కొత్త కొత్తగా ఎన్నికల్లో సరికొత్త అంశాలు

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై ఉండే బ్యాలెట్‌ పత్రాల్లో అభ్యర్థుల పేర్లు, ఇంటిపేర్లు, గుర్తులు మాత్రమే ఉండేవి. అవిఒకే విధంగా ఉండటంతో క్రాస్‌ఓటింగ్‌ పెరిగి విజయావకాశాలు తారుమారవుతాయని పలుపార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈనేపథ్యంలో ఎన్నికలసంఘం ఈసారి బ్యాలెట్‌ పత్రాల్లో అభ్యర్థుల పేర్లు, గుర్తుల పక్కనే అభ్యర్థుల ఫొటోలను కొత్తగా ముద్రించింది.
ఓటరు చీటీల్లో పూర్తి సమాచారం
అధికారులు గతంలో పంపిణీ చేసే పోలింగ్‌ చీటీల్లో కేవలం ఓటర్ల పేర్లు, తండ్రి/భర్త పేరు,ఇంటిసంఖ్య, గ్రామం తదితర వివరాలు మాత్రమే ఉండేవి. ఈసారి ఓటరు చీటీలు కొత్త రూపు సంతరించుకున్నాయి. వాటిలో గూగుల్‌ ఎర్త్‌ సహకారంతో పోలింగ్‌ కేంద్రాల చిరునామాను రూట్‌ మ్యాప్‌తో సహా ముద్రించారు. ఓటర్ల అనుమానాల నివ ృత్తికి బూత్‌స్థాయి అధికారుల సెల్‌ నంబర్లను, జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్‌, టోల్‌ఫ్రీ నంబర్లనూ ముద్రించారు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌నూ పేర్కొన్నారు.
మహిళలకు ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలు
మహిళల పోలింగ్‌ శాతం తగ్గుతుందని గుర్తించిన ఎన్నికల సంఘం ఈసారి కొత్తగా పింక్‌ పోలింగ్‌ కేంద్రాల పేరిట ప్రత్యేకంగా మహిళా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒకమహిళా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వీటిలో మహిళా ఉద్యోగులే విధులు నిర్వర్తిస్తారు.
దివ్యాంగులకు సదుపాయాలు
వరుసలో ఎక్కువ సమయం నిలబడలేక దివ్యాంగులు ఓటు హక్కుకు దూరమవుతున్నారు. దీంతో వారు ఓటు హక్కును వినియోగించడానికి వీలుగా ఎన్నికల సంఘం ప్రత్యేక సదుపాయాలను కల్పించింది. గ్రామంలో 70 మంది దివ్యాంగులు ఉంటే వారికి ప్రత్యేక వాహనాన్ని కేటాయించింది. దివ్యాంగులను ఈవాహనాల్లో పోలింగ్‌ కేంద్రం ఆవరణ వరకు తీసుకెళతారు. ఆవరణ నుంచి పోలింగ్‌ గదిలోకి వెళ్లడానికిగాను చక్రాల కుర్చీలు, ట్రైసైకిళ్లను ఏర్పాటు చేశారు. 80 సంవత్సరాలు దాటిన వృద్ధులకూ ఈ సదుపాయాలు వర్తిస్తాయి.
ఓటు నమోదుపై అవగాహన
అర్హులైన యువకులను ఓటర్లుగా నమోదు చేయడానికి ఎన్నికల సంఘం ఈసారి పలు వినూత్న విధానాలను అనుసరించింది. ప్రధానంగా యువకులు సెల్ఫీలు దిగడానికి ప్రాధాన్యమిస్తారు. యువకులను ఆకర్షించడానికి పట్టణ ప్రాంతాల్లో ‘ఐ ఓట్‌ బికాజ్‌..’ పేరిట పట్టణాల్లో సెల్ఫీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఓటర్లకు చైతన్యం పెంపొందించేలా హోర్డింగులను ఏర్పాటు చేసి గాలి బెలూన్లను ఏర్పాటు చేసింది. వీటితోపాటు ఓటు హక్కును వినియోగించాలంటూ ఈసారి కళాబృందాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేపట్టింది.
అంధుల కోసం బ్రెయిలీ లిపి
ప్రతి ఎన్నికల్లో అంధులు ఓటు హక్కును వినియోగించు కోవడం ఇబ్బందికరంగా మారింది. చాలామంది అంధులు ఓటు హక్కును వినియోగించుకోలేక పోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం అంధుల కోసం ఈవీఎంలలో బ్రెయిలీ లిపీని అందుబాటులోకి తీసుకొచ్చింది. వీరికి బెయిలీ లిపితో కూడిన ఓటరు చీటీలను పంపిణీ చేశారు.
రెండు ఓట్లను గుర్తించొచ్చు
రెండు చోట్ల ఉన్న ఓట్లను తొలగించి ఏదైనా ఒకే ప్రాంతం లో ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ఎన్నికల సంఘం ‘ఈఆర్వోనెట్‌.వీ2.0 వర్షన్‌’ సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టింది. ఎన్నికల సంఘం అధికారులు ఈ సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా ఓటర్ల రెండో ఓటును తొలగించారు.
ఫిర్యాదులకు సి-విజిల్‌
అభ్యర్థులు పంపిణీ చేస్తున్న డబ్బు, మద్యం గురించి గతంలో సంబంధిత కార్యాలయాలకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సి ఉండేది. వీటిపై ఓటర్లు ఫిర్యాదు చేస్తూ మద్యం, డబ్బు పంపిణీని అరికట్టడానికి ప్రస్తుతం ఎన్నికల సంఘం సీ-విజిల్‌ యాప్‌ను ప్రవేశపెట్టింది. మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్న వ్యక్తుల చిత్రాలు తీసి ఈయాప్‌లో నమోదు చేయగానే.. సంబంధిత అధికారులకు సమాచారం అందుతుంది. ఈఎన్నికల్లో కొత్తగా ప్రవేశపెట్టిన యాప్‌కు ఓటర్ల నుంచి మంచి స్పందన వచ్చింది.
సందేహాల నివ ృత్తికి ‘సమాధాన్‌’..
ఎన్నికల సమయంలో ఓటర్లు తమ సందేహాలను నివ ృత్తి చేసుకోవడానికి గతంలో అధికారులు, ఆర్డీవో, జిల్లా పాలనాధికారి కార్యాలయాల వద్దకు వెళ్లాల్సి వచ్చేంది. ఈసారి ఓటర్లు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వీలుగా ‘సమాధాన్‌’ యాప్‌ను ప్రవేశపెట్టింది. స్మార్ట్‌ చరవాణిలో సి`విజిల్‌ యాప్‌ను దిగుమతి చేసుకొని ఆయాప్‌ ద్వారా సందేహాల్ని నివ ృత్తి చేసుకోవచ్చు.
నూతన రాష్ట్రంలో తొలి ఎన్నికలు
ప్రత్యేక హోదా సాధన కోసం ఏర్పాటు చేసిన జనసేనాపార్టీ నేతృత్వంలో బీఎస్పీ, వామపక్షాలు కలసి కూటమిగా ఈఎన్నికల బరిలో ప్రధానపార్టీనేతల్లో దఢ పుట్టిస్తోంది.
నిన్నటి శత్రువులు..నేటి మిత్రులు
రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రుత్వం ఉండవన్న అంశాన్ని నిజంచేస్తూ ఈసారి ప్రజాకూటమి పేరిట కాంగ్రెస్‌, తెదేపాలు ఒకే గొడుగు కిందకు చేరాయి. తెలుగుదేశం పార్టీ గతంలో వివిధ సందర్భాల్లో తెరాస, భాజపాలతో జట్టు కట్టిన ప్పటికీ కాంగ్రెస్‌కు స్నేహ ‘హస్తం’ చాచడం ఆసక్తి కరంగా మారింది.
ఈవీఎంలు ఎలా పనిచేస్తాయి?
80 కోట్ల మంది ఓటర్లు, 2000కు పైగా రాజకీయ పార్టీలు పాల్గొనే సాధారణ ఎన్నికలను నిర్వహించడం భారత్‌ వంటి దేశంలో ఓ పెద్దసవాలే. ఇంత సంక్లిష్ట ప్రక్రియలోని విశ్వసనీయత అంతా దాని పారదర్శకతపైనే ఆధారపడి ఉంటుంది. రాజకీయ పార్టీలకు చెందిన అల్లరి మూకలు పోలింగ్‌ కేంద్రాలను లూటీ చేయడం, బ్యాలట్‌ బాక్సులను ఎత్తుకెళ్లిపోవడం వంటి చర్యల కారణంగా దశాబ్దాలపాటు ఎన్నికల నిర్వహణ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం) ప్రవేశంతో ఈపరిస్థితికి అడ్డుకట్ట పడిరది. కానీ వీటిపై ఎన్నో అనుమానాలు,విమర్శలు. ఈయంత్రాలను హ్యాకింగ్‌ చేయవచ్చని, రిగ్గింగ్‌కు పాల్పడవచ్చంటూ ఎన్నికల్లో పరాజ యం పాలైన పార్టీలు ఆరోపించడం సాధారణమైపోయింది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ అనుమానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. 2014 ఎన్నికల్లో ఈవీఎంలను హ్యాక్‌ చేశారని, అందువల్లే నరేంద్ర మోదీ నేత ృత్వంలోని బీజేపీ భారీ ఆధిక్యంతో అధికారాన్ని కైవసం చేసుకుందని అమెరికాలో నివసిస్తున్న భారత సైబర్‌ నిపుణుడు సయ్యద్‌ షుజా చేసిన ఆరోపణలను భారత ఎన్నికల సంఘం ఖండిరచింది. కానీ, ఈవీఎంల్లో వాడే సాంకేతికతపై అనుమా నాలు మాత్రం ఇంకా తొలగిపోలేదు. కోర్టుల్లో ఈవీఎంల కచ్చిత త్వంపై కనీసం 7కేసులు నడుస్తున్నాయి. అయితే భారత్‌లో వినియో గిస్తున్న ఈవీఎంలను హ్యాకింగ్‌ చేయలేరని ఎన్నికల సంఘం వర్గాలు చెబుతూనే వస్తున్నాయి.
ఈవీఎంల భద్రత
భారత్‌లో వినియోగిస్తున్న 1.6 కోట్ల ఓటింగ్‌ యంత్రాల్లో ఒక్కోదానిలో 2000 ఓట్లు నమోదు చేయవచ్చు (ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 1500 మందికి మించి ఓటర్లు ఉండరాదు). 64 మంది అభ్యర్థుల పేర్లను చూపించవచ్చు. భారత్‌లోనే తయారయ్యే ఈ మెషీన్లను బ్యాటరీ పవర్‌తో కూడా ఉపయోగించవచ్చు. దీనివల్ల కరెంటు సౌకర్యం సరిగా లేని మారుమూల గ్రామాల్లో సైతం వీటితో ఎన్నికలు నిర్వహించవచ్చు. దీనిలో ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ను ఈసీఐఎల్‌ ఇంజనీర్ల బృందం అభివృద్ధి చేసింది. ఈ బృందానికి తప్ప వేరెవరికీ ఈ సాఫ్ట్‌వేర్‌ గురించి గానీ, ఈవీఎంలకు సంబంధిం చిన ఇతర వివరాల గురించి గానీ తెలిసే అవకాశం లేదని ఈసీఐఎల్‌ వర్గాలు స్పష్టం చేశాయి. ఎవరైనా బలవంతంగా, నిబంధనలకు విరుద్ధంగా ఓట్లు వేయాలని ప్రయత్నిస్తే, మెషీన్‌ పనిచేయకుండా చేసేలా ఈవీఎంపై ఓబటన్‌ కూడా ఉంది. పోలింగ్‌ స్టేషన్‌లోని సిబ్బంది అవసరమైన సమయంలో దీన్ని నొక్కవచ్చు. పోలింగ్‌ ముగి సిన తర్వాత దీనికి పాతపద్ధతిలోనే లక్కతో సీల్‌ వేసి, దానిపై ఓ స్టిక్కర్‌ అతికించి, స్టాంప్‌ వేస్తారు. దీంతోఎలాంటి మార్పులకూ అవకా శం ఉండదు. ఇప్పటి వరకూ మూడు సాధారణ ఎన్నికలు, 113 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించారు. బ్యాలెట్‌ పద్ధతిలో పోలింగ్‌ జరిగినప్పుడు ఒక్కో పార్లమెంటరీ నియోజక వర్గంలో ఫలితం తేలాలంటే కనీసం 40 గంటలు పట్టేది. ఈవీఎంల వినియోగంతో అది 5 గంటలకు తగ్గిపోయింది. ఎలాంటి అవకతవ కలకు, మానవ తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఎన్నికలు నిర్వహిం చేందుకు వీలు కలిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈవీఎంల ప్రభావం అనే అంశంపై పరిశోధనలు చేసిన శిశిర్‌ దేవ్‌నాథ్‌, ముదిత్‌ కపూర్‌, షమికా రవి తమ పరిశీలనలను 2017లో సమర్పించారు. ఈవీఎంల ప్రవేశం కారణంగా అందరూ తమ ఓటు హక్కు నిర్భ యంగా వినియోగించుకునే అవకాశం కలిగిందని, ఎన్నికల్లో అక్రమా లకు అడ్డుకట్ట పడిరదని, ఎన్నికలను మరింత సమర్థంగా నిర్వహించే వెసులుబాటు కలిగిందని తమ నివేదికలో వీరు పేర్కొన్నారు.
వీఎంల హ్యాకింగ్‌ సాధ్యమేనా?
ఈవీఎంలకు ఓ చిన్న పరికరం అమర్చి, మొబైల్‌ ద్వారా ఎస్‌ఎంఎస్‌ పంపించడం ద్వారా ఓట్లను తారుమారు చేయవచ్చని ఎనిమిదేళ్ల క్రితం మిచిగాన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. కానీ ఈసీ అధికారులు ఇదిఅసాధ్యమంటూ ఆఆరోపణలను కొట్టి పారేశారు. ఇన్నివేల ఈవీఎంలను హ్యాక్‌ చేయాలంటే చాలా డబ్బు అవసరమని, ఒకవేళ చేయాలనుకున్నా దానికి ఈవీఎంల తయారీలో భాగమైన ఇంజినీర్ల సాయం అవసరమని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)కు చెందిన నిపుణుడు ధీరజ్‌ సిన్హా అభిప్రాయ పడ్డారు. దీనికి ఓ చిన్న రిసీవర్‌ సర్క్యూట్‌, మానవ కంటికి కనబడని ఓ యాంటెన్నా అవసరమని ఆయన అన్నారు. అయితే భారత్‌లో వినియోగిస్తున్న ఈవీఎంలకు ఎలాంటి యాంటెన్నాలు, ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్లు లేవని ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు. ఇంత భారీస్థాయిలో హ్యాకింగ్‌ అసాధ్యమని అన్నారు.
ఇతర దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది?
దాదాపు 33దేశాల్లో ఈవీఎంల ద్వారా ఓటింగ్‌ జరుగు తోంది. కొన్ని దేశాల్లో వీటి విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈవీఎంల ద్వారా జరిగిన 2017 వెనెజ్వేలా ఎన్నికల్లో నమోదైన ఓట్లకన్నా దాదాపు 10 లక్షల అదనపు ఓట్లు ఎక్కువ పడ్డాయని వచ్చిన ఆరోపణలను అక్కడి ప్రభుత్వం తోసిపుచ్చింది. బ్యాలట్ల గోప్యత, ఫలితాల తారుమారు వంటి సమస్యలను ప్రస్తావిస్తూ అర్జెంటీనా కూడా 2017లో ఈ-ఓటింగ్‌ ప్రతిపాదనలను తిరస్కరిం చింది. 2018 ఇరాక్‌ పార్లమెంటు ఎన్నికల్లో ఈవీఎంలలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయంటూ కొన్ని చోట్ల రీకౌంటింగ్‌ నిర్వహించాల్సి వచ్చింది. డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో గత డిసెంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికలు పెద్ద వివాదాన్నే రేపాయి. ఈవీఎంలను సరిగ్గా పరీక్షించకుండానే పోలింగ్‌లో వినియోగించారనే ఆరోపణలు వచ్చాయి. అమెరికాలో 15 ఏళ్ల క్రితం ఓటింగ్‌ యంత్రాల వినియోగం ప్రారంభమైంది. ఇప్పుడు అక్కడ దాదాపు 35 వేల మెషీన్లు ఉన్నాయి. అయితే అక్కడా కొన్ని ఆరోపణలున్నాయి.
వీవీప్యాట్లతో సందేహాలు తొలగుతాయా?
‘‘టెక్నాలజీ వినియోగాన్ని ఎంతగా వీలైతే అంతగా తగ్గిం చాలి. ఏ ఓటరు ఏఅభ్యర్థికి ఓటేశాడో తెలియకూడదని అంటు న్నారు, అసలు సాఫ్ట్‌వేర్‌ అనుకున్న విధంగానే పనిచేస్తోందో లేదో తెలుసుకు నేందుకు కూడా సరైన మార్గం లేదు’’ అని ఈ-ఓటింగ్‌పై అధ్యయనం చేస్తున్న యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ కరోలినా ప్రొఫెసర్‌ డంకన్‌ బ్యూల్‌ వ్యాఖ్యానించారు. భారత్‌లో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిం చేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. అన్ని ఈవీఎంలకు వీవీప్యాట్‌లను ఏర్పాటు చేయాలని ఐదేళ్ల క్రితం సుప్రీం కోర్టు ఆదేశించింది. ఒక ఓటు నమోదుకాగానే, సీరియల్‌ నంబరు, పోటీలో ఉన్న అభ్యర్థి పేరు, పార్టీ గుర్తుల వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. 7 సెకండ్ల తర్వాత ఈవివరాలతో ప్రింట్‌ అయిన రసీదు ఓసీల్డు బాక్సులో పడిపోతుంది. వీవీప్యాట్ల ద్వారా వచ్చే పేపర్‌ స్లిప్‌లను మెషీన్లలో నమోద య్యే ఓట్ల సంఖ్యతో పోల్చి చూడాలని అధికారులు నిర్ణయిం చారు. ప్రతి అసెంబ్లీ స్థానంలో కనీసం 5%కేంద్రాల్లో ఇలా చేయాలని భావిస్తు న్నారు. ఓటర్ల మనసుల్లో ఉన్న అనుమానాలు వీవీప్యాట్‌ల ద్వారా తొలగవచ్చని మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషీ అభిప్రాయపడ్డారు.‘‘2015 నుంచి అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో వీవీ ప్యాట్లను ఉపయోగిస్తున్నారు. వీటిలో దాదాపు1500 మెషీన్లకు ఉన్న పేపర్‌ స్లిప్‌లను పోలైన ఓట్లతో కలిపి లెక్కించారు. ఒక్కటి కూడా తేడా రాలేదు’’ అని ఆయన అన్నారు. ఈవీఎంలో ఓట్లు ఎలా లెక్కిస్తారు? వీవీ ప్యాట్‌లు అంటే ఏంటి? ఈవీఎం మెషీన్లలో నిక్షిప్తమై ఉన్న ఓట్లు ఎవరికి అధికారం కట్టబెడ తాయో అన్న ఉత్కంఠతో అందరూ ఎదురు చూస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ అంతా రాజకీయపార్టీలు, ఏజెంట్ల సమక్షంలో జరుగుతుంది. ప్రతి రౌండ్‌లోనూ వారు సంతృప్తి చెందిన తర్వాతే ఫలితాలను అధికారులు వెల్లడిస్తారు. ఈనేపథ్యంలో అసలు ఈవీఎం మెషీన్లలో ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుం దో చూద్దాం. ఆసమయంలో లెక్కింపు సిబ్బంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూద్దాం. ఓట్లను లెక్కించేందుకు ముందుగా ఈవీఎంలోని ఫలితాల విభాగానికి ఉన్న సీల్‌ను తొలగిస్తారు. ఈవీఎం బయటి కప్పు మాత్రమే తెరుస్తారు. లోపలి భాగాన్ని తెరవకుండా అలాగే ఉంచు తారు. తర్వాత ఈవీఎం పవర్‌ ఆన్‌ చేస్తారు. బ్యాటరీలో ఛార్జింగ్‌ తక్కువగా ఉంటే ఆ మెషీన్‌కి ఉండే డిజిటల్‌ తెర మిణుకు మిణుకుమని వెలుగుతుంది. లేదంటే ఖాళీగా కనిపిస్తుంది. అప్పుడు కొత్త బ్యాటరీ అమర్చాలి. అనంతరం లోపల బటన్‌ మాదిరిగా కనిపిం చే సీల్‌ను తొలగిస్తే లోపల రిజల్ట్స్‌ మీట కనిపిస్తుంది. ఆమీట నొక్కగానే ఏఅభ్యర్థికి ఎన్నిఓట్లు పోలయ్యాయో తెరపై కనిపిస్తుంది.ఆ వివరాలను జాగ్రత్తగా నోట్‌ చేసుకుంటారు.
వీవీపాట్‌ అంటే ఏమిటి? అదెలా పనిచేస్తుంది?
ఎన్నికల సంఘం ఓటింగ్‌ విషయంలో అనేక సంస్కరణలు, విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూనే ఉంది. బ్యాలెట్‌ బాక్స్‌ల నుంచి ఈవీఎంల వరకు కొత్త సాంకేతికతను వినియోగిస్తూనే ఉంది. అయితే, ఓటింగ్‌లో మరింత పాదర్శకతకు పేపర్‌ బ్యాలెట్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని 16 రాజకీయ పార్టీలు గతంలో ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం వీవీపాట్‌ను తీసుకొచ్చింది. వీవీపా ట్‌.. ఇకమై మీ ఓటును ప్రింట్‌ తీసుకోవచ్చు. ఓటర్‌ వెరిఫైడ్‌ పేపర్‌ అడిట్‌ ట్రయిల్‌కు సంక్షిప్త రూపమే వీవీపాట్‌. ఇది ఒక చిన్న ప్రింటిర్‌ లాంటిది. వీవీపాట్‌ను ఈవీఎంలకు అనుసంధానిస్తారు. తాము వేసిన ఓటు ఎవరికి పడిరదో ఓటర్లు చూసుకునేందుకు వీలుగా ఎన్నికల సంఘం దీన్ని తీసుకొచ్చింది. మనంఏపార్టీకి ఓటు వేశామనదే వీవీ పాట్‌లద్వారా వెంటనే తెలుసుకునే అవకాశం ఉంది. ఈవీఎంలో మనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసిన తర్వాత వీవీపాట్‌ ఒక స్లిప్‌లో ఆఅభ్యర్థి పేరు, గుర్తు వచ్చేలా ప్రింట్‌ తీసి సీల్డ్‌ బాక్స్‌లో పడేస్తుంది. ఓటు వేసిన ఏడు సెకన్ల తర్వాత వీవీపాట్‌ బీప్‌ శబ్దం చేస్తూ ప్రింట్‌ను చూపిస్తుంది. 2013లో నాగాలాండ్‌లోని నొక్సెన్‌ అసెంబ్లీ నియోజక వర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో తొలిసారి వీవీపాట్‌లను ఎన్నికల సంఘం ఉపయోగించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2014 సాధారణ ఎన్నికల్లో కొన్ని పోలింగ్‌ బూత్‌లలో వీవీపాట్‌లను ఎన్నికల సంఘం ఉపయోగించింది.-కందుకూరి సతీష్‌కుమార్‌

హామీల ఉల్లంఘనలు సరికొత్త వాగ్దానాలు

గత ఎన్నికల సందర్భంగా రైతులకు, డ్వాక్రా మహిళలకు, చేనేత కార్మికులకు రుణ మాఫీ చేస్తానని, చంద్రబాబు నాయుడు వాగ్దానం చేశారు. ఇప్పుడు పసుపు కుంకుమల వల వేశారు. దాన్ని కూడా నమ్మరన్న అనుమానం వచ్చింది కాబోలు! మళ్లీ అధికారంలోకి వస్తే మరోసారి పసుపు కుంకుమ ఇస్తానని కొత్త వాగ్దానం ప్రకటించారు. జగన్‌ కూడా డ్వాక్రా రుణ మాఫీ అంటున్నారు.
రూ.16 వేల కోట్లు రుణమాఫీ చేశామంటూ అబద్ధాలు చెప్పుకుంటూ ఈ కాలమంతా ప్రచారం చేశారు. 2014 డిసెంబరు 31నాటికి డ్వాక్రా సభ్యులు రూ.13 వేల 844 కోట్లు బ్యాంకులకు బకాయి ఉన్నారు. రూ.2 వేల 174కోట్లు ఓవర్‌ డ్యూఅయ్యాయి. రూ.888 కోట్లు ఎన్‌పిఎ గా ప్రకటించబడ్డాయి. రుణాలు ప్రభుత్వం జమ చేసినట్లయితే మహిళలు వడ్డీల మీద వడ్డీలు కట్టాల్సిన దుస్థితి వచ్చేది కాదు. 2018లో సెప్టెంబరులో జరిగిన శాసనసభ సమావే శాల్లో డ్వాక్రా రుణ మాఫీ వాగ్దానం ప్రకారం ఎంత రుణమాఫీ చేశా రని ప్రశ్నించగా ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదన్న కఠోర వాస్తవం సంబంధిత శాఖామంత్రి ఇచ్చిన సమాధానంలో వెల్లడైంది. గత ఎన్నికలలో హామి ఇచ్చిన ప్రకారం రుణ మాఫీ చెయ్యలేదనేది కఠోర వాస్తవం. మద్య నిషేధ హామీతో అధికారంలోకి వచ్చిన ఎన్‌టిఆర్‌ స్థానంలో చంద్రబాబు నాయుడు అర్ధంతరంగా అధికారంలోకి వచ్చిన కాలంలోనూ అంతే. మద్య నిషేధ హామీకి తూట్లు పొడిచారు. కల్తీ మద్యం నిరోధం పేరిట మద్యం షాపులకు లైసెన్స్‌ ఇవ్వడం ప్రారంభించి, డ్వాక్రా పేరిట మహిళలకు వల వేశారు. 1000 రూపాయలు పొదుపు చేసుకొంటే రూ.1000 జమ చేస్తానని పెద్ద ఎత్తున స్వయం సహాయక గ్రూపులను ఏర్పాటు చేశారు. లక్షల మంది మహిళలను సమీకరించేందుకు డ్వాక్రాను ఒక సాధనంగా మార్చుకున్నారు.
నిరంకుశ పెత్తనం
మహిళలు, పిల్లల అభివృద్ధి కోసం ప్రవేశ పెట్టబడిరది డ్వాక్రాపథకం. గ్రూపు పొదుపు చేసుకున్న డబ్బులకు నాలుగు రెట్ల నుండి 10 రెట్ల వరకు అదనంగా బ్యాంకు రుణ సౌకర్యాన్ని కల్పిం చాలని రిజర్వుబ్యాంక్‌ ఆదేశించింది. అయితే ప్రారంభం నుంచే ఈ స్వయం సహాయక గ్రూపులు రాజకీయ ప్రయోజనాలకు అను గుణంగా తీర్చిదిద్దబడ్డాయి. ఎమ్‌ఎల్‌ఎలు, మంత్రులు, ముఖ్య మంత్రుల సభలు జయప్రదం చెయ్యడానికి వీరిని వాడుకోవడం మొదలుపెట్టారు. డిఆర్‌డిఎ ఉద్యోగులకు గ్రామ సేవికలకు అధికారా లను కట్టబెట్టారు. రుణం మంజూరు కావాలంటే సభలకు హాజరు కావలసిందేనని నమ్మబలికారు. గ్రూపుల తీర్మానాలను నామ మాత్రం చేసి అధికారుల ఇష్టారాజ్యంగా, అధికార పార్టీ ప్రయోజనాలకు అను గుణంగా గ్రూపులు నిర్వహించబడుతూ వచ్చాయి. మహిళలు, పిల్లల సమగ్ర అభివృద్ధికి ఉద్దేశించబడిన స్వయం సహాయక గ్రూపులు, పొదుపు రుణాల గ్రూపులుగా మార్చబడ్డాయి. మహిళల చొరవ, నిర్ణయాధికారం, చైతన్యవంతమైన కృషి, ఆర్థిక స్వావలంబన అణచి వేయబడ్డాయి. మహిళలు నాయకులుగా ఎదిగే క్రమాన్ని నీరు గార్చాయి.
గోరంత లబ్ధి, కొండంత భారం
స్వప్రయోజనాల సాధనే లక్ష్యంగా, ఆంధ్ర ప్రదేశ్‌లో అధికార పార్టీలు పొదుపు గ్రూపు లను ప్రోత్సహించాయి. ఫలితంగా గోరంత లబ్ధి, కొండంత భారంగా గ్రూపులు నడుస్తు న్నాయి. మహిళల శ్రమను కారు చౌకగా బ్యాంకులు, ప్రభుత్వం వినియోగించు కొంటున్నాయి. డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న వేలకోట్ల రూపాయలను వడ్డీ లేకుం డానే బ్యాంకులు ఉపయోగించు కుంటు న్నాయి. పొదుపు డబ్బులను బ్యాంకుల నుండి తీసుకోవడానికి ఆంక్షలు పెడుతున్నాయి. గ్రూపుల నిర్వహణ ఖర్చులు, గ్రామసేవికల వేతనాలు డ్వాక్రా మహిళలే చెల్లించుకుం టున్నారు. బలవంతపు డిపాజిట్లు, ఇన్సూ రెన్సులు కట్టించి వడ్డీ రేట్ల భారాన్ని మహిళల మీద మోపారు. వీటితో పాటు అధికార పార్టీ సభలకు బలవంతపు ప్రేక్షకులుగా మార్చ బడ్డారు. 2008లో సెస్‌ అంచనాల మెరకు 2004-5, 2010-11 మధ్య బ్యాంకుల నుండి డ్వాక్రా గ్రూపులకు రూ.1200 కోట్లు నుంచి 8,600 కోట్లు రుణాలు మంజూరు పెరిగింది. 2012నాటికి రాష్ట్రంలో12.5 లక్షల గ్రూపుల్లో1.36 కోట్ల మంది మహి ళలు ఉన్నారు. ఈ మొత్తం గ్రూపులకు వడ్డీల మొత్తం జమ చేయాల్సివస్తే రూ.1,400 కోట్లువడ్డీల కింద చెల్లించాల్సి వస్తుందని లెక్కించబడిరది. అంటే డ్వాక్రా గ్రూపులకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చెయ్యడం ద్వారాప్రభుత్వం,బ్యాంకులు లబ్ధిపొందాయి.
పసుపు కుంకుమల మాయ
2014లో రుణ మాఫీ హామీ ద్వారా టిడిపి ఓట్లు వేయించుకుని అధికారాన్ని పొందింది. మహిళలు మాత్రం పెనాల్టీలు కట్టారు. ముక్కు పోగులు, చెవి కమ్మలు, అమ్ముకుని అప్పులు చెల్లించారు. అవి కూడా లేని వాళ్ళ గ్రూపులు రద్దయ్యాయి. అప్పటికి గ్రూపులు చెల్లించవలసిన మొత్తం రూ.2,514 కోట్లు మాత్రమే. ఈ మొత్తం కూడా చెల్లించనందున డ్వాక్రా గ్రూపులు రుణగ్రస్త గ్రూపులుగా మారి పోయాయి. అధిక వడ్డీలకు అప్పులు చేసి, లేక సొంతంగా అప్పులు చెల్లించగలిగిన వాళ్ళు చెల్లించగా, మిగిలిన వాళ్ళు బ్యాంకుల నుండి నోటీసులను అందుకున్నారు. ఇప్పుడు పసుపు కుంకుమ కింద ఇచ్చిన డబ్బులు కొన్ని చోట్ల పాత బకాయిలకు చెల్లవేశారు. పసుపు, కుంకుమ చెక్కుల పంపిణీ చేస్తూ తెలుగు దేశానికి ఓట్లు వేస్తామని, బాబు మళ్ళీ రావా లని ప్రమాణాలు చేయించుకున్నారు.
వడ్డీ లేని రుణాలు
2012లో డ్వాక్రా గ్రూపులకు వడ్డీ లేని రుణా లు ఇస్తామని జీవో జారీ చేసింది. ఆ మేరకు సంవత్సరానికి రెండున్నర వేలకోట్ల రుపా యలు వడ్డీ కింద మంజూరు చేయాలి. సకాలంలో వడ్డీలు చెల్లించినట్లయితే గ్రూపు లకు అదనపు వడ్డీ భారం పడదు. కాని ఆ ప్రకారం టిడిపి ప్రభుత్వం వడ్డీ చెల్లించ నందున, అదనపువడ్డీల భారం గ్రూపుల మీద పడుతుంది.
ఐక్యతతో అధిగమించాలి
టిడిపి ప్రభుత్వం ఇచ్చిన రుణ మాఫీ హామీతో సుమారుగా మూడున్నర లక్షల గ్రూపులు రుణాల ఊబిలో కురుకుపోయి రద్దయ్యాయి. ప్రభుత్వం చేసిన తొలి సంతకానికి విలువ ఇచ్చి కనీసం రెండున్నర వేల కోట్ల రూపా యలు జమ చేస్తే అన్ని గ్రూపులు సజీవంగా ఉండటమే కాక, వారి ఆర్థిక కార్యక్రమాలు పెరిగేందుకు దోహద పడేది. ఇప్పుడు ఎన్ని కల ముందు ఆర్భాటంగా ప్రకటించిన పసు పు, కుంకుమ ఆనాడే రుణ మాఫీకి జమ చేస్తే రాష్ట్రానికి, మహిళలకు, బ్యాంకులకు ఎంతో లబ్ధి చేకూరేది. ఎన్‌ఆర్‌ఎల్‌ఎమ్‌ (నేష నల్‌, రూరల్‌ లైవ్లో హడ్‌ మిషన్‌) పథకం కింద రూ.10 లక్షల వరకూ 7 శాతం వడ్డీకే లింకేజి లోన్‌ ఇవ్వగలిగే అవకాశం వుంది. కాని దానిని అమలు చేయడానికి ప్రభుత్వం నుంచి ప్రయత్నమే లేదు. నైపుణ్య శిక్షణ, ఉత్పత్తి యూనిట్లు, మార్కెటింగ్‌ సదుపా యాలు కాగితాలకే పరిమితమయ్యాయి. స్త్రీ నిధి రుణాల పై కూడా వడ్డీ జమ చేయాలి. ప్రభుత్వం ఈ రుణాలకు ముక్కు పిండి మరీ వడ్డీ వసూలు చేస్తోంది.
పసుపు కుంకుమలు, రుణ మాఫీ వాగ్దానాలు ఓట్ల కోసం వేసే వల మాత్రమే. స్వయం సహాయక గ్రూపులు స్వయం నిర్ణయాధి కారంతో నడవాలి. అందుకు ప్రభుత్వం సహా యం ఇవ్వాలి. నిర్వహణకోసం అయ్యే ఖర్చు లు, ఫెసిలిటేటర్లు (ఏనిమేటర్లు) జీతాల ఖర్చు లు ప్రభుత్వమే భరించాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ వడ్డీ రాయితీని ఏనెలకా నెల జమ చేయాలి. నైపుణ్య శిక్షణ,మార్కెటింగ్‌ సదు పాయాల కోసం బహుళ జాతి కంపెనీల మీద ఆధారపడడంగాక ప్రత్యామ్నాయ పద్ధ తులు రూపొందించాలి. సామాజిక చైతన్యం తో సమస్యల పరిష్కారంలో డ్వాక్రా మహిళలు భాగస్వాములైతే పాలక వర్గాల వంచనలు సాగవు. సాగబోవు.-డి.రమాదేవి

క్షమించరాని..నిర్లక్ష్యం

‘శ్రీకాకుళం జిల్లాకు ఇతర ప్రాంతాల నుండి వలసలు వచ్చే విధంగా చేసే బాధ్యత నాది. కిడ్నీల వ్యాధిని నిర్మూలించడానికి సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మించే బాధ్యత నాది’ అని ఇటీవల శ్రీకాకుళం ఎన్నికల బహిరంగ సభలో పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు. ‘ఇలాంటి అమలు కాని వాగ్ధానాలు చేస్తే మాదేశంలో ఉరి వేస్తార’ని హైదరాబాదులో జరిగిన సెమినార్‌లో ఓ విదేశీ ప్రతినిధి అన్నారు. ఇది జరిగినప్పుడు చంద్రబాబు వేదిక పైనే ఉన్నారు. రెండూ వేర్వేరు సందర్భాలలో అన్నమాటలే అయినప్పటికీ నేతలు అలా నోటికొచ్చిన వాగ్దానాలు చేస్తూనే వున్నారు. సోంపేట, కాకరాపల్లిలో ధర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లకు సంబంధించిన ప్రతిపాదనలు వైఎస్సార్‌ హయాం లోనే వచ్చాయి. మొత్తంమీద ఇటు చంద్రబాబు…అటు వైఎస్సార్‌… వీరిద్దరి పాలనలోనూ ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగింది. జగన్‌ సైతం ఆ ప్రాంత అభివృద్ధికి ఎన్నో శుష్క వాగ్దానాలు చేశారు. చేస్తూనే ఉన్నారు. శ్రీకాకుళం, విజయ నగరం, విశాఖల నుంచి వలసలు వెళ్తున్నవారు హిమాలయ పర్వతాల నుంచి అండమాను దీవుల వరకు విస్తరించి వున్నారు. ఎక్కడో మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ఒక చిన్నపరిశ్రమ పెడితే అక్కడికీ శ్రీకాకుళం వాళ్లు కార్మికులుగా వెళ్తున్నారు. దీన్నిబట్టే ఉత్తర కోస్తా నుంచి వెళ్లే వలసలు ఎంత ప్రమాదకరంగా వున్నాయో అర్థమౌతోంది. వాస్తవానికి ఉత్తర కోస్తా జిల్లాలలో దేశంలోనే అత్యధిక వర్షపాతం 1150 మి.మీ నమోదవుతోంది. ఈ నీటిని సద్వినియోగం చేసుకుంటే ఆజిల్లాల నుంచి ప్రజలు వలసలు పోయే పరిస్థితే రాదు. కానిఆదిశగా ప్రభుత్వాలు పని చేయవు. పైగా పరిశ్రమల కోసం పేదల నుంచి భూములు లాక్కున్నాయి. పోలీసుల నిర్బంధం ప్రయోగించి, అక్రమ కేసులు బనాయించి, జైళ్లలో పెట్టి, లాఠీ ఛార్జీలు చేసి, బలవంతంగా భూముల నుండి పేదలను వెళ్లగొట్టారు. చివరికి అణువిద్యుత్‌ కేంద్రానికి కూడా శ్రీకాకు ళంనే ఎంచుకున్నారు.మూడు జిల్లాల్లో దాదాపుగా 30లక్షల ఎకరాల సాగుభూమి లో 3లక్షల ఎకరాలకు మాత్ర మే నీటి వనరులు న్నాయి. చెరువులు వున్నప్పటికీ మరమ్మతులు లేక పెద్దగా వినియోగంలో లేవు. తాగునీటి కోసం విజయనగరం నుంచి తాడిపూడి ప్రాజెక్టును విశాఖపట్నం కార్పొరేషన్‌ నిర్మాణం చేసి నీటిని వినియోగిం చుకున్నది. నిర్ణీత 25 సంవత్సరాల గడువు పూర్తి అయిన తర్వాత స్థానిక జిల్లాకు ఆ ప్రాజెక్టును అప్పగించారు. కానీ,నేటికీ విశాఖపట్నానికే నీరు వెళుతోంది. దీంతో ప్రాజెక్టు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు తాగు నీరు లేని పరిస్థితి. 2009లో ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని రూ.7214 కోట్లతో చేపట్టారు. ఈ ప్రాజెక్టు వల్ల శ్రీకాకుళంలో 0.85 లక్షల ఎకరాలు, విజయనగరంలో 3.94 లక్షల ఎకరాలు, విశాఖపట్నంలో 3.21 లక్షల ఎకరాలు మొత్తం 8 లక్షల ఎకరాలకు నీరిస్తామని చెప్పారు. కానీ, 2016-17లో రూ.రెండు కోట్లు, 2017-18లో రూ.రెండు కోట్లు కేటాయించారు. 2018-19 రాష్ట్ర బడ్జెట్‌లో మొత్తం ఇరిగేషన్‌కు రూ.14,229 కోట్లు కేటాయించారు. అందులో రూ.420 కోట్లు మాత్రమే మూడు జిల్లాల ప్రాజెక్టుకు కేటాయించినా వ్యయం చేయలేదు. వంశధార-2 ప్రారంభించి దశాబ్దం గడుస్తున్నా పూర్తి కాలేదు. ఇలా ఉత్తరాంధ్ర లోని ప్రాజెక్టులు దశాబ్దాల తరబడి తీవ్ర నిర్లక్షానికి గురౌతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కావలసినన్ని వాగులు, వంకలు, నదులు ఉన్నా, ఈ నీరంతా సముద్రం పాలవు తూనే వుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు 2003 వరకు 9సంవత్స రాల పాటు ఉమ్మడి రాష్ట్ర ముఖ్య మంత్రిగా,2014-19ప్రత్యేక ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఈ15 సంవత్సరాలలోను గుర్తించని అంశాన్ని కొత్తగా గుర్తించినట్లు ప్రకటించడం హాస్యాస్పదం. వలసలను నిరోధించాలంటే ఆ జిల్లాల జీవనాదాయం పెరగాలి. ప్రతిసారీ ‘అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటాను’ అంటూ చేస్తున్న ప్రచారం చెవిలో మోగుతూనే ఉంది. పాలకుల దృష్టి అంతా ఉత్తరాంధ్రలో వున్న ఖనిజ సంప దను, బహుళ జాతి సంస్థల ద్వారా అమ్మించాలన్న ప్రయత్నమే తప్ప ఆ ప్రాంతాన్ని బాగు చేయాలన్న దృష్టి కాదు. బంగాళఖాతంలో వచ్చిన ప్రతి తుపాను ఉత్తర కోస్తాను నష్టపరుస్తూనే ఉంది. హుదూద్‌, పైతాన్‌ లాంటి తుపానుల వల్ల జరిగిన నష్టానికి ప్రభుత్వం ఇంత వరకు పరిహారం ఇవ్వ లేదు. పైగా నష్టం ఇస్తున్నట్లు విపరీతమైన ప్రచారం చేసింది. ఈ పరిహా రాన్ని కూడా ఉద్యోగుల సహకారంతో పాలక వర్గాలు పెద్దఎత్తున అవినీతికి పాల్పడిన ఘటనలు ఉన్నాయి. ఈ జిల్లా లు విద్యకు బహు దూరంలో వున్నాయి. ప్రతిపక్షంలో వున్న వైఎస్సార్‌ పార్టీ ఈ అంశాలపై గట్టిగా ఒత్తిడి చేయనూ లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా అక్షరాస్యత గురించి పట్టించుకోలేదు. వైద్య సౌకర్యం ఆమడ దూరంలో వుంది. అక్కడ లేని జబ్బులు లేవు. పైగా, ఫార్మా సంస్థలు గిరిజనులపై తమ మందులను ప్రయో గించి పరీక్షలు చేస్తాయి.దీంతో వారి బతుకులు అర్ధాంతరంగా ముగుస్తున్నాయి. ఫార్మా కంపెనీలకు దాసోహంగా ఉండే ప్రభుత్వాలు పేద, దళిత గిరిజనుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. పిహెచ్‌సీ సెంటర్లు వున్నా వైద్యులు, మందులు ఉండవు. కిడ్నీలకు సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణం ప్రారంభిస్తామన్న ఏలికలకు ఈ ప్రాంతంలో మలేరియాతో ఏటా 3వేల మంది చనిపోతున్న విషయం తెలుసా? మొబైల్‌ వ్యాను ద్వారా మెడికల్‌ సహాయం చేయడానికి ఆటంకాలేంటి? మరణిస్తున్న గర్భిణీలు, నవజాత శిశువుల గణాంకాలు ఈ పాలకులు ఎప్పుడైనా గమనించారా? రవాణా సౌకర్యాలు పరిశీలిస్తే ఎన్‌హెచ్‌-5 (చెన్నై-కోల్‌ కతా), రైల్వే లైన్‌ మినహా గిరిజన పల్లెలకు కల్పించిన రహదారి సౌకర్యం నామ మాత్రమే. ఒక వైపున ఈ మూడు జిల్లాలలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారి సంఖ్య ఏటేటా పెరుగుతుండగా అక్కడ ఎంపికైన శాసన సభ్యులు, మంత్రులు మాత్రం కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ప్రజలకు ఆదామా షాలో ఆదాయం పెరిగిందా? ఈమూడు జిల్లాల్లో 2014 నుండి 2019 వరకు ప్రజల కొనుగోలు శక్తి పెరుగుదలకు ఎంత కేటాయించి వ్యయం చేశారో ప్రభుత్వం శ్వేత పత్రం ప్రకటించాలి. కిడ్నీ బాధితు లకు పాలక వర్గాల నాయకులు సానుభూతులు మాత్రమే ప్రకటించి వచ్చారు తప్ప, నివారణకు ఏ చర్యలూ తీసుకోలేదు. ఫ్లోరైడ్‌ నీటి వినియోగం వల్ల కిడ్నీ వ్యాధులు దశాబ్దాలుగా వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రులన్నీ వైద్యులు లేక, మందుల కొరత వల్ల కునారిల్లుతున్నాయి. ఈ సంగతి పాలకు లకు తెలియదా? సాగునీటి వనరులను ఒక్క సంవత్సరంలో పూర్తి చేసి, వారికి పౌష్టికాహారం అందించడం, జీవనాదాయం పెంచడం, విద్యా వైద్య సౌకర్యం కల్పించడంతో పాటు కాలుష్య నివారణా చర్యలు చేపట్టినప్పుడు ఉత్తర కోస్తాను ‘కోస్తా’గా గుర్తించవచ్చు. అంతేగానీ, కోస్తా పేరు చెప్పి ఇంతకాలం చేస్తున్న నిర్లక్ష్యం క్షంతవ్యం కాదు. శ్రీకాకుళం జిల్లాకు బయటి నుండి వలసలు రావటం కాదు, ఇక్కడి నుంచి వెళ్లే వలసలను నివారించగలిగితేనే పాలక పార్టీ లక్ష్యం నెరవేరుతుంది- వ్యాసకర్త : వ్యవసాయ రంగ నిపుణులు -సారంపల్లి మల్లారెడ్డి

అస్థిత్వం కోల్పోతున్న సబ్‌ప్లాన్‌ ఏజెన్సీ

‘‘ ప్రశాంతమైన మన్యసీమలో గిరిజనేతరలు, దోపిడీ దారులు పెరిగిపోయి ఆరాచకాలు సృష్టిస్తున్నారు. దళారీ వ్యవస్థ విపరీతంగా పెంచేస్తున్నారు. ప్రస్తుతం సబ్‌ప్లాన్‌ ఏరియాలో గిరిజనప్రజలు స్వేచ్ఛగా జీవించే విధానం కనుమరుగువుతోంది. వందల ఎకరాలున్న గిరిజన భూస్వాములు నేడు భూములు కోల్పోయి బికారులా వలస బాట పట్టే పరిస్థితికి దిగజారుతున్నారు. ఇక్కడ ఉన్న వనరులు దోపిడికి గురవుతున్నాయి ’’- లోత సుబ్బారావు
ఉద్యమాల గెడ్డగా పేరుగాంచిన సబ్‌ప్లాన్‌ ఏజెన్సీ పెదమల్లాపురం ఏరియా గిరిజనులు అస్థిత్వం కోల్పోతున్నారు. తరాలు మారినా తమ తలరాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1957 నుంచి చట్టసభలకు ఎన్నికవుతున్న శాసనసభ్యులకు తమ ఓట్లు వేసినా నేటికీ తమ బతుకులు మారడం లేదు. ఆదునిక సాంకేతిక యుగం వచ్చినప్పటికీ ఈ ప్రాంత గిరిజనుల జీవన సరళీలో మార్పు లేని దుస్థితి. స్వతంత్ర భారతంలో ఆదివా సీలకూ రాజ్యాంగ రక్షణలు, రాజ్యాంగ ఫలాలు అందని ద్రాక్షలుగానే మిగిలాయి. ప్రత్యేకమైన, విశిష్టమైన సంస్కృతి సంప్రదాయాలు కలిగి, ఎంతో విలువైన సహజ వనరులు, ఖనిజసంపదలు ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో జీవిస్తున్న గిరిజనులూ నేడు పరాయికరణకు గురవుతున్నారు. సబ్‌ప్లాన్‌ ఏజెన్సీ ప్రాంతాలు నేడు ఆదివాసులకు తీరని శాపంలా పరిణమించాయి.
తూర్పు గోదావరి జిల్లా సబ్‌ప్లాన్‌ ఏజెన్సీలో నివాసముంటున్న గిరిజనులు దుస్థతి అగమ్యగోచరంగా మారింది. వారి సమస్యలు పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు. జిల్లాలో ఐదు మైదాన ప్రాంతంలో ఉన్న శంఖవరం, రౌతులపూడి, కోటనందూరు, ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండ ల్లాలో 59 గిరిజన గ్రామాలున్నాయి. సుమారుగా 1.18వేల మంది కొండకాపు, కొండరెడ్డి, కోయి, వాల్మికీ భగత వంటి గిరిజన తెగలు నివాసముంటున్నారు. గ్రామాల్లో అనేక సమస్యలతో గిరిజనులు సతమతమౌతున్నారు. ఎలాంటి పనులేక ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందక ప్రతి ఏడాది తీవ్రమైన కరువు ఏర్పడడంతో గిరిజనులు వలస బాట పడుతున్నారు. తరతరాలుగా వివిధ దురాక్రమణదారుల దోపిడికి గురవుతున్నారు. అలాంటి అణగారిన ప్రజలు నేడు తమ అస్థిత్వం, మనుగడ కోసం ఉద్యమిస్తున్నారు. రాజకీయ దళారీలు గిరిజన తండాలను ఆక్రమించి ఇక్కడ నివసించే గిరిజనుల జీవన విధానాలను నిర్వీర్యం చేస్తున్నారు. గిరిజన భూములు దురాక్రామణకు గురవుతూ రియల్‌ ఎస్టేట్‌గా మార్చేస్తున్నారు. స్థానిక గిరిజనులను అడ్డంపెట్టుకొని విలువైన వనరులు దోచుకొంటున్నారు. ప్రశాంతమైన మన్యసీమలో గిరిజనేతరలు, దోపిడీ దారులు పెరిగిపోయి ఆరాచకాలు సృష్టిస్తున్నారు. దళారీ వ్యవస్థ విపరీతంగా పెంచేస్తున్నారు. ప్రస్తుతం సబ్‌ప్లాన్‌ ఏరియాలో గిరిజనప్రజలు స్వేచ్ఛగా జీవించే విధానం కనుమరుగువుతోంది. వందల ఎకరాలున్న గిరిజన భూస్వాములు నేడు భూములు కోల్పోయి బికారులా వలస బాట పట్టే పరిస్థితికి దిగజారుతున్నారు. ఇక్కడ ఉన్న వనరులు దోపిడికి గురవుతున్నాయి. కొండలపై ఉన్న ఆవేల్తి, అనుమర్తి, పెద్దూరు, కిత్తమూరిపేట, ధార మల్లా పురం, జల్దాం వంటి గిరిజన గ్రామాలకు ఇప్పటికీ సరిjైున మౌలిక సదుపాయాలు లేవు. ఆగ్రామాలకు నేటికీ సంపూర్ణమైన వైద్య సదుపాయాలు దక్కలేదు. పౌష్టికాహారం లేక చిన్నపిల్లల్లో రక్తహీనత :
ఎంతో మంది గిరిజన చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు పౌష్టికాహార లోపంతోనే కొట్టిమిట్టులాడుతున్నారు. ఏజెన్సీలో రోడ్లు లేక, బస్సులు రాక గిరిజనులు కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లి బియ్యం తెచ్చుకోవాల్సి వస్తోంది. రేషన్‌ దుకాణాల్లో ఇచ్చేదే చాలీచాలని బియ్యం. ఆదుకాణాల్లో సబ్బులు కొనుక్కుంటేనే బియ్యం ఇస్తారట! ఇదెక్కడి న్యాయం? గిరిజన సహకార సంఘాల్లో పనిచేసే పౌష్టికాహారం లేకచిన్నపిల్లల్లో రక్తహీనత పెరిగిపోతోంది. పెదమల్లాపురం ఆసు పత్రిలో సరిjైున వైద్యం అందడం లేదు. ఆసుపత్రికి అంబులెన్స్‌ లేదు. అత్యవసరం అయితే డోలు మోసుకోవాల్సిన దుస్థితి. వందలామంది చిన్నారులు రక్తహీనతతో ఇబ్బందులు పడుతున్నారు. రోగులు ఆసుపత్రులకు వెళితే అక్కడ వైద్యులు ఉండడం లేదు. ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం మూడేళ్లుగా ఒక్క నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. ఇలాంటి విషమ పరిస్థితుల్లో రోగులు ఎలా బతుకుతారో ప్రభుత్వమే చెప్పాలి. లోతట్టు ప్రాంతాలకు వెళ్లాలంటే కష్టమే… ఐదు మండలంలో కొన్ని లోతట్టు గిరిజన గ్రామాలకు వెళ్లడానికి అసలు రహదారులు లేవు. పోలవరం నుంచి జల్ధాంకు ఏర్పాటు చేసిన రహదారి అస్తవ్యస్థంగా ఉంది. రాఘపట్నం నుంచి మండల కేంద్రమైన రౌతులపూడికి వెళ్లాలంటే రోడ్డుంతా గతుకుల మయంగా మారింది. పెదమల్లారం నుంచి శంఖవరం చేరాలంటే రోడ్డుంతా అస్తవ్యస్థంగా మారింది. దీంతో కనీసం బస్సు ఆర్టీసీ బస్సులు తిరగని పరిస్థితి. మాతయ్యపాలెం నుంచి రాఘపట్నం, సార్లంక చేరాలంటే కాలిమాటే గతి. కనీసం ద్విచక్ర వాహనాలు ఈ దారిలో వెళ్లే పరిస్థితి కన్పించట్లేదు. ఈ గ్రామాలకు రహదారి నిర్మించాలని దశాబ్దలుగా కోరుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. గిరిజన ప్రాంతా లలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తుంది. ఏళ్లు గడుస్తున్న గిరిజన ప్రాంతాల రహదారుల నిర్మాణాలు మాత్రం కలగానే మిగిలింది. ఎన్నోసార్లు రహదారుల కోసం దరఖాస్తులు చేసుకున్నా అవి బుట్ట దాఖలయ్యాయి. గతంలో తమ గ్రామాలు అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎన్నికలు బహిష్కరించడం కూడా జరిగింది. ఐదు మండలాలలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలు ఇంత వరకు పాలకులుగాని, ప్రభుత్వ అధికారులు గాని పట్టించుకోక పోవడంపై ఈ ప్రాంత వాసులు సందిగ్ధ పరిస్థితుల్లో నాయకులను ప్రశ్నంచలేక ఎవరికి ఓటువేయాల లేదా ఓటును బహిష్కరించాల అనే మీమాసంలో ప్రజలల్లో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, పాలకులు తమ సమస్యలపై స్పందించి పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.
దీర్ఘకాలిక సమస్యలు ఇవి :
ె పెదమల్లాపురం కేంద్రంగా ప్రత్యేక గిరిజన మండలం ఏర్పాటు చేయాలి
ె ఉపప్రణాళిక ప్రాంతంలో ఉన్న 59 గిరిజనగ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చాలి
ె జీవో నెంబరు 3ని సవరించి సబ్‌ప్లాన్‌ గిరిజన విద్యార్ధినీ, విద్యార్థులకు న్యాయం చేయాలి.
ె అన్నీ రకాల ఉద్యోగాలు సబ్‌ప్లాన్‌ ప్రాంతంలో స్థానిక గిరిజన విద్యార్థులకు మంజూరు చేయాలి
ె నాన్‌ షెడ్యూల్డ్‌ ప్రాంతంలో ఉన్న 59 గిరిజన గ్రామాలను ఐటీడీఏలో విలీనం చేయాలి. ఐటీడీఏ ద్వారా మంజూరయ్యే సంక్షేమ పథకాలను సబ్‌ప్లాన్‌ ఏరియా ప్రజలకు వర్తింప చేయాలి
ె ఎస్‌.టీ గిరిజన విద్యార్ధినీ, విద్యార్థులకు ఆటంకం లేకుండా ఎస్‌టీ కుల దృవీకరణ పత్రాలు మంజూరు చేయాలి
ె గిరిజన గ్రామాలలో రవాణా సౌకర్యం మెరుగు పరిచి, మెరుగైన వైద్య సదుపాయాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలి.
ె నైపుణ్యమైన విద్యను అందించడానికి జూనియర్‌ కాలేజీ ఏర్పాటు చేయాలి.
ె ప్రతి గిరిజన గ్రామంలోనూ సురక్షతమైన రక్షిత మంచినీటి ట్యాంక్‌ నిర్మించాలి.
ె ఫారెస్టు పోడు భూములకు అర్హులైన గిరిజనులకు పట్టాలిచ్చి హక్కును కల్పించాలి.
ె పెదమల్లాపురం వేళంగి, రాఘపట్నం, బురదకోట, జల్దాం గ్రామ పంచాయితీలో కమ్యూనికేషన్‌ కోసం సెల్‌టవర్లు నిర్మించాలి.

దేశ చరిత్రను తిరగరాస్తున్న జన్యు శాస్త్రం

ఈ భూమి మీద ఆధునిక మాన వుడి కథ సుమారు రెండు లక్షల సంవత్స రాలకు ముందు ప్రారంభమైంది. చీకటి ఖండం అని పిలువబడ్డ ఆఫ్రికాలో తొలి మానవుడు వెలుగు చూశాడు. అక్కడి నుండి ప్రయాణమై ఆఫ్రికా ఖండం బయటికి వచ్చాడు. అక్కడ నియాండర్‌తల్‌ మ్యాన్‌ జాతితో లైంగిక సంపర్కం జరిగింది. సుమారు అరవై వేల ఏళ్ల క్రితం ఆఫ్రికా బయటి ప్రాంతాల నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. మొదట మిడిల్‌ ఈస్ట్‌ చేరుకున్న మానవ సమూహాలు తర్వాత మధ్య ఆసియా ప్రాంతం చేరాయి. క్రమంగా భారత ఉపఖండంలోకి ప్రవేశించాయి. ఒక అంచనా ప్రకారం ఈ మానవ సమూహాలు తొలిసారిగా సుమారు నలభై వేల ఏళ్ల క్రితం భారత భూభాగం చేరాయి. ఇవి రెండు శాఖలుగా విడిపోయాయి. ఉత్తర భారత దేశానికి పరిమితమైన వారు-ఉత్తర భారత పూర్వీకులు అయ్యారు. దక్షిణ భారత దేశానికి పరిమితమైన వారు-దక్షిణ భారత పూర్వీకులు అయ్యారు. దక్షిణ భారతదేశంతో పోలిస్తే ఉత్తర భారత దేశంలో వలసలు ఎక్కువగా జరిగాయి. దక్షిణాన మూడు వైపులా సముద్రం ఉండడం మూలాన అక్కడికి వలసలు తగ్గి ఉండొచ్చు. అందుకే దక్షిణ భారతీయులను మూల వాసులుగా పరిగణించారు. ఈ దేశంలో క్రీ.పూ 1500 నుంచి క్రీ.శ 200 మధ్య కాలంలో మనుస్మృతి కుల వ్యవస్థను ద ృఢ పరిచింది. అంతకు ముందు రెండు వేల మూడు వందల ఏళ్లు మిశ్రమ జనాభా కొనసాగిన తర్వాత, మనుస్మ ృతి ప్రభావంతో కులగోత్రాల ఆధారంగా పెళ్లిళ్లు జరుగుతూ వచ్చాయి. మనుస్మ ృతి ప్రకారం శూద్రులు, క్షత్రియులు అంతా సమానమే. కాని, సామాజికంగా బలవంతులైన క్షత్రియులు బ్రాహ్మణులకు గౌరవ స్థానాలిచ్చి రాజ్యాలేలారు. రాజ్యాలేలిన ఇతర కులాల వారు కూడా చేసిన పని అదే. కొలోనియల్‌ రూలర్స్‌ కూడా దేశంలోని కుల వ్యవస్థను దెబ్బ తీయకుండా తెలివిగా వారి పబ్బం గడుపుకున్నారు. భారతీయ సంప్రదాయ వాదులు చెప్పుకుంటున్నట్టు కులగోత్రాలకు ఆధారాలేవీ లేవు. అవిమధ్యలో కొన్ని సమూహాలు తమ ఆధిపత్యం నిలుపుకోవ డానికి కల్పించి ప్రచారం చేసినవే. వేల వేల ఏళ్లుగా దేశంలో ఒక మిశ్రమ జనాభా కొనసాగుతూ వచ్చిన విషయాన్ని వారు కప్పి పుచ్చారు. మరొక పరిశోధకుల బృందం చెపుతున్న దాని ప్రకారం-భారతేదశంలో మిశ్రమ జనాభా తయారు కావడానికి 65 వేల ఏళ్ళ క్రితమే బీజాలు పడ్డాయి. ఆఫ్రికా మూలాలున్న సమూహాలు కొన్ని ఇతర ప్రాంతాల గుండా భారత్‌లో ప్రవేశించాయి. క్రీ.పూ ఏడు వేల ఏళ్ల క్రితం జగ్రోసియన్‌ హెడ్డర్స్‌ బెలూచిస్థాన్‌ చేరి తొలి భారతీయులతో సంబంధాలు ఏర్పరచు కున్నారు. ఈ రెండూ కలిసి ఒక మిశ్రమ జాతిగా హరప్పా నాగరికతను ఏర్పరిచాయి. ఆ తర్వాత రెండు వేల ఏళ్లకు ఆర్యులు వలస వచ్చారు. అంటే ఇక్కడ జరిగిందేంటి? సంస్క ృతీ నాగరికతలు ఏక మార్గంగా అభివృద్ధి కాలేదు. బహు ముఖాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ఇది వాస్తవం! అందుకే ఈ దేశంలో భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, మత విశ్వాసాలు ఒకదానికొకటి సమాంతరంగా విస్తరిస్తూ వచ్చాయి. ఇదే విషయం సమకాలీనంలో కూడా చూస్తున్నాం. మనమంతా భారతీయులమే అయితే ఎప్పుడో ఒకప్పుడు మన పూర్వీకుల పూర్వీకులు వలస వచ్చినవారే. అంటే మనమంతా వలస వచ్చిన వారికి వారసులమే. మనదంతా మిశ్రమ జనాభానే. ఏమయితేనేం మానవ జాతి అంతా ఒక్కటే. ఇందులో ఎక్కువ తక్కువలు. ఎగుడు దిగుళ్లూ లేవు. పవిత్రులమని, ఉన్నతులమని జబ్బలు చరుచుకునే వారు కూడా ఈ మిశ్రమ జనాభా నుంచి వచ్చినవారే…ఇంగితజ్ఞానం, వివేచన పెరిగినందు వల్లనే మనిషి పనిముట్లు, ఆయుధాలు తయారు చేసుకున్నాడు. దాని వల్లనే విజ్ఞాన శాస్త్రం పెరుగుతూ వచ్చింది. ఫలితంగా మనిషి జంతువుల నుంచి విడివడి పరిణామం చెందుతూ వచ్చాడు. ఏ మత విశ్వాసాల వల్లనో మనిషి మనిషిగా ఎదగలేదు. సైన్సు వల్లనే ఎదిగాడు. ఇప్పుడు మళ్లీ సైన్సు సహాయంతోనే తన గతాన్ని తవ్వి తీస్తున్నాడు. జర్మనీలో దొరికిన రెండు వందల వేల ఏళ్ల నాటి ఒక మానవుడి అస్థిపంజరం పరిశోధనలను ఆకాలానికి తీసుకుపోయి కొత్త సత్యాల్ని వెల్లడిరచింది.
లభించిన పురాతన డిఎన్‌ఎ ప్రకారం తెల్ల చర్మం వారు ఎక్కువని, నల్ల చర్మం వారు తక్కువని విదేశాలలో ఉన్న భావన తప్పు. ఒక కులం వాడు ఎక్కువనీ, మరో కులం వాడు తక్కువనే భారతీయుల భావనా తప్పే. ఓగోత్రం వాడు పవిత్రుడని మరో గోత్రం వాడు అపవిత్రుడని భావించే వారంతా మూరు?లు. కొంత సైన్సు, మరికొంత చరిత్ర తెలుసుకుంటే కళ్లకున్న అహంకారపు పొరలు తొలగి పోతాయి. తమని తాము మోసగించుకుంటూ, ఇతరులను మోసం చేసే వారికి జ్ఞానోదయం కావాలంటే మత గ్రంథాలు పక్కన పెట్టి వివేచనను నిద్ర లేపాలి. హేతుబద్ధంగా ఆలోచించగలిగే సామర్థ్యాన్ని సమకూర్చు కోవాలి. పరిణతి చెందని వారంతా పరిణామ దశలోని తొలి మానవుడి దశలో వున్నారన్నమాట! ఆకారాలు మారాయి కాని, వారి మెదళ్లు ఇంకా మూడు వేల ఏళ్ల కిందటి భావజాలంతోనే ఉన్నాయన్నది నిజం. బలవంతుడు నిర్బలుడికి సహాయపడ్డట్టు- మేధోపరంగా ఎదిగిన వారు, ఎదగని వారికి చెపుతూనే ఉండాలి. అందుకే సమాజంలో హేతుబద్ధంగా ఆలోచించే వారిపై ఎక్కువ బాధ్యత ఉంది. ఆలోచన లేనివాడు ఎలాగూ మూర?ంగా ప్రవర్తిస్తూ ఉంటాడన్నది తెలిసిన విషయమే. ఒకప్పుడు ఆర్కియాలజీ శాఖ వారి తవ్వకాల్లో బయటపడ్డ ఆధారాలతో చరిత్రకారులు చరిత్ర రాశారు. దానికి ఇప్పుడు ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం తోడయ్యింది. ఊహలకు, భావనలకు పరిమితం కాకుండా జన్యు శాస్త్రంతో మానవ పరిణామ చరిత్ర మరింత స్పష్టమౌతూ వుంది. దాంతో నేటి భారతీయ సంప్రదాయవాదులకు గుండెలు ఆగిపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఈ భారత ఖండంలోని గొప్ప సంస్కృతిలోని భాగంగా సంస్క ృత భాషని మన వాళ్లు నెత్తికెత్తుకొని ఊరేగారు. నిజానికి ఆ భాషకు మూలాలు మొదట సిరియాలో బయట పడ్డాయి. పురాతత్వ పరిశోధకులు, జీవ శాస్త్రవేత్తలు చేస్తున్న పని ఏమిటంటే-వారు ప్రస్తుతంలో నిలబడి గతంలోకి మెట్టు దిగుతున్నారు. పురాతన మానవ అస్థి పంజరాల నుంచి డిఎన్‌ఎ సేకరించి మరింత కచ్చితమైన సమాచారం అందిస్తున్నారు. నేటి పాకిస్తాన్‌ ప్రాంతంలో జరిపిన తవ్వకాల వల్ల ఐదు వేల ఏళ్ల నాటి నాగరికత బయటపడిరది. అలాగే ఉత్తర భారతం నుంచి దక్షిణాన మహారాష్ట్ర వరకు ఇండస్‌ వ్యాలీకి సంబంధించిన సమాచారం లభించింది. ఈ ప్రాంతమంతా వ్యాపించిన వారు హరప్పన్లు. నేడు మన హిందూ సంప్రదాయవాదులు వాదిస్తున్నట్టుగా వీరికీ వేద సంస్క ృతికీ సంబంధమే లేదు. ఆర్యులు ఎక్కడి నుంచో వలస రాలేదని, మొదటి నుంచీ వారు ఈ పావన భారతావని లోనే విరాజిల్లారని, వేదాలు ఇక్కడే ఉద్భవించాయని చెప్పే వాదనలను పరిశోధనలు ఏమాత్రం బలపరచలేదు. హార్యానాలోని రాఖిగర్హి తవ్వకాలలో లభించిన పురాతన డిఎన్‌ఎ, ఇండస్‌ వ్యాలీ గూర్చి స్పష్టమైన సమాచార మిచ్చింది. ఆర్యులు వలస రావడం నిజమేనని ధృవపర్చింది. పైగా దక్షిణాసియా మూల వాసులు-ఇరాన్‌ దేశపు వ్యవసాయదారుల కలయిక వల్లే హరప్పన్లు ఏర్పడ్డారని తెలిసింది. అంటే, వేల వేల ఏళ్ల క్రితమే మిశ్రమ మానవ జాతి ఏర్పడిరది. ఇంక పవిత్రులు, శుద్ధమైన వారు, సంకరజాతి లాంటి పదాలకు అర్థమే లేదు కదా! మిశ్రమ జాతి నిజమైనప్పుడు మధ్య ఏర్పరుచుకున్న కుల, గోత్రాలకు విలువ వుంటుందా? జాత్యహంకారానికి అర్థం ఉంటుందా? జీవశాస్త్ర ప్రకారం ప్రాణుల మధ్య లైంగిక సంపర్కం జరుగుతూ ఉందంటే అవి ఒకే జాతికి చెందిన ప్రాణులని అర్థం ఈ అత్యాధునిక కాలంలో కూడా అదే చూస్తున్నాం. కులాంతర, మతాంతర వివాహాలే కాదు, వివిధ దేశాల, వివిధ జాతుల ప్రజల మధ్య కూడా చూస్తున్నాం. అంటే మానవ జాతి అంతా ఒక్కటే అని అర్థం. – డా.దేవరాజు మహారాజు

ఓటరు అనే నేను

శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని, దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడడానికి.. ఒక ఓటరుగా, నా కర్తవ్యమైన ఓటును శ్రద్ధతో, అంత:కరణ శుద్ధితో భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా నోటుకు, మద్యానికి, కులానికి, మతానికి, సంక్షేమ పథకాల ఎరకు కూడా లొంగకుండా వివేచనా, విచక్షణా జ్ఞానంతో రాజ్యాంగం నాకు కల్పించిన అత్యద్భుతమైన అవకాశం అయినటువంటి ఓటు హక్కును వినియోగించుకుంటానని మన భారత రాజ్యాంగం మీద త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను.
ఓసాఫ్ట్‌వేర్‌ ఉద్యోగితో ఇటీవల జరిగిన సంభాషణ. ఆమె పేరు కవిత.
‘నీకు ఇక్కడే ఓటుందిగా?’ ‘లేదు మేడం.. ఓటు నమోదే చేయించుకోలేదు. ఇంతవరకూ నేను ఓటే వేయలేదు. అయినా, మనం వేయకపోతే- పోయేది ఏముంది? ఎవరొకరు గెలుస్తారు. ఎవరు గెలిచినా ఏం ఒరుగుతుంది కనుకా.. ‘అంది నిర్లిప్తంగా…ఇలా ఒక్క కవిత మాత్రమే కాదుబీ ఇంకా చాలామంది అలాంటి ఆలోచనలతో, ఉదాసీనతతో ఉన్నవారు మనచుట్టూ చాలా మందే ఉన్నారు. ఓటు మన బాధ్యత కదా! కానీ ఈ నిర్లిప్తత ఎందుకు వస్తుంది? నిజమే ఒక్కసారి ఆలోచిస్తే ఈదేశ పౌరులుగా మనం చేస్తుంది నిజంగా బాధ్యతా రాహిత్యమే. ఓటు వేయకపోతే శిక్షలు వేస్తారన్న భయంకాదు కానీ..రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవాలన్న స్పృహ లేకపోవడం నిజంగానే క్షమించరాని నేరం.
నా చిన్నప్పుడు నేను చదువుకోవడానికి ప్రభుత్వ విద్య అందుబాటులో ఉండేది. ఊరందరం ఒకే స్కూల్లో చదివేవాళ్లం. ఇప్పుడు నా పిల్లల్ని చదివించాలంటే కార్పొరేట్‌ స్కూళ్ల వైపు చూడాల్సి వస్తోంది. ప్రభుత్వ విద్య చాలాకాలంగా నిర్వీర్యం చేయబడిరది. ప్రయివేటు విద్యాసంస్థల్లో చదివించాలంటే- చాలా డబ్బులు పోయాలి. ఈ విద్యావిధానం ఇలా మారడానికి కారణం ఎవరు? ప్రభుత్వమే అన్నది సమాధానం.. కానీ ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకొనేది.. ఎన్నుకుంది మనమే కదా?! అంటే మన విద్యావిధానం ఇలా తయారుచేసే పాలకులను ఎన్నుకోవడం నాఓటుతోనే. దాన్ని మార్చాలన్నా నాఓటుతోనే సాధ్యం. అసలు ఓటు వేయకపోయినా మనలాంటివారి ఓట్లు పడక ప్రజానాయకులు ఓడిపోతు న్నారేమో? ఒక్కసారి ఆలోచించండి. ఆఓటు వేసే చైతన్యమే మనకు రావాలి. అందుకే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందే. తొలిసారి ఓటు హక్కు పొందినవాళ్లకు ఓ సదవకాశంగా భావించాలి. భావి భారత పౌరులుగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. మన పాలకులు ఎవరో నేనే నిర్ణయించగలనన్న మాట.. ఇలా అనుకుంటుంటేనే నాకెంతో శక్తి ఉందనిపిస్తోంది.
గ్రామీణ పరిస్థితులు..
మా తాతయ్యను చిన్నప్పటి నుంచీ చూస్తున్నా. కౌలుకు తీసుకునే.. వ్యవసాయం చేస్తున్నాడు. ఏడాదంతా కష్టపడతాడు గానీ, అప్పు తప్ప ఇంట్లోకి ఉప్పూ తేలేని పరిస్థితి. రుణమాఫీ అవుతుందని ఎన్నికల కోసం ఎదురుచూడటం అలవాటైపోతుంది. కానీ, ఈ కష్టాలన్నింటికీ.. ఈ వ్యవసాయ విధానం ఇలా కావడానికి ప్రభుత్వానిదేగా బాధ్యత. ఒక్కసారి కూడా దీన్ని ఆలోచించకపోవడం వల్లే..మన భవిష్యత్తును బాగుపరిచే వారికన్నా..తాత్కాలిక ప్రలోభాలకు, వాళ్ల మాయ మాట లకు లోనయ్యి, ఓమందు బాటిల్‌, రెండు పచ్చ నోట్లకు ఆశపడి కొందరు ఓట్లేసేస్తున్నారు. దాంతో మళ్లీ మన కష్టాలు అవే..వారి స్వార్థాలు వారివే…అందుకే మన ఓటుకున్న పవరేంటో చూపిద్దాం. ఆ పవర్‌తో పవర్‌లోకి ప్రజాపక్షం వహించేవారిని తీసుకొద్దాం.
దేశ సార్వభౌమత్వం..?
అంతెందుకు నేను ఇప్పుడు ఇంత చదువుకున్నా నా ఉద్యోగమేంటో.. నా సంపాదనేంటో..నేను ఏదేశం వెళ్లాలా? అందుకు డబ్బులెలా సంపాదించాలా? అక్కడికెళ్లి ఎంత సంపాదించాలా? అదీ కాకపోతే ఏకార్పొరేట్‌ కంపెనీలో ఉద్యోగం సంపాదించాలో అన్నదే నాలాంటి వాళ్ల ఆలోచనగా ఉంది. అంతేకానీ, మన బతుకుల్ని, భవిష్యత్తునూ నిర్ణయించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్న స్పృహ ఉండటం లేదు. అసలు ఓటు నమోదు చేసుకోవాలన్న విజ్ఞత ఉండటం లేదు. నాకు ఓటుందా? నేను ఓటేసే రోజుకు కచ్చితంగా వచ్చి, నా హక్కు నేను కాపాడుకోవాలనే ధ్యాస అసలే ఉండదు. పైగా ఆరోజు ప్రభుత్వం సెలవిస్తే దాన్నీ ఎలా ఎంజారు చేద్దామా? ఓటీ చేసి మరింత సంపాదిద్దామా? అనే ఆలోచిస్తున్నాం. విదేశాలకు వెళ్లేటప్పుడు, అక్కడుండాల్సిన పరిస్థితిలో ఎదురయ్యే ఇబ్బందులకు ప్రభుత్వాలు అనుసరించే విధానాలేనన్నది విస్మరించేస్తున్నాం. ఈరోజు అభివృద్ధి చెందిన దేశాలతో దేశభ విష్యత్తు ను తాకట్టు పెట్టే విధంగా మన విదేశాంగ విధానాలున్నాయి. ప్రపం చంలో విశ్వమానవాళి అభిలషించే పక్షం కాకుండా వేరొకవైపు మొగ్గి ఉన్నామన్నది విస్పష్టం. ఈపరిస్థితికి కారణం మనం ఎన్నుకున్న పాలకుల విధానాలే కారణం. మనం ఇంత చదువుకున్న నాకు ఈ దేశ పౌరునిగా బాధ్యత లేదా? అని నన్ను నేను ఒక్కసారి ప్రశ్నించు కోవాలి. ఈపరిస్థితి మారాలంటే నా ఓటేగా కీలకం. అలాంటి పరిస్థితి ఏర్పడడానికీ నా నిర్లక్ష్యమేగా కారణం. అందుకే నేను ఓటు వేయాలి.
యుద్ధం..కారణం.. : అంతెందుకు ఈ రోజు దేశంలో యుద్ధ వాతావ రణాన్నీ రాజకీయా లకు ఉపయోగించుకునే కుత్సితమైన విధానాలు అనుసరిస్తున్నది చూస్తూనే ఉన్నాం. రాజకీయ ప్రయోజనాల కోసం యుద్ధం వచ్చే పరిస్థితికి సృష్టికర్తలు ఎవరు? కాశ్మీర్‌ సమస్య అలాగే నేటికీ ఉండిపోవ డానికి కారణం ఎవరు? అక్కడి పౌరులపై సైనిక నిర్బంధాల్ని ప్రయోగి స్తూ పిట్టల్లా ప్రాణాలు తీసేస్తున్నారు. అందుకు కారణం ఎవరు? ఈ అత్యవసర పరిస్థితుల్లో కొంతమంది యువత ఉగ్రవాదులుగా తయారు కావడానికి కారకులెవరు? ఇవన్నీ మనం ఎప్పుడైనా ప్రశ్నించు కున్నా మా? ప్రశ్నించామా? ప్రశ్నించుకుంటే.. ఇవన్నీ మారాలంటే ఓటునే ఆయుధంగా చేసుకుంటాం. మన నిర్లిప్తతవల్ల అంతమంది సైనికు లను, పౌరులను బలితీసుకున్నాం. వేడినెత్తురు ప్రవాహం నీకు తగిలే వరకూ నీలోచలనం లేకపోవడానికి బాధ్యత నీదేగా? అని ఇప్పుడు అనిపిస్తుంది. మనదేశ రక్షణకు, సమగ్రతకు మన బాధ్యత ఎంతైనా ఉంది. అందుకు ఉపయోగించాల్సిన అత్యంత శక్తివంతమైన వెపెన్‌ ఓటే! అలాంటి ఓటును ఏదో యథాలాపంగా.. ఏమాత్రం ఆలోచించ కుండా కొంతమొత్తానికి అమ్ముకోవద్దు.. మత్తులో తూగిపోవద్దు.. కుల, మతాల తూకంలో చేరిపోవద్దు. కొన్ని బహుమతులకూ ఆశప డొద్దు. నాలాంటి నిర్లక్ష్యం నిండుగా ఉండేవాళ్లు ఇప్పటికైనా దాన్ని వదిలి చైతన్యంతో ఓటేటస్తే సరి.
వ్యాపారం.. రాజకీయం..: పదవీ వ్యామోహాలతో..రాజకీయ వ్యా పారం జరుగుతున్న పరిస్థితులు నేడు గల్లీ నుంచి ఢల్లీి వరకూ జరుగు తున్నవే. అందుకోసం అవినీతితో అంటకాగడానికి ఏమాత్రం వెను కాడడం లేదు. ఈపరిస్థితి ఎందుకు వచ్చింది? మన చుట్టూనే మనల్ని సర్వనాశనం చేస్తున్న పరిస్థితులు రోజురోజుకు చుట్టుముడుతున్నా.. మనం పట్టించుకోని స్థితిలో ఎందుకున్నాం? ఈరోజు మన రాష్ట్ర రాజకీయాల్లోనేంటీ, దేశ రాజకీ యాల్లోనేంటీ కుటుంబ పాలనలు.. రాష్ట్రాలు, దేశాలు వాళ్ల సొంత ఆస్తులన్నట్లు వ్యవహరిస్తున్నారు. రాజకీయాలను అడ్డంపెట్టుకుని వారి వాణిజ్యాలను విదేశాలకూ విస్తరిస్తున్నారు. అనేక నేరాలకు పాల్పడు తున్నారు. ఒక్క శాతం వద్దే దేశంలోని పెద్దమొత్తంలో డబ్బంతా పోగుబడి ఉంది. కానీ 99శాతం మంది పౌరులు పడరాని కష్టాలు పడుతున్నారు. తినటానికి తిండి లేక, ఉండటానికి గూడులేక, వేసుకోవ డానికి బట్ట లేక. ఆకలితో చచ్చిపోతున్నారు. అప్పులతో ఆత్మహత్యలు చేసుకునే రైతన్నలు. మహిళలపై భ్రూణ హత్యలు, అత్యాచారాలు.. హత్యలు.. అఘాయి త్యాలు నిత్యకృత్యమై ఎందరో బలైపోతున్నారు. వరకట్న హత్యలకైతే లెక్కే లేదు. నిరుద్యోగసైన్యం పెరిగిపోయి, నిరాశ, నిస్పృహలతో బలవన్మరణాలకు పాల్పడడం.. పెడదారులు పట్టడం.. ఉగ్రవాదులు గా తయారుకావడం.. ఇవన్నీ మనమందరం చూస్తున్న నడుస్తున్న చరిత్ర. కానీ,నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరి స్తున్నాం. మనపాటికి మనం మూవీలూ, టీవీలూ చూస్తూ..అదీ కాకపోతే పోర్నోగ్రఫీల్లో ఓలలాడుతూ ఈ ప్రపంచానికి దూరంగా మనల్ని మనం నాశనం చేసుకుంటున్నాం. నాకిప్పుడు అనిపిస్తుంది నా ఓటుతోనే వీటన్నింటి మార్చే అవకాశం ఉందని. అది చేయకపోవడమే ఇన్ని అనర్థాలకు కారణమని. ఈదుస్థితికి నావంతు బాధ్యత నేను వహించాల్సిందే. నాజీవన ఆరాటంలో నేను ఓసరైన గమ్యంలో అయి నా ఉన్నానా అంటే అదీ లేదు. ఈ అగమ్య పరిస్థితులు ఒకవైపు ఉంటే.. మరోవైపు నాతర్వాత తరానికి మరింత దారుణమైన పరిస్థితు లు కల్పిస్తున్నాన్న విషయాన్ని విస్మరిస్తున్నా. ఇప్పటికైనా మనం మేలుకోవాలి.అంతా మేలుకోవాలి.. మన కర్తవ్యం ఓటు వేయడమే. ఓటు అనే ఆయుధంతో మన భవితను, దేశ భవితను సమూలంగా మార్చుకోగల ఓమంచి అవకాశం కోల్పోవద్దు.– శాంతిశ్రీ

ప్రజాస్వామ్యంల ఓటే ఆయుధం

‘‘ ఓ ఓటర్‌ మహాశయా
ఒక్క నిమిషం ఆలోచించండి..
ఓటును కులం, మతం,
పార్టీ ప్రతిపాదికన వేయడం ఆపేయండి
కులం..కేవలం గుర్తింపు మాత్రమే
అభివృద్ధికి మాత్రం కాదూ..
పార్టీ ఎదయినా అభివృద్ధి చేయగల
అభ్యర్ధికే నీ ఓటు వేయండి..!’- గునపర్తి సైమన్‌
‘‘ మంచి పాలకులను ఎంచుకునే హక్కు ప్రజల చేతుల్లోనే ఉంటుంది. కేవలం ఓటు అనే వజ్రాయుధంతోనే అదిసాధ్యం. ప్రజాస్వామ్యం మనకిచ్చిన హక్కు ఓటు. అందరూ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే దానికి సార్థకత ఉంటుంది. అందుకే ఎవరూ ఓటు అనే విలువైన ఆయుధాన్ని నోటుకు అమ్ముకోవద్దు. మనం వేసే ఓటుతోనే నవసమాజ నిర్మాణం సాధ్యమవుతుంది’’
డబ్బుకు, ఇతర ప్రలోభాలకు లోబడి ఓటు వేయడం చట్ట విరుద్ధం. రాజకీయ ప్రజాస్వామ్యం పరిఢ విల్లాలంటే సాంఘిక,ఆర్థిక,సమానత్వాన్ని సాధించాలి. ఐదేళ్లకు ఒక్కసారివచ్చినా, మన జీవితాలను, తల రాతను మార్చేది ఎన్నికలు. మనం వేసే ఓటుతోనే నవసమాజం నిర్మితమౌతుంది. అందుకను గుణంగా ఓటు ఆవశ్యకత, ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటుకున్న పాత్రగురించి యువ ఓటర్లను చైతన్యం చేయాలి. ప్రజాస్వామ్యదేశమైన మనదేశంలో ప్రజలే పరిపాలకులు. మనం వేసే ఓటే మన భవిష్యత్తు, రాబోయే తరాల మనుగడ నిర్ణయిస్తాయి. కానీ మన దేశంలో ఎన్నికల పరిస్థితి దారుణంగా ఉంది. ఎన్నికలసమయంలో దేశం మొత్తంలో 60శాతం పోలింగ్‌ కూడా నమోదు కావడం లేదు. 125కోట్లజనాభా కలిగిన మన దేశంలో సుమారు 100కోట్ల మందిఓటర్లు వుంటే, కేవలం50కోట్లలోపు ఓటర్లు మాత్రమే ఓటు హక్కు వినియోగిం చుకుంటున్నారు. మన దేశపరిస్థితి ఇలా వుంటే, ఇతర దేశాల్లో మాత్రంఓటు వేయడం తప్పనిసరి. ఒకవేళ ఓటువేయకుండా వుంటే ఎన్నికల సంఘం నుంచి జరిమానా పత్రం ఇంటికి వెళుతుంది. అంతేకాదు చట్టబద్దమైన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ మనదేశంలో అనేక మంది ఓటింగ్‌ రోజును కేవలం సెలవు దినంగా మాత్రమే చూస్తారు. ఓటుప్రాముఖ్యతను ఎంతమంది ఎన్నిరకాలుగా చెప్పినా పట్టించుకునే వారు చాలా అరుదు. అందుకే ఇతర దేశాల మాదిరి మన దేశంలో కూడా ఓటుహక్కుపై కఠిన నియమాలు పెట్టవచ్చు. కచ్చితంగా ఓటుహక్కు వినియోగించు కొనేలా ప్రతిపౌరున్ని మేల్కొల్పాలి. ఎన్నికల కమిషన్‌, ప్రభుత్వ పెద్దలు ఈబాధ్యతను నిర్వర్తించాలి. అపుడే మనదేశంలో ప్రజాస్వామ్యం విజయవంతమవుతుంది.
యువతా మేలుకో.. ఓటు విలువ తెలుసుకో : ఏప్రజాస్వామ్య దేశంలోనైనా ప్రజలే నిర్ణేతలు. వారి మనోభావాలను ప్రకటించేందుకు ప్రజల చేతిలో ఉన్న ఏకైక పదునైనఆయుధం ఓటు. రాజకీయ పార్టీల జాతకాలు మార్చాలన్నా.. భ్రష్టుపట్టిన వ్యవస్థకు చరమగీతం పాడాలన్నా వజ్రాయుధం ఇదే. ప్రజలగళం వినిపిం చాలన్నా, ప్రజాస్వామ్య వ్యవస్థ పదిలంగా ఉండాలన్నా ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదై, ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటుకు నేతల రాతనే కాదు..దేశ తలరాతనే మార్చే సత్తా ఉంది. ఓటు హక్కుపై అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఏటా జనవరి 25న ‘జాతీయ ఓటరు దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థలు, చట్టసభలకు ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలంతా ఓటువేయడానికి వెళ్లేలా ఆ రోజున సెలవు దినంగానూ ప్రకటిస్తున్నారు. అయినప్పటికీ ఎవరూఓటు వేసేం దుకు ముందుకు రావడం లేదు. ముఖ్యంగా పల్లెల కంటే పట్టణాల్లో ఓటు శాతం తక్కువగా ఉంటోంది. ప్రతిఒక్కరినీ ఓటరుగా నమోదు చేసేందుకు జిల్లా యంత్రాంగం తీవ్ర కసరత్తులు చేస్తోంది. ముఖ్యంగా గత నెల రోజుల కాలంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది.
యువతలో చైతన్యం వస్తేనే..: ఒక ఓటు దేశ గమనాన్నే మారుస్తుంది. యువతలో చైత న్యం వచ్చి..ఓటు హక్కును సమర్థంగా వినియోగించుకున్న నాడే దేశాభివృద్ధి సాధ్యం. అయితే, జిల్లాలో యువ ఓటర్ల నమోదు ప్రతిసారీ అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. నమోదు పెంచడానికి జిల్లా అధికార యంత్రాంగం ఏటా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది.18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటు హక్కు పొందేలా కార్యక్రమాలు చేపట్టారు. పరిపాలన సజావుగా సాగాలన్నా, సరైన నేతలకు పగ్గాలు ఇవ్వాలన్నా అది ఓటు ద్వారానే సాధ్యమన్న సత్యాన్ని ఓటరు దినోత్సవం నాడైనా అందరూ మననం చేసుకోవాలి. ముఖ్యంగా యువత మేలుకొని ఓటు హక్కు నమోదుకు ముందుకు రావాలని జిల్లా అధికార యంత్రాంగం కోరుతోంది.
ఒక్క ఓటుతో కూలిన ప్రభుత్వాలు : ఎన్నికల్లో అనేక మంది అభ్యర్థులు ఒక్క ఓటుతో ఓడిపోయిన సంద ర్భాలు ఉన్నాయి. పలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వాస పరీక్షలో ఒక్క ఓటుతో ఓడిపోయిన అరుదైన సంఘటనలు చరిత్రలో లేకపో లేదు. గత 2008లో రాజస్థాన్‌ శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేసులో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి సీపీ జోషీకి 62,215 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కళ్యాణ్‌ సింగ్‌కి 62,216 ఓట్లు వచ్చాయి. అయితే, కొందరు టెండర్‌ ఓటు వేశారని కోర్టు దాకా వెళ్లడంతో తిరిగి లెక్కించగా ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో డ్రా తీయడంతో బీజేపీ అభ్యర్థి కళ్యాణ్‌ సింగ్‌ను గెలుపు వరించింది. అదేవిధంగా 2004లో కర్నాటకలోని సంతేమరహళ్ళి స్థానంలో జరిగిన ఎన్నికల్లో జేడీఎస్‌ అభ్యర్థి కృష్ణమూర్తికి 40,751 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి ఆర్‌.ధృవ్‌నారాయణ్‌కు 40,752 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటుతో కృష్ణమూర్తి ఓటమిపాలయ్యారు. అందుకే ఒక్క ఓటు కూడా ఎంతో విలువైనదేనని రాజ్యంగ నిపుణులు అంటున్నారు.
ఓటు కథలో ఎన్ని మలుపులో….:సార్వత్రిక ఎన్నికల వేళ ఇందుగలదని… అందులేదని, సందేహంబు వలదన్నట్లు ఎక్కడ చూసినా, ఏది విన్నా…అక్కడ ఓటు చర్చే సాగుతోంది. రాజకీయం చేసేవారిలోనే కాదు..ప్రజల నోళ్లలోనూ నానుతోంది ఓటే. అసలీ ఓటు కథేంటో తెలుసా? ఓటు వేయడమనేది ఆంగ్లేయుల పాలనా కాలంలోనే మొదలైనా 1988 నాటికి అది ఓ రూపాన్ని సంతరించుకుంది. మన దేశంలో బ్రిటిష్‌ వారి పాలనలో భారతీయులకు పరిమితంగానే కల్పించిన ఓటుహక్కును భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాకే పౌరులందరికీ సార్వత్రిక వయోజన ఓటు హక్కు సాకారమైంది.
ా 1907లో ఏర్పడిన రాయల్‌ కమిషన్‌ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఓటుహక్కుపై చేసిన సిఫార్సుల ఆధారంగా 1909 కౌన్సిల్‌ చట్టం పరిమిత ప్రాతిపదికన భారతీయులకు ఓటు హక్కు వచ్చింది.
ా 1919 కౌన్సిల్‌ చట్టం ఓటు హక్కును కొంత మేర విస్తృత పరిచింది.
ా 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఓటుహక్కు దేశ జనాభాలో 10.5 శాతానికి పెరిగింది.
ా 1947లో రాజ్యాంగ పరిషత్తు ఎన్నికల సందర్భంగా దీనిని 28.5 శాతానికి పెంచారు.
ా స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానానికి కట్టుబడి, రాజ్యాంగం ప్రకారం భారత పౌరులకు సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించారు.
ా ప్రజాస్వామ్యంలో సమానత్వ సూత్రాన్ని అనుసరించి ఒకవ్యక్తికి ఒక ఓటును మాత్రమే కల్పించారు.
ా ఆర్టికల్‌ 325 ప్రకారం కుల,మత,వర్గ,వర్ణ,జాతి,ప్రాంత, లింగ భేదాలు వంటి తేడాలతో ఏవ్యక్తికీ ఓటు హక్కును నిరాకరించ కూడదు.
ా 1952లో సాధారణ ఎన్నికల సందర్భంగా అధికరణ 326 కింద సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించింది. 21 ఏళ్లు పైబడిన వారందరూ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.
ా 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ఓటు హక్కు వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించింది.
విలువ చాలా తక్కువ మందికి తెలుసు. : ఓటు అనే రెండక్షరాలకు ప్రపంచ గతిని మార్చే శక్తి ఉంది. ఓటు వ్యక్తి అస్తిత్వాన్ని గుర్తిస్తుంది, వ్యవస్థ మార్పుకు నాంది పలుకుతుంది. ఉన్నత విలువలతో కూడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన రాజకీయ నేతలే నేరస్తులైతే నేరమయ భారతం నిర్మితమౌతుంది. దీన్ని అడ్డుకొనే సంస్కరణలు తీసుకు రావడానికి 1975లో తార్కుండే కమిటి, 1998లో ఇంద్రజిత్‌ గుప్తా కమిటీలను కేంద్రం ఏర్పాటుచేసింది. ఈ కమిటీలు అనేక ఉన్నతమైన సంస్కరణలు ప్రతిపాదించాయి. అందులో భాగంగానే 1971 నుండి ఎన్నికల కోడ్‌ ఆప్‌ కండక్ట్‌ అమలవుతోంది. లోక్‌సభ ఎన్నికల ఖర్చు 25లక్షలు, అసెంబ్లీ ఎన్నికల ఖర్చు10 లక్షలు దాటకూడదని 2004లో నిబంధనలు విధించిన ప్పటికీ అభ్యర్థులు మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తున్నారు. అభ్యర్థి నేరస్తుడైనా కోట్ల రూపాయల డబ్బు ఉంటే చాలు ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చి ప్రతి పార్టీ ప్రోత్సహిస్తోంది. సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా పాలకుల మితిమీరిన జ్యోక్యంతో సత్ఫలితాలు రావడం లేదు. మంచినాయకత్వం లేకుండా మంచి సమాజం ఏర్పడదు. వయోజనులైన ప్రతి వ్యక్తికీ ఎలాంటి భేదభావాలు లేకుండా ఓటుహక్కును కల్పిం చింది మన రాజ్యాంగం. రాజకీయ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే సాంఘిక, ఆర్థిక, సమానత్వాన్ని సాధించాలని, రాజ్యాంగం యొక్క లక్ష్యం కూడా అదేనని, రాజకీయ ప్రజాస్వామ్యం సామాన్యులకు అందకపోతే బాధితులు ఈ రాజ్యాంగ వ్యవస్థను కూల్చేస్తారని నవంబర్‌ 26, 1949న భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్‌కు సమర్పిస్తూ అంబే డ్కర్‌ హెచ్చరించారు.
ఓటుకూ ఓ లెకుంది…: ఎన్నికల పండగలో ఓటే కీలకం. తమను పాలించే ప్రజాప్రతినిధుల్ని ఎంపిక చేసుకునే అధికారం పౌరులకు దక్కేది దీనితోనే. అయితే సాధారణంగా మనం ఓటు ఒకటే అనుకుంటాం. కానీ ఓటుల్లోనూ రకాలున్నాయని.. ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉందని చాలామందికి తెలియదు. ఈ ఏడాది కొత్తగా ప్రవాస భారతీయులకు కూడా ఓటు హక్కు పొందే అవకాశం కల్పించారు.
ఎన్నారై ఓటు : ప్రవాస భారతీయులకు తొలిసారిగా ఈ ఏడాది జరగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో చదువు, ఉద్యోగం,ఉపాధితో పాటు బంధువుల ఇళ్లకు తాత్కాలికంగా వెళ్లి, ఎన్నికలప్పుడు రాలేని వారి ఈకోసం ఈ అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఫారం-6ఎ ద్వారా ఎన్నారైలు దరఖాస్తు చేసుకుని, తగిన ఆధారాలు చూపించి, ఓటును పొందవచ్ఛు వారి ఆసక్తి మేరకు విదేశాల నుంచి వచ్చి తమ ప్రాంత ప్రజాప్రతినిధిని ఎన్నుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది.
సర్వీసు ఓటు : దేశరక్షణ సంబంధ శాఖల్లో పనిచేసే వారికి ఈఓటు హక్కు ఉంటుంది. ఎన్నికల సమయంలో వారు ఇక్కడకు రాలేరు. అలాంటి వారి ఓటు కూడా కీలకంగా భావించి, ఓటు హక్కును కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు కల్పిస్తు న్నాయి. తపాలాశాఖ, తమ ప్రతినిధి ద్వారా ఈఓటును పంపవచ్ఛు లేని పక్షంలో సరిహద్దుల్లో ఉండే సైని కులు ఎలక్ట్రానిక్‌ టాన్స్‌ఫర్‌బుల్‌ ఓటును ఆన్‌లైన్‌ ద్వారా కూడా వినియోగించుకోవచ్ఛు.
పోస్టల్‌ బ్యాలెట్‌ : ఎన్నికల సమయంలో ఎన్నికల విధులను ప్రభుత్వ ఉద్యోగులే నిర్వహి స్తారు. వీరు కూడా ఓటర్లే కావటంతో తమ ప్రజాప్రతినిధులను ఎంపిక చేసుకోవటంలో వీరు కూడాభాగస్వాములే కాబట్టి వీరికి పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యంఉంది. ఎన్నికల షెడ్యూలు వెలువడిన తర్వాత అందరికంటే ముందు ఓటు హక్కును తపాలాశాఖ ద్వారా పంపవచ్ఛు ఉద్యోగులు తమకు ఓటు ఉన్నచోట అభ్యర్థులకు ఓటు వేసి తిరిగి పోస్టు ద్వారా ఎన్నికల అధికారి చిరునామాకు పంపుతారు. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ ఇస్తున్న సమయంలోనే వీరు తమ ఓటు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా అధికారులకు పంపిస్తారు. ఓట్ల లెక్కింపు అయ్యాక వీటిని లెక్కిస్తారు. కొన్ని సందర్భాల్లో పోస్టల్‌ ఓట్లే కీలకంగా మారుతాయి.’
టెండర్‌ ఓటు : ఓటర్ల జాబితాలో పేరు ఉండి, పోలింగ్‌ బూత్‌లోకి తమ ఓటును వినియోగించుకునేందుకు వెళ్లే సరికి అప్పటికే ఆవ్యక్తి ఓటు హక్కు వినియోగించుకున్నట్లు చూస్తూ ఉంటాం. అనేక సందర్భాల్లో ఈ తరహాలో ఓటర్లు నిరుత్సాహం చెందుతారు. అలాంటి సందర్భాల్లో తాను ఓటు హక్కును వినియోగించుకోలేదని ఎన్నికల అధికారికి నిరూపించి పొందేదే టెండర్‌ ఓటు. ఎన్నికల అధికారి అనుమతితో టెండర్‌ ఓటును వేయవచ్ఛు బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా ఈ తరహా ఓట్లు వేసుకునే అవకాశం కల్పిస్తారు.
సాధారణ ఓటు… : 18 సంవత్సరాలు దాటిన ప్రతీ భారతీయ పౌరుడు అన్ని రకాల ఎన్నికల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించేదే సాధారణ ఓటు. ఫారం-6 నింపి,18 సంవత్సరాలు దాటినట్లుగా, స్థానికంగా నివాసం ఉంటున్నట్లుగా ఆధారాలు చూపిస్తే ఓటు హక్కు కల్పిస్తారు. ఏటా ఓటర్ల నమోదు, ఓటర్ల ముసాయిదా ప్రచురణ జరుగుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు 18 సంవత్సరాలు దాటిన వారంతా ఓటు హక్కు పొందవచ్ఛు మన దేశంలో ఈఓటర్లే కీలకం. బయటి వ్యక్తులువచ్చి ఓటు వేస్తున్నారని పోలింగ్‌ కేంద్రంవద్ద ఎన్నికల ఏజెంట్‌ కానీ, అక్కడి ఓటర్లు కానీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన సందర్భాల్లో ఈఓటు ప్రస్తావన వస్తోంది. అరోపణలు ఎదుర్కొనేవ్యక్తి ఫొటో, ఓటు తమదేనని, సంబంధిత ఓటరు తానేనని నిరూపించి సవాలు చేయవచ్ఛు అనంతరం ఓటు వేసే అవకాశం కలుగుతోంది. ఇలాంటి సందర్భాల్లో ఓటరుపై ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటారు. ఇంకొకరి ఓటు వేసేందుకు వచ్చినట్లు నిర్ధారణ అయినా, అతనిపై చర్యలు తీసుకుంటారు.

గిరిజన నేస్తం

తూర్పు అడవుల్లో ఇప్పపువ్వు సీజన్‌ నడుస్తున్నది. ఏటా మార్చి నుంచి మే చివరి దాకా సేకరణలో గిరిజనం నిమగ్నమవుతుంది. ఈ సారి గతానికి మించి సందడి నెలకొన్నది. తునికాకుతో పాటు ఉపాధినిచ్చే ఇప్పపూల కోసం మంటుటెండను సైతం లెక్కచేయ కుండా చిన్నాపెద్దా తరలుతు న్నారు. తెల్లవారుజామునే తట్టా బుట్టా, అంబలి బుర్రతో బయలుదేరి, సాయంత్రం కల్లా ఊళ్లకు చేరుతున్నారు.-జి.ఎన్‌.వి.సతీష్‌
గిరిజనులకు ఇప్పపూల సేకరణే ప్రధాన ఆదాయవనరు. దీనిని గిరిజనులు పవిత్రం గా భావిస్తారు. గిరిజనులు జరుపుకునే సాంప్ర దాయ, వేడుకలు, సంబరాలు, పెళ్లి సమయాల్లో ఇప్పపూల నుండి తయారుచేసిన సారాయి తాగడం ఆచారంగా పాటిస్తారు. సారాయి కాచడమే కాకుండా ఇప్పపూలతో ఇప్పజామ్‌, కేక్‌, లడ్డు, హల్వా, నూనె తదితర ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. ఎండాకాలం ముందు ఫిబ్రవరి, ఏప్రిల్‌ నెలల విప్ప చెట్లు ఆకురాలుస్తాయి. ఆ సమయం లోనే కస్తూరి వాసన కలిగిన పూలు పుష్పించడం మొదలవుతుంది. పూలు సాధారణగా ఉదయం సమయంలోరాలుతాయి. 30 సంవత్సరాల వయస్సు గల ఒక చెట్టు నుండి సుమారు 100 నుండి 150 కిలోల ఇప్ప పూలు లభిస్తాయి. ఇలా రాలిపడిన పూలను సేకరించి నీడలో ఆరబెడుతారు. బాగా ఎండిన తరువాత లావుపాటి కర్రతో పూలలోని పొట్టు పోయేంత వరకు కొట్టి, గాలి దూరని విధంగా వెదురు బుట్టలలో నింపి నిల్వచేస్తారు. వీటిని తమ అవస రాలకు అనుగుణంగా కావాల్సినప్పుడు వాడుతుంటారు. గిరిజన ప్రాంతాల్లో ఇప్ప పువ్వు అంటే కేవలం సారాయి తయారు చేయడానికే వాడుతారు అనే భావన ఉంది. ఢల్లీికి చెందిన డాక్టర్‌ ఎస్‌ఎన్‌.నాయక్‌ భారత శాస్త్రీయ, సాంతికేక మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహించిన పరిశోధనలో ఇప్ప పూల నుండి పంచదార పాకం తయారు చేసి దీంతో బిస్కెట్‌, చాక్లెట్‌, జామ్‌, కేక్‌లు తయారు చేసే విధానాన్ని కనిపెట్టారు. 1999లో పేటెంటు కొరకు దరఖాస్తు చేశారు. ఆయుర్వేద వైద్య విధానం ప్రకారం ఇప్ప పూలు బాలింతలకు చాలా ఉపయోగకరంగా పనిచేస్తాయి. సాధారణ శారీరక బలహీనత నుండి రక్షిస్తుంది. వీటిని నేరుగా తినడం వల్ల పిల్లలు పోషకహార లోపం నుండి బయట పడవచ్చు. గతంలో గిరిజనులందరూ ఇప్ప పూలను మంగళంలో పొడిగా చేసి వేపి, వేపిన గోంగూర గింజల పొడిని కలుపుతూ ఇప్ప నూనె కొంచెం చేర్చి ఉండలుగా చేసుకొని తినేవారు. రెండు లడ్లు తింటే ఒక రోజుకు సరిపడా శక్తి శరీరానికి లభించేది. కొన్ని రాష్ట్రాల్లో గిరిజనులు ఈ పూలను రొట్టెల పిండిలో కలిపి తింటారు.
ఇప్పపూలతో ఇప్పజామ్‌గిరిజనులకు ఇప్పపూల సేకరణే ఆధారం
నవతెలంగాణ-ములుగు
గిరిజనులకు ఇప్పపూల సేకరణే ప్రధాన ఆదాయ వనరు. దీనిని గిరిజనులు పవిత్రంగా భావిస్తారు. గిరిజనులు జరుపుకునే సాంప్రదాయ, వేడుకలు, సంబరాలు, పెళ్లి సమయాల్లో ఇప్పపూల నుండి తయారుచేసిన సారాయి తాగడం ఆచారంగా పాటిస్తారు. సారాయి కాచడమే కాకుండా ఇప్పపూలతో ఇప్పజామ్‌, కేక్‌, లడ్డు, హల్వా, నూనె తదితర ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. ఎండాకాలం ముందు ఫిబ్రవరి, ఏప్రిల్‌ నెలల విప్ప చెట్లు ఆకురాలుస్తాయి. ఆ సమయంలోనే కస్తూరి వాసన కలిగిన పూలు పుష్పించడం మొదలవుతుంది. పూలు సాధారణగా ఉదయం సమయంలో రాలుతాయి. 30 సంవత్సరాల వయస్సు గల ఒక చెట్టు నుండి సుమారు 100 నుండి 150 కిలోల ఇప్ప పూలు లభిస్తాయి. ఇలా రాలిపడిన పూలను సేకరించి నీడలో ఆరబెడుతారు. బాగా ఎండిన తరువాత లావుపాటి కర్రతో పూలలోని పొట్టు పోయేంత వరకు కొట్టి, గాలి దూరని విధంగా వెదురు బుట్టలలో నింపి నిల్వ చేస్తారు. వీటిని తమ అవసరాలకు అనుగుణంగా కావాల్సినప్పుడు వాడుతుంటారు. గిరిజన ప్రాంతాల్లో ఇప్ప పువ్వు అంటే కేవలం సారాయి తయారు చేయడానికే వాడుతారు అనే భావన ఉంది. ఢల్లీికి చెందిన డాక్టర్‌ ఎస్‌ఎన్‌.నాయక్‌ భారత శాస్త్రీయ, సాంతికేక మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహించిన పరిశోధనలో ఇప్ప పూల నుండి పంచదార పాకం తయారు చేసి దీంతో బిస్కెట్‌, చాక్లెట్‌, జామ్‌, కేక్‌లు తయారు చేసే విధానాన్ని కనిపెట్టారు. 1999లో పేటెంటు కొరకు దరఖాస్తు చేశారు. ఆయుర్వేద వైద్య విధానం ప్రకారం ఇప్ప పూలు బాలింతలకు చాలా ఉపయోగకరంగా పనిచేస్తాయి. సాధారణ శారీరక బలహీనత నుండి రక్షిస్తుంది. వీటిని నేరుగా తినడం వల్ల పిల్లలు పోషకహార లోపం నుండి బయట పడవచ్చు. గతంలో గిరిజనులందరూ ఇప్ప పూలను మంగళంలో పొడిగా చేసి వేపి, వేపిన గోంగూర గింజల పొడిని కలుపుతూ ఇప్ప నూనె కొంచెం చేర్చి ఉండలుగా చేసుకొని తినేవారు. రెండు లడ్లు తింటే ఒక రోజుకు సరిపడా శక్తి శరీరానికి లభించేది. కొన్ని రాష్ట్రాల్లో గిరిజనులు ఈ పూలను రొట్టెల పిండిలో కలిపి తింటారు.
ఇప్పపూలతో ఇప్పజామ్‌
గిరిజనులు చెట్ల కింద పడిన పూలను ఏరి ఆరుబయట నేలపై ఆరబెడుతారు. భద్రాచలం పుణ్య కేత్రాన్ని సందర్శించిన భక్తులకు ఇప్పపూలను సీతమ్మ ప్రసాదంగా స్వీకరించడం ఆనవాయితీ. ఇప్ప పూల పొట్టు తొలగించి శుభ్రమైన నీటితో మూడు సార్లు కడికి కుక్కర్లో వేసి ఉడక బెట్టాలి. ఉడక బెట్టిన పూలను కొద్దిసేపు చల్లబడే వరకు ఉంచి మిక్సీలో వేసి ఫేస్ట్‌లా రుబ్బాలి. అదేవిధంగా బొప్పాయి. జామ, అరటి, యాపిల్‌ పండ్ల గుజ్జును కూడా తయారు చేసుకోవాలి. మొత్తం అన్నీ రకాల పండ్లు, ఇప్ప పూల గుజ్జును తూకం వేసి తూనికానికి సగం పంచదార కలిపి సన్నని సెగపై కింద అడుగు అంటకుండా మెదుపుతూ సుమారు 2 గంటల పాటు కాయాలి. కొంచెం తీసి నీళ్లలో వేసినప్పుడు ఆ కొంచెం నీళ్లలో కలవకుండా నేరుగా కిందికి దిగిపపోయినప్పుడు జామ్‌ తయారు అయినట్లుగా గుర్తించాలి.
విరిసిన ఇప్పపువ్వే బతుకుదెరువు
ఏటా వేసవిలో ఇప్పచెట్లు పూత, కాతలతో కళకళలాడుతుంటాయి. ఈ కాలన్నే గిరిజనులు ఇప్పసీజన్‌గా చెప్పుకుంటారు. ఈసారి ఇప్పపువ్వు సీజన్‌ ఆలస్యంగా ప్రారంభం కాగా, తూరుపు ప్రాంతంలో అడవిబిడ్డలు సేకరణలో తలమునకల య్యారు. వేకువజామునే బయలుదేరి, ఉదయం పదిగంటల్లోగా సేకరించి, ఇళ్లకు చేరుకుంటున్నారు. పలువురు తమ సొంత భూముల్లో ఉన్న చెట్లనుంచి సేకరించుకుంటుండగా, భూములు లేని గిరిజనులు అటవీప్రాంతంలో చెట్ల నుంచి ఏరుకుంటున్నారు.
వరా ్షకాలంలో అంబలి, ఇప్పపువ్వు అన్నం
గిరిజనులు సేకరించిన ఇప్పపూలను ఎండబెట్టి దానిలో పుప్పొడి రేణువులు పొయ్యేదాకా కర్రమొద్దులతో బాదుతారు. అనంతరం చెరిగి గుమ్ముల్లో దాచుకుంటారు. మొదట దాని అడుగున ఆకులు వేసి తొక్కుతారు. మధ్యమధ్య ఎండబెట్టిన వేపాకులు చల్లుతారు. దీంతో ఇప్పపువ్వు ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. వర్షాకాలం వచ్చిందంటే చిక్కుడు గింజలు, అల్చందలు కలిపి ఉడికించి అంబలి కాస్తారు. ఇప్పపువ్వు కలిపి అన్నం వండుతారు. మరికొందరు గిరిజనులు ఇప్ప ఉండలను ఆల్పాహారంగా తీసుకుంటారు. ఇప్పపూలను పెంకుల్లో వేయించే సమయాన దంచిన వెల్లుల్లి, మిర్చి, అల్లం కలుపుతారు. అన్నీ కలిపి మోదుగాకుల్లో ఉండలుగా చు డుతారు. వాటిని నేతితో, ఇప్పనూనెతో కలిపి తింటారు. పలువురు ఇప్పపువ్వుతో సారా తయారు చేసి సేవిస్తారు. ఇప్పబద్దల నుంచి నూనె తీసి పంటలకు, దీపం చమురుగా వాడుతారు. అటవీ ప్రాంతానికి మేతకు వెళ్లే మేకలు, గొర్రెలు, పశువులు సైతం ఇప్పపువ్వు తింటాయి.
మందుల తయారీలో..
ఇప్పపూలను మందుల తయారీలోనూ ఉపయోగిస్తారు. పూల నుంచి తీసిన తైలాన్ని పక్షవాతం తదితర వ్యాధుల నివారణకు వాడుతారు. మాలిష్‌కు కూడా వినియోగిస్తారు. ఇప్పబద్దలను సబ్బులు, ఎరువుల తయారీలో ఉపయోగిస్తారు. ఇప్పపూలతో పళ్లు తోముకుంటే దంతవ్యాధులు, దగ్గు దరిచేరవని గిరిజనులు చెబుతున్నారు. ఇప్పపువ్వుతో తయారైన సారా తాగితే వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా ఉంటాయని విశ్వసిస్తారు. పలు ఆయుర్వేద మందుల తయారీలోనూ వాడతారు.
వైద్యశాస్త్రంలో ప్రాధాన్యం
వైద్యశాస్త్రంలోనూ ఇప్పచెట్టుకు ఎంతో ప్రాధాన్యముంది. ఆయుర్వేదంలో ఇప్పచెట్టును మధూక వ ృక్షమని వ్యవహరిస్తారు. దీ న్ని శాస్త్రీయ నామం గ్లీజేరియా గ్లాబ్రా కాగా, మేడికేటెడ్‌ ఆయుర్వేదిక్‌లో దీన్ని వాడుతారు. అటవీ ప్రాంతంలోని గిరిజనులు టేకు చెట్లను సైతం నరికి వంట చెరుకుగా, కట్టెలుగా, దుంగలుగా, నాగళ్లుగా వాడుతారు కానీ, ఇప్పచెట్టును నరికే ప్రసక్తే ఉండదు. ఓఅంచనా ప్రకారం ప్రతి గిరిజనుడి భూమిలో పది నుంచి పదిహేను అంతకుమించిన సంఖ్యలో కూడా ఇప్పచెట్లుంటాయి.
కొనుగోలుకు ముఖం చాటేస్తున్న జీసీసీ
గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు గ్రామాల్లో ఏర్పాటు చేసిన గిరిజన సహకార సంస్థ(జీసీసీ) కేంద్రాలు నామమాత్రంగానే మిగిలాయి. గిరిజనులు సేకరించిన ఇప్పపువ్వును ప్రభుత్వ మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉండగా ఎక్కడా కనిపించడం లేదు. కిలో ఇప్పుపువ్వుకు రూ.15 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించగా తూర్పున జీసీసీ కొనుగోలు చేయక పోవడంతో గిరిజనులు దళారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు నిర్ణయించిన ధరలకే అమ్మి నష్టపోతున్నారు.
ఇప్పపువ్వు..గ్రామీణులకు కల్పతరువు
గిరిజనులు అడవులను నమ్ముకుని జీవించడానికి ప్రధాన కారణం అడవిలో లభించే ఉత్పత్తులను సేకరించి వాటిని అమ్మడం ద్వారా ఉపాధి పొందు తున్నారు. కొందరు తడకలు అల్లితే మరికొందరు పండ్లు సేకరిస్తున్నారు. మరికొందరు తునికాకు,వంటి వాటిపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇందులో ఇప్పపువ్వు సేకరణ కూడా వారికి అధిక ఉపాధి కల్పిస్తోంది. గిరిజనులకు కాలానికనుగుణంగా ఉపాధినిచ్చే వృక్షాల్లో ఇప్పచెట్లు ప్రధానమైనవి. వేసవిలో వీటి ద్వారా గిరిజనులు ఉపాధి పొందడానికి అనేక అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఇప్పపువ్వు లభిస్తుండడంతో గిరిజనులు అడవుల్లోకి వెళ్లి తెల్లవారు జామునే ఇప్పపువ్వు సేకరించే పనిలో పడ్డారు. గిరిజనులు సూర్యోదయానికి ముందే అడవికి చేరుకుని ఇప్పపువ్వును సేకరిస్తున్నారు. తెల్లవారుజామున కిందపడిన ఇప్పపువ్వును మధ్యాహ్నంలోగా సేకరించి ఇంటికి తెచ్చి ఎండబెడుతున్నారు.
మూడు మాసాలు ఉపాధికి ఊతం..
ఖరీఫ్‌, రబీ పనులు ముగిసే సమయానికి ఇప్పచెట్లు విరగపూస్తాయి. వీటి పూత గాలికి నేలరాలుతుంటుంది. ఈ పువ్వులను గిరిజనులు సేకరిస్తారు. వీటితోపాటు మొర్రిపండ్లు సేకరించి తీసుకొస్తుంటారు. వీటిని విక్రయించి మూడు మాసాలపాటు అంటే మార్చి, ఏప్రిల్‌, మేనెలల్లో వీరు ఉపాధి పొందుతారు. ఇప్పపువ్వుల నుంచి తీసిన తైలాన్ని పక్షవాతం వంటి వ్యాధులకు ఉపయోగిస్తారు. అలాగే ఇప్పపువ్వుతో దంతాలను శుభ్రం చేసుకోవడంతో దగ్గుకు, దంతాలకు సంబంధించిన వ్యాధుల నివారణకు ఔషధంగా పనిచే స్తోంది. ప్రధానంగా స్వచ్ఛమైన ఇప్పపువ్వుతో తయారుచేసిన సారాయి సేవిస్తే వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా ఉంటాయని పల్లె ప్రజలు విశ్వసిస్తారు. ఇన్నిరకాల ప్రయోజనాలున్న ఇప్పచెట్లు రోజురోజుకు స్మగర్ల చేతుల్లో నేలరాలుతున్న టేకు చెట్లతో పాటు ఇప్పచెట్లు నరికేస్తున్నారు. దీంతో క్రమంగా ఉపాధికి దూరమవుతున్నారు.
ఇప్పపువ్వులో ఎన్నెన్నో పోషకాలు..
అడవిలో లభించే ఇప్పపువ్వుల గింజల నుంచి తీసిన నూనెలో ఎన్నెన్నో పోషక విలువలు ఉన్నట్లు శాస్త్రీయంగా రూడీ అయింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కొమురంభీం జిల్లాల్లోని ఆయా మండలాల్లోని అడవుల్లో లభించే ఇప్పపువ్వుల పండ్లలో పోషక విలువల నివధికల ఆధారంగా భారతశాస్త్రీయ సాంకేతిక మంత్రిత్వశాఖ సహయంతో 1999లో నిర్వహించిన పరిశోధనల్లో ఎండిన ఇప్పపువ్వుల నుంచి పంచదార తయారుచేసి దీంతో జాము, కేకులు, చాక్లెట్లు తయారుచేసే విధానాన్ని కనిపెట్టారు. ఇప్పపువ్వు ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి మద్యమధ్యలో ఎండినవేప ఆకు పిచికారి చేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుందని తెలుసుకున్నారు. చిక్కుడు గింజలు, అలిచందలు కలిపి ఉడికించి అంబలి చేస్తారు. ఇప్పగింజల నుంచి తీసిన నూనెను దీపంగా వాడుతారు. గిరిజనులు కొంత మంది ఇప్పపువ్వును ఆహారంగానూ తీసు కుంటారు. ఇప్పపువ్వులో లభించే పోషకాలు పరిశీలిస్తే క్యాల్షియం 139.00, పాస్పర్‌ 137.00, ఫైబర్‌ 109.00, కార్బోహైడ్రేడ్స్‌ 68.00 మాయిశ్చర్‌ 11.66, ప్రోటీన్‌లు 6.67 శాతం ఉంటాయి.

అడవిపై హక్కు`ఆదివాసులదే’

రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో చేర్చిన ఈశాన్య రాష్ట్రాలయిన అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరామ్‌లాంటి రాష్ట్రాలలోని అడవిని నమ్ముకొని ఉన్న గిరిజన తెగలకు, దేశంలోని 6వ షెడ్యూల్‌లో లేని మిగతా దేశం మొత్తం మీద ఇతర రాష్ట్రాలలోని అడవిని నమ్ముకొని బతుకుతున్న అయిదవ షెడ్యూల్‌లోని ప్రజలందరికీ ఈ చట్టం వర్తిస్తుంది. ఈ చట్టంలోని కొన్ని సెక్షన్స్‌ ఆక్రమణదారులను తొలగించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయగా, వాటిని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వాధికారులు అడవి నుండి ప్రజలను తరిమివేసేందుకు పెద్ద కుట్రచేస్తూ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, వాటి వెలుగులో వచ్చిన దేశ సర్వోన్నత న్యాయస్థానం(సుప్రీంకోర్టు), వివిధ రాష్ట్రాల హైకోర్టుల తీర్పులు, ఐదు, ఆరవ షెడ్యూల్ల స్ఫూర్తికి తిలోదకాలిచ్చి, బహుళజాతి సంస్థలకు, బడా పెట్టుబడిదారులకు అడవిని అప్పజెప్పేందుకు బృహత్‌ పథకాన్నే రచించాయి. -చిక్కుడు ప్రభాకర్‌
ఈదేశ మూలవాసులు ఆదివాసీలు. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలలో తరతరాలుగా అడవిలోనే జీవిస్తున్న 12 లక్షల ఆదివాసీలను, అడవి నుంచి ఖాళీ చేయించాలని ఫిబ్రవరి 13వ తేదీన దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. 2006 సంవత్సరంలో దేశ పార్లమెంటు ద్వారా చేసిన ఆదివాసీ అటవీ హక్కుల చట్టం-2006ను రద్దు చేయాలని, ఈ చట్టం ఆదివాసీలు అడవిలో నివసించేందుకు, వ్యవసాయం చేసుకునేందుకు, అలాగే వారితోపాటు జీవించే ఇతర నిరుపేద తెగలకు కూడా అడవి మీద హక్కు కల్పిస్తుందని, ఈ హక్కులు వన్యమృగాల రక్షణ చట్టం, 1972నిబంధనలకు, అభయారణ్యంలోని పులుల రక్షణ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదని, ఈ చట్టాన్ని కొట్టివేయాలని ‘వైల్డ్‌ లైఫ్‌ ఫస్ట్‌’ అనే స్వచ్ఛందసంస్థతో పాటు ఇతర సంస్థలు 2009 సంవత్స రంలో సుప్రీంకోర్టులో ఒక పిటిషెన్‌ వేసాయి. ఈ రిట్‌ పిటీషన్‌ తరపున గత కొద్ది సంవత్సరాలుగా వాదనలు కొనసాగుతున్నాయి. అటవీ హక్కుల చట్టం-2006లోని సెక్షన్‌2(0) చాలా స్పష్టంగా, గత మూడు దశాబ్దాలుగా, 2005 సంవత్సరం డిసెంబర్‌ కంటే ముందుగా ఎవరైనా అడవిలో బతుకు తున్నట్లయితే, వారికి అడవిలో నివసించే హక్కు, అలాగే వారు సేద్యం చేసుకుంటున్న భూమి మీద సర్వహక్కులు కల్పించాలని చెబుతున్నది. అలాగే సెక్షన్‌ 3(1)(ఎ) చాలా స్పష్టంగా ఈ విధంగా చెబుతున్నది. అడవిలో భూమి, ఇల్లు కలిగి ఉండి అక్కడే జీవిస్తున్న ఆదివాసులకు అడవిపై హక్కు ఉన్నది. ఈ హక్కులు కూడా తరతరాలుగా వారు జీవిస్తున్న సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ స్థోమతలకు ఎటువంటి భంగం కలిగించకుండా హక్కులను గుర్తించాల్సిందిగా చెబుతున్నది. అలా కాకుండా అడవిలోకి ఆక్రమణదారులుగా వస్తున్నవారికి ఎటువంటి హక్కులు కల్పించరాదని కూడా చెబుతున్నది. అయితే తరత రాలుగా అడవిని నమ్ముకొని, అడవిలోనే జీవిస్తున్న వేలాది తెగల జీవితాలు రోజురోజుకు దిగజారుతున్నాయి. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో చేర్చిన ఈశాన్య రాష్ట్రాలయిన అస్సాం, మేఘాలయ,త్రిపుర,మిజోరామ్‌లాంటి రాష్ట్రాలలోని అడవిని నమ్ముకొని ఉన్న గిరిజన తెగలకు, దేశంలోని 6వ షెడ్యూల్‌లో లేని మిగతా దేశం మొత్తం మీద ఇతర రాష్ట్రాలలోని అడవిని నమ్ముకొని బతుకుతున్న అయిదవ షెడ్యూల్‌లోని ప్రజలందరికీ ఈ చట్టం వర్తిస్తుంది. ఈ చట్టంలోని కొన్ని సెక్షన్స్‌ ఆక్రమణ దారులను తొలగించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయగా, వాటిని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వాధికారులు అడవి నుండి ప్రజలను తరిమివేసేందుకు పెద్ద కుట్రచేస్తూ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, వాటి వెలుగులో వచ్చిన దేశ సర్వోన్నత న్యాయస్థానం(సుప్రీంకోర్టు), వివిధ రాష్ట్రాల హైకోర్టుల తీర్పులు, ఐదు, ఆరవ షెడ్యూల్ల స్ఫూర్తికి తిలోదకాలిచ్చి, బహుళజాతి సంస్థలకు, బడా పెట్టుబడిదారులకు అడవిని అప్పజెప్పేందుకు బృహత్‌ పథకాన్నే రచించాయి. ఇందులో భాగంగానే రాజ్యాంగాన్ని, దానికి అనుగుణంగా వచ్చిన భూమి మీద అటవీ ప్రజలకు కలిగిన హక్కులను, ఆయా చట్టాల్లోని సారాన్ని సంపూర్ణంగా హరించివేస్తూ అడవిలో బతికే ఈ దేశమూలవాసులకు తీరని అన్యాయం చేస్తున్నారు. నలభై లక్షల ధరఖాస్తులలో 12 లక్షల ధరఖాస్తులు ఎందుకు ఆమోదించలేదు? దానికి గల కారణాలు ఏమిటి? ఒకసారి అవి ఆమోదించి చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వారికి దక్కాల్సిన హక్కులు ఎందుకు కల్పించలేదు? ఒకవేళ అవి తిరస్కరణకు గురైతే అవి చట్టబద్దంగానే తిరస్కరణకు గురైనాయా? అలా చట్టబద్దంగా తిరస్కరణకు గురికాగానే వారికి చట్టబద్దంగా పై ఫోరాలలో అప్పీల్‌ చేసుకునే అవకాశం ఇచ్చారా? 1996 సంవత్సరంలో దేశ పార్లమెంటు చేసిన పంచాయత్‌ ఎక్స్‌టెన్షన్‌ షెడ్యూల్‌ ఏరియా చట్టం(పెసా)లోని నిబంధనలను వీరి ధరఖాస్తు తిరస్కరణలకు వర్తింపచేశారా? ఆదివాసీలకు, అడవిలో జీవించే ప్రజలందరికి రాజ్యాంగం కల్పించిన రక్షణలు, వాటి వెలుగులో వచ్చిన దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పులతో పాటు, రాజ్యాంగ మౌలిక స్వరూపమైన, ఏ వ్యక్తికైనా సగర్వంగా సంపూర్ణ ఆరోగ్య జీవితం కల్పించాలని ఇచ్చిన తీర్పులన్ని ఆదివాసీ, అడవిలో బతికే వారందరికి వర్తిస్తాయి. కాని, ఇవేమీ పట్టించుకోకుండా దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ముగ్గురు జడ్జీలు కలిగిన ధర్మాసనం ఇచ్చిన తీర్పు, 13 మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పు కేశవానంద భారతి వర్సెస్‌ కేరళ నుంచి మొదలుకొని ఐదుగురు జడ్జీలు కలిగిన రాజ్యాంగ ధర్మాసనాలు వివిధ సందర్భాలలో ఇచ్చిన తీర్పులయిన, డి.టి.సి వర్సెస్‌ మజ్దూర్‌ కాంగ్రెస్‌, బంధుముక్తి మోర్చా వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా(1984), ఓల్గా తెల్లీస్‌ వర్సెస్‌ ముంబాయి మున్సిపల్‌ కార్పోరేషన్‌, సుభాష్‌కుమార్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బీహార్‌, సి.ఇ.ఎస్‌.సి వర్సెస్‌ యన్‌.సి.బోస్‌ లాంటి ఎన్నో తీర్పులను ఆధారం చేసుకొని 1997 సంవత్సరంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సమతరవి కేసులో విస్తృత ధర్మాసనం అడవిపై ఆదివాసుల సర్వ హక్కులను గుర్తించింది. ఈ తీర్పులన్నింటితోపాటు సమతరవి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ తీర్పును కూడా విస్త ృత దర్మాసనం నియమగిరి పర్వతాలలోని మైనింగ్‌ విషయంలో ఒరిస్సా మైనింగ్‌ కార్పోరేషన్‌ వేసిన కేసులో 2013 సంవత్సరంలో సమతరవి తీర్పును ఎత్తిపడుతూ, ఇదే విస్త ృత ధర్మాసనం అడవిలోని ఆదివాసుల, ఇతర గిరిజన, గిరిజనేతర ప్రజల సర్వహక్కులను ముఖ్యంగా జల్‌, జంగల్‌, జమీన్‌లను ధృవపరిచింది. అయితే విస్తృత ధర్మాసనం పై తీర్పులన్నింటిని పరిగణలోకి తీసుకోకుండా కనీసం కేంద్ర ప్రభుత్వం, కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ తమ ప్రమాణపత్రాలు దాఖలు చేయకుండానే, కేవలం అటవీ మంత్రిత్వశాఖ, వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ఉన్నత, ముఖ్య కార్యదర్శులు సమర్పించిన తప్పుడు ప్రమాణ పత్రాల ఆధారంగా రాజ్యాంగంలోని మౌలిక స్వరూపమైన జీవించే హక్కు, ఐదవ, ఆరవ షెడ్యూల్లు వాటి ఆధారంగా వచ్చిన వివిధ చట్టాలు, తమ సొంత తీర్పులకు భిన్నంగా రాసిన సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించాల్సిన విశాల సమాజం, ఆదివాసీ, గిరిజన, హరిజన, బడుగు, బలహీనవర్గాల సామాజిక శక్తులవారు కూడా నోరు మెదపకపోవడం అత్యంత విషాదం. ఇటువంటి నిశ్శబ్ద పరిస్థితిని నా నాలుగు దశాబ్దాల ప్రజాజీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఈ రోజు కేవలం 12 లక్షల ఆదివాసులను అడవి నుంచి పంపే తీర్పుతో మొదలయ్యే ఈ దుర్మార్గ ప్రక్రియ రేపు మొత్తం దేశంలోని 10 నుంచి 12కోట్ల వరకున్న ప్రజానీకాన్ని తరిమివేసి, బహుళజాతి సంస్థలకు, దేశీయ బడా పెట్టుబడిదారులకు, వారి దళారులకు అడవిని అప్ప జెప్పేందుకు జరుగుతున్న బృహత్‌ పథ కంగా, సమాజంలోని ప్రగతిశీలశక్తులన్నీ గుర్తించాలి.

డేటా వార్‌లో ఓటర్లే బలిపశువులా?

ఇందులో టిడిపి ఇరకాటం, టిఆర్‌ఎస్‌ చెలగాటం, వైసీపీ బులపాటం దాచేస్తే దాగేవి కావు. ఎవరెవరి వ్యూహ ప్రతి వ్యూహాలు ఎలా వున్నా రెండు ప్రధాన పార్టీలు పోటా పోటీగా లక్షల ఓట్లు గల్లంతు చేస్తే సగటు ఓటరు సంరక్షణెలా అన్నది కీలక ప్రశ్న. విధానాలతో విశ్వాసం పొంది ఓట్లు వేయించుకోవాలి గాని మూకు మ్మడి తొలగింపులు ఆందోళనకరం. అనుమా నాస్పదంగా మారిన ఈ డేటా వార్‌ కపట నాటకంలో పాత్రధా రులు, సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఓటర్ల న్యాయమైన హక్కుల పరిరక్షణ తక్షణ కర్తవ్యంగా తీసుకోవాలి. ఎన్నికల సంఘం కుంభకర్ణ నిద్ర మానాలి. అంతిమంగా ప్రజలు తీర్పు చెప్పే సమయం కూడా ఎంతో దూరం లేదు. ఈలోగా కుట్రలు కుత్సితాలతో, కుళ్లు కుతంత్రాలతో ఏదో సాధించేద్దామని ఎవరనుకున్నా భంగపాటు తప్పదు. ఎందుకంటే ప్రజలు కేవలం కంప్యూటర్‌ డేటా కాదు.
ఎక్కడో మునిగి ఎక్కడో తేలినట్టు ఎ.పి రాజకీయాల్లో టిడిపి-వైసిపి-టిఆర్‌ఎస్‌ వైరం చౌర్యం అంచుల వరకూ వెళ్లింది. నవ రత్నాలని ఒకరు, నవీక ృత పథకాలతో మరొకరు గెలిచేశామని ఇరు పార్టీలూ చేసిన హడావుడి వెనక్కు పోయి పరస్పరం దొంగతనం నిందారోపణలు మార్మోగుతున్నాయి. ఇరు పక్షాల పోల్‌ మేనేజిమెంట్‌ పొలిటికల్‌ మార్కెటింగ్‌ క్రీడల్లో ప్రజలు లేదా ఓటర్లు కేవలం డేటాగా మారిపోయిన దుస్థితి దాపురించింది. ఈ రెండు పార్టీలకూ లేదా వారి వారి మిత్రులకూ సంబంధించిన వివాదాన్ని రెండు తెలుగు రాష్ట్రాల పోలీసు తగాదాగా చూపించే ప్రయత్నాలు కూడా ఉధ ృతంగానే సాగుతున్నాయి. లక్షల ఓట్ల తొలగింపు, ఓటర్ల ప్రభుత్వ డేటా దొంగిలింపు వంటి తీవ్రమైన ఫిర్యాదులు భారీగా వినిపిస్తున్నా ఎ.పి, తెలంగాణ పోలీసులు, రాజకీయ వేత్తలు బాహాటంగా తిట్టిపోసు కుంటున్నా ఎన్నికల సంఘం నిమ్మకు నీరెత్తినట్టు వుండిపోయింది. అంతర్రాష్ట్ర వివాదంలాగా మారిన ఈ ప్రతిష్టంభన లో కేంద్రం చోద్యం చూస్తున్నది. తాజాగా ఏపి సిఎం ఇచ్చిన అధికారిక వివరణలోనూ రాజకీయ ఆరోపణలు, ఆక్రోశాలు తప్ప సమగ్ర సమాధానాలు, సంత ృప్తికరమైన సమాచారాలు లేవు.
ఐటి గ్రిడ్‌ వ్యవహారం : ఎ.పి ప్రభుత్వ ఔట్‌ సోర్సింగ్‌ సంస్థ బ్లూ ఫ్రాగ్‌ (విశాఖ) టిడిపి ఐటి ప్రొవైడర్‌ ‘ఐటి గ్రిడ్స్‌’ (హైదరాబాద్‌) కేంద్రంగా ఈ వివాదం మొదలైంది. మార్చి మూడవ తేదీ అర్థరాత్రి హైదరాబాద్‌ అయ్యప్ప సొసైటీ కాలనీలో ఐటి గ్రిడ్స్‌ కంపెనీలో పోలీసులు ప్రవేశించారు. ఓటర్లను తొలగించే ప్రక్రియ కోసం ఎ.పి ప్రభుత్వ డేటా అక్కడ దుర్వినియోగం అవుతున్నట్టు లోకేశ్వరరెడ్డి అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు వచ్చినట్టు చెప్పారు. నలుగురు సిబ్భందిని తీసుకువెళ్లారు. ఇంతలో ఎ.పి పోలీసులు లోకేశ్వరరెడ్డి ఇంటికి చేరుకున్నారు. తమ సిబ్బంది ఆచూకీ తెలియలేదని ‘ఐటి గ్రిడ్స్‌’ యజమాని అశోక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వచ్చామనడంతో ఉభయ పోలీసుల మధ్య వివాదం నడిచింది. తెలంగాణ హైకోర్టులోనూ అశోక్‌ హేబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో కోర్టు ఆ నలుగురిని హాజరు పర్చాలని ఆదేశించింది. పోలీసులు ఖాళీ కాగితాలపై విఆర్‌వోల సంతకాలు తీసుకోవడం ఏమిటని అక్షింతలు వేసింది. ఆ నలుగురు సిబ్బందిని సాక్షులుగా తీసుకున్నామే గాని అరెస్టు చేయలేదని వివరణ ఇచ్చిన పోలీసులు మరుసటి రోజు తీసుకురావడంతో కోర్టు పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈలోగా ఎ.పి మంత్రి లోకేశ్‌, మరికొందరు తమ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ‘సేవామిత్ర’ అనే యాప్‌ తయారు చేస్తున్న ‘ఐటి గ్రిడ్స్‌’పై దాడి చేసి తెలంగాణ పోలీసులు డిస్క్‌లు, డేటా అపహరించుకుపోయారని ఆరోపించారు. హైదరాబాద్‌లో నివసించే టిడిపి వారిని వ్యాపారవేత్తలను భయభ్రాంతులను చేసేందుకు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోడీ దర్శకత్వంలో వైసీపీతో కుమ్మక్కయిందని వారు ఆరోపించారు. ఇక ప్రభుత్వ డేటాను ఉపయోగించి ప్రతిపక్ష ఓటర్లను తొలగించేందుకు ప్రభావితం చేసేందుకు పెద్ద కుట్ర జరిగిందని వైసీపీ ఆరోపించింది. ఫిర్యాదు వస్తే పోలీసులు వెళ్లారు గాని ఏపి డేటాతో మాకేం అవసరమని టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసు తరహాలో చంద్రబాబును, లోకేశ్‌ను అవహేళన చేస్తూ మాట్లాడారు. వైసీపీ నేతలు టిడిపి డేటా చౌర్యం దొరికి పోయిందని ధ్వజమెత్తారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ డేటా చౌర్యంపై దర్యాప్తు చేస్తున్నామని అవసరమైతే ఎ.పి ప్రభుత్వానికి కూడా నోటీసు ఇస్తామని ప్రకటించారు. అయితే ‘సాధికార మిత్ర’తో సహా సర్కారు పథకాలకు సంబంధించిన సమాచారం సురక్షితంగా వుందని ఎ.పి అధికారి ఒకరు ప్రకటించారు. తమ పార్టీకి సంబంధించిన సేవామిత్ర యాప్‌లో డేటా దొంగిలించి వైసీపీకి ఇచ్చేందుకు టిఆర్‌ఎస్‌ కుట్ర పన్నిందని టిడిపి ఎదురుదాడి చేసింది. అశోక్‌ తమ సంరక్షణలో వున్నారని కూడా ఆ పార్టీ నేత ఒకరు వెల్లడిరచారు. మన పార్టీపై ఇంత దాడి జరుగుతుంటే మీరు మంత్రులుగా గాక టిడిపి నేతలుగా మాట్లాడ్డం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహించినట్టు మీడియా రాసింది.
ఎప్పటి నుంచో ఆరోపణలు, అరెస్టులు : అరెస్టులు, ఆరోపణలు ఇప్పుడు భగ్గుమన్నాయి గాని ఈ ప్రహసనం చాలా కాలం కిందటే మొదలైంది. ఏపిలో 59 లక్షలకు పైగా దొంగ ఓట్లు చేర్పించినట్టు ఆరు మాసాల కిందటే వైసీపీ ఆరోపించింది. ఫిబ్రవరి 4న జగన్‌ ఢల్లీిలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి వచ్చారు. అధికార పార్టీ దీనిపై మాట్లాడలేదు (పైగా టిడిపి ఓట్లకు డబ్బు ఇస్తే తీసుకోమని అన్నందుకు జగన్‌ ఓటు హక్కు రద్దు చేయాలని టిడిపి లీగల్‌ సెల్‌ వినతి పత్రం సమర్పించింది). రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య మూడున్నర కోట్లు అయితే అందులో దాదాపు 60 లక్షలు బూటకం అనడం అతిశయోక్తిగా వుందనే వ్యాఖ్యలు కూడా వచ్చాయి. అలాగే గ్రామాలలో సర్వేలంటూ జరిపి ప్రతిపక్ష ఓటర్ల సమాచారం తెలుసుకుని తొలగిస్తున్నారని వైసీపీ స్థానిక నేతలు అడ్డుపడటం వివాదానికి దారి తీసి అరెస్టులు కేసుల వరకూ వెళ్లింది. చిత్తూరు జిల్లా వంటి చోట్ల పోటా పోటీ ధర్నాలు జరిగాయి. అక్రమంగా ఓట్ల తొలగింపు జరిగిందని ఫిర్యాదు చేస్తే పోలీసులు బెదిరించిన ఘటనలు కూడా వెల్లడైనాయి. ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘం ఏ మాత్రం స్పందించలేదు. జగన్‌ ఫిర్యాదుల పైనా అధికారికంగా వ్యాఖ్యానించలేదు. వివాదం బాగా ముదిరాకనే ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ ఓట్ల తొలగింపు సులభం కాదని మూడు దశలు దాటాలని చెప్పారు. ఓట్ల తొలగింపును కోరే ఫారం-7 దరఖాస్తులు తమకు లక్షల సంఖ్యలో వస్తే పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇంతలోనే హైదరా బాద్‌లో ఐటి గ్రిడ్‌పై దాడులు సంభవించాయి. డేటావార్‌ మొదలైంది.
ఇద్దరూ ఇద్దరే! : ఈ వార్‌ మొదలైన మరు రోజునే జగన్‌ నెల్లూరులో మాట్లాడుతూ తమ చిన్నాయన వివేకానందరెడ్డితో సహా లక్షల మంది ఓట్లను తొలగించినట్టు ఆరోపించారు. దొంగఓట్ల తొలగింపు కోసం తమ పార్టీ 8 లక్షల ఫారాలు సమర్పించిం దన్నారు. గవర్నర్‌కూ ఫిర్యాదు చేశారు. ‘అసలు మీ ఫిర్యాదు ఓట్ల తొలగింపు అయితే…మళ్లీ తొలగింపు కోసమే అన్ని లక్షల దరఖాస్తులు సమర్పించడం వైరుధ్యభరితం కాదా!’ అని నేను టీవీ చర్చల్లో అడిగాను. రెండు ప్రధాన పార్టీల మధ్య నడుస్తున్న ఈ ప్రహసనంలో ఏదో లోగుట్టు వుందని మాత్రం స్పష్టమై పోయింది. ఆ నాటకం ఏమిటో తేలాలని ఓట్ల జాబితా సక్రమంగా వుండేలా చూడాలని జనసేన -వామపక్షాలు కోరాయి. కాని ఎన్నికల సంఘం ఖండిరచడం తప్ప కదిలింది లేదు. దాంతో ‘అర్హులందరికీ ఓటు హక్కు’ అనే రాజ్యాంగ మౌలిక సూత్రం పరిరక్షణ వెనక్కుపోయి టిడిపి, వైసిపి, టిఆర్‌ఎస్‌ రాజకీయాలే ప్రధానమై డేటా వార్‌ను ఈ స్థితికి తెచ్చాయి. వైసిపి ఎం.పి విజయ సాయిరెడ్డి ఫిర్యాదు పత్రాలు చూపిస్తూ ‘ఇది బాహుబలిని మించిన కుట్ర’ అని ఆగ్రహిస్తున్న చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘానికి ఆయన చేసిన ఫిర్యాదులను ఎందుకు ముందే పట్టించుకోలేదు? అమెజాన్‌ క్లౌడ్‌లో ఈ డేటా పొందుపర్చడంపై సమాధానమేమిటి?
పొంతనలేని ప్రభుత్వాల తీరు : వార్‌ మొదలైన తర్వాత కూడా టిడిపి నాయకత్వం తడబాటుకు గురైంది. డేటా మాదైనప్పుడు తెలంగాణ పోలీసులు ఎందుకు వచ్చారంటూ మొదట్లో విమర్శ చేశారు. ఐటి గ్రిడ్స్‌ హైదరాబాదులో వుంది గనక ఈ ఆరోపణ నిలవలేదు. తామే వ్యతిరేక కూటమి వుందని ఆరోపించే చోట ఎందుకు వుంచారనే ప్రశ్న మరొకటి. రిజిస్టర్‌ కాని కంపెనీకి ఇంత ముఖ్యమైన డేటా అప్పగించడం కూడా విడ్డూరమే. ఒకే సంస్థకు ప్రభుత్వ యాప్‌ పార్టీ యాప్‌ కూడా కట్టబెట్టడం ఆరోపణలు పెంచుతుంది. పైగా ప్రభుత్వ డేటా పదిలంగా వుందని, టిడిపి యాప్‌లో సమాచారంలో రహస్యం లేదని చెబుతూ వచ్చారు. ప్రపంచమంతటా బిగ్‌ డేటా చౌర్యాలు పెరిగిపోతున్న కాలంలో అలాటి అలసత్వానికి తావే లేదు. జరిగింది డేటా సేకరణా బహుకరణా తస్కరణా అన్నది తేలవలసిందే. ఐటి గ్రిడ్స్‌పై తెలంగాణ పోలీసులు 23నే దాడి చేసి డేటా తీసుకున్నారంటున్న ఎ.పి ప్రభుత్వం అరెస్టుల విషయం రచ్చకెక్కేవరకూ కిమ్మనకపోవడానికి కారణాలు అనూహ్యం. మార్చి 4 తర్వాత కూడా ఐటి గ్రిడ్‌ తరపున హేబియస్‌ కార్పస్‌ వేశారే గాని తమ డేటా గురించి టిడిపి కేసు వేయలేదు. వైసీపీ టిఆర్‌ఎస్‌ బిజెపిలు జట్టు కట్టాయంటే దాన్ని ఎదుర్కోవడం టిడిపి రాజకీయ సమస్య తప్ప ఎ.పి,తెలంగాణ ప్రజల వివాదం కాబోదు. ఇటీవల ఎ.పికి చెందిన చిగురుపాటి జయరాం హత్య కేసు సందర్భంలో ఒక దశ తర్వాత ఇరు రాష్ట్రాల పోలీసులు సహకరించుకోవడం చూశాం. మరి ఏ.పికి సంబంధించిన డేటా సమస్యలో తెలంగాణ పోలీసులు ఎపి ప్రభుత్వానికి ఎందుకు తెలియజేయలేదన్న ప్రశ్న తలెత్తుతుంది. అందుకే వారు తెలంగాణ డేటా కూడా పోయిందని ఆలస్యంగా చెప్పడం మొదలు పెట్టారు. కేసుపై మాట్లాడే పోలీసు అధికారులు కూడా ఇప్పటికి ముగ్గురు మారారు. మాట్లాడిన ముగ్గురిలోనూ కొన్ని వైరుధ్యాలున్నాయి. కనుక ఇదంతా ఇరువైపులా పోటాపోటీ రాజకీయ ప్రయోజనాల వేట మాత్రమేనన్నది స్పష్టం. ఇందులో టిడిపి ఇరకాటం, టిఆర్‌ఎస్‌ చెలగాటం, వైసీపీ బులపాటం దాచేస్తే దాగేవి కావు. ఎవరెవరి వ్యూహ ప్రతివ్యూహాలు ఎలా వున్నా రెండు ప్రధాన పార్టీలు పోటా పోటీగా లక్షల ఓట్లు గల్లంతు చేస్తే సగటు ఓటరు సంరక్షణెలా అన్నది కీలక ప్రశ్న. విధానాలతో విశ్వాసం పొంది ఓట్లు వేయించుకోవాలి గాని మూకుమ్మడి తొలగింపులు ఆందోళనకరం. గత ఏడాది ఇలాగే భారీగా ఓట్ల తొలగింపు సమస్య తెలంగాణ ఎన్నికల్లోనూ వస్తే హైకోర్టు జోక్యం చేసుకుంది. అయినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు ఎ.పి లోనూ న్యాయపరమైన చర్యలు తీసుకోవాలే గాని రాజకీయ రచ్చ నిరర్థకం. అనర్థకం. డేటా సురక్షితంగా వుందా లేదా అన్నది తెలంగాణ పోలీసుల తుది నివేదిక తర్వాతనే మాట్లాడాల్సిన విషయం. ఒకవైపు అధికార డేటా పోలేదంటూనే ఎ.పి ప్రభుత్వం అతిగా కంగారు పడటం ఆశర్యకరం. తమ పార్టీ డేటా పోయిందని టిడిపి నాయకులూ పరువు పోయిందని ఎ.పి మంత్రులూ రాష్ట్ర పోలీసులకు, కలెక్టర్లకు ఫిర్యాదులు చేయడం రాష్ట్రాల మధ్య మధ్య వివాదానికే తప్ప పరిష్కారానికి దోవ చూపదు. ఎన్నికల సంఘం ముందు, ఉన్నత న్యాయస్థానాల ఎదుటు తేలాల్సిన సమస్యలివి. అన్ని వైపులా అనుమానాస్పదంగా మారిన ఈ డేటా వార్‌ కపట నాటకంలో పాత్రధారులు, సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఓటర్ల న్యాయమైన హక్కుల పరిరక్షణ తక్షణ కర్తవ్యంగా తీసుకోవాలి. ఎన్నికల సంఘం కుంభకర్ణ నిద్ర మానాలి. అంతిమంగా ప్రజలు తీర్పు చెప్పే సమయం కూడా ఎంతో దూరం లేదు. ఈలోగా కుట్రలు కుత్సితాలతో, కుళ్లు కుతంత్రాలతో ఏదో సాధించేద్దామని ఎవరనుకున్నా భంగపాటు తప్పదు. ఎందుకంటే ప్రజలు కేవలం కంప్యూటర్‌ డేటా కాదు. – తెలకపల్లి రవి

1 2