మన నైతిక విలువలెక్కడ?

ప్రతి సమాజంలో నైతిక నియమాలు (ఎథిక్స్‌) సమాజ మనుగడను ప్రత్యక్షంగా శాసిస్తాయి. సమాజంలోని ప్రతి వ్యక్తి నైతికతను పాటిస్తే సమాజం లో ఎలాంటి సంఘర్షణ, అలజడి, ఆందోళన కనపడదు. నైతిక ప్రవర్తనలు మంచి నడవడిని, సమాజ నియమాల పట్ల నమ్మకాన్ని కోరుకొంటాయి. అందువల్ల సమాజం లో నైతిక నియమాలు అనేక ప్రధాన సామాజిక నియం త్రణ సాధనాలుగా వ్యవహరిస్తాయని చెప్పవచ్చు.
ప్రస్తుతం మనం నైతిక విలువలు కన పడకుండా పోతున్న సమాజంలో ఉన్నాం.ఈ సమాజంలో మానవత్వంతో వ్యవహరించడం ఆడ,మగ అందరికీ అసాధ్యం అయిపోతోంది. ప్రభుత్వం సంగతిచూస్తే అది నిష్పక్షపాత వైఖ రితో,న్యాయబద్ధంగా, ధర్మంగా వ్యవహరిం చడం అనేది ఎప్పుడో మరిచిపోయింది. ఇక నాయకులు ప్రజలకు చేసిన వాగ్దానాలను నిలుపుకోవడంలో విఫలమౌతున్నారు. నిజానికి వాళ్ళు తమ వాగ్దా నాలను అమలు చేస్తారని ఎవరూ ఆశించడం లేదుకూడా. ఏ మాత్రం జంకు,గొంకు లేకుండా, మనస్సాక్షి అనేదే లేకుండా‘మాదే మెజారిటీ గనుక మా మాటే శాసనం’ అనే విధానాన్ని ప్రభుత్వం ఆచరిస్తోంది. ప్రాచీన నిర్మాణాలను అమూల్యమైన చారిత్రక సంపదగా పరిగణించి పరిరక్షించాల్సి నది పోయి వాటిని ఉంచాలా, కూల్చాలా అన్నది వాటిని నిర్మించిన వారి మతాన్ని బట్టి నిర్ణయిస్తు న్నారు. ఆఫీసులలో పని చేసేవారి పట్ల, ఇళ్ళల్లో నివసించేవారి పట్ల ఎలాంటి వైఖరి ఉండాలన్నది కూడా అదే మాదిరిగా నిర్ధారిస్తున్నారు. ప్రభు త్వాన్నిగాని,ప్రభుత్వపుదన్నుతో రెచ్చిపోతూ విద్వే షాన్ని రెచ్చగొట్టే ప్రదర్శనల్ని నిర్వహిస్తున్న అసాం ఘిక శక్తుల్ని గాని నువ్వు ప్రశ్నిస్తే ఇక అంతే. నువ్వే వాళ్ళకి ప్రధానలక్ష్యం అయిపోతావు. మారుమాట్లాడకుండా తల ఒగ్గడమే నేడు అనుస రించాల్సిన పద్ధతి. మానవత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటివి ఇప్పుడు డీప్‌ ఫ్రీజ్‌లో ఉన్నాయి. భవిష్య త్తులో వాటిని బైటకు తెచ్చి నడిపించేదెన్నడో తెలీదు.
మారిపోతున్న విలువలు
యోగితా భయానా ఒక సామాజిక సేవకురాలు. గురుగ్రాంలో కొందరు గూండాలు ఒక ముస్లిం వ్యక్తికి చెందిన దుకాణాన్ని తగులబెడితే, దానిని తిరిగి నిర్మించుకోడానికి సహాయం చేసిందామె. ఆ సమాచారాన్ని, ఆమెకు కృతజ్ఞతలు తెలియ జేస్తున్న ఆదుకాణదారుడి వీడియో క్లిప్పింగ్‌ని సోషల్‌ మీడియాలో పెట్టారు. వెంటనే యోగితకు మొదలయ్యాయి ట్రోలింగ్‌ వేధింపులు. నష్టపోయిన వాళ్ళు మరో50,60 మంది ఉన్నారు, వాళ్ళం దరికీ కూడా పోయి సాయం చెయ్యమం టూ వెటకారంగా కొందరు కామెంట్స్‌ పెట్టారు. ఆమె ఇంటి చుట్టుపక్కల హిందూ మహిళలు ఇంకా ఉన్నారు కదా,వాళ్ళకి లేనిబాధ నీకెందుకు? అం టూ మరి కొంతమంది కామెంట్‌ చేశారు. బహు శా ఒకపది,పదిహేనేళ్ళ క్రితం ఇటువంటి సహా యాన్నే చేసివుంటే,ఆకాలంలో యోగితకు అభినం దనల పరంపర ఎదురై వుండేది. మత సామర స్యాన్ని నిలబెట్టినందుకు గౌరవం దక్కేది. కాని, ఇప్పుడాపరిస్థితి లేదు.మారిపోయింది.పాత కాల పు విలువలు ఇప్పుడులేవు.మతవిశ్వా సాలు వేరు వేరుగా ఉన్నా, అందరమూ కలిసి బతుకుదాం అన్న ఐక్యతాస్ఫూర్తిలో విశ్వాసం లేనివాళ్ళు ఇప్పు డు కోట్లలో తయారయ్యారు. ఇప్పుడు ఎవరికి వారే. పక్కవాడు ఎలాపోయినా పట్టించుకోన వసరం లేదు అన్న ధోరణి బాగా పెరిగింది. హర్యానా లోని నువాలో అనిస్‌ అనే వ్యక్తి ముగ్గురు హిందూ యువకులకు తన ఇంట రక్షణ కల్పించి వాళ్ళని వెంట తరుముతున్న మూకల నుండి కాపాడాడు.తమ ప్రాణాలు నిలబెట్టినందుకు ఆ ముగ్గురూ అతని పట్ల కృతజ్ఞత తెలిపారు. కాని, ఆమర్నాడు అనిస్‌ ఇంటిని బుల్‌డోజర్‌ తో నేల మట్టం చేసేశారు. హర్యానాలో బుల్‌డోజర్లతో విధ్వంసం చేయడం ఇప్పుడు పరిపాటి అయి పోయింది. ఆ విషయం మీద పంజాబ్‌-హర్యానా హైకోర్టు జోక్యం కల్పించుకుని ఈవిధంగా చెప్పిం ది.’ముందస్తుగా నోటీసులు ఏవీ జారీ చెయ్య కుండా,కూల్చివేతకు అనుమతించే ఉత్తర్వులు ఏవీ లేకుండా శాంతి, భద్రతల రక్షణ పేరుతో ఇలా భవనాలను కూల్చివేయడం తప్పు. శాంతి భద్రత ల సమస్య ఒక సాకుగా ఉపయోగించుకుని ఒకే మతానికి చెందిన వారి ఇళ్ళను కూల్చివేయడం జరుగుతోందా అన్న అంశాన్ని కూడా చూడాలి. కొన్ని జాతుల సమూహాలను నిర్మూలించే విధా నాన్ని ప్రభుత్వం అనుసరిస్తోందా అన్నది కూడా పరిశీలించాలి.’’
సమాజంలో నైతిక విలువల పతనం ఇదివరకే మొదలైంది.కాని మరీ ఇంత అథమ స్థితికి చేరు కోవడం గతంలో లేదు. అతి నీచంగా, పబ్లిక్‌గా ఆడబిడ్డల్ని మణిపూర్‌ వీధుల్లో అవమానపరచిన వైనం ఆ అథమ స్థితికి సూచన కాక ఇంకేమిటి? ఆ ఉదంతంపై అధికారంలో ఉన్న వారి స్పందన సంగతేమిటి?అది దేన్ని సూచిస్తోంది? ఆ బాధితు లను ఆ పాశవిక మూకలకు అప్పజెప్పినది ఆడ వాళ్ళేనంటూ ఆ దుర్మార్గాన్ని సమర్ధించే నైచ్యం దేనికి సంకేతం?కథువాలో జరిగినమరో ఉదం తం చూడండి! అక్కడ ఒక ఎనిమిదేళ్ళ ముక్కు పచ్చలారని పసిబాలికను ఘోరంగా రేప్‌ చేశారు. ఆ ఉదంతంలో నిందితులకు మద్దతుగా కొందరు జనాలు ఊరేగింపు తీశారు !
వెయ్యేళ్ళ క్రితమో,లేకుంటే నాలుగు వందల ఏళ్ళ క్రితమో ఎవరో ఒక రాజు, లేదా దండెత్తి వచ్చిన వాడు తలవంపులు తెచ్చే విధంగా వ్యవహరించా డంటూ ఇప్పుడు దానికి బాధ్యులుగా కొందరిని చేసి వారిపై దాడులకు దిగుతున్నారు.ఆ దాడు లను మనలో కొందరు సమర్ధిస్తున్నారు.కాని ఇప్పుడే,మనముందే మణిపూర్‌లో, హర్యానా లో జరుగుతున్న అన్యాయాలకు బలైపోయిన బాధి తులకు న్యాయం చేయాలని అడగడానికి మనం నోళ్ళు మెదపడం లేదు. ఫెవికాల్‌తో మన పెదవు లు అతుక్కుపోయాయి. ఎప్పుడో, ఎవరో దండెత్తి వచ్చినవాళ్ళు మన ప్రార్థనాస్థలాలను ఏ విధంగా అపవిత్రం చేశారో (ఆ ఘటనల్లో కొన్ని జరిగినవి, మరికొన్ని కేవలం కల్పితమైనవి కూడా ఉన్నాయి) చర్చించి, అప్పటి చారిత్రిక తప్పిదాలను ఇప్పుడు సరి చేయడానికి తయారయ్యాం. అది కూడా ఏ విధంగా?కొన్ని వందల సంవత్సరాల క్రితం చచ్చి పోయిన ఆ రాజు ఏ మతానికి చెందినవాడో ఆ మతానికి చెందిన ప్రార్థనా స్థలాలమీద ఇప్పుడు దాడులు చేయడం ద్వారా.అప్పుడు ఆ రాజు చేసినది తప్పు అయితే ఇప్పుడు మరి మనం చేస్తున్నదేమిటి? అదే తప్పుకాదా? ఉత్తర ప్రదేశ్‌ లో,ఢల్లీిలో,హర్యానాలో పదే పదే మసీదులమీద దాడులు జరుగుతూనే వున్నాయి. ‘’మసీదు అంటే ఏమిటి? మహా అయితే అదో కట్టడం. చాలా కట్టడాలను కూల్చివేసినట్టే వాటినీ కూల్చేస్తాం’’ అని బాబరి మస్జిద్‌ విధ్వంసం సందర్భంలో ఎల్‌.కె.అద్వానీ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ జ్ఞానవాపి మసీదు వియంలో కూడా అదే వ్యాఖ్యా నం చేశాడు. జరిగినదానికి ఏ విధమైన విచారం గాని సిగ్గు గాని లేనే లేదు. ఇది చరిత్రను రీవైండ్‌ చేస్తున్నట్టు ఉంది. నైతిక దౌర్బల్యం తాండవిస్తున్న కాలం ఇది. ప్రతీ జాతీఅప్పుడప్పుడు మనో వైక ల్యానికి లోనవుతూ వుంటుంది. మన విషయంలో ఆ వైకల్యం షార్ట్‌ టర్మ్‌ అమ్నీషియా (స్వల్పకాలిక మతిమరుపు) రూపంలో వ్యక్తం ఔతున్నట్టుంది. జరుగుతున్న వాటిని మనం చూస్తూనే వున్నాం. కాని వెంటనే మరిచి పోతున్నాం. గోగూండాలు ఒక మనిషిని చితక్కొట్టి చంపేసినా, ఒక మహిళ సామూహిక అమానుషత్వానికి బలైపోయినా ఆ సంఘటనలు మన మనస్సుల్లోని జల్లెడ కన్నాల నుండి జారిపోతున్నాయి. చాలా కొద్ది విషయా లను మాత్రమే గుర్తుంచుకోగలుగుతున్నాం. రోజూ కళ్ళెదుట జరుగుతున్న నీచమైన సంఘటనలను చూసి చూసి అలసిపోయామా? బహుశా అంతే అయివుండాలి మరి. కాకపోతే మన రోజువారీ పనుల్లో మునిగిపోయి వాటిని పట్టించుకోలేక పోతున్నామా? అది కూడా అయివుండొచ్చు. కార ణం ఏదైనా,మన నుండి ప్రతిస్పందన లేక పోవడంవలన విద్వేష మూకలకి, అసహన పరులకి ధైర్యం పెరుగుతుంది. జరుగుతున్న దాడి అక్కడో మసీదు మీదనో, ఇక్కడో దుకాణం మీదనో అయితే, అంతవరకూ అయితే వాటిని అదుపు చేయవచ్చు.కాని ఇప్పుడు జరుగుతున్న దాడి అటు వంటి చెదురు మదురుదాడి కాదు.
జోక్యం కల్పించుకోకపోవడం
ఇప్పుడు త్రిశూలాలు, పలుగులు, గొడ్డళ్ళు పుచ్చు కుని దాడి చేసే మూకలు అవసరం లేదు. ఇప్పుడు బుల్‌డోజర్లు ఆ పని కానిచ్చేస్తున్నాయి. ఒక చిన్న దుకాణం నడుపుకుంటూ బతుకుతున్నవాడిపైన లేదా ఒకచిన్న ఇంట్లో కాపురం ఉంటున్న వాడ పౖిెన దాడి చేసి వాటిని కూల్చివేసినప్పుడు గతంలో అక్కడినుంచి మూకలు చెల్లాచెదురు అయిపోయేవి. కాని ఇప్పుడు ఆవిధ్వంసం ముందు దర్జాగా నిల బడి సెల్ఫీ తీసుకుంటున్నారు.వాటిని వీడి యోలు చేసి సోషల్‌ మీడియాలో పెడుతున్నారు. ఒక గోగూండా ఒక బక్కచిక్కిన పేద మీద విరుచుకు పడి, అతడిని వేధిస్తున్న వైనాన్ని, ప్రయోగిస్తున్న తిట్లను రికార్డు చేయిస్తున్నాడు. రైలులో ఒక పోలీ సు జవాను తన పై అధికారిని, మరో ముగ్గురు ముస్లిం ప్రయాణికులను కాల్చి చంపి, ఆ తూటా లకు బలై కొనవూపిరితో వాళ్ళు అతగాడి బూట్ల కింద కొట్టుమిట్టాడుతూ వున్నప్పుడే అక్కడే ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అందులో ప్రధాని నరేంద్ర మోడీకి, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి జేజేలు పలికాడు. జనాలు కూడా జరుగుతున్న దారుణాన్ని ఆపే ప్రయత్నం చేయడం కన్నా దానిని వీడియోగా తీయడమే ప్రధానం అనుకుంటున్నారు. ఇక బుల్‌డోజర్‌ బాధితులు తమపై జరిగే దుర్మార్గాన్ని తామే కళ్ళారా చూస్తూ నిస్సహాయంగా ఉండిపోతున్నారు. కళ్ళ ముందే తాము కట్టుకున్న ఇల్లు ఒక్కో ఇటుకా, ఒక్కో రాయీ రాలి పడుతూంటే బిక్కచచ్చి కూలబడుతు న్నారు. మరోపక్క మీడియాలో కూడా కొందరు ఆ విధ్వంసాన్ని చూపిస్తూ క్షణాల్లో ‘న్యాయం’ ఏ విధంగా జరిగిందో చెప్తూ కీర్తిస్తున్నారు. బుల్‌ డోజర్ల విధ్వంసంలోని క్రూరత్వాన్ని,మూక దాడుల హత్యల్లోని ఆటవికతను, దేశ ప్రజల్లో ఒక పెద్దభాగం పశుప్రాయులుగా దిగజారి ప్రవర్తించడాన్ని మనం అందరం చూస్తున్నాం. ఏమీ పట్టనట్టు, లేదా ఇది రోజూ జరుగుతున్న దేలే అన్నట్లు చూస్తున్నాం.సామాజిక స్పృహ లేకుం డా బతికేయడం నేటి ప్రజానీకానికి అలవా టైపో యింది మరి!
నైతికతే శాంతిసమాజ నిర్మాణ పునాది
నైతిక విలువలు మన ఆలోచనలు, ప్రవర్తన మరియు నిర్ణయం తీసుకోవటానికి మార్గ నిర్దేశం చేసే నైతికతను కలిగి ఉంటాయి, ముఖ్యం గా నైతిక లేదా సామాజిక సందిగ్ధతలకు వచ్చిన ప్పుడు. నైతిక విలువలు సాంస్కృతిక భేదాలు, సామాజిక నిబంధనలు లేదా మతంలో లోతుగా పొందుపరచబడి,సమాజంలో ఒకరి స్థితిని నిర్వ చించే సమాచారంతో కూడిన ఎంపికలు చేయ డంలో సహాయపడే సరైన లేదా తప్పుపై వైఖరిని స్థాపించడానికి.పిల్లలకోసం, ఈ విలువలు సామా జిక బాధ్యత, తాదాత్మ్యం మరియు నైతిక నిర్ణయా త్మక నైపుణ్యాలను పెంపొందించడానికి అవస రం. బాల్య వికాస సమయంలో నైతిక విలువ లను పరిచయం చేయడం అనేది యుక్త వయస్సు లో యుక్తవయస్సులో భవిష్యత్తు వృద్ధి పథాన్ని రూపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇతరులతో గౌరవప్రదంగా ప్రవర్తించేటప్పుడు మంచిగా లేదా పేలవంగా ప్రవర్తించడం వంటి ప్రాథమిక భావనలను అర్థం చేసుకోవడం వ్యక్తి గత ఎదుగుదలకు మాత్రమే కాకుండా సామాజిక సందర్భంలో కూడా అవసరమైన నైపుణ్యాలు.
-(జియా ఉస్‌ సలామ్‌)

ఆదివాసుల హక్కులకు రక్షణ కావాలి

‘‘ ఆదివాసీల హక్కులను గుర్తించేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం నిరాకరిస్తున్నది. అడవులపై వారు సాధించుకున్న హక్కులను తొలగించి కార్పొరేట్‌ కంపెనీలకు ప్రవేశం కల్పించింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా ఆదివాసీలు తిండి కోసం వలసలు పోవాల్సి వస్తోంది. వీరు విద్య, వైద్య సదుపాయాలు, ఉపాధి లేక దుర్భర జీవితం అనుభవిస్తున్నారు.ప్రపంచ వ్యాప్తంగా 40దేశాలలో సుమారు 40కోట్ల మంది ఆదివాసీ లు జీవిస్తున్నారు. ఆదివాసీల హక్కులను గుర్తిం చాలని 1994 ఆగస్టు 9నఐక్యరాజ్య సమితి డిక్ల రేషన్‌ పేర్కొంది.ఆదివాసీల హక్కులను గుర్తించ డానికి మాత్రం ప్రభుత్వాలు నేటికీ నిరా కరిస్తు న్నాయి. భారత దేశంలో 10కోట్ల మంది ఆది వాసీ ప్రజలు జీవిస్తు న్నారు. 700వందల ఆది వాసీ,75 ఆదిమజాతి తెగల హక్కులను గుర్తిం చేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం నిరాకరి స్తున్నది. అడవులపై వారు సాధించుకున్న హక్కు లను తొలగించి కార్పొరేట్‌ కంపెనీలకు ప్రవేశం కల్పిం చింది. స్వాతంత్య్రం వచ్చి75ఏళ్లు దాటినా ఆది వాసీలు తిండికోసం వలసలు పోవాల్సి వస్తోం ది. వీరు విద్య, వైద్య సదుపాయాలు,ఉపాధి లేక దుర్భర జీవితం అనుభవిస్తున్నారు.’’
భారత రాజ్యాంగం5,6షెడ్యూల్‌ ప్రాంత అడవులలో నివసిస్తున్న ఆదివాసీలకు అక్కడి సహజ వనరులపై హక్కు కల్పించింది. ఆదివాసీలకు,గ్రామ సభలకు సర్వ అధికారాలు కల్పించింది.అయితే ఆదివాసీప్రాంతంలో ఉన్న అపారమైన సహజ వనరులను బడా కంపె నీలకు ధారాదత్తం చెయ్యడానికి,ఆదివాసీ ప్రాంత అడవు లను అదానీ,అంబానీ పరం చేయడానికి, విలు వైన బొగ్గు,బాక్సైట్‌,కాల్సైట్‌,లేటరైట్‌,మాంగనీస్‌, యురేనియం,గ్రానైట్‌,ఐరన్‌ ఓర్‌,వనమూలికలు, వృక్ష జంతు సంపదను ప్రైవేట్‌ బడా సంస్థలకు అప్పజెప్పడానికి కేంద్ర బిజెపి ప్రభుత్వం చెయ్యని ప్రయత్నం లేదు.ఆదివాసీల అభిప్రాయాలు, ప్రతి పక్ష పార్టీల అభ్యంతరాలను పట్టించుకో కుండా ఏకపక్షంగాఅటవీ సంరక్షణ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపచేసుకుంది. ఆదివాసీ ప్రాంతంలో ప్రవేట్‌ బడా సంస్థల ప్రవేశానికి తలుపులు బార్లా తెరిచింది.ఆదివాసీ ప్రాంతం లో ఆదివాసీలకు అడవులపై ఉన్న హక్కులను తొలగించింది.దీనివలన ఆదివాసీలకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఇప్పటివరకూ ఆదివాసీలు సహజ సిద్ధంగా అటవీ ఫలసాయం పొందేవారు. ఇప్పుడది నేరం అవుతుంది. ఆదివాసీల అడవు లు, భూమి, సహజ వనరులకు రక్షణగా ఉన్న గ్రామసభకు అటవీ హక్కులు,1/70తదితర చట్టా ల అధికారాలు లేకుండా చేసింది. తక్షణమే ఈ సవరణ చట్టాన్ని రద్దు చేసి ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీలకు అడవులు,భూమి,సహజ వనరులపై హక్కులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి.
జీవో నెం 3 అమలు చెయ్యాలి
ఆదివాసీ ప్రాంత గిరిజన హక్కులు, చట్టాల అమలుకు రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్లకు భారత రాజ్యాంగం విస్త్రుతమైన అధికారాలు కల్పించింది.5వ షెడ్యూల్‌ ప్రాంతంలో ఆదివాసీ లకు వందశాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్న జీవో 3 అమలు చేసి 20రకాల విభాగాలలో ఉపాధి కల్పించింది.అంతటి కీలకమైన జీవో నంబర్‌ 3ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ఆదివాసీ ప్రాం తంలో రిజర్వేషన్‌ ప్రశ్నార్థకంగా మారింది. రాజ్యాంగం ఆదివాసీలకు కల్పించిన రిజర్వేషన్లు, హక్కులను రద్దు చేసినట్లయింది. గిరిజనేతర జాతులైన బోయ వాల్మీకులకు ఆదివాసీలుగా గుర్తింపు కల్పించి రాజకీయ లబ్ధి పొందేందుకు కేంద్ర బిజెపి,రాష్ట్ర వైసిపి ప్రయత్నిస్తున్నాయి. ఆదివాసీ ప్రాంత అడవులు,సహజ వనరులను బడా కార్పొరేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నా యి. తక్షణమే జీవో నంబర్‌ 3అమలుకు చర్యలు తీసుకోవాలి. షెడ్యూల్డ్‌ ప్రాంతంలో ఆదివాసీలకు వంద శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి.
పోలవరం బాధితులకు సహాయక చర్యలు
గత సంవత్సరం జులై 11న వచ్చిన గోదావరి వరద వల్ల అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలకు చెందిన కూనవరం, వరరామ చంద్రాపురం, దేవీపట్నం, ఎటపాక, చింతూరు, కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండ లాల్లోని 200 గ్రామాలు పూర్తిగా నీట మునిగి పోయాయి. వంద రోజులపాటు ఈ గ్రామాలు వరద నీటిలో ఉన్నాయి. పోలవరం వద్ద కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంవల్ల నీరు వెనక్కి తన్ని ఈ జల ప్రళయం సంభవించింది.ఈ మండలాల్లోని ఊళ్ళకు ఊళ్ళు నీట మునిగిపోయాయి. వేలాది కుటుంబాలవారు కొండలు, గుట్టలు ఎక్కి వారాల తరబడి అక్కడే నానా అగచాట్లు పడ్డారు. రెండు నెలల తర్వాత గ్రామాలకు చేరుకున్నారు. అదే పరిస్థితి నేటివరదల సమయంలో మరలా పునరావృతం అయ్యింది. మునక మండలాల గ్రామాలు గోదావరి, శబరి నదుల వరద వల్ల జల దిగ్బంధనంలో ఉన్నాయి. వరద ముంపు సమస్యపై సత్వరం ప్రభుత్వం స్పందించాలి. ముందస్తు చర్యలు తీసుకోవాలి.
1.గోదావరి వరద ముందస్తు చర్యలు సత్వరం తీసుకోవాలి.2. వరద బాధితులకు నిత్యావసర సరుకులు వెంటనే అందించాలి.3.వరద గ్రామా ల నుండి బాధితులను తరలించేందుకు వాహ నాలు ఏర్పాటు చేయాలి. పడవలు, లాంచీలు సిద్ధం చేయాలి.4.వరద బాధిత గ్రామాల ప్రజలు తాత్కాలిక గుడారాలు నిర్మించుకోవడానికి ప్రతి కుటుంబానికి టార్పాలిన్లు ఇవ్వాలి.5. ప్రత్యామ్నా య రహదారులను పునరుద్ధరించాలి.రోడ్లను మరమ్మతు చేయాలి.6.పాఠశాలలు మూత పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. 7.చింతూరులో ఐటిడిఎ ప్రాజెక్టు ఆఫీసరును వెంటనే నియమించాలి.
షెడ్యూల్‌ ప్రాంతంలో నాన్‌ షెడ్యూల్‌ ఆదివాసీ గ్రామాలు కలపాలి
రాష్ట్ర వ్యాప్తంగా1500ఆదివాసీ గ్రామాలను షెడ్యూల్‌ ప్రాంతంలో కలపాలి. షెడ్యూల్‌ ప్రాంతంలో లేనందున అక్కడ నివసి స్తున్న ఆదివాసీల భూములు, అడవులకు రక్షణ లేదు.గిరిజనేతర పెత్తందారులు,మైనింగ్‌ మాఫి యా మధ్య ఆదివాసీలు నలిగిపోతున్నారు. ఐటిడిఎ పర్యవేక్షణ, పథకాలు, నిధులు అందక… ఆదివాసీ గ్రామాలకు విద్య, వైద్యం ఉపాధి, మంచి నీరు,రోడ్లు తదితర మౌలిక సదుపాయాలు అందు బాటులోలేక…బిక్కు బిక్కుమంటూ గడుపుతు న్నారు.తక్షణమే నాన్‌ షెడ్యూల్‌ ఆదివాసీ గ్రామా లను షెడ్యూల్‌ ప్రాంతంలో కలపాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలి.
యుసిసి ని వ్యతిరేకిద్దాం
రాజ్యాంగం ఆదివాసీలకు ప్రత్యేక శాసనాలు చేసింది. వారి సంస్కృతి, ఆచారాలను గుర్తించింది. అయితే కేంద్ర బిజెపి ఆదివాసీలపై హిందూ భావజాలాన్ని రుద్దేందుకు, ఆదివాసీల ప్రత్యేక శాసనాలు, సంస్కృతి ఆచారాలు తొలగిం చేందుకు ఏకరూప పౌర స్మృతి (యుసిసి)ని అమలు చేయాలని చేస్తున్నది. ఆదివాసీ ప్రాంతం లో యుసిసి అమలును వ్యతిరేకించాలని ఆదివాసీ గిరిజన సంఘం పిలుపు ఇస్తున్నది.
హక్కుల దినోత్సవం ప్రాధాన్యత :
యుఎన్‌ఓ 1982 లో ప్రపంచంలోని ఆదివాసీలను విశ్వమానవులుగా గుర్తించినపుడు, వారికున్న ప్రత్యేక హక్కులను రక్షణ కల్పించాల్సిన బాధ్యతను ఈ హక్కుల దినోత్సవం గుర్తుచేస్తుంది. ఈ కమిటీ గుర్తించిన ముఖ్యమైన అంశాలు రాజకీయ,సామాజిక,ఆర్థిక సాధికారత, సంస్కృతి, సాంప్రదాయాలు,చరిత్ర,వేదాంతశాస్త్రం, వార సత్వ భూమి హక్కులు, స్థానిక వనరులు, అలాగే అన్ని రకాల వివక్షలు మొదలైన వారి హక్కులను రక్షించాల్సిన అవసరం ఉందని, వాటిని గౌరవిస్తూ ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని ఆ సమా వేశంలో తీర్మానించిన అంశాలను వెల్లడిర చిన అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్‌ ను అనుస రిస్తూ సెప్టెంబర్‌ 13ను అంతర్జాతీయ ఆది వాసీ హక్కుల దినోత్సవంగా గుర్తించడం జరిగింది.
46 రకాల హక్కులను కల్పించి
ఈ డిక్లరేషన్‌ లో మొత్తం 46 ప్రకర ణలు పొందుపరిచారు.ఈ 46ప్రకరణలలో ముఖ్యమైనవి మచ్చుకు కొన్ని…(1):ప్రపంచ మానవ హక్కుల చట్టం ప్రకారం,ఆదివాసీలు స్వేచ్ఛగా మానవహక్కులు, ప్రాథమి క హక్కులను కలిగి వాటిని ఆనందంగా అనుభవించాలి. ఎటు వంటి వివక్షకు గురికావద్దు. అధికరణ(2): ఆదివాసీలు ఎటువంటి వివక్ష లేకుండా ఇతరులతో పాటు సమానంగా హక్కు లను అనుభవించాలి.
అధికరణ (3): ఆదివాసీలు సంకల్పంతో వారి ఇష్ట ప్రకారం, రాజకీయ, ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక అభివృద్ధికి తోడ్పడు అంశా లను వారి ఇష్టమైన రీతిలో నిర్వహించుకొని అభివృద్ది చెందవచ్చు.
అధికరణ (4): వీరు స్వయం ప్రతిపత్తి, స్వయం పాలనను వారి అంతరంగిక స్థానిక అంశాలలో నిర్వహించుకోవచ్చు. అదే విధంగా ఆర్థిక వనరు లు,సముపార్జనను వారుఇష్టమైన రీతిలో నిర్వ హించుకోవచ్చును.
అధికరణ(5): ఆదివాసీలకు రాజకీయంగా, ఆర్థికంగా,చట్టాలను బలోపేతం చేసుకునే అధికా రం కలదు.
అధికరణ(6): ప్రతి ఆదివాసీ ఏ దేశంలో నివసి స్తున్నప్పటికీ ఆదేశ పౌరసత్వము పొందే ఉండే హక్కును కలిగి ఉంటాడు.
ఆధికరణ(7):ప్రతి ఆదివాసీ మానసిక సమత గ్రతలో జీవితంలో స్వేచ్ఛ,రక్షణ హక్కును కలిగి ఎటువంటి మారణ హోమానికి గురికాకుండా, వృక్తిగతంగా,సమూహంగా,రక్షణతో కూడిన శాంతి,రక్షణ కలిగి బలవంతపు చర్యలు వీరిమీద, పిల్లల లేకుండా ఉండే హక్కు.
అధికరణ(8): జాతిపరంగా రెచ్చగొట్టే చర్యలు, వివక్ష ఉండకూడదు. వారి సంస్కృతి, సాంప్రదా యాలు రక్షణ కలిగి విలువలు కలిగి ఉండాలి. భూమిపై హక్కులు కాలరాయకుండా, వనరుల దోపిడి జరగకుండా బాధ్యతాయుతమైన యంత్రాం గాన్ని ఆయా రాష్ట్రాలే కల్పించాలి.
అధికరణ(9):ఆదివాసీలు సంస్కృతి, సాంప్ర దాయులకు అనుగుణంగా ఏదైనా జాతీయతను కలిగి వుండవచ్చును. వీటిపై ఎట్టివివక్ష చూ పరాదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మన ఆది వాసీ సమాజాలకు ఆగస్టు 9 ఆదివాసీ దినోత్సవం గురించి తెలిసినంతగా ఆదివాసీ హక్కుల దినం గురించి తెలియక పోవడానికి కారణం నేటి ప్రభు త్వాల అలసత్వం.ఐక్యరాజ్య సమితి సూచన మేరకు దేశ మంతటా ఆదివాసీల హక్కులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలి.
వ్యాసకర్తలు :ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,తెలంగాణ ఆదివాసీ రచయి తల వేదిక, వ్యవస్థాపక కార్యదర్శి.(కిల్లో సురేంద్ర/గుమ్మడి లక్ష్మీ నారాయణ)

కోయ సంగీతం..రేలా నృత్యం

కోయలు సామూహికంగా జరుపుకొనే భూమి పండుగ, ముత్యాలమ్మ పండుగ, కొలుపు, తాటిచెట్ల పండుగ, లేలే పండుగ, వేల్పుల పండుగతో పాటు వివాహాది కార్యక్రమాలలో సాంప్రదాయ నృత్యాలు చేస్తారు. కోయలు ఇప్ప సారాయితో పాటు తాటి, జీలుగు చెట్ల నుండి కూడా కల్లు తీసి స్త్రీ పురుషులం దరు సేవించి ఆ నిషాలో అందరూ కలిసి కేరింతల మధ్య ఆనందంగా నృత్యాలు చేస్తారు.
సంగీత వాయిద్యాలు

ఆదిమ కోయ జాతులు పూర్వం రాళ్లతో, కర్రలతో శబ్దాలు చేసేవారు. ఒక గుంపు నుండి మరో గుంపుకు సందేశాలు అందిం చడం లాంటివి, తమను రక్షించుకోనే క్రమాలలో శబ్ద తరంగిణులను చేసుకునేవారు. క్రమంగా జంతువుల చర్మాలు ఒలిచి ఎండ పెట్టి వాటిని డోలు, డప్పులుగా చేసి శబ్ద తరంగిణులు చేసుకునేవారు. వారు ఏద్కెనా విజయం సాధించినప్పుడు ఈ శబ్దాలు చేసుకుంటూ గంతులు వేసుకుంటూ వినోద కార్యక్రమాలు జరుపుకునేవారు. కాలక్రమంలో కోయజాతుల సాంప్రదాయం అభివృద్ధిలోకి వచ్చాక ఏసందర్భంలో ఏశబ్ద తరంగిణులు కావాలో,ఎలాంటి సంగీత వాయిద్యాలు వాడాలో,సహజ సిద్ధంగా వారి పరిసరాలలో లభించే వస్తువులతో సంగీత వాయిద్యాలను వారే స్వతహాగా కళాత్మకంగా తయారు చేసు కున్నారు,వీటిని పండుగలలో పెళ్ళిళ్లలో, చావు లలో,దినాలల్లో,జాతర్లలో,వేటలో,కొలు పుల్లో, విందులు-వినోదాలలో ఈ సంగీత వాయి ద్యాలు ఉపయోగిస్తున్నారు.
అందె: దీన్ని ఇనుముతో చేసి,లోపల చిన్న చిన్న గట్టివి గుండ్రనివి రాళ్ళ ముక్కలు లేదా ఇనుప ముక్కలు వేస్తారు.వీటితో అడుగు కదిలినప్పుడు శబ్దంవస్తుంది,దీన్ని మగవారు కాలికి తొడుక్కొని నృత్యాలు చేస్తారు. అడు గుకు అందె సవ్వడితోఆనృత్యం కొనసాగు తుంది.
డోలు కొయ్య: సుమారు మూడు అడుగుల పొడవు కలిగి,కుడి ప్రక్క అడుగు,ఎడమ వారం కలిగి ఉండే శబ్ద తరంగిణి.దీన్ని వేగిస చెట్టు గుల్లను చెక్కి, డోలుగా చేసి దీన్ని రెండు వైపులా మేక చర్మం కుడి వైపు,గొడ్డు చర్మం ఎడమ వైపుతో మూస్తారు.ఈ డోలును చర్మం తాడుతో బిగించి కడతారు.ఈ డోలును నృత్యం చేసేటప్పుడు మగవారు మెడలో వేసుకొని కుడివైపు చేతితో,ఎడమవైపు సిర్ల కర్రతో వాయిస్తారు. దీన్ని ఆయా సంద ర్భాలలో ఉపయోగించే ప్రధాన సాంప్రదాయ సంగీత వాయిద్యం.
తూత కొమ్ము -అక్కుం : దీన్ని అడవి దున్న కొమ్ము తో తయారు చేసుకుంటారు. అడుగు న్నర పొడవు కలిగి ఉండి అర్ధ చంద్రా కారంలో ఉంటుంది,ఊదేవైపు సన్నగాను మరోవైపు వెడల్పుగాను ఉంటుంది. దీన్ని ఊదినప్పుడు శబ్ధ సంగీతం వస్తుంది. దీన్ని సాంప్రదాయ నృత్యాలు, వేట మొదల్కెన సందర్భాలలో ఉపయోగిస్తారు. వీటిని తాటాకులతో కూడా తయారు చేసుకుంటారు. అక్కుంను ఇత్తడి లేదా ‘డాక్రామెటల్‌’తో తయారు చేస్తారు.సాధారణంగా ఇది తూత కొమ్ము ఆకారాన్ని కలిగి ఉంటుంది. దీని ఎడమవైపు సన్నగ ఉండి ఆ భాగంలో ఊదటానికి అనుకూలంగా రంధ్రం చేస్తారు. దీని క్రింది భాగం చివరి వరకు చూడటానికి కళాత్మకంగా గజ్జెలు అమర్చుతారు. దీని రంధ్రం నుండి ఊదితే అద్భుతమైన శబ్ద తరంగం వస్తుంది. కోయ జాతులు దీన్ని ప్రత్యేకంగా వేల్పులు-కొల్పులలో మాత్రమే ఉపయోగిస్తారు. కోయవారి సాంప్రదాయంలో అక్కుం ప్రత్యేక చారిత్రక సంస్కృతికి స్థానం పొందిన సంగీత వాయిద్యం.దీన్ని పూజ వస్తువుగా వినియోగిస్తారు.
కోయలు ప్రధానంగా ఐదు రకాల సాంప్రదాయ నృత్యాలు చేయడం కనిపిస్తుంది. అవి: రేలా నృత్యం,డోలి / మేళం నృత్యం, కొమ్ము నృత్యం,కురై నృత్యం,కోలాటం.
1.రేలా నృత్యం
కోయలు మూడు రకాల రేల నృత్యాలు చేస్తారు.ఈ రేల నృత్యాలలో 30నుండి 40 మంది వరకు స్త్రీ పురుషులు పాల్గొంటారు. స్త్రీ జట్టుకు ఒక నాయకురాలు, పురుషుల జట్టుకు ఒక నాయకుడు ముందు ఉండి ఈ నృత్యాలను చేస్తుంటారు. ఒక రకమైన పద్ధతిలో స్త్రీ పురుషులు పాటలు పాడుతూ ఒకరి నడుముపై ఒకరు చేతులు వేసి పాటకు అనుగుణంగా లయబద్ధంగా అడుగులు వేస్తూ వలయాకారంగా తిరుగుతూ నృత్యం చేస్తారు. ఇంకో రకమైన పద్ధతిలో స్త్రీ పురుషులు విడివిడిగా వలయాకారంగా నిలబడి, ఎవరి చేతులతో వారే చప్పట్లు కొడుతూ ముందుకు మూడు అడుగులు వేసి, వెనుకకు మూడు అడుగులు వేస్తూ పాటకు అనుగుణంగా నృత్యం చేస్తారు. మరో రకమైన పద్ధతిలో వలయాకారంగా విడివిడిగా నిలబడి అడుగులు వేస్తూ నృత్యం చేస్తూ తమ చేతులను ఇరు ప్రక్కలకు మార్చి మార్చి చప్పట్లు కొడతారు.ఈ ఆట కోలాటం మాదిరిగా ఉంటుంది. భూమి పండుగ సమయంలో గ్రామంలోని పురుషులందరు సామూహికంగా వేటకు వెళ్ళి ఏదో ఒక అడవి జంతువును వేటాడి తీసుకు వస్తారు. పురుషులు అడవి నుండి తిరిగి వచ్చేంత వరకు గ్రామంలోని స్త్రీలు రేల పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. స్త్రీలు ఒకరి భుజాలు ఒకరు పట్టుకొని వలయాకారంగా తిరుగుతూ రేల నాట్యం చేస్తారు. సాంప్ర దాయ దుస్తులు ధరిస్తారు. అడ్డ కట్టుగా మోకాళ్ళ వరకు చీర కట్టి కుడివైపు పైట వేసుకుంటారు.శిరోజాలను అందమైన కొప్పులుగా (కూపారు ముడి) ముడుస్తారు. తలపై పక్షుల ఈకలను ధరిస్తారు. పండుగ, వివాహము, జాతర్లు, వెన్నెల రోజుల్లో ఆనందంగా మైమరచి చేసే కోయ యువతుల నృత్య భంగిమలు బహు ఆకర్షణీయంగా ఉంటాయి. వారు పాడే రేల పాటలలో రేల అంటే ‘‘వెన్నెల’’అని అర్ధం.వారి జాతి కూడా రేల చెట్టు క్రిందనే జన్మించిందనే భావం కూడ ఉంది.
ఒక రేల పాట రేలా రేలయ్యో రేలా రేలా రేరేలా
సన్నబాదు చెల్లెలే లారిదాదా ఎలో చెలో బొలో చెలే లారిదాదా వీరలరాజు చెల్లెలే లారిదాదా ఎలో చెలో బొలో చెలే లారిదాదా అద్దమన్నా నత్థింకే లారిదాదా ఎలో చెలో బొలో చెలే లారీదాదా దాని లేబరేయ్యానో లారిదాదా ఎలో చెలో బొలో చెలే లారిదాదా దానితోడు చెల్లెలే లారిదాదా ఎలో చెలో బొలో చెలే లారిదాదా ముత్త లచ్చు చెల్లెలే లారిదాదా ఎలో చెలో బొలో చెలే లారిదాదా ముత్తల జానకి చెల్లెలే లారి దాదా ఎలో చెలో బొలో చెలే లారిదాదా
రేలా రేలా రేరేలా.. రేలా రేలా రేరేలా…. రేలా రేలా రేరేలా.. రేలా రేలా రేరేలా… రేలా రేలా రేరేలా… రేలా రేలా రేరేలా.. రేలా రేలా రేరేలా… లచ్చల నీరు చెల్లెలే లారీదాదా ఎలో చెలో బొలో చెలే లారీదాదా లచ్చల రాజు చెల్లెలే లారీదాబా ఎలో చెలో లొలో చెలే లారీదారా రేలా రేలా రేరేలా రేలా రేలా రేరేలా డోలి నృత్యం
కోయ సంఘ వ్యవస్థను ఐదుగురు వ్యక్తులు నడిపిస్తారు.వారు:దొర,పటేల్‌,వడ్డె,అడితి బిడ్డ, తలపతి.దొర,పటేల్‌ అనుమతి మేరకు తలపతి ఆధ్వర్యంలో వడ్డె ఇలవేలుపు (దేవత) కొలు పును నిర్వహించగా అడితి బిడ్డ డోలి అనే వాయిద్యాన్ని వాయిస్తూ, పాటలు పాడుతూ పడిగె (చిత్రపటం) ఆధారంగా కోయల చారిత్రక గాథలను వల్లిస్తాడు. ఇలవేల్పును గుట్టపై నుండి జాతర స్థలానికి ఎదుర్కోవ డానికి, మళ్ళీ తిరిగి సాగనంపడానికి డోలి కోయలే ముందుండి వాయిస్తారు. ఈ సంద ర్భంగా వీరు పాటలు పాడుతూ వాద్య శబ్దానికి అనుగుణంగా వలయాకారంలో తిరుగుతూ నృత్యం కూడా చేస్తారు. 2020 సంవత్సరపు మేడారం జాతర నుండి డోలి కోయలది ఒక ప్రత్యేక నృత్యంగా పేరు సంపాదించుకుంది. ఇలాంటి డోలి కోయ కళాకారుడు సకినె రామచంద్రయ్యకు భారత ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారాన్నిచ్చి సత్కరించింది.
కొమ్ము నృత్యం
కోయలు అడవి దున్నపోతు (గొర్రపోతు) కొమ్ములతో తయారు చేసుకున్న ‘సింగ’ అను శిరస్త్రాణము (టోపి) ధరిస్తారు. తాటాకులతో తలపైన బోర్లించుకునే పరిమాణంతో సింగ తయారు చేస్తారు. దాని పై మధ్య భాగంలో జానెడు ఎత్తు ఉండేటట్లు తుంచిన నెమలి ఈకలను చెక్కుతారు. సింగకు కుడి, ఎడమ వైపుల కొమ్ములను అమర్చుతారు. తాటాకులు కనపడకుండా ముదురు రంగు (పచ్చ లేదా ఎరుపు) చీరను (పెర్మ కోక) చుట్టుతారు. నెమలి పురికట్ట, కొమ్ముల చుట్టూ చుట్టగా మిగిలిన చీరను సింగ వెనుక వైపుకు వదులుతారు. ఇలా తయారైన సింగను నర్తకుడు ధరించినప్పుడు అతని తలపై నెమలి ఈకల కట్ట, కొమ్ముల జత, నర్తకుని వెనుక తల వెనుక వీపు మీదుగా కొంకులపై వేళ్ళాడుతున్న చీర మడత మాత్రమే కనిపిస్తాయి -అందంగా. ఇలా పెద్ద కోక ధరించిన నర్తకులు చేసే నర్తనం కాబట్టి దీనిని పెర్మ కోక ఆట అని కూడా పిలుస్తారేమో. ఈ నర్తకులు పూర్వ కాలంలో కేవలం ధోతిని మాత్రమే ధరించేవారనిపిస్తుంది. కాని గత రెండు, మూడు దశాబ్దాల కాలంలో వీరు చేతులు లేని బనియన్‌ లేదా టీ-షర్ట్‌, నడుము భాగం నుంచి కిందికేమో గీతల లంగాను ధరించడం అలవాటు చేసుకున్నారు. ప్రతీ పురుష నర్తకుడు తన ఎడమ భుజం మీదుగా కుడి కాలుపై వేలాడే విధంగా నాలుగు అడుగుల పొడవైన డోలకొయ్య (గండ్జ)ను ధరిస్తాడు. గండ్జను గుమ్ముడు చెట్టు దుంగతో తయారు చేస్తారు. దుంగ మధ్యలో ఫీటు, ఫీటున్నర వ్యాసంతో బోలు చేసి,ఆ బోలును ఒక వైపు ఆవు తోలుతోన,మరో వైపు హన్మబండ (అలబండ) తోలుతో మూస్తారు. ఆవు తోలుతో మూసిన వైపు అడుగు పొడవుండే చిర్ర (కట్టె)తో వాయిస్తారు, హన్మ బండ తోలుతో మూసిన వైపు ఎడమ చేతితో వాయిస్తారు. చిర్ర మొదట్లో చిన్న రంధ్రం చేసి,దాని గుండా ఒక ఇనుప రింగును దూర్చి, దానికి మువ్వలు కూర్చుతారు – వాయిస్తు న్నప్పుడు వినసొంపైన శబ్దం రావడానికి. అందరూ కాళ్ళకు అందెలు ధరిస్తారు. నర్తకుల మధ్యలో ప్రధాన పాటగాడు (మేస్త్రీ) ఉండి రేల పాటలు పాడుతూ నృత్యానికి నాయకత్వం వహిస్తాడు. పాటగాడు చిర్రతో బీటు మారిస్తే మిగతా నర్తకులు కూడా బీటు మార్చి, నృత్యాన్ని మారుస్తూ అనుసరిస్తారు. మధ్య మధ్య ముసారి కొమ్ము (తూత కొమ్ము /అడవిదున్న కొమ్ము) ను ఊదుతూ హుషారు గొలిపే శబ్దాలు చేస్తారు. నాట్యం చేసే సమయంలో ఈ ముసారి కొమ్మును భుజానికి తగిలించుకుంటారు. వారి నాట్యంలో భాగంగా అడవి దున్నపోతుల పోరాటం (పెర్మాం) ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేక్షకులు భూమి మీద వేసిన రూపాయల నోట్లను లేదా కాగితపు ముక్కలను తాము ధరించిన అడవి దున్న కొమ్ము కొనలతో గుచ్చి పైకి తీయడం వంటి చిత్ర విచిత్రమైన కళలను ప్రదర్శిస్తారు. ఇలాంటి నృత్యాలు పూర్వ కాలంలో మనుగడ సాగించినా మధ్యలో కోయల ఆర్థిక స్థితి దిగజారిన కాలంలో కనుమరుగయ్యాయి. కాబట్టి ఇలాంటి నృత్యం తూర్పు గోదావరి జిల్లా గంగవరం మండలంలోని పండ్రపోల పంచాయితీలోని కోయదొర కులస్థులకు మాత్రమే వచ్చు అని 2016 లో మైపతి అరుణ్‌ కుమార్‌ రాశాడు. కాని ఆ తరువాత తెలంగాణలోని అశ్వాపురం మండలం కోయ రంగాపురం, ఏటూరునాగారం దగ్గరి చినబోయినపల్లి మొదల్కెన గ్రామాల కోయలు ఈ నృత్యాన్ని నేర్చుకున్నారు. ఇప్పుడు ఈ నృత్యాన్ని మేడారం జాతరతో పాటు గంగాలమ్మ, కొండరాజులు, పసరుబోలి, పప్పుకొత్త,పలకం,బడ్డి మొదల్కెన పండుగలు, వివాహాది శుభకార్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రదర్శిస్తున్నారు.
కుర్రె నృత్యం
సందర్భాన్ని బట్టి 20నుండి 30మంది పురుషుల వరకు కుర్రె నృత్యంలో పాల్గొంటారు. రెండు సన్నాయిలు, మూడు మేళాలు ఈనృత్యంలో ప్రధాన సంగీత వాయిద్యాలుగా ఉపయోగిస్తారు. పంచ, బనీను ధరించి తలకట్టు కట్టుకొని, చేతిలో తువ్వాలు పట్టుకొని కాళ్లకు గజ్జలు ధరించి వలయాకారంగా సంగీత వాద్య శబ్దాలు అనుగుణంగా నృత్యాలు చేస్తారు. ఒకరి భుజంపై మరొకరు చేతులు వేసి బృంద నాయకుని సైగలను అనుసరించి ఈ నృత్యాలు చేస్తారు.
కోలాటం
గ్రామాలలో పురుషులు రెండు చేతుల్లో రెండు కోలలు ధరించి పరస్పరం ఒకరి కోలలను ఒకరు కొట్టుకుంటూ పాటలు పాడుతూ వలయా కారంలో నృత్యం చేసే కోలాటం ఆట కోయలలో కూడా ఉంది. అలాగే కోయ స్త్రీలు కూడా ఈ ఆటను ఆడుతుంటారు. (తెలంగాణ మాస పత్రిక సౌజన్యంతో..)- (డా. ద్యావనపల్లి సత్యనారాయణ)

యూపీకి ఆదర్శంగా ఏపీ

ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ విధానాలు, పని తీరు బాగున్నాయని, సాంకే తికత అత్యున్నతంగా ఉందని, వాటిని తమ రాష్ట్రంలోనూ అమలు చేస్తామని ఉత్తర ప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రాజెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌ చంద్రకాంత్‌ చెప్పారు. యూపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఐటీ నిపుణుడు ప్రశాంత్‌ షాహి తదితరులతో కలిసి ఆయన తాడేపల్లి లోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని సందర్శించారు. యూపీ విపత్తుల నిర్వహణ సంస్థను ఆధునికీరిస్తున్న క్రమంలో దేశానికే రోల్‌ మోడల్‌గా ఉన్న ఏపీ విధానాలను అధ్యయనం చేసేందుకు ఈ బృందం ఇక్కడకు వచ్చింది.
ఏపీలో అధునాతన టెక్నాలజీ
ఉత్తరప్రదేశ్‌ ప్రాజెక్ట్‌ ఎక్సపర్ట్‌ చందర్‌ కాంత్‌ మాట్లాడుతూ..ఏపీ స్టేట్‌ ఎమర్జన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ అనుసరిస్తున్న నూతన విధివిధానాలు, కార్యచరణ తెలుసుకునేందుకు వచ్చినట్లు చెప్పారు. వాతావరణ పరిశోధన విభాగా లలోని వివిధ అంశాలను అడిగి తెలుసు కున్నారు. ఏపీలో అత్యున్నత టెక్నాలజీ వినియోగిస్తుందని తమ రాష్ట్రంలో ఇక్కడ సాంకేతికతను అమలు చేస్తామని తెలిపారు. విపత్తులను ఎదుర్కోడానికి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పాటిస్తున్న ఉత్తమ విధానాలు, కార్యచరణ ప్రణాళికలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థల గురించి విపత్తుల సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా.బిఆర్‌ అంబేద్కర్‌ ఉత్తరప్రదేశ్‌ అధికారులకు వివరించారు. తుఫానులు, వరదలు, పిడుగులపై అప్రమత్తం స్టేట్‌ ఎమర్జెన్సీ సెంటర్‌లోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సాంకేతికతను, దాన్ని వినియో గిస్తున్న తీరును నిశితంగా పరిశీలించింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వారికి స్టేట్‌ ఎమర్జెన్సీ సెంటర్‌లోని అన్ని విభాగాలను చూపించి, పని విధానాన్ని వివరించారు. రాష్ట్రంలో తుఫా­నులు, వరదలతోపాటు పిడుగుపాట్లు ఎక్కువగా ఉంటాయని, అందువల్ల తమ ప్రభుత్వం విపత్తుల నిర్వహణ ప్రణాళికను పక్కాగా సిద్ధం చేసిందని తెలిపారు.
నష్టనివారణపై ముందస్తు ప్రణాళికలు
తుపాను, వరద వచ్చే అవకాశం ఉందని తెలిసిన వెంటనే రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ, వార్డు సచివాలయ స్థాయి వరకు ఉన్న విపత్తుల నిర్వహణ బృందాలు క్షేత్ర స్థాయిలో పని ప్రారంభిస్తాయని వివరించారు. ఈ అప్ర మత్తత వల్లే నాలుగేళ్లలో తుపానులు, వరదలొచ్చినా ప్రాణ నష్టాన్ని నివారించగలి గామన్నారు. వాతావరణ పరిశోధన విభా­గాలు, వివిధ వాతావరణ మోడల్స్‌, కార్యాచరణ ప్ర­ణాళికలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థల గురించి అంబేడ్క­ర్‌ వారికి వివరించారు.
ఒడిశా,అసోం,తెలంగాణ,ఢల్లీి సైతం
గతంలో ఒడిశా,అసోం,ఉత్తరాఖండ్‌, తమిళ నాడు, తెలంగాణ, ఢల్లీి రాష్ట్రాల అధికారులు ఇక్కడకు వచ్చి విపత్తుల్లో ఏపీ అవలంబిస్తున్న విధివిధానాలు తెలుసుకున్నారు. ఏపీలో 44% తుపాను, 15% వరదలు, 68% కరువు, పిడుగులు, వడగాల్పులు 100శాతం ప్రభావితం చేస్తున్నట్లు బృందానికి అంబేద్కర్‌ తెలిపారు. స్టేట్‌ ఎమర్జన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ నుంచి 24 గంటలు పర్యవేక్షించే విధానం, వాతావరణం గురించి వివిధ మోడల్స్‌ క్రోడికరించి హెచ్చరికలు జిల్లాలకు చేరవేస్తున్నట్లు తెలిపారు. విపత్తుల సమ యంలో నిరంతరం పర్యవేక్షిస్తూ అలర్ట్స్‌ పంపే విధానాన్ని చూపించారు. కామన్‌ అలెర్ట్‌ ప్రోటోకాల్‌, ఏపీ అలెర్ట్‌ద్వారా ప్రజలకు హెచ్చరిక మేసేజ్లు పంపించే విధానం చూపించారు. స్టేట్‌ ఎమర్జన్సీ ఆపరేషన్‌ సెంటర్లో కమ్యూనికేషన్‌ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు వినియోగించే శాటిలైట్‌ ఫోన్స్‌, శాటిలైట్‌ బేస్డ్‌ మొబైల్‌ డేటా వాయిస్‌ టెర్మినల్‌, వాకీటాకీ, వి-శాట్‌ కమ్యూనికేషన్‌ పరికరాలను ఉత్తర ప్రదేశ్‌ అధికారులకు చూపించారు. వెబ్‌ ఎమర్జన్సీ ఆపరేషన్‌ సెంటర్‌, జియోగ్రఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌, ముందస్తు హెచ్చరికల వ్యవస్థ గురించి విపత్తుల సంస్థ అధికారులు వివరించారు.
విపత్తు -నిర్వహణ
మానవ దైనందిన జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ అధిక ప్రాణనష్టం, ఆస్తినష్టం కలిగించే వైపరీత్య సంఘటనను ‘విపత్తు’ అంటారు. విపత్తులు సంభవించడానికి భౌగోళిక, వాతావరణం వంటి ప్రత్యేక పరిస్థితు లతోపాటు మానవుడి చర్యలు, కార్యకలాపాలు కారణమవుతున్నాయి. ప్రపంచంలో ప్రతిరోజు ఎక్కడో ఓచోట ఏదో ఒక విపత్తు సంభవి స్తుంది. దీనికి భారత్‌ అతీతం కాదు.ప్రత్యేక భౌగోళిక పరిస్థితులైన ఎత్తయిన పర్వత శ్రేణులు, విశాలమైన ద్వీపకల్ప పీఠభూమి, వేల కిలోమీటర్లు ప్రవహించే జీవనదీ వ్యవస్థ వల్ల భారత్‌ విపత్తుల బారిన పడుతుంది. ఒకరకంగా చెప్పాలంటే ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల విపత్తులు సంభవిస్తున్నాయి. ఈ మార్పులకు కారణం అడవులను నిర్మూలించడం, కాలుష్యం పెరిగిపోవడం, జీవవైవిధ్యం దెబ్బతినడం, వాతావరణం వేడెక్కడం మొదలైనవి. చీa్‌బతీవ ూతీశ్‌ీవష్‌ం ఱట ంష్ట్రవ ఱం ూతీశ్‌ీవష్‌వస అంటే మనం ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది. ‘ప్రకృతిని అనుసరించాలేకాని శాసించకూడదు’ అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మన కార్యకలాపాలను కొనసాగిస్తే ఈ విపత్తుల తీవ్రతను చాలా వరకు తగ్గించే అవకాశం ఉంది.
విపత్తు -నిర్వచనాలు
విపత్తు నిర్వహణ చట్టం-2005

1 నిర్వచనం.. ఏదైనా భౌగోళిక ప్రాంతం ప్రకృతి లేదా మానవ తప్పిదాలు లేదా ప్రమాదవశాత్తు లేదా నిర్లక్షం వల్ల తనంతట తాను కోలుకోలేని విధంగా పెద్దఎత్తున ప్రాణ నష్టానికి, ఆస్తి నష్టానికి, పర్యావరణ నష్టానికి లేదా విధ్వంసానికి కారణమయ్యే ఉపద్రవాలు లేదా ప్రమాదాలు లేదా దుర్ఘటనలను ‘విపత్తు’ అంటారు. 2.నిర్వచనం..సమాజపు సాధారణ నిర్మాణానికి, సాధారణ లేదా కమ్యూనిటీ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తూ అకస్మాత్తుగా, తీవ్రంగా సంభవించే ఆపదనే ‘విపత్తు’ అంటారు.పపంచ ఆరోగ్యసంస్థ) 3.నిర్వచనం..ఏదైనా ప్రదేశంలోని సమూహానికి వెలుపల నుంచి సాయం పొందవలసినంత తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టాన్ని, పర్యావరణ నష్టాన్ని, ఆర్థిక విధ్వం సాన్ని, ఆరోగ్య సమస్యలను కలుగజేసే సంఘటననే ‘విపత్తు’ అంటారు. 4. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్వచనం..సాధారణ జీవితానికి లేదా పర్యావరణ వ్యవస్థకు అంతరాయం కలిగినప్పుడు ప్రాణాలను లేదా పర్యావరణాన్ని రక్షించి, సంరక్షించడానికి.. అసాధార ణ, అత్యవసర చర్యలు అవసర మయ్యే ఉపవూదవ పరిస్థితినే ‘విపత్తు’ అని నిర్వచించారు.
విపత్తు సంస్థాగత చట్రం
1900,1905,1907,1947లలో వచ్చిన వరుస దుర్భిక్షాలు, 937లో సంభవించిన బీహార్‌-నేపాల్‌ భూకంపం మొదలైన వాటి నేపథ్యంలో భారతదేశ విపత్తు నిర్వహణ వ్యవస్థాగత నిర్మాణం బ్రిటిష్‌వారికాలంలో ప్రారంభమైంది.బ్రిటిష్‌ పరిపాలనలో విపత్తువల్ల వచ్చే అత్యవసర పరిస్థితులను ఎదుర్కునేందుకు పునరావాస విభాగాలను ఏర్పాటు చేశారు. ఈ విభాగాలు విపత్తు అనంతర పరిస్థితుల్లో మాత్రమే సహాయక చర్యలు చేపట్టేవి. స్వాతంత్య్రం అనంతరం విపత్తుల నిర్వహణ బాధ్యతను ప్రతి రాష్ట్రం లో ఉండే పునరావాస కమిషనర్లు, కేంద్రంలో కేంద్ర పునరావాస కమిషనర్లు నిర్వహించేవారు. ప్రపంచవ్యాప్తంగా ఐక్యారాజ్యసమితి సాధారణసభ 1990వ దశాబ్దాన్ని ‘అంతర్జాతీయ సహజ విపత్తుల కుదింపు దశాబ్దంగా ప్రకటించింది. దేశంలో 1990 అనంతరం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ కింద విపత్తు నిర్వహణ సెల్‌ను ఏర్పాటు చేయడంతో ఒక శాశ్వత, వ్యవస్థాగతమైన ఏర్పాటు ప్రారంభమైంది. తదనంతరం దేశంలో సంభవించిన విపత్తులను అనుసరించి అప్పటి వ్యవసాయ మంత్రిత్వశాఖ కార్యదర్శి జేసీ పంత్‌ చైర్మన్‌గా విపత్తుల నిర్వహణపై సమగ్ర విధానాన్ని రూపొందించడానికి అత్యున్నతాధికార కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ నిర్ణయం ప్రకారం 2002లో కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలోకి మార్చారు. దీన్ని అనుసరించి దేశంలో విపత్తు నిర్వహణకు ఒక అధికార క్రమ నిర్మాణం ఏర్పడిరది.
దేశంలో విపత్తు నిర్వహణ నిర్మాణం
విపత్తు నిర్వహణ కోసం జాతీయస్థాయిలో శాసననిర్మాణ అవసరాన్ని ప్రధానంగా పేర్కొన్న అన్ని పార్టీల సమావేశం 2005 జనవరి 9న జరిగింది. విపత్తు నిర్వహణ బిల్లును రాజ్యసభలో మొదటిసారిగా 2005 మే 11న ప్రవేశపెట్టారు.- జిఎన్‌వి సతీష్‌

పేదలకు శ్రీరామరక్ష జగనన్న సురక్ష

రాష్ట్రంలోని ప్రజలందరికీ వంద శాతం సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా సీఎం జగన్‌ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మక జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఒక్క మాట లో చెప్పాలంటే సంక్షేమ పథకాలకు అర్హులై ఉన్న ఏఒక్కరూ లబ్ధి అందకుండా మిగిలి పోకూడదన్న తపనతో..వారికి ఏచిన్న సమస్య ఉన్నా దానిని పరిష్కరించాలన్న చిత్తశుద్ధితో ప్రారం భించిన జగనన్న సురక్ష పథకానికి విశేష స్పందన లభించింది.గత నెలాఖరువరకు ఇంటిం టికీ నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో కొన్ని లక్షల మంది రోగులకు లబ్ది చేకూరింది.ఎంతో బృహత్తర రమైన జగనన్న సురక్ష పథకంపై ప్రత్యేక కథనం..!
అర్హులకు పథకాల లబ్ది చేకూర్చడమే లక్ష్యంగా జులై 1వ తేదీ నుంచి సమస్యల పరిష్కా రానికి క్యాంపుల ప్రారంభం. ఇందులో భాగంగా 11రకాల ధ్రువ పత్రాల సేవలు ఉచితంగా అందించనున్నారు.ఇప్పటికే తొలిదశలో ప్రజల సమస్యలు సిబ్బంది నమోదు చేశారు. ఈ కార్య క్రమం తొలిదశలో గ్రామ, వార్డు సచివాల యాల పరిధిలోని సిబ్బంది, ప్రజా­ప్రతినిధులు, వాలం టీర్లు, గృహసారథులు ప్రతి ఇంటికీ వెళ్లి జగనన్న సురక్ష గురించి వివరించడం జరిగింది. ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి అక్కడ ఇంకా ఎవరికైనా అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలు అందడం లేదా? ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా? వివిధరకాల సర్టిఫికెట్లను పొందడంలో ఏమైనా ఇబ్బందులున్నాయా? అనే అంశాలను నిశితంగా పరిశీలించి..ఆ వివరాలను నమోదు చేసుకున్నారు.
ప్రతి ఇంటిని కవర్‌ చేసేలా కార్యక్రమం
‘‘ఈ కార్యక్రమంపై సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి వైద్యఆరోగ్యశాఖాధికారులకు దిశ నిర్ధేశాలు ఆదేశించారు.ప్రతి ఇంట్లో ఆరోగ్య సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కారించే గొప్ప బాధ్యతను మనం తీసుకుంటున్నాం.మనం చేసే ఈ కార్యక్ర మం ద్వారా గ్రామంలో ఒక పర్టిక్యులర్‌ రోజు నాడు హెల్త్‌ క్యాంపు నిర్వహిస్తాం. అందులో ప్రజలకు అవసరమైన పరీక్షలు చేయడం పాటు, మందులు,కళ్లద్దాలు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుం టున్నాం.హెల్త్‌ క్యాంపు నిర్వహించిన గ్రామాన్ని మ్యాపింగ్‌ చేసి, ఏ సమస్యలున్నాయన్నది తెలుసు కుని ఫ్యామిలీ డాక్టర్‌ విలేజ్‌ క్లినిక్‌ ద్వారా వాటిని పరిష్కరిస్తారు.ఆ తర్వాత గ్రామంలో ప్రతి ఇంట్లో ఎవరికి ఎలాంటి ట్రీట్‌మెంట్‌ జరగాలి, ఎలాంటి మందులు కావాలో తెలుస్తుంది. ఇంట్లో ఫెరా లసిస్‌, మరేదైనా సమస్య ఉంటే వారికి రెగ్యులర్‌గా మెడిసిన్‌ ఇవ్వడంతో పాటు వైద్యుడు వారిని పరీక్షించి…వారికి అవసరమైన మందులతో పాటు చికిత్స కూడా అందించే కార్యక్రమం చేపడుతున్నాం.ఒకవైపు తనిఖీలు చేస్తూనే మందు లు కూడా ఇవ్వబోతున్నాం. ఇది చాలా పెద్ద మార్పు.దీనికి సంబంధించిన బాధ్యత కలెక్టర్లు తీసుకోవడం అభినందనీయమని సీఎం జగన్‌ అభినందించారు. సీఎం ఆదేశాలు మేరకు రాష్ట్రంలోని ఆయా గ్రామంలో ప్రతి ఇల్లు తిరిగారు. క్రానిక్‌ పేషెంట్లు ఉన్న ఇళ్లపై ప్రత్యేక శ్రద్ధచూపారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతల తోపాటు రక్తహీనత ఉన్నవాళ్లను గుర్తించారు. అదేరకంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతు న్నవారు,నియోనేటల్‌ కేసులతో పాటు బీపీ, షుగర్‌ వంటి వాటితో బాధపడుతున్న వారికి కూడా చికిత్స అందించారు.ఆయా వ్యాధులు రాకుండా నివారణ చర్యలపై కూడా గ్రామాల్లో అవగాహన కలిగించారు.ప్రతి గ్రామాన్ని మేపింగ్‌ చేసి,45 రోజుల పీరియడ్‌తో ఈ కార్యక్రమాన్ని సర్ధవం తంగా నిర్వర్తించారు. సీఎం ఆదేశించిన మేరకు ప్రతి మండలంలో నెలకు 4 గ్రామాల్లో హెల్త్‌ క్యాంపులు నిర్వహించాలని ఆయా జిల్లా కలెక్టర్ల కిందస్థాయి సిబ్బందికిచ్చిన ఆదేశాలు మేరకు పరీక్షలు నిర్వహించారు. దీనివల్ల ప్రతి 6 నెలలకొకసారి ఆమండలంలో ఉన్న ప్రతి గ్రామంలోనూ హెల్త్‌ క్యాంపు నిర్వహించినట్లవు తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
నాలుగు దశల్లో ఆరోగ్య సురక్ష కార్యక్రమం
తొలిదశలో వలంటీర్లు, గృహసారధులు, ప్రజా ప్రతినిధులు ఈ ముగ్గురూ కలిసి ప్రతి ఇంటినీ సందర్శించారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేయ బోయే రోజు, తేదీతోపాటు ఏయే కార్యక్రమాలు చేపడతామో వివరించారు. ఆరోగ్యశ్రీ పథకంలో ఉన్న ఆసుపత్రుల వివరాలు,పథకాన్ని ఎలా విని యోగించుకోవాలన్న అంశాలపై అవగాహన కల్పించారు. తర్వాత దశలో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, ఆ ఏరియా వాలంటీర్లతో కలిసి వెళ్లి 7 రకాల టెస్టులకు సంబంధించిన వివరాలను ప్రజ లకు తెలిపారు. రెండో టీం ఆశావర్కర్‌, ఏఎన్‌ఎం తో సీహెచ్‌ఓ వచ్చారు. ఇక్కడితో రెండో దశ పూర్తవుతుంది.7రకాల టెస్టులు చేసే విధంగా.. బీపీ,షుగర్‌, హిమోగ్లోబిన్‌, యూరిన్‌ టెస్టుతో పాటు (ఉమ్మి)స్పూటమ్‌ టెస్ట్‌,మలేరియా, డెంగ్యూ పరీక్షలు కూడా నిర్వహిస్తారు.ప్రతి ఇంటికి వెళ్లి ఈ పరీక్ష లు నిర్వహిస్తారు.మొబైల్‌ యాప్‌లో ఇలా సేకరిం చిన డేటాను అప్‌డేట్‌ చేస్తారు. ప్రతి ఇంటికి, పేషెంట్‌కి ఒక కేస్‌ షీట్‌ కూడా జనరేట్‌ అవు తుంది. ఫేజ్‌-3లో మరోసారి ఓరియెంటేషన్‌ కార్యక్రమం ఉంటుంది.హెల్త్‌ క్యాంప్‌ జరగబో యే 3 రోజుల ముందు మరోసారి వాలంటీర్‌, ఏఎన్‌ఎం,ప్రజా ప్రతినిధులు ప్రజలు ఆ గ్రామం లో మరోసారి గుర్తు చేస్తారు. ఫేజ్‌ 4లో హెల్త్‌ క్యాంపు నిర్వహిస్తారు. ప్రతి మండలంలో ఒక రోజు హెల్త్‌ క్యాంపు ఉంటుంది.45రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో..రూరల్‌,అర్బన్‌ ఏరియా లోనూ ఈ హెల్త్‌ క్యాంపులు నిర్వహిస్తారు.
ఖాళీలుంటే వెంటనే భర్తీ చేయాలి
వైద్యారోగ్యశాఖలో నాలుగేళ్లలో 53,126 పోస్టు లు భర్తీ చేశామని సీఎం జగన్‌ అన్నారు. అన్ని ఆసుపత్రులను జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేశామన్నారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌స ీలు, టీచింగ్‌ ఆసుపత్రుల వరకు నాడు-నేడుతో అప్‌గ్రేడ్‌ చేస్తున్నామన్నారు.2356 సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. ప్రతి పేషెంట్‌ ఈ సేవలను ఉచితంగా అందుకోవాల న్నదే లక్ష్యమన్నారు. ప్రతి పేషెంట్‌ డబ్బులు ఖర్చు లేకుండా..అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా చికిత్స అందుకోవాలన్నదే మన తాపత్రయం అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఎక్కడైనా ఖాళీలుంటే మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు వాటిని తక్షణమే భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇదో మంచి నిర్ణయం
జగనన్న ఆరోగ్య సురక్ష పథకం కింద 30 రోజుల పాటు ప్రత్యేకంగా వైద్య శిబిరాలు నిర్వహించను న్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు.వచ్చే నెలాఖరు నాటికి రాష్ట్రంలో శిబిరాల నిర్వహణ పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మండలానికి ఒక గ్రామం చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజూ వైద్య శిబి రాలు జరుగుతాయని..శిబిరంలో 105 రకాల మందులు అందుబాటులో ఉంచుతాం. రోగులకు భోజన సదుపాయం కల్పిస్తామని.. ఇద్దరు స్పెష లిస్టు డాక్టర్లు, ఇద్దరు పీహెచ్‌సీ వైద్యులు పాల్గొం టారన్నారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల నుంచి కూడా ఒక స్పెషలిస్టు వైద్యుడు హాజరవుతారని తెలిపారు.
రాష్ట్రంలోని పేదలందరికీ ఆరోగ్య భరోసా కల్పిం చాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు మంత్రి విడదల రజిని.వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ఆరోగ్యశ్రీ సేవల వివరాలు, అనుబంధ ఆసుపత్రుల జాబితాతో కూడిన కిట్‌లు అందజేస్తారని మంత్రి చెప్పారు. ఇంటిలో ఆరోగ్య సమస్యలున్న వారిని గుర్తించి,స్థానికఏఎన్‌ఎంలకు తెలియజేస్తారన్నారు.మరుసటి రోజు నుంచి ఏఎన్‌ఎంలు, సీహెచ్‌వోలు ఇంటింటికీ వెళ్లి అవస రమైన వారికి షుగర్‌, బీపీ, రక్త పరీక్షలు చేస్తార న్నారు. శిబిరాల నిర్వహణ సమయానికి వారి హెల్త్‌ రిపోర్ట్‌ సిద్ధం చేస్తారని పేర్కోన్నారు.
ప్రజల ఆరోగ్య సమస్యలకు స్థానికం గానే స్పెషలిస్ట్‌ డాక్టర్లద్వారా చికిత్స అందిం చడమే ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమ ధ్యేయ మని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో భాగంగా ఈనెల 15 నుంచి గ్రామ, వార్డు వలం టీర్లు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య రక్షణపై అవగాహన కల్పిస్తారన్నారు. ఆరోగ్యశ్రీ కరపత్రాన్ని పంపిణీ చేసి.. సేవలను వివరిస్తారన్నారు. ఈనెల 16 నుంచి వైఎస్సార్‌ విలేజ్‌ క్లీనిక్‌, వైఎస్సార్‌ అర్బన్‌ క్లీనిక్‌ల పరిధిలోని గృహాలను ఏఎన్‌ఎంలు, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు(సీహెచ్‌వోలు) సందర్శి స్తారన్నారు.ప్రజలకు ప్రాథమిక వైద్య పరీక్షలు చేసి.. ఆరోగ్య సమస్యలను గుర్తిస్తారు. ఆ ఫలితా లను డాక్టర్లకు అందుబాటులో ఉంచుతారు. ఆరోగ్య సమస్యలున్న వారు వైద్య శిబిరాలకు హాజరయ్యేందుకు వీలుగా ఏఎన్‌ఎంలు, కమ్యూ నిటీ హెల్త్‌ ఆఫీసర్లు టోకెన్‌ నంబర్లు ఇస్తారు. ఈనెల 30నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ శిబిరాలను వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాటు చేయనుంది. ప్రతిరోజూ.. ప్రతి మండ లంలోనూ ఏదో ఒక వైఎస్సార్‌ విలేజ్‌ క్లీనిక్‌తో పాటు ప్రతి పట్టణంలోనూ ఏదో ఒక వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో ఈ వైద్య శిబి రాన్ని నిర్వహిస్తారు. నెల రోజుల పాటు ఈ శిబిరాల నిర్వహణ కొనసాగుతుంది. ఈ వైద్య శిబిరాల్లో మొత్తం 342 మంది స్పెషలిస్ట్‌ డాక్టర్లు సేవలందిస్తారు. అలాగే ఆయా మండలాల్లోని ఇద్దరు పీహెచ్‌సీ వైద్యులతో పాటు ఫ్యామిలీ డాక్టర్‌, ఇతర వైద్య సిబ్బంది పాల్గొంటారు. 162 రకాల మందులతో పాటు 18 రకాల శస్త్రచి కిత్సల వస్తువులు, 14రకాల ఎమర్జెన్సీ కిట్లు తదిత రాలను అందుబాటులో ఉంచుతారు. ఆరోగ్య సమస్యలున్న వారిని వైద్యులు పరీక్షిస్తారు. అవసర మైన వారికి ఈసీజీ వంటి వైద్య పరీక్షలు కూడా చేసి.. ఉచితంగా మందులిస్తారు. ఎవరికైనా పెద్ద చికిత్సలు అవసరమైతే డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద రిఫర్‌ చేస్తారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం అమలులో ఆయా శాఖల మధ్య సమన్వ యం అవసరమని సీఎస్‌ జవహర్‌రెడ్డి అన్నారు. వివిధ శాఖల అధికా రులతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఇంటింటి సర్వే నిర్వహణ సమయంలో సాధారణ వాటితోపాటు దీర్ఘకాలిక వ్యాధులు, గర్భిణులు, బాలింతలు, తగిన బరువు లేని పిల్లలు,క్షయ, కుష్ఠు వ్యాధులు కలిగిన వారు ఉంటే.. ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా ‘‘జగనన్న ఆరోగ్య సురక్ష’’.
ప్రజల ఆరోగ్య అవసరాలు గుర్తించేందుకు, పరీక్షలు నిర్వహించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా నిర్వహించిన ‘‘జగనన్న ఆరోగ్య సురక్ష’’ కార్యక్రమ సమావేశంలో పేర్కొ న్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి.ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ గా రాష్ట్రాన్ని తీర్చి దిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహించనున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని సిఎం క్యాంప్‌ కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు,జాయింట్‌ కలెక్టర్లు ,మున్సి పల్‌ కమిషనర్లు,వైద్య,విద్యాశాఖ అధికా రులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశం నిర్వ హించి,ఈ కార్యక్రమ నిర్వహ ణకుశాఖల వారీగా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను సమీక్షించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నెలరోజుల పాటు చేపట్టిన జగనన్న సురక్ష పథకం ప్రజల్లో మంచి గుర్తింపు లభించింది.– జి.ఎన్‌.వి.సతీష్‌

ప్రకృతి వైఫరిత్యాలు..పెరుగుతున్న మార్పులు

ప్రకృతి ప్రకోపానికి ప్రపంచ దేశాలు అల్లకొల్లోల మవుతున్నాయి. మొన్న అమెరికాలో సంభవించిన ఐస్‌ తుఫాన్లు, నిన్న టర్కీ,సిరియా రెండు దేశాల్లో సంభవించిన వరస భూకంపాలుతో సుమారు 4,500మంది మృతిచెందగా వేలాది మంది క్షతగాత్రులుగా మిగిలారు. నేడు ఆఫ్రికా దేశం లిబియా లోని డెర్నా నగరంలో సంభవించిన డేనియల్‌ తుఫాన్‌ కారణంగా ఏర్పడిన వరదల ధాటికి లిబియా దేశం అతలాకుతలమైంది. ఓ వైపు భారీ వర్షాలు,మరోవైపు ఆకస్మిక వరదలు లిబియాలో పెను వివిధ్వంసాన్ని సృష్టించాయి.ఈ క్రమంలోనే డ్యామ్‌లు పగిలిపోవడం తో ఏకంగా డెర్నా నగరం పూర్తిగా మునిగిపోయింది. రాత్రి నిశ్శబ్ధంగా ఉన్న నగరంలో ఉదయం వరకు తుఫాన్‌ విలయం సృష్టించింది. ఎటు చూసినా కూలి పోయిన బిల్డింగ్‌లు, కొట్టుకుపోయిన శవాలు, వాహనాలతో భీతావహ దృశ్యాలు కనిపి స్తున్నాయి. సుమారు 20వేల మంది మృత్యువాత పడ్డారు. ఇంకా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది.మెరుపు వరదల ధాటికి వేల మంది తీరానికి కొట్టుకొస్తున్నాయి. దీంతో సముద్ర తీరంలో శవాలు కుప్పగా మారింది. ఇప్పటికే టెర్రరిజం, అశాంతితో నిత్యం ఘర్షణలు జరిగే డెర్నా నగరంలో డేనియల్‌ తుఫాన్‌ మరింత పరిస్థితులు దిగజారాయి. ప్రస్తుతం డెర్నా నగరంలో తుఫాన్‌ బీభత్సానికి సంబం ధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడి యాలో వైరల్‌గా మారాయి. కొండలు, గుట్టల మధ్య నుంచి డెర్నా నగరం గుండా ప్రవహించే నది పరిసరాల్లో ఉన్న ఇళ్లు, భవనాలు పూర్తిగా నేల మట్టం అయ్యాయి. ఎన్నో అపార్ట్‌మెంట్‌లు బురదలో కూరుకుపోయినట్లు సోషల్‌ మీడియా ద్వారా తెలుస్తోంది.
భూకంపం,తుఫాను,వరదలు,సునామీ మొద లైన ప్రకృతి వైపరీత్యాలు మానవ నియంత్రణా పరిధికి ఆవల ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు,అనేక ప్రకృతి వైపరీత్యాలతో విధ్వంసానికి గురౌతున్నాయి. తీవ్రమైణ ఆస్తి,ప్రాణనష్టాలు జరు గుతున్నాయి. కొన్ని రకాల వైపరీత్యాలను ఎదుర్కొన డానికి, ముందుగా సిద్ధం కావటానికి మానవ చైత న్యం అవసరం.పునరావాస పనులు,ప్రథమ చికిత్స, ఆహారం,బట్ట్‌లు,మందులు,రక్షణ చర్యలు, ఆశ్రయం, మొదలైన అంశాల గురిం చి ప్రజలు తగినంత అవగాహన కలిగి వుండాలి.ప్రకృతి విపత్తులు ఎక్కువగా సంభ వించేది గాలి-నీరు వలనే. తుఫాన్‌, అతి భారీ వర్షాలు, వరదలు, ఈదురు గాలులు ఇంకా సునామీ వంటి విపత్తులు మనవాళికి తీవ్ర నష్టం చేస్తూ ఉంటాయి. సముద్ర గర్భంలో జరిగే విపరీత చర్యలు వలన సునామీ ఏర్పడితే, తీర ప్రాంతం అంతా నీటిమయం అవుతుంది. తీరప్రాంతాలు అన్నీ నీట మునుగుతాయి. ఇటువంటి సునామీలు వలన ఏర్పడే ప్రకృతి వైపరీత్యాలు అపార నష్టం తీసుకువస్తాయి. ఇంకా సముద్రంలో ఏర్పడే అల్పపీడనం వలన తీవ్ర వర్షాలు, అతి భారీ వర్షాలు కురవడం వలన కూడా నదులు విపరీతంగా ప్రవచించి వరదలుగా సంభ విస్తాయి.వరదల వలన ప్రాణ నష్టం, పంటనష్టం,ఆస్తి నష్టం,వ్యవస్థలు స్తంభించడం వంటివి జరుగుతాయి. వాయుగుండం తీరం దాటుతున్నప్పుడు ఈదురు గాలులు, అతిభారీ వర్షాలు చాలా నష్టం కలిగిస్తాయి. వాతా వరణం మార్పులు గమనిస్తూ, ముందస్తు హెచ్చరికలు చేయడం వలన ఒక్కోసారి గాలి-నీరు వలన సంభవించే ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్త వహించినా ఒక్కోసారి ప్రాణనష్టం కూడా సంభవించేది.గాలి-నీరు వలన సంభవించే విపత్తుల నుండి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్త పడగలరు కానీ ఆస్తి నష్టం,ఆర్ధికనష్టం,వ్యవస్థలు స్తంభించడం వంటివి జరగకుండా అడ్డుకోవడం అసాధ్యమే అవుతుంది. అయితే ప్రకృతి వైపరీత్యాలు జరిగిన వెంటనే పునరుద్దరణ చర్యలు తీసు కునే వ్యవస్థ మనకు అందుబాటులో ఉండాలి. అందుకు అందరూ స్పందించి తగినంత సాయం చేయాలి. ఇటువంటి సాయం చాలామంది చేసి ఉన్నారు కూడా.
భూకంపాలు -భూమి కంపించుట వలన ప్రకృతి వైపరీత్యాలు
భూమి అడుగుభాగం వివిధ పొరలతో వివిధ లోహాలతో ఉంటుంది. భూమి లోపల కూడా నీరు, ఖనిజాలు ఉంటాయి. భూమి లోపల చర్యలు జరిగినప్పుడు భూమి ప్రకంపనలకు గురి అవుతుంది. అకస్మాత్తుగా భూమిలోపల ఏర్పడే చర్యలతో లేక విడుదల అయ్యే శక్తి వలన భూమి కంపిస్తుంది. అలా భూమి కంపించినప్పుడు భూమి పగిలి బీటలువారు తుంది.భూమి కంపించడం భూమి పగలడం వలన భూమిపైన ఉండే భవనాలు కూలి పోయే ప్రమాదం ఉంటుంది. అటువంటి ప్రమాదాలు వలన ప్రాణనష్టం, ఆస్తినష్టం, ఆర్ధిక నష్టం జరుగుతూ ఉంటుంది. ఇలా భూమి నుండి ఏర్పడే ప్రకృతి విపత్తుల నుండి రక్షణ కొరకు భూకంపాలను అంచనా వేసే పరికరాల సాయంతో భూకంపం సంభవించే సమయం ముందుగానే పసిగడితే, ముందస్తు చర్యలు వలన ప్రాణనష్టం జరగకుండా చూడవచ్చు.అయితే ఆస్తి నష్టం,ఆర్ధిక నష్టం అడ్డుకోవడం అసాధ్యం.
అగ్ని ప్రమాదాలు వైపరీత్యాలు
అగ్ని వలన జరిగే ప్రమాదాలు ఎక్కువగా మానవ తప్పిదం వలననే జరుగుతాయి.గ్యాస్‌ లీక్‌ కావడం, కెమికల్‌ లీకేజ్‌ తదితర తప్పుల వలన అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. ఇటువంటి అగ్ని ప్రమాదాలు నుండి రక్షణ కొరకు నీరు, ఇసుక, వాయువులు వంటివి అందుబాటులో ఉండడం వలన అగ్ని ప్రమాదాలు పెద్ద ప్రమాదాలుగా పరిణ మించకుండా జాగ్రత్త పడవచ్చు.పెద్ద మొత్తం లో గ్యాస్‌ లీకేజ్‌ వంటివి అపార నష్టం చేయ గలవు. మానవ తప్పిదం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే, అగ్ని ప్రమాదాల నుండి రక్షణ ఉంటుంది.అగ్నిమాపక సిబ్బంది వలన చాలావరకు అగ్ని ప్రమాదాలను ఆర్పిన ఘటనలు ఉన్నాయి.
ప్రకృతి వైపరీత్యాల జరగకుండా చర్యలు
ప్రకృతి వైపరీత్యాల జరగకుండా చర్యలు, అంటే ప్రకృతిలో అసహజత్వం జరగకుండా చూసుకోవడమే అంటారు. సహజంగా ఏర్పడిన పర్యావరణంలో భూమిపై గాలి, నీరు, నిప్పు సాయంతో జంతుజాలం, మానవుడు నివాసం ఉంటారు. జంతువులు కేవలం వాటి ఆహారం, నివాసం విషయంలో ప్రకృతిలో లభించే సహజస్థితిలోనే జీవిస్తాయి. ప్రకృతిని తనకు నచ్చినట్టుగా మార్చుకునే తెలివి, సామర్ధ్యం మనిషికి సొంతం. అటువంటి తెలివి ప్రకృతి సహత్వాన్ని దెబ్బతీసి, ప్రకృతి సమతుల్యత పాడైతేమాత్రం ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయి. ఎంత సహజంగా ప్రకృతి ఉంటే అంతా ఆహ్లాద కరమైన ప్రకృతి, ఎంత అసహజత్వానికి గురి అయితే, అంతటి విపత్తులను పొందుతుంది. అది విపరీత స్వరూపాన్ని పొందితే మాన వాళికి నష్టమే కానీ లాభం ఉండదు.ప్రకృతి విపరీత స్థితికి చేరడానికి గాలి-నీరు ఎక్కువగా సాయపడతాయి. ప్రకృతిలో కుత్రిమ చర్యలు సహజత్వాన్ని పాడు చేయకుండా తగు జాగ్రత్తలు టేసుకోవాలి. మనిషితోబాటు కలిసి జీవించే జంతుజాలం వలన కూడా ప్రకృతి సమతుల్యత ఉంటుంది అని అంటారు. కాబట్టి ప్రకృతిలో జంతుజాలం అంతరించిపోయే చర్యలను కూడా నివారించాలి. ప్రకృతి వైపరీత్యాల నివారణకు, ప్రకృతిని సహజత్వం నుండి దూరం చేయకుండా ఉండడమే ప్రధానం. ప్రకృతి వైపరిత్యాలను మనం ఆపలేం.అయితే వరదలు, తుఫానులు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలవంటి ప్రకృతివైపరీత్యాలు సంభ వించడంవల్ల పర్యావరణం కలుషితమవు తుంది.అనేక రకాల రోగాలు ప్రబలుతాయి. మనుషులతో సహా జంతువులన్నీ కూడా రోగా లబారిన పడ తాయి. కాబట్టి ఇలాంటి సంద ర్భాలలో మనం అప్ర మత్తంగా ఉండడంతో పాటు ఇతరులకు సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉండాలి. బట్టలు, ఆహారపదార్థాలు సేకరించి పంపడం,సేవా క్యాంపులలో పాల్గొనడం చేయాలి. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినపుడు తీసుకో వలసిన జాగ్రత్తల పట్ల అవగాహన కలిగించ డానికి ప్రయత్నం చేయాలి. ప్రకృతి వైపరీ త్యాలు సంభవించి నప్పుడు 12 నుండి 15 సంవత్స రాల వయస్సుగల పిల్లలు చేపట్టగల సహాయ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ా వరదనీటిలోకి ప్రవేశించవద్దు.
ా మురుగునీటి కాలువలు, కల్వర్టులకు దూరంగా ఉండండి.
ా విద్యుదాఘాతానికి గురికాకుండా విద్యుత్‌ స్తంభాలతో పాటు, పడిపోయిన విద్యుత్‌ లైన్లకు దూరంగా ఉండండి.
ా ఓపెన్‌ డ్రెయిన్స్‌ లేదా మ్యాన్‌హూల్స్‌ను గుర్తించి ఆప్రదేశంలో కనిపించే విదంగా చిహ్నాలు,ఎర్ర జెండాలు లేదా బారికేడ్లు ఉంచండి.
ా వరదనీటిలో నడవకండి లేదా డ్రైవ్‌ చేయవద్దు
ా రెండు అడుగుల మేర ప్రవహించే వరద నీరు పెద్ద కార్లను కూడా తోసుకు పోగలవు
ా తాజాగా వండిన లేదా పొడి ఆహారాన్ని తినండి.
ా తినే ఆహార పదార్ధాలపై ఎల్లపుడూ మూతలు వేసి ఉంచండి
ా వేడిచేసిన లేదా క్లోరినేటెడ్‌ నీరు త్రాగాలి.
ా మీ పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి పెద్ద కార్లను కూడా తోసుకుపోగలవు
వరదల వచ్చిన తర్వాత చేయాల్సిన / చేయకూడని పనులు
్చ మీ పిల్లలను వరద నీటిలో ఆడనివ్వకండి
్చ రిపేర్‌కు వచ్చిన విద్యుత్‌ వస్తువులను ఉపయోగించవద్దు
్చ అధికారులు సూచించిన వెంటనే కరెంట్‌కు సంబందిం చిన ప్రధాన స్విచ్లు లను,ఎలక్ట్రిక్‌ ఉపకరణాలను వాడడం మానెయ్యాలి
్చ తడిగా ఉంటే విద్యుత్‌ పరికరాలను తాకవద్దు.
్చ విరిగిన విద్యుత్‌ స్తంభాలు,తీగలు,పదునైన వస్తువులను పరిశీలించండి
్చ వరద నీటిలో కలిసిన ఆహారం తినవద్దు.
్చ మలేరియావంటి వ్యాధులను నివారిం చడానికి దోమతెరలను వాడండి.
్చ వరద సమయంలో పాము కాటు సాధారణంకాబట్టి పాముల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
్చ నీటి మార్గాలు/మురుగునీటిపైపులు దెబ్బతి న్నట్లయితే టాయిలెట్‌ లేదా కుళాయి నీటిని వాడకండి.
్చ నీరు త్రాగడానికి సురక్షితమని ఆరోగ్య శాఖసలహా ఇచ్చే వరకు పంపు నీరు తాగవద్దు.
్చ మీ ప్రాంతంలో వరదలు సంభవించి ఖాళీ చేయవలసివస్తే మంచం,టేబుళ్లపై మీ ఫర్నిచం ఇతర ఉపకరణాలను పెట్టండి.
్చ మీ కరెంట్‌,గ్యాస్‌ కనెక్షన్‌ ను ఆపివేయండి
్చ ఎత్తైన భూ ప్రదేశం లేదా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళండి.
్చ మీ వద్ద ఉన్నఅత్యవసర వస్తు సామగ్రి, ప్రథమ చికిత్స పెట్టె,విలువైన వస్తువులు, ముఖ్యమైన పత్రాలను తీసుకొని వెళ్ళండి.
భూమి వేడెక్కితే ఏం జరుగుతుంది?
గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రపంచానికి పెను విపత్తుగా మారబోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరి స్తున్నారు. మనుషుల చర్యల వల్ల వాతవర ణంలోకి కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉద్గారాలు భారీగా పెరిగాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు కూడా మండుతున్నాయి. ధ్రువాల్లో మంచు కరుగుతోంది.ప్రతికూల వాతా వరణ పరిస్థితులు పెరుగుతున్నాయి. భూమి సగటు ఉష్ణోగ్రత15డిగ్రీసెంటీగ్రేడ్లు.గతంలో ఇది ఇంత కన్నా ఎక్కువగా,తక్కువగా కూడా ఉంది.ఈ ఉష్ణోగ్రతలో మార్పులు సహజమే. అయితే, మునుపటి కన్నా చాలా వేగంతో ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగు తున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌ దీనికి కారణమని వారు చెబుతున్నారు. గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌ అంటే సూర్యుడి నుంచి భూమిపైకి వచ్చే శక్తిలో కొంత భూమిపైనే నిలిచిపోవడం. భూమిపై నుంచి పరావర్తనం చెంది అంతరిక్షంలోకి వెళ్లాల్సిన సౌరశక్తిని గ్రీన్‌హౌజ్‌వాయువులు గ్రహిం చుకుని తిరిగి భూమిపైకి చేరేలా చేస్తున్నాయి. ఫలి తంగా వాతావరణం,భూ ఉపరితంల వేడెక్కు తున్నాయి. ఈఎఫెక్ట్‌ లేకపోతే భూమి ఇంకో 30డిగ్రీ సెంటీగ్రేడ్స్‌ చల్లగా ఉండేది. జీవం మనుగడ కష్టమ య్యేది.అయితే ఈ గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌కు పరిశ్రమలు, వ్యవసాయంవల్ల వెలువడే వాయువులుతోడై మరిం త శక్తిని గ్రహించి, ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీన్నే గ్లోబల్‌ వార్మింగ్‌ (భూమి వేడెక్కడం),వాతావరణ మార్పులు అంటారు.
గ్రీన్‌ హౌజ్‌ వాయువులు ఇవే…
గ్రీన్‌హౌజ్‌ వాయువుల్లో అత్యంత ప్రభా వవంతమైంది నీటిఆవిరి.కానీ,అది వాతా వర ణంలో కొన్ని రోజులపాటే ఉంటుంది. కార్బన్‌ డై ఆక్సైడ్‌ చాలా కాలం ఉంటుంది. అది పారిశ్రా మికీకరణ కన్నా ముందుఉన్న స్థాయిలకు వెళ్లాలంటే కొన్ని వందల ఏళ్లు పడుతుంది. సముద్రాల్లాంటి సహజ జలవనరులు దాన్ని పీల్చుకోగలవు. శిలాజ ఇంధనాలను మండిరచడంవల్లే అత్యధికంగా కార్బన్‌ డై ఆక్సైడ్‌ విడుదలవుతోంది. కార్బన్‌ డై ఆక్సైడ్‌ను పీల్చుకునే అడవులను నరికి,కాల్చేయడంవల్ల కూడా కార్బన్‌ వెలువడుతోంది.గ్లోబల్‌వార్మింగ్‌ ఎక్కువవు తోంది.1750లో పారిశ్రామిక విప్లవం మొదలై నప్పటితో పోలిస్తే కార్బన్‌ డై ఆక్సైడ్‌ స్థాయిలు 30శాతం పెరిగాయి.అయితే,కార్బన్‌డైఆక్సైడ్‌ అం తటి స్థాయిలో అవి లేవు.
గ్లోబల్‌ వార్మింగ్‌కు ఆధారాలు ఉన్నాయా?
పారిశ్రామిక విప్లవం కన్నా ముందు నాళ్లతో పోల్చితే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఇప్పుడు ఒక సెంటీగ్రేడ్‌ పెరిగినట్లు ప్రపంచ వాతా వరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) చెబుతోంది. అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు నమోదైన 20ఏళ్లు..గత 22 ఏళ్లలోనే ఉన్నాయి. 2005-2015 మధ్య సగటు సముద్ర మట్టం 3.6 మిల్లీమీటర్లు పెరిగింది. ఉష్ణోగ్రత పెరగడం వల్ల నీరు వ్యాకోచించి ఇది ఎక్కువగా జరిగింది. ఉష్ణోగ్రత పెరుగుతున్న ప్రాంతాల్లో హిమనీనదాలు కరుగుతున్నాయి. ఉష్ణోగ్రత పెరుగుదలను1.5డిగ్రీ సెంటీగ్రేడ్‌లకు కట్టడి చేసు కోగలిగితే క్షేమంగానే ఉండొచ్చని ఇటీవలికాలంలో శాస్త్రవేత్తలు,నాయకులు అంటున్నారు. గ్రీన్‌ హౌజ్‌ ఉద్గారాల కట్టడి విషయంలో రాజకీయంగా జరుగు తున్న కృషికి ఐరాసనేతృత్వం వహిస్తోంది. ఇప్పటి కిప్పుడు గ్రీన్‌ హౌజ్‌ వాయువుల ఉద్గారాలు గణనీ యంగా తగ్గించుకున్నా, వాతావరణంపై ప్రభావం తప్పదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ప్రభావం ఎలా ఉంటుంది?
వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉంటు దన్నదానిపై స్పష్టత లేదు.ప్రతికూల వాతా వరణ పరిస్థితులు పెరుగతాయి. దీంతో మంచినీటి కొరత ఏర్పడొచ్చు. ఆహారఉత్పత్తి పైనా తీవ్ర ప్రభా వం పడొచ్చు. వరదలు, తుఫానులు, వడగాలులవల్ల మరణాల సంఖ్య పెరగొచ్చు. భూతాపం పెరగడంవల్ల ఎక్కువ నీరు ఆవిరవుతుంది. సముద్ర మట్టాలు పెరుగు తాయి కాబట్టి వరదలు కూడా పెరగొచ్చు. ఈ మార్పులను తట్టుకునే సామ ర్థ్యం లేని పేద దేశాలపై ప్రభావం విపరీ తంగా ఉండొచ్చు. పరిస్థితులకు అంత త్వరగా అలవాటు పడలేవు కాబట్టి కొన్ని రకాల మొక్కలు, జంతువులు అంతరించి పోవచ్చు. మలేరియా లాంటి వ్యాధులు, పోషకాహార లోపాల బారిన కోట్ల మంది పడొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూ హెచ్‌ఓ)అంచనా వేసింది. వాతావరణంలో పెరిగిన కార్బన్‌ డై ఆక్సైడ్‌ను సముద్రాలు ఎక్కువగా పీల్చుకోవడంవల్ల వాటి ఆమ్లత్వం ఇంకా పెరగొచ్చు. కోరల్‌ రీవ్స్‌కు ముప్పు ఏర్పడొచ్చు. వాతావరణ మార్పులపై స్పందించడమే ఈశతాబ్దంలో మానవాళికి అతి పెద్ద సవాలు కాబోతోంది.
`వ్యాసకర్త : వాతావరణ మార్పుల పరిశోధకుడు,సెంట్రల్‌ యూనివర్శిటీ,హైదరాబాద్‌- (మల్లేష్‌ నాయక్‌)

కార్పొరేట్‌ లాభాల కోసమే..అడవుల విధ్వంసం

ప్రస్తుతం మన దేశంలో భూ వినియోగం విషయంలో ప్రైవేట్‌ కార్పొరేట్ల ప్రయోజనాలు సామాజిక ప్రయోజనాలకు పూర్తిగా వ్యతిరే కంగా ఉన్నాయి. ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ అవసరాల కోసం, గోల్ఫ్‌ కోర్సుల కోసం చాలా ఎక్కువమంది పేదలు నివసిస్తున్న భూములను ఖాళీ చేయిస్తున్నారు. స్వల్ప సంఖ్యలో ఉండేవారికోసం అధిక సంఖ్యాకుల ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారు.మోడీ ప్రభుత్వం మార్కెట్‌ అవసరాలకు (కార్పొరేట్ల అవసరాలకు) అనుగుణంగా భూ వినియో గాన్ని మార్చే పనిలో ఉంది. పెట్టుబడి ఆదిమ సంచయంతో ఇటువంటి మార్పులే జరుగు తాయి. భూమితో సహా అన్ని సంపదలూ సమిష్టిగా అనుభవిస్తున్నవిగాని, చిన్న చిన్న యజమానులు అనుభవిస్తున్నవి గాని కొద్దిమంది కార్పొరేట్ల చేతుల్లో చిక్కడమే కాకుండా, ఆ సంపదల వినియోగం తీరు కూడా మారిపోతుంది. చిన్న చిన్న రైతుల చేతుల్లో ఉండే భూమి కాస్తా కొద్దిమంది కార్పొరేట్ల పాలైతే అప్పుడు అక్కడ చిన్న తరహా ఉత్పత్తి విధానం పోయి,భారీ స్థాయి సరుకుల ఉత్పత్తి మొదలౌతుంది.
ఈ మోడీ ప్రభుత్వం నిరంతరం కార్పొరేట్ల ప్రయోజనాలను నెరవేర్చడం కోసం పనిచేస్తూ వుంటుంది. ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌ రంగంలో, ఇతర రంగాలలో ఉన్న కార్పొరేట్లు ప్రాజెక్టులు చేపట్టి లాభాలను పిండుకోవడం కోసం దేశంలోని విస్తారమైన అటవీ ప్రాంతా లను నాశనం చేయడానికి అనుమతిస్తోంది. అందుకోసం అటవీ సంరక్షణ చట్టానికి సవరణలు తెస్తోంది. తద్వారా ప్రభుత్వ సంరక్షణలో ఉండే కొన్ని అటవీ ప్రాంతాలను ఇకముందు అడవులుగా పరిగణించకుండా అటవీ సంరక్షణ చట్టం పరిధిలోంచి తొలగించనుంది.
1996లో సుప్రీం కోర్టు ఒక తీర్పు వెలువరించింది. దాని ప్రకారం అటవీ ప్రాంతంగా ఉన్న భూమిని, అది ఎవరి స్వాధీనంలో ఉన్నప్పటికీ, దానిని ప్రభుత్వ రికార్డుల్లో అటవీ ప్రాంతంగా నమోదు చేయకపోయినప్పటికీ, ప్రభుత్వం సంరక్షిం చాల్సిందే. ప్రభుత్వ రికార్డులు అటవీ ప్రాంతాలను నమోదు చేయడంలో ఘోరంగా వెనుకబడ్డాయి. అడవి అనే నిర్వచనమే చాలా అస్పష్టంగా ఉంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంది. అందువలన సుప్రీం కోర్టు ప్రతీ రాష్ట్రంలోనూ ఒక నిపుణుల కమిటీని నియ మించాలని, రికార్డుల్లో లేని అన్ని అటవీ ప్రాంతాలనూ గుర్తించాలని, వాటన్నింటికీ అధికారికంగా అటవీ ప్రాంతాలుగా గుర్తింపునివ్వాలని, అప్పుడే వాటిని చట్ట ప్రకారం సంరక్షించడం సాధ్యపడుతుందని ఆ తీర్పులో ఆదేశించింది. ఈ తీర్పు వచ్చిన 18 సంవత్సరాల తర్వాత కూడా, అంటే 2014 నాటికి కూడా హర్యానా, బీహార్‌, గుజరాత్‌, మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాల ప్రభుత్వాలు అటవీ ప్రాంతాలను గుర్తించడానికి కాని, వాటిని ప్రభుత్వ రికార్డులలో తగు విధంగా నమోదు చేయడానికి గాని ఏ విధమైన చర్యలూ తీసుకోలేదు. ఈ సంగతి ఒక పాత్రికేయుల బృందం చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ లొసుగుని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది. ఏకంగా చట్టానికే సవరణలు తెచ్చి రికార్డులకెక్కని అటవీ భూములకు ప్రభుత్వ సంరక్షణ లేకుండా చేస్తోంది.
ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించ డమే. నిజానికి కేంద్రం ఇంతవరకూ సుప్రీంకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేసిన రాష్ట్రాలను హెచ్చరించి ఆ తీర్పు అమలు జరిగేలా చూసి వుండాలి. లేదా కేంద్ర ప్రభుత్వమే ఒక నిపుణుల కమిటీని నియ మించి అన్ని రాష్ట్రాలలోనూ నమోదు కావల సిన అటవీ ప్రాంతాలను గుర్తించి అవి ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయాలని ఆ యా రాష్ట్రాలను ఆదేశించి వుండాల్సింది. అలా చేయకపోగా, రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వాన్ని సాకుగా తీసుకుని సుప్రీం కోర్టు తీర్పునే రద్దు చేసేలా చట్ట సవరణకు సిద్ధం కావడం మోడీ ప్రభుత్వ తెంపరితనానికి నిదర్శనం.సుప్రీంకోర్టు ఉత్తర్వుల కారణంగా తమ నిర్వహణలో ఉన్న తోటలను కూడా అడవులుగా గుర్తించే అవకాశం ఉందని ప్రైవేటు యజమానులు భయపడుతున్నారని, తమ భూములను తమకు నచ్చిన విధంగా వినియోగించుకునే హక్కు కోల్పోతామని వారు భావిస్తున్నారని, అందువలన ప్రైవేటు తోటల విస్తరణ ఆగిపోయిందని, దాని ఫలితంగా పచ్చదనం దెబ్బ తింటోందని, ప్రైవేటు యజమానుల భయాలను పోగొట్టి పచ్చదనాన్ని విస్తరించడానికే ఈ సవరణ తీసుకువస్తు న్నామని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్‌ తమ చర్యను సమర్ధించుకున్నారు. ఇది అందరినీ తప్పుదోవ పట్టించే వాదన. మొదటి విషయం: అడవుల, తోటల విస్తీర్ణం పెరగకపోడానికి ఒక కారణాన్ని అది ముందుకు తెచ్చింది. తోటలు పెంచుతున్న, పెంచాలని అనుకుంటున్న ప్రైవేటు యజమానుల మనసుల్లో భయాలు ఏర్పడ్డాయ న్నదే ఆ కారణం. అటువంటిది వాస్తవంగా ఉందో, లేదో, ఉంటే ఎక్కడెక్కడ, ఎవరెవరికి ఉందో చెప్పగల గణాంకాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి. దానిమీద ఎటువంటి స్వతంత్ర అధ్యయనమూ లేదు, ఆధారాలూ లేవు. రెండవ విషయం:ఒకవేళ ప్రైవేటు యజమాను లకు ఆ విధమైన భయాలు నిజంగా ఉన్నా, అడవులకు, తోటలకు మధ్య తేడాను స్పష్టంగా తెలియజెప్పే విధంగా నిర్వచించడమే దానికి పరిష్కారం ఔతుంది. అలా చేయడం పోయి ఏకంగా చట్టాన్నే మార్చేయవలసిన అగత్యం ఏముంది? ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశ్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అడవీ ప్రాంతాలను సంరక్షించడం కాదు దాని లక్ష్యం. విస్తారమైన అటవీ ప్రాంతాలను వ్యాపారానికి అనువుగా మార్చివేయడమే. అలా గనుక జరిగితే పర్యావరణానికి కలిగే నష్టం అపారంగా ఉంటుంది. ఇప్పటిదాకా, దేశంలో అటవీ భూముల విస్తీర్ణం వాస్తవంగా ఎంత ఉందో ప్రభుత్వం అధికారికంగా వెల్లడిరచలేదు. అందులో ఎంతమేరకు ఇప్పుడు వ్యాపారానికి అనువుగా మార్చబోతున్నారో అంచనా వేయడం సాధ్యం కావడం లేదు. ఐతే ఈ రంగంలోని నిపుణులు మాత్రం గణనీయమైన అటవీ ప్రాంతాన్ని కోల్పోనున్నామని హెచ్చరి స్తున్నారు. ఉదాహరణకు హర్యానా రాష్ట్ర పరిధిలోకి వచ్చే ఆరావళీ పర్వత శ్రేణికి చెందిన అటవీ ప్రాంతం అధికారికంగా అడవిగా నమోదు కాలేదు. ఆ ప్రాంతం దేశ రాజధానికి దగ్గర్లో ఉంది. అందుచేత ఆ ప్రాంతంమీద చాలామంది రియల్టర్ల కన్ను పడిరది. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని వ్యాపారాలకు వినియోగించడం జరిగితే దేశ రాజధాని ప్రాంతంలో అత్యంత ఆవశ్యమైన పచ్చదనం కాస్తా కనుమరుగౌతుంది. ఆంధ్రప్రదేశ్‌, కర్నూలు జిల్లాలో శ్రీశైలం,ఆత్మకూరు, వెలుగోడు, మహానంది,శిరివెళ్ల,రుద్రవరం, ఆళ్లగడ్డ మండలాల పరి ధిలోని నల్లమల అటవీ ప్రాంతం ఉంది. టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్టు రోళ్లపాడు, గుండ్ల బ్రహ్మేశ్వరం అభయార ణ్యాలు ఉన్నాయి. వీటిలో లెక్కలేనన్ని జీవజా తులు నివశిస్తున్నాయి. అధికారుల గణాంకాల ప్రకారం 55 జాతుల క్షీరదాలు, 2006 రకాల పక్షులు,18రకాల ఉభయచరాలు, 54 రకాల సరీసృపాలు, 55 జాతుల చేపలు ఉన్నాయి. వివిధ జాతుల క్రిమి కీటకాలెన్నో ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో బయో డైవ ర్సిటీ ఏర్పాటయ్యాక నల్లమల అటవీ ప్రాంతంలో కొన్ని కొత్తరకం జీవరాశులను కనుగొన్నారు. ఈ బయోడైవర్సిటీలో 2001 డిసెంబర్‌లో ఏర్పాటు చేసిన లైబ్రరీలో ఆయా జాతులకు చెందిన పూర్తి వివరాలు పొందుపరిచారు.
అటవీ నిబంధనలు పాటించాలి..
పులి, చిరుతలు తమ ప్రాణాలకు హాని జరుగుతుందేమో అన్న అనుమానం వచ్చే వరకు మనిషిపై దాడిచేయవు. అలాగే ఎలుగు బంటి కూడా, పులిని ఒక సారి మనం చూశా మంటే అది వేయి సార్లు మనల్ని చూసే ఉం టుందని తెలుసుకోవాలి. అది ఎప్పుడూ మనిషిని తప్పుకునే తిరుగుతుంది. చిరుతలు మనుషుల ఆవాసాలకు సమీపంలోనే తమ ఆహారాన్ని వెతుక్కుంటాయని చాలా మందికి తెలియదు. ఇవి గ్రామ సమీపాల్లో రాత్రి పూట రహస్యంగా తిరుగుతూ తనకిష్టమైన కుక్కలను ఎత్తుకుపోతాయి. మనుషులపై దాడి చేయడం అరుదు. మనిషి నడిచి వెళితే పులులు చక్కగా గుర్తిస్తాయి. అతను తమ ఆహారపు మెనూలో లేడన్న విషయం వాటికి తెలుసు. అదే ద్విచక్ర వాహనాలపై వెళ్లిన ప్పుడు అది మొత్తం ఒక జంతువుగా భావించి దాడులు చేస్తాయి. అటవీ ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో వంగి నడవడం, కూర్చోవడం చేయ రాదు. అడవిలో నడిచే సమయంలో చేతిలో కర్ర ఉంచుకోవడం మంచిది. మనిషి చేతిలోని కర్ర ఎత్తినప్పుడు ఎదురుగా ఉన్న అటవీ జంతువుకు మనిషి రెండు రెట్లు ఎత్తుగా కనిపిస్తాడు. దీంతో వన్యప్రాణులు మనిషికి దూరంగా పారిపోతాయి. అటవీ ప్రాంతాల్లో నివాసం ఉండే వారు పెద్ద పెద్ద శబ్దాలు చేయకుండా పరిసరాలను ప్రశాంతంగా ఉంచాలి. వాతావరణ కాలుష్యానికి పాల్పడకుండాఉండాలి. అటవీ నిబంధనలను తప్పకుండా పాటించాలి. వన్య ప్రాణుల ఆవాసాల్లో చొరబడి వాటిపై క్రూరత్వం ప్రదర్శించడం సరైంది కాదని వన్యప్రాణి ప్రేమికులు సూచిస్తున్నా రు. పర్యావరణానికి కలిగే అపార నష్టంతోబాటు ఆ అడవుల మీద ఆధారపడి తమ జీవనాన్ని కొనసాగిస్తున్న ప్రజల గతి ఏమౌతుంది? అడవుల్లో చిన్న తరహా అటవీ ఉత్పత్తులను సేకరించి తమ జీవనాన్ని వెళ్ళదీస్తున్నవారు చాలామంది ఉన్నారు. ఆ అడవులు ధ్వంసం అయితే వారి జీవనోపాధి ఏమౌతుంది? వారికి ప్రభుత్వం ఏ ప్రత్యామ్నాయాన్నీ చూపించకుండా అడవులను ధ్వంసం చేయడానికి అనుమతిస్తే అది వారందరి జీవితాలనూ నాశనం చేయడమే ఔతుంది. ఉమ్మడి సంపదను కొందరు కొల్లగొట్టి పోగేసుకునే ‘’ఆదిమ సంచయం’’ ఫలితంగా అనేకుల జీవితాలు విధ్వంసం అవుతాయని మార్క్స్‌ చెప్పాడు. ఇప్పుడు అదే జరుగుతోంది. పలు దళిత, గిరిజన సంఘాలు మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన చట్ట సవరణను బలంగా వ్యతిరేకించడంలో ఆశ్చర్యప డాల్సిందేమీ లేదు. అటవీ భూములను ప్రైవేటీకరించే ఈ ప్రయత్నం ఒక పెద్ద సవాలును ముందుకు తెచ్చింది. అది కేవలం అడవీ భూములకు సంబంధించినదే కాదు, మొత్తం భూమికి సంబంధించినది. మన దేశంలో భూమి కొరత చాలా ఉంది. అంతే కాదు, ఆ కొరతను భర్తీ చేయడం కూడా అసాధ్యం. అటువంటప్పుడు ఆ పరిమితమైన భూమిని ఏ విధంగా వినియోగిస్తున్నారు అనేది ఉపాధి, ఆహార భద్రత, తదితర సామాజిక లక్ష్యాలపై ప్రభావం చూపుతుంది. ఆ లక్ష్యా లను సాధించడంలో భూమి వినియోగం కీలకం ఔతుంది. అందుచే త అటువంటి కీలకమైన భూమి వినియోగాన్ని ప్రైవేటు వ్యక్తుల ఇష్టాలకు వదిలిపెట్టకూడదు. భూమిని మొత్తంగా సమాజపరం చేయలేకపోవచ్చు. కాని భూ వినియోగాన్ని మాత్రం సామా జికంగా నియంత్రించాల్సిందే. వరిసాగులో ఉన్న భూములను ఇతరత్రా వినియోగించడాన్ని నియంత్రిస్తూ కేరళ రాష్ట్రంలో చేసిన చట్టం వెనుక ఉన్న తర్కం ఇదే.దీనర్ధం ఏమిటి? ఒకరివద్ద నుండి మరొకరు కొంత భూమిని కొంటున్నప్పుడు ఆ లావాదేవీని అనుమతించా లంటే ఒక షరతు విధించాలి. ఆ భూమి చేతులు మారాక దాని వినియోగం మారితే (పంట పొలంగా ఉన్నది కాస్తా ఇళ్ళ నిర్మాణా నికో, ఫ్యాక్టరీ కట్టడానికో ఉపయోగిస్తే) అలా మారిన వినియోగం సమాజానికి మోదయో గ్యంగా ఉండాలి అన్నదే ఆ షరతు. ఈ సూత్రా న్ని అనుసరించే 1996లో సుప్రీం కోర్టు అటవీ భూములను వేరే విధంగా వినియోగించడాన్ని నిరోధిస్తూ తీర్పు చెప్పింది. పర్యావరణ రక్షణ దృష్ట్యా, స్వేచ్ఛా మార్కెట్‌ (కార్పొరేట్లను) కార్యకలా పాలను నియంత్రిం చడం అవసరమేనని అందరూ ఒప్పుకుం టారు. కాని మొత్తం సమాజం ప్రయోజనా లను కాపాడాలంటే ప్రైవేట్‌ కార్పొరేట్ల ప్రయోజనాలను నియంత్రించాల్సిందే అన్న సాధారణ సూత్రం లో ఇదొక అంతర్భాగ మేనని అందరూ గమనించాలి.ప్రస్తుతం మన దేశంలో భూ వినియోగం విషయంలో ప్రైవేట్‌ కార్పొరేట్ల ప్రయోజనాలు సామాజిక ప్రయోజ నాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ అవసరాల కోసం, గోల్ఫ్‌ కోర్సుల కోసం చాలా ఎక్కువ మంది పేదలు నివసిస్తున్న భూములను ఖాళీ చేయిస్తున్నారు. స్వల్ప సంఖ్యలో ఉండేవారి కోసం అధిక సంఖ్యాకుల ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారు.ఇప్పుడు దేశంలో భూ విని యోగాన్ని సామాజిక ప్రయోజనాల దృష్ట్యా నియంత్రించడానికి ఏ విధమైన పద్ధతులను ప్రవేశ పెట్టాలన్న ప్రశ్న మనల్ని వెనక్కి లాగే యకూడదు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి మార్కెట్‌లో అమ్మకానికి వచ్చే ఏ భూమినైనా మొదట ఆ కార్పొరేషన్‌కే అమ్మజూపాలి అన్న నిబంధన విధించాలి. అప్పుడు ఆ కార్పొరేషన్‌ ఆ భూమిని కొని దానిని తిరిగి మరొకరికి అమ్మేటప్పుడు ఆ కొనుగోలుదారులు దాన్ని సామాజికంగా ఆమోదయోగ్యంగా ఉండే విధంగా వినియోగించే షరతును అమలు చేయగలుగుతుంది. లేదా, నేరుగానే ఇద్దరు వ్యక్తుల మధ్య భూ లావాదేవీ జరిగినప్పుడు దానిని కొనేవారు సామాజికంగా ఆమోద యోగ్యమైన రీతిలోనే వినియోగిం చాలన్న షరతును విధించవచ్చు. ఆ షరతును ఉల్లంఘిస్తే భారీ జరిమానా విధించవచ్చు.ఐతే ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఇందుకు పూర్తి వ్యతిరేక దిశలో అడుగులు వేస్తోంది. మార్కెట్‌ అవసరాలకు (కార్పొరేట్ల అవసరాలకు) అను గుణంగా భూ వినియోగా న్ని మార్చే పనిలో ఉంది.పెట్టుబడి ఆదిమ సంచయంతో ఇటు వంటి మార్పులే జరుగు తాయి. భూమితో సహా అన్ని సంపదలూ సమిష్టిగా అనుభవిస్తు న్నవిగాని, చిన్న చిన్న యజమానులు అనుభ విస్తున్నవి గాని కొద్ది మంది కార్పొరేట్ల చేతుల్లో చిక్కడమే కాకుండా,ఆ సంపదల విని యోగం తీరు కూడా మారి పోతుంది. చిన్న చిన్న రైతుల చేతుల్లో ఉండే భూమి కాస్తా కొద్ది మంది కార్పొరేట్ల పాలైతే అప్పుడు అక్కడ చిన్న తరహా ఉత్పత్తి విధానం పోయి, భారీ స్థాయి సరుకుల ఉత్పత్తి మొదలౌతుంది. నల్ల వ్యవసాయ చట్టాలు ఈలక్ష్యం కోసమే రూపొం దాయి. తమ తమ స్వంత వినియోగం కోసం గాని,ఎఫ్‌సిఐద్వారా దేశ ఆహార అవసరా లను తీర్చడం కోసం గాని ప్రధానంగా పంటలు పండిరచే చిన్న ర్కెటతుల నుండి భూమి కార్పొరేట్ల పరం చేసి సంపన్న పెట్టు బడిదారీ దేశాల అవసరాలను తీర్చే వాణిజ్య పంటలు పండిరచడానికిఆ చట్టాలు తోడ్పడ తాయి. ఇప్పుడు అటవీ సంరక్షణ చట్టానికి చేస్తున్న సవరణ కూడా అటవీ భూముల వినియోగాన్ని మార్చి స్వదేశీ, విదేశీ సంపన్ను ల అవసరాల కోసం మళ్ళించడానికే ఉప యోగపడుతుంది.ఆ అడవుల మీద ఆధారపడి జీవిస్తున్న ఆదివాసులను అడివికి దూరం చేస్తుంది. (స్వేచ్ఛానుసరణ) – (ప్రభాత్‌ పట్నాయక్‌)

మహిళా బిల్లుకు ఆమోదం

దీంతో తమ పని సులువైపోతుందని, పితృస్వామ్యపు తుట్టెను కదపకుండానే, తమకు రావాల్సిన ఓట్లు వచ్చేస్తాయని బిజెపి, ప్రధాని గట్టి నమ్మకంతో వున్నట్లు కనిపిస్తోంది. కానీ కచ్చితంగా ఇదేదీ జరిగేది కాదు. దేశవ్యాప్తంగా మహిళలందరూ సంతోషంతో పొంగి పోయేం దుకు ఇందులో ఏమీ లేదని,నిజానికి మోస పోయామని భావిస్తున్నారు. పార్లమెంట్‌లో కానీ, రాష్ట్రాల అసెంబ్లీల్లో గానీ తమ సంఖ్య పెరగ కుండానే మరో సార్వత్రిక ఎన్నిక, అనేక రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయనే క్రూరమైన వాస్తవం వారి కళ్ళ ముందుంచబడిరది.
మహిళా రిజర్వేషన్‌ వాస్తవ రూపం దాల్చడానికి జనాభా లెక్కల నిర్వహణ లేదా పునర్విభజన ప్రక్రియ ఏదీ అవసరం లేదు. బిల్లు ను ఆమోదించిన తక్షణమే రిజర్వేషన్‌ను అమలు చేయవచ్చు,జనగణన,పునర్విభజన ప్రక్రి యలు నిర్వహించినపుడు సీట్ల సంఖ్య ఆ దామాషా ప్రకారం పెరుగుతాయి. కానీ, ప్రజాప్రతినిధు లుగా ఎన్నుకునేందుకు మహిళలకు గల హక్కును మరికొన్ని సంవత్సరాల పాటు నిరాకరించడానికి వీటిని ముందుకు తీసుకువచ్చారు.
ఇరవైఏడు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు ఎంతగానో అందరూ ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందింది. కానీ, ఇది ఆనందించే అంశంగా లేదు. ఇన్నేళ్ళూ, వరుసగా వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా ఈ బిల్లును చంపే యడానికే చూశాయి, ఉదాసీనతతో మూటగట్టి మూలన పెట్టడానికే ప్రయత్నిం చాయి. కానీ, వామపక్షాలు,ఐద్వాతో సహా కొన్ని మహిళా ఉద్యమ విభాగాలు మాత్రమే నిరంతరంగా పోరా డుతూ,ఈ బిల్లును సజీవంగా వుంచేందుకు పోరా టం, ప్రచారం చేస్తూ వచ్చాయి.
తాజా అధ్యాయంలో విషాదకరమైన అంశమేమంటే, బిల్లు ఆమోద ముద్ర పొందినా, దీని అమలు మాత్రం 2029 సార్వత్రిక ఎన్నికల వరకు, అది కూడా తీవ్రమైన స్థాయిలో ప్రశ్నించ దగ్గ కారణాలతో వాయిదా వేశారు. తదుపరి జన గణన ప్రక్రియ పూర్తయిన పిదప 2026లో సీట్ల పునర్విభజన ప్రారంభమైన తర్వాత మాత్రమే చట్టసభల్లో మహిళలకు సీట్ల రిజర్వేషన్‌ జరుగు తుందని ముసాయిదాబిల్లు పేర్కొంటోంది. మహి ళా రిజర్వేషన్‌ వాస్తవరూపం దాల్చడానికి జనాభా లెక్కల నిర్వహణ లేదా పునర్విభజన ప్రక్రియ ఏదీ అవసరం లేదు.బిల్లును ఆమోదించిన తక్షణ మే రిజర్వేషన్‌ను అమలు చేయవచ్చు, జనగణన, పునర్విభజన ప్రక్రియలు నిర్వహించి నపుడు సీట్ల సంఖ్య ఆదామాషా ప్రకారం పెరుగుతాయి. కానీ, ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకునేందుకు మహిళలకు గల హక్కును మరికొన్ని సంవత్సరాల పాటు నిరాకరించడానికి వీటిని ముందుకు తీసుకు వచ్చారు.మహిళా రిజర్వేషన్‌ బిల్లును బిజెపి క్రమం తప్పకుండా తన ఎన్నికల ప్రణాళికల్లో చేరుస్తూ వచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లోగా అమలు చేస్తామంటూ 2014లోనే ఈదేశ మహి ళలకు హామీ ఇచ్చింది.ఆ రెండు ఎన్నికల తర్వాత లోక్‌సభలో బిజెపికి మెజారిటీ వచ్చింది. దాంతో ఈ బిల్లును తొక్కిపారేసింది. అధికారంలో వున్న తొమ్మిదేళ్లలో బిల్లును ఆమోదిస్తామన్న హామీని మాత్రం నెరవేర్చలేదు. ఇప్పుడు, రెండో పదవీ కాలం చివరిలో బిల్లును ప్రవేశ పెట్టింది. దీంతో తమ పని సులువైపోతుందని, పితృస్వామ్యపు తుట్టెను కదపకుండానే, తమకు రావాల్సిన ఓట్లు వచ్చేస్తాయని బిజెపి,ప్రధాని గట్టి నమ్మకంతో వున్నట్లు కనిపిస్తోంది. కానీ కచ్చితంగా ఇదేదీ జరిగేది కాదు. దేశవ్యాప్తంగా మహిళలందరూ సంతోషంతో పొంగిపోయేందుకు ఇందులో ఏమీ లేదని, నిజానికి మోసపోయామని భావిస్తున్నారు. పార్లమెంట్‌లో కానీ,రాష్ట్రాల అసెంబ్లీల్లో గానీ తమసంఖ్య పెరగకుండానే మరోసార్వత్రిక ఎన్నిక, అనేక రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయనే క్రూర మైన వాస్తవంవారి కళ్ళ ముందుంచ బడిరది.
మనకు స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ళలో, ప్రజాస్వామ్యానికి మూలాధారం అంటూ బిజెపి చెబుతున్న దానిలో లోక్‌సభలో మహిళల సీట్ల శాతం 5శాతం నుండి ఈనాటి 15 శాతా నికి మాత్రమే పెరిగింది. ఇది సిగ్గుపడాల్సిన వాస్తవంగా వుంది. ప్రపంచంలోని అనేక ఇతర దేశాలు మెరుగైన రికార్డును కలిగి వున్నాయి. పార్లమెంట్లకు ఎన్నికైన మహిళల సీట్ల సంఖ్య పరంగా చూస్తే భారత్‌ ఇరవయ్యవ స్థానంలో వుంది. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇది మారవచ్చు, కానీ మారదు. మన దేశంలో మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు వేస్తున్నారు, పైగా ప్రతి ఎన్నికతో ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది.
పైగా గాయాన్ని మరింత రేపేలా, ‘బిల్లు లక్ష్యాలు-కారణాలు’ను ప్రభుత్వం పేర్కొం ది. ‘’మహిళాసాధికారత, మహిళల నేతృ త్వంలో అభివృద్ధిద్వారా, మహిళల ఆర్థిక స్వాతం త్య్రం గణనీయంగా మెరుగు పరచబడిరది. విద్య, ఆరోగ్యానికి సమాన అవకాశాలు అందుబాటు లోకి వచ్చాయి. తద్వారా ‘నారీ శక్తి’కి పెద్ద పీట వేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఉజ్వల యోజన,స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద టాయి లెట్లకు అవకాశం, ముద్ర యోజన ద్వారా ఆర్థిక క్రమంలోకి తీసుకురావడం వంటి వివిధ చొరవల ద్వారా ముఖ్యంగా మహిళలకు ప్రశాంత జీవ నాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, మహిళల నిజమైన సాధికారతకు…నిర్ణయం తీసు కునే ప్రక్రియలో మహిళలు మరింత ఎక్కువగా పాల్గొనడం అవసరం. వారు విభిన్నమైన దృక్కో ణాలతో చట్టసభల్లో చర్చలు జరిపి, నిర్ణాయక క్రమాన్ని మరింత పరిపుష్టం చేసి, నాణ్యతగా మారుస్తారు.’’అని ప్రభుత్వం పేర్కొంది. ఉజ్వల యోజన అనేది లక్షలాదిమంది నిరుపేద మహి ళలపై క్రూరమైన జోక్‌గా మారిందని రుజువైంది. వివిధ సాంకేతిక అభ్యంతరాల కారణంగా వారికి ఉచితంగా సిలిండర్లు రావడం లేదు. దాంతో ఇప్పుడు అత్యంత వ్యయభరితంగా మారిన సిలిం డర్లను వారు కొనుగోలు చేయలేకపోతున్నారు. అలాగే,దేశంలో పలుప్రాంతాల్లో నిర్మించిన తర్వాత,పని చేస్తున్న టాయిలెట్ల సంఖ్యకు సంబం ధించి ప్రభుత్వం చెబుతున్న గొప్పలు కూడా కేవలం కాగితాలపైనే. కానీ, నిరుపేద మహిళల పారిశుధ్య పరిస్థితులు పెద్దగా మారలేదని, ఇంకా అలానే కొనసాగుతున్నాయనేది సిగ్గుచేటైన వాస్తవికతగా వుంది. చట్టసభల్లో మహిళల రిజర్వే షన్‌కు హామీ కల్పించే బిల్లు అమలుకు సుదీర్ఘ కాలం పట్టనుండడంతో… ఈ రాజ్యాంగ (128 వ సవరణ) బిల్లు-2023పై లోక్‌సభలో సుమారు 8గంటలపాటు చర్చ జరిగింది. ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా, ఇద్దరు మాత్రం వ్యతిరేకంగా ఓటేశారు.
బిల్లుకు సంబంధించిన ముఖ్యాంశాలు
లోక్‌సభ,రాష్ట్రాల్లోని అసెంబ్లీలు,జాతీయ రాజ ధాని ప్రాంతం దిల్లీ అసెంబ్లీలో మూడో వంతు సీట్లు మహిళలకు రిజర్వ్‌ అవుతాయని ఈ బిల్లు చెబుతోంది.అంటే, 543 లోక్‌సభ స్థానాల్లో 181 సీట్లు మహిళలకు రిజర్వ్‌ చేస్తారు.పుదుచ్చేరి వంటి కేంద్ర పాలిత ప్రాంతాలకు సీట్లు రిజర్వ్‌ చేయలేదు.
‘ఇంటి నుంచే మొదలవ్వొచ్చు..’
మూడు దశాబ్దాల నుంచీ మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతూ ఉంటే ఇప్పటికి ఆమోదించారు. దీనిపై ఇప్పుడు బాగా చర్చ జరుగుతోంది.అయితే,ఆంధ్రప్రదేశ్‌లో 2019లోనే వైసీపీ ప్రభుత్వం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఆరిజర్వేషన్ల వల్లే నాకు జడ్పీటీసీ స్థానం లభించింది. కానీ, మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్‌లో మాత్రం ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వచ్చింది. ఇది పురుషాధిక్య సమాజం అనేది బహిరంగ రహస్యం. ఒక మహిళ ఎదుగుతుంది అంటే ఏ పురుషుడూ సహించడు. అది ఆమె ఇంటి నుంచే మొదలవ్వొచ్చు.సమాజంలో కావొచ్చు. వేరే ఎక్క డైనా కావొచ్చు.మేము ఇంతమంది ఉన్నప్పుడు, ఒకమహిళకు ఎందుకు ఇస్తారు? అనే దిశగా పురుషులు ప్రశ్నిస్తే మహిళలు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సవాళ్లు తట్టుకోని నిలబడగాలంటే ఈ రిజర్వేషన్లు మాకు ఒక హక్కులా, ఒక ఆయుధంలా పనిచేస్తాయి. మహిళలకు కచ్చితంగా ప్రాముఖ్యత ఇవ్వాల్సిందే. ఎందుకంటే,ఒక కుటుంబం బాగుండాలంటే తన పిల్లలు, భర్త సరైన మార్గంలో వెళ్లాలంటే మహిళ పాత్ర చాలా కీలకం అనేది అందరికి తెలిసిన విషయం.కుటుంబం తరహాలోనే సామాజికంగా కూడా బ్యాలెన్స్‌ చేసి మహిళ పరిపాలన అందించ గలదని నేను గట్టిగా నమ్ముతాను. ఇప్పుడు ఈ మహిళా రిజర్వేషన్‌ వల్ల 33 శాతం రిజర్వేషన్లు వస్తే, ప్రతి ముగ్గురిలో ఒక మహిళా ప్రజాప్రతి నిధి ఉంటారు. ఇది అందరికీ ఆమోదయోగ్యమైన అంశం. మహిళలందరూ గర్వించదగినది.
మహిళా రిజర్వేషన్‌తోనే ఈ స్థాయికి..
‘’మాది ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం. నా స్టడీస్‌ అంతా అక్కడే జరిగాయి. ఇంటర్మీడియెట్‌ వరకూ ధర్మవరంలో,డిగ్రీ, అనం తపూర్‌, పీజీ కర్నూల్‌లో చేశాను. మొదటి నుంచీ నాకు రాజకీయాలు అంటే ఆసక్తి. కాలేజీ రోజుల్లో కూడా ఎన్నికల్లో పోటీచేసి కాలేజీ చైర్మన్‌గా గెలి చాను’’ అని పద్మావతి తెలిపారు. మహిళా రిజర్వేషన్‌ వల్లనే ఈరోజు ఈ గౌరవప్రదమైన జెడ్పీటీసీ స్థానంలో కూర్చోగలిగానని ఆమె చెప్పారు.‘’పార్టీకి పనిచేసిన వాళ్లం మేము ఇంత మంది ఉండగా మహిళకే ఎందుకు ఇవ్వాలి అని పురుషులు పోటీ పడుతుంటారు. పురుషా ధిపత్యం ఉన్న దేశంలో ఉంటున్న మనం నిజానికి లింగ వివక్ష ఎదుర్కొంటున్నాం. ఇంతమంది పోటీ దారుల మధ్య మహిళకు రిజర్వేషన్‌ వచ్చింది కాబట్టి తప్పనిసరిగా మహిళలకే ఇస్తారు. మహిళా రిజర్వేషన్‌ వచ్చింది కాబట్టి నేను జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. అప్పట్లో ప్రతిపక్ష పార్టీ వాళ్లు విత్‌ డ్రా చేసుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది’’ అని పద్మావతి అన్నారు.
ఎస్సీ, ఎస్టీ మహిళల సంగతి ఏంటి?
ప్రస్తుతం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ లలో షెడ్యూల్డ్‌ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్‌ తెగలు (ఎస్టీ)ల కోసం రిజర్వ్‌ చేసిన సీట్లు ఉన్నాయి. ఆ రిజర్వ్‌ చేసిన స్థానాల్లో ఇప్పుడు మూడోవంతు సీట్లను మహిళలకు కేటాయిస్తారు.ప్రస్తుతం ఎస్సీలు,ఎస్టీల కోసం 131 సీట్లను రిజర్వ్‌ చేశారు. వీటిల్లో నుంచి సుమారు 43 సీట్లు మహిళలకు కేటాయించనున్నారు.ఈ 43 సీట్లను కూడా సభలో మహిళలకు రిజర్వ్‌ చేసిన మొత్తం సీట్లలో భాగం గానే లెక్కిస్తారు.అంటే, మహిళలకు రిజర్వ్‌ అయ్యే 181స్థానాల్లో,138 సీట్లు జనరల్‌ కేటగిరీ మహిళ లకు అందుబాటులో ఉంటాయి.అయితే, ఈ లెక్కలన్నీ ప్రస్తుతం లోక్‌సభలో అందుబాటు లో ఉన్న సీట్లసంఖ్య ఆధారంగా చేసినవే. ఒక్కసారి డీలిమిటేషన్‌ కసరత్తు మొదలైతే ఈ గణాంకాలు మారొచ్చు.
ఈ చట్టం ఎప్పటినుంచి అమల్లోకి వస్తుంది?
మొదట,పార్లమెంట్‌లోని ఉభయ సభలు ఈ బిల్లును మూడిరట రెండొంతుల (2/3) మెజారిటీతో ఆమోదించాలి.జనగణన (సెన్సస్‌) తర్వాత డీలిమిటేషన్‌ జరగాల్సి ఉంటుంది. డీలిమిటేషన్‌ అంటే జనాభా ప్రకారం నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించే ప్రక్రియ. దేశవ్యాప్త డీలిమిటేషన్‌ ప్రక్రియ చివరిసారిగా 2002లో జరిగింది. ఇది 2008 లో అమల్లోకి వచ్చింది. డీలిమిటేషన్‌ జరిగిన తర్వాత లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు అయ్యాక మహిళా రిజర్వేషన్‌ అమల్లోకి రావొచ్చు. ప్రాక్టికల్‌గా చూస్తే, ఈ రిజర్వేషన్ల అమలు 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందువరకు సాధ్యం కాదని అనిపిస్తోంది. మహిళా రిజర్వేషన్లు అమ ల్లోకి వచ్చాక 15 ఏళ్ల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఎస్సీ, ఎస్టీలకు కూడా ఒక పరిమిత సమయం వరకే సీట్లను రిజర్వ్‌ చేస్తారు. తర్వాత వాటిని పదేళ్లపాటు పొడిగిస్తారు.
రిజర్వ్‌డ్‌ సీట్లను ఎలా నిర్ణయిస్తారు?
ప్రతీ డీలిమిటేషన్‌ ప్రక్రియ తర్వాత రిజర్వ్‌డ్‌ సీట్లను రొటేట్‌ చేస్తామని బిల్లులో పేర్కొ న్నారు.ఈ వివరాలను పార్లమెంట్‌ తర్వాత నిర్ణ యిస్తుంది.పార్లమెంట్‌, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళా రిజర్వేషన్లను ఏర్పాటు చేసుకునేలా ప్రభు త్వానికి ఈరాజ్యాంగ సవరణ అధికారాన్ని కల్పిస్తుంది. అయితే సీట్ల రొటేషన్‌, డీలిమిటేషన్‌ చేపట్టడానికి ఒక ప్రత్యేక చట్టం,నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. పంచాయతీలు, మున్సిపా లిటీలు వంటి స్థానిక సంస్థల్లో కూడా మూడో వంతు సీట్లు మహిళల కోసం కేటాయించారు. ప్రతీ ఎన్నికల సందర్భంగా ఇవి కూడా మారు తుంటాయి. ఎస్సీలకు నియోజకవర్గాల్లో వారి జనాభా ఎక్కువగా ఉన్నచోట సీట్లను రిజర్వ్‌ చేశా రు.చిన్న రాష్ట్రాల్లో సీట్లను ఎలా రిజర్వ్‌ చేస్తారు? లడఖ్‌, పుదుచ్చేరి, చండీగఢ్‌ వంటి కేవలం ఒక ఎంపీ సీటు ఉన్నకేంద్ర పాలిత ప్రాంతాల్లో రిజర్వేషన్‌ ఎలా ఉంటుందో ఇంకా నిర్ణయిం చలేదు. ఈశాన్య రాష్ట్రాలైన మణిపుర్‌, త్రిపురల్లో రెండు చొప్పున, నాగాలాండ్‌లో ఒకే ఎంపీ స్థానం ఉంటుంది.అయితే, మునుపటి మహిళా రిజర్వే షన్‌ బిల్లులో ఈఅంశానికి ఒకపరిష్కారం చూపా రు.ఒకే సీటు ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో… ఒక లోక్‌సభ ఎన్నికల్లో ఆ సీటును మహిళలకు కేటాయించి, తర్వాతి రెండు ఎన్నిక లకు దాన్ని రిజర్వ్‌ చేయకూడదని 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వే షన్‌ బిల్లులో పేర్కొన్నారు.రెండు సీట్లు ఉన్న రాష్ట్రా ల్లో ఒక సీటును రెండు లోక్‌సభ ఎన్నికల వరకు రిజర్వ్‌చేసి,మూడో ఎన్నికలో మహిళలకు ఎలాంటి రిజర్వేషన్‌ కేటాయించకూడదని నిర్ణయించారు.
మహిళల ప్రాతినిధ్యం ఎంత?
ప్రస్తుతం,లోక్‌సభలో 82మంది మహిళలు ఉన్నారు. అంటే మొత్తం సంఖ్యలో దాదాపు 15శాతం.19రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళల ప్రాతినిధ్యం 10శాతం కంటే తక్కువే ఉంది. ప్రపంచవ్యాప్తంగా పార్లమెంట్‌లలో మహి ళా ప్రాతినిధ్యం సగటున 26.5శాతంగాఉందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది.
మహిళలకు కలిగే ప్రయోజనం
మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్‌ కల్పించే బిల్లు అమలులోకి వస్తే రాష్ట్రంలోని నియోజకవర్గాల ముఖచిత్రం మార నుంది. ఇప్పుడు ఉన్న స్థానాల ప్రకారం 8 లోక్‌సభ,58శాసనసభ స్థానాలు అతివలకే చెంద నున్నాయి. మహిళా బిల్లు ఆమోదం పొందితే 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి అమలవు తుంది. అప్పటికీ నియోజకవర్గాల పునర్విభజన పూర్తవనుంది. దీంతో స్థానాల సంఖ్య పెరిగితే ముఖచిత్రాలు తారుమారయ్యే అవకాశం ఉంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే మహిళా బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌ సభలో ప్రవేశపెట్టడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఇప్పటికప్పుడు కాకుండా. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అంటే 2029 సార్వత్రిక ఎన్నికల నాటికే ఇది అమల్లోకి వస్తుందనే స్పష్టత వచ్చినప్పటికీ రాష్ట్రంలోని ఏయే నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉందనేదానిపై ప్రజా ప్రతినిధులు ఆరా తీస్తున్నారు. ఈబిల్లు వల్ల తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం మహి ళలకు కేటాయించే అవకాశం ఉందా అనే అంశం పై చర్చల్లో మునిగి తేలుతున్నారు. 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నాటికే ఈ బిల్లు అమల్లోకి వస్తుందని మొదట్లో ప్రచారం జరి గింది. దీంతో ఆ మార్పులు ప్రభావం, పర్యవ సానం తమపై ఎలా ఉంటుందోనని తొలుత కొంతమంది ఆందోళన చెందారు. అయితే లోక్‌ సభ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఇది అమ ల్లోకి వస్తుందనే స్పష్టత రావటంతో ఊరట పొందారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 175 శాసనసభ,25లోక్‌సభ నియోజకవర్గాలకు సంబం ధించిన ఓటర్ల జాబితాను విశ్లేషించగా ఈ ఏడాది జనవరి 5వ తేదీనాటికి ఉన్న ఓటర్ల జాబితా ప్రకారం మహిళా ఓటర్ల సంఖ్య అత్యధి కంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించాయి. నియోజకవర్గాల సంఖ్య పెరగకుండా పరిధిల్లో పెద్దగా మార్పులు చేర్పులు లేకపోతే మహిళా ఓటర్ల సంఖ్య అత్యధికంగా ఉన్న నియోజక వర్గాల్లో పెద్దతేడా ఏమీ ఉండకపోవొచ్చు. నియో జకవర్గాల సంఖ్య పెరిగి వాటి పరిధిల్లో భారీగా మార్పులు, చేర్పులు చేసుకుంటే మాత్రం మహిళా ఓటర్ల సంఖ్య అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల ముఖచిత్రం కూడా మారే వీలుంది.రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో శాసనసభ నియోజ కవర్గాల పెంపు అంశం ఉండటంతో పునర్వి భజన సమయంలో ఇక్కడి నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
-(జిఎన్‌వి సతీష్‌/ న్యూఢల్లీి నుంచి ప్రకాష్‌ యాదవ్‌)

మనువాదం వర్సెస్‌ మానవాదం

మన దేశానికి సంబంధించి ఆలోచిస్తే, ఇక్కడ వేళ్ళూనుకుని ఉన్న మను వాదాన్ని తిరస్కరిస్తూ మానవ వాదాన్ని బలపరుస్తూ ముందుకు సాగాల్సి ఉంది. పార్టీలు వేరైనా, వారు రాజకీయ ప్రత్యర్థులయినా దేశ ప్రధాని మొదలుకొని కొందరు ముఖ్య మంత్రుల వరకు చేసే పనులన్నీ ఒకటే! ప్రజా ధనాన్ని ఒకరు ఒక దేవాలయం మీద ఖర్చు పెడితే, మరొకరు మరో దేవాలయం మీద ఖర్చుపెడుతున్నారు. పూజలకు, యాగాలకు ప్రాధాన్య మిస్తున్నారు. వాటి వల్ల సామాన్యులకు ఒరిగేదేమిటి? మూఢత్వంలోంచి వారు బయటికి రాకుండా అణిచిపెట్టడమే కదా ?
ఇవాళ ప్రపంచంలో మూడు అతి పెద్ద భారీ వ్యాపార వస్తువులు ఉన్నాయి. ఒకటి-ఆయుధాలు, రెండు- మాదకద్రవ్యాలు, మూడు-ఆధ్యాత్మికత.ఆయుధాలు, మాదక ద్రవ్యాల తయా రీలో ఎంతోకొంత పని చేయాల్సి ఉంటుంది. ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఆధ్యా త్మికతలో ఇవ్వాల్సింది ఏమీ ఉండదు.చేయా ల్సింది కూడా ఏమీ ఉండదు. అందుకే భారత దేశంలో ఆధ్యాత్మికవేత్తలు ఎక్కువ. ఈ ఆధ్యాత్మిక సూపర్‌ మార్కెట్‌లో అడిగిన వెంటనే నిర్వాణం దొరుకుతుంది.ఈమెయిల్‌లో మోక్షం అందు తుంది.ఆత్మసాక్షాత్కారంలో క్రాష్‌ కోర్సు ఉం టుంది.నాలుగైదు సులభ వాయిదాలలో విశ్వ చైతన్యం లభిస్తుంది.ఈఆధ్యాత్మిక సూపర్‌ మార్కె ట్‌కు ప్రపంచ వ్యాప్తంగా గొలుసు దుకాణాలు న్నాయి. అశాంతితో ఉన్న ఉన్నత వర్గాలు, సంపన్న కుటుంబాలు ఆ దుకాణాలలో ఆధ్యాత్మి కత పేరుతో దొరికే ఫాస్ట్‌ఫుడ్‌ కొనుక్కుని తింటూ ఉంటాయి.అదేమిటో పూటపూటకూ రెక్కలు ముక్కలు చేసుకునే వారికి దీని అవసరమే ఉండదు.
నిజాలు చెప్పినప్పుడు ఎవరి మనోభా వాలైనా దెబ్బతింటే, వారు-వారి మనోభావాల్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నిజాలు ఎప్పుడూ మారవు. వాటిని మార్చి చెప్పి కొందరికి సంతోషం కలిగించాలను కుంటే అవి, అప్పుడు నిజాలుగా ఉండవు కదా? నిజాలు తెలుసుకోవా లనుకున్న నిజాయితీ గలవారు మనోభావాల్ని మూసి పెట్టుకుని,నిజాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి! కృష్ణా కాన్షస్‌నెస్‌కు సంబం ధించిన ఓ స్వామి, మనల్ని ఎలా ఆలోచించమని చెపుతున్నాడో చూడండి…దేవాలయాల అవసరం చాలా ఉంది అని,మనతోనే చెప్పించాలని చాలా తాపత్రయ పడుతున్నాడు. ఆయన ఇలా అన్నా రు… ‘దేవాలయాలు కట్టడానికి అనవసరం గా ధనం ఎందుకు ఖర్చు చేస్తున్నారూ? అని కొందరు అంటూ ఉంటారు. దేవాలయాలు కట్టడంకంటే పేదల ఆకలి తీర్చవచ్చు కదా? పాఠశాలలు, ఆసుపత్రులు కట్టొచ్చుకదా? అవసరమైన వారికి అవసరమైన రీతిలో ఖర్చు చేయవచ్చు కదా?’’ అని ప్రశ్నిస్తుంటారు. నిజమే! కానీ, క్లబ్‌లు, పబ్‌లు, సినిమా హాళ్ళు,క్రికెట్‌ల మీద ఎందుకు ఖర్చు చేస్తున్నారు-అనేది మాత్రం ఆలోచించరు. మనిష న్నాక ఎంటర్‌టెయిన్‌మెంట్‌ అవసరం కదా అని అంటారు.కానీ,ఎన్‌లైట్‌మెంట్‌ కూడా అవసరమని ఆలోచించరు.మనిషైన వాడికి ఆధ్యాత్మిక చింతన, ప్రశాంత జీవనం అవసరమే కదా? మానసిక వేదనలతో రోజుకు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదుపుతప్పిన ఆవేశాలతో ఎందరో ఎన్నో దుర్మార్గాలు చేస్తున్నారు. వారిని సన్మార్గంలో పెట్టాల్సిన పనిలేదా? దైవ చింతనతో గడుపుతూ జీవితాన్ని సక్రమ మార్గంలో పెట్టు కోవాల్సిన పనిలేదా? మా హరేరామ హరేకృష్ణ మిషన్‌ లాంటివి పేదలకు ఉచిత భోజనం కూడా అందిస్తున్నాయి. మత పరమైన విహార యాత్రలు పెరిగితే,ఆర్థిక వనరులు పెరుగుతాయి.వాటి చుట్టూ మరెన్నో వ్యాపారాలు పెరుగుతాయి. ఇవన్నీ ఎందుకు ఆలోచించరూ?’’ అని స్వామి ప్రశ్నించారు. ఇందులో మనం ఎన్‌లైట్‌మెంట్‌- జ్ఞానోదయం గురించి మాట్లాడే పనేలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని మతాల ప్రార్థనా స్థలాల్లో ‘పూజారులు’గా ఉన్నవారికే జ్ఞానోదయం కాలేదు. ఇక ఓ గంట కోసమో, పూటకోసమో ఇలా వెళ్ళి అలా వచ్చేవారికి ఏం జ్ఞానోదయం అవుతుందీ? హరేరామ హరేకృష్ణ వాళ్ళు, సిక్కు గురుద్వార వాళ్ళు, సంత్‌సంగ్‌ల వాళ్ళు వాళ్ళదగ్గరికి వచ్చిన వారికి భోజనం పెడుతుంటారు. ఎందుకంటే వారి దగ్గరికి వచ్చినవారి సంఖ్య తగ్గిపోగూడదని! అది వారి జాగ్రత్త!! జనం ఆకలి తీర్చాలంటే మురికివాడల్లో తిండిలేక మలమల మాడుతున్న వారి దగ్గరికి వెళ్ళాలి. దేవాలయాల ముందు, మెట్ల మీద అడుక్కునేవారు ఉంటారు. వారి ఆకలి తీర్చాలి కదా ?
క్రికెట్‌, పబ్స్‌, సినిమాహాళ్ళూ ఎలా వ్యాపార కేంద్రాలో- అలా అన్ని మతాల అన్ని ప్రార్థనా స్థలాలు, దేవాలయాలు కూడా వ్యాపార కేంద్రాలేనని మొదట ఒప్పుకోండి! ఎన్ని ఆత్మహ త్యలు ఈ దేవాలయాలు ఆపగలిగాయి? ఎన్ని అత్యాచారాల్ని, ఎన్ని హత్యల్ని, ఎన్ని డ్రగ్స్‌ దం దాల్ని ఈ దైవ క్షేత్రాలు ఆపగలిగాయీ? ఎవరైనా లెక్కలివ్వగలరా? ఈ ఆధ్యాత్మికత ఎందమందికి ప్రశాంతత ఇవ్వగలుగుతోంది? ఎంతమందికి ఆత్మస్థయిర్యాన్ని ఇవ్వగలుగుతోంది? ప్రపంచంలో ఎక్కడా లేని ఆధ్యాత్మిక కేంద్రాలు ఈ దేశంలో ఎక్కువ! మరి ఏ దేశంలోనూ లేని అల్లకల్లోలం ఈ దేశంలో ఎందుకుందీ? ఆత్మవిమర్శ చేసుకో వాలి కదా? దేవుడొక్కడే అని చెపుతున్నప్పుడు ఇన్ని రకాల ప్రార్థనా స్థలాలు ఎందుకున్నాయీ? వాటి మధ్య విభేదాలెందుకున్నాయి? వాటి కారణంగా జనం ఎందుకు విడిపోతున్నారూ? జనం మధ్య రాజకీయాలు చొరబడి అగాధాలు ఎందుకు పెంచుతు న్నాయీ? జనం మధ్య చిచ్చు పెట్టి ఘర్షణలకు ఎందుకు దారి తీస్తున్నాయీ? ఏ మత కేంద్రంలోనైనా ‘మానవత్వం’ అనే మాట వినిపించదు ఎందుకూ?మనిషి ప్రమేయం లేకుం డా ఏ మతానికి చెందిన ఏదేవుడైనా ఏమీ చేయ లేడని ఎందుకు ప్రకటించరు?జ్ఞానోదయం సంగతి తర్వాత చూద్దాం ముందు మీరు చెప్పే దేవదేవుణ్ణి ‘నిజం’ చేసి చూపండి.
దేవుడే అబద్దం! అబద్దానికి బంగారు కిరీటాలుపెట్టి,పట్టుబట్టలు కట్టి, గుళ్ళూ గోపురాలు కట్టి,పూజలు, భజనలు చేసినంత మాత్రాన అబ ద్దం నిజమైపోతుందా?కల్పించుకున్న దేవుడు శక్తిమంతుడైపోతాడా?ఒకవైపు దేవుణ్ణి శక్తిమం తుణ్ణి చేయడానికి-మరోవైపు మనుషుల్ని విభజించి శక్తిహీనులుగా తయారు చేయడానికి రాసుకున్నదే‘మనుధర్మశాస్త్రం’.ఇది మనుషులంతా ఒక్కటే అని చెప్పే ఆధునిక మానవవాదం ముందు నిలవదు- మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏ ప్రార్థనా స్థలమూ అక్కరలేదు. ఏ నది ఒడ్డునో, చెరువు గట్టునో,చెట్ల మధ్యో గడిపితే చాలు. ఏదీ లేకపోతే డాబామీద పడుకుని ఆకాశం, నక్షత్రాలు చూస్తూ ఆనందించగలిగితే చాలు.దేవాలయాల చుట్టూ,ప్రార్థనా స్థలాల చుట్టూ తిరిగి ఎన్‌లైట్‌ మెంట్‌ పొందిన వాడు ఎవడైనా ఉన్నాడా? వేల వేల మందితో కలిసి, క్యూలలో నిలబడి, దైవద ర్శనం గోలలో పడి, ఒళ్ళు హూనమై తల నొప్పు లు తెచ్చుకునే వారికి నిజంగానే జ్ఞానోదయం కావాలి.కానీ అవుతోందా? ఆధ్యాత్మిక ప్రశాం తత-అక్కడ లభిస్తోందా?ఎవరికి వారు ఆలోచిం చుకోవాల్సిన విషయం. పారసిటమాల్‌ బిళ్ళవేసు కుంటే జ్వరం తగ్గినట్టు-ఏ ప్రార్థనా స్థలానికో పోయి కూచుంటే జ్ఞానోదయమైన ఉదంతాలు న్నాయా? దేవాలయాల నిర్మాణం కన్నా పాఠశా లలు కట్టండి! ఆసుపత్రులు కట్టండి!! అని చెప్పేది ఎందుకంటే భావితరాల కోసం. ఇప్పటి పిల్లల్ని రేపటి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడం కోసం. ఇక ఆసుపత్రులుంటేనే అందరి ఆరోగ్యాలు బావుంటాయి గనుక ! ప్రార్థనా స్థలాలకు వెళితే చదువురాదు,ఆరోగ్యమూ బాగుపడదు.లేని దేవుణ్ణి నమ్మి, మూఢభక్తికి అలవాటు పడి జీవితాన్ని అబద్దంగా మార్చుకోవడం జరుగుతోంది. జబ్బు లకు వైద్యం చేయించుకోకుండా దేవుడికి మొక్కు కున్నంత మాత్రాన, ముడుపులు కట్టినంత మాత్రాన, ఉపవాసాలున్నంత మాత్రాన ఎవరికీ ఏ జబ్బూ ఎప్పుడూ తగ్గలేదు.తగ్గినవి ఉంటే నిరూపించి చూపాలి కదా?ప్రార్థనా స్థలాన్ని కానీ, దైవ క్షేత్రాన్ని కానీ దర్శించుకుని వస్తే శరీరం నుంచి నెగటివ్‌ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్‌ ఎనర్జీ వస్తుంది-అని కొందరు విశ్వాసకులు దుష్ప్రచారం చేస్తుంటారు.వ్యక్తిగతంగా మనిషి ఆలోచనా విధా నాన్ని బట్టి పాజిటివ్‌,నెగటివ్‌లు ఉంటాయి తప్పితే ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఏమీ ఉండదు.మొక్కులు, ముడుపులు ఎంత హాస్యా స్పదంగా ఉంటాయో చెప్పడానికి ఇక్కడ ఒక వాస్తవ సంఘటనని గుర్తుచేస్తున్నాను. ఒకసారి ఒకతను అడవిలో నడుస్తూ ఉండగా చెప్పు తెగి పోయింది. తెగిన చెప్పుతో ముందుకు నడవలేక అతను ఒకచిలిపి పనిచేశాడు. దాని పక్కన గల ఒక చెట్టుకు తెగిన చెప్పులు తగిలించి, చెట్టు పక్కనఉన్న బండ మీద బొగ్గుతో ఇలా రాశాడు… ‘’ఈ చెట్టు కొమ్మమీద మీ చెప్పులను వేలాడదీస్తే మీ భార్య మీ చెప్పుచేతల్లో ఉంటుంది’’ అని… రాసి వెళ్ళిపోయాడు. అంతే! కొన్నాళ్ళకు ఆ చెట్టు కొమ్మలకు వందలచెప్పులు వేలాడబడ్డాయి. తెగిన చెప్పులు కాదు, వాడుకుంటున్న మంచి జతలు, కొత్తగా కొన్నవీ, అన్నీ చెట్టుకొమ్మల మీదికి చేరా యి. ఆ ప్రాంతంలో అదొక ఆచారమైంది. తర్వా త కాలంలో ఆ చెప్పుల చెట్టును వెతుక్కుంటూ జనం రాసాగారు. కొంతకాలానికి ఆ చెట్టు ఎటు వైపు ఉందో చూపడానికి డైరెక్షన్‌ బోర్డులు వెలి శాయి. చెప్పులచెట్టు-తిరనాళ్ళ అయ్యింది. ప్రతి సంవత్సరం జనం గుమిగూడి ఉత్సవం చేయడం ప్రారంభించారు. సంప్రదాయాల పేరుతో మూర్ఖత్వం ఎలా వ్యాప్తి చెందుతుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ! ఇలాంటివి దేశంలో అనేక చోట్ల అనేక ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి.
‘ప్రపంచం మారాలని మనం కోరుకో వడం కాదు, మార్పు మనతో మొదలైతే ప్రపంచం అదే మారుతుంది’అన్నాడు ప్రపంచ ప్రసిద్ధ రష్యన్‌ రచయిత లియో టాల్‌స్టారు. మన దేశానికి సంబం ధించి ఆలోచిస్తే, ఇక్కడ వేళ్ళూనుకుని ఉన్న మను వాదాన్ని తిరస్కరిస్తూ మానవ వాదాన్ని బలపరు స్తూ ముందుకు సాగాల్సి ఉంది. పార్టీలు వేరైనా, వారు రాజకీయ ప్రత్యర్థులయినా దేశ ప్రధాని మొదలుకొని కొందరు ముఖ్యమంత్రుల వరకు చేసే పనులన్నీ ఒకటే! ప్రజా ధనాన్ని ఒకరు ఒక దేవాలయం మీద ఖర్చు పెడితే, మరొకరు మరో దేవాలయం మీద ఖర్చుపెడుతున్నారు. పూజలకు, యాగాలకు ప్రాధాన్యమిస్తున్నారు.వాటి వల్ల సామాన్యులకు ఒరిగేదేమిటి? మూఢత్వంలోంచి వారు బయటికి రాకుండా అణిచిపెట్టడమే కదా? ఒకసారి ఆలోచించండి!
వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్‌ – (డా.దేవరాజు మహారాజు)

విశాఖ వైపు మెట్రో పరుగులు

ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా కార్యనిర్వాహక రాజధానిగా ఎంపికైన విశాఖలో అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విశాఖలో ఇప్పటికే వందల కోట్ల వ్యయంతో సుందరీకరణ,అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం.. తాజాగా పెండిరగ్‌లో ఉన్న మెట్రో రైల్‌ ప్రాజెక్టునూ పరుగులు పెట్టించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మెట్రో రైలు పరిధిని 75 కిలోమీటర్లుగా నిర్ణయించిన ప్రభుత్వం నాలుగు కారిడార్లుగా దీన్ని అభివృద్ధి చేయబో తోంది. ఇందుకోసం సమగ్ర వివరాలతో డీపీఆర్‌ను త్వరలోనే విడుదల చేసేందు కు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారా యణ ప్రకటించారు.అంతే కాకుండా ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌. జవహర్‌రెడ్డి విశాఖ రాజధాని అభి వృద్ధిపై అధికార్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలోనూ మెట్రో ప్రాజెక్టుపై చర్చిలు నిర్వహించిన విషయం తెలిసిందే. నగరంలో మెట్రో రైల్‌ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మ కంగా తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర చరిత్ర, సంస్కృతి,సంప్రదాయం ప్రతిబింబిం చేలా మెట్రో పిల్లర్లు నిర్మాణం చేపట్టే దిశగా ఆలోచన చేస్తోంది. మరోవైపు తొలి విడతలో76.90కి.మీ.మేర లైట్‌ మెట్రో నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈలోగా నిధుల సమీకరణను వేగవంతం చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌ రెడ్డి మెట్రో రైల్‌ కార్పొరేషన్కు మార్గదర్శకాలు జారీ చేశారు.
విశాఖ మెట్రో పరిధి ఖరారు పారిశ్రా మికంగా అభివృద్ధి చెందిన విశాఖ నగరం ఏపీలోని ప్రస్తుతం మరే ఇతర నగరాల కంటే కూడా మెరుగైన స్ధితిలో ఉంది. ఇక్కడ కొత్తగా వస్తున్న ప్రాజెక్టులతో పాటు ఇప్పటికే కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వ సంస్ధలకు చెందిన ఉద్యోగులతో నగరం కిటకిటలాడు తోంది.ఈ రద్దీని తట్టుకునేందుకు ఎప్పటి నుంచో మెట్రోరైల్‌ ప్రాజెక్టు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరిగినా అవి అరకొరగానే మిగిలిపోయాయి. ఇప్పుడు వైసీపీ సర్కారు వాటిని దుమ్ముదులిపి ఎలాగైనా మెట్రో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అడుగులు వేస్తోంది.కార్యనిర్వాహక రాజధానిగా ఎంపికైన విశాఖ నగరంలో అభివృద్ధిని పరుగులు పెట్టించాలంటే మెట్రో ప్రాజెక్టు తప్పనిసరి అని భావిస్తున్న ప్రభుత్వం 75కిలోమీటర్ల మార్గంలో దీన్ని అభివృద్ధి చేసేందుకు తుది ఆమోద ముద్ర వేసింది.
ప్రజారవాణా వ్యవస్థ మెరుగుదలపై దృష్టి

2021 అంచనాల ప్రకారం విశాఖ మహా నగరంలో 25లక్షలకుపైగా జనాభా ఉంది. మెట్రో నిర్మాణ ప్రతిపాదనలు ఉన్న శివారు ప్రాంతాలతో కలిపితే మొత్తం జనాభా 41లక్షలు. లాభనష్టాలతో సంబంధం లే కుండా కేవలం ప్రజలకు రవాణా సౌకర్యా లను మె రుగుపరిచేందుకు మెట్రోపై దృష్టి సారించింది.సీఎం వైఎస్‌ జగన్మోహన్రెడ్డి దసరా తర్వాత విశాఖ కేంద్రంగా పరిపాలన సాగించేందుకు అడుగులు పడుతున్న తరు ణంలో నగరంలో ప్రజారవాణా వ్యవస్థ మరింత మెరుగు పరచాల్సిన అవసరం ఉంది. మెట్రో రైలు రాకతో ట్రాఫిక్‌ సమస్య తీరడం తోపాటు సమయం కూడా ఆదా అవుతుంది..
నాలుగు కారిడార్లుగా విభజన…
విశాఖలో ప్రస్తుతం ఉన్న రద్దీని దృష్టిలో ఉంచుకుని 75 కిలోమీటర్ల మెట్రో రైల్‌ ప్రాజెక్టును నాలుగు కారిడార్లుగా విభజిం చారు. స్టీల్‌ ప్లాంట్‌ గేటు నుంచి కొమ్మాడి జంక్షన్‌ వరకూ,గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసు వరకూ,తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకూ, కొమ్మాడి జంక్షన్‌ నుంచి భోగాపురం వరకూ నాలుగు కారిడార్లు ఏర్పాటు కానున్నాయి. ఈ నాలుగు కారిడార్ల ఏర్పాటుకు అవసరమైన డీపీఆర్‌ సాధ్యమై నంత త్వరగా సిద్ధం చేయాలని విజయ వాడలో నిర్వహించిన సమీక్షలో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆధేశించారు. వచ్చే ఏడాది కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు నాటికి మెట్రో పనులను ఎట్టి పరిస్ధితుల్లోనూ ప్రారంభం కావాలని ప్రభుత్వం ఆశిస్తోంది.
2025 నాటికి రోజుకు ఆరులక్షల మంది ప్రయాణం…
కోవిడ్‌ కారణంగా డీపీఆర్‌ తయారీ ఆలస్యమై నప్పటికీ సాధ్యమైనంత త్వరగా దీన్ని ప్రభు త్వానికి అందించేందుకు అధికారులు సన్నద్దమవు తున్నారు.ఆ తర్వాత దాన్ని వెంటనే ఆమోదించి ప్రాజెక్టును పట్టాలెక్కిం చాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో డీపీఆర్‌ పూర్తి చేసి ప్రాజెక్టు మొదలుపెడితే మూడు నుంచి నాలుగేళ్ల వ్యవధిలో ఇది పూర్తవుతుంది. ఆ లెక్కన చూస్తే 2025 నుంచి రోజుకు సగటున ఆరు లక్షల మంది విశాఖ మెట్రోలో ప్రయాణించేందుకు అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అత్యాధునిక మెట్రోగా ఉన్న హైదరాబాద్‌ మెట్రోరైల్‌ కంటే మెరుగైన టెక్నాలజీతో దీన్ని నిర్మించాలని ప్రభుత్వం ఆదే శాలు ఇచ్చింది.
వచ్చే ఏడాది జనవరి 15న పునాది రాయి
వచ్చే ఏడాది జనవరి 15న మెట్రో రైలు పనులకు పునాది రాయి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల విశాఖలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహన్రెడ్డి నిర్వహించిన అభివృద్ధి పనుల సమీక్షలో మెట్రో రైలు నిర్మాణ అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. పునాది రాయి వేసేలోగా నిధులు సమీకరించేందుకు ఉన్న మార్గాల్ని అన్వేషించాలని ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎండీ యూజేఎం రావుకు సూచించారు. 42 మెట్రో స్టేషన్లతో కూడిన మూడు కారిడార్లను మొదటి దశలో నిర్మించాలని భావిస్తున్నారు. కారిడార్‌-1లో స్టీల్‌ ప్లాంట్‌ గేట్‌ నుంచి కొమ్మాది జంక్షన్‌ వరకు 34.40కి.మీ..కారిడార్‌-2లో గురుద్వార నుంచి పాత పోస్టాఫీస్‌ వరకు 5.07 కి.మీ.,కారిడార్‌-3లో భాగంగా తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకూ 6.75 కి.మీ. మేర లైట్‌ మెట్రో కారిడార్‌ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఆ తరువాత రెండో విడత కింద కారిడార్‌-4లో కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్పోర్టు వరకు 30.67 కి.మీ. మేర నిర్మించనున్నారు. ఈ నాలుగు కారిడార్లలో మొత్తం 54 స్టేషన్లు, రెండు డిపోలు ఏర్పాటు చేయనున్నారు.
బీచ్‌ రోడ్డులో ట్రామ్‌ కారిడార్‌
బీచ్‌ రోడ్డులో ట్రామ్‌ కారిడార్‌ ఒక మణిహా రంగా రాబోతోంది. ప్రధాన జం క్షన్ల నుంచి అభివృద్ధి చెందే ప్రాంతాలకు కూడా ట్రామ్‌ నడిపే యోచనలో ప్రభుత్వం ఉంది. మొత్తం 60.05 కి.మీ. మేర మోడ్రన్‌ ట్రామ్ని నడ పిేందుకు 4 కారిడార్లు గుర్తించారు. కోస్టల్‌ బ్యాటరీ నుంచి భీమిలి వరకూ ట్రామ్‌ కారిడార్‌ ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా స్టీల్‌ ప్లాంట్‌ నుంచి అనకాపల్లి, ఎన్‌ఏడీ జంక్షన్‌ నుంచి పెందుర్తి వరకు కూడా ట్రామ్‌ కారిడార్‌ రాబోతోంది.
శివారుకు మెట్రో.. సీఎం ఆకాంక్ష
ఏపీ ఎగ్జిక్యూటివ్‌, ఫైనాన్షియల్‌ క్యాపిటల్గా, ఐటీ హబ్‌ అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో శివారు ప్రాంతా లు కూడా కోర్‌ సిటీకి సమానంగా అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు అవసరం. అందుకే ఆయా ప్రాంతాలకు మెట్రో స్వా కర్యం కూడా కల్పించాలన్నది సీఎం వైఎస్‌ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష. అందుకు అనుగుణంగా డీపీఆర్‌ లో మార్పులు, చేర్పులు జరిగాయి.
విశాఖ మెట్రో స్వరూపమిదీ..
మొత్తం అంచనా వ్యయం:14.09 కోట్ల
ఫేజ్‌-1లో కారిడార్‌-1, 2,3 నిర్మాణ అంచనా వ్యయం: రూ.9,699 కోట్లు
ఫేజ్‌-2లో కారిడార్‌-4 నిర్మాణ అంచనా వ్యయం: రూ.4,610 కోట్లు ప్రాజెక్టు
విస్తీర్ణం: 76.90 కి.మీ. ఫేజ్‌-1, ఫేజ్‌-2లో నిర్మించే మొత్తం స్టేషన్లు: 54
మోడ్రన్‌ ట్రామ్‌ ప్రాజెక్టు
అంచనా వ్యయం: రూ.5,323 కోట్లు కారిడార్‌ -1 అంచనా వ్యయం: రూ.1,102 కోట్లు,కారిడార్‌-2 అంచనా వ్యయం: రూ.1.879 కోట్లు, కారిడార్‌- 3 అంచనా వ్యయం: రూ.1,321 కోట్లు, కారిడార్‌ – 4 అంచనా వ్యయం: 1.21 కోట్ల, ప్రాజెక్టు విస్తీర్ణం: 60.05 కి.మీ.– (జి.ఎ.సునీల్‌ కుమార్‌)

1 22 23 24 25 26 75