ఓటరు అనే నేను

శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని, దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడడానికి.. ఒక ఓటరుగా, నా కర్తవ్యమైన ఓటును శ్రద్ధతో, అంత:కరణ శుద్ధితో భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా నోటుకు, మద్యానికి, కులానికి, మతానికి, సంక్షేమ పథకాల ఎరకు కూడా లొంగకుండా వివేచనా, విచక్షణా జ్ఞానంతో రాజ్యాంగం నాకు కల్పించిన అత్యద్భుతమైన అవకాశం అయినటువంటి ఓటు హక్కును వినియోగించుకుంటానని మన భారత రాజ్యాంగం మీద త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను.
ఓసాఫ్ట్‌వేర్‌ ఉద్యోగితో ఇటీవల జరిగిన సంభాషణ. ఆమె పేరు కవిత.
‘నీకు ఇక్కడే ఓటుందిగా?’ ‘లేదు మేడం.. ఓటు నమోదే చేయించుకోలేదు. ఇంతవరకూ నేను ఓటే వేయలేదు. అయినా, మనం వేయకపోతే- పోయేది ఏముంది? ఎవరొకరు గెలుస్తారు. ఎవరు గెలిచినా ఏం ఒరుగుతుంది కనుకా.. ‘అంది నిర్లిప్తంగా…ఇలా ఒక్క కవిత మాత్రమే కాదుబీ ఇంకా చాలామంది అలాంటి ఆలోచనలతో, ఉదాసీనతతో ఉన్నవారు మనచుట్టూ చాలా మందే ఉన్నారు. ఓటు మన బాధ్యత కదా! కానీ ఈ నిర్లిప్తత ఎందుకు వస్తుంది? నిజమే ఒక్కసారి ఆలోచిస్తే ఈదేశ పౌరులుగా మనం చేస్తుంది నిజంగా బాధ్యతా రాహిత్యమే. ఓటు వేయకపోతే శిక్షలు వేస్తారన్న భయంకాదు కానీ..రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవాలన్న స్పృహ లేకపోవడం నిజంగానే క్షమించరాని నేరం.
నా చిన్నప్పుడు నేను చదువుకోవడానికి ప్రభుత్వ విద్య అందుబాటులో ఉండేది. ఊరందరం ఒకే స్కూల్లో చదివేవాళ్లం. ఇప్పుడు నా పిల్లల్ని చదివించాలంటే కార్పొరేట్‌ స్కూళ్ల వైపు చూడాల్సి వస్తోంది. ప్రభుత్వ విద్య చాలాకాలంగా నిర్వీర్యం చేయబడిరది. ప్రయివేటు విద్యాసంస్థల్లో చదివించాలంటే- చాలా డబ్బులు పోయాలి. ఈ విద్యావిధానం ఇలా మారడానికి కారణం ఎవరు? ప్రభుత్వమే అన్నది సమాధానం.. కానీ ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకొనేది.. ఎన్నుకుంది మనమే కదా?! అంటే మన విద్యావిధానం ఇలా తయారుచేసే పాలకులను ఎన్నుకోవడం నాఓటుతోనే. దాన్ని మార్చాలన్నా నాఓటుతోనే సాధ్యం. అసలు ఓటు వేయకపోయినా మనలాంటివారి ఓట్లు పడక ప్రజానాయకులు ఓడిపోతు న్నారేమో? ఒక్కసారి ఆలోచించండి. ఆఓటు వేసే చైతన్యమే మనకు రావాలి. అందుకే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందే. తొలిసారి ఓటు హక్కు పొందినవాళ్లకు ఓ సదవకాశంగా భావించాలి. భావి భారత పౌరులుగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. మన పాలకులు ఎవరో నేనే నిర్ణయించగలనన్న మాట.. ఇలా అనుకుంటుంటేనే నాకెంతో శక్తి ఉందనిపిస్తోంది.
గ్రామీణ పరిస్థితులు..
మా తాతయ్యను చిన్నప్పటి నుంచీ చూస్తున్నా. కౌలుకు తీసుకునే.. వ్యవసాయం చేస్తున్నాడు. ఏడాదంతా కష్టపడతాడు గానీ, అప్పు తప్ప ఇంట్లోకి ఉప్పూ తేలేని పరిస్థితి. రుణమాఫీ అవుతుందని ఎన్నికల కోసం ఎదురుచూడటం అలవాటైపోతుంది. కానీ, ఈ కష్టాలన్నింటికీ.. ఈ వ్యవసాయ విధానం ఇలా కావడానికి ప్రభుత్వానిదేగా బాధ్యత. ఒక్కసారి కూడా దీన్ని ఆలోచించకపోవడం వల్లే..మన భవిష్యత్తును బాగుపరిచే వారికన్నా..తాత్కాలిక ప్రలోభాలకు, వాళ్ల మాయ మాట లకు లోనయ్యి, ఓమందు బాటిల్‌, రెండు పచ్చ నోట్లకు ఆశపడి కొందరు ఓట్లేసేస్తున్నారు. దాంతో మళ్లీ మన కష్టాలు అవే..వారి స్వార్థాలు వారివే…అందుకే మన ఓటుకున్న పవరేంటో చూపిద్దాం. ఆ పవర్‌తో పవర్‌లోకి ప్రజాపక్షం వహించేవారిని తీసుకొద్దాం.
దేశ సార్వభౌమత్వం..?
అంతెందుకు నేను ఇప్పుడు ఇంత చదువుకున్నా నా ఉద్యోగమేంటో.. నా సంపాదనేంటో..నేను ఏదేశం వెళ్లాలా? అందుకు డబ్బులెలా సంపాదించాలా? అక్కడికెళ్లి ఎంత సంపాదించాలా? అదీ కాకపోతే ఏకార్పొరేట్‌ కంపెనీలో ఉద్యోగం సంపాదించాలో అన్నదే నాలాంటి వాళ్ల ఆలోచనగా ఉంది. అంతేకానీ, మన బతుకుల్ని, భవిష్యత్తునూ నిర్ణయించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్న స్పృహ ఉండటం లేదు. అసలు ఓటు నమోదు చేసుకోవాలన్న విజ్ఞత ఉండటం లేదు. నాకు ఓటుందా? నేను ఓటేసే రోజుకు కచ్చితంగా వచ్చి, నా హక్కు నేను కాపాడుకోవాలనే ధ్యాస అసలే ఉండదు. పైగా ఆరోజు ప్రభుత్వం సెలవిస్తే దాన్నీ ఎలా ఎంజారు చేద్దామా? ఓటీ చేసి మరింత సంపాదిద్దామా? అనే ఆలోచిస్తున్నాం. విదేశాలకు వెళ్లేటప్పుడు, అక్కడుండాల్సిన పరిస్థితిలో ఎదురయ్యే ఇబ్బందులకు ప్రభుత్వాలు అనుసరించే విధానాలేనన్నది విస్మరించేస్తున్నాం. ఈరోజు అభివృద్ధి చెందిన దేశాలతో దేశభ విష్యత్తు ను తాకట్టు పెట్టే విధంగా మన విదేశాంగ విధానాలున్నాయి. ప్రపం చంలో విశ్వమానవాళి అభిలషించే పక్షం కాకుండా వేరొకవైపు మొగ్గి ఉన్నామన్నది విస్పష్టం. ఈపరిస్థితికి కారణం మనం ఎన్నుకున్న పాలకుల విధానాలే కారణం. మనం ఇంత చదువుకున్న నాకు ఈ దేశ పౌరునిగా బాధ్యత లేదా? అని నన్ను నేను ఒక్కసారి ప్రశ్నించు కోవాలి. ఈపరిస్థితి మారాలంటే నా ఓటేగా కీలకం. అలాంటి పరిస్థితి ఏర్పడడానికీ నా నిర్లక్ష్యమేగా కారణం. అందుకే నేను ఓటు వేయాలి.
యుద్ధం..కారణం.. : అంతెందుకు ఈ రోజు దేశంలో యుద్ధ వాతావ రణాన్నీ రాజకీయా లకు ఉపయోగించుకునే కుత్సితమైన విధానాలు అనుసరిస్తున్నది చూస్తూనే ఉన్నాం. రాజకీయ ప్రయోజనాల కోసం యుద్ధం వచ్చే పరిస్థితికి సృష్టికర్తలు ఎవరు? కాశ్మీర్‌ సమస్య అలాగే నేటికీ ఉండిపోవ డానికి కారణం ఎవరు? అక్కడి పౌరులపై సైనిక నిర్బంధాల్ని ప్రయోగి స్తూ పిట్టల్లా ప్రాణాలు తీసేస్తున్నారు. అందుకు కారణం ఎవరు? ఈ అత్యవసర పరిస్థితుల్లో కొంతమంది యువత ఉగ్రవాదులుగా తయారు కావడానికి కారకులెవరు? ఇవన్నీ మనం ఎప్పుడైనా ప్రశ్నించు కున్నా మా? ప్రశ్నించామా? ప్రశ్నించుకుంటే.. ఇవన్నీ మారాలంటే ఓటునే ఆయుధంగా చేసుకుంటాం. మన నిర్లిప్తతవల్ల అంతమంది సైనికు లను, పౌరులను బలితీసుకున్నాం. వేడినెత్తురు ప్రవాహం నీకు తగిలే వరకూ నీలోచలనం లేకపోవడానికి బాధ్యత నీదేగా? అని ఇప్పుడు అనిపిస్తుంది. మనదేశ రక్షణకు, సమగ్రతకు మన బాధ్యత ఎంతైనా ఉంది. అందుకు ఉపయోగించాల్సిన అత్యంత శక్తివంతమైన వెపెన్‌ ఓటే! అలాంటి ఓటును ఏదో యథాలాపంగా.. ఏమాత్రం ఆలోచించ కుండా కొంతమొత్తానికి అమ్ముకోవద్దు.. మత్తులో తూగిపోవద్దు.. కుల, మతాల తూకంలో చేరిపోవద్దు. కొన్ని బహుమతులకూ ఆశప డొద్దు. నాలాంటి నిర్లక్ష్యం నిండుగా ఉండేవాళ్లు ఇప్పటికైనా దాన్ని వదిలి చైతన్యంతో ఓటేటస్తే సరి.
వ్యాపారం.. రాజకీయం..: పదవీ వ్యామోహాలతో..రాజకీయ వ్యా పారం జరుగుతున్న పరిస్థితులు నేడు గల్లీ నుంచి ఢల్లీి వరకూ జరుగు తున్నవే. అందుకోసం అవినీతితో అంటకాగడానికి ఏమాత్రం వెను కాడడం లేదు. ఈపరిస్థితి ఎందుకు వచ్చింది? మన చుట్టూనే మనల్ని సర్వనాశనం చేస్తున్న పరిస్థితులు రోజురోజుకు చుట్టుముడుతున్నా.. మనం పట్టించుకోని స్థితిలో ఎందుకున్నాం? ఈరోజు మన రాష్ట్ర రాజకీయాల్లోనేంటీ, దేశ రాజకీ యాల్లోనేంటీ కుటుంబ పాలనలు.. రాష్ట్రాలు, దేశాలు వాళ్ల సొంత ఆస్తులన్నట్లు వ్యవహరిస్తున్నారు. రాజకీయాలను అడ్డంపెట్టుకుని వారి వాణిజ్యాలను విదేశాలకూ విస్తరిస్తున్నారు. అనేక నేరాలకు పాల్పడు తున్నారు. ఒక్క శాతం వద్దే దేశంలోని పెద్దమొత్తంలో డబ్బంతా పోగుబడి ఉంది. కానీ 99శాతం మంది పౌరులు పడరాని కష్టాలు పడుతున్నారు. తినటానికి తిండి లేక, ఉండటానికి గూడులేక, వేసుకోవ డానికి బట్ట లేక. ఆకలితో చచ్చిపోతున్నారు. అప్పులతో ఆత్మహత్యలు చేసుకునే రైతన్నలు. మహిళలపై భ్రూణ హత్యలు, అత్యాచారాలు.. హత్యలు.. అఘాయి త్యాలు నిత్యకృత్యమై ఎందరో బలైపోతున్నారు. వరకట్న హత్యలకైతే లెక్కే లేదు. నిరుద్యోగసైన్యం పెరిగిపోయి, నిరాశ, నిస్పృహలతో బలవన్మరణాలకు పాల్పడడం.. పెడదారులు పట్టడం.. ఉగ్రవాదులు గా తయారుకావడం.. ఇవన్నీ మనమందరం చూస్తున్న నడుస్తున్న చరిత్ర. కానీ,నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరి స్తున్నాం. మనపాటికి మనం మూవీలూ, టీవీలూ చూస్తూ..అదీ కాకపోతే పోర్నోగ్రఫీల్లో ఓలలాడుతూ ఈ ప్రపంచానికి దూరంగా మనల్ని మనం నాశనం చేసుకుంటున్నాం. నాకిప్పుడు అనిపిస్తుంది నా ఓటుతోనే వీటన్నింటి మార్చే అవకాశం ఉందని. అది చేయకపోవడమే ఇన్ని అనర్థాలకు కారణమని. ఈదుస్థితికి నావంతు బాధ్యత నేను వహించాల్సిందే. నాజీవన ఆరాటంలో నేను ఓసరైన గమ్యంలో అయి నా ఉన్నానా అంటే అదీ లేదు. ఈ అగమ్య పరిస్థితులు ఒకవైపు ఉంటే.. మరోవైపు నాతర్వాత తరానికి మరింత దారుణమైన పరిస్థితు లు కల్పిస్తున్నాన్న విషయాన్ని విస్మరిస్తున్నా. ఇప్పటికైనా మనం మేలుకోవాలి.అంతా మేలుకోవాలి.. మన కర్తవ్యం ఓటు వేయడమే. ఓటు అనే ఆయుధంతో మన భవితను, దేశ భవితను సమూలంగా మార్చుకోగల ఓమంచి అవకాశం కోల్పోవద్దు.– శాంతిశ్రీ