ప్రభుత్వ మోసాలకు పరాకష్ట 2019 తాత్కలిక బడ్జెట్‌

‘‘ ఇది ఎన్నికల బడ్జెట్‌ అన్నది అందరికీ తెలిసిందే. ఏకంగా రైతాంగానికి 60వేల కోట్ల రూపాయల రొక్కం అక్కౌంట్లలోకి జమ చేయబోతున్నట్టు ప్రకటించారు ఆర్థిక మంత్రి. 2008లో పంట రుణాల మాఫీ పథకం అమలుకు ఖర్చు చేసిన మొత్తం సుమారు 80 వేల కోట్లు. ఫలితంగా తర్వాతి మూడు నాలుగేండ్లు వ్యవసాయ రంగంలో ఎంతో కొంత కదలిక రావటానికి నాటి యూపీఏ అమలు చేసిన రుణమాఫీ పథకం పని చేసింది. కానీ ఇప్పుడు మోడీ ప్రతిపాదిస్తున్న తెలంగాణ మోడల్‌ రైతు సహాయ పథకం వ్యవసాయ రంగానికి ఎంత మేలు చేస్తుంది అన్నది ప్రశ్నార్థకమే ’’ – ధీర

రెండువేల పందొమ్మిది వోట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ వివరాలు పరిశీలిస్తే 2014లో మొదలైన మోడీ ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాలు పరాకాష్టకు చేరాయని స్పష్టమవుతోంది. బడ్జెట్‌ ప్రవేశపెట్టినంతసేపూ జాతీయ టెలివిజన్‌ ఛానెళ్లు అన్నీ ఆదాయ పన్ను రాయితీ, రైతు సహాయ పథకం, పెన్షన్‌ పథకం సరళీకర వంటి ఆకర్షణీయమైన హామీలను పదే పదే ప్రసారం చేశాయి. సమీప భవిష్యత్తులో మోడీ ప్రభుత్వం అందించినంత సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వమూ అమలు చేయలేదని గొప్పలు చెప్పుకోవటం అప్పుడే మొదలైంది. తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్‌ గోయెల్‌ తన ఉపన్యాసంలో బీజేపీ ప్రభుత్వం పన్నుల విధానంలో అమలు చేసిన సంస్కరణల ఫలితంగా పన్ను చెల్లింపుదార్ల సంఖ్య విపరీతంగా పెరిగిందనీ, లక్షల కోట్ల ఆదాయం వచ్చిందనీ చెప్పుకొంది. కానీ వాస్తవాలు ఏమిటి? నిజంగా ప్రభుత్వం అంత గొప్ప సంక్షేమ బడ్జెట్‌ను ప్రతిపాదించిందా? వివిధ పథకాలకు కేటాయించిన నిధులు పెంచిందా? ప్రభుత్వ ఆదాయం పెరిగిందా అన్న మూడు ప్రశ్నలు వేసుకుంటే ఈ బడ్జెట్‌ ఉత్తిత్తిదే… అని ఘంటా పథంగా చెప్పవచ్చు.
ముందుగా రాబడి గురించి చూద్దాం. ప్రభుత్వం చెప్తున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరుగుదల వల్ల దేశానికి ఒనగూడిరది ఏమీ లేదని రాబడి లెక్కలు పరిశీలిస్తే తేలుతుంది. జీఎస్టీ వల్ల పన్నుల ఆదాయం గొప్పగా పెరుగుతుందనీ ఆ విధంగా వచ్చిన ఆదాయంతో సంక్షేమ పథకాలకు ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు పెట్టవచ్చన్నది బీజేపీ వాదన. కానీ పార్లమెంట్‌కు సమర్పించిన రాబడి లెక్కలు గమనిస్తే జీఎస్టీ వల్ల అదనంగా వచ్చిన ఆదాయం ఏమీ లేదని స్పష్టమవుతున్నది. జాతీయ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని చెప్పటానికి ఓ ప్రమాణం దిగుమతి సుంకాలు. ఆర్థిక వ్యవస్థ ఘనంగా ఉంటే ఆర్థిక వ్యవస్థ అవసరాలు తీర్చుకోవటానికి, వినిమయ అవసరాలు తీర్చుకోవటానికి దిగుమతులు పెరుగుతాయి. దిగుమతులు పెరగటం అంటే దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం పెరగాలి. కానీ దిగుమతి సుంకాల ద్వారా వచ్చిన ఆదాయం 201-18ఆర్థిక సంవత్సరంలో లక్ష 28వేల కోట్లు అయితే 2018-19ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం లక్షా 26వేల కోట్లు. మరో సూచన కేంద్ర ఎక్సైజు సుంకాలు. 2017-18లో ఈ పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం రెండు లక్షల 58 వేల కోట్లు కాగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం రెండు లక్షల 59వేల కోట్లు మాత్రమే. వచ్చే సంవత్సరం కూడా ఇంతకన్నా ఈ పద్దు కింద వచ్చే ఆదాయం పెరగదు అని అంచనా వేశారు. ఈ రెండు పద్దులు గమనిస్తే ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ గొప్పతనం గురించి చెప్తున్న విషయాలు అన్నీ కాకమ్మ కబుర్లే అని తేటతెల్లమవు తుంది. కేంద్ర ప్రభుత్వ ఆదాయం పెరగటానికి మరో మార్గం ప్రత్యక్ష పన్నులు. అంటే వేతన జీవుల మీద విధించే ఆదాయపు పన్ను. కంపెనీల మీద విధించే కార్పొరేట్‌ పన్ను. సంపన్నుల మీద విధించే సంపద పన్ను. ప్రభుత్వం వాగ్దానం ప్రకారమే ఇప్పటిరకు 2.5లక్షలుగా ఉన్న ఆదాయపన్ను పరిమితిని ఐదు లక్షలకు పెంచారు. అంటే ఇప్పటి వరకు ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తున్న వారిలో సగం మంది ఇక మీదట పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అయినా ఆదాయపు పన్ను పద్దు కింద కేంద్రానికి జమయ్యే ఆదాయంలో ఎటువంటి మార్పు లేదు…
ఆదాయపు పన్ను పరిధి పెంచిన తర్వాత ఆదాయపు పన్ను చెల్లింపుదార్ల సంఖ్య తగ్గిన తర్వాత కూడా అంతే మొత్తంలో ఆదాయపు పన్ను ఎలా వసూలు చేయాలో చార్టెడ్‌ అక్కౌంటెంట్‌, బీజేపీ రాజకీయ విరాళాలు వసూలుచేయటంలో దిట్ట అయిన పియూష్‌ గోయెల్‌కు మాత్రమే తెలిసిన విద్య. ఆర్థిక వ్యవస్థ ఆగమేఘాల మీద పురోగమిస్తున్నప్పుడు కార్పొరేట్‌ పన్ను పద్దు కింద వచ్చే ఆదాయం పెరగాలి. గత మూడేండ్లల్లో ఈ పద్దు కింద కేంద్రానికి వచ్చే ఆదాయంలో చెప్పుకోదగ్గ మార్పులు లేకపోవటాన్ని గమనిస్తే కార్పొరేట్‌ కంపెనీల మన్ననలు పొందేందుకు బీజేపీ ప్రభుత్వం ఎంతగా ఆరాట పడుతుందో అర్థమవుతుంది. ఏటాప్రపంచ కుబేరుల జాబితాలో పెరుగుతున్న భారతీయుల సంఖ్యచూసి సంస్కరణల గొప్పదనం గురించి జబ్బలు చరిచే ప్రభుత్వాలు సంపదపన్ను ద్వారా సేకరించే ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నం చేయకపోవటం ప్రభుత్వం యొక్క పక్షపాత వైఖరిని తెలియచేస్తోంది. ప్రధాన ఆదాయ వనరుల నుండి వచ్చే ఆదాయంలో పెద్దగా మార్పు లేకపోయినా బడ్జెట్‌ మోతాదును మాత్రం పెంచేసింది బీజేపీ ప్రభుత్వం. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 21,41,975 కోట్లు. 2018-9సంవత్సరానికి ఆశిస్తున్న ఆదాయం 24, 57,235 కోట్లు. కానీ2019-0 సంవత్సరంలో 27,84,200 కోట్లు సంపాదిం చాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత రెండేండ్లల్లో కేంద్రానికి వచ్చే స్థూల రాబడిలో ఎటువంటి మార్పు లేదు అంటేనే ఆర్థికాభివ ృద్ధి గురించి కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాటలకు దేశం ముందుంచుతున్న బడ్జెట్‌ గణాంకాలకు మధ్య పొంతన లేదని స్పష్టమవుతున్నది. అయినా ఈ సంవత్సరానికి అంటే 2019-20ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ రాబడి గతేడాది కంటే దాదాపు రెండున్నర లక్షల కోట్లు ఎక్కువ ఉంటుందని అంచనా వేసింది. అయితే ఈ మొత్తాన్ని అప్పుల రూపంలో సేకరిం చాలని ప్రతిపాదించింది. అప్పు చేయటం కూడామోడీ ప్రభుత్వం సాధించిన ఘనతగా చెప్పుకుని దేశాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచె త్తాలని ప్రయత్నం చేయటం ఆర్థిక వ్యవస్థ గురించిన వాస్తవాలను మరుగున పెట్టే ప్రయత్నం తప్ప మరోటి కాదు. ఇది ఎన్నికల బడ్జెట్‌ అన్నది అందరికీ తెలిసిందే. ఏకంగా రైతాంగానికి 60వేల కోట్ల రూపాయల రొక్కం అక్కౌంట్ల లోకి జమ చేయ బోతున్నట్టు ప్రకటించారు ఆర్థిక మంత్రి. 2008లో పంట రుణాల మాఫీ పథకం అమలుకు ఖర్చు చేసిన మొత్తం సుమారు 80 వేల కోట్లు. ఫలితంగా తర్వాతి మూడు నాలుగేండ్లు వ్యవసాయ రంగంలో ఎంతో కొంత కదలిక రావటానికి నాటి యూపీఏ అమలు చేసిన రుణమాఫీ పథకం పని చేసింది. కానీ ఇప్పుడు మోడీ ప్రతిపా దిస్తున్న తెలంగాణ మోడల్‌ రైతు సహాయ పథకం వ్యవసాయ రంగానికి ఎంత మేలు చేస్తుంది అన్నది ప్రశ్నార్థకమే. రక్షణ రంగానికి కేవలం 15వేల కోట్లు మాత్రమే (2.85 లక్షల కోట్లు నుంచి 3.05 లక్షల కోట్లు) పెంచి దేశ రక్షణకు ఎంతో సేవ చేస్తున్నట్టు చెప్పుకోవటం బీజేపీకి మాత్రమే చెల్లింది. ఈసంవత్సరం రక్షణ రంగానికి పెంచిన ప్రతిపాదిత కేటాయింపులు రాఫెల్‌ ఒప్పందంలో అనిల్‌ అంబానికి ఇచ్చే సబ్‌ కాంట్రాక్టు విలువ కంటే తక్కువ అన్న విషయాన్ని గమనించాలి. ఈ పేరు మీద జాతీయ భావాలు రెచ్చగొట్టే ప్రయత్నమే కనపడుతున్నది. వ్యవసాయ రంగాన్ని ఆదుకోవటంలో ప్రధాన పాత్ర ఎరువుల సబ్సిడీది. కానీ ఈపద్దు కింద తాత్కాలిక బడ్జెట్‌లో ఎరువుల సబ్సిడీ కోసం అదనంగా కేటాయించినది కేవలం ఐదువేల కోట్లు మాత్రమే. గతసంవత్సరం 70వేల కోట్లు ఖర్చు పెడితే ఈ సంవత్సరం 74,986కోట్లు ఖర్చు పెట్టాలని ప్రతిపాదించింది. ప్రభుత్వమే వాగ్దానం చేస్తున్నట్టు రైతుకి సహాయం పథకం ద్వారా వ్యవసా యరంగంలో భారీ కదలిక వచ్చి పెద్దఎత్తున సాగుభూమి విస్తరించే మాట నిజమే అయితే తదనుగుణంగా ఎరువుల సబ్సిడీ ఉండాలి. కానీ అత్తెసరు సబ్సిడీ పెరుగుదల గమనిస్తే ప్రభుత్వ వాగ్దానం మీద ప్రభుత్వానికే నమ్మకం లేదన్న విషయం స్పష్టమవుతోంది. ఆహారసబ్సిడీ కోసం అదనంగా కేటాయించింది 13వేల కోట్లు. మొత్తం ఆహారపు సబ్సిడీ కింద గత సంవత్సరం లక్షా 71 వేల కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం లక్షా 84 కోట్లు కేటాయించింది.
పేద ప్రజల ప్రయోజనాలకు పెద్ద పీట వేశామని చెప్పు కుంటున్నా విశ్లేషణల్లో వాస్తవం ఏమీ లేదని గణాంకాలు వెల్లడిస్తు న్నాయి. గ్రామీణాబి óవృద్ధి, విద్య, వైద్య శాఖల పద్దుల్లో గుర్తించదగిన పెరుగుదల ఏమీ లేదు. ఉపాధిహమీ పథకానికి కేటాయింపులు గతమూడేండ్లల్లో ఎటువంటి పెరుగుదలకు నోచుకోలేదు. ప్రపంచ వ్యాప్తంగా గొప్పదని చెప్పుకున్న ఆయుష్మాన్‌ భవ పథకానికి (ఆరోగ్య సేవలు) కేటాయింపులు పెంచకపోవటాన్ని గమనిస్తే ఈ పథకం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదన్న సందేహం తలెత్తుతు న్నది. పేద మహిళల కన్నీళ్లు చూడలేక దీపం పథకం దేశవ్యాప్తం చేశామని చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వం పేదలకు ఇచ్చే గ్యాస్‌ సబ్సిడీ కేటాయింపులు గత సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం మరింత తక్కువగా కేటాయించటం గమనార్హం. మొత్తంమీద గమనిస్తే ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో మెరుగుదల సాధించటానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని గాలికొదిలి కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం అప్పులు చేసి మరీఖర్చు పెట్టడానికి సిద్ధమైందని స్పష్టమవుతూనే ఉంది. యూపీఏ 1 హయాంలో ఉపాధి హామీ చట్టం, రైతు రుణ మాఫీవాగ్దానాలు చేస్తే దిగాలుపడిన స్టాక్‌ మార్కెట్‌ అదే తరహా పథకాన్ని బీజేపీ ప్రకటిస్తే ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సంబరాలు చేసుకోవటం వ్యాపార వర్గానికీ బీజేపీకీ ఉన్న అనుబంధాన్ని నిర్ధారించే సందర్భంగా నిలిచిపోతుంది.

అంతా ఆదివాసీలదే

అక్కడ ఆదివాసీలే ప్రభువులు. ప్రభుత్వ నిర్ణయాల్ని బేఖాతర్‌ చేసే అధికారం కూడా వారికి ఉన్నది. ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్‌ని, వార్డు సభ్యులను పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కూడా వారికి సంక్రమించింది. షెడ్యూలు ప్రాంతాలకు పంచాయతీ రాజ్‌ విస్తరణ (పీసా) చట్టం ప్రకారం స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం వారికి ఉన్నా ఏజెన్సీ గ్రామాలు మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా 500 జనాభా కలిగిన ఆదివాసీ గూడేలను గ్రామపంచాయతీలుగా ప్రకటించిన తర్వాత మొదటి సారి ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో గ్రామ సభల అధికారాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.
రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్‌లో ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో పీసా చట్టం అమల్లో ఉన్నది. రాష్ట్రంలోని పూర్వపు ఆదిలాబాద్‌, ఖమ్మం,వరంగల్‌,మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో గతంలో ఉన్న631 గ్రామ పంచాయితీలతో పాటూ ఇటీవల ఏర్పాటు చేసిన మరో 400 గ్రామ పంచాయితీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆదివాసీ తెగల ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాల్లో భాగంగా ఉన్న స్వయం నిర్ణయాధి కారం, సమస్యలను తగవులను పరిష్కరించుకునే ఆచారాన్ని ద ృష్టిలో పెట్టుకుని 1996లో కేంద్ర ప్రభుత్వం ‘పీసా’చట్టం అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం కీలక నిర్ణయాలన్నీ గ్రామసభల్లోనే జరగాలి. గ్రామ పెద్దల సమక్షంలో జరిగే గ్రామసభల నిర్వహణకు సంబం ధించిన మార్గదర్శక సూత్రాలను ఉమ్మడి రాష్ట్రంలో 2011లో జీఓ నంబర్‌ 66 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవే నిబంధనలు కొనసాగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలను ఆమోదించటం లేదా తిరస్కరిం చే అధికారం ఏజెన్సీ గ్రామ సభలకు ఉన్నది.
గ్రామసభల అధికారాలు…
ప్రజావసరాల కోసం కానీ ప్రయివేటు సంస్థల కోసం కానీ భూసేకరణ జరపాలంటే ఏజెన్సీ ప్రాంతంలో గ్రామసభల అనుమతి తీసుకోవాల్సి ఉన్నది. ‘పీసా’ చట్టం ప్రకారం ఇసుక, గ్రావెల్‌ తదితర చిన్న తరహా ఖనిజ సంసదకు ఆదివాసీలే యజమానులు. ఖనిజ సంపదను ప్రభుత్వ రంగ సంస్థలకి కానీ ప్రయివేటు వ్యక్తులకు కానీ అప్పగించాలంటే గ్రామసభల ఆమోదం అవసరం. ఏజెన్సీ ప్రాంతంలో గ్రామసభలు ఆమోదిస్తేనే మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇవ్వాల్సి ఉన్నది. ఈ లైసెన్సులు కూడా ఆదివాసీల పేరుతోనే జారీ చేయాల్సి ఉన్నది. చిన్న తరహా అటవీ ఉత్పత్తుల సేకరణ, సంతల నిర్వహణ, చిన్న తరహా నీటి వనరుల నిర్వహణ గ్రామసభల ఆమోదంతోనే జరగాలి. వ్యవసాయ ప్రణాళికలు కూడా గ్రామసభ ఆమోదం తర్వాతే అమలు చేయాలి. పంచాయితీ పరిధిలో ఉండే పాఠశాలలు, వైద్య శాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షించే బాధ్యత కూడా గ్రామ సభలకే కట్టబెట్టారు. తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లో పీసా చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే నీరు కార్చాయనే విమర్శలు పెల్లుబుకుతున్నాయి. ఇసుక తవ్వకాలు గ్రామపంచాయితీలకే అప్పగించాల్సి ఉండగా చట్టవిర్ధుంగా రాష్ట్ర ఖనిజా భివృద్ధి సంస్థ దక్కించుకుని ప్రయివేటు కాంట్రా క్టర్లకు అప్పగించటంతో గ్రామసంచాయితీలకు ఆదాయం రాకుండా పోయింది. పర్యావరణ విధ్వంసం జరుగుతున్నా నష్ట నివారణ చర్యల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయటం లేదు. ప్రస్తుతం జరుగు తున్న గ్రామసంచాయితీ ఎన్నికల తర్వాత పంచాయితీరాజ్‌ వ్యవస్థలో కీలక మార్పులు తీసుకు వస్తామని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఆదివాసీల స్వయం పాలన కోసం జరిగే గ్రామసభల విషయంలో కూడా ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలని ఆదివాసీలు కోరుతున్నారు.
సర్పంచ్‌ లేక పోయినా గ్రామసభ…
చట్ట ప్రకారం గ్రామసభను సమావేశపరచిన తర్వాత దీనికి అధ్యక్షత వహించే అధికారం సర్పంచ్‌కి ఉన్నప్పటికీ సర్పంచ్‌ రాక పోయినా గ్రామసభకు అధ్యక్షత వహించటానికి సర్పంచ్‌ అంగీకరించక పోయినా అదివాసీ తెగకు చెందిన పెద్దను గ్రామసభ అధ్యక్షుడిగా ఎన్నుకునే అధికారం ఆదివాసీలకు ఉన్నది. ఒకగ్రామపంచాయితీ పరిధిలో ఒకటి కన్నా ఎక్కువ ఆవాసాలు ఉంటే ప్రతి ఆవాసంలో ఒక గ్రామసభ నిర్వహించుకునే అధికారం ఉన్నది. అక్కడి నివసించే ఆదివాసీ తెగ లేదా గుంపు గ్రామసభ ద్వారా నిర్ణయాలను ప్రకటించే అధికారం సంక్రమించింది. గ్రామసభ తీర్మానాలకు పూర్తి స్థాయి చట్టబద్ధత ఉన్నది. గ్రామసభ వ్యవహారాల్లో తాము కూడా జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు కూడా పలుమార్లు స్పష్టం చేసింది.
వేదాంతను తిప్పికొట్టిన గ్రామసభలు : ఒడిషాలోని బాక్సైట్‌ గనులను వేదాంతకు అప్పగించటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలను గ్రామసభల తీర్మానాల ద్వారా అక్కడి ఆదివాసీలు తిప్పికొట్టారు. గ్రామసభల నిర్వహణలో అధికార యంత్రాంగం మితిమీరిన జోక్యాన్ని కూడా ఈ సందర్భంగా సుప్రీం కోర్టు తప్పుపట్టింది. అధికారులకు సంబంధం లేకుండా జిల్లా న్యాయమూర్తి పర్యవేక్షణలో నిర్వహించిన 13 గ్రామపంచాయితీలకు సంబంధించిన గ్రామసభలు బాక్సైట్‌ తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి.
నూతన పంచాయతీలకు గ్రామాభివృద్ధే ధ్యేయం కావాలి : పదవి చిన్నదే కావచ్చు, ఐనా తను తలుచుకుంటే గ్రామాన్ని అన్ని విషయాల్లో అగ్రగామిగా ఉంచగలడు. ఆమేరకు ఆత్మవిశ్వాసం,దీక్ష, పట్టుదల పుష్కలంగా సర్పంచ్‌గా ఎన్నుకోబడే వ్యక్తికి ఉండాలి. కేవలం తమ ప్రాబల్యం చాటుకోవాలనే దుగ్ధ కాకుండా ఊరి బాగోగు లపై శ్రద్ధ కనబరచే దిశగా ఆలోచించి ఉన్నంతలో రిజర్వు స్థానా ల్లో సైతం విద్యావంతులు, ప్రగతి కాముకులు ఎన్ని కవడానికి రాజకీ య పార్టీలు చొరవచూపాలి. గ్రామానికి ఆగ్రామం సొంతంగా అభివృద్ధి చెందడానికి కావలసిన ప్రణాళికా రచన జరగాలి. గ్రామాబి óవృద్ధి ప్రణాళిక రూపొందించడంలో ‘గ్రామసభ’దే కీలకపాత్ర. గ్రామసభ నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం తోపాటు వార్డు సభ్యులు, ఉప సర్పంచ్‌, సర్పంచ్‌లు అతి ముఖ్యమైన వాళ్లు. సాధారణంగా ఏ గ్రామానికైనా దాని సుస్థిరత కారకాల్లో మూడు అంగాలు ప్రధాన మైనవి. అవి1.విద్య 2.ఆరోగ్యం 3.మౌలిక సదుపాయాలు. అక్కడి ప్రభుత్వ పాఠశాలను పకడ్బందీగా నడుపుకోవడం ద్వారా బాలబాలిక లకు గుణాత్మక విద్య అందించాల్సిన బాధ్యత పంచాయతీలదే. ప్రజారోగ్యం పారిశుధ్యం పైనేఅధారపడి ఉంది. పారిశుధ్య వ్యవస్థను పటిష్టంగా అమలు పరచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని లేదా ఆరోగ్య సిబ్బందిని సమర్ధవంతంగా ఉపయోగించుకోవాల్సిన బాధ్యత కూడా పంచాయతీదే. మురుగుకాల్వల నిర్వహణ, సామాజిక మరుగు దొడ్ల నిర్మాణం, ఇంటింటి మరుగు దొడ్ల నిర్మాణం, దోభీ ఘాట్ల నిర్మాణం, గృహవ్యర్థాల సేకరణ వంటి చర్యల ద్వారా జాతీయ స్థాయిలో నిర్మల్‌, స్వచ్ఛ భారత్‌ పురస్కారాలను అందుకోవాలి. వీధి దీపాల ఏర్పాటు, గ్రంథాలయం నిర్వహణ, తాగు నీటి సరఫరా, రోడ్ల మరమ్మతు, కమ్యూనిటీ భవనాల నిర్మాణం-నిర్వహణ, మెరుగైన సమాచార వ్యవస్థ, తపాలా కార్యాలయం, క్రీడా సాంసృతిక శాలలు, బ్యాంకు, మార్కెట్‌ తదితర ప్రజావసరాల్లో మండలం, జిల్లా, రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని సమన్వయాన్ని ఎప్పటికిప్పుడు వేగిరపరచుకొని అభివృద్ధిలో నమూనాగా గ్రామాన్ని తీర్చిదిద్దాలి ఇందుకు సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లకు రాజకీయ అక్షరాస్యత కంటే అధికంగా స్థానిక సంస్థల విధులు-నిధులు, నిర్వహణ పట్ల అవగాహన సమగ్రంగా ఉండాలి. కొంతకాలంగా గ్రామాలు రాజకీయ కక్షలు కార్పణ్యాలకు నిలయా లుగా మారిపోయాయి. ఊళ్లు ప్రాత:కాలం నుంచే మద్యంమత్తుతో తూలుతున్నాయి. మద్యం దుకాణాల కారణంగా ప్రజా రోగ్యం పూర్తిగా క్షీణించింది. భర్తల అకాల మర ణంతో వితంతువుల సంఖ్య పెరిగి ఇళ్లలో విషాదం అలుముకుంటున్నది. మద్య రహిత గ్రామంగా తమ గ్రామాన్ని నడుపుకోవడంలో ఇతర గ్రామాలకు ఆదర్శంగా పంచా యతీ పనితీరు, నిర్ణయాలు ఉండాలి. వలసలకు నిలయాలుగా కాకుం డా ఉత్పత్తి క్షేత్రాలుగా ఊర్లు విలసిల్లాలంటే స్థానికంగా కుటీర పరిశ్ర మలు, ఉపాధి పనులు, వృత్తి నైపుణ్యాల శిక్షణా సంస్థలు నెలకొనేటట్టు గ్రామపంచాయతీ ఒక మిషన్‌గా పనిచేయాలి. యువజన సంఘాలు, మహిళా పొదుపు గ్రూపులు, ఉద్యోగుల సేవాకేంద్రం, హితైషుల వితరణ కార్యక్రమాలను ప్రోత్సాహిస్తూ కలుపుకొని వెళ్తేనే సర్పంచ్‌ రాణిస్తారు. అధికారం చెలాయించడానికో దర్ప ప్రదర్శన కోసమో పదవి కాదని సర్పంచ్‌ గమనించాలి. గ్రామంలో కుల వ్యవస్థ పునా దులు బలిష్టంగా ఉంటాయి. శాంతి సామరస్య వైఖరులను అవలభిస్తూ సమైక్యతను మరింత అభివృద్ధి పరచాలి. పండుగలు తదితర సంద ర్భాల నిర్వహణలో గ్రామంలోని పెద్దల సలహాలు సూచనలు పాటిస్తూ ఈవెంట్‌ మేనేజ్మెంట్‌ స్ట్రాటజీతో ముందుకెళ్లాలి. నిధులు కేంద్రం నేరుగా ఇచ్చినా, రాష్ట్రం ఇచ్చినా, స్థానిక వనరుల ఆధారంగా సమ కూరినా వాటి ఖర్చు, వినియోగంలో పారదర్శకత నిజాయితీ అడుగడు గునా పాటించాలి. ఎంహెచ్‌ఆర్‌డీ వంటి సంస్థలు నిర్వహించే శిక్షణా కార్యక్రమాలకు ఉత్సాహంతో హాజరవ్వాలి. స్ఫూర్తి వంతంగా సర్పంచ్‌ పదవీ నిర్వహణకు అవసరమైన సజనాత్మకతను విభిన్న పద్ధతుల్లో అందిపుచ్చు కోవాలి. పంచాయతీరాజ్‌ చట్టానికి లోబడి సంవత్స రానికి మొక్కుబడిగా కాకుండా, విధిగా విశాల దక్పథంతో ప్రజలందరి సమక్షంలో గ్రామసభ జరిపి తీర్మానాలను తీసుకోవాలి. అంతే గుణవం తంగా తీర్మానాలను అమలు జరపాలి కూడా. అభివృద్ధితో పాటు, ప్రజలకు ప్రశ్నించే శక్తినిచ్చే పంచాయతీయే ఉన్నతమైంది. – కొండూరి రమేశ్‌బాబు

ఎడతెగని సామాజిక బంధం

‘‘భారతీయ సమాజంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న సమూ హాలు గిరిజన తెగలు. వీటికి సామాజికంగా, సాంస్క ృ తికంగా ప్రత్యేకతలున్నాయి. వీటితోపాటు వైవిధ్య చరిత్ర, సంస్క ృ తులున్నాయి. జన జీవన స్రవంతిలో భాగంగా కొందరు.. దూరంగా ఇంకొందరు జీవనం సాగిస్తున్నారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లోనూ భిన్న తెగలకు చెందిన గిరిజనులున్నారు. భారత్‌లోని గిరిజన తెగల సంస్క ృతి.. సంప్రదాయాలు.. జీవన వైవిధ్యం..’’
ఆదివాసీలు, గిరిజనులు ఏదేశానికైనా మూలవాసులన్నది మానవ శాస్త్రవేత్తల భావన. ప్రస్తుత భారత జనాభాలో దాదాపు 8-9 శాతం ప్రజలు వివిధ గిరిజన సమూహాలకు చెందినవారే. భారతీ య సమాజంలో గిరిజన సమూహాలన్నీ ప్రత్యేకమైన మత విశ్వా సాలను కలిగి ఉన్నాయి. గిరిజన సమాజమనేది కొన్ని ప్రత్యేక లక్షణా లతో కూడుకున్న సమూహం. ఆంథ్రోపాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధ్యయనం ప్రకారం ఒక్కోగిరిజన తెగ ఒకనిర్దిష్టమైన భౌగోళిక ప్రాం తానికి పరిమితమై ఉంటుంది. ఒక గిరిజన తెగ విభిన్న రాష్ట్రాల్లో విస్తరించి ఉండటం అరుదు. ప్రతిగిరిజన సమూహానికి ఒక నిర్దిష్టమైన పేరుంటుంది. ఒకే రకమైన భాష, సంస్కృతి ఉంటాయి. ఒకేరకమైన ఆచార వ్యవహారాలు కలిగి ఉంటారు. ఒకే న్యాయం, ఒకే చట్టం ఉంటాయి. అంతర్వివాహ పద్ధతిని ఆచరిస్తారు. గిరిజన సమూహాలకు ప్రత్యేకమైన మతవిశ్వాసాలు, ఆరాధన పద్ధతులు ఉంటాయి. ముఖ్యం గా ప్రకృతి శక్తులను ఆరాధిస్తారు. వీటితోపాటు ప్రతిగిరిజన సముదా యానికి ఒక స్వయం ప్రతిపత్తి గల రాజకీయ వ్యవస్థ ఉంటుంది. ఈనాటికీ చాలా తెగలుప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో ప్రవేశించినా, తమనుతాము నియంత్రించుకునే స్వీయరాజకీయ వ్యవస్థను (ఆదివాసీ మండలి) కొనసాగిస్తున్నాయి. ఆయా తెగల పెద్దలు ఇందులో సభ్యులు గా ఉంటారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ కార్యకలాపాలను వీరే నియంత్రిస్తుంటారు. అన్నింటికీ మించి ఇవి ఏకరూపత కలిగిన సమూ హాలు. వీటన్నింటిలోనూ గోత్ర వ్యవస్థ అంతస్సూత్రంగా పనిచేస్తుంది. గిరిజన సమాజంలోని సభ్యుల ప్రవర్తనను గోత్రవ్యవస్థ నియంత్రి స్తుంటుంది. స్వగోత్రికులు రక్తబంధువులనే భావన కలిగి ఉంటారు. అందుకే స్వగోత్రీకులు పెళ్లిళ్లు చేసుకోరు.
పవిత్ర టోటెమ్‌
ప్రతి గోత్రానికి ఓటోటెమ్‌ ఉంటుంది. టోటెమ్‌ అంటే మతపరమైన చిహ్నం. గోత్ర సభ్యులంతా ఆమతపరమైన చిహ్నం నుంచి ఉద్భవించామనే భావనతో దాన్ని పవిత్రంగా భావిస్తారు.. ఆరాధిస్తారు. ఈచిహ్నం ఒక వ్యక్తి కావొచ్చు, జంతువు, చెట్టు లేదా ప్రకృతిలోని ఏదైనా కావొచ్చు. అది వారి తెగకు గుర్తు. మూడు రకాల తెగలు భారత్‌లో మనకు 3 రకాల గిరిజన తెగలు కనిపిస్తాయి.

  1. దట్టమైన అటవీ ప్రాంతాల్లో, పర్వత ప్రాంతాల్లో జీవించేవారు. వీరు జనజీవన స్రవంతికి దూరంగా ఉంటారు. అడవులు, అటవీ సంపదపై ఆధారపడి జీవిస్తారు. ఆర్థికంగా, రాజకీయంగా స్వతం త్రంగా జీవించినప్పటికీ ఆర్థికంగా వెనకబడిన తెగలివి.
  2. అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్నా, వ్యవసాయం ప్రధానంగా చేసే ఆదిమతెగలు. వీరికి పాక్షికంగా గిరిజనేతరులతో సంబంధాలుంటా యి. సామాజిక, వ్యాపార సంబంధాలుండే అవకాశముంది.
  3. మైదాన ప్రాంతాల్లోని గిరిజన సమూహాలు. జనజీవన స్రవంతిలో భాగంగా ఉండి ఆధునిక జీవన విధానానికి దగ్గరగా ఉంటారు. ప్రభు త్వం కల్పించే చాలా అభివృద్ధి పథకాలు ఈమైదాన ప్రాంతాల్లో స్థిర పడిన, గ్రామీణ ఆర్థికవ్యవస్థకు దగ్గరగా ఉన్న తెగలు ఎక్కువగా ఉపయోగించుకుంటాయి. అందుకే వారిలో విద్య, ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది. ఉదాహరణకు ఉత్తర భారతదేశంలో తీసుకుంటే బిల్లులు, సంతాల్‌(మధ్యప్రదేశ్‌)లు, ముండాలు(బిహార్‌), మహారాష్ట్ర, తెలంగాణ ల్లోని రాజ్‌గోండులు, లంబాడీలు జనజీవన స్రవంతికి చాలా దగ్గరగా ఉండే సమూహాలు. అందుకనే వీరిలో రాజకీయ, ఆర్థిక, విద్యాపరమైన అభివృద్ధి కనిపిస్తుంటుంది. అదే చెంచు లాంటి తెగలను చూస్తే వారింకా జనజీవన స్రవంతికి దూరంగానే ఉన్నారు.
    ఈశాన్య భారతంలో..
    సామాజిక, మానవ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం భారత్‌లో దాదాపు 450కి పైగా గిరిజన సమూహాలున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో వీరి జనాభా శాతం ఎక్కువ. దాదాపు 80 నుంచి 90 శాతం దాకా ఈశాన్య రాష్ట్రాల మొత్తం జనాభాలో గిరిజనులే. వీటిలో జనాభా పరంగా చూస్తే, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, తెలంగాణల్లో విస్తరించిన గోండు తెగ అత్యధిక జనాభాతో ఉంది. ఈ గోండుల్లో కూడా రకరకాల వారున్నారు. ఉదాహరణకు మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల్లో ఎక్కువగా కనిపించేవారు మరియా గోండులు. తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో కనిపించే వారు రాజ్‌గోండులు. రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల్లో ప్రధానమైన తెగ భిల్లులు. బిహార్‌, ఒడిశా, పశ్చిమ్‌ బంగ, మధ్యప్రదేశ్‌ (పాక్షికంగా)ల్లో సంతాల్‌లుబీ రaార్ఖండ్‌లో ముండాలు అత్యధిక జనాభా ఉన్న గిరిజన సమూహాలు. మధ్యభారత ప్రాంతాల్లో ముఖ్యంగా మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, బిహార్‌, రaార్ఖండ్‌, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్‌లలో గిరిజనజనాభా ఎక్కువగా ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం అక్కడి జనాభాలో అత్యధిక శాతం గిరిజన తెగకు చెందినవారే. ఉదాహరణకు మిజోరాంను చూస్తే స్థానిక జనాభాలో 95శాతం గిరిజన సమూహాలే. అరుణాచల్‌ప్రదేశ్‌, మేఘా లయల్లోని జనాభాలో 80 శాతం గిరిజనులే. నాగాలాండ్‌లో 85 శాతంపైగా, మధ్యప్రదేశ్‌, ఒడిశాల్లో 25 శాతం వంతున గిరిజన జనాభానే. గుజరాత్‌లో 14, రాజస్థాన్‌లో 12, అసోం, బిహార్‌ల్లో 10 శాతం గిరిజన జనాభా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
    గిరిజన సమూహాలు.. జోన్లు
    భారత్‌లో భౌగోళికంగా వివిధ గిరిజన సమూహాలు ఏవిధంగా విస్తరించి ఉన్నాయనేది ఆసక్తికరం. దీనిపై ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ ఫర్‌ రిసెర్చ్‌ (ఐసీఎస్‌ఎస్‌ఆర్‌), ఎల్‌పీ విద్యార్థి అనే సామాజిక మానవ శాస్త్రవేత్త ఆధ్వర్యంలో ఓసర్వే నిర్వహిం చింది. భారత్‌లోని వివిధ గిరిజన సమూహాల భౌగోళిక విస్తరణను అధ్యయనం చేసిన విద్యార్థి వీరిని నాలుగు జోన్లుగా విభజించారు.
  4. హిమాలయ ప్రాంతం
  5. మధ్య భారత ప్రాంతం
  6. పశ్చిమ భారత ప్రాతం
  7. దక్షిణ భారత ప్రాంతం
    భారతదేశ జనాభాలో గిరిజన జనాభా 9-10 శాతం ఉంటుందని అంచనా. మొత్తం గిరిజన జనాభాలో.. హిమాలయ పర్వత ప్రాంతాల్లో 11 శాతం ఉంటే..57 శాతం మధ్య భారతంలోనూ, 25 శాతం పశ్చిమ భారతంలోనూ, 7శాతం దక్షిణ భారతంలోనూ ఉన్నట్లు విద్యార్థి అంచనా. ఇతడి సర్వే ప్రకారం ఆయా ప్రాంతాల్లోని ప్రధాన తెగలను చూస్తే..
  8. హిమాలయ ప్రాంతంలో..
    జమ్మూ కశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో ప్రధానంగా కనిపించేవి భోట్‌, గుజ్జర్‌, గద్ది తెగలు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని తెరాయి ప్రాంతంలో ప్రధాన మైన తెగ తారూ. అసోంలో-మిజో, గారో, ఖాసీలతో పాటు బోడోలు.. మేఘాలయలో-ఖాసా, ఖాసీలు..నాగాలాండ్‌లో-నాగాలు.. మణిపూర్‌లో-మావో, కూకీలు.. త్రిపురలో-త్రిపురి తెగ.
  9. మధ్య భారత ప్రాంతంలో..
    పశ్చిమ్‌ బంగ, బిహార్‌, జార?ండ్‌ల్లో-సంతాల్‌, ముండా, ఒరావణ్‌, హో తెగలు.. ఒడిశాలో-ఖోండులు, గోండులు.
  10. పశ్చిమ భారత ప్రాంతంలో..
    రాజస్థాన్‌లో-భిల్లులు, మీనాలు ఘరాసియాలు..మధ్యప్రదేశ్‌లో- సంతాల్‌లు, భిల్లులు..గుజరాత్‌లో-భిల్లులు, దుబ్లాలు, ధోడియాలు.. మహారాష్ట్రలో-భిల్లులు,కోలీలు,మహదేవ్‌లు, కోక్నాలు ప్రధాన తెగలు.
  11. దక్షిణభారత ప్రాంతంలో..
    ఆంధ్రప్రదేశ్‌లో-కోయ, కొండదొర, సవర, కొండరెడ్డి..తెలంగాణలో- రాజ్‌గోండులు,లంబాడీలు,చెంచులు,ఎరుకలు,గుత్తికోయ,కోలమ్‌, నాయక్‌పోడ్‌.. తమిళనాడులో – ఇరుల, తోడా, కురుంబా, కడార్‌లు.. కర్ణాటకలో-నాయికాడ, మరాటీలు.. కేరళలో-కుళయన్‌, పనియన్‌.. అండమాన్‌, నికోబార్‌దీవుల్లో-అండమానీలు, జారవాలు, నికోబారీలు ప్రధాన తెగలు. రకరకాల కారణాల వల్ల జారవా అనే తెగతో పాటు అండమానీలు జనాభా పరంగా దాదాపు అంతరించే స్థితిలో ఉన్న తెగలు.
    కులం – తెగ
    ప్రతి తెగ సజాతీయ సమాజం. తెగలో ఏకరూపత ఉంటుంది. భౌగోళి కపరంగా ఉన్న సమూహమిది. కులం అలా కాదు. కులం ఏకరూపత కలిగిన సమూహం కాదు. కులానికి చెందినవారు వేర్వేరు భాషలు మాట్లాడొచ్చు. వారికి వేర్వేరు సంస్కృతులుండొచ్చు. కులానికి వార సత్వంగా ఉండే వ ృత్తి ఉంటుంది. కానీ గిరిజనులకు ఆయా భౌగోళిక ప్రాంతాల్లోని వనరులను బట్టి జీవనోపాధి ఉంటుంది. ప్రతి తెగకు ఓ నిర్దిష్టమైన భాష ఉంటుంది. గిరిజన భాషలకు చాలామేర లిపి లేదు. కులానికి నిర్దిష్టమైన భాష అంటూ ఉండదు. కులానికి, తెగలకు ఉన్న ఏకైక ప్రధాన సారూప్యత ఏమైనా ఉందంటే అది రెండూ అంతర్‌వివాహ సమూహాలే.
    తెలంగాణ గిరిజనం
    తెలంగాణలో దాదాపు 10-12 శాతం గిరిజనజనాభా ఉన్నట్లు అంచనా. ఇక్కడ నివసిస్తున్న ప్రధాన తెగలు-లంబాడీలు, రాజ్‌గోండులు,చెంచులు,ప్రధాన్‌లు,కోలమ్‌లు,నాయక్‌పోడ్‌, ఎరుకలు, గుత్తికోయలు. సామాజికంగా, సాంస్క ృతికంగా జనజీవన స్రవంతిలో సమ్మిళితమైన తెగలు-లంబాడీలు,గోండులు(రాజ్‌గోండులు). ఆదిలాబాద్‌ జిల్లాలోని రాజ్‌గోండులు తాము క్షత్రియసంతతి వారమని అంటుంటారు. వీరు కొంతమేరకు విద్యాపరంగా, ఇటీవలి కాలంలో రాజకీయంగా కూడా భాగస్వామ్యాన్ని పొందారు. వీరితో పాటు లంబాడీ తెగ కూడా ఆఫలాలను అందుకుంటోంది. తెలంగాణలోని చాలా జిల్లాల్లో విస్తరించిన తెగ లంబాడీ తెగ. ఇటీవలి కాలంలో లంబాడీలు కూడా తాము క్షత్రియులమనే వాదన తెస్తున్నారు. రాజ్‌ గోండులతో పాటు ఆదిలాబాద్‌లో ప్రముఖంగా ఉన్నవారు ప్రధా నులు, కోలమ్‌లు, నాయక్‌పోడ్‌లు. తెలంగాణలో బాగా వెనకబడిన తెగ చెంచులు. వీరు మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉంటారు. ఇప్పటికీ ఆహార సేకరణ ప్రధానవృత్తిగా ఉన్న తెగ ఇది. వరంగల్‌లాంటి చోట ఎరుకల తెగవారెక్కువ. వీరు జన జీవన స్రవంతిలో భాగంగానే జీవనం గడుపుతున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో మథుర అనే తెగ ఉంది. రాజస్థాన్‌ నుంచి వలస వచ్చిన తెగకు చెందిన వారు. వీరి ప్రధాన వృత్తి పశుపోషణ. గోవులను పెంచడం, వ్యవసాయం వీరి ప్రధాన జీవనాధారం. వైష్ణవ సంప్రదాయాన్ని ఆచరించడం వీరి ప్రత్యేకత. శ్రీకృష్ణుడి సంతతి నుంచి వచ్చామని అంటుంటారు. కామారెడ్డి గాంధారి మండలంలో ఈమథుర తెగ కనిపిస్తుంది. తెలంగాణలోని చాలా తెగల్లో వెనకబాటుతనం కనిపిస్తుంది. ప్రభు త్వాలు గిరిజన తెగల అభివ ృద్ధి కోసం ఐటీడీఏ ద్వారా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో దీనిద్వారా అభివ ృద్ధికి క ృషి చేస్తున్నారు. ఫలితంగా కొన్ని తెగల్లో అభివృద్ధి కనిపిస్తోంది.
    గోందులు40లక్షలకుపైగా భల్లులుదాదాపు 40లక్షలు సంతాల్‌లు30లక్షలు 2011 జనాభా లెక్కల ప్రకారంభారత్‌లో అత్యధికంగా గిరిజన జనాభా ఉన్న ప్రాంతాలు మధ్యప్రదేశ్‌, చత్తీసఘడ్‌, రaార్ఖండ్‌, బిహార్‌, మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్‌. – ఆచార్య గణేశ్‌

రిజర్వేషన్లు పాలకుల పన్నాగాలు

‘రాజకీయాలలో మనిషికి ఒక ఓటు, ఓటుకు ఒక విలువ అనే సూత్రాన్ని గుర్తించబోతు న్నాము. కానీ మన సామాజిక, ఆర్థిక జీవితాలలో మనుషు లందరిదీ ఒకే విలువ అనే సూత్రాన్ని అంగీకరి స్తున్నామా? ఎంత కాలం ఈ వైరుధ్యాల జీవితం? ఈ అసమానతలను వీలైనంత త్వరగా అంతం చేయాలి.’
డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌,1950 జన వరి 26.ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం సమంజసమే అని అత్యు న్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఐదుగురు న్యాయమూర్తు ల్లో ముగ్గరు అనుకూలంగాను, మరో ఇద్దరు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ ఇద్దరిలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి కూడా వున్నారు. ఈ రిజర్వేషన్లు పొందడానికి ప్రభుత్వం నిర్ణయించిన ఆర్థిక ప్రాతిపదిక సమంజస మేనా?ఇది నిజంగా అగ్రకులా ల్లోని అర్హులకా? అనర్హులకా? ప్రభుత్వ రంగం పెద్దఎత్తున ప్రైవేటీక రించబడుతున్న ఈస్థితిలో రిజర్వేషన్లవల్ల ప్రయో జనం ఎంత? అగ్ర కులాల్లో కాని, మొత్తం సమా జంలో కాని ఆర్థిక,సామాజిక అణచివేతకు కార ణాలు ఏమిటి? అనే ప్రశ్నలు సహజంగానే చర్చనీ యాంశం అయ్యాయి. 2019 నుండి పెండిరగ్‌లో వున్న ఈ సమస్యపై కొద్ది రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భం గా తీర్పు రావడం వెనుక రాజకీయ ప్రయోజ నాలు ఏమీలేవు అనుకో గలమా?
బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభు త్వం అధికారం లోకి వచ్చిన తర్వాత 2019 జనవ రిలో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థిక వెనుకబాటు తరగతులకు10 శాతం రిజర్వేషన్లు ప్రకటించింది. విద్యా, ఉద్యోగ నియా మకాల్లో ఈ పదిశాతం కోటాను అమలు చేయా లని నిర్ణయించింది. సామాజిక అసమానత ప్రాతి పదికగా వున్న రిజర్వేషన్లను, ఆర్థిక అస మానత ప్రాతి పదికగా కూడా అమలు చేయవచ్చు అని ఈతీర్పు ప్రకటించింది. అగ్రకులాల్లో వుండే పేద లకు ప్రత్యేక సదుపాయం కల్పించడం సరైందే. నిజంగానే ఆఆర్థిక వెనుకబాటును రూపు మా పాలను కుంటే ప్రస్తుతం పాలకులు అమలు చేస్తున్న అనేక విషయాల్లో మౌలిక మార్పులు రావాలి. అది చేయకుండా కేవలం రిజర్వేషన్ల ద్వారా మాత్రమే ఏదో పరిష్కరిస్తున్నామంటే అది పేదలను చీల్చ డానికి,వారి ఐక్యతను దెబ్బతీసి మరిం త కాలం ఆర్థిక,సామాజిక అణచివేతను కొనసా గించడానికి పాలకవర్గాలు చేస్తున్న కుట్రగా భావించాలి. కార్పొరేట్‌ అనుకూల, మతో న్మాద విధానాలు అమలు చేస్తున్న కేంద్ర పాల కులు నిత్యం ప్రజల ఐక్యతకు విఘాతం కలిగించే ఎత్తు లు వేస్తూనే వున్నారు. హిందూత్వ శక్తులు-రిజర్వే షన్లు. మను ధర్మం ఆధారంగా చాతుర్వర్ణ వ్యవస్థ భావజాలంతో దేశాన్ని పాలిస్తున్న ఆర్‌ఎస్‌ ఎస్‌, బిజెపి నేతలకు సామాజిక ప్రాతిపదికన రిజర్వే షన్లు వుండడం మొదటి నుండి ఇష్టం లేదు. సామాజిక అసమాన తలు గుర్తిస్తే అస మానతలకు కారణాలను విశ్లేషించాలి. అప్పుడు హిందూత్వ నగరూపాన్ని ప్రజలు గుర్తిస్తారు. అందుకే కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండకూడదనేది హిందూత్వ శక్తుల వాదన. అనాగ రిక భావజా లంతో ఆధునిక పరిజ్ఞానాన్ని మేళ వించి,అనేక ద్వంద్వ ప్రమాణాలతో ప్రజల మధ్య చిచ్చుపెడు తున్న ఆర్‌ఎస్‌ఎస్‌… కుల వ్యవస్థను కొనసాగిస్తూనే మత రాజ్యాన్ని స్థాపించాలను కుంటుంది. ఒకే మతం,ఒకే దేశం,ఒకే జాతి లాంటి నినాదాలతో ప్రజల మద్దతును పొందా లనుకుంటుంది. మరో వైపు భారత రాజ్యాంగం వారి భావజాల విస్తరణ కు ఆటంకంగా వుంది. అందుకే వారు రాజ్యాం గంపై, అందులోని కీలక అంశాలైన లౌకికతత్వం, ఫెడరల్‌ వ్యవస్థ, సామా జిక న్యాయం, శాస్త్ర విజ్ఞాన పరిశోధనలాంటి వాటిపై అనేక రూపాల్లో దాడులు చేస్తున్నారు. అనేక తరాలుగా హిందూత్వ భావజాలంతో తీవ్రమైన సామాజిక అణచి వేతకు గురైన దళి తులు,ఉపశమనం కోసం మతం మారితే వారికి దళిత రిజర్వేషన్లు అమలు చేయ రాదని మత కోణం నుండే బిజెపి వాదిస్తున్నది. ‘మానవులంతా సమానంగా గుర్తించబడలేదు’ అని మనుధర్మ శాస్త్రం 1వస్మృతి- 31వ శ్లోకం చెబుతుంది. అలాగే ‘అగ్రవర్ణాలకు సేవ చేయడం శూద్రుల బాధ్యత, శూద్ర కులాలు చదవకూడదు, శూద్రులు వేదం వింటే చెవుల్లో సీసం కాసి పో యాలి, వేదం పలికితే నాలుక కత్తిరించాలి’ ఇలాంటి అనేక భాష్యాలతో శూద్ర, అతి శూద్ర కులాలను బానిసలుగా చేసుకొని ఆర్థికంగా దోచు కుంటూ, సామాజికంగా అణచివేసి, చదువుకు, విజ్ఞానానికి శ్రమజీవులను దూరం చేసింది అగ్ర వర్ణ బ్రాహ్మ ణాధిపత్యం.
వందేళ్ళకు పైబడ్డ రిజర్వేషన్ల చరిత్ర. దేశాన్ని బ్రిటీష్‌ వారు పరిపాలించే క్రమంలో వారి వ్యాపార ప్రయోజనాల కోసమైనా ప్రజలకు చదువు చెప్పాల్సి వచ్చింది.పరిమిత విజ్ఞానా న్న యినా శ్రామిక జనంపొందే అవకాశం వచ్చిం ది.ఈ క్రమంలోనే సమాజం నుండి సాంఘిక సమానత్వ అంశం ముందుకు వచ్చింది. 1882 లో హంటర్‌ కమిషన్‌ ముందు జ్యోతిరావ్‌ పూలే హాజరై శూద్ర, పంచమ కులాలకు విద్యా,ఉద్యో గ రంగాలలో రిజర్వేషన్లు ఉండాలని వాదిం చారు.1902లో మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ సాహు మహారాజ ఆస్థానంలో బ్రాహ్మణేతరులకు విద్యా, ఉద్యోగాల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పిం చినట్లు ఆధారాలు వున్నాయి. దక్షిణ భారత దేశంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్య మిస్తున్న క్రమంలోనే విద్యా,ఉపాధికోసం పోరా టాలు జరిగాయి.గురజాడ,కందుకూరి, ముఖ్యంగా పెరియార్‌ ఇ.వి.రామస్వామి నాయర్‌ నడిపిన అనేక పోరాటాల వల్ల నాటి మద్రాసు రాష్ట్రంలో ఎస్‌.సి,ఎస్‌.టి,క్రిస్టియన్లతో సహా వెనుకబడిన కులాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించ బడ్డాయి. బి.సి ల సమస్యలపై దేశంలో మొదటి సారిగా 1921లో నియమించిన మిల్లర్‌ కమిటీ మైసూర్‌ సంస్థానంలో,1935లో కేరళ ప్రాంతం లోని ట్రావెన్‌కోర్‌ సంస్థానంలోఈరకమైన రిజర్వే షన్‌ సదుపాయాలు కల్పించాల్సి వచ్చింది. స్వాతంత్య్రానంతరం…జాతీయోద్యమంలో భాగంగా ప్రజలు ఒకవైపు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూనే, మరోవైపు దేశంలోని కులవివక్ష, వెట్టిచాకిరి,ఆర్థిక దోపిడి లాంటి రుగ్మ తలకు వ్యతిరేకంగా సామాజిక ఉద్యమాలు సాగించారు. సహజంగానే వీటిలో కమ్యూనిస్టులు, మానవతావాదుల చొరవ కీలకంగా వుంది. తరతరాలుగా అణచివేతకు, సాంఘిక వివక్షకు గురైన అత్యధికమంది ప్రజలకు ప్రత్యేక సదుపా యాలు కల్పించడం ద్వారానే దేశం అభివృద్ధి సాధించగలదని రాజ్యాంగ నిర్మాతలు భావిం చారు.ఈ నేపథ్యం నుండే స్వాతంత్య్రా నంతరం సామాజిక రిజర్వేషన్లను రాజ్యాంగ బద్ధంగా కల్పించారు. ఇలా పది సంవత్సరాలు ప్రత్యేక అవకాశాలు కల్పించడంద్వారా సాంఘిక సమా నత్వం సాధించడానికి తోడ్పడుతుందని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. భూస్వామ్య భావజాలం, మనువాద సిద్ధాంతం బలంగా తలలో నింపుకున్న శక్తులు ప్రారంభం నుండే రిజర్వేషన్లను వ్యతిరేకి స్తూ వచ్చారు. రిజర్వేషన్లు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15(1)కి వ్యతిరేకమని 70 ఏళ్ళ క్రితమే కోర్టుకు వెళ్లారు. రాజ్యాంగంలోని సమాన సూత్రాలకు రిజర్వేషన్లు విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో రిజర్వేషన్ల అమలు కోసం రాజ్యాంగానికి మొట్టమొదటి సవరణ చేయాల్సి వచ్చింది. భూ సమస్యను పరిష్కరించి, ప్రభుత్వ రంగాన్ని విస్తరింపచేయాల్సిన పాలకులు గ్రామీణ భూస్వామ్య వర్గంతో పెట్టుబడిదారులు రాజీపడి సామాజిక, ఆర్థిక అణచివేతను కొనసాగించారు. రిజర్వేషన్లు అవసరం లేదా? సాంఘిక, ఆర్థిక సమానత్వం సాధించేవరకు రిజర్వేషన్లు అవస రం. 76 ఏళ్ళ స్వాతంత్య్రం తరువాత కూడా కులం పేరుతో దాడులు, అసమానతలు ఎదు ర్కొంటున్న దళిత,గిరిజనులు అనేక రంగాల్లో వెనుకబడ్డారు.విద్య,ఉపాధిలో తీవ్ర అసమాన తలకు గురౌతున్నారు. ఏదో ధర్మం చేసినట్లు జన సంఖ్యతో సంబంధం లేకుండా ఈ వర్గాలకు శాతాల లెక్కన రిజర్వేషన్లు ఇస్తున్నారు. చేతివృ త్తులు,బలహీన కులాలకు చెందిన అత్యధిక మంది సామాజిక సేవారంగాల్లో పనిచేసేవారు. సాంకేతిక మార్పులు, ప్రభుత్వాల విధానాలు వీరి పరిస్థితిని తీవ్రంగా దిగజార్చాయి. బి.సి రిజర్వే షన్లకు కూడా రాజ్యాంగబద్ధంగా హక్కు కల్పిం చాలని అనేక పోరాటాలు జరిగాయి. 1976లో జనతా ప్రభుత్వంబి.పి.మండల్‌ అధ్యక్షతన వేసిన కమిషన్‌ సిఫార్సుల ఆధారంగా జనతాదళ్‌ ప్రభుత్వం 1990 ఆగస్టు 17న బి.సి కులాలకు విద్యా,ఉద్యోగాల్లో 27శాతం రిజర్వేషన్లు ప్రకటిం చింది. దీన్ని సహించలేని ఆర్‌ఎస్‌ఎస్‌, సంఘపరి వార్‌ సంస్థలు మండల్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా కమండల్‌ ను లేవదీశారు. రథయాత్రలు, ఏక్‌తా యాత్ర,అయోధ్య రామమందిరం పేర్లతో మతో న్మాద చర్యలు చేపట్టారు. దేశమంతటా ముఖ్యం గా విద్యాలయాల్లో హింసను రెచ్చగొట్టారు. ఓబిసి రిజర్వేషన్లు-వైద్య కళాశాలల్లో ప్రవేశానికి దేశ వ్యాప్తంగా ఒకే ప్రవేశ పరీక్ష (నీట్‌)అమలు చేయాలని 2016లో సుప్రీంకోర్టు చెప్పింది. ఈ అడ్మిషన్లల్లో 15శాతం అండర్‌ గ్రాడ్యుయేట్‌ సీట్లు, 50 శాతం పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సీట్లు అఖిల భారత కోటాకు ఇవ్వాలని ఈ తీర్పు ప్రకటించింది. ఇది నేరుగా రాష్ట్రాల హక్కులను కాలరాయడమే. ఈ విధానం రాజ్యాంగంలోని ఫెడరల్‌ విధానానికే వ్యతిరేకం.
ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు- విద్యా,ఉపాధి రంగాల్లో ప్రభుత్వ రంగానిది కీలక పాత్ర వున్న కాలంలో రిజర్వేషన్ల ప్రయోజనం కొద్దిమేరకైనా వుండేది. ప్రైవేటీకరణ ఒక ప్రళ యంలాగా సాగుతున్న ఈ పరిస్థితుల్లో రిజర్వేషన్లు ఎంత మేరుకు ఒడ్డుకు ఎక్కించగలవు? ప్రభుత్వ పెట్టుబడి, ప్రభుత్వ రాయితీలు, పన్ను మినహా యింపులు, ప్రభుత్వ రక్షణ లాంటి అనేక సదుపా యాలు పొందుతున్న కార్పొరేట్‌ సంస్థలు రిజర్వే షన్లు కలిపిస్తే ప్రతిభ దెబ్బ తింటుందనే చిలుక పలుకులు పలుకుతున్నాయి. బయటకు కనిపించే నాగరికత అంతా సామాజిక, ఆర్థిక అసమానతల ముందు దిష్టిబొమ్మలాగా మారుతుంది. దీని నుండి బయట పడడానికి ఒక ఉపశమనంగా రిజర్వేషన్లను వివిధ తరగతులు కోరుకుంటు న్నాయి. పాలకుల విధానాల వల్ల ఏర్పడి, కొనసా గుతున్న సామాజిక, ఆర్థిక అణచివేతకు ఈ రిజర్వే షన్లు మాత్రమే పరిష్కారం కాదు. అసమాన తలకు, దోపిడికి గురౌతున్న శక్తుల మధ్య ఐక్యత పెంచడం, సర్వ సమస్యలకు మూలమైన వ్యవస్థ సమూల మార్పుకోసం పోరాడడం ద్వారానే విముక్తి సాధించగలం.అందుకు ప్రగతిశీల శక్తులు కృషి చేయడమే పరిష్కారం.
సాంఘిక సమానత్వ సాధనలో రిజర్వేషన్ల ఆవశ్యకత, పరిమితులు
ఉద్యోగాలలో, చదువుల్లో దళితులకు, గిరిజను లకు, ఒబిసిలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని ఒక తాత్కాలిక ఉపశమనంగా పరిగణిస్తూనే సిపిఐ (ఎం) రిజర్వేషన్లను సమర్ధిస్తుంది. అదే సమయం లో దీర్ఘకాల పరిష్కారంగా సమూలంగా భూసంస్క రణలను చేపట్టాలని, కొద్దిమంది చేతుల్లో ఉన్న సంపద కేంద్రీకరణను బద్దలు కొట్టాలని, అన్ని తరగతులవారికీ ప్రయోజనాలు కలిగే విధంగా ఆర్థికాభివృద్ధి ఉండాలని కోరుతుంది.
దేశంలో వివిధ ప్రాంతాల్లో రిజర్వేషన్లకు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో పలుగ్రూపులు ఆయాతరగతుల డిమాం డ్లపై ఆందోళనలు చేపడుతున్నాయి. వారి వారి ఎన్నికల ప్రయోజనాలను నెరవేర్చుకోవడం కోసం బూర్జువా రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ ఆందోళనలను ప్రోత్సహిస్తు న్నాయి. అందరికన్నా ఎక్కువగా ఈ ఆందోళన లను, ఆయా తరగతుల సమస్యలను ఆర్‌.ఎస్‌.ఎస్‌ అతి శ్రద్ధగా తన సోషల్‌ ఇంజనీరింగ్‌ వ్యూహానికి అనుగుణంగా వినియోగించుకుంటోంది. ఇది ఆ యా బలహీన వర్గాలపై ప్రేమకొద్దీ చేస్తున్న పని కాదు,తన హిందూత్వ సిద్ధాంతాన్ని బలపరుచు కోవడం కోసం ఆయా కులాల్లో,సమూహాల్లో చొర బడడానికి వినియోగించుకుంటోంది.ఈ విషయం లో తన జోక్యంతో న్యాయ వ్యవస్థ సైతం కొత్త వివాదాలకు,సమస్యలకు కారణమౌతోంది. మొ త్తంగా చూసినప్పుడు ఒకవైపున రిజర్వేషన్ల వలన కలుగుతున్న ప్రయోజనాలు తగ్గిపోతూంటే, మరో వైపున తమకూ రిజర్వేషన్లు కావాలన్న తాపత్ర యం మరిన్ని తరగతులలో పెరుగుతోంది. ఇదే ప్రస్తుత పరిస్థితి లోని వైచిత్రి.
సాంఘిక సమానత్వాన్ని, న్యాయాన్ని సాధించడం లో భాగంగా సమాజంలోని దళిత, గిరిజన, తదితర బలహీన తరగతుల ప్రజలకు తోడ్పడ డానికి భారత రాజ్యాంగం పలు అవకా శాలను కల్పించింది.330,332,243-డి, 243 -టి అధికరణలు రాజకీయ రిజర్వేషన్లు కల్పిం చాయి.15,15(4),16(4),29(2) అధికరణలు విద్య,ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాయి. 17వ అధికరణ అంటరానితనాన్ని రద్దు చేసింది. 338 అధికరణ దళితులకు, గిరిజనులకు జాతీయ కమిషన్ల ఏర్పాటుకు అవకాశం కల్పించింది. సామాజిక న్యాయ సాధన దిశగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా 1989లో ఎస్‌.సి, ఎస్‌.టి అత్యాచార నిరోధక చట్టాన్ని జారీచేశారు. 1975 తర్వాత ఎస్‌.సి,ఎస్‌.టి స్పెషల్‌ కాంపొనెంట్‌ ప్లాన్‌ను బడ్జెట్‌లో భాగంగా ప్రవేశపెట్టారు. ఐతే, బిజెపి అధికారంలోకివచ్చాక దీనినినీరుగార్చారు. మన రాజ్యాంగంలో పలు అవకాశాలు చెప్పుకో దగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అందాలన్న లక్ష్యం మాత్రం ఇంకాచాలా దూరంగానే ఉండి పోయింది. భారత పాలకవర్గాలలో రాజకీయ చిత్తశుద్ధి లేక పోవడమే దీనికి కారణం. మతో న్మాద, మను వాద బిజెపి కేంద్రంలో అధి కారంలోకి వచ్చాక రాజ్యాంగ స్ఫూర్తినే దెబ్బతీసి నీరుగార్చే విధంగా నేరుగా దాడి జరుగుతోంది. రిజర్వేషన్ల వలన ఎటువంటి ఉపయోగాలూ కలగకుండా చూడ డానికి పలు వక్ర మార్గాల్లో మతోన్మాద శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలను ప్రతిఘటించి తిప్పికొట్టకపోతే బలహీన వర్గాలకు రిజర్వేషన్ల సదుపాయం లేకుండానే పోయే ప్రమాదం ఉంది.
చారిత్రికంగా అతిహీనమైన రీతిలో సామా జిక అణచివేతకు గురైన తరగతులకు ప్రస్తుత పెట్టుబడిదారీ సంబంధాలచట్రం పరిధిలో, ఆ పెట్టుబడిదారుల ప్రయోజనాలకు భంగం కలగ కుండానే, కనీసమైన ఊరటను రిజర్వేషన్లు కలిగి స్తాయన్నది సిపిఐ(ఎం) అభిప్రాయం. అంతే తప్ప పాలక వర్గాలు చెప్పుకుంటున్నట్టు రిజర్వేషన్లతోటే సామాజిక విముక్తి సాధ్యం కాదు. రిజర్వేషన్లు కులవ్యవస్థ సాంప్రదాయ పట్టును సడలింప జేయడానికి దోహదపడతాయని,కొద్దిపాటి సంఖ్యలోనైనా ‘కింది కులాల’ వారు సామాజి కంగా పైకి ఎక్కి రావడానికి వీలు కల్పించడం ద్వారా సమాజంలోని వివిధ వర్గాలలో బహుళ త్వాన్ని పెంచడానికి దోహదపడతాయని, ఆవిధం గా చూసినప్పుడు రిజర్వేషన్లు ఒక ప్రజాతంత్ర సారాంశం కలిగివున్నాయని సి.పి.ఐ(ఎం) భావిస్తుంది.ఉద్యోగాలలో, చదువుల్లో దళితులకు, గిరిజనులకు, ఒబిసిలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని ఒకతాత్కాలిక ఉపశమనంగా పరిగణిస్తూనే సిపిఐ (ఎం) రిజర్వేషన్లను సమర్ధిస్తుంది. అదే సమ యంలో దీర్ఘకాల పరిష్కారంగా సమూలంగా భూసంస్కరణలను చేపట్టాలని,కొద్దిమంది చేతుల్లో ఉన్న సంపద కేంద్రీకరణను బద్దలు కొట్టాలని, అన్ని తరగతులవారికీ ప్రయోజనాలు కలిగే విధంగా ఆర్థికాభివృద్ధి ఉండాలని కోరుతుంది. సామర్ధ్యం పేరుతోనో, మెరిట్‌ పేరుతోనో, సమా నత్వం పేరుతోనో రిజర్వేషన్లను రద్దు చేయాలన్న డిమాండ్‌ను సి.పి.ఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకి స్తుంది. సామాజిక వెనుకబాటుతనం వాస్తవంగా ఉన్న తరగతులకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్లనుబలపరుస్తుంది. ఇప్పటికీ రిజర్వేషన్లు అమలులోకి రాని రంగాల్లో, ప్రభుత్వ విభాగాల్లో రిజర్వేషన్లను అమలు చేయాలన్న డిమాండ్‌ను బలపరుస్తుంది. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు ఉండాలన్న డిమాండ్‌ను సమర్ధిస్తుంది. రిజర్వేషన్ల అమలులో తలెత్తుతున్న అసమానతలను సరి చేయాలన్న డిమాండ్‌ను బలపరుస్తుంది. ప్రమో షన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్‌ ను, రిజర్వేషన్ల అమలు ఫలితంగా ఒకే కేటగిరీ లో ఉన్న వివిధకులాల మధ్యలో అసమాన ప్రయో జనాలు కలిగితే దానిని సరి చేయడానికి ఆకు లాలను వర్గీకరించాలన్న డిమాండ్‌ను సిపిఐ(ఎం) బలపరుస్తుంది. ఒబిసిలలో గణనీయంగా దొంత రలు తయారైన కారణంగా, ఒబిసి రిజర్వేషన్ల అమలులో ఆర్థిక ప్రాతిపదికను (క్రీమీ లేయర్‌) పాటించాలన్న డిమాండ్‌ ను బలపరుస్తుంది. ఆ విధంగా చేసినప్పుడే ఎవరికి నిజంగా అవసరం ఉందో వారే రిజర్వేషన్ల వలన ప్రయోజనం పొందగలుగుతారు. అదే సమయంలో దళితుల్లో, గిరిజనుల్లో కూడా ఆర్థిక ప్రాతిపదికను (క్రీమీ లేయర్‌) ప్రవేశ పెట్టాలన్న డిమాండ్‌ను సిపిఐ (ఎం) వ్యతిరేకిస్తుంది. ఆ సామాజిక తరగతుల లోపల గణనీయమైన స్థాయిలో అంతరాలు ఏర్పడనందువల్ల ఈ విధమైన డిమాండ్‌ వారికి వర్తింపజేయకూడదు. అగ్ర కులాలవారికి, ఆధి పత్య కులాలవారికి కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండకూడదన్నది సిపిఐ(ఎం) వైఖరి. ఇందుకు మినహాయింపుగా ఆర్థికంగా వెనుకబడిన అగ్రకు లాల వారికి, ఆధిపత్య కులాల వారికి రిజర్వేషన్‌ సదుపాయం కల్పించడాన్ని,అది సామాజిక వెనుక బాటుతనంతో సంబంధం లేనిదే అయినా, సిపిఐ(ఎం)సమర్థిస్తుంది. పేద తరగతుల ప్రజల్లో రిజర్వేషన్‌ సదుపాయం వర్తించనివారిలో రిజర్వే షన్‌ విధానంపట్ల ఉన్న వ్యతిరేకతను తగ్గించ డానికి,వర్గ ఐక్యతను నిలబెట్టడానికి ఇది ఉప యోగపడుతుందన్న భావనతోనే ఈ వైఖరిని సిపిఐ(ఎం) తీసుకుంది.
సమాజంలో ఏకులం జనాభా ఎంత శాతం ఉందో అంతశాతం మేరకు వారికి రిజర్వే షన్‌ కల్పించాలన్న డిమాండ్‌ను సిపిఐ(ఎం) వ్యతి రేకిస్తుంది. ఒక్క దళిత, గిరిజన తరగతుల విష యంలోనే దీనికి మినహాయింపు ఉంటుంది. సామాజిక వెనుకబాటుతనం మౌలిక ప్రాతిప దికగా ఏతరగతికైనా రిజర్వేషన్‌ కల్పించాలే తప్ప జనాభాలో ఎవరెంత శాతం ఉన్నారన్న లెక్కన కాదు. ఆ విధంగా చేస్తే అది కులవ్యవస్థ యొక్క అణచివేసే నిచ్చెనమెట్లనిర్మాణపు దుర్మార్గాన్ని కప్పిపుచ్చడమే అవుతుంది.
రిజర్వేషన్ల అమలు-ఫలితాలు
స్వతంత్ర భారతదేశంలో గత ఏడు దశాబ్దాలుగా అమలు జరిగిన రిజర్వేషన్ల వలన వచ్చిన అనుభ వాలను, ఫలితాలను దిగువ పేర్కొన్న విధంగా సంక్షిప్తీకరించవచ్చు.

  1. సామాజికంగా ప్రతికూలతను ఎదుర్కొం టున్న తరగతుల్లో విద్యావ్యాప్తికి రిజర్వేషన్లు తోడ్పడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో, ప్రభుత్వ రంగ సంస్థలలోని ఉద్యోగాల్లో అవకాశాలు పొందిన ఈతరగతుల వారు,చట్ట సభల్లో రిజర్వేషన్ల వలన పదవులు పొందినవారు సామాజి కంగా పైస్థాయికి ఎదగడానికి కొంత అవకాశాన్ని రిజర్వేషన్లు కల్పిం చాయి.
  2. అయితే, సామాజికంగా ప్రతికూలతను ఎదుర్కొంటున్నవారిలో అవసరమైన వారందరికీ రిజర్వేషన్‌ ఫలాలు అందలేదు. వారిలో అతిచిన్న భాగం మాత్రం ప్రయో జనం పొంది ఒకచిన్న మధ్యతరగతిగా రూపొం దారు. ఒకే గ్రూపులో పలు కులా లవారు ఉన్నప్పుడు ఆ కులాల్లో ఎక్కువ జనాభాగా ఉన్న కులాలవారు, సాపేక్షంగా తక్కినవారికన్నా ముందున్న కులాలవారు రిజర్వేషన్‌ కల్పించిన అవకాశాలను ఎక్కువగా దొరకబుచ్చుకోగలిగారు. వాస్త వానికి కాస్త మెరుగైన పరిస్థితిలో ఉన్న వారికే రిజర్వేషన్‌ వలన ఎక్కువగా ప్రయోజనాలు కలిగాయి.ఆ తర్వాత కూడా వారికే ఆ ప్రయోజనాలు కలుగుతూ వస్తున్నాయి. తద్వారా ఎవరికి ఎక్కువ అవసరం ఉందో వారు రిజర్వేషన్‌ ఫలా లనుపొందలేకపోతున్నారు. సామాజికంగా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నవారిలో అత్యది óక భాగం ప్రజానీకాన్ని ఇప్పటికీ, పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం,నిరుద్యోగం, అణ చి వేత, వివక్షత వెన్నాడుతూనే వున్నాయి. కొద్ది మంది ప్రజలు సామాజికంగా పైకి ఎదగడానికి మాత్రమే రిజర్వేషన్లు తోడ్ప డ్డాయి తప్ప అస్థిత్వ వాదులలో పలువురు చెప్పు కుంటున్నట్టు సాంఘిక సమానత్వాన్ని సాధించడానికి తోడ్పడలేదు.
  3. నయా ఉదారవాద ఆర్థిక విధానాల అమ లు ప్రారంభమయ్యాక రిజర్వేషన్ల పరిమిత ప్రయోజనం కూడా కుదించుకుపోతూ వుంది. ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగాన్ని కూల దొయ్యడం, ఉద్యోగాల కాంట్రాక్టీ కరణ,యాంత్రీకరణ విధానాల వలన, వాటి పర్యవసానాలైన ఉపాధి రహిత అభివృద్ధివలన,విద్య వ్యాపారీకరణ వలన విద్యావకాశాలు, ఉపాధి అవకాశాలు ప్రభుత్వ రంగంలో తగ్గిపోతున్నాయి. ఆ విధంగా రిజర్వేషన్ల అమలు వర్తించే రంగాల పరిధి రోజు రోజుకూ ముడుచుకు పోతోంది.
  4. ఇలా అవకాశాలు కుదించుకు పోతున్న దానికి ప్రత్యామ్నాయంగా సామాజిక ఉ ద్యమాలు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నాయి. సిపిఐ(ఎం) కూడా ఈ డిమాండ్‌ను గట్టిగా బలపరుస్తోంది. కాని ప్రైవేటు రంగం చాలా తీవ్రంగా ఈ డిమాండ్‌ ను వ్యతిరేకి స్తోంది.ఒకవేళ ప్రైవేటు రంగంలో రిజర్వే షన్లను అమలు చేయాలన్న డిమాండ్‌ను ఆమోదించినా దానివలన ప్రయోజనాలు పరిమితంగానే ఉంటాయి తప్ప మౌలికమైన మార్పు ఏమీ ఉండబోదు. ఎందుకంటే సంఘటిత ప్రైవేటు రంగంలో ఉద్యోగాల లభ్యత చాలా స్వల్పం. అణచివేతకు గురౌతున్న సామాజిక తరగతులనుండి ఉద్యోగాలు కోరుతున్నవారి సంఖ్య దానితో పోల్చితే చాలా ఎక్కువ.
  5. రిజర్వేషన్‌ రొట్టె పరిమాణం తగ్గిపో తున్నకొద్దీ అలాతగ్గిపోతున్నదానిలో తాము ఎక్కువ వాటా దక్కించుకోవాలన్న పోటీ బలహీన వర్గాల లోని వివిధ తరగతుల్లో పెరుగుతోంది. దాని ఫలితంగా ఇప్పటికే తగ్గిపోతున్న అవకాశాలను పొందే ప్రయ త్నంలో వివిధ తరగతుల మధ్య, వివిధ కులాల మధ్య వైరుధ్యాలు, ఘర్షణలు పెరు గుతున్నాయి. కొత్త తరగతులు, సమూహాలు తమకు సైతం రిజర్వేషన్లు వర్తింప జేయా లన్న డిమాండ్‌ను ముందుకు తెస్తున్నాయి. దానితోబాటు ఇప్పుడున్న రిజర్వేషన్ల పరిధి లోనే వర్గీకరణ చేపట్టి అవకాశాల పంపి ణీలో మరింత సమన్యాయం చేయాలన్న డిమాండ్‌ కూడా ముందుకొచ్చింది.
  6. ఈ పరిణామాల పర్యవసానంగా రిజర్వే షన్లకు సంబంధించిన వివిధ డిమాండ్లను చేపట్టి అనేక ఆందోళనలు, ఉద్యమాలు రానురా నూ ఎక్కువౌతున్నాయి. కులం, సామాజిక అస్థిత్వం ప్రధాన అంశాలుగా ఈ ఆందోళనలలో సమీకరణలు జరుగుతు న్నాయి.(సీపీఎం వెబ్‌సైట్‌ సౌజన్యంతో..) (వ్యాసకర్త సిపిఐ(ఎం)పొలిట్‌బ్యూరో సభ్యులు)-(బి.వి.రాఘవులు)
1 8 9 10