బాల్యం అంద‌మైన జ్ఞాప‌కం

పాపం పుణ్యం ప్రపంచ మార్గం/ కష్టం సౌఖ్యం శ్లేషార్ధాలూ/ ఏమీ ఎరుగని పూవుల్లారా/ ఆకసమున హరివిల్లు విరిస్తే/ అవి మీకే అని ఆనందించే/ కూనల్లారా’ అంటూ బాలలను ముద్దు చేస్తాడు మహాకవి శ్రీశ్రీ. కష్టసుఖాలు ఎన్నున్నా సంపూర్ణ ఆరోగ్యంతో… విజ్ఞానవంతులు కావాలి బాలలు. వారు దేశ భవితకు వనరులు…వారధులు… ఆశాదీపాలు.వారి శ్రేయస్సే దేశాభివృద్ధికి మూలం. అందుకే అంటారు…‘నేటి బాలలే రేపటి పౌరులు’ అని. బాల్యాన్ని ఆనందంగా…ఆరోగ్యవంతంగా అనుభవించడం ప్రతి చిన్నారి జన్మహక్కు. ఎవరికై నా బాల్యం ఒక అందమైన జ్ఞాపకం. ‘స్వచ్ఛ మైన పువ్వులు/విచ్చుకున్నబంధాలు/పెంచుకున్న అను బంధాలు/చిన్ననాటి జ్ఞాపకాలు’అనిఓకవి అంటాడు. మనిషి వ్యక్తిత్వం బాల్యాన్ని పెనవేసుకునే వికసి స్తుంది. మనిషిగా ఎంత ఎదిగినా…బాల్యపు జ్ఞాప కాలు…అనుభవాలు అప్పుడప్పుడు తట్టి లేపుతూనే వుంటాయి. అమ్మ లాలిపాట, గోరుముద్దలు, నాన్న మురిపెం,అమ్మమ్మ,నానమ్మ,తాతయ్యల గారా బాలు…అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, అత్తామామల ప్రేమానురాగాల మధ్య బాల్యం ఆనందంగా గడిచిపోతుంది.అందమైన జ్ఞాపకంగా మిగిలి పోతుంది. తిరిగిరాని బాల్యాన్ని తలచుకొని ‘నా సర్వస్వం నీకిచ్చేస్తా… నా బాల్యం నాకు ఇచ్చెరు’ అంటాడు సినారె. బాల్యం అంటే…రంగురంగుల అనుభూతులే కాదు… మింగుడుపడని విషాదాలూ వుంటాయి.తన ప్రమేయం లేకపోయినా అనుభ వించక తప్పని కష్టాలూ వుంటాయి.
చిట్టిచిట్టి చేతుల చిన్నారులు బాల కార్మికుల వుతున్నారు. ఆడిపాడాల్సిన వయస్సులో నాలుగు గోడల మధ్య బందీ అవుతున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో విజ్ఞానవంతులు కావాల్సిన పిల్లలకు తగిన ఆదాయాలు లేక తల్లిదండ్రులు పౌష్టికాహారం అందించలేకపోతున్నారు. గర్భస్థ శిశువు నుండే అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. తక్కువ బరువుతో పుట్టడం,అంగవైకల్యంతో పుట్టడం వంటి కారణాల వల్ల వీరు మిగతా పిల్లలతో సమానంగా వుండలేకపోతున్నారు. చిన్నారుల్లో పోషకాహార లోపాలు, వయసుకు తగిన బరువు లేకపోవటం, శిశు మరణాల రేటు వంటి అంశాలను పరిగణ నలోకి తీసుకున్న ‘ప్రపంచ ఆకలి సూచీ-2021’ లో…107 దేశాలతో పోల్చితే మన దేశం 94వ స్థానంలో వుంది. దేశంలోని ప్రజల ఆదాయం, ఆర్థిక అసమానతలు వంటి అంశాలను లెక్క తీసు కుంటే… ‘ప్రపంచ ఆహార భద్రత సూచీ-2021’లో 113 దేశాలతో కూడిన ఈజాబితాలో మనం 71వ స్థానంలో వున్నాం. చిన్నతనంలో ఎదుర్కొనే సమ స్యలు పిల్లల భవిష్యత్‌పై ప్రభావం చూపుతాయని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా విద్య,ఆరోగ్యం,గృహవసతి,పోషకా హారం,పారిశుధ్యం,నీరు అందుబాటులో లేని పిల్లల సంఖ్య 120కోట్లు ఉండగా,కోవిడ్‌ కారణంగా మరో 15కోట్ల మంది అదనంగా యునిసెఫ్‌ అధ్య యనం వెల్లడిరచింది. బాలల జనాభా అత్యధి కంగా గల భారత్‌లో కూడా దీనిప్రభావం భారీ గానే వుంటుందని ఈ నివేదిక నొక్కి చెబుతోంది.
అమ్మమ్మ, నానమ్మ ఇళ్లల్లో ఆటపాటల మధ్య సాగిపోయే బాల్యం…నేడు ఒంటరిపాలైంది. కుం చించుకుపోయిన కుటుంబ వ్యవస్థలో…ఇరుకు ఇళ్ళలో..పలకరింపులు కూడా మరిచి, ప్రపంచీ కరణ వలలో చిక్కుకుపోయిన తర్వాత అందమైన బాల్యం,బాల్య స్నేహాల బంధమెక్కడిది? ప్రభుత్వాలు రుద్దిన ఆర్థిక భారాలతో భార్యాభర్తలిద్దరూ ఉద్యో గాలు చేయాల్సిన పరిస్థితి అనివార్యంగా ఏర్ప డిరది. పిల్లల మంచిచెడ్డలు చూడడమూ కష్టతర మౌతోంది. ఏబిడ్డకైనా తల్లి తొలి గురువు. తల్లిదం డ్రులతో పాటు పెద్దలు నేర్పిన నీతి,బాధ్యతలు మంచి పౌరులుగా ఎదగడానికి ఉపయోగపడ తాయి. ఇవన్నీ జరగాలంటే ప్రభుత్వాలు కనీస మౌలిక వసతులను కల్పించాలి. ఆహ్లాదకరమైన వాతావరణం…మౌలిక వసతులు కల్పించడం మన బాధ్యత. ‘బాల బాలికలందరికీ ప్రభుత్వ పాఠ శాలల్లో ఉచితంగా చదువు నేర్పాలి. బాలబాలికలు పని చేసే పద్ధతిని నిర్మూలించాలి. అలాంటి ఒక సుహృద్భావ వాతావరణంలో పిల్లలు ఎదగాలి. ‘మీదే మీదే సమస్త విశ్వం/మీరే లోకపు భాగ్య విధాతలు/ మీ హాసంలో మెరుగులు తీరును/ వచ్చే నాళ్ల విభాప్రభాతములు’ అంటాడు శ్రీశ్రీ. చిన్నారుల మోమున హాసం మెరిసినప్పుడే నిజమైన ‘బాలల దినోత్సవం’.
బాలల హక్కులపై సమత అవగాహన సదస్సులు
బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా సమత ఆధ్వర్యంలో పలు గిరిజన గ్రామాలు,పాఠశాలల్లోని విద్యార్ధులకు అవగాహన సదస్సలు నిర్వహించింది. బాలల హక్కుల వారోత్సవాలపై యూనిసెఫ్‌ నవంబరు 14 నుంచి 20వరకు వారోత్సవాలు నిర్వహించడానికి పిలుపు నిచ్చింది. ఇందులో భాగంగా సమత సరుగుడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల,రామన్నపాలెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించింది. ఈసందర్భంగా గోడపత్రికలను స్థానిక ఉపాధ్యాయులు,సరుగుడు పంచాయితీ సర్పంచ్‌, గిరిమిత్ర సొసైటీ అధ్యక్షుడు బండి గంగ రాజు, సమత డైరెక్టర్‌ విక్కీ,కో`ఆర్డినేటర్లు కె.సతీష్‌, జి.సైమన్‌లతో కలసి సరుగుడు యూపీ స్కూల్‌ ప్రదానోపాధ్యాయుడు డి.సుబ్రహ్మణ్యే శ్వరరావు కలసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో విద్యా ర్ధినీ, విద్యార్థులు బాలల హక్కులపట్ల భారత రాజ్యాంగం బాలలకు కల్పించిన హక్కులపై వారి కున్న అనుభవాలను లఘునాటికల ద్వారా ప్రదర్శిం చారు. అనంతరం విద్యార్థులు ప్లకార్డులతో బాలల హక్కుల పరిరక్షిద్దాం..పిల్లల హక్కులను భాగస్వా మ్యం కల్పిద్దాం..నేటిబాలలే..రేపటి పౌరులు, పరిసరాల పరిశుభ్రత మన హక్కు అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమాన్ని పురస్కరించుకొని సమత డైరెక్టర్‌ విక్కీ,సత్తీష్‌ కుమార్‌ పిల్లలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు,విధులపై వివరిం చారు.
కందుకూరి సతీష్‌ కుమార్‌