చిరు ధాన్యాలు కాదు..సిరి ధాన్యాలు

చిరు ధాన్యాలు ఎక్కువ ఉష్ణోగ్రతలను, బెట్టను తట్టుకొనే పంటలు కనుక కరువు పీడిత ప్రాంతాలలో కూడా పండిరచటానికి వీలుంటుంది. చిరుధాన్యాలలో పీచు పదార్థం, ఇనుము, కాల్షియం, విటమిన్లు అధికంగా ఉండటం వల్ల ఇవి ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. గడిచిన మూడు నాలుగు దశాబ్థాల కాలంలో జీవన శైలిలో వచ్చిన మార్పులు వల్ల మన ఆహార విధానంలోనూ మార్పులు వచ్చాయి. తద్వారా ప్రబలుతున్న దీర్ఘకాలిక వ్యాధుల ద ృష్ట్యా తిరిగి చిరుధాన్యాల వాడకంపై ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో వ్యవసాయాభివ ృద్ధికి తోడ్పడే గ ృహవిజ్ఞాన విభాగం నుంచి చిరుధాన్యాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించే ప్రచారం పెరిగింది. ఇందులో భాగంగా గ ృహవిజ్ఞానంలో పరిశోధకురాలిగా ఉన్న డాక్టర్‌ కీర్తి చిరుధాన్యాల ప్రాముఖ్యత, వాటితో చేసుకోదగిన వంటల గురించి వివరిస్తున్నారు.- కె.కీర్తి
చిరుధాన్యాలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల చిరుధాన్యాల వాడకం పెరుగుతుంది. తద్వారా రైతులు అధికంగా చిరుధాన్యాలను పండిరచడానికి మొగ్గు చూపుతారు. దీనితోపాటు రైతులకు అధిక ఆదాయం పెరిగే చిన్న కుటీర పరిశ్రమలనూ అభివ ృద్ధి చేసుకోవచ్చు. అయితే ప్రస్తుత ఆధునిక యుగంలో ఫాస్ట్‌ఫుడ్స్‌ వాడకం మూలంగా మార్కెట్‌లో చిరుధాన్యాలు లభించినప్పటికి చాలా మందికి వాటిని ఎలావినియోగించాలో తెలియక చిరుధాన్యాల వాడకాన్ని తగ్గించారు. చిరు ధాన్యాల పోషక విలువలను, చిరుధాన్యాలతో వివిధఆహార పదార్థాలను త్వరితగతిని చేసుకునే పద్ధతులపై అవగాహన పెంచడానికి కృషి చేస్తున్నారు గృహ విజ్ఞాన పరిశోధకులు. ఈప్రయత్నంలో భాగంగా చిరుధాన్యాలతో పౌష్టిక విలువలతో కూడిన సంప్రదాయ వంటలు ఎలా చేసుకోవాలో తెలియ జేస్తున్నారు.
చిరుధాన్యాలతో ఆరోగ్యం
మనం రోజూ తీసుకునే వరిఅన్నం, గోధుమల కంటే చిరు ధాన్యాలలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. రోజుతీసుకునే ఆహారంలో చిరుధాన్యాలను కూడా చేర్చడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు. చిరుధాన్యాల సాగుతో వీటి వినియోగ సామర్థాన్ని పెంచడానికి వీలుకలుగుతుంది. చిరుధాన్యాలలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల పిల్లల్లో, మహిళల్లో ఎముకల పుష్టికి అవకాశం ఏర్పడుతుంది. చిరుధాన్యాలలో పీచుపదార్థం,మాసంకృత్తులు, అమైనోయాసిడ్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి కనుక సులభంగా, నెమ్మదిగా జీర్ణం అవుతాయి. అంతేకాదు చిరుధాన్యాలను రోజువారి ఆహారంలో చేర్చ డం ద్వారా గుండె సమస్యలు, మధుమేహం, ఉబకాయం వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
రాగులు – ఆరోగ్య లాభాలు : రాగులు వాడితే ఎముకల పెరుగుదల, దృఢత్వం మెరుగవుతుంది. ఇవి అధిక బరువు నియంత్రణ, మధుమేహ వ్యాధి నియంత్రణ, రక్తహీనత నివారిస్తాయి. గ్లూటెన్‌ ఎలర్జీ, సీలియాక్‌ వ్యాధిగ్రస్తులకు రాగులు అనువైన ఆహారం. రాగిచేదు,కారం,వగరు, తీపిరుచులు కలిగి ఉంటుంది. రాగుల్లో ప్రోటీన్లు,అమినోయాసీడ్లు ఎక్కువగాఉంటాయి. లేలైన్‌,ధియోనైన్‌, ఐసో ల్యూసిన్‌, మిథియోనైన్‌, థైమీన్‌, ట్రిఫ్టోఫైన్‌ వంటి ముఖ్య అమినో యాసిడ్లు ఉండటం వల్ల కండరాలు పనిచేయటానికి, రక్తం ఏర్పడ టానికి, డిప్రెషన్‌లపై పోరాటానికి, శరీర పెరు గుదల హార్మోన్లు విడుదల అవ్వడానికి, మల బద్ధకం,ఊబకాయం, వ్రణాలకి మంచి ఆహా రం. ఇది జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. బాలిం త స్త్రీలలో పాలఉత్పత్తిని పెంచుతుంది. చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. పేగుక్యాన్సర్‌ బారిన పడకుండా ఉండటానికి ఇది చక్కని ఆహారం. రాగికి చలవ చేసే గుణం ఉండటంవల్ల వేసవి కాలంలో ఎండతాపాన్ని తట్టుకోవడానికి రాగిజావ, అంబరిని ఎక్కువగా తీసుకుంటారు. విటమిన్‌-ఎ, బి-1,బి-2, ఇనుము, కాల్షియం వంటి ఖని జాలు అధికంగా ఉండటంవల్ల రాగులను ‘పోషక ధాన్యంగా’ పిలుస్తారు. ఈ రాగులతో రాగిజావ, సేమ్యా,ఇడ్లి,వడ,పుల్లటి పునుగు లు,చెక్కపకోడి, పూరి,బూంది, మురుకులు, పొగడాలు, మిక్స్‌డ్‌ అటుకులు,లడ్డు, సంకటి, బొబ్బట్లు వంటి సంప్ర దాయ వంటకాలు చేసుకోవచ్చు.
జొన్నలు-ఆరోగ్య లాభాలు: జొన్నలతో అధిక శక్తి, పెరుగుదల సాధ్యమవుతుంది. అంతేకాక మలబద్ధకం నియంత్రణ, మధుమేహ వ్యాధి నియంత్రణ, కొలెస్ట్రాల్‌ నియంత్రణతో పాటు గ్లూటెన్‌ ఎలర్జీ, సీలియాక్‌ వ్యాధిగ్రస్తులకు అను వైన ఆహారం. జొన్నలు ఆరోగ్యవంతమైన జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు అధికంగాఉంటాయి. ఇది రక్తహీనతకు, మలబద్ధకానికి చక్కని ఆహారం. కండపుష్ఠికి,ఎముకల పటుత్వాన్ని పెంచు తుంది.కాల్షియం స్థాయిలను క్రమ బద్ధీకరిస్తుంది.రోగనిరోధక వ్యవస్థను పెం పొందిస్తుంది.ఇందులో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. క్యాన్సర్‌ బారినపడ కుండా కాపాడుతుంది. ఇది గ్లూటెన్‌ లేని ఆహారం. ధయామిన్‌, రైబోప్లేరిన్‌ పుష్కలంగా ఉండటంతో నరాల బలహీనతలు, మానసిక రుగ్మతలు, కాళ్లు చేతులు మంటలు, నోటి పుండ్లు, వార్థక్య రుగ్మతల నుంచి కాపాడతాయి. ఇలాంటి జొన్నలతో స్వీట్‌ దోశ, హాట్‌బాల్స్‌, జొన్న పాయసం, జొన్నబజ్జీ, జొన్నసేమ్యా, పాల తాలికలు, ఉప్మా, పొంగలి, జొన్న రవ్వ బిర్యాని, జొన్నరవ్వ, కిచిడి, బూంది, జొన్న వడ, అరటికాయ బజ్జీ, చెక్కలు, జంతి కలు, చెక్క పకోడి, జొన్న అటుకులతో చుడువా, మురిపి, గవ్వలు,లడ్డు, బర్ఫీ, అటుకుల పాయసం, వడియాలు మొదలైన వంటకాలు చేసుకోవచ్చు.
సజ్జలు-ఆరోగ్య లాభాలు: సజ్జలు అధిక శక్తి, శరీర పెరుగుదలకు తోడ్పడతాయి. ఇవి మల బద్ధకాన్ని నియంత్రిస్తాయి. రక్తహీనత నివారణ, కడుపులో పుళ్లను (అల్సర్‌) తగ్గించడం, గ్లూటెన్‌ ఎలర్జీ, సిలియాక్‌ వ్యాధిగ్రస్తులకు అనువైన ఆహారం. సజ్జలు వగరు, తీపి రుచులు కలిగి ఉంటాయి. సజ్జలలో పిండి పదార్థం అధికం, వీటిలో ప్రోటీన్లు, పీచు పదార్థం అధికంగా ఉంటాయి. సజ్జలలో ఉండే అమినోయాసిడ్లు గోధుమలో ఉండే అమినో యాసిడ్లు కంటే తేలికగా జీర్ణమవుతాయి. బి-కాంప్లెక్స్‌ మిటమిన్లు (నియాసిన్‌, మిథియోనైన్‌, థయామిన్‌, రైబోప్లైవిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, లెసిథిన్‌) పోటాషియం, మాంగనీస్‌, జింక్‌ వంటి అవసరమైన అనేక పాత్రలను సమర్థవంతంగా నిర్వర్తిస్తుంది. నియాసిన్‌ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. సజ్జలలో అధికంగా ఉండే భాస్వరం శరీరకణ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషి స్తుంది. జెనిటిక్‌ కోడ్‌ నిర్మాణంలో ముఖ్యమైన న్యూక్లిక్‌ యాసిడ్స్‌లో ఫాస్పరస్‌ ముఖ్యభాగం. కణాల పొరలు, నరాల నిర్మాణంలో పాత్ర పోషించే లిపిడ్స్‌లో కూడా భాస్వరం ఒక భాగం. సజ్జలతో తయారుచేసిన ఆహారాన్ని ప్రతిరోజు తీసుకుంటే స్త్రీలకు మూత్రపిండాలలో ఏర్పడే రాళ్ల సమస్య ఉండదు. శరీరంలో ట్రైగ్లీనరైడ్స్‌ స్థాయిని కూడా తగ్గిస్తుంది. ప్రతిరోజు సజ్జ ఆహరాన్ని తీసుకోవటం వల్ల స్త్రీలలో రొమ్ము క్యాన్సర్‌, పిల్లలో ఆస్తమా సమస్యలు తగ్గుతాయి. సజ్జలలో ఉండే అవసరమైన పోషకం లగ్నిన్‌ శరీరానికి చాలా ప్రయోజనకారి. ఇది క్యాన్సర్‌, గుండె ఆగిపోవటం వంటి ప్రమాదాలను అరికడు తుంది. సజ్జల ఆహారం డయోబెటిక్‌ టైపు-2ను కూడా తగ్గిస్తుంది. సజ్జలతో మసాలా రొట్టె, అప్పాలు, స్వీట్‌ పూరి,సేమ్యా, బిర్యాని, బూంది, వాంగీబాత్‌, నమక్‌ ఏరా, సజ్జ పకోడి, చెక్క పకోడి, మంచూరియా, బూంది లడ్డు, బొబ్బట్లు, మిఠాయి, బాదుషా, లడ్డు.
కొర్రలు ఆరోగ్య లాభాలు : శరీర పెరుగుదల, శరీర నిర్మాణంలో కొర్రలు తోడ్పడతాయి. సిలియాక్‌ జబ్బుకు అనువైన ఆహారమిది. కొర్రలు తీపి, వగరు రుచులు కలిగి ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు, రక్త హీనత నివారణలో ఇది మంచి ఆహారం. శరీరంలో కొలస్ట్రాల్‌ పరిమాణాన్ని తగ్గిస్తుంది. వీటిలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కొర్రలలో అధిక పీచుపదార్థం, మాంసక ృత్తులు, కాల్షియం, ఐరన్‌, మాంగనీస్‌, మెగ్నీషియం, ఫాస్పరస్‌, విటమిన్లు అధిక పాళ్లలో ఉంటాయి. కనుక చిన్న పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు మంచి ఆహారం. ఇవి ఉదర సంబంధ వ్యాధులకు మంచి ఉపశమనం కలిగిస్తాయి. కడుపు నొప్పి, మూత్రం పొసేటప్పుడు మంటగా ఉండటం, ఆకలిమాంద్యం, అతిసారం మొదలగు వ్యాధులకు ఔషధాహారం. మాంసకృత్తులు, ఇనుము ఆధికంగా ఉండటం వల్ల రక్తహీనత నివారణకు చక్కటి ఔషదం. పీచు పదార్థం అధికంగా ఉండటంవల్ల మలబద్ధకాన్ని అరికడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో జ్వరం వచ్చినప్పుడు కొర్ర గంజి తాగి దుప్పటి కప్పుకుని పడుకుంటే జ్వరం తగ్గిపోతుందని పెద్దల అనుభవం చెబుతుంది. గుండె జబ్బులు, రక్తహీనత, ఊబకాయం, కీళ్లవాతం, రక్తస్రావం, కాలిన గాయాలు త్వరగా తగ్గుటకు కొర్రలు తినడం మంచిది. కొర్రలతో కొర్ర పాయసం, కొర్ర లడ్డు చేసుకోవచ్చు.
సామాలు-ఆరోగ్య సూత్రాలు : సామాలతో అధిక శక్తి, శరీర పెరుగుదల ఉంటుంది. రక్తహీనత నివారణ, మలబద్ధకం నియంత్రణలో సహకరిస్తుంది. గ్లూటెన్‌ ఎలర్జీ వారికి, సీలియాక్‌ వ్యాధిగ్రస్తులకు అనువైన ఆహారం.
వరి గడలు-ఆరోగ్య సూత్రాలు : వీటితో మధుమేహ వ్యాధి, కొలెస్ట్రాల్‌, మలబద్ధకం నియంత్రణలో ఉంటాయి. గ్లూటెన్‌ ఎలర్జీ వారికి, సిలియాక్‌ వ్యాధిగ్రస్తులకు అనువైన ఆహారం.
అరికలు-ఆరోగ్య సూత్రాలు : అరికలు అధిక శక్తి, శరీర పెరుగుదలను ఇస్తాయి. వీటితో మధుమేహ వ్యాధి, మలబద్ధకం నియంత్రణలో ఉంటాయి. ఇవి అధిక బరువును నియంత్రి స్తాయి. ప్రస్తుతం అన్ని వయసుల వారిలోనూ ఆరోగ్య స్ప ృహ పెరుగుతోంది. అందుకు తగినట్టుగానే ఆహారంలోనూ మార్పులు వస్తున్నాయి. ఎలాంటి పురుగు మందులు, రసాయనాలు వేయకుండా, సేంద్రీయ పద్ధతిలో పండిరచిన పంటలతో చేసిన వంటలనే కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, బియ్యం, గోధుమలు, అపరాలు వంటి ఆహారోత్పత్తులకు నగరంలో ఏటేటా అనూహ్య ఆదరణ లభిస్తోంది. ఆహార ప్రియుల ‘స్వచ్ఛమైన’ అభిరుచికి అనుగుణంగానే వందల కొద్దీ చిన్న, పెద్ద సంస్థలు, కార్పొరేట్‌ దిగ్గజాలు, రైతు సహకార సంఘాలు సైతం మార్కెట్‌లో పోటీ పడుతున్నాయి. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో ఏటా సుమారు రూ.వెయ్యి కోట్ల ఆర్గానిక్‌ ఆహార పదార్థాల విక్రయాలు జరుగుతుండగా, ఒక్క హైదరాబాద్‌లోనే సుమారు రూ.80 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. ఒక అంచనా మేరకు సుమారు 70 వేల కుటుంబాలు నిత్యం సహజంగా పండిన ఆహార పదార్థాలను తీసుకుంటుండగా, మరో 20 వేల కుటుంబాలు ఆర్గానిక్‌ రుచులను మాత్రమే ఆస్వాధిస్తున్నాయి. ఏటా ‘ఆర్గానిక్‌’ ఆహార ప్రియుల సంఖ్య పెరుగుతోంది. నగర జీవనంలో పెరుగుతున్న ఒత్తిళ్లు, రకరకాల అనారోగ్య సమస్యల నుంచి శాశ్వత విముక్తిని, ఊరట పొందాలంటే అత్యధికంగా పిండిపదార్థాలు ఉండే బియ్యం కంటే.. పోషక విలువలు, పీచు పదార్థాలు సమ ృద్ధిగా ఉండే మిల్లెట్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు.
పాత వైపు కొత్త చూపు..
ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ ఫెస్టివళ్లు, నోరూరించే రకరకాల వంటకాలు, బిరియానీ ఘుమఘు మలు, వెరైటీ వెజ్‌, నాన్‌ వెజ్‌తో రోజూ పసందైన విందు భోజనాలు ఆరగించే నగర వాసులు ఇప్పుడు ‘పాత’ తరానికి పయనమవు తున్నారు. అలనాటి ఆహార పదార్థాల వైపు దృష్టి సారించారు. జీవనశైలి వ్యాధులకు దూరంగా, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా బతికిన నిన్నటి తరం ఆహారపు అలవాట్లను నేటి తరం ఎంతో ఆసక్తిగా పరిశీస్తోంది. ఒకప్పుడు ప్రధాన ఆహారంగా ఉన్న సజ్జలు, కొర్రలు, కొర్రలు, వరిగెలు, ఊదలు, సామలు, జొన్నలు, రాగులు, వరిగెలు వంటి చిరు ధాన్యాలకు అనూహ్యమైన డిమాండ్‌ పెరిగింది. కాల్షియం బాగా ఉండి అనేక రకాల జీవన శైలి వ్యాధుల నుంచి విముక్తి కల్పిండంలో దోహదం చేసే రాగులకు, స్థూలకాయాన్ని అదుపులో ఉంచే కొర్రలకు నగరవాసులు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇంటికి.. వంటికీ కూడా..
సహజమైన జీవన విధానంలో కేవలం ఆహార పదార్థాలే కాకుండా కూరగాయలు, ఆకు కూరలు, సబ్బులు, షాంపూలు, వంట నూనెలు, కాస్మోటిక్స్‌ కూడా చేరాయి. మొరార్కో, ఫ్యాబ్‌ ఇండియా, 24 లెటర్‌ మంత్ర, ఈకోఫుడ్స్‌, కాన్షియస్‌ ఫుడ్‌, నేచర్‌ బాస్కెట్‌ వంటి వ్యాపార దిగ్గజాలు నగరవాసుల అభిరుచికి తగ్గట్టుగా ఆర్గానిక్‌ ఉత్పత్తులను అందజేస్తున్నాయి. ఇక దక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ, రైతునేస్తం, సహజ ఆహారం, ధరణి నేచురల్స్‌, గ్రామీణ్‌ మాల్‌ వంటి సంస్థలు, రైతు సహకార సంఘాలు సేంద్రియ ఎరువులతో పడిరచిన పంటలతో మహానగరానికి పల్లెకు మధ్య బాటలు వేశాయి. సూపర్‌మార్కెట్లలో ఇప్పుడు బ్రౌన్‌రైస్‌, జొన్నలు, రాగులు తప్పనిసరి విక్రయ వస్తువులయ్యాయి. ఆన్‌లైన్‌ అమ్మకాలు సైతం జోరందుకున్నాయి.
సహజ ఆహారమే ఎందుకు..
ప్రస్తుతం కాలంలో బియ్యం నుంచి పప్పులు, వంట నూనెల వరకు అన్నింటా కల్తీయే రాజ్యమేలుతోంది. 34 ఏళ్ల క్రితమే నిషేధించిన ఇతియాన్‌, డీడీటీ, బీహెచ్‌సీ వంటి ప్రమాద కరమైన పురుగుమందుల అవశేషాలు ఇప్పటికీ బయటపడుతున్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం వంటి వ్యాధులకు రాజధానిగా మారిన హైదరాబాద్‌లో ఇలాంటి కల్తీ ఆహారాలు ప్రజలను మరింత అనారోగ్యం బారిన పడేస్తున్నాయి. చిన్న వయసులోనే అనేక రోగాలు దరిచేరుతున్నాయి. ఎదుగుతున్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి క్షీణిస్తోంది. కల్తీ ఆహారం మేధో వికాసానికి సైతం బ్రేకులు వేస్తోంది. వైద్యనిపుణుల అంచనా మేరకు నగరంలో సుమారు 20 లక్షల మంది మధు మేహంతో బాధపడుతుండగా..మరో 25 లక్షల మందికి పైగా అధికరక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి అనర్థాల నుంచి బయటపడేందుకు ప్రజలు ఇప్పుడు ఆర్గానిక్‌, మిల్లెట్స్‌ ఆహారాన్ని కోరుకుంటున్నారు. వ్యాధులకు గురై, రకరకాల మందులు మింగుతూ రోగులుగా బతకడం కంటే..సహజ ఆహారంతో అసలు వ్యాధులే రాకుండా ఉంటా యనే నమ్మకం ప్రజల్లో బాగా పెరిగింది. ఒకప్పుడు ముడి బియ్యం అన్నమంటే చాలా మందికి తెలిసేది కాదు. పుష్కలమైన పీచు పదార్థాలు, పోషక విలువలు ఉన్న ముడి బియ్యం తీసుకొనే వారి సంఖ్య ఇటీవల అధికమైంది. ఇదొక్కటే కాదు.. అన్ని ఆహార ఉత్పత్తులూ రైతు క్షేత్రాల నుంచి నేరుగా నగరానికి వస్తున్నాయి. మహారాష్ట్ర లోని వార్ధా నుంచి సహజమైన గోధుమలు, యావత్‌మాల్‌ నుంచి సోయాబీన్స్‌, తమిళనాడు నుంచి స్వచ్ఛమైన నువ్వులు, నువ్వుల నూనె, కేరళ నుంచి సహజమైన సుగంధ ద్రవ్యాలు సైతం ప్రస్తుతం నగర మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండడంతో చాలామంది అటువైపే చూస్తున్నారు.- రిసెర్చ్‌ అసోసియేట్‌,
గృహ విజ్ఞాన విభాగం, కృషి విజ్ఞాన కేంద్రం గరికపాడు, కృష్ణాజిల్లా.

పాలకుల నిర్లక్ష్యం…ఆదివాసీలకు శాపం

‘‘ ఆక్రమిత అటవీ భూముల నుంచి ఆదివాసీలను, ఇతర సంప్రదాయ అటవీ నివాసితులను(ఓటీఎఫ్‌డీ) తొలిగించే విషయంపై ఆయా రాష్ట్రాలకు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీచేయడం గిరిజనులలో కలకలం రేపుతున్నది. అటవీ హక్కు చట్టం-2006 కింద భూ యాజమాన్య హక్కు దరఖాస్తులు తిరస్కరణకు గురైన ఆదివాసీలను, ఓటీఎఫ్‌డీలను అటవీ ప్రాంతం నుంచి తొలిగించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా 21 రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జరిగే జూలై 17లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టంచేసింది ’’- గునపర్తి సైమన్‌
అటవీ భూములపై హక్కులు లేకుండా అక్రమంగా నివసిస్తున్న వారిని ఖాళీ చేయించాలని ఆదేశిస్తూ ఫిబ్రవరి13వ తేదీన తను ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అటవీ హక్కుల చట్టం(ఎఫ్‌ఆర్‌ఏ)2006 కింద అటవీ భూముల హక్కుల కోసం చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురైన దాదాపు 11.8 లక్షల మందిని ఖాళీ చేయించాలని సుప్రీంకోర్టు నాటి ఆదేశాల్లో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌పై జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేత ృత్వంలోని ధర్మాసనం గురువారం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, దరఖాస్తుల తిరస్కరణ ప్రక్రియలో పాటించిన విధివిధానాలపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా 16 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు నాలుగు నెలల్లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అటవీ హక్కుల కోసం చేసుకున్న దరఖాస్తులు భారీ సంఖ్యలో తిరస్కరణకు గురయ్యాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటన్నింటినీ పరిశీలించి అఫిడవిట్లు సమర్పించాలని కోరింది.
అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం 2005 డిసెంబరుకు ముందు నుంచి అడవుల్లో నివసిస్తున్న గిరిజనులు, మూడు తరాలుగా(75ఏళ్లు) అక్కడే నివసిస్తున్న ఇతర సంప్రదాయ తెగలు వారి వారి భూములపై హక్కులు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలి. అయితే, ఇలా చేసుకున్న దరఖాస్తుల్లో కేవలం 44.83 శాతం మాత్రమే ఆమోదం పొందాయి. ఆచరణయోగ్యం కాని గడువు, తగిన సమాచారం లేకపోవడం, రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీలు సమావేశాలు నిర్వహించకపోవడం, జిల్లా యంత్రాంగం నుంచి తగిన సహకారం అందకపోవడం వంటి కారణాల వల్ల ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయన్న ఫిర్యాదులు వచ్చాయి. ప్రక్రియ సవ్యంగా సాగక పోవడం వల్లే హక్కుదారులు పత్రాలు పొందలేకపోయారన్న ఆరోపణ లున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి13 నాటి సుప్రీంకోర్టు ఉత్తర్వు లక్షలాది మంది గిరిజనులపై ప్రభావం చూపుతోందని, అటవీ హక్కుల కోసం చేసుకున్న దరఖాస్తులను విధిగా గ్రామసభలు, రాష్ట్ర యంత్రాంగం పరిశీలించాయా? లేదా ? అన్న అంశాలను చూడాల్సిన అవసరం ఉందని కేంద్రం చేసిన అభిప్రాయంతో ధర్మాసనం ఏకీభవించింది. అటవీ హక్కులు లేనివారిని ఖాళీ చేయించే ముందు ప్రక్రియ సవ్యంగా సాగిందా లేదాఅనే అంశంలో రాష్ట్రాలు తగిన అఫిడవిట్‌ సమర్పించాల్సిన అవసరం ఉందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా నివేదించారు. ‘గిరిజనులను ఖాళీ చేయించే ప్రక్రియ ను నిలిపివేయాలి. నిరుపేదలు, నిరక్షరాస్యులుగా ఉన్న గిరిజనులు తమ అటవీ హక్కులపై తగిన ఆధారాలు పొందలేకపోయి ఉండొచ్చు. ప్రక్రియ అమలుపై తగిన సమాచారం లేకుండా వారిని తొలగించడం వారికి అన్యాయం చేయడమే అవుతుంది’అని నివేదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ తిరస్కరణకు గురైన దరఖాస్తులను సమీక్షించేందుకు యంత్రాంగం ఎందుకు లేదని ప్రశ్నించింది. ‘తిరస్కరణకు గురైన దరఖాస్తుల వివరాలు సమర్పించాలని 2016లో రాష్ట్ర ప్రభుత్వాలను కోరగా ఇప్పటిదాకా స్పందించలేదు. మేం ఉత్తర్వులిచ్చాక మాత్రమే వాటిని సరిచేయాలంటూ అడుగుతోంది. ఇప్పడు ప్రస్తావించిన అంశాలను గతంలో ఎందుకు లేవనెత్తలేదు. ఇంతకాలం ఎందుకు నిద్రపోయింది’అని ప్రశ్నించింది. సంప్రదాయ హక్కులు కలిగిన గిరిజనుల అటవీ భూములను గొప్పవ్యక్తులు’ఎవరూ ఆక్రమించరాదని కోర్టు పేర్కొంది. పిటిషనర్‌ అయిన వైల్డ్‌ లైఫ్‌ ఫస్ట్‌ స్వచ్ఛంద సంస్థ తరపున సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌ వాదనలు వినిపిస్తూ వాస్తవికమైన లక్షలాది దరఖాస్తులకు న్యాయం జరిగిందని వివరించారు. మొత్తం 42,24,951 దరఖాస్తులు రాగా 18,94,225 పట్టాలు పంపిణీ అయినట్టు వివరించారు. తదుపరి విచారణను ధర్మాసనం జూలై 10వతేదీకి వాయిదావేసింది. అటవీ హక్కుల చట్టం అమలుపై ఇటీవల సుప్రీంకోర్టు జారీచేసిన మధ్యంతంఉత్తర్వులు ఆదివాసీలకు, తరతరాలుగా అడవుల్లో నివసిస్తున్న నిరుపేదలకు పిడుగుపాటు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా దేశంలోని 21రాష్ట్రాల్లో అడవులనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న 23.30 లక్షల గిరిజన, గిరిజనేతర కుటుంబాలనుకోర్టు ఆర్డర్‌ తీవ్రఆందోళనకు గురి చేసింది. యుపిఎ-1ప్రభుత్వ హయాంలో 2006లో తీసుకొచ్చిన అటవీహక్కుల చట్టం అమల్లో భాగంగా ఆదివాసీలు తమఅధీనంలో ఉన్న భూములను గుర్తించివాటిపై యాజమాన్య హక్కులు కల్పిం చాలని దరఖాస్తులు పెట్టుకున్నారు. ఆవిధంగా పెట్టుకున్న అర్జీలను తిరస్కారానికి గురయ్యాక కూడా ప్రభుత్వాలు ఇంకా వారిని భూముల నుంచి ఖాళీ చేయించలేదన్నది కేసు వేసిన ‘వైల్డ్‌ లైఫ్‌ఫస్ట్‌’ సంస్థ అభియోగం. విచారించిన న్యాయస్థానం అర్జీలు తిరస్కరించినా ఇంకా భూముల్లో ఉన్న వారిని ఖాళీ చేయిం చాలని రాష్ట్రాలను ఆదేశించింది. కేసు వాయిదా తేదీని జులై 24గా పేర్కొని ఆలోపు గిరిజనులను, గిరిజనేతరులను భూము లనుంచి ఖాళీ చేయిం చాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శు లను ఆదేశించింది. కోర్టుఆదేశాల అమలు దిశగా రాష్ట్రాలు అడుగులేస్తుండటంతో గిరిజనుల్లో భయోత్పాతాలు బయలు దేరాయి. కోర్టుకేసు వేసిన వారి కోణంలో అటవీ హక్కుల చట్టం అమలును చూసింది తప్ప పూర్వాపరాల జోలికి పోలేదనిపిస్తుంది. అందుక్కారణం కేంద్ర ప్రభుత్వమే. కేసు వేసిన వారు అటవీశాఖలో పని చేసిన మాజీ అధికారులు. చట్టంలో లొసుగులను ఆమూలాగ్రం ఔపోసన పట్టినవారు. వన్యప్రాణుల సంరక్షణ ముసుగులో ఆదివాసీలను, అటవులనే నమ్ముకున్న ఇతర పేదతరగతులను భూముల నుంచి వెళ్లగొట్టి ప్రైవేటు కంపెనీలకు, కార్పొరేట్లకు ధారాదత్తం చేయాలన్న కుట్ర ఈకేసు వెనుక దాగుందనిపిస్తుంది. సహజ వనరుల దోపిడీకి కార్పొరేట్లకు అవకాశం కల్పించేలా చట్టాలను మారు స్తూ విధానాలను రూపొందిస్తున్న మోడీసర్కారు కోర్టులో అంటీముట్టనట్లు వ్యవహరించింది. గిరిజన సంక్షేమ వ్యవహారాలు చూసే మంత్రిత్వశాఖకు కాకుండా అటవీ శాఖకు కేసు బాధ్యత అప్పగించింది. కేసు విచారణ సమ యంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి గైర్హాజరయ్యారు. దీంతో న్యాయస్థానం కేసు వేసినవారికి అనుకూలంగా ఉత్తర్వులిచ్చింది. వాజ్‌పేయి సర్కారు 2002లో లక్ష లాది మంది ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొడుతూ ఉత్తర్వులి చ్చింది. ఆపూర్వరంగంలో చూసినప్పుడు ప్రస్తుత మోడీ ప్రభుత్వం కూడా గిరిపుత్రుల హక్కులకు ఉద్దేశపూర్వ కంగానే హాని తలపెట్టిందని అర్థమవుతోంది. యుపిఎ-1ప్రభుత్వ సమయంలో ప్రజాసంఘాల కృషితో గిరిజనుల అధీనంలోని భూములపై వారికే హక్కులు కల్పిం చేందుకు అటవీ హక్కుల చట్టం వచ్చింది. చట్టమైతే వచ్చింది కాని పూర్తి స్థాయిలో ఆచరణాత్మకం కాలేదు. గిరిజనులకు హక్కులు కల్పిం చాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కొర్రీలు వేసి సాంకేతికాంశాలతో లక్షలాది దరఖాస్తులను పరిష్కరించకుండా ఏళ్లుపూళ్లు గడుపు తున్నాయి. అటవీ హక్కుల చట్టం కోసం పోరాడిన గిరిజనులు చట్టం అమలు కోసం పోరాటాలు చేయాల్సి వచ్చింది. రాజ్యాంగం ప్రకారం గ్రామసభలు నిర్వహించి గిరిజనుల అర్జీలను పరిష్కరించాలి. అక్కడ తేలకపోతే రాష్ట్ర స్థాయి వరకు వివిధ స్థాయిల్లో అప్పీలు చేసుకోవచ్చు. ప్రభుత్వాల్లో గిరిజన వ్యతిరేకత గూడుకట్టు కోవడంతో అటవీ భూములపై హక్కుల కోసం గిరిపుత్రులు న్యాయ స్థానాలను సైతం ఆశ్రయించాల్సి వస్తోంది. నిరుడు డిసెంబర్‌ నాటికి భూములపై హక్కు ల కోసం దేశవ్యాప్తం గా42 లక్షల అర్జీలు అందితే 18లక్షలు మాత్రమే (40శాతం) పరిష్క రించారు. పరిష్కరించా రంటున్న వాటిలో తిరస్కరించినవి కూడాఉన్నాయి. ఎ.పిలో1.14లక్షల ఎకరాలకు సంబంధించి 66, 351 అర్జీలను తిరస్కరించారు. సుప్రీం ఆర్డర్‌ అమలు చేస్తే ఆమేరకు గిరిజనులు భూములను కోల్పో యి నిరాశ్రయు లవుతారు. దేశంలో21రాష్ట్రాల్లో ఇదేపరిస్థితి. కోర్టు ఉత్తర్వులకు కేంద్ర ప్రభుత్వ అసమర్ధ వాదనలే కారణం. అందుకు ప్రాయశ్చిత్తంగా ఆర్డినెన్స్‌ తీసుకురావాలి. హడావుడిగా త్రిపుల్‌ తలాక్‌ పైన, మెడికల్‌ కౌన్సిల్‌ పైన ఆర్డినెన్సులు తేగలిగిన మోడీ ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా లక్షలాది గిరిజనులు నిరాశ్రయులు కాకుండా నిలవరించడానికి ఒక ఆర్డినెన్సు తేవడం అసాధ్యంకాదు. కాకుంటే ప్రాయ శ్చిత్తం చేసుకునే నిజాయితీ మోడీ ప్రభుత్వానికి ఉన్నదా అన్నదే సందేహం. ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా లక్షలాది గిరిజన కుటుంబాలు నిరాశ్రయులు కాను న్నాయి. వీరిలో ఎక్కువశాతం పోలవరం నిర్వాసి తులే. వారికి అటవీ హక్కుల పట్టాలు ఇవ్వకుండా నష్టపరిహారాన్ని, పునరావాసాన్ని నిరాక రించే దుష్ట తలంపుతోనే రాష్ట్రంలో 66వేల మంది క్లెయిములను తిరస్కరించారు. ఇప్పుడీసుప్రీం ఆదేశాలను అడ్డం పెట్టుకుని వారం దరినీ బలవం తంగా ఖాళీ చేయించేందుకు సైతం వెనకాడరు. ఈవిష యమై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా తాత్సారం చేసి ఎన్నికల పబ్బం గడుపుకునే యోచన కూడా చేయవచ్చు. చైతన్యవం తమైన ప్రజా ఉద్యమ ఆవశ్యకతను ప్రస్తుత పరిస్థితి సూచిస్తోంది.
నేరం ప్రభుత్వాలది-శిక్ష ఆదివాసీలకా
దేశం మొత్తంపై 21 రాష్ట్రాల్లో 42.19 లక్షల మంది పట్టాల కోసం దరఖాస్తు చేసుకుంటే 18.89 లక్షల మందికే పట్టాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో 66,350, తెలంగాణలో 80,000, గుజరాత్‌లో 1,82,869, కర్నాటకలో 1,76,540 దరఖాస్తులు తిరస్కరించారు. కేరళలో వామపక్ష ప్రభుత్వం మాత్రమే ఆదివాసీలకు అనుకూలంగా దరఖాస్తులు పరిష్కరించింది. మొత్తం 39,999 దరఖాస్తుల్లో 894 మాత్రమే తిరస్కరించింది. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం ఆదివాసీలకు వ్యతిరేకమైనప్పుడు చట్టం ఎలా అమలు జరుగుతుంది? కేరళ వామపక్ష ప్రభుత్వం 99 శాతం దరఖాస్తుదార్లకు పట్టాలు ఇవ్వడం ద్వారా ఆదివాసీల వాస్తవ హక్కులను గుర్తించింది కదా! ఆదివాసీలు సాగు చేస్తున్న భూమికి పట్టాలు ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే. ప్రభుత్వమే అన్యాయంగా వ్యవహరిస్తుంటే ఆదివాసీలకు హక్కు పత్రాలు ఎలా వస్తాయి? ఎవరి హక్కు పత్రం వారే రాసుకునే అవకాశం లేదు కదా? కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాది/అధికారి కోర్టుకు హాజరై వాస్తవ పరిస్థితులను వాదనకు పెట్టి ఉంటే కోర్టు తీర్పు మరోలా వచ్చి ఉండేదేమో? కీలక సమయంలో కేంద్ర ప్రభుత్వం కోర్టుకు గైర్హాజరై ఆదివాసీ వ్యతిరేకులైన పదవీ విరమణ చేసిన అటవీ అధికార్ల వాదన నెగ్గేందుకు సహకరించింది. బిజెపి ఆదివాసీ వ్యతిరేకినని రుజువు చేసుకుంది.
అనాదిగా ఆదివాసీలకు అన్యాయం
ఆదివాసీలకు చారిత్రకంగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దు తున్నట్లు 2006 అటవీ హక్కుల చట్టం భాష్యం చెప్పింది. మైదానాల్లో ఎవరు సాగు చేసుకున్న భూమి వారికి దఖలుపర్చిన ప్రభుత్వాలు ఆదివాసీలకు అడవిపై హక్కును ఇవ్వకుండా తరతరాలుగా అన్యాయం చేస్తూ వచ్చాయి. నాటి రాజులు, అనంతరం బ్రిటిష్‌ పాలకులు, స్వాతం త్య్రం అనంతరం ఏర్పడిన ప్రభుత్వాలు అడవి మీద ఆధారపడి జీవిస్తున్న ఆదివాసీలను దురాక్రమణదారులుగానే పరిగణించాయి. నేడు వారిని ఏకంగా అడవి నుండి గెంటివేస్తున్నారు. 5వ షెడ్యూల్డ్‌ ఏరియాలో రాజ్యాంగం, పీసా చట్టం భూమికి సంపూర్ణ రక్షణ కల్పించి నప్పటికీ మోడీ ఉల్లంఘించి కార్పొరేట్లకు ఇచ్చేశారు. పోలవరం ప్రాజెక్టులో వేలాది ఎకరాల అటవీ భూమి మునిగిపోతుంది. రాజధాని నిర్మాణానికి 50వేల ఎకరాల అటవీ భూమి కావాలని చంద్రబాబు అడగడం, కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించడం అందరికీ తెలిసిందే. తక్షణమే ఆదివాసీ హక్కులను రక్షిస్తూ కేంద్రం ఆర్డినెన్సు తేవాలని, రాష్ట్రంలో ఆదివాసీలు చేసుకున్న దరఖాస్తులకు హక్కు పత్రాలు 27.7.2019లోపు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ఆదివాసీలంతా ఉద్యమించాలి.
అడవి బిడ్డలకు ఊరటనిచ్చిన సుప్రీం స్టే
అటవీ ప్రాంతాల నుండి ఆదివాసీలను తొలగించాలన్న ప్రభుత్వ ఆదేశాలపై సుప్రీం కోర్టు ఫిబ్రవరి 21న (గురువారం) స్టే ఇచ్చింది. సుప్రీం కోర్టు తీర్పు అడవి బిడ్డలకు ఊరటనిచ్చింది. 11.8 లక్షల ఆదివాసీలను తొలగించాలని ఫిబ్రవరి 13వ తేదీన కేంద్ర ప్రభుత్వం 21 రాష్ట్రాలకు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు ఈ రోజు నిలిపేసింది. అడవి బిడ్డల వాదనలను తోసిపుచ్చుతూ అవలంబించిన కేంద్ర ప్రభుత్వ విధానాలను వివరంగా అఫిడవిట్‌ లో దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆదివాసీలను అడవుల నుండి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను నిలుపుదల చేయాలని కోరుతూ.. దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పింది. ఇన్నేళ్లుగా నిద్ర పోతున్నందుకు కేంద్ర ప్రభుత్వాన్ని మందలించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున జాప్యం జరిగిందని సాలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అంగీకరించడంతో మీరు ఇప్పుడే నిద్ర లేచారా.. అని కేంద్ర ప్రభుత్వంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టులో రాష్ట్రాలు దాఖలు చేసిన అఫిడవిట్ల ప్రకారం.. షెడ్యూల్డ్‌ తెగలు, అటవీ హక్కుల చట్టం కింద ఇతర సంప్రదాయ అటవీ నివాసులతో సుమారు 11,72,931 (1.17 మిలియన్‌) ఎకరాల భూమి, భూ యాజమాన్యం హక్కుల వాదనలు, వివిధ కారణాలపై తిరస్కరించబడ్డాయి. ఈ భూమి కనీసం మూడు తరాల నుండి వారి స్వాధీనంలో ఉన్నట్టు నిరూపించలేక పోయినవారు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత చట్టాల ప్రకారం.. ఆ భూములను ఖాళీ చేయించాలని ఫిబ్రవరి 13 న జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ నవీన్‌ సిన్హా, జస్టిస్‌ ఇందిరా బెనర్జీల బెంచ్‌ ఆదేశించింది.

ఆదివాసీల అన్యాయంపై..ఊరాటనిచ్చిన సుప్రీం కోర్టు స్టే’

ఆదివాసీలు తరతరాలుగా అడవులపై గిరిజనులు వారసత్వపు హక్కు సహజంగానే అనుభవిస్తూ వస్తున్నారు. అడవులను ఆదాయ వనరులుగా ప్రభుత్వాలు గుర్తించడం ప్రారంభించనప్పటి నుంచి అటవీ వినియోగం నుండి గిరిజనులను దూరం చేయడం మొదలైంది. వారి సాంప్రదాయక హక్కులు హరింపజేస్తూ ఎన్నో చట్టాలు రూపొందించడం జరిగింది. అటవీ సంరక్షణ, క్రమబద్దీకరణ పేరుతో వారి హక్కులు కాలరాసి రాయితీలు కల్పిస్తూ నియమాలు రూపొందించారు. దేశవ్యాప్తంగా అటవీ భూవనరులపై హక్కుకోసం ఆదివాసీల పోరాటం సలిపారు. ఫోరాట ఫలితంగా ది షెడ్యూల్‌ ట్రైబ్స్‌ ఇతర సాంప్రదాయక అటవీ నివాసుల అటవీహక్కుల గుర్తింపు చట్టం`2006 నెం.2/2007ను భారత పార్లమెంట్‌లో 2006, డిసెంబరు 15న ఆమోదం పొందింది. అయినా సరే దీని అమల్లో ఆదివాసీ ప్రజలకు అన్యాయం జరుగుతూనే వస్తోంది. ఈ చట్టం ఆదివాసీలకు అటవీ భూములపై వ్యక్తిగత, కమ్యూనిటీ హక్కులతోపాటు అటవీ వనరులపై కూడా హక్కును కల్పిస్తుంది. చట్టం తీసుకువచ్చినప్పటికీ ఇది సక్రమైన రీతిలో అమలుకు నోచుకోవడం లేదు. దీనిఅమలుపట్ల పర్యావరణ పరిరక్షణ, అటవీశాఖ విభాగం సవితితల్లి ప్రేమగా చూపుతున్నారు. ఈనేపధ్యంలో చట్టం అమలుపై మరో ఘోరమైన పిడుగు పడిరది.
ఫిబ్రవరి 13వ తేదీన కేంద్ర ప్రభుత్వం 21 రాష్ట్రాలకు సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఆదివాసీలు ఆందోళనకు గురయ్యారు. అడవులు ఆక్రమణకు గురవుతున్నాయని..అడవుల్లో అక్రమంగా నివసిస్తున్నవారి కారణంగా వన్యప్రాణి సంరక్షణ ప్రమాదంలో పడుతోందని వైల్డ్‌ లైఫ్‌ యాక్టివిస్ట్‌లు న్యాయస్థానాలను ఆశ్రయించిన కారణంగా11.8లక్షల ఆదివాసీలను తొలగించాలని సుప్రీం కోర్టు మధ్యంతరఉత్తర్వులిచ్చింది. అటవీ హక్కుల చట్టం అనేది అనాదిగా అరణ్యాల్లో నివసిస్తున్నవారికి భూమిపై హక్కు కల్పించడానికి ఉద్దేశించిందే కానీ..భూపంపిణీ, వితరణకు ఉద్దేశించింది కాదని పిటిషనర్లలో ఒకరైన వైల్డ్‌ లైఫ్‌ ట్రస్ట్‌కు చెందిన ప్రవీణ్‌ భార్గవ్‌ నివేదించారు. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని కాపాడలేకపోవడమేనని వారు పలువురు మేధావులు అభియోగాలు. ఏజెన్సీలో అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయకుండా అటవీశాఖ అధికారులు తూట్లు పొడిచి నిర్వీర్యం చేశారు. ఇది అటవీశాఖ అధికారులు, రాష్ట్ర,కేంద్రప్రభుత్వాల వైఫల్యమేనని పలువురు భావిస్తున్నారు. గతంలో 2002, 2004 మధ్య అటవీ ఆక్రమణలను నిరోధించేందుకుగాను సుమారు 3 లక్షల మందిని అడవుల నుంచి ఖాళీ చేయించారని ఈ వ్యవహారాలపై అధ్యయనం చేసే సీఆర్‌ బిజోయ్‌ ప్రకటించారు. ఆసమయంలో అకృత్యాలు జరిగాయని.. ఇళ్లను తగలబెట్టారని, పంటలను ధ్వంసం చేశారని, పోలీసుల కాల్పుల్లో ఎంతోమంది మరణించారని బిజోయ్‌ వెల్లడిరచారు. అడవుల్లో నివసించేవారికి మొదటి నుంచి యాజ మాన్య హక్కులు పత్రసహితంగా లేకపోవడం, చట్టప్రకారం కల్పించాలన్నా కూడా అది అధికారులపై ఆధారపడి ఉండడంతో చాలామంది అనాదిగా అరణ్యాల్లోనే నివశిస్తూ, ఆక్రమణదారులుగా మిగిలిపోతున్నారని బిజోయ్‌ నివేదిక వెల్లడిస్తోంది. దీంతో గిరిజనులు ఎంత దుర్బల జీవితం గడుపుతున్నారో అర్ధమవుతుంది. దేశవ్యాప్తంగా దట్టమైన అడవుల్లో పరవళ్లు తొక్కే నదులు..ఇనుము, బాక్సైట్‌ ఖనిజ నిక్షేపాల మధ్య బతికే గిరిజనులు ఇప్పటికే గనులు, ఆనకట్టలు, కర్మాగారాల కోసం తమ ఇళ్లను, భూములను కోల్పోయారు. ఇప్పుడు కోర్టు తీర్పు మేరకు ఇల్లూపొల్లూ వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చాలు వారు ఎంత దుర్బల, దుర్భర పరిస్థితుల్లో ఉన్నారో చెప్పడానికి.
అడవి బిడ్డలకు ఊరటనిచ్చిన సుప్రీం స్టే
అటవీప్రాంతాల నుండి ఆదివాసీలను తొలగించాలన్న ప్రభుత్వ ఆదేశాలపై సుప్రీం కోర్టు ఫిబ్రవరి 21న (గురువారం) స్టే ఇచ్చింది. సుప్రీం కోర్టు తీర్పు అడవి బిడ్డలకు ఊరటనిచ్చింది. ఫిబ్రవరి 13వ తేదీన కేంద్ర ప్రభుత్వం 21 రాష్ట్రాలకు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు ఈ రోజు నిలిపేసింది. అడవి బిడ్డల వాదనలను తోసిపుచ్చుతూ అవలంబించిన కేంద్ర ప్రభుత్వ విధానాలను వివరంగా అఫిడవిట్‌లో దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆదివాసీలను అడవుల నుండి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను నిలుపుదల చేయాలని కోరుతూ.. దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పింది. ఇన్నేళ్లుగా నిద్ర పోతున్నందుకు కేంద్ర ప్రభుత్వాన్ని మందలించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున జాప్యం జరిగిందని సాలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అంగీకరించడంతో మీరు ఇప్పుడే నిద్ర లేచారా..అని కేంద్ర ప్రభుత్వంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టులో రాష్ట్రాలు దాఖలు చేసిన అఫిడవిట్ల ప్రకారం..షెడ్యూల్డ్‌ తెగలు, అటవీ హక్కుల చట్టం కింద ఇతర సంప్రదాయ అటవీ నివాసులతో సుమారు 11,72,931 (1.17 మిలియన్‌) ఎకరాల భూమి, భూ యాజమాన్యం హక్కుల వాదనలు, వివిధ కారణాలపై తిరస్కరించబడ్డాయి. ఈ భూమి కనీసం మూడు తరాల నుండి వారి స్వాధీనంలో ఉన్నట్టు నిరూపించలేక పోయినవారు ఉన్నారు.రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంతచట్టాల ప్రకారం..ఆ భూములను ఖాళీ చేయించాలని ఫిబ్రవరి 13న జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ నవీన్‌ సిన్హా, జస్టిస్‌ ఇందిరా బెనర్జీల బెంచ్‌ ఆదేశించిన విషయం విధేతమే. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆదివాసులకు అన్యాయాలు జరగకుండా షెడ్యూల్లో పొందుపరిచిన రాజ్యాంగపరమైన చట్టాలను సమర్ధవంతంగా అమలు పర్చడానికి చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఆదివాసీ అన్యాయాలు జరగకుండా వారి అభివృద్ధికి కృషి చేయాల్సిన అవశ్యకత ఉంది !- ర‌వి రెబ్బాప్ర‌గ‌డ‌,ఎడిట‌ర్‌

1 2