వనవాసి నవల

1930 దశకంలో, బిభూతి భూషణ్ బందోపాధ్యాయ తన స్వీయానుభవాల ఆధారంగా రాసిన ‘ అరణ్యక్’ పర్యావరణం పై వచ్చిన అత్యుత్తమమైన నవలల్లో ఒకటి. దీనిని తెలుగులోకి ‘వనవాసి’ అనే పేరుతో సూరంపూడి సీతారాం గారు అనువదించారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది హర్షణీయం , హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఈ నవల ను శబ్ద-రూపకంగా మీకందిస్తున్నాము. వనవాసి నవల మొదటి ఐదు భాగాలు ఇప్పుడు పాడ్కాస్ట్ చెయ్యడం జరుగుతోంది.ఈ నవల మొత్తం వంద భాగాలుగా హర్షణీయంలో పాడ్కాస్ట్ చెయ్యబడుతుంది రాబోయే మూడు నెలలలో.తెలుగు రాష్ట్రాలలోనే కాక దేశవ్యాప్తంగా వున్న పర్యావరణం సమస్యలు , అటవీ ప్రాంత ప్రజల సమస్యలు, వాటిపై పని చేస్తున్న పర్యావరణ కార్యకర్తల, ప్రముఖులతో హర్షణీయం జరిపిన సంభాషణలు కూడా ఈ రూపకంలో భాగంగా ప్రసారం చేయబడతాయి. https://player.captivate.fm/collection/ae7d492e-4bb1-47bb-b1a2-0642b7ed4461