ప్రజాస్వామ్యంల ఓటే ఆయుధం

‘‘ ఓ ఓటర్‌ మహాశయా
ఒక్క నిమిషం ఆలోచించండి..
ఓటును కులం, మతం,
పార్టీ ప్రతిపాదికన వేయడం ఆపేయండి
కులం..కేవలం గుర్తింపు మాత్రమే
అభివృద్ధికి మాత్రం కాదూ..
పార్టీ ఎదయినా అభివృద్ధి చేయగల
అభ్యర్ధికే నీ ఓటు వేయండి..!’- గునపర్తి సైమన్‌
‘‘ మంచి పాలకులను ఎంచుకునే హక్కు ప్రజల చేతుల్లోనే ఉంటుంది. కేవలం ఓటు అనే వజ్రాయుధంతోనే అదిసాధ్యం. ప్రజాస్వామ్యం మనకిచ్చిన హక్కు ఓటు. అందరూ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే దానికి సార్థకత ఉంటుంది. అందుకే ఎవరూ ఓటు అనే విలువైన ఆయుధాన్ని నోటుకు అమ్ముకోవద్దు. మనం వేసే ఓటుతోనే నవసమాజ నిర్మాణం సాధ్యమవుతుంది’’
డబ్బుకు, ఇతర ప్రలోభాలకు లోబడి ఓటు వేయడం చట్ట విరుద్ధం. రాజకీయ ప్రజాస్వామ్యం పరిఢ విల్లాలంటే సాంఘిక,ఆర్థిక,సమానత్వాన్ని సాధించాలి. ఐదేళ్లకు ఒక్కసారివచ్చినా, మన జీవితాలను, తల రాతను మార్చేది ఎన్నికలు. మనం వేసే ఓటుతోనే నవసమాజం నిర్మితమౌతుంది. అందుకను గుణంగా ఓటు ఆవశ్యకత, ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటుకున్న పాత్రగురించి యువ ఓటర్లను చైతన్యం చేయాలి. ప్రజాస్వామ్యదేశమైన మనదేశంలో ప్రజలే పరిపాలకులు. మనం వేసే ఓటే మన భవిష్యత్తు, రాబోయే తరాల మనుగడ నిర్ణయిస్తాయి. కానీ మన దేశంలో ఎన్నికల పరిస్థితి దారుణంగా ఉంది. ఎన్నికలసమయంలో దేశం మొత్తంలో 60శాతం పోలింగ్‌ కూడా నమోదు కావడం లేదు. 125కోట్లజనాభా కలిగిన మన దేశంలో సుమారు 100కోట్ల మందిఓటర్లు వుంటే, కేవలం50కోట్లలోపు ఓటర్లు మాత్రమే ఓటు హక్కు వినియోగిం చుకుంటున్నారు. మన దేశపరిస్థితి ఇలా వుంటే, ఇతర దేశాల్లో మాత్రంఓటు వేయడం తప్పనిసరి. ఒకవేళ ఓటువేయకుండా వుంటే ఎన్నికల సంఘం నుంచి జరిమానా పత్రం ఇంటికి వెళుతుంది. అంతేకాదు చట్టబద్దమైన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ మనదేశంలో అనేక మంది ఓటింగ్‌ రోజును కేవలం సెలవు దినంగా మాత్రమే చూస్తారు. ఓటుప్రాముఖ్యతను ఎంతమంది ఎన్నిరకాలుగా చెప్పినా పట్టించుకునే వారు చాలా అరుదు. అందుకే ఇతర దేశాల మాదిరి మన దేశంలో కూడా ఓటుహక్కుపై కఠిన నియమాలు పెట్టవచ్చు. కచ్చితంగా ఓటుహక్కు వినియోగించు కొనేలా ప్రతిపౌరున్ని మేల్కొల్పాలి. ఎన్నికల కమిషన్‌, ప్రభుత్వ పెద్దలు ఈబాధ్యతను నిర్వర్తించాలి. అపుడే మనదేశంలో ప్రజాస్వామ్యం విజయవంతమవుతుంది.
యువతా మేలుకో.. ఓటు విలువ తెలుసుకో : ఏప్రజాస్వామ్య దేశంలోనైనా ప్రజలే నిర్ణేతలు. వారి మనోభావాలను ప్రకటించేందుకు ప్రజల చేతిలో ఉన్న ఏకైక పదునైనఆయుధం ఓటు. రాజకీయ పార్టీల జాతకాలు మార్చాలన్నా.. భ్రష్టుపట్టిన వ్యవస్థకు చరమగీతం పాడాలన్నా వజ్రాయుధం ఇదే. ప్రజలగళం వినిపిం చాలన్నా, ప్రజాస్వామ్య వ్యవస్థ పదిలంగా ఉండాలన్నా ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదై, ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటుకు నేతల రాతనే కాదు..దేశ తలరాతనే మార్చే సత్తా ఉంది. ఓటు హక్కుపై అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఏటా జనవరి 25న ‘జాతీయ ఓటరు దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థలు, చట్టసభలకు ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలంతా ఓటువేయడానికి వెళ్లేలా ఆ రోజున సెలవు దినంగానూ ప్రకటిస్తున్నారు. అయినప్పటికీ ఎవరూఓటు వేసేం దుకు ముందుకు రావడం లేదు. ముఖ్యంగా పల్లెల కంటే పట్టణాల్లో ఓటు శాతం తక్కువగా ఉంటోంది. ప్రతిఒక్కరినీ ఓటరుగా నమోదు చేసేందుకు జిల్లా యంత్రాంగం తీవ్ర కసరత్తులు చేస్తోంది. ముఖ్యంగా గత నెల రోజుల కాలంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది.
యువతలో చైతన్యం వస్తేనే..: ఒక ఓటు దేశ గమనాన్నే మారుస్తుంది. యువతలో చైత న్యం వచ్చి..ఓటు హక్కును సమర్థంగా వినియోగించుకున్న నాడే దేశాభివృద్ధి సాధ్యం. అయితే, జిల్లాలో యువ ఓటర్ల నమోదు ప్రతిసారీ అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. నమోదు పెంచడానికి జిల్లా అధికార యంత్రాంగం ఏటా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది.18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటు హక్కు పొందేలా కార్యక్రమాలు చేపట్టారు. పరిపాలన సజావుగా సాగాలన్నా, సరైన నేతలకు పగ్గాలు ఇవ్వాలన్నా అది ఓటు ద్వారానే సాధ్యమన్న సత్యాన్ని ఓటరు దినోత్సవం నాడైనా అందరూ మననం చేసుకోవాలి. ముఖ్యంగా యువత మేలుకొని ఓటు హక్కు నమోదుకు ముందుకు రావాలని జిల్లా అధికార యంత్రాంగం కోరుతోంది.
ఒక్క ఓటుతో కూలిన ప్రభుత్వాలు : ఎన్నికల్లో అనేక మంది అభ్యర్థులు ఒక్క ఓటుతో ఓడిపోయిన సంద ర్భాలు ఉన్నాయి. పలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వాస పరీక్షలో ఒక్క ఓటుతో ఓడిపోయిన అరుదైన సంఘటనలు చరిత్రలో లేకపో లేదు. గత 2008లో రాజస్థాన్‌ శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేసులో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి సీపీ జోషీకి 62,215 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కళ్యాణ్‌ సింగ్‌కి 62,216 ఓట్లు వచ్చాయి. అయితే, కొందరు టెండర్‌ ఓటు వేశారని కోర్టు దాకా వెళ్లడంతో తిరిగి లెక్కించగా ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో డ్రా తీయడంతో బీజేపీ అభ్యర్థి కళ్యాణ్‌ సింగ్‌ను గెలుపు వరించింది. అదేవిధంగా 2004లో కర్నాటకలోని సంతేమరహళ్ళి స్థానంలో జరిగిన ఎన్నికల్లో జేడీఎస్‌ అభ్యర్థి కృష్ణమూర్తికి 40,751 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి ఆర్‌.ధృవ్‌నారాయణ్‌కు 40,752 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటుతో కృష్ణమూర్తి ఓటమిపాలయ్యారు. అందుకే ఒక్క ఓటు కూడా ఎంతో విలువైనదేనని రాజ్యంగ నిపుణులు అంటున్నారు.
ఓటు కథలో ఎన్ని మలుపులో….:సార్వత్రిక ఎన్నికల వేళ ఇందుగలదని… అందులేదని, సందేహంబు వలదన్నట్లు ఎక్కడ చూసినా, ఏది విన్నా…అక్కడ ఓటు చర్చే సాగుతోంది. రాజకీయం చేసేవారిలోనే కాదు..ప్రజల నోళ్లలోనూ నానుతోంది ఓటే. అసలీ ఓటు కథేంటో తెలుసా? ఓటు వేయడమనేది ఆంగ్లేయుల పాలనా కాలంలోనే మొదలైనా 1988 నాటికి అది ఓ రూపాన్ని సంతరించుకుంది. మన దేశంలో బ్రిటిష్‌ వారి పాలనలో భారతీయులకు పరిమితంగానే కల్పించిన ఓటుహక్కును భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాకే పౌరులందరికీ సార్వత్రిక వయోజన ఓటు హక్కు సాకారమైంది.
ా 1907లో ఏర్పడిన రాయల్‌ కమిషన్‌ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఓటుహక్కుపై చేసిన సిఫార్సుల ఆధారంగా 1909 కౌన్సిల్‌ చట్టం పరిమిత ప్రాతిపదికన భారతీయులకు ఓటు హక్కు వచ్చింది.
ా 1919 కౌన్సిల్‌ చట్టం ఓటు హక్కును కొంత మేర విస్తృత పరిచింది.
ా 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఓటుహక్కు దేశ జనాభాలో 10.5 శాతానికి పెరిగింది.
ా 1947లో రాజ్యాంగ పరిషత్తు ఎన్నికల సందర్భంగా దీనిని 28.5 శాతానికి పెంచారు.
ా స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానానికి కట్టుబడి, రాజ్యాంగం ప్రకారం భారత పౌరులకు సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించారు.
ా ప్రజాస్వామ్యంలో సమానత్వ సూత్రాన్ని అనుసరించి ఒకవ్యక్తికి ఒక ఓటును మాత్రమే కల్పించారు.
ా ఆర్టికల్‌ 325 ప్రకారం కుల,మత,వర్గ,వర్ణ,జాతి,ప్రాంత, లింగ భేదాలు వంటి తేడాలతో ఏవ్యక్తికీ ఓటు హక్కును నిరాకరించ కూడదు.
ా 1952లో సాధారణ ఎన్నికల సందర్భంగా అధికరణ 326 కింద సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించింది. 21 ఏళ్లు పైబడిన వారందరూ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.
ా 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ఓటు హక్కు వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించింది.
విలువ చాలా తక్కువ మందికి తెలుసు. : ఓటు అనే రెండక్షరాలకు ప్రపంచ గతిని మార్చే శక్తి ఉంది. ఓటు వ్యక్తి అస్తిత్వాన్ని గుర్తిస్తుంది, వ్యవస్థ మార్పుకు నాంది పలుకుతుంది. ఉన్నత విలువలతో కూడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన రాజకీయ నేతలే నేరస్తులైతే నేరమయ భారతం నిర్మితమౌతుంది. దీన్ని అడ్డుకొనే సంస్కరణలు తీసుకు రావడానికి 1975లో తార్కుండే కమిటి, 1998లో ఇంద్రజిత్‌ గుప్తా కమిటీలను కేంద్రం ఏర్పాటుచేసింది. ఈ కమిటీలు అనేక ఉన్నతమైన సంస్కరణలు ప్రతిపాదించాయి. అందులో భాగంగానే 1971 నుండి ఎన్నికల కోడ్‌ ఆప్‌ కండక్ట్‌ అమలవుతోంది. లోక్‌సభ ఎన్నికల ఖర్చు 25లక్షలు, అసెంబ్లీ ఎన్నికల ఖర్చు10 లక్షలు దాటకూడదని 2004లో నిబంధనలు విధించిన ప్పటికీ అభ్యర్థులు మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తున్నారు. అభ్యర్థి నేరస్తుడైనా కోట్ల రూపాయల డబ్బు ఉంటే చాలు ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చి ప్రతి పార్టీ ప్రోత్సహిస్తోంది. సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా పాలకుల మితిమీరిన జ్యోక్యంతో సత్ఫలితాలు రావడం లేదు. మంచినాయకత్వం లేకుండా మంచి సమాజం ఏర్పడదు. వయోజనులైన ప్రతి వ్యక్తికీ ఎలాంటి భేదభావాలు లేకుండా ఓటుహక్కును కల్పిం చింది మన రాజ్యాంగం. రాజకీయ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే సాంఘిక, ఆర్థిక, సమానత్వాన్ని సాధించాలని, రాజ్యాంగం యొక్క లక్ష్యం కూడా అదేనని, రాజకీయ ప్రజాస్వామ్యం సామాన్యులకు అందకపోతే బాధితులు ఈ రాజ్యాంగ వ్యవస్థను కూల్చేస్తారని నవంబర్‌ 26, 1949న భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్‌కు సమర్పిస్తూ అంబే డ్కర్‌ హెచ్చరించారు.
ఓటుకూ ఓ లెకుంది…: ఎన్నికల పండగలో ఓటే కీలకం. తమను పాలించే ప్రజాప్రతినిధుల్ని ఎంపిక చేసుకునే అధికారం పౌరులకు దక్కేది దీనితోనే. అయితే సాధారణంగా మనం ఓటు ఒకటే అనుకుంటాం. కానీ ఓటుల్లోనూ రకాలున్నాయని.. ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉందని చాలామందికి తెలియదు. ఈ ఏడాది కొత్తగా ప్రవాస భారతీయులకు కూడా ఓటు హక్కు పొందే అవకాశం కల్పించారు.
ఎన్నారై ఓటు : ప్రవాస భారతీయులకు తొలిసారిగా ఈ ఏడాది జరగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో చదువు, ఉద్యోగం,ఉపాధితో పాటు బంధువుల ఇళ్లకు తాత్కాలికంగా వెళ్లి, ఎన్నికలప్పుడు రాలేని వారి ఈకోసం ఈ అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఫారం-6ఎ ద్వారా ఎన్నారైలు దరఖాస్తు చేసుకుని, తగిన ఆధారాలు చూపించి, ఓటును పొందవచ్ఛు వారి ఆసక్తి మేరకు విదేశాల నుంచి వచ్చి తమ ప్రాంత ప్రజాప్రతినిధిని ఎన్నుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది.
సర్వీసు ఓటు : దేశరక్షణ సంబంధ శాఖల్లో పనిచేసే వారికి ఈఓటు హక్కు ఉంటుంది. ఎన్నికల సమయంలో వారు ఇక్కడకు రాలేరు. అలాంటి వారి ఓటు కూడా కీలకంగా భావించి, ఓటు హక్కును కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు కల్పిస్తు న్నాయి. తపాలాశాఖ, తమ ప్రతినిధి ద్వారా ఈఓటును పంపవచ్ఛు లేని పక్షంలో సరిహద్దుల్లో ఉండే సైని కులు ఎలక్ట్రానిక్‌ టాన్స్‌ఫర్‌బుల్‌ ఓటును ఆన్‌లైన్‌ ద్వారా కూడా వినియోగించుకోవచ్ఛు.
పోస్టల్‌ బ్యాలెట్‌ : ఎన్నికల సమయంలో ఎన్నికల విధులను ప్రభుత్వ ఉద్యోగులే నిర్వహి స్తారు. వీరు కూడా ఓటర్లే కావటంతో తమ ప్రజాప్రతినిధులను ఎంపిక చేసుకోవటంలో వీరు కూడాభాగస్వాములే కాబట్టి వీరికి పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యంఉంది. ఎన్నికల షెడ్యూలు వెలువడిన తర్వాత అందరికంటే ముందు ఓటు హక్కును తపాలాశాఖ ద్వారా పంపవచ్ఛు ఉద్యోగులు తమకు ఓటు ఉన్నచోట అభ్యర్థులకు ఓటు వేసి తిరిగి పోస్టు ద్వారా ఎన్నికల అధికారి చిరునామాకు పంపుతారు. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ ఇస్తున్న సమయంలోనే వీరు తమ ఓటు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా అధికారులకు పంపిస్తారు. ఓట్ల లెక్కింపు అయ్యాక వీటిని లెక్కిస్తారు. కొన్ని సందర్భాల్లో పోస్టల్‌ ఓట్లే కీలకంగా మారుతాయి.’
టెండర్‌ ఓటు : ఓటర్ల జాబితాలో పేరు ఉండి, పోలింగ్‌ బూత్‌లోకి తమ ఓటును వినియోగించుకునేందుకు వెళ్లే సరికి అప్పటికే ఆవ్యక్తి ఓటు హక్కు వినియోగించుకున్నట్లు చూస్తూ ఉంటాం. అనేక సందర్భాల్లో ఈ తరహాలో ఓటర్లు నిరుత్సాహం చెందుతారు. అలాంటి సందర్భాల్లో తాను ఓటు హక్కును వినియోగించుకోలేదని ఎన్నికల అధికారికి నిరూపించి పొందేదే టెండర్‌ ఓటు. ఎన్నికల అధికారి అనుమతితో టెండర్‌ ఓటును వేయవచ్ఛు బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా ఈ తరహా ఓట్లు వేసుకునే అవకాశం కల్పిస్తారు.
సాధారణ ఓటు… : 18 సంవత్సరాలు దాటిన ప్రతీ భారతీయ పౌరుడు అన్ని రకాల ఎన్నికల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించేదే సాధారణ ఓటు. ఫారం-6 నింపి,18 సంవత్సరాలు దాటినట్లుగా, స్థానికంగా నివాసం ఉంటున్నట్లుగా ఆధారాలు చూపిస్తే ఓటు హక్కు కల్పిస్తారు. ఏటా ఓటర్ల నమోదు, ఓటర్ల ముసాయిదా ప్రచురణ జరుగుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు 18 సంవత్సరాలు దాటిన వారంతా ఓటు హక్కు పొందవచ్ఛు మన దేశంలో ఈఓటర్లే కీలకం. బయటి వ్యక్తులువచ్చి ఓటు వేస్తున్నారని పోలింగ్‌ కేంద్రంవద్ద ఎన్నికల ఏజెంట్‌ కానీ, అక్కడి ఓటర్లు కానీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన సందర్భాల్లో ఈఓటు ప్రస్తావన వస్తోంది. అరోపణలు ఎదుర్కొనేవ్యక్తి ఫొటో, ఓటు తమదేనని, సంబంధిత ఓటరు తానేనని నిరూపించి సవాలు చేయవచ్ఛు అనంతరం ఓటు వేసే అవకాశం కలుగుతోంది. ఇలాంటి సందర్భాల్లో ఓటరుపై ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటారు. ఇంకొకరి ఓటు వేసేందుకు వచ్చినట్లు నిర్ధారణ అయినా, అతనిపై చర్యలు తీసుకుంటారు.