తెలంగాణ గట్టుమీద పోలవరం

ప్రముఖ పరిశోధక రచయిత, విశ్లేషకులు, డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు థింసా పత్రిక కోసం ప్రత్యేకంగా రాస్తున్న ‘గిరిజన కథావిశ్లేషణ’ ధారావాహికంగా అందిస్తున్న ఈ నెల సంచికలో కథా విశ్లేషణ తెలుగు సాహితీలోకానికి సుపరిచితులైన ‘కోమాకుల సీతారాములు’’ కథా రచన ‘ తెలంగాణ గట్టు మీద పోలవరం ’ కథా చదవండి..! – సంపాదకులు
సీతారాములు కథల్లో పోరాట చైతన్యం కనిపిస్తుంది… బహుముఖీనమైన కళాసేవతో సీతారాములు రాసిన అనేక కథల్లో ఇది ఒకటి.‘‘బహుళార్థక పోలవరం ప్రాజెక్టు’’ నిర్మాణంలో మార్పులు తేవాలనే లక్ష్యంతో ‘‘ముంపు మండ లాలపోరాటం’’ మొదలైన తరుణంలో సామాజిక స్పృహ నిలువెల్ల పులుముకున్న ఉద్యమ రచయిత సీతా రాములు. ఆ స్వానుభవానికి అక్షర రూపమే ఈ కథ. ఇది ఏదో పోరాట కథనం అనుకుంటే పొరపాటే.. చక్కటి ఒక భిన్నమైన కథ రచనా కాలం 2015. .
కేవలం ఉద్యోగ వృత్తితో కాలం గడపకుండా, సంపూర్ణ సామాజిక స్పృహతో తన చేరువలోని అడవిబిడ్డల వికాసమే లక్ష్యంగా కృషి చేసిన సామాజిక కార్యకర్త రచయిత ‘కోమాకుల సీతారాములు’ మానుకోట జన్మస్థలం గల వీరు సుమారు పుష్కర కాలం పాటు భద్రాచలం మన్యం ప్రాంతంలో విద్యార్థి ఆవాస కేంద్రాల పర్యవేక్షకుడిగా ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ,.. ఇక్కడి గిరిజనులతో మమేకమై ఎందరో గిరిజన విద్యార్థులకు దారి దీపం అయ్యారు. గాయకుడిగా,రచయితగా,నటుడిగా,శిక్షణా ధ్యక్షుడుగా,బహుముఖీనమైన కళాసేవ చేసిన సీతారాములు రాసిన అనేక కథల్లో ఒకటి ‘‘తెలంగాణ గట్టుమీద పోలవరం’’.దీని రచనా కాలం 2015 సంవత్సరం.ఊహించిన విధంగా అందివచ్చిన తెలంగాణ రాష్ట్రం యావత్తు, ఆనందంతో సంబరాలు చేసుకుంటున్న వేళ.. భౌగోళికంగా రాష్ట్రంలో అంతర్భాగమైన భద్రాచలం మన్నెసీమకు కుడిచేయి వంటి ‘పోలవరం ముంపు ప్రాంతమండలాలు’ పాలకులముందుచూపు..,వ్యూహాలతో..స్వార్థ ఒప్పందాలతో అక్కడే నివాసం ఉంటున్న గిరిజ నులను బలవంతంగా ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడంతో అక్కడి అన్ని వర్గాలప్రజల్లో ఆందో ళనతో కూడిన విషాదఛాయలు అలుము కున్నాయి. ఈ ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపవద్దని అంతేకాక అధిక నష్టదాయకమైన ‘‘బహుళార్థక పోలవరం ప్రాజెక్టు’’ నిర్మాణంలో మార్పులు తేవాలనే లక్ష్యంతో ‘‘ముంపు మండ లాలపోరాటం’’ మొదలైంది. సామాజిక స్పృహ నిలువెల్ల పులుముకున్న ఉద్యమ రచయిత సీతా రాములు ముంపుమండలాపోరులో కీలక పాత్ర పోషించారు.ఆ స్వానుభవానికి అక్షర రూపమే ఈ ‘తెలంగాణ గట్టుమీద పోలవరం’ కథని ఇది ఏదో పోరాట కథనం అనుకుంటే పొరపాటే…!! రచయితకు ఉండే సాధారణ ఆశావాదం.. అందమైన అడవిబిడ్డల జీవనవిధానం,సుందరమైన గోదావరి అడవి అందాలు,అంతర్గతంగా అభివర్ణిస్తూ…. మరో పక్క అడవిబిడ్డల జీవన విధానంతో కూడిన వారి పోరాటగాథను రచయిత హృద్యంగాచెప్పే ప్రయత్నం చేశారు. కారు మబ్బుల సాక్షిగా చిరుజల్లుల్లో తడుస్తూ ‘‘కోడేరు’’ గిరిజన గ్రామ స్తులంతా సంప్రదాయబద్ధంగా ఏటా జరుపుకొనె భూమిపండుగ కోలాహలంతో ఈ కథ మొదలవుతుంది. ‘రాములమ్మ’అనే గిరిజన యువతి ఈకథలో ప్రధాన పాత్రగా అగు పిస్తుంది. అనుచరులుగా రాజన్న,కొమ్మారెడ్డితో పాటు కథా రచయిత కూడా ఈకథలో అతిధి పాత్రగా దర్శనమిస్తాడు. ఇక కథ విషయానికి వస్తే ఎంతో ఆనందంగా కొమ్ము,డోలు,నృత్యా లతో భూమిపండగ చేసుకుంటున్న ఆగూడెం గిరిజనులకు పిడుగులాంటి వార్త చెబుతాడు రాజన్న. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంవల్ల తెలంగాణ ప్రజలంతా ఆనందోత్సవాలతో తేలి ఆడుతుండగా….ఆ రాష్ట్రంలో భాగమైన మన్య సీమ లోని గిరిజన గ్రామాలకు నిరుత్సాహంతో కూడిన,బాధ కలిగించే వార్త చెప్పడం ఈ కథ ప్రారంభంలోని ఎత్తుగడ.
కానీ ఎత్తుగడలో ఎలాంటి ఉత్కంఠత గాని, సందేహాలు గాని, లేకుండా అసలు విషయం వెంటనే వెల్లడిరచి రచయితే స్వయంగా ఒక పాత్ర ధరించి కథలో ప్రవేశించడంతో విష యం శక్తి సన్నగిల్లిన,కథనంతో కాస్త కష్టపడి కథను చివరికంటూ చదివింప చేసే ప్రయత్నం జరిగింది. కథలోని తొలి పాత్ర అయిన రాము లమ్మ, డిగ్రీ వరకూ చదువుకొని ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నా ఆదివాసీ యువతి,తాను చదువుకున్న చదువు ద్వారా లభించిన విజ్ఞానం, విషయ పరిజ్ఞానం ద్వారా తనప్రాంత గిరిజ నుల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలు అయిన ఏడు మండలాల ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతంలో కలుపుతున్నట్లు వెలువడ్డ టీవీ వార్తలు గురించి రాజన్న ద్వారా విన్న రాములమ్మ, వెంటనే తనకు గతంలో తెలిసిన విజ్ఞానం సాయంతో గూడెం ప్రజలనంతా… ఒకచోటకు చేర్చి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లోని లొసుగులు గురించి చెబుతుంది.తాను చదువుకునే సమయంలో సీతారాములు సార్‌ (కథా రచయిత) చేసిన ఉపన్యాసాల సారాంశం గుర్తుచేసుకుని,గతంలో గిరిజన సమాజాల్లో సమ్మక్క సారక్క,హైమన్డార్ఫ్‌,సీతారామరాజు, గంటందొర,కొమరంభీమ్‌ వంటి వారు చేసిన పోరాటాలు,త్యాగాలు, చైతన్యపుకృషి, గురించి వివరిస్తుంది రాములమ్మ. అలా ఆమె చెప్పిన మాటల ద్వారా రానున్న కష్టకాలం తలుచు కుంటూ భవిష్యత్‌ కార్యాచరణ గుర్తు చేసు కుంటూ ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోతారు. పూర్వం దేశమంతా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటూ ఉంటే ఒక హైదరాబాద్‌ సంస్థాన ప్రాంత ప్రజలు మాత్రం నిరుత్సా హంగా ఎలా ఉండిపోయారో ,ఇప్పుడు అదే పరిస్థితి ఈపోలవరం ముంపు ప్రాంత గిరిజన గ్రామాలది. తెలంగాణ వచ్చిన సంతోషం కన్నా తెలంగాణ ప్రాంతం నుంచి గెంటివేయ బడ్డామన్న బాధ ఈప్రాంతవాసులకు ఎక్కు వైంది.తిరిగి పోలవరం వ్యతిరేక ఉద్యమం మొదలైంది.సీతారాములు సార్‌ పాత్ర మళ్ళీ ప్రారంభమైంది,ఏడు మండలాలకు చెందిన యువ కార్యకర్తలకు కార్యాచరణ చేయడం కోసం,ఏర్పాటుచేసిన శిక్షణ శిబిరంకు వెళ్ళిన సీతారాములు అనేక లెక్కలు,చారిత్రక విశేషా లతో కూడిన సుదీర్ఘ ప్రసంగం చేయడంతో కథ అంతా వ్యాసపుముసుగు వేసుకుని నడుస్తుంది. కథలో రూపం మారిన పాఠకులకు విసుగు రాకుండా చదివింప చేయడంలో రచయిత పడ్డ శ్రమ చివరికి ఫలించిందనే చెప్పాలి.ఈ పోల వరం ముంపు పోరాట ఉద్యమంకు నూతన పంథాలో, గిరిజనుల సంప్రదాయ సంస్కృతి ఆయుధాల సాక్షిగా ఉద్యమ నిర్మాణం జరిగి పోతుంది.‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాం తం’ దిగ్బంధం లక్ష్యంగా కార్యాచరణ సాగు తోంది.‘పోలవరం ఆపండి ఆదివాసులను కాపాడండి’ అనే నినాదాలతో అడవి అంత మారుమోగుతుంది, భారత ప్రభుత్వం న్యాయం చేసే వరకు పోరాటం చేయాలని అక్కడి గిరిజ నులంత తీర్మానం చేసుకున్నారు. అందుకు అన్ని ప్రాంతాల ప్రజలు,ఉద్యోగులు,సంఘాల వారు తమ మద్దతు తెలుపుతారు,‘పోలవరం దిగ్బం ధం’ చేసే రోజు ఖరారు అయ్యింది. పోలవరం ముంపు ప్రాంతపు గిరిజనులు చేసే పోరాటానికి అన్ని ప్రాంతాల నుంచి ట్రాక్టర్లు,లారీలు, లాంచీ లు,పడవలు, ఇలా రకరకాల ప్రయాణ సాధ నాల ద్వారా నిర్బంధ ప్రాంతానికి జనాలను చేరవేయడానికి, నాయకులు ఎవరికి వారు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇక్కడ వరకు కథ వాస్తవానికి దగ్గరగా భూతకాలంలో నడిచింది. చివరిలో రచయిత తన ఆశావహ దృక్పథాన్ని వ్యక్తపరుస్తూ ఒక గొప్ప ఆశయం చాటుతూ కథను ముగిస్తారు. కథ చివరి ఘట్టం అంతా అడవి బిడ్డలు చేసిన పోరాట రూపం, దానికి సహచరులు అంతా తెలిపిన సంఫీు భావం,అక్కడ వారు రహదారులను దిగ్బంధం చేసినతీరు,వంటావార్పులుతో నిరసన తెలిపిన వైనం తదితరాలు కళ్లకు కట్టినట్లు అభివర్ణిం చడంలో రచయిత స్వయంగా చేసిన ఉద్యమాల అనుభవాలు వ్యక్త పరిచారు.ఈ పోలవరం పోరులో అడవి బిడ్డలు ఉపయోగించిన వస్తు వులు,ఎండుగుబ్బ,పూరిదికట్ట,బొంగుది కర్ర , టేకుది సిర్ర,డోలు మొదలైన వాటి గురించి వివ రించడంలో రచయితకు గల పరిసరాల అవగా హన ఎంత పటిష్టంగా ఉందో అర్థం వుతుంది. ఉద్యమంలో వారు చేసిన నినాదాలు,పాడిన పాటలు,ఆడిన ఆటలు, మొదలైనవి చూస్తే ఈ అడవి బిడ్డలలోని ఆత్మస్థైర్యం,కష్టాలను ఎదు ర్కొనే ధైర్యం,ఎంతో ఆదర్శంగా చిత్రిం చడంలో రచయిత సీతారాములు కృషి నెరవేరింది అని పిస్తుంది.‘పోలవరం కడితే అందులో జల సమాధిఅయ్యి చనిపోయే దానికంటే.. ఇప్పుడే ఇక్కడే పోరాడి చనిపోతాం భావితరాలైనా ఈప్రాంతాన్ని కాపాడుకుంటారు’ అనే భావన గిరిజన యువతి రాములమ్మ నుంచి చెప్పిస్తాడు రచయిత.పోరాటాలు ఏవైనా తక్షణ ఫలితాలు అందించక పోయినా భావితరంలో రావాల్సిన మార్పులకు బీజాలుగా తప్పక మారుతాయి.. అన్న చారిత్రక ఆలోచనలు నిజమే కదా అని పిస్తుంది. ఇక కథ చివర్లో ఉద్యమకారులకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణ వాతావ రణం చూపిస్తూ ‘బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ’ అన్న సుమతీశతక కర్త బద్దెన వాక్కుకు నిజం చేస్తూ.., గిరిజనుల ఐక్యత, తెగింపు, వారికి లభించిన సంఫీుభావంతో పోలీసులు వెనకడుగు వేయ టం,రాష్ట్రపతి ప్రధాని,జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించడానికి ముందుకు రావడం జరుగు తుంది. వారు కోరుకున్నట్టుగా 7మండలాలు తెలంగాణ భూభాగంలోని కొనసాగించడానికి ఒప్పుకోవడం తో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి కూడా పునరాలోచన చేస్తా మని హామీ ఇవ్వడంతో,మనిషిని మాటను, సం పూర్ణంగా నమ్మే గిరిజనులు శాంతించివారు చేస్తున్న పోరాటం ఆపి ఎవరి ఇళ్లకు వారువెళ్లి రాబోయే బంగారు తెలంగాణ సమాజాన్ని తలచుకుంటూ నిద్రలోకి జారుకుంటారు.అంటూ రచయిత తన ఆశాభావాన్ని రంగరించి తనదైన క్రాంతదర్శనంతో కథను సుఖాంతం చేయ డంతో పాఠకులు సంతృప్తి చెందుతారు.ఈకథ లో గిరిజనజీవితాల్లో అంతర్భాగంగా అగుపించే ‘పోరుబాట’ను వివరిస్తూనే వారివారి సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేస్తూ, ఒక వార్తా కథనాన్ని అందమైన కథగా తీర్చిదిద్ది తెలుగు కథా సాహిత్యానికి ఒక ‘గిరిజన కథ’అందించిన సీతారాములు కృషి లెక్కించదగిన అభినందిం చాల్సినది. (వచ్చే మాసం ఎస్‌.బాలసుధాకర్‌ మౌళి కథా విశ్లేషణ ‘‘థింసా దారిలో’’…. మీకోసం)

బంజారా భావిపౌరుల ముచ్చ‌ట్లు

ఏ సమాజమైనా ఉన్నత స్థితికి చేరాలంటే అది ఆసమాజపు విద్యా వ్యవస్థ పైన, దాని ప్రధాన నిర్వాహకులు ఉపాధ్యాయుల పైన వారినిబద్దత పైన ఆధారపడి ఉంటుంది. ఉద్యోగాలు అన్నిటికీ కేంద్రబిందువైన ‘‘ఉపాధ్యాయకత్వం’’ పైకి కనిపించేటంత సామాన్య మైనది కాదు.వివిధ విభాగాలుగా విభజిం చబడి ఉన్న ఉపాధ్యాయ ఉద్యో గాలు ఆయా వ్యక్తులు చేసే నిబద్ధతగల కృషి ద్వారానే సంబంధిత ఉద్యోగాలకు, వ్యక్తు లకు,భవిష్యత్తు గుర్తింపు,సంతృప్తి, సమ పాళ్ళలో అంది వస్తాయి. కొద్ది కాలపు పంటల రక్షణ దిగుబడి కోసం రైతు మిత్రులు ఎంత ప్రయాస పడతారో మనకు తెలిసిందే..!
అలాగే ‘‘భావి సమాజపు నిర్మాణ పం టలైన’’ విద్యార్థులు అనబడే ఈ పసి పం టల గురించి,ఉపాధ్యాయ కృషి వలురు ఎలాంటి కృషి చేస్తున్నారో..! ఎంతగా కృషి చేయాలో చెప్పకనే చెప్పిన పుస్తకం ‘‘మా పిల్లల ముచ్చట్లు’’ టీచర్‌ అనుభవాలు….అనే అనుబంధ శీర్షికతో వెలువడిన ఈ విలువైన పుస్తకం వెలువరించింది ప్రముఖ కథా రచయిత్రి ‘‘సమ్మెట ఉమాదేవి’’.
ఇలాంటి అనుభవాలు అనుభూతులు ప్రతి ఉపాధ్యాయునికి ఉపాధ్యాయినికి ఉంటాయి ఇందులో విశేషం ఏముంది? అనుకోవచ్చు,కానీ ఇక్కడ ఆ అనుభవా లను పంచుకుంది ఓ..ఉపాధ్యాయిని,చక్కని సృజనాత్మక రచయిత్రి,దానితో ‘పసిడికిపన్నీరు పూసిన’చందమై ఈ సాధారణ అనుభవాలు,భావితరానికి బాగా పనికివచ్చే ఆదర్శ అక్షరాలై,అవి పుస్తకంగా అలంకరించ బడటానికి అన్ని అర్హతలు సాధించాయి. ఈ పుస్తక రచయిత్రి వృత్తిరీత్యా ఆంగ్ల అధ్యాప కురాలు. కానీ అమ్మభాష తెలుగు మీద ఇష్టం..పట్టు అధికం…అందున ఆమె అనుభవాలను, అనుభూతులను, మేళ వించి మేలైన కథలు రాయడంలోనేర్పరి, అలా కలగలిసిన అనుభవాల సృజనా త్మకతల కలబోతగా వెలువడిరదే… ఈ ‘మా పిల్లలముచ్చట్లు’.
ఇది సాధారణంగా కనిపించే అసాధారణ పుస్తకం,ముఖ్యంగా రచయిత్రి ఉమాదేవి శిష్య గణానికి భవిష్యత్తులో ఇదో ‘అపూ ర్వ కానుక’కానుంది,ఆయా విద్యా ర్థులం తా మరో పాతికేళ్ళకు మంచి మంచి స్థితుల్లో స్థిరపడి అబ్బురపరిచే తమతమ బాల్యం తాలూకు జ్ఞాపకాలను గుర్తు చేసుకుని పరవశించడానికి ఈ పుస్తకం సచిత్రంగా చక్కగా సహకరిస్తుంది.ఇక ఈ పుస్తకంలోని విషయాలు ఇలా అక్షరీక రించడంలోని అవసరం..నేపథ్యం ఏమిటో తెలిస్తేనే పుస్తకం పట్టుదలగా పట్టుబట్టి చదవగలం. రచయిత్రి ‘సమ్మెట ఉమాదేవి’ సంపూర్ణ సామాజిక స్పృహ గల వ్యక్తే కాదు. పరిపూర్ణ పరోపకార గుణం గల స్త్రీ మూర్తి.
తనకు జీవనభృతి,సామాజిక గౌరవం, బ్రతుకుభద్రత,కలిగించిన తన ఉద్యోగం పట్ల అమితమైన ఇష్టం,గౌరవం కలిగిన వ్యక్తి,కనుక ఈనిస్వార్థ కార్యానికి కంక ణం కట్టుకుంది. తమ ఆరోగ్యం,ఇంటి సమస్యలను బూచిగా చూపి ఉద్యోగ జీవి తాలను మొక్కుబడిగా దొర్లించుకుపోతు న్న నేటితరం ఉద్యోగగణం.రచయిత్రి కృషిని ఆదర్శనీయంగా గమనించి ఆచర ణలో పెట్టాల్సి ఉంది. అందరూ పడే ఇబ్బందులు కన్నా కాస్త అధికం గానే ఆరోగ్య సంసారిక ఇబ్బందులున్నా…తన సమస్యల కన్నా తనవిద్యార్థుల సమస్యలు ముఖ్యం. తనకు ఆగుణం తల్లిదండ్రుల నుంచి అలవడిరది,.ఇక తను‘నిత్య బాట సారి’గా ఉంటూ మారుమూల లంబాడా తండాల్లో మాతృభాష తెలుగుకాని తండా పిల్లల విద్యావికాసం కోసం నిత్యం తపించి పనిచేసిన నిజమైన అధ్యా పకురాలు ఆమె. విద్యార్థులకు కేవలం పుస్తకాల్లో విషయాలు లెక్క ప్రకారం చెప్పేసి,పరీక్షల్లో గట్టెక్కించడమే నేటి ఆధునిక ఉపాధ్యాయవృత్తి దారులకు పని గాఉన్న కాలంలో,విద్యార్థుల సొంత జీవి తాల్లోకి తొంగి చూసి తనకు చేతనై నంత లో సాయపడటం తనకు మించిన భార మైనప్పుడు,అర్హులైన దాతలకు విషయం వివరించి వారి దాతృత్వంను నిజా యితీ గా నిజమైన లబ్ధిదారులకు చేరవేయడం, ఆమె ఉద్యోగంలో ఒకభాగంగా భావిం చారు. రచయిత్రి ఉద్యోగ జీవిత నేపథ్యం అలాంటిది కనుకనే అంతటి అపూర్వ మైన రచన తెలుగు సాహిత్యానికి అంది వచ్చింది.ప్రక్రియ తదితర ప్రామాణిక తలను పక్కనపెడితే ఇదో‘చిత్రాక్షరి’. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద జీవిత నేపథ్యంతో బ్రతుకు బండ్లను నెట్టు కొస్తున్న భావిపౌరులు ప్రతిచోటఉన్నారు.. ఉంటారు. కానీ వారిని చూసి సాను భూతిచూపడటం..దురదృష్టాలను తిట్టు కుంటూ..కాలంవెల్ల బుచ్చకుండా,వాటి పరిష్కారం కోసం ఎమి చేయాలో ఈపుస్త కం మార్గదర్శనం చేస్తుంది. ఇక ఈ అను భవాల పూరేకులను ఒక్కొక్కటిగా విప్పా రిస్తే ప్రతి రెమ్మ ఓ ఆదర్శనీయ అపురూ పమైన అనుభూతే..! అమాయకత్వంకు తోడు పేదరికం కలగలిసిన ఈబంజారా భావి పౌరులను ఉమాటీచర్‌ ఎలాతీర్చిది ద్దిందో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ‘జేగంట’ మొదలు‘ఉపసంహారం’వరకు సాగిన ఈచిరు వ్యాసాల సమ్మేళనంలో ప్రతివ్యాసం ఓప్రత్యేకతను కలిగి ఉన్నది. ముఖ్యంగా లంబాడా పిల్లలు బడికి రావడంలో ఎదురయ్యే ఇబ్బందులు వచ్చాక బడిలో పాఠాలు నేర్చుకునే వేళ పడే పాట్లు రచయిత్రి సున్నితంగా ఆలో చింపజేసేట్టు చెబుతారు.‘తండాల చరిత’ అనే ఒకఅనుభవంలో పట్టణాలకు దూ రంగా ఉండే లంబాడా లైన తండా వాసులు రవాణా సౌకర్యం లేక నేటికీ ప్రయాణాలు వేళ ఎదుర్కొంటున్న ఇబ్బందులు చెబుతూనే ‘ముత్యాలం పాడు’లో తను పనిచేసే సమయంలో అక్కడి తన విద్యార్ధినిలను తాను ఉండే కొత్తగూడెం పట్టణంకు ఒకసెలవురోజు తీసుకువచ్చి పట్టణ వాతావరణంలో పిల్లలకు ప్రత్యేకంగా పరిచయం చేసిన సమయంలో ఆరాత్రి కూడా ఆధునిక సౌకర్యాలను గడపాలన్న తాపత్రయంతో పిల్లలు చెప్పిన ‘రాత్రి ప్రయాణఅసౌకర్య’ వివరాలు తెలుసుకుని ఒకపక్క బాధ అని పించిన,పిల్లలు పథకం పారినందుకు పరవశిస్తుంది ఈపంతులమ్మ. ఇలా తాను విద్యాబోధన వేళ ఎదుర్కొన్న ప్రతి అను భూతిలో ఒకసామాజిక సమస్యను, అంశాన్ని అధ్యయనం చేసుకుంటూ సాగటం,రచయిత్రిలోని సృజనాత్మక ప్రతిభకు తార్కాణం. ఇక ఆ గిరిజన తం డాలలోని బతుకమ్మ ఆటో డి తీజ్‌ పండుగ వంటి వారి సాంప్రదాయ పండు గలు విశేషాలు వివరిస్తూ అందులో విద్యా ర్థులకు ఆధునికతను జోడిరచి భాగస్వా ములను చేయడం విద్యార్థులకు మరువ లేని మధురానుభూతులే…!! గిరిజన జనావాసాలు యుక్తవయసు బాలికలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వాటిని నివారించే పరిష్కార మార్గాల గురించి తనదైన బాణిలో చక్కటి సూచ నలు చేస్తుంది ఉమా మేడం‘ఫంక్షన్‌ సెలవులు’సంఘటన ద్వారా,బడి ప్రాణ లో చేసే సీమంతాలు,యుక్త వయసు లోని బాలబాలికలు తెలుసుకోవలసిన వ్యక్తిగత శుభ్రత,ఆరోగ్య జాగ్రత్తల గురిం చి,కూడా నిర్వహించిన కార్యక్రమాలు తాలూకు అనుభవాలు ఇందులో చెబు తారు.ఆడపిల్లలు మరుగుదొడ్లుతో పడుతున్న పాట్లు, ఇలా ఎన్నో విషయాలు ఆనందపు పోతపోసిన అగచాట్ల తాలూకు హృదయవిదారక, ఇబ్బందులను ఆలోచించే విధంగా ఆవిష్కరించారు రచయిత్రి. ఇంతసమానత సమాజంలో చక్కర్లు కొడుతున్న… ఇంకా తండాల్లో కనిపిస్తున్న కుల వివక్షత గురించి‘ఒక కంచం కథ’ ద్వారా చూపిస్తారు.అలాగే తండాల్లో నేటికీ నెలకొని ఉన్నారు నిండు పేదరికానికి తార్కాణం ’కంచం గ్లాసు’ అనే సంఘటన చెబుతుంది. మనిషి జీవితం అన్న,మనుషులు నివసించే సమాజమైనా,భావి పౌరులను తయారు చేసే బడులైనా,ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని ఎదురయ్యే ఇబ్బందుల్లోనే సౌకర్యాలు సృష్టించుకొని ముందుకు సాగిపోవాలనే అక్షర సత్యాన్ని ఆవిష్క రిస్తుంది ఈటీచరమ్మ అనుభవాల తోట 255 పేజీల ఈబుల్లి గ్రంథం నిండా ప్రతి పేజీ గిరిజన తండా పిల్లల అగచాట్లు అగుపిస్తాయి. అందుకు అధ్యాపకులు అందించిన చేయూత, మరి కొందరు ఉపాధ్యాయులకు ఆదర్శంగా ఆలోచనలు అందిస్తూ ఈఅనుభూతుల పుస్తక రచన సాగింది. నేటి కాలపు ఆధునిక అధ్యాపకులు అంతా తప్పక చదివి ఆచరించాల్సిన విషయాలు ఈపుస్తకంలో చాలా ఉన్నాయి.విద్యార్థుల మనసుల్లో పది కాలాలపాటు గుర్తుండి పోయే కృషి చేసి ‘ఉత్తమ ఉపాధ్యా యులు’గా నిలవాలి అనుకునే ప్రతి ఉపాధ్యాయుడు…ఉపాధ్యాయని ఈపుస్త కాన్ని తప్పక సొంతం చేసుకుని చదవాలి. పుస్తకాన్ని పాఠక ప్రపంచానికి అందించడానికి ముందుకు వచ్చిన ‘శాంతా వసంతట్రస్ట్‌’ వారు, ద్వితీయ ముద్రణ చేసిన ‘కవీర్ణప్రచురణలు’ వారూ.. అభినందనీయులు.
పుస్తకం వివరాలు :- ‘మా పిల్లల ముచ్చట్లు… ఒక టీచర్‌ అనుభవాలు’, (కవీర్ణ ప్రచురణలు)
రచన :- సమ్మెట ఉమాదేవి. పేజీలు :-256
వెల :- రు 250/- పుస్తకాల కోసం సంప్రదించాల్సిన ఫోన్‌ నంబరు :- 9849406722 డా: అమ్మిన శ్రీనివాసరాజు

1 2