు గనుక తాము చట్టాను చేయడం సరైన చర్యే అన్నది కేంద్రం వాదన. ఇది చాలా ప్రమాదకరమైన వాదన. మన భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని ఏరాష్ట్రం లోని రైతు పైన అయినా సరే రుద్దకూడదు. ఒకరాష్ట్రంలోని రైతు వ్యతిరేకిం చినా ఆ రాష్ట్రపు రైతు అభీష్టానికి వ్యతిరేకంగా కేంద్రం చట్టం చేయకూడదు. అలా చేసే అధికారం కేంద్రానికి లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో రైతు పరిస్థితు, వ్యవసాయం పరిస్థితు వేరువేరుగా ఉంటాయి. ఆరాష్ట్రం లోని ప్రభుత్వం మాత్రమే అక్కడి ప్రజకు నేరుగా జవాబుదారీగా ఉంటుంది. ఆరాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే అక్కడి నిర్దిష్ట పరిస్థితు పట్ల స్పష్టమైన అవగాహన ఉంటుంది. అందుకే రాజ్యాంగం వ్యవసాయాన్ని రాష్ట్ర ప్రభు త్వా పరిధిలో ప్రత్యేకంగా ఉంచింది. వ్యవసా యిక సంబంధ విషయాపై చట్టాు చేయడం కేంద్రం పని కానేకాదు. ఒకవేళ కార్పొరేట్లు వ్యవ సాయ రంగంలో ప్రవేశించడం చాలా మంచిదని కేంద్రం తనకున్న విజ్ఞతతో భావిస్తే ముందుతాను జారీ చేసిన మూడు చట్టా నూ రద్దు చేసి ఆతర్వాత కార్పొరేట్లను వ్యవసాయంలోకి అనుమతిస్తూ చట్టాను చేయవ సిందిగా రాష్ట్రాకు సహా ఇవ్వవచ్చు. కేంద్రం చెప్పినట్టు రాష్ట్రాలో రైతు ఇందుకుఅను కూంగా ఉండడమే వాస్తవం అయితే ఆయా రాష్ట్రా ప్రభుత్వాలే అందుకు అనుగుణంగా చట్టాను చేసుకుంటాయి. ఏ రాష్ట్రా ల్లోనైతే రైతు కార్పొరేట్ల ప్రవేశాన్ని వ్యతిరేకి స్తున్నారో ఆరాష్ట్రా ప్రభుత్వాు అటువంటి చట్టా ను చేయవు. వ్యవ సాయ చట్టాు ఆయా రాష్ట్రా పరిస్థితుకు అను గుణంగా ఉండానేది రాజ్యాం గం నిర్దేశిస్తున్న విషయం. పరిస్థితు రాష్ట్రానికో తీరున ఉన్నట్టే చట్టాూ వేరువేరుగా ఉండాలి. అంతే తప్పతానేది సరైనచట్టం అని కేంద్రం భావి స్తున్నదో దానినే రాష్ట్రాపైరుద్దే అధికారం కేంద్రా నికి లేదు. మరి రాజ్యాంగం ఇంత స్పష్టంగా నిర్దేశిం చినా కేంద్రం తానే పూనుకుని చట్టాను ఎందుకు తెచ్చింది? ఎందుకు రాష్ట్రాకు వదిలిపెట్టలేదు? రాజ్యాంగం చెప్పినట్టు గనుక రాష్ట్రాకు వదిలి పెడితే ఏఒక్క రాష్ట్ర ప్రభుత్వమూ- ఆఖరుకి బిజెపి పాన లోని రాష్ట్రాు కూడా-ఈ విధంగా కార్పొరేట్ల పెత్తనానికి బాటు వేసే చట్టాను చేసేందుకు సాహసిం చలేవు. ఆ చట్టాు రైతుకు అంత వ్యతిరేకంగా ఉన్నాయి. ఇక కేంద్రమే ఈ చట్టాను చేయడానికి రెండు కారణాున్నాయి. మొదటిది-కొన్ని రాష్ట్రాల్లో రైతు మెజారిటీగా ఉన్నప్పటికీ దేశం మొత్తంగా చూసుకుంటే రైతు మెజారిటీ కాదు. రెండవది- కేంద్రం తీసుకున్న రైతు వ్యతిరేక వైఖరి వన బిజెపిపట్ల ప్రజలో ఏర్పడే ప్రతికూతను ఎన్ని క సమయంలో వెనక్కి నెట్టడానికి తగిన వ్యూహం ఆపార్టీ వద్ద ఉండనే వుంది. సరైన సమయం చూసి ఏదో ఒక సంఘటనను సృష్టించి భావోద్వే గాను రెచ్చగొట్టి ఆక్రమంలో ఈ వ్యవసాయ చట్టా వన ఏర్పడిన ఆగ్రహాన్ని వెనక్కి నెట్టవచ్చు నన్నదే ఆ వ్యూహం. అటువంటి సంఘటనను ఏ రాష్ట్రానికి ఆరాష్ట్రం లో సృష్టించడంచాలా కష్టమేగాక అవి ఎటు దారితీస్తాయో తెలియదు. విదేశీ వ్యవహారాు, రక్షణ రంగం కేంద్రం పరిధిలో ఉండే అంశాు గనుక అటువంటి ఉద్వేగ సంఘట నను సృష్టించే అవకాశాు కేంద్రానికి కావసి నన్ని ఉంటాయి. మనదేశం ఆహారధాన్యాఉత్పత్తి వైపు నుండి ఇతర ఉత్పత్తు వైపు దృష్టి మళ్ళించాని, తమ దేశా నుండి ఆహార ధాన్యాను దిగుమతి చేసుకునే టట్టుగా భారతదేశం మార్పు చెందాని అమెరికా, యూరోపియన్‌ యూని యన్‌ చాలా కాం నుండీ ఒత్తిడి చేస్తున్నాయి. ఇకమన దేశ వ్యవసాయ మార్కె ట్‌లో, వంట సరుకు చ్లిరవ్యాపారంలో మొత్తం గా ప్రవేశిం చాని మన దేశ కార్పొరేట్లూ కోరుతు న్నాయి. ఈ రెండు శక్తు ఎజెండానూ అము చేసేందుకు పూనుకున్న మోడీ ప్రభుత్వం ఆక్రమంలో అధికారాను కేంద్రీకృతం చేయడానికి పూను కుంది. అలా చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేకమేగాక రాజ్యాంగవ్యతిరేకం కూడా. ఇంతకు ముందే ఆర్థిక వనరును కేంద్రీకృతం చేయడంలో భాగంగా జిఎస్‌టి వ్యవస్థను తెచ్చింది. ఆసందర్భంలో రాష్ట్రా ు కోల్పోయే ఆదాయాన్ని కేంద్రం భర్తీ చేస్తుం దని ఇచ్చిన హామీ వొట్టి బూటకం అని తేలిపో యింది. ఆతర్వాత ఏకపక్షంగా నూతన విద్యా విధానం ప్రకటించింది. వాస్తవానికి విద్య అనేది రాజ్యాంగం లోని 7వ షెడ్యూు ప్రకారం కేంద్ర, రాష్ట్రా ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం. ఐనా రాష్ట్రాను సంప్రదించలేదు. జమ్ము,కాశ్మీర్‌ కు సంబంధించి 370, 35-ఎ అధికరణాను రద్దు చేసినప్పుడూ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం కోరలేదు. నిజానికి ఈ అధికరణాను రద్దు చేయడానికి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం ఇచ్చినంత మాత్రాన ఆ రద్దు సమర్ధనీయం అయి పోదు. ఇప్పుడు ఏకంగా ఉమ్మడి జాబితాలో కూడా లేని, కేవం రాష్ట్రా పరిధిలో మాత్రమే ఉన్న వ్యవసాయం జోలి కొచ్చిం ది. దేశవ్యాప్తంగా వ్యవసాయంలో తీవ్ర మార్పుకు దారి తీసే చట్టాను తెచ్చింది. ఈ విధంగా అటు ఆర్థిక వనరును, ఇటు అధికారా ను కేంద్రీకృతం చేయడం ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు పెను ముప్పుగా మారుతుంది. పైగా ఈ కేంద్రీకరణ కూడా పుట్టెడు అబద్ధా మాటున సాగించుతోంది. జిఎస్‌టి లో కేంద్రం రాష్ట్రాకు కలిగే రెవెన్యూ నష్టాన్ని భర్తీ చేసే విషయమై ఇచ్చిన హామీ వెనుక ఏవిధంగా అబద్ధం దాగుందో మనం చూశాం. ఇప్పుడు ఈవ్యవసాయ చట్టా విషయం లోనూ అటువంటి అబద్ధాు దాగున్నాయి. సాక్షా త్తూ పార్లమెంటు వేదికగా ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. నీతి ఆయోగ్‌ పాక మండలి ప్రైవేటు వ్యక్తు వద్దఉండే ఆహారధాన్యా న్విపై ఎటువంటి ఆంక్షూ ఉండరాదని సిఫార్సు చేసిం దన్నది ఆ ప్రకటన సారాంశం. నీతిఆయోగ్‌ పాక మండలిలో రాష్ట్రా ముఖ్యమంత్రుూ ఉంటారు. ఐతే, సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా తమ పాక మండలి లో అటువంటి చర్చ ఏదీ జరగనేలేదని నీతి ఆయోగ్‌ తెలిపింది. అసు ఆహార ధాన్యా న్విపై ఆంక్ష ు ఎత్తివేయాన్న సిఫారసుతో ఒక నివేదిక ఉందన్నది కూడా బూటకమే. వాస్తవానికి ఆహార ధాన్యా న్విపై ఆంక్షు ఉండాలా వద్దా అన్నది కూడా రాష్ట్రా పరిధిలో నిర్ణయించే అంశమే. ఇప్పుడు ఆ అధికారాన్ని చాలా అబద్ధాు చెప్పి రాష్ట్రా నుంచి ఊడలాక్కున్నారు. అంతేగాక, చట్టా వ్యాపారుకూ, బ్లాక్‌మార్కెట్‌ వ్యాపారుకూ ఆహార ధాన్యా కొరత సృష్టించేందుకు పుష్కంగా అవకాశాు కల్పించారు. రాష్ట్రా పరిధిలో ఉండే అంశాపై కేంద్రమే నేరుగా చట్టాను జారీ చేయబూను కోవడమే కాదు. ఇక్కడ మరో ప్రమాదకర ధోరణి ఏమంటే రాష్ట్రాు వ్యతిరేకి స్తున్నా వాటి అభీష్టాకు విరుద్ధంగా కేంద్రం చట్టాు తేవడం. పైగా కొన్ని రాష్ట్రాు మాత్రమే వ్యతిరేకిస్తు న్నాయంటూ తాము ఘనకార్యం చేసినట్టు ప్రచారం సైతం చేసుకుంటోంది కేంద్రం.ఈదేశంలో మొత్తం గానే రాజ్యాంగానికి ద్రోహం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న రైతు పోరాటం మన భవిష్యత్తుదృష్ట్యా చాలా ప్రాముఖ్యతను సంతరిం చుకుంది.

భారత్‌ రైతు పోరాటానికి పెరుగుతున్న మద్దతు..!

ప్రాధేయపడే గొంతు పైకి ఉరి విసిరివేయబడుతున్నపుడు కంఠాు ఢంకాధ్వానం చేస్తున్నవి అర్థించే చేతును నిర్బంధించినపుడు పిడికిళ్ళను బిస్తున్నవి. మౌన శ్రమకారు భవితపై ద్రోహపు చట్టా ఖడ్గాు దింపు తున్నపుడు, పాదాు ప్రశ్నలై ముంచెత్తుతున్నవి. పొలా తల్లి కడుపుకోతను భరించలేని నేనేంతా కాంక్రీటు వీధుపై కవాతు చేస్తున్నవి. పచ్చని పైరు హౌరెత్తుతూ యుద్ధ సంగీతాన్ని మోగిస్తున్నవి ఈ దేశ కృషీమ పోరాటం అకుంఠిత దీక్షతో కొనసాగుతున్నది సమస్త ప్రజ సంఫీుభావమూ బలాన్ని పెంచుతున్నది. ఇది కేవం రైతు సమస్య మాత్రమే కాదు. అన్నము తినే ప్రతి మనిషన్న వాడి సమస్య. దోపిడీదారుకు దోచిపెట్టడాన్ని నివారించేందుకు చేస్తున్న శ్రామికు సమస్య. మెతుకుపై బడాబాబు పెత్తనాన్ని ధిక్కరించే సమస్య. రైతు వ్యతిరేక చట్టాను, మేు చేస్తాయని అబద్ధా ప్రచారాన్ని తిప్పి కొట్టి వాస్తవాను వ్లెడిరచే సమస్య. అందుకే ప్రభుత్వానికి కంటగింపుగా వున్నది. దోపడి దారుకు, వారి ప్రచారకుకు అసహనంగా వున్నది. ఎవరేమి అనుకున్నా న్యాయమైన సమస్యపై నిజాయితీగా సామాన్య రైతు అసామాన్య పోరాటం చేస్తున్నారు. ప్రజాస్వామిక ప్రభుత్వానేవి ప్రజ భావాను అర్థం చేసుకుని తమ విధానాల్ని మార్చుకోవాలి. లేకుంటే ప్రభుత్వానే ప్రజు మార్చుకుంటారు.
సుమారు 45రోజుగా క్షలాది మంది రైతు ఢల్లీిని ముట్టడిరచి కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాను,పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన విద్యుత్‌ సవరణ బ్లిును ఉపసంహరించాని ఆందోళను కొనసాగిస్తున్నారు. నవంబర్‌ 26న ప్రారంభమైన ఢల్లీి పోరాటం దేశవ్యాప్తంగా జరుగుతున్నది. జూన్‌ 3వతేదీన 3ఆర్డినెన్స్‌ను కేంద్ర క్యాబినేట్‌ ఆమోదించింది. 1.నిత్యావసర వస్తువు నియంత్ర సవరణ చట్టం,2.ఫార్మర్స్‌ ప్రొడ్యూసెస్‌డకామర్స్‌(ప్రమోషన్‌డప్రొటక్షన్‌) ఆగ్రిమెంట్‌ ఆన్‌ ప్రైస్‌ ఆస్యూరెన్స్‌ డఫార్మ్‌ సర్వీస్‌యాక్ట్‌,3.ద ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌డకామర్స్‌ (ప్రమోషన్‌ డఫెసిలిటేషన్‌ యాక్ట్‌) 2020.జూన్‌ 5వతేదీన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
ఈచట్టా వన రైతు ప్రస్తుతం ఉన్న కనీస మద్దతు ధరను కోల్పోతారు. మధ్య ధళారీు కార్పొరేట్‌ సంస్థు కలిసి రైతు ఆస్తును కాజేస్తాయి. అభ్యంతరాు వుంటే రైతు సివిల్‌ కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు. రాష్ట్రాు ఈచట్టాకు రూల్‌ తయారు చేయాలి. కార్పొరేట్‌ సంస్థు కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ పేరుతో ఎగుమతి ఆధారిత పంటను పండిస్తారు. ఆహార ధాన్యాు దిగుమతు చేసు కోవాల్సి వస్తుంది. చిన్న కమతాను భారీ కమతా ుగా మార్చి యాంత్రీకరణ ద్వారా సాగు చేస్తారు. చివరకు తమ భూములో సన్న,చిన్న కారు రైతు కూలీకి కూడ పనికి రారు. దేశంలో14.57కోట్ల మంది రైతు కుటుంబాలో 85శాతంగా ఉన్న సన్న,చిన్నకారు రైతు భూమి కోల్పోయి అస్తులేని వారవుతారు.నైపుణ్యం లేకపోవడంతో పూర్తి ఆదా యాన్ని కోల్పోతారు. ఇప్పటికే 20శాతం సాగు భూమి కార్పొరేట్‌ సంస్థ చేతులోకి వెళ్ళింది. ఈప్రమాదకర చట్టాు50 కోట్ల మంది ఉపాధిని కాజేస్తాయి. అమెరికాలో1.2శాతం ప్రజు, ఇంగ్లాండ్‌లో0.3శాతం ప్రజు మాత్రమే వ్యవ సాయంపై ఆధారపడి ఉన్నారు. కానీభారత దేశం లో48శాతం మంది ప్రజు వ్యవసాయంపై ఆధా రపడి ఉన్నారు. యాంత్రీకరణ వన, భారీ కమ తా వన భారతదేశంలో కూడా వ్యవసా యంపై ఆధారపడిన వారిసంఖ్య సగానికి సగం తగ్గుతుంది. జూన్‌10వతేదీ నుండి ఆర్డినెన్స్‌ కాపీ దగ్దంతో పాటు రాస్తారోకోు, ధర్నాు ప్రతిరాష్ట్రంలో జరి గాయి. ఆగస్టు 12న రాష్ట్రపతికి రైతు ఉత్తరాు వ్రాశారు. డిసెంబర్‌1న మరియు 3వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి రైతు ప్రతినిధుకు మధ్య జరిగిన చర్చు విఫం కావడంతో వెంటనే నిరసన కార్యక్ర మాు జరిగాయి. తిరిగి5వ తేదీన మరియు డిసెంబర్‌8న,9న జరిగిన చర్చు కూడా విఫ మైనాయి. కేంద్ర ప్రభుత్వం చర్చ కొరకు పంపిన ఎజెండాలో ముఖ్యఅంశాు ఇవి.
ా వ్యవసాయోత్పత్తు మార్కెట్‌ కమిటీని పునరుద్దరించడం,
ా రాష్ట్ర ప్రభుత్వాు వ్యాపారుకు లైసెన్స్‌ు ఇచ్చే బాధ్యత,
ా అభ్యంతరాపై రైతు సివిల్‌ కోర్టుకు వెళ్ళడం.
ా కాంట్రాక్టు పార్మింగ్‌ ఒప్పందం జరిగిన 30 రోజు లోపు ఆగ్రిమెంట్‌ను యస్‌బియం వద్ద డిపాజిట్‌ చేయడం.
ా కాంట్రాక్టు భూముపై జరిగిన నిర్మాణాను రైతుకు అప్పగించడం.
ా కాంట్రాక్టు ఫార్మింగ్‌ భూముపై కార్పొరేట్లకు హక్కు లేకుండా చేయడం.
ా కనీస మద్దతు ధర మరియు సేకరణ అము జరపడం.
ా ప్రస్తుతం విద్యుత్‌ చెల్లింపు విధానంలో రైతుకు ఎలాంటి మార్పు చేయకపోవడం,
ా ఢల్లీి పరిసర ప్రాంతాలో గాలి కాుష్యంపై రైతు కోరిక మేరకు పాటించడంపై 9 సమ స్యను వ్రాతపూర్వకంగా హామీ ఇస్తామని తెలిపారు. చట్టంలో ఉన్నవాటినే అము చేయని ప్రభుత్వం చట్టేతరంగా వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీు అము జరుగుతాయా అన్నది రైతు ప్రతినిధు అనుమానించాల్సి వచ్చింది. చట్టాను అము చేయని ప్రభుత్వాు ఉత్త హామీతో రైతాంగ ఉద్యమాన్ని విరమింప జేయటానికి చేసే మోసాన్ని గ్రహించిన రైతు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించారు.ఉద్యమం కొనసాగింపుకే నిర్ణయిం చుకున్నారు. ఎన్ని నెలు గడిచినా తాము పోరా టం కొనసాగిస్తామని ప్రకటించడం జరిగింది. డిసెంబర్‌ 12 మరియు 14వ తేదీన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాు జరపాని ఈపోరాట కమిటీ పిుపునిచ్చింది. అందుకు అన్ని రాష్ట్రాలో అన్ని సంఘాు సమాయత్తం అవుతున్నాయి. ఈఉద్య మానికి దేశంలోని 25ప్రధాన పార్టీు దాదాపు 500 రైతు సంఘాు, వ్యవసాయ కార్మిక సంఘా ు,మహిళ,యువజన,ఉద్యోగ,ఉపాధ్యాయ, సామా జిక సంఘాు మద్దతు ఇస్తున్నాయి. ఈ ఉద్యమం తో క్రమంగా బిజెపి ఒంటరి అయిపోయింది. బిజెపిని బపర్చిన శిరోమణి ఆకాలిదల్‌ శివసేన, హర్యానలోచి చౌతాపార్టీ, పార్లమెం ట్‌లో చట్టా ను బపర్చిన వైసిపి, తొగు దేశం పార్టీ రైతు కూడా ఉద్యమాన్ని బపరుస్తున్నారు. మేధా వు, కవు సమావేశాు జరిపి తమ నిరసనను తెలియ జేస్తున్నారు. ఇప్పటికే కార్మిక వర్గం దేశ వ్యాప్తంగా సంఫీుభావంగా ఆందోళన చేసింది. రానున్న పోరా టాకు కూడా మద్దతు తొపు తున్నది. చివరకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, కెనడాతో పాటు ఐక్య రాజ్య సమితి ఈఉద్యమాన్ని బపరుస్తూ తీర్మానాు పంపిం చింది. ఈ మద్దతుతో ప్రపంచంలో మోడీ ప్రభుత్వం ఏకాకీగా మారే పరిస్థితి ఏర్పడుతున్నది. చివరకు అమెరికాలోని రాష్ట్రాలో కూడా ఈ పోరాటానికి మద్దతుగా ర్యాలీు నిర్వహించారు. ఇంత జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ప్రతిష్టకుపోయి చట్టాను ఉప సంహరించుకోటానికి, విద్యుత్‌ బ్లిు ను ప్రవేశ పెట్టకుండా నిుపుద చేయటానికి అంగీకరిస్తూ ప్రకటించలేదు. పోరాటం చేస్తున్న రైతు సంఘాు అంబాని,ఆదాని ఉత్పత్తును బహిష్కరించాని పిుపు ఇచ్చారు. ఇప్పటికే ఈ పిుపు అములోకి వచ్చింది. కార్పొరేట్‌ సంస్థకు లాభాు కట్టబెట్టడానికి తెచ్చిన ఈచట్టాకు ప్రతి చోట నిరసన వ్యక్తం అవుతూనే ఉంది. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ విధానా వ్ల ఏటా దేశంలో12,600మంది రైతు ఆత్మ హత్య ు చేసుకుంటున్నారు. తాను ప్రకటించని పంట భీమా,వడ్డీమాఫీ,కిసాన్‌ సమ్మాన్‌,కృషి సించాయి యోజన పథకాతోబాటు మార్కెట్‌ జోక్యం పథకం విఫమైంది. మార్కెట్‌ జోక్యం పథకం కింద దేశ వ్యాప్తంగా రైతుకు మద్దతు కల్పించటానికి 20 20-21సంవత్సరానికి రూ.2,000కోట్లు కెటాయిం చడం గమనిస్తే ఈ ప్రభుత్వానికి రైతుపై ఉన్న ప్రేమను అర్థం చేసుకోవచ్చు. వీలైనంత త్వరగా వ్యవసాయ రంగాన్ని ప్రత్యక్షంగా కార్పొరేట్‌ సంస్థ కు అప్పగించేదిశగా విధానాు కొనసాగి స్తున్నారు.
ఫెడరల్‌ రాజ్యంగ విధానానికి విరుద్దం
భారత రాజ్యాంగం ‘’ఫెడరల్‌ రాజ్యాంగంగా’’ రూపొందిం చడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కరెన్సీ,దేశ రక్షణ ఎగుమతి, దిగుమతు, విదే శాంగ విధానంకే పరిమితం కావాలి. అడవు, వ్యవసాయం,విద్య తదితర కొన్ని అంశాను కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలో పెట్టినప్పటికీ ప్రధాన నిర్ణయం రాష్ట్రాలే విధానాు రూపొందించి అమ ు చేయాలి. ఇప్పటికే ఫెడరల్‌ రాజ్యాంగానికి విరుద్దంగా పన్ను విధానాన్ని మార్చి ఒకే దేశం ఒకే పన్ను పేరుతో జిఎస్టీ తెచ్చి రాష్ట్రాను ఆదా యాన్ని దెబ్బకొట్టింది. రిజర్వేషన్‌ ఉన్నటువంటి అంశాను తొగించే ప్రయత్నం చేసింది. విద్యా రంగాన్ని తన చేతుల్లోకి తీసుకోటానికి జాతీయ విద్య విధానం రూపొందించింది. ప్రస్తుతం విద్యుత్‌ శక్తిని కేంద్రం అధీనంలోకి తేవటానికి బ్లిు సిద్దంగా ఉంది. వ్యవసాయ రంగం నుండి పూర్తిగా రాష్ట్రా హక్కును తొగించడానికి 3వ్యవసాయ చట్టాను తెచ్చింది. ఒకేభాషా, ఒకేమతం,ఒకేసంస్కృతి పేరు తో ఫెడరల్‌ వ్యవస్థను విచ్ఛిన్నం చేయపూనుకుంది. అందులో భాగంగానే వ్యవసాయ రంగాన్ని కార్పొరే ట్లకు తాకట్టు పెట్టడానికి సిద్ధ పడిరది.గత6 సంవ త్సరా వ్యవసాయ విధానం వ్ల స్వయం పోషక త్వంగా ఉన్న భారత వ్యవసాయ ఉత్పత్తు రంగం నేడు దిగుమతుపై ఆధారపడిరది.1.40కోట్ల టన్ను వంటనూనొ, 50క్ష టన్ను పప్పు, 40క్ష టన్ను పంచధార,35క్ష బేళ్ళ పత్తి, ముతక ధాన్యా ఉత్పత్తు జీడి పప్పు తది తర వ్యవసాయోత్పత్తును రూ.3క్షకోట్ల మివ గవి ఏటా దిగుమతి చేసుకుం టున్నాం. చివరకు ఆహార ధాన్యాు కూడా దిగుమతి చేసుకునే దిశకు దేశాన్ని మార్చడానికి ఆహార ధాన్యాకు బదు ఎగుమతి ఆధారిత పంటు పండిరచటానికి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల పరం చేయబూను కుంది. ధనిక దేశాు భారత ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి దిగుమతుపై భారత దేశాన్ని ‘’మార్కెట్‌గా’’ చేయబూను కున్నారు. తమపథకంలో 30% విజ యం సాధించడం జరిగింది. దిగుమతు ఏటా 35క్షకోట్లు కాగా ఎగమతు 25క్ష కోట్లు వద్దనే ఉన్నాం. విదేశీ అప్పు భారం పెరగడానికి ఈ దిగుమతు తోడ్పడుతు న్నాయి. 1991లో దేశంలో వ్యవసాయోత్పత్తు స్వయం సమృ ద్దంగా ఉండడమే గాక ఎగుమతు చేసిన పరిస్థితి ఉంది. ఉదాహరణగా 365 క్ష టన్ను పంచాధార ఉత్పత్తి నుండి నేడు 250 క్ష టన్ను కు ఉత్పత్తి తగ్గింది. ఈ విధంగా అన్ని పంట ఉత్పత్తి జరిగింది. అన్నిదేశాలో గిట్టుబాటు ధరు ప్రకటించి రైతు ప్రయోజనాన్ని కాపాడు తున్న విధానానికి విరుద్దంగా కనీస మద్దతు ధర ను ప్రకటించి వాటిని కూడా అము జరపడం లేదు. ఆశాస్త్రీ యంగా నిర్ణయించిన కనీస మద్దతు ధరు రైతుకు పెట్ట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడిరది. ఇలాంటి విపత్కర పరిస్థితు లో 3చట్టాను తేవడంతో ప్రభుత్వ‘’కార్పొ రేటీ కరణ నగత్వం’’ బట్ట బయు అయ్యింది. టాటా, బిర్లా,అంబాని,అదాని,ఐటిసి,బేయర్‌ లాంటి సంస్థ ు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమకు అను కూమైన విధానాకు చట్టాను చేయిస్తున్నారు. ఒకవైపున ప్రజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున ప్పటికీ ప్రజ బాగు కొరకే చట్టాను చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్తున్నది. అలాంటప్పుడు ప్రభుత్వం అన్ని పక్షాతో సంప్రదించి చేయవచ్చుగదా? బ్లిుు ఆమోదించేటప్పుడు కూడా మూజు వాణి ఓటుతో బపర్చుకోవడం గమనిస్తే ప్రభుత్వం నియంతృత్వంగా చట్టాను చేస్తున్నది. దీనివ్ల ప్రజ యొక్క కోర్కెను అణగదొక్కడమే తప్ప మరొకటి కాదు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజ ఆకాంక్షకు అనుగుణంగా మూడు చట్టాను ఉపసంహ రించుకోవడంతోబాటు పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టబోయే విద్యుత్‌బ్లిును ఉపసం హరించు కోవాలి. ప్రతిపక్షాతో, రైతు సంఘా తో మరియు మేధావుతో చర్చు జరిపి వారిఅభిప్రాయం మేరకు విధానాు రూపొందించాలి. కేంద్ర ప్రభు త్వం గతంలో ప్రకటించిన విధానం 2020-22 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయటానికి తగు విధానాు రూపొం దించాలి. కనీస మద్దతు ధరు కాకుండా గిట్టుబాటు ధరు కల్పించాలి. ఆహార ధాన్యాను పేదకు సబ్సిడీపై అందించాలి తప్ప,రైతు ఆదాయాన్ని దెబ్బకొట్టరాదు. అన్ని పంటకు మద్దతు ధరు నిర్ణయించాలి. భీమా సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వమే అన్ని పంట ప్రీమియంను చెల్లించాలి.దేశప్రజకు అవస రమైన ఉత్పత్తునుపండిరచే విధంగా ప్రణాళికు రూ పొందించాలి. ఉత్పాదకతను పెంచటానికి పరి శోధన కేంద్రాను అప్‌డేట్‌ చేయాలి. పైకార్య క్రమాను అము జరపటానికి తగు విధానాు రూపొం దించాలి. నిర్భందంతో ప్రజా ఉద్యమా ను అణచడం ప్రభుత్వ ఉనికికే ప్రమాదం.
దేశమంటే? కార్పొరేట్లా-ప్రజలా?
ప్రస్తుతం సాగుతున్న రైతాంగ పోరా టం కేవం వ్యవసాయాన్ని కార్పొరేటీకరించ వద్దన్న డిమాండ్‌కో, కనీస మద్దతు ధర గ్యారంటీ కోసమో పరిమితం కాలేదు. అంతకుమించి నయా ఉదార వాదం ముందుకు తెచ్చిన ఆధిపత్య వాదానికి వ్యతి రేకంగా అది విస్తరించింది. ఈ పోరాటం వెనుక ఏవేవో ‘’కుట్రు’’ వున్నాయంటూ నరేంద్ర మోడీ వినిపి స్తున్న ‘కహానీ’ు మరింత వేగం పుంజు కుంటున్నకొద్దీ ఈ ఉద్యమం మరింత సమగ్రతను, స్పష్టతను, ప్రతిఘటనను పెంచుకుంటూ సాగు తోంది. ఈ సందర్భంగా ‘’జాతి’’ భావనపై జరుగు తున్న చర్చను నేను వివరిస్తాను. 17వశతాబ్దంలో యూరప్‌లో బూర్జువా వర్గం ఆవిర్భవించిన తర్వా త’జాతి’భావనస్పష్టతను సంతరించు కుంది.19వ శతాబ్దం రెండవ భాగంలో ఫైనాన్సు పెట్టుబడి పైచేయి సాధించాక ఈభావన ఒకప్రత్యేక ప్రాధాన్య తను పొందింది. రుడాల్ఫ్‌ హ్ఫిÛర్‌డిరగ్‌ చెప్పినట్టు ఫైనాన్సు పెట్టుబడి సిద్ధాంతం ‘’జాతి’’ భావనను ఒక గొప్ప ఆదర్శంగా ముందుకు తెచ్చింది. అదే సమయంలో ‘’జాతి’’ అంటే మరో అర్ధంలో ఫైనాన్సు పెట్టుబడిఅని, జాతి ప్రయోజనాు అంటే ఫైనాన్సు పెట్టుబడి ప్రయోజనాు తప్ప వేరేమీ కావని చెప్పింది. వివిధ సామ్రాజ్యవాద దేశాు తమలో తాము పోటీ పడిన సమయంలో ఆయా దేశా లోని ఫైనాన్సు పెట్టు బడు మధ్య పోటీని కాస్తా ఆయా జాతు ప్రయో జనా మధ్య పోటీగా చిత్రీకరించింది. ఈ విధంగా జాతి అంటే ఫైనాన్సు పెట్టుబడి అనే సిద్ధాంతం పర్యవసానంగా ఆజాతికి ప్రజకు మధ్య సంబం ధాన్ని తెగ్గొట్టింది. ప్రజ కంటే జాతి ఎంతో మిన్న అని, అందుచేత జాతి కోసం ప్రజు త్యాగాు చేయాని, ప్రజకు ఆరోగ్యం కల్పించడం, పౌష్టికాహారం గ్యారంటీ చేయడం వంటి అ్పమైన దైనందిన విషయాను ముందుకు తెచ్చి జాతి యొక్క ఔన్నత్యాన్ని, ఘనతను కించపర చకూడదని, జాతి ప్రయోజనాు ఎంతో ఉన్నతమైనవని ఈ సిద్ధాంతం చెప్పింది. మూడవ ప్రపంచ దేశాలో సామ్రాజ్యవాద వస పానకు వ్యతిరేకంగా విముక్తి కోసం సాగిన పోరాటాలో తలెత్తిన ‘’జాతి’’ భావన ఇందుకు పూర్తిగా భిన్నం. ఇక్కడ సామ్రాజ్యవాదం జాతి వ్యతిరేకమైనదిగా పరిగ ణించబడిరది. అది ప్రజను అణచివేస్తుంది కనుక జాతి వ్యతిరేకమైంది. అంటే ఇక్కడ జాతి అంటే ప్రజు. యూరప్‌లో ఫైనాన్సు పెట్టుబడి ముందుకు తెచ్చిన అర్ధానికి ఇదిపూర్తి విరు ద్ధం.1931లో కరాచీలో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ మహాసభలో ఆమోదించిన తీర్మానంలో గాని, ఇతర దేశాలోని అదేతరహా పత్రాల్లో గాని ప్రజ జీవన పరిస్థితును మెరుగు పరచడమెలా అన్న దానిపైనే ప్రధా నంగా చర్చ చేశారు. ప్రస్తుతం సాగుతున్న నయాఉదారవాదం ఒకవిధంగా ప్రతీ ఘాత విప్లవం వంటిది. ఇది మూడవ ప్రపంచ దేశాలో యూరో పియన్‌ తరహా ‘’జాతి’’భావనను ముందుకు తేవడమే గాక దానికి ఒకదైవత్వ క్ష ణాన్ని కూడా ఆపా దించింది. ప్రజ కన్నా జాతి ఎంతో గొప్పదని చెప్పింది.కార్పొరేట్‌-ఫైనాన్సు పెట్టుబడి ప్రయో జనాలే జాతి ప్రయోజ నాని చెప్పింది. భారత దేశంలో కూడా ఇదే జరిగింది. గతంలో సామ్రా జ్యవాదు మధ్య ఉండిన పోటీ ఇప్పుడు సద్దు మణిగింది కాని ఆనాడు ముందుకు తెచ్చిన జాతిభావన నేడుకూడా ఫైనాన్సు పెట్టుబడికి ఉపయోగ పడుతోంది. కార్పొరేట్లు-ఫైనాన్సు పెట్టుబడి చేతు ల్లో గనుక పెత్తనం పెడితే తద్వారా దేశంలో యావన్మందికీ ఉపయోగపడేలా ఆర్థికాభివృద్ధి జరుగుతుందని నయా ఉదారవాద విధానపు తొలి రోజుల్లో ప్రచారం చేసి చాలామందిని నమ్మించారు. కాని క్రమేణా నయా ఉదారవాద విధానాు సంక్షోభానికి దారితీయ సాగాయి. ఈ పరిస్థితుల్లో పాత పద్ధతిలో నమ్మించడం సాధ్యప డడం లేదు.
ప్రస్తుతం కొనసాగుతున్న రైతు పోరాటం కార్పొరేట్‌-ఫైనాన్సు పెట్టుబడి శక్తు ‘’జాతి’’ భావనను సవాు చేస్తోంది. జాతి అంటే ఆ దేశం లోని శ్రమజీవులేనన్న ప్రత్యామ్నాయ భావనను ముందుకు తెచ్చింది. ఆ మూడు చట్టాూ రైతుకు మేు చేస్తాయని మోడీ చెప్పిన వాదనను పోరాటం తిరస్కరించింది. తద్వారా నాయకుడికి ఏది మంచో బాగా తెసునన్న కార్పొరేట్‌-హిందూత్వ శక్తు కీక వాదనను దెబ్బతీసింది. రైతు ఏం చెప్తు న్నారో వినిపించుకోకుండా, వారితో అర్ధవం తమైన సంప్రదింపు చేపట్టకుండా ఉన్నందుకు చాలా మంది కేంద్రాన్ని విమర్శిస్తున్నారు.
నిరసనపై నిర్బంధం
కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికా రంలోకి వచ్చాక ప్రజావ్యతిరేక విధానాకు తెగ బడిరది. ఎక్కడికక్కడ నిరసనల్ని అణచివేసే కుటి వ్యూహాల్ని అము చేస్తున్నది. ఆర్టికల్‌ 370ని రద్దు చేసి కాశ్మీర్‌ని జైుగా మార్చింది. నిరసనకారు చూపుని హరించే బుల్లెట్లని ప్రయోగించింది. ప్లిు,యువకు ఎంతోమంది పోలీసు దాష్టీకం వ్ల కళ్ళు లేని వారయ్యారు. కాశ్మీర్‌లో మానవ హక్కు ఉ్లంఘన మీద ఐక్యరాజ్యసమితి, అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఆందోళన వ్యక్తం చేశాయి. జమ్మూ కాశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని హరించే వ్యవహార సరళి అంతటితోనే ఆగలేదు. ఈమధ్యన అక్కడి భూముల్ని కొనుగోు చేయడానికి బయటివారిని అనుమతిస్తూ ఉత్తర్వు జారీచేశారు. ఆర్టికల్‌ 370 అములో ఉన్న కాలాన జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలోని భూముల్ని బయటివారు కొనడానికి వీల్లేకుండా ఉండేది. ఆ రాష్ట్ర స్వయంప్రతిపత్తికి ఆర్టికల్‌ 370అండగా ఉండేది. ఇపుడు ఆనిబంధన లేకపోవడంతో జమ్మూకాశ్మీర్‌లోని అందమైన నేలపై కార్పోరేట్ల కన్నుబడిరది. ఈదుర్మార్గాన్ని నిరసించడానికి వీల్లేకుండా ఎక్కడికక్కడ అరెస్టు, నిర్బంధాు, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపా పేరిట అణచి వేతకు ప్పాడటం నిత్యకృత్యమయింది. ప్లినీ, మహిళనీ, వృద్ధునీ సైతం పాశవిక నిర్బంధానికి గురి చేస్తున్నారు. ఈ దారుణాల్ని ప్రశ్నించిన కాశ్మీర్‌ రాజకీయ నాయకుల్ని, కార్యకర్తల్ని జైళ్ళలో పెట్టారు. అయినా కాశ్మీర్‌లో రోజూ ఎక్కడోచోట ఏదో ఒక రూపంలో నిరసనప్రదర్శను జరగడం సాధారణ మైంది. వీటి మీదఅణచివేత అమానుషంగా పరిణ మించిన నేపథ్యంలోనే హక్కు సంఘా వారు, ప్రజాస్వామికవాదు బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యల్ని అభిశంసించారు.
కొనసాగుతున్న ఆందోళను-మహారాష్ట్ర లాంగ్‌
మహారాష్ట్రలోని నాసిక్‌ నుంచి వేలాది మంది రైతుతో కూడిన వాహన జాతా డిసెంబర్‌ 25 నుంచి పోరాటం సాగుతున్న రైతు పోరాట స్థలి షాజహాపూర్‌కు చేరుకుంది. అంతకుముందు జాతాగా వస్తున్న రైతుకు ఎఐకెఎస్‌తో పాటు అనేక ప్రజా సంఘా నేతు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల మేర వాహన జాతా, రెండు కిలోమీటర్ల భారీ ర్యాలీ తర్వాత షాజాహాపూర్‌ వద్దకు చేరుకున్న మహారాష్ట్ర రైతుకు అక్కడి రైతు ఘనస్వాగతం పలికారు. అయితే ఇదే సమయంలో మహారాష్ట్ర రైతుకు పోలీసు అడ్డంకు సృష్టించారు. భారీస్థాయిలో హర్యానా పోలీసు,రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ మోహ రించాయి. పెద్దఎత్తున బారీకేడ్లును ఏర్పాటు చేశా రు. భారీట్రక్కుల్లో మట్టినింపిరోడ్లకు అడ్డంగా పెట్టారు. పెద్దపెద్దరాతి బండను, సిమెంట్‌ దిమ్మ ను ఏర్పాటు చేశారు. (ఎఐఎడబ్ల్యుయు), విపి సాను,నితీష్‌ నారాయన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ), ప్రతిభా షిండే (మహారాష్ట్ర)తదితయిఉన్నారు. దేశ రాజధాని సరిహద్దుల్లో జరుగుతున్న రైతు పోరాటం మరింత ఉధఅతమవుతోంది. వేలాది మంది రైతు కొత్తగా వచ్చి ఉద్యమంలో భాగ స్వామ్యం అవుతున్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రా నుంచి వేలాది మంది రైతు వచ్చి ఉద్యమంలో చేరారు. సుమారు 45రోజు నుంచి ఉద్యమం కొనసాగింది. రైతు రిలే నిరా హార దీక్షు కూడా కొనసాగుతున్నాయి.

-టి.సాగర్‌/గుడిపాటి

Justice K Ramaswamy and Samata judgement

Justice K Ramaswamy, former Supreme Court Judge who passed away on March 6, was popularly known for one of his landmark Judgements known as Samata Judgement that upheld the rights of tribals on their lands in tribal areas. The State government, in a befitting manner, conducted his funeral with all respects to the departed soul.

Samata was a non-governmental organisation that worked for the rights of the tribal people as it found them being alienated from their lands and exploited by non-tribal people and the state, in contravention of the Fifth Schedule of the Constitution and various Central and State government laws. After a prolonged struggle, it approached courts. The case it filed in the then Andhra Pradesh High Court in 1993 against the then State government was dismissed. Then, Samata filed a Special Leave Petition in the Supreme Court. After a four-year legal battle, it won.

Read more

Rajasthan’s phosphate mines deprive villagers of land, livelihood, health

Mongabay | October 28, 2020

  • Udaipur’s phosphate mines have been causing miscarriage in women of surrounding villages, have destroyed farming and forests, claims locals.
  • Health officials note that there’s so much dust in the air that residents of villages nearby mines develop diseases such as tuberculosis and lung cancer.
  • However, the government firm operating the mine denies any negative impact.

“Yeh toh bhagwan ki marzi hai, sahab. Pichhle janam ke kuch paap honge jo iss janam main saamne aa rahe hain (It’s all god’s will. Maybe we had sinned in our past lives, for which we are suffering now),” said Lohari Meena, a resident of Jhamarkotra village, 22 kilometres from Udaipur in Rajasthan, while explaining her two miscarriages.

Read more

What is that Tamil Man Swami doing in Jharkhand?

Stan Swami arrested at 83 years of age

What is that Tamil man Swami doing in Jharkhand? That was the question asked by a former agent of the Research and Analysis Wing, RAW, in a debate on one of the national screaming news channels on a Wednesday morning when they were discussing Kashmir, Pakistan’s ISI, India’s Urban Naxals and the women and men arrested by the National Investigation Agency.

The scowling former Lt Colonel’s argument was that anyone working with India’s Adivasis, Dalits and the dispossessed is a foreign agent conspiring to overthrow the government of India’s elected prime minister, Narendrabhai Damodardass Modi.

Read more

Why India Needs Scheduled Tribes to Educate its Future Judges

The recent five-judge bench Supreme Court judgment in Chebrolu Leela Prasad Rao and Ors v State of AP and Ors, shows us once again how little the 5th Schedule of the Indian constitution which is meant to protect adivasi rights is understood.

The reasoning in the judgment – which struck down an Andhra Pradesh government order from 2000 providing 100% reservation for Scheduled Tribe teachers in Scheduled Areas of the state – moves perilously close to dismantling the entire edifice of the 5th Schedule.

If 100% reservation for teaching jobs is not permissible, the next step will be for someone to argue against the ban on alienation of tribal land, or overturn the Samata judgment prohibiting mining leases being given to non-tribals in 5th Schedule Areas in undivided Andhra Pradesh. After all, both these ‘discriminate’ against non-tribals. As non-adivasis from other districts flood scheduled areas leading to clear demographic change, the clamour to do away with the protective provisions of the 5th Schedule is only getting louder.

Read more

ఎన్నికల కోలాహలం నిఘా పటిష్టం

ఏఫ్రిల్‌ 11న జరిగే పోలింగ్‌ సమయం మరింత దగ్గర పడుతుండటంతో పోలీసులు పటిష్టమైన బందోబస్తును సిద్ధంచేశారు. ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఖర్చుపై నిఘా బృందాలు నిఘా ఉంచాయి. అక్రమ మద్యం, డబ్బు పంపిణీ, ఓటర్లకు తాయిలాలు అనుమతి లేకుండా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంపై నిఘా బృందాలు కన్నెసి ఉంచాయి. ఎన్నికల ప్రచార ఘట్టం దగ్గర పడుతంఉడటంతో గ్రామాలు, పట్టణాల్లో అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల నియమావళికి లోబడి ప్రవర్తిస్తున్నారా, సమావేశానికి ఎంత వెచ్చిస్తున్నారు అనే విషయాలను లెక్క తేల్చడానికి తనిఖీ బృందాలు వెంటాడుతున్నాయి. తాయి లాలపై ప్రత్యేక దృష్టి ఆయా పార్టీల అభ్య ర్థులు ఓటర్లకు తాయిలాల పంపిణీపై నిఘా బృందాలు ప్రత్యేకదృష్టి సారిం చాయి. డబ్బు, మద్యం పంపిణీపై ఓవైపు సివిల్‌ పోలీసులు, మరోవైపు ఎక్సైజ్‌శాఖ సిబ్బంది విస్త ృతంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో వివిధ విభాగాలకు చెందిన 15వేల మంది పోలీసులు ఉండగా, మరో 10,000 మంది సెంట్రల్‌, స్టేట్‌ పారామిలటరీ బలగాలు రానున్నాయి. ఆరు ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ బృందాలు పనిచేస్తుండగా, అనుమా నస్పదమైన ప్రతి చోట పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని ఆపి విస్తృతంగా తనిఖీచేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రూ.కోట్లాది రూపాయల నగదును పట్టుకున్నట్లు అధికారులు వెల్లడిరచారు.
సమస్యాత్మక గ్రామాల్లో అవగాహన రాష్ట్రంలో ఉన్న సమస్యాత్మక గ్రామాలపై ఆయా జిల్లాల ఎస్పీలు, నగర పోలీస్‌ కమిషనర్లు, ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటుచేసి ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా యువత గొడవలకు వెళ్లకుండా వారిని చైతన్యం చేస్తున్నారు. ప్రత్యేకంగా పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటుహక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు సూచిస్తున్నారు. అభ్యర్థుల సమావేశం, ప్రచారాలపై ఎస్పీ ఎప్పటికప్పుడు కిందస్థాయి అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఆయా జిల్లాలో ఉన్న పోలింగ్‌ కేంద్రాలువద్ద కూడా నిఘా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. ఎస్పీ నేతృ త్వంలో పలు గ్రామాల్లో కార్డెన్‌సెర్చ్‌ నిర్వహిస్తూ అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బ్యాంకు లావాదేవీలపై నజర్‌ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బ్యాంకుల్లో వివిధ లావాదేవీలు జరిపే వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. నామినేషన్ల పర్వం ముగి యడంతో ఓటర్లను ప్రలోభ పెట్టేం దుకు రాజకీయ పార్టీల నాయకులు వివిధ మార్గాల్లో ప్రయత్నాలు ఆరంభించారు. అభ్యర్థుల ఎత్తుగడలను అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది.ఖాతాల్లో ఒకేసారి నగదు జమకావడం, ఎక్కువ లావాదేవీలు నిర్వహించడం తదితర వాటిపై నిఘా ఉంచారు. రూ.50వేలు దాటితే పాన్‌కార్డు నంబర్‌ తప్పనిసరి అడుగుతున్నారు. ముఖ్యంగా రూ.లక్షలకు మించిన లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఆయా పార్టీలు డబ్బు సంచిలు కదలాడుతున్నాయి. ఎన్నికల బూత్‌ స్థాయి కన్వీనర్‌లకు చేరుతున్నాయి. నిఘా యంత్రాంగం దీనిపై దృష్టి కేంద్రీక రించారు. నిఘా కెమెరాలతో ఎప్పట్టికప్పుడు చిత్రీకరిస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం, రాజమండ్రి, కడప, కాకినాడ, కర్నూల్‌, గుంటూరు, విజయవాడ, మంగళగిరి వంటి ప్రాంతాల్లో క్షుణ్ణంగా తణిఖీలు చేస్తున్నఆరు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే ఓటర్లను చైతన్యవం తులను చేయడానికి సామాజిక సేవా బృందాలు పనిచేస్తున్నాయి. అలాగే సమస్యాత్మకమైన పోలింగ్‌ బూత్‌ల వద్ద ఘట్టి నిఘా ఏర్పాటు చేయడానికి ప్రణాళి కలు రూపొందించారు. యువత భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు జిల్లాలో ఉన్న సమస్యాత్మక గ్రామాల్లో ఓటర్లకు అవగాహన కల్పించాం. ఓటర్లు ప్రలోభా లకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఒకరి సమావేశాలు జరిగే సమయంలో మరొకరు అక్కడి వెళ్లి గొడవలు చేస్తే చర్యలు తప్పవు. ముఖ్యం గా యువత గొడవలకు దిగి వారి భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు. డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా చెక్‌పోస్టులు ఏర్పాటుచేశామని పోలీసులు పేర్కోన్నారు.

1 8 9 10 11