భాగస్వామిని ఎంచుకునే హక్కు లేదా?

భారత రాజ్యాంగ రచనా కమిటీలో ఇద్దరు మహిళా సభ్యులు హన్సా మెహతా, రాజ్‌ కుమారి అమృత్‌ కౌర్‌ కూడా ఉన్నారు. ప్రతి మహిళ తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కును, లేదా కనీసం వివాహ మాడే వ్యక్తిపై తన ఇష్టాయిష్టాలను తెలిపే హక్కును రాజ్యాంగం లోని ప్రాథమిక హక్కులలో చేర్చాలని వారు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు కమిటీ లోని మిగతా సభ్యులు మద్దతు ఇవ్వలేదు. అందువల్ల రాజ్యాంగ పరిషత్తు ముందుంచిన తుది రాజ్యాంగ ప్రతిలో ఈ హక్కును చేర్చలేదు.
ఏడు దశాబ్దాల తర్వాత కూడా, మహిళలు తమకు నచ్చిన ఇతర కుల, మతా లకు చెందిన వ్యక్తులను ఎంపిక చేసుకోలేని పరిస్థితులను వారి కుటుంబాలే కల్పిస్తూ సంకుచితమైన ఆజ్ఞలను జారీ చేస్తున్నాయి. వారి జీవిత భాగస్వా ములపైన కిడ్నాప్‌, అత్యాచారం,‘లవ్‌ జిహాద్‌’ కేసులు మోపి జైలుపాలు చేస్త్తున్నారు. ఒకవేళ ప్రేమ జంట ప్రతిఘటిస్తే…స్వంత కుటుంబ సభ్యుల చేతిలోనో లేక ఆగ్రహంతో ఉన్న గుంపు దాడు లలోనో హత్యకు గురవుతున్నారు. ఇటీవల కాశ్మీర్‌ కు చెందిన సిక్కు యువతులు కొందరు ముస్లిం యువకులను వివాహం చేసుకొని, ఇస్లాం మతం లోకి మారాలనుకోవడంతో కాశ్మీర్‌ లోయలో ఒక ప్రమాదం ముంచుకొచ్చింది. పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీదళ్‌ సిక్కు నాయకులు ఇవన్నీ ‘’లవ్‌ జిహాద్‌’’ నేరపూరిత చర్యలని ఆగ్రహించారు. అమాయక హిందూ, సిక్కు బాలికలను వెంబడిస్తున్నారని ముస్లింలపై ద్వేషపూరితంగా నిందించడం కొత్తేమీ కాదు. ముస్లిం యువకులు గల్ఫ్‌ లో సంపాదించిన డబ్బుతో క్రైస్తవ బాలికలను వంచించి ఇస్లాం మతం లోకి మార్చే ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నారని ఆరోపిస్తూ కేరళ క్యాథలిక్‌ బిషప్‌ కౌన్సిల్‌ మొదట ‘లవ్‌ జిహాద్‌’ అనే పదాన్ని ఉపయోగించింది. ఈ భావావేశ ద్వేషభావాన్ని మొత్తం హిందూత్వ సంస్థలు వెంటనే స్వీకరించాయి. పైకి నదురుగా కనిపించే ముస్లిం యువకులను ఇలాంటి లవ్‌ జిహాద్‌ కోసం ఇస్లాం మత విశ్వాసాలను బోధించే కళాశాలల్లో జాగ్రత్తగా ఎంపిక చేశారని, హిందూ యువతులను ప్రేమ సంబంధాల్లోకి లాగి, ప్రలోభపెట్టే శిక్షణను వారికిస్తారనీ, వారికి అమ్మాయిలను ఆకర్షించడానికి మోటారు వాహనాలు, స్మార్ట్‌ ఫోన్లు, తేలికగా డబ్బు సంపాదించే ఏర్పాట్లు చేస్తారని హిందూత్వ సంస్థల వాదన. హిందూ యువతులతో సంబంధాలు ఏర్పరచుకునే ముస్లిం పురుషుల హృదయాల్లో ప్రేమ లేదని, కేవలం ఇస్లాం మతంలోకి మార్చేందుకే వారిని మభ్యపెట్టి పెళ్ళిళ్ళు చేసుకుంటారని హిందూత్వ వాదులు చెబుతున్నారు.
ఇటీవల సిక్కు మహిళలను (కేరళలో వారి క్రైస్తవ సోదరీమణులు, దేశంలో అనేక ప్రాంతాల్లో హిందూ సోదరీమణుల తరువాత) లవ్‌ జిహాదీలుగా ఆరోపణలు ఉన్న వారి మత ప్రచారంలోకి లాగారు. ‘లవ్‌ జిహాదీ’ల బాధితులుగా గుర్తించిన సిక్కు మహిళలలో, పద్దెనిమిది సంవత్సరాల మన్‌మీత్‌ కౌర్‌ కూడా వుంది. ఆమె ఇస్లాం మతంలోకి మారి,29 సంవత్సరాల ముస్లిం యువకుడు షాహీద్‌కు దగ్గరైంది. వారు రహస్యంగా పెళ్లి చేసుకు న్నారని రుజువు చేసే నిఖా ధ్రువపత్రాలు ఉన్నప్పటికీ…పోలీసులు వారిని గుర్తించి, వారు చెప్పే విషయాలను నమోదు చేయడానికి శ్రీనగర్‌ జిల్లా కోర్టుకు తీసుకెళ్ళారు. పోలీసు చర్యలు మన్‌మీత్‌ కౌర్‌ కోర్టులో చెప్పిన విషయాలను నిర్థారించడం కష్టమే అయినప్పటికీ, ఆమె ఇస్లాం మతం లోకి మారడం, షాహీద్‌ ను పెళ్లి చేసుకోవడం స్వచ్ఛందంగానే జరిగాయని అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆమె సంతకాలు చేసిన అఫిడవిట్‌ లు షాహీద్‌ కుటుంబం దగ్గర వున్నాయి. చివరికి ఆమె కోర్టు నుండి బయటకు వచ్చేటప్పుడు, ఆమెను షాహీద్‌ కుటుంబంతో వెళ్ళనివ్వలేదు. ఆమెను లాక్కెళ్లి ఒక వాహనంలో పడేసి, షాహీద్‌ ను పోలీసు కస్టడీ లోకి తీసుకున్నారు. మతాంతర వివాహాలకు వ్యతిరేకంగా స్థానికంగా చెలరేగిన దౌర్జన్యాలను పురికొల్పింది ఢల్లీి సిక్కు గురుద్వారా యాజమాన్యం పెద్ద, శిరోమణి అకాలీదళ్‌ కు చెందిన మంజీందర్‌ సింగ్‌ సిర్షా అని చాలా నివేదికలు తెలియజేస్తున్నాయి. మన్‌మీత్‌ కౌర్‌ వ్యవహారం లవ్‌ జిహాద్‌ కు ఒక ఉదాహరణ అని, ఆమెను తుపాకీతో బెదిరించి, కిడ్నాప్‌ చేసి అరవయ్యేళ్ళ ముస్లిం వృద్ధునితో పెళ్లి చేశారని గతంలో బిజెపి లో ఉన్న సిర్షా ఆరోపించాడు. మూడు రోజుల తరువాత, మన్‌మీత్‌ కౌర్‌ తన మొదటి భర్తతో విడాకులు కాకుండానే ఒక సిక్కు యువకునితో దక్షిణ కాశ్మీర్‌ లోని పుల్వామా గురుద్వారాలో పునర్వివాహం చేశారు. సిర్షా ముందుండి ఈ పెళ్ళి జరిపించినట్లు వార్తలందాయి.
ఆ ముస్లిం యువకునితో తనకున్న అనుబంధాన్ని గురించి హైకోర్టులో మన్‌మీత్‌ కౌర్‌ ఏం చెప్పిందనేది అధికారికంగా నిర్థారణ కాలేదు. అయినప్పటికీ, మరో మహిళ దన్‌మీత్‌ కౌర్‌ అలాంటి సమస్యతోనే ఒక సెల్ఫీ వీడియోను బయట పెట్టింది. 30 ఏళ్ళ తన భర్త ముజఫర్‌ తనను బెదిరించి కిడ్నాప్‌ చేశాడని ఆరోపణలు చేస్తూ ఆమె తల్లిదండ్రులు పోలీస్‌ కేసు పెట్టారు. దానిని ఖండిస్తూ, తాను అన్నీ తెలిసిన విద్యావంతురాలునని ఆమె వీడియోలో తెలిపింది. ‘నా హక్కులు నాకు తెలుసు. మంచి చెడుల మధ్య ఉన్న తేడా తెలుస’ంది. ఆమె జూన్‌ 6న ఇల్లు వదిలి, తన కోసం వెతకొద్దని తన తల్లిదండ్రులకు తెలిపింది. కానీ ఆరు గంటల వ్యవధిలోనే వారు పోలీసు ఫిర్యాదు చేయడంతో ఆమెను పెట్టుకొని వారికి అప్పగించారు. ఆమె 2012 లోనే స్వచ్ఛందంగా ఇస్లాం మతం లోకి మారి, 2014లో తన తోటి విద్యార్థి ముజఫర్‌ ను పెళ్లి చేసుకున్నానని రుజువు చేసే పత్రాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఆమె భర్త శ్రీనగర్‌ సెంట్రల్‌ జైలులోనే ఉన్నాడు.
తన ‘’సిక్కు బిడ్డలను’’ కిడ్నాప్‌ చేసి, బలవంతంగా ఇతర మతాలకు చెందిన వారితో పెళ్ళి జరిపించడం విస్మయానికి గురిచేసిందని శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌ అంటున్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ లో మాదిరిగా బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా చట్టాలు చేసి, అమలు చేయాలని బిజెపి అభిప్రాయపడిరది. కానీ, సిక్కు మహిళలు తమకు నచ్చిన వ్యక్తిని ఎంపిక చేసుకునే క్రమంలో… వారి కుటుంబ సభ్యులు, మత, రాజకీయ సంస్థలు, కోర్టులు, పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల…జమ్మూ, కాశ్మీర్‌ లో అనేక మంది మహిళలు బహిరంగంగా విచారాన్ని వ్యక్తం చేశారు.
మహిళ మతానికి చెందిన ఆస్తి కాదు
‘మహిళలను ఒక ‘’మతానికి చెందిన ఆస్తిగా’’ పరిగణిస్తున్నారు. 21వ శతాబ్దంలో కూడా మహిళలకు అండగా నిలిచే సంస్థలేమీ లేవు. పితృస్వామిక వ్యవస్థ చెప్పిన విధంగా మహిళలను మారకానికి ఉపయోగించే ఒక సరుకుగా చూస్తున్నారు’ అని జమ్మూ, కాశ్మీర్‌ కు చెందిన ఇఫ్రా జాన్‌ పేర్కొంది. పోలీసులు, కోర్టులు మహిళల ప్రాథమిక హక్కులను కాపాడే స్థితిలో లేవు. మగవారు కోరుకున్న విధంగానే ఆ వ్యవస్థలు పని చేస్తున్నాయి.
ఇటీవల కాలంలో సిక్కు మత పెద్దల మార్గదర్శకత్వంలో జరిగిన చర్యలను ఖండిస్తూ రచయితలు, మేధావులు, కవులు, కళాకారులు, సాంస్కృతిక కార్యకర్తలు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఒక వ్యక్తితో స్నేహం చేసే, ప్రేమించే, పెళ్లి చేసుకునే హక్కు, ఒక మత విశ్వాసాలను ఆచరించే హక్కులు విడదీయరానివి. ఇవి మహిళలకు కూడా సమానంగా చెందుతాయి. తప్పుడు వార్తలపై ఆధారపడే, మతాల మధ్య ద్వేష భావాన్ని, అనుమానాన్ని పెంచే ‘లవ్‌ జిహాద్‌’ లాంటి కుట్రపూరిత సిద్ధాంతాలను తిరస్కరిస్తున్నాం. దేశంలో ఏ ప్రాంతంలోనైనా మత మార్పిడి వ్యతిరేక చట్టాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అన్నారు. ‘వాస్తవానికి మత మార్పిడి వ్యతిరేక చట్టాన్ని ఇతర మతాలకు చెందిన మహిళలను పెళ్లాడిన ముస్లిం యువకులను నేరస్తులను చేసేందుకు ఉపయోగిస్తున్నారు. కానీ అటువంటి చట్టాలకు నిజమైన బాధితులు మహిళలే. ఎందుకంటే ఆ చట్టం వారి జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కును ఉల్లంఘిస్తుందని’ వారు అన్నారు. తమ జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకునే వారికి తమ సంఫీుభావాన్ని ప్రకటించి, మత పెద్దల బాధితులకు, కుటుంబాలకు మద్దతుగా నిలుస్తామని ప్రతినబూనారు.-(‘ది హిందూ’ సౌజన్యంతో),హర్ష మందిర్‌