అంతా ఆదివాసీలదే

అక్కడ ఆదివాసీలే ప్రభువులు. ప్రభుత్వ నిర్ణయాల్ని బేఖాతర్‌ చేసే అధికారం కూడా వారికి ఉన్నది. ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్‌ని, వార్డు సభ్యులను పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కూడా వారికి సంక్రమించింది. షెడ్యూలు ప్రాంతాలకు పంచాయతీ రాజ్‌ విస్తరణ (పీసా) చట్టం ప్రకారం స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం వారికి ఉన్నా ఏజెన్సీ గ్రామాలు మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా 500 జనాభా కలిగిన ఆదివాసీ గూడేలను గ్రామపంచాయతీలుగా ప్రకటించిన తర్వాత మొదటి సారి ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో గ్రామ సభల అధికారాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.
రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్‌లో ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో పీసా చట్టం అమల్లో ఉన్నది. రాష్ట్రంలోని పూర్వపు ఆదిలాబాద్‌, ఖమ్మం,వరంగల్‌,మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో గతంలో ఉన్న631 గ్రామ పంచాయితీలతో పాటూ ఇటీవల ఏర్పాటు చేసిన మరో 400 గ్రామ పంచాయితీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆదివాసీ తెగల ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాల్లో భాగంగా ఉన్న స్వయం నిర్ణయాధి కారం, సమస్యలను తగవులను పరిష్కరించుకునే ఆచారాన్ని ద ృష్టిలో పెట్టుకుని 1996లో కేంద్ర ప్రభుత్వం ‘పీసా’చట్టం అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం కీలక నిర్ణయాలన్నీ గ్రామసభల్లోనే జరగాలి. గ్రామ పెద్దల సమక్షంలో జరిగే గ్రామసభల నిర్వహణకు సంబం ధించిన మార్గదర్శక సూత్రాలను ఉమ్మడి రాష్ట్రంలో 2011లో జీఓ నంబర్‌ 66 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవే నిబంధనలు కొనసాగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలను ఆమోదించటం లేదా తిరస్కరిం చే అధికారం ఏజెన్సీ గ్రామ సభలకు ఉన్నది.
గ్రామసభల అధికారాలు…
ప్రజావసరాల కోసం కానీ ప్రయివేటు సంస్థల కోసం కానీ భూసేకరణ జరపాలంటే ఏజెన్సీ ప్రాంతంలో గ్రామసభల అనుమతి తీసుకోవాల్సి ఉన్నది. ‘పీసా’ చట్టం ప్రకారం ఇసుక, గ్రావెల్‌ తదితర చిన్న తరహా ఖనిజ సంసదకు ఆదివాసీలే యజమానులు. ఖనిజ సంపదను ప్రభుత్వ రంగ సంస్థలకి కానీ ప్రయివేటు వ్యక్తులకు కానీ అప్పగించాలంటే గ్రామసభల ఆమోదం అవసరం. ఏజెన్సీ ప్రాంతంలో గ్రామసభలు ఆమోదిస్తేనే మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇవ్వాల్సి ఉన్నది. ఈ లైసెన్సులు కూడా ఆదివాసీల పేరుతోనే జారీ చేయాల్సి ఉన్నది. చిన్న తరహా అటవీ ఉత్పత్తుల సేకరణ, సంతల నిర్వహణ, చిన్న తరహా నీటి వనరుల నిర్వహణ గ్రామసభల ఆమోదంతోనే జరగాలి. వ్యవసాయ ప్రణాళికలు కూడా గ్రామసభ ఆమోదం తర్వాతే అమలు చేయాలి. పంచాయితీ పరిధిలో ఉండే పాఠశాలలు, వైద్య శాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షించే బాధ్యత కూడా గ్రామ సభలకే కట్టబెట్టారు. తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లో పీసా చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే నీరు కార్చాయనే విమర్శలు పెల్లుబుకుతున్నాయి. ఇసుక తవ్వకాలు గ్రామపంచాయితీలకే అప్పగించాల్సి ఉండగా చట్టవిర్ధుంగా రాష్ట్ర ఖనిజా భివృద్ధి సంస్థ దక్కించుకుని ప్రయివేటు కాంట్రా క్టర్లకు అప్పగించటంతో గ్రామసంచాయితీలకు ఆదాయం రాకుండా పోయింది. పర్యావరణ విధ్వంసం జరుగుతున్నా నష్ట నివారణ చర్యల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయటం లేదు. ప్రస్తుతం జరుగు తున్న గ్రామసంచాయితీ ఎన్నికల తర్వాత పంచాయితీరాజ్‌ వ్యవస్థలో కీలక మార్పులు తీసుకు వస్తామని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఆదివాసీల స్వయం పాలన కోసం జరిగే గ్రామసభల విషయంలో కూడా ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలని ఆదివాసీలు కోరుతున్నారు.
సర్పంచ్‌ లేక పోయినా గ్రామసభ…
చట్ట ప్రకారం గ్రామసభను సమావేశపరచిన తర్వాత దీనికి అధ్యక్షత వహించే అధికారం సర్పంచ్‌కి ఉన్నప్పటికీ సర్పంచ్‌ రాక పోయినా గ్రామసభకు అధ్యక్షత వహించటానికి సర్పంచ్‌ అంగీకరించక పోయినా అదివాసీ తెగకు చెందిన పెద్దను గ్రామసభ అధ్యక్షుడిగా ఎన్నుకునే అధికారం ఆదివాసీలకు ఉన్నది. ఒకగ్రామపంచాయితీ పరిధిలో ఒకటి కన్నా ఎక్కువ ఆవాసాలు ఉంటే ప్రతి ఆవాసంలో ఒక గ్రామసభ నిర్వహించుకునే అధికారం ఉన్నది. అక్కడి నివసించే ఆదివాసీ తెగ లేదా గుంపు గ్రామసభ ద్వారా నిర్ణయాలను ప్రకటించే అధికారం సంక్రమించింది. గ్రామసభ తీర్మానాలకు పూర్తి స్థాయి చట్టబద్ధత ఉన్నది. గ్రామసభ వ్యవహారాల్లో తాము కూడా జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు కూడా పలుమార్లు స్పష్టం చేసింది.
వేదాంతను తిప్పికొట్టిన గ్రామసభలు : ఒడిషాలోని బాక్సైట్‌ గనులను వేదాంతకు అప్పగించటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలను గ్రామసభల తీర్మానాల ద్వారా అక్కడి ఆదివాసీలు తిప్పికొట్టారు. గ్రామసభల నిర్వహణలో అధికార యంత్రాంగం మితిమీరిన జోక్యాన్ని కూడా ఈ సందర్భంగా సుప్రీం కోర్టు తప్పుపట్టింది. అధికారులకు సంబంధం లేకుండా జిల్లా న్యాయమూర్తి పర్యవేక్షణలో నిర్వహించిన 13 గ్రామపంచాయితీలకు సంబంధించిన గ్రామసభలు బాక్సైట్‌ తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి.
నూతన పంచాయతీలకు గ్రామాభివృద్ధే ధ్యేయం కావాలి : పదవి చిన్నదే కావచ్చు, ఐనా తను తలుచుకుంటే గ్రామాన్ని అన్ని విషయాల్లో అగ్రగామిగా ఉంచగలడు. ఆమేరకు ఆత్మవిశ్వాసం,దీక్ష, పట్టుదల పుష్కలంగా సర్పంచ్‌గా ఎన్నుకోబడే వ్యక్తికి ఉండాలి. కేవలం తమ ప్రాబల్యం చాటుకోవాలనే దుగ్ధ కాకుండా ఊరి బాగోగు లపై శ్రద్ధ కనబరచే దిశగా ఆలోచించి ఉన్నంతలో రిజర్వు స్థానా ల్లో సైతం విద్యావంతులు, ప్రగతి కాముకులు ఎన్ని కవడానికి రాజకీ య పార్టీలు చొరవచూపాలి. గ్రామానికి ఆగ్రామం సొంతంగా అభివృద్ధి చెందడానికి కావలసిన ప్రణాళికా రచన జరగాలి. గ్రామాబి óవృద్ధి ప్రణాళిక రూపొందించడంలో ‘గ్రామసభ’దే కీలకపాత్ర. గ్రామసభ నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం తోపాటు వార్డు సభ్యులు, ఉప సర్పంచ్‌, సర్పంచ్‌లు అతి ముఖ్యమైన వాళ్లు. సాధారణంగా ఏ గ్రామానికైనా దాని సుస్థిరత కారకాల్లో మూడు అంగాలు ప్రధాన మైనవి. అవి1.విద్య 2.ఆరోగ్యం 3.మౌలిక సదుపాయాలు. అక్కడి ప్రభుత్వ పాఠశాలను పకడ్బందీగా నడుపుకోవడం ద్వారా బాలబాలిక లకు గుణాత్మక విద్య అందించాల్సిన బాధ్యత పంచాయతీలదే. ప్రజారోగ్యం పారిశుధ్యం పైనేఅధారపడి ఉంది. పారిశుధ్య వ్యవస్థను పటిష్టంగా అమలు పరచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని లేదా ఆరోగ్య సిబ్బందిని సమర్ధవంతంగా ఉపయోగించుకోవాల్సిన బాధ్యత కూడా పంచాయతీదే. మురుగుకాల్వల నిర్వహణ, సామాజిక మరుగు దొడ్ల నిర్మాణం, ఇంటింటి మరుగు దొడ్ల నిర్మాణం, దోభీ ఘాట్ల నిర్మాణం, గృహవ్యర్థాల సేకరణ వంటి చర్యల ద్వారా జాతీయ స్థాయిలో నిర్మల్‌, స్వచ్ఛ భారత్‌ పురస్కారాలను అందుకోవాలి. వీధి దీపాల ఏర్పాటు, గ్రంథాలయం నిర్వహణ, తాగు నీటి సరఫరా, రోడ్ల మరమ్మతు, కమ్యూనిటీ భవనాల నిర్మాణం-నిర్వహణ, మెరుగైన సమాచార వ్యవస్థ, తపాలా కార్యాలయం, క్రీడా సాంసృతిక శాలలు, బ్యాంకు, మార్కెట్‌ తదితర ప్రజావసరాల్లో మండలం, జిల్లా, రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని సమన్వయాన్ని ఎప్పటికిప్పుడు వేగిరపరచుకొని అభివృద్ధిలో నమూనాగా గ్రామాన్ని తీర్చిదిద్దాలి ఇందుకు సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లకు రాజకీయ అక్షరాస్యత కంటే అధికంగా స్థానిక సంస్థల విధులు-నిధులు, నిర్వహణ పట్ల అవగాహన సమగ్రంగా ఉండాలి. కొంతకాలంగా గ్రామాలు రాజకీయ కక్షలు కార్పణ్యాలకు నిలయా లుగా మారిపోయాయి. ఊళ్లు ప్రాత:కాలం నుంచే మద్యంమత్తుతో తూలుతున్నాయి. మద్యం దుకాణాల కారణంగా ప్రజా రోగ్యం పూర్తిగా క్షీణించింది. భర్తల అకాల మర ణంతో వితంతువుల సంఖ్య పెరిగి ఇళ్లలో విషాదం అలుముకుంటున్నది. మద్య రహిత గ్రామంగా తమ గ్రామాన్ని నడుపుకోవడంలో ఇతర గ్రామాలకు ఆదర్శంగా పంచా యతీ పనితీరు, నిర్ణయాలు ఉండాలి. వలసలకు నిలయాలుగా కాకుం డా ఉత్పత్తి క్షేత్రాలుగా ఊర్లు విలసిల్లాలంటే స్థానికంగా కుటీర పరిశ్ర మలు, ఉపాధి పనులు, వృత్తి నైపుణ్యాల శిక్షణా సంస్థలు నెలకొనేటట్టు గ్రామపంచాయతీ ఒక మిషన్‌గా పనిచేయాలి. యువజన సంఘాలు, మహిళా పొదుపు గ్రూపులు, ఉద్యోగుల సేవాకేంద్రం, హితైషుల వితరణ కార్యక్రమాలను ప్రోత్సాహిస్తూ కలుపుకొని వెళ్తేనే సర్పంచ్‌ రాణిస్తారు. అధికారం చెలాయించడానికో దర్ప ప్రదర్శన కోసమో పదవి కాదని సర్పంచ్‌ గమనించాలి. గ్రామంలో కుల వ్యవస్థ పునా దులు బలిష్టంగా ఉంటాయి. శాంతి సామరస్య వైఖరులను అవలభిస్తూ సమైక్యతను మరింత అభివృద్ధి పరచాలి. పండుగలు తదితర సంద ర్భాల నిర్వహణలో గ్రామంలోని పెద్దల సలహాలు సూచనలు పాటిస్తూ ఈవెంట్‌ మేనేజ్మెంట్‌ స్ట్రాటజీతో ముందుకెళ్లాలి. నిధులు కేంద్రం నేరుగా ఇచ్చినా, రాష్ట్రం ఇచ్చినా, స్థానిక వనరుల ఆధారంగా సమ కూరినా వాటి ఖర్చు, వినియోగంలో పారదర్శకత నిజాయితీ అడుగడు గునా పాటించాలి. ఎంహెచ్‌ఆర్‌డీ వంటి సంస్థలు నిర్వహించే శిక్షణా కార్యక్రమాలకు ఉత్సాహంతో హాజరవ్వాలి. స్ఫూర్తి వంతంగా సర్పంచ్‌ పదవీ నిర్వహణకు అవసరమైన సజనాత్మకతను విభిన్న పద్ధతుల్లో అందిపుచ్చు కోవాలి. పంచాయతీరాజ్‌ చట్టానికి లోబడి సంవత్స రానికి మొక్కుబడిగా కాకుండా, విధిగా విశాల దక్పథంతో ప్రజలందరి సమక్షంలో గ్రామసభ జరిపి తీర్మానాలను తీసుకోవాలి. అంతే గుణవం తంగా తీర్మానాలను అమలు జరపాలి కూడా. అభివృద్ధితో పాటు, ప్రజలకు ప్రశ్నించే శక్తినిచ్చే పంచాయతీయే ఉన్నతమైంది. – కొండూరి రమేశ్‌బాబు