మార్పు అవసరం..!

నేను 1987లో తూర్పుగోదావరిజిల్లా శంఖవరం మండలం గిరిజనప్రాంతమైన పెదమల్లాపురం వెళ్లినప్పుడు చాలా చోట్ల కరెంట్‌లేదు. రోడ్డుల్లేవు. రవాణా సదుపాయాల్లేవు. సైకిళ్ళు, ఎడ్లబండ్లే అక్కడ..అక్కడా కన్పించేవి. కాలినడకనే కొండెక్కి దిగాల్సి వచ్చేది. ఆఖరికి అగ్గిపుల్ల కావాలన్నా కొండదిగిరావాల్సిందే. ఏ గ్రామానికి వెళ్లిన విద్య,వైద్యం అందక ప్రజలు నానా అవస్థలు పడేవారు. బడులుగాని, ఆసుపత్రులుగాని లేవు. చాలామంది పిల్లలు అస్తవ్యస్థంగా కన్పించేవారు. వైద్యం కూడా ఉండేదికాదు. నిత్యావసరాలు దొరికేవి కాదు. కొన్ని ప్రాంతాల్లో అసలు వారపు సంతలే ఉండేవి కాదు. చాలా వరకు ఉత్తరాలు అందని గ్రామాలు ఉండేవి. ఆసమయంలో వేళింగి సమీపంలో ఉండే స్పందన సంస్థ నిర్వహించే స్వర్గీయ కె.ఎస్‌. తిలక్‌ గారి వద్ద నేను, స్థానిక యువకలు కొంతమంది కలసి కొద్దిరోజులు పనిచేశాం. అక్కడ గిరిజనులకు వాహనాలంటే వేళింగిలో ఉన్న స్పందన సెంటర్‌లో ఉండే మోటర్‌ సైకిల్‌ ఆప్రాంత గిరిజనులకు తెలుసు. హెల్మేట్‌ ధరించి వెళ్తూంటే జనం భయపడేవారు. నక్సలైట్లు, పోలీసులు గోడవలు ఎక్కువగా ఉండేవి. భూవివాదాలు అధికంగా ఉండేవి. ఆరోజుల్లో అక్కడ భూస్వాములైన మల్లుదొర లాంటి వాళ్లు ఉండేవాళ్లు. ఇప్పుడు లేరని కాదు !అక్కడ లోతా సుబ్బారావు గారి నాయకత్వంలో చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని అధికారులకు తెలయపర్చడం, వాటిని పరిష్కరించడం ..ఇలా ప్రజల్ని చైతన్యపర్చడం, సమస్యలపట్ల అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేసేవాళ్ళం. ఆ కాలంలో అధికారులు కూడా ప్రజా సమస్యలు పట్టించుకొని తక్షణమే పరిష్కరించేవారు.
ప్రస్తుతం కొత్తభూస్వాములు వచ్చారు. నూతన ఆర్ధిక విధానంలో ప్రభుత్వం ద్వారా పారిశ్రామిక భూస్వాములు తయార య్యారు. ఆరోజుల్లో ప్రభుత్వం పనిచేసే అధికారులు ప్రజల కోసం పనిచేసేవారు. అక్కడ ప్రజల గోడు, వారి పడే బాధలు స్వయంగా పరిశీలించి సమస్యలు పట్టించుకొనేవారు. రహదారి సదుపాయాలు లేకపోయిన కాలినడకన మారుమూల ప్రాంతాలు నడిచి గ్రామాల్లో ప్రజల బాధలు ప్రత్యక్షంగా పర్యవేక్షించేవారు. అటువంటి ఉన్నతాధికారుల్లో బి.డి.శర్మ, కె.బి.సక్సెనా, హర్షమందార్‌, ఈ.ఏ.ఎస్‌. శర్మ, ఆర్‌.శంకరన్‌, ఎం.వి.పి.సి శాస్త్రీ, డి.విజయకుమార్‌, ఎస్‌.నరసింగరావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, డాక్టర్‌. బి.వి.రమేష్‌, డాక్టర్‌ ప్రేమచంద్‌, ముఖేష్‌ కుమార్‌ మీనా, డాక్టర్‌ డి.టి.నాయక్‌, వంటి ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యలపట్ల శ్రద్ద చూపి పరిష్కరించే వారు.
ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా మారాయి. చాలాచోట్ల కరెంట్‌, రోడ్డులు, ఇతర మౌళికసదుపాయాలు వచ్చాయి. వైద్యం, 108,విద్య, ఐసీడీఎస్‌ సెంటర్లు,కమ్యూనికేషన్‌ సెంటర్లు విస్తరించబడ్డాయి. ఏమూలకు వెళ్లినా మొబైల్‌ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. అక్షరాస్యత పెరుగుతోంది. చాలామంది గిరిజన యువత చదువుకొని ఉన్నత స్థానాల్లో స్థిరపడుతున్నారు. మూరుమూల ప్రాంతాల్లో సహితం సాంకేతిక పరిజ్ఞానం విస్తరించింది. అయితే ప్రజల్లో సాంకేతికతను పెంచింది తప్పా అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ప్రస్తుతం నాటి కాలంలో ఉండే అభివృద్ధి మాత్రమే కన్నిస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేసి..పట్టణాల వైపు దృష్టి చారిస్తోంది. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి వేదికగా నిలిచే గిరిజన సదస్సులు ఎక్కడా కన్పించ లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక సంస్థపై ఖర్చుపెట్టిన నిధులు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడలేదు. అసలు వారికి న్యాయం చేకూరడం లేదు. అయితే గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న కొందరు యువ ఐఏఎస్‌ అధికారులైన శివశంకర్‌, ప్రసన్న వెంకటేషన్‌ వంటి అధికారులు గత కాలపు ఐఏఎస్‌ అధికారులైన శంకరన్‌, బి.డి.శర్మ వంటి వారి స్పూర్తిని తీసుకొని మారుమూల గిరిజన ప్రాంతాలపై దృష్టిపెట్టి గిరిజనులకు న్యాయం చేస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ గిరిజన ప్రజల్లో చాలా మార్పులంటే వచ్చాయి గానీ, అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా ఉంది. కాలాను గుణంగా గిరిజన ప్రాంతాల్లో మార్పులు వచ్చినా, శంకరన్‌గారి లాంటి ఐఏఎస్‌ అధికారుల స్పూర్తి తీసుకొని పాలనా యంత్రాంగం ప్రజల్లోకి వెళ్లి, వారి అవసరాలు, మౌళిక వసతులు కల్పనకు దృష్టి కేంద్రీకరిస్తే నాటి ఐఏఎస్‌ అధికారులు ఆకాంక్షలు నెరవేరినట్లు అవుతుంది.- రెబ్బాప్ర‌గ‌డ ర‌వి,ఎడిట‌ర్‌

ఆదర‌ణ ప‌థ‌కం

  • రూ.3 వేల కోట్లతో ఆదరణ కింద 6 లక్షల మందికి లబ్ధి
  • మరో 2 లక్షల మందికి లబ్ధి చేకూర్చే విధంగా జనవరిలో నాలుగో విడత ఆదరణ పథకం
  • 2022 కల్లా ప్రతి ఒక్కరికి శాశ్వత గృహం
  • 2 ఏళ్లలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా త్రాగునీరు
  • ప్రతి ఒక్కరికి సంత ృప్తికర స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు
  • పరిశ్రమల స్థాపనకు 15 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు, 30 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు
  • రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
  • ప్రతి కుటుంబానికి కనీసం నెలకు రూ.10 వేల ఆదాయం సమ కూర్చాలి అన్నది తమప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈలక్ష్యం సాకారం అయ్యేం దుకే పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా మన్నారు. డిసెంబరు 28న అనకాపల్లి ఎన్టీఆర్‌ గ్రౌండ్స్లో నిర్వహించిన మెగా గ్రౌండిరగ్‌ మేళాలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్ధిదారు లకు పనిముట్లు ఆస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని ఆర్థిక అసమానతలను రూపుమాపి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని లక్ష్యంతో గత నాలుగేళ్లలో పలు పథకాలను రూపొందించి అమలు చేస్తున్నా మన్నారు. వెనుకబడిన వర్గాలకు ఆదరణ, ఎస్సీలకు ముందడుగు, ఎస్టీలకు చైతన్యం, వికలాంగులకు చేయూత, ముస్లింలకు రోషిని తదితర పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నా మన్నారు. ఆధునిక పనిముట్లు పంపిణీకి ఒకటి, రెండు విడతల ఆదరణ కార్యక్రమాలను విజయవాడ, తిరుపతిలో భారీ స్థాయిలో నిర్వహించామని , ప్రస్తుతం అనకాపల్లిలో మూడు విడత ఆదరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా మన్నారు. ఈ మూడు విడతల్లో రూ.3 వేలకోట్లను వెచ్చిస్తూ 6 లక్షల మందికి లబ్ధిచేకూర్చడం జరుగుతున్నదన్నారు. మరో2లక్షల మందికి లబ్ధి చేకూర్చే విధంగా జనవరిలో నాలుగో విడత ఆదరణ కార్యక్రమం నిర్వహి స్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి శాశ్వత గృహ కల్పించేందుకు పెద్ద ఎత్తున గృహనిర్మాణ పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. 2022కల్లా ప్రతి ఒక్కరికి శాశ్వత గృహ వసతి కల్పిస్తామని ఆయన తెలిపారు. జనవరిలో నిర్వహించే జన్మభూమి కార్యక్రమంలో గృహాలు కావాల్సిన వారందరి నుండి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. 2ఏళ్లలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా త్రాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరికి సంత ృప్తికర స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు చేస్తున్నామన్నారు. పింఛన్లు, రేషన్‌ కార్డులు, గ ృహాలు మంజూరు చేస్తున్నామన్నారు. విద్యా వైద్య ఆరోగ్య పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామన్నారు. 24 రకాలవైద్య సేవలను అందు బాటులోకి తెచ్చి వైద్య ఖర్చులను చాలా వరకు తగ్గించా మన్నారు. పరిశ్రమల స్థాపనకు 15లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయని, 30 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయని ముఖ్య మంత్రి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 100, 200 ఎకరాల్లో ఎంఎస్‌ ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, వీరి ఉత్పత్తులకు ప్యాకింగ్‌, మార్కెటింగ్‌, వేర్‌ హౌసింగ్‌ సౌకర్యాలను కల్పిస్తామని ఆయన తెలి పారు. కుల వృత్తుల ఉత్పత్తుల కూడా వీటి ద్వారా మార్కెటింగ్‌ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
  • అనకాపల్లి నియోజకవర్గంపై వరాల జల్లు
  • అనకాపల్లి పార్లమెంట్‌ సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు మరియు శాసన సభ్యులు పీలా గోవిందసత్యనారాయణ చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి స్పందిస్తూ పలు వరాల జల్లు కురిపించారు. అనకాపల్లి శ్రీనూకంబిక అమ్మవారి ఆలయ అభివృద్ధికి సిజిఎఫ్‌ కింద ఐదు కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తూర్పు కాపులకు కులదృవీకరణ పత్రాలను మంజూరు చేస్తా మన్నారు. కసింకోట మండలం వెదురుపర్తి రోడ్డు నిర్మా ణానికి 3 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. ముస్లింల పాఠశాల మదర్సా నిర్మాణానికి ఒక ఎకరం భూమిని కేటాయిస్తున్నట్లు ప్రకటిం చారు. అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ అభివ ృద్ధికి సహకరిస్తామన్నారు. రూ.24 కోట్లతో తుంపాల ఆనకట్ట నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి ఈ సంద ర్భంగా శంకుస్థాపన చేశారు. తుంపాల షుగర్‌ఫ్యాక్టరీని పునఃప్రారం భించారు. గత నాలుగేళ్ల కాలంలో ఒక్కఅనకాపల్లి నియోజ కవర్గం నియోజ కవర్గంలోనే 98 వేల 724 పనులకు రూ.1,985కోట్లు ఖర్చు చేస్తు న్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప,రాష్ట్ర మంత్రులు చింతకాయల అయ్యన్న పాత్రుడు, కింజరాపు అచ్చెన్నాయుడు, అనకాపల్లి పార్లమెంట్‌ సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రావత్‌, సాంగే సంక్షేమ శాఖ కార్యదర్శి విజయ కుమార్‌, బీసీ కార్పొరేషన్‌ కమిషనర్‌ ఉదయలక్ష్మి, జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్కుమార్‌, శాసనసభ్యులు పీలా గోవింద్‌ సత్యనారాయణ, పంచకర్ల రమేష్బాబు, బండారు సత్యనారాయణ మూర్తి తదితరులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు. – స‌తీష్ కుమార్‌

విశాఖ ఉత్సవ్‌

పర్యాటక అభివృద్ధిలో విశాఖను ప్రధమశ్రేణిలో తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో ప్రభుత్వం నాలుగు ఏళ్ల నుంచి నిర్వహిస్తున్న ‘విశాఖ ఉత్సవ్‌’’ ఈసంవత్సరం కూడా అంగరంగ వైభంగా నిర్వహించారు. డిసెంబరు 28,29,30 తేదీల్లో ఏర్పాటు చేసిన ఉత్సవాలు అంతర్జాతీయ ఖ్యాతిని ఇనుముడిరప చేశాయి. రామకృష్ణాబీచ్‌లో నిర్వహించిన ఉత్సవాలను రాష్ట్రముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా హజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలను విశాఖనగరం ఆకర్షించే విధంగా పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. విశాఖను మించిన పర్యాటకనగరం దేశంలో మరొకటి లేదన్నారు. ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధికి పర్యాటక రంగం దోహదపడు తుంద న్నారు. సేవల రంగంలో పర్యాటక రంగం ముఖ్యమని చెప్పారు. వ్యవసాయ అనుబంధరంగాల కంటే పర్యాటకరంగంలో ఉపాధి అవకా శాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.
విశాఖనగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్తుతామని పేర్కొన్నారు. రానున్న కాలంలో విద్యుత్తు వాహనాలు అందుబాటులోకి వస్తాయన్నారు. నాలుగుయేళ్లలో 20వేల రూమ్‌లు నిర్మించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రతినెల నగరంలో ఒక ఉత్సవాన్ని నిర్వహించాలని సూచించారు. విశాఖపట్నంలో ఏమ్యూజిమెంట్‌ పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. స్కూభా డైవింగ్‌ ఏర్పాటు చేసుకోవచ్చునని చెప్పారు. వచ్చే జూన్‌ నాటికి విశాఖపట్నానికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా గోదావరి జలాలను అందిస్తామన్నారు. తొందరలో భోగాపురం ఎయిర్‌ పోర్టుకు టెండర్లు పిలుస్తామన్నారు. కాకినాడకు బీచ్‌లను ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయని తెలిపారు. విశాఖనగరం ప్రశాంత నగరమని, భూకబ్జాలకు, నేరాలకు అవకాశం ఉండకూడదన్నారు. బుద్దిజం అభివృద్ధికి అవకాశాలున్నాయన్నారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి లేపాక్షిలను పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తామన్నారు. అరకువేలి, లంబసింగిలో సమ్మర్‌ రిసార్ట్స్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖపట్నంలో పారిశుద్ద్యం బాగుందని జీవీఎంసీ కమిషన్‌ను అభినందించారు. ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి, నగరావాయిద్యాన్ని వాయించి ఉత్సవాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ విశాఖ ఉత్సవ్‌ నిర్వహణపై ప్రారంభోపన్యాసం చేశారు. విశాఖ ఉత్సవ విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివా సరావు, కార్మికశాఖ మంత్రి కె.అచ్చెయ్య నాయుడు, ఎంపీఎం. శ్రీనివా సరావు, ఈస్ట్రన్‌ నేవిల్‌ కమెండ్‌ చీఫ్‌ కరంభీర్‌సింగ్‌, శాసనసభ్యులు పంచకర్ల రమేష్‌బాబు, వెలగపూడి రామకృష్ణబాబు, బండారు సత్యనారాయణమూర్తి, వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ బసంత్‌ కుమార్‌, జీవీఎంసీ కమిషనర్‌ ఎం.హరి నారాయణన్‌,జాయింట్‌ కలెక్టర్‌ జి. సృజన,సిపీ మహేంద్ర లడ్డా తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాలు సందర్భంగా నగరంలోని సిటీ సెంట్రల్‌ పార్కు లోను, వుడా పార్కులోఏర్పాటు చేసిన పుష్పప్రదర్శనలు, ఆర్కేబీచ్‌కు కేంద్రంగా నిర్వహించిన పలుసాంస్కృతిక కార్యక్రమాలు మూడు రోజుల పాటు నగరప్రజల్ని మైమరిపించాయి.
ఆకట్టుకున్న పుష్పప్రదర్శన :
విశాఖపట్నం మెట్రో రీజియన్‌ డవలప్‌మెంట్‌ ఆధారిటీ (వీఎం ఆర్‌డీఏ) ఏర్పాటు చేసిన పుష్పప్రదర్శన నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది. వివిధ రకాల పూల ఆకృతులతో సుమారు 130 ఆకుల పుష్పాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ప్రజను ఆకట్టుకునేలా థాయలాండ్‌, కోల్‌కొత్తా, బెంగళూరు, కడియం నుంచి ఆకర్షణీయమైన పుష్పాలను తెప్పించి ప్రదర్శనలో ఉంచారు. పుష్పఆకృతులతోపాటు డ్రై ప్లవర్స్‌, వెజిటబుల్‌ కార్వింగ్‌ తదితర ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి -స‌తీష్‌.

మెరిసిన మొద‌టి అక్ష‌రం

స్త్రీ సాధికారత కోసం, వారి హక్కుల కోసం కృషి చేసిన సావిత్రిబాయి జీవితం ఆదర్శప్రాయం. వారు చూపిన మార్గాన్ని అనుసరించడమే వారికి మనం ఇచ్చే నివాళి. సావిత్రిబాయి పూలే దేశంలో సామాజిక చైతన్యాన్ని, స్త్రీ చైతన్యాన్ని కలిగించిన వారిలో ముఖ్యలు. ఆరోజుల్లో అణగారిన వర్గాలకు, స్త్రీలకు చదువుకోవడానికి పాఠశాలలు ఉండేవి కావు. అందుకే సావిత్రిబాయి పెళ్లికి ముందు మూడవ తరగతి వరకే చదివారు. పెళ్లి తర్వాత జ్యోతిబా పూలే చొరవతో తిరిగి చదువుకొనసాగించారు. అంతేకాదు. పూలే ఆమె చదువుకునే అవకాశం కల్పిండమే కాదు ఆమె చదువు పదిమందికి ఉపయోగపడేలా టీచర్‌ ట్రైనింగ్‌ కూడా ఇచ్చారు. అలా సావిత్రిబాయి తాను విద్య నేర్చుకుని, పదిమందికి నేర్పించారు. ఈ విధంగా సావిత్రిబాయి ఈ దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు అయ్యారు. సమాజంలో స్త్రీలు అన్ని రంగాల్లో ముందుండాలని, స్త్రీలు చదవగలరు, రాయగలరు, పోరాటం చేయగలరని నిరూపించిన దార్శనికురాలు సావిత్రిబాయి పూలే. అట్టడుగు వర్గాలకు చదువు చెప్పడానికి వెళ్లేటప్పుడు ఆమె ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. – గునపర్తి సైమన్‌
పూలే దంపతులు మహారాష్ట్రలో బలమైన సామాజిక ఉద్యమాలను నిర్మించారు. మహారాష్ట్రంలో అణగారిన వర్గాల వారు నివసించే ప్రాంతాల్లో మొదట పాఠశాలు ప్రారంభించారు. తర్వాత ఆడపిల్లల కోసం కూడా ప్రత్యేక పాఠశాలలను పూలే దంపతులు ఏర్పాటు చేశారు. వారు స్థాపించిన పాఠశాలలో నాడు విద్యకు నోచుకోని స్త్రీలు, అణగారిన వర్గాల విద్యార్థులు ఎంతో మంది చదువుకున్నారు. సావిత్రిబాయి అట్టడుగు వర్గాలకు విద్య నేర్పించడానికి అగ్రకులాల వారు సహించలేకపోయారు. ఆమెను అనేక అవమానాలకు గురిచేశారు. ఆమెపై కోడిగుడ్లు, టమాటాలు, బురద, రాళ్లు విసిరేవారు. వారి చర్యలతో విసుగు చెందిన సావిత్రి ఉద్యోగం మానాలని భావించారు. అయితే భర్త ఇచ్చిన ప్రోత్సహంతో సావిత్రిబాయి పోరాటాన్ని వదిలిపెట్టలేదు. ఏ సమాజం సంకెళ్లు విధించిందో వాటిని తెంపి స్త్రీ విద్య, వారి హక్కుల కోసం నిరంతరం ఉద్యమించారు. సావిత్రి బాయి అణగారిని వర్గాల వారినేకాకుండా బ్రహ్మణ స్త్రీలకు కూడా ఆదరించారు. అగ్రవర్ణాల్లోని వితంతువలను చేరదీశారు. వారికి కొత్త జీవితాలను ప్రసాదించారు. వితంతువుల కోసం, వారి పిల్లల కోసం జ్యోతిరావు శరణాలయాలను స్థాపించారు. ఇందులో కూడా సావిత్రిబాయి తన సేవలను అందించారు. జ్యోతిరావు పూలే 1837లో సత్యశోధక సమాజం ఏర్పాటు చేశారు. అందులో భర్తతోపాటు సావిత్రిబాయి క్రీయాశీలయంగా పాల్గొన్నారు.187677,189697లో మహారాష్ట్రంలో కరువు కాటకాలు సంభవించాయి. అప్పుడు ఉచిత భోజన వసతి హాస్టళ్లను ఏర్పాటు చేయాలని, కరువు నివారణ కోసం తక్షణ చర్యలు చేపట్టాలని బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆసమయంలో సత్యశోధక సమాజ్‌ చేసిన సేవ, ముఖ్యంగా సావిత్రిబాయి చేసిన సేవ చిరస్మరణీయం.
బాల్యం :
శ్రీమతి సావిత్రి బాయి పూలే మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్‌ అనే గ్రామంలో 1831 జనవరి 3న జన్మించింది. ఆమెది రైతుకుటుంబం. సావిత్రి బాయి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధు త్వం ఉంది. వీరి బంధువులు నిజామాబాద్‌ జిల్లాలో బోధన్‌ నాందేడ్‌ కొండల్‌ వాడి ప్రాంతంలో , అదిలాబాద్‌ చుట్టుపక్కల ఉన్నారు. బోధన్‌ ప్రాంతపు మున్నూరుకాపులు వీరికి బంధువులు. శ్రీమతి సావిత్రి బాయి తన 9వ యేట 12 యేండ్ల జ్యోతిరావు ఫూలెను 1840లో వివాహమాడారు. ఆదంపతులకు పిల్లలు లేరు. వీరు యశ్వంతరావు (బ్రాహ్మణ వితంతువు కుమారుడు)ను దత్తత తీసుకున్నారు. ‘‘జ్యోతీరావు ఫూలె’’ ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది. అహ్మద్‌ నగర్‌లోఉపాధ్యాయునిగా శిక్షణ పొంది 1848లో భర్త జ్యోతిరావుతో కలిసి క్రింది కులాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించారు. అట్టడుగువర్గాలు, మహిళలకు చదువు సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, బ్రాహ్మణవాద సంప్రదాయాలను, ఆధిపత్యవర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పాఠశాలలు ప్రారంభించి,12 మే 1848న దేశంలో బహుజనులకు మ్నెట్టమ్నెదటి పాఠశాల ప్రారంభించారు. సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధీశాలి ఆమె. కేవలం 4సంవత్సరాలలోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశా లలను ప్రారంభించి ఉచితవిద్యనం దించారు. 1848 లోనే దేశంలొ విద్యా ఉద్యమం ప్రారంభించిన మ్నెదటి మహిళ ఉపాద్యాయురాలు, దళితుల, స్త్రీల విద్యా ్య్ష వ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు 18 ఏళ్ళు మాత్రమే. వారి జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య కులాల వారి నుంచి అనేక దాడులను, అవమానాలను ఎదుర్కొంది.ఈ నేపథ్యంలోనే 1849లో పూలే, సావిత్రీబాయి దంపతులు గృహ బహిష్కారానికి గురిచేశారు.
సామాజిక విప్లవకారిణి :
ఆమె మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్త్రీలను చైతన్యపరచడానికి 1852లో మహిళా సేవామండల్‌ అనే మహిళా సంఘన్ని కూడా స్థాపించింది. జెండర్‌ సమస్యలకు తోడుగా, కుల పితృస్వామ్య వ్యవస్థల అణచివేతకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారిత కోసం ఈ సంస్థ కృషిచేసింది. మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించినది సావిత్రిబాయి అసత్యాలతో, అగ్రవర్ణ దురహంకారపు నిచ్చెనమెట్ల కులవ్యవస్థగా నిర్మాణమైన సమాజంలో ‘‘సత్యాన్ని’’ శోధించడానికి 1873 లో తన భర్త మహత్మా పూలేతో కలసి ‘‘సత్యశోధక్‌ సమాజ్‌ ‘‘ను ప్రారంభించి బాల్యవివాహలకు, మూడనమ్మకాలకు, సతీసహగమనానికి వ్యతిరేఖంగా మరియు వితంతువు పునఃర్వివాహల కొరకు అసమాన బ్రాహ్మనిజ వ్యవస్థకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడిపారు. బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభవించే ఎంతో మంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. గర్భవతులైన వారికి పురుళ్లు పోసి వారి కళ్లల్లో వెలుగు చూసారు. అలా పురుడు పోసుకుని తన వద్దేవదిలేసి పోయిన ఓ బిడ్డను అక్కున చేర్చుకున్నారు.యశ్వంత్‌ గా నామకరణం చేసి తమ ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పెంచి పెద్ద చేసారు. వితంతువులకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండిరచి, క్షురకులను చైతన్యపర్చి, వితంతువులకు శిరోముండనం చేయబోమంటూ క్షురకుల చేత 1860లో సమ్మె చేయించారు సావిత్రీబాయి. తరువాత 1873 సెప్టెంబరు 24న ‘‘సత్యసోధక్‌ సమాజ్‌’’ అనే సామాజిక, ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించి, సత్యసోధన కోసం ఉద్యమాన్ని నడిపారు పూలే. ఈ సత్యసోధక్‌ సమాజ్‌ మహిళా విభాగం సావిత్రీబాయి నేత ృత్వంలో నడిచేది. వివాహాలు వంటి శుభ కార్యాలను పురోహితులు లేకుండా నిర్వహించే విధానాన్ని ఈ సంస్థ ప్రారంభించింది. 1873 డిసెంబరు 25న భార్యను కోల్పోయిన ఒక యువకునికి తన స్నేహితురాలి కుమార్తెతో సత్యసోధక్‌ సమాజ్‌ ఆధ్వర్యన సావిత్రీబాయి వివాహం జరిపించారు.1868 నుంచి సావిత్రీబాయి అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. 1870లో ఒకసారి 1896లో మరోసారి దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినప్పుడు ఫూలే దంపతులు చేసిన క ృషి అనన్య సామాన్యం. కరువు వాతపడిన కుటుంబాలలోని అనాధ బాలలను దాదాపు 2,000 మందిని అక్కున చేర్చుకున్నారు. తమ పాటశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించినారు. సావిత్రిబాయి సంఘ సంస్కర్తగానే గాదు, రచయిత్రిగా కూడా వేగుచుక్కగా నిలిచారు. 1854లోనే ఆమె తన కవితా ంసపుటి ‘కావ్యఫూలే’ను ప్రచురించారు. ప్రతీ భారతీయ మహిళ మూడాచారాలకు,మూఢనమ్మకాలు వ్యతిరేకంగా శ్రీమతి సావిత్రి బాయి పూలే స్ఫూర్తితో ప్రజలలో చైతన్యం తీసుకురావాలి.
యుద్ధ వితంతువు పిల్లలతో జీవనం.
హిందూ సమాజంలో భర్త చనిపోయిన స్త్రీని వితంతువు అంటారు. వీరిని వ్యవహారంలో ముండమోపి , విధవ అని కూడా వ్యవహరిస్తారు. గతంలో వీరు సమాజంలో అనేక అవమానాలను ఎదుర్కొనేవారు. ఇప్పటికీ అక్కడక్కడా వీరికి ఇలాంటి అనుభవాలు ఎదురు అవుతూనే ఉంటాయి. కందుకూరి వీరేశలింగం పంతులు, రాజా రామ్మోహనరాయ్‌ వంటి సంఘ సంస్కర్తల కారణంగా ప్రస్తుతము వీరు గౌరవ ప్రథమైన జీవితమును గడుపుతున్నారు. వితంతు కుమార్తె ,విడాకులు పొందిన కూతురూ కుటుంబ పింఛనుకు అర్హులే పింఛను పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆయనపై ఆధారపడిన వితంతు, విడాకులు పొందిన కుమార్తె కుటుంబ పింఛను పొందవచ్చు. ఈవిషయంలో ఇప్పటివరకు ఉన్న అడ్డంకులు తొలగి పోయాయి.గతంలో ఉద్యోగి బతికి ఉండగానే కూతురు వితంతువై లేదా విడాకులు పొంది ఉంటేనే పింఛను అందేది. 25 ఏళ్ల వయోపరిమితి వరకే వర్తింపజేయాలనే నిబంధన ఉండేది. తాజా ఉత్తర్వుల ప్రకారం వితంతు, విడాకులు పొందిన కూతురు మళ్లీ వివాహం చేసుకున్నా, మరణించినా ,ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి లేదా స్వయంఉపాధి ద్వారా నెలకు రూ.2440 పొందుతున్నా పింఛను ఆగిపోతుంది. మానవ హక్కులు అనేవి ‘‘మానవులకు సంక్రమించే హక్కులు మరియు స్వేచ్ఛలు.’’ ఈ భావనను ప్రతిపాదించిన వారు సాధారణంగా ప్రతి ఒక్కరు వారు కేవలం మానవులు అయిన కారణంగానే కొన్ని హక్కులకు అర్హులని పేర్కొన్నారు. కాబట్టి మానవ హక్కులు అనేవి ఒక సార్వత్రిక మరియు సమసమాజ శైలికి చెందినవి. వాస్తవ మానవ నైతికత యొక్క భాగంగా మాత్రమే అటువంటి హక్కులు ఉంటాయి, ఎందుకంటే న్యాయబద్ధ నైతిక సూత్రాలు లేదా సహజ హక్కులు బలమైన కారణాలచే లభిస్తాయి, లేదా అంతర్జాతీయ చట్టం పరిధిలో లేదా జాతీయ స్థాయిలో చట్టబద్ధమైన హక్కులుగానో లభిస్తాయి. కానీ, పైన చెప్పిన భావనలలో ఎందులోనూ దేనిని మానవహక్కుగా పరిగణించాలో, పరిగణించ కూడదో అనే విషయంపై ఏకాభిప్రాయం లేదు మరియు మానవ హక్కుల అమూర్త భావన అనేది ఎప్పుడూ తీవ్ర వేదాంత చర్చ మరియు విమర్శకు దారితీస్తూనే ఉంది.

గిరిజన ఉద్యమం

  • భారతదేశంలో బ్రిటిషర్ల కాలంలో వివిధ కారణాలతో ప్రారంభమైన గిరిజనోద్యమాలు స్వాతంత్య్రానంతరం కూడా కొనసాగాయి. బ్రిటిషర్ల పాలనలో జరిగిన తిరుగుబాట్లను మూడు దశలుగా విభజించవచ్చు.
  • 1795-1860 మధ్య కాలం: బ్రిటిష్‌ సామ్రాజ్య స్థాపన, విస్తరణ జరుగుతున్న కాలంలో చెలరేగిన తిరుగుబాట్లు.
  • 1861-1920 మధ్య కాలం: వలస పాలన, ఆర్థిక మూలధనం గిరిజనుల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడం వల్ల జరిగిన తిరుగుబాట్లు.
  • 1921-1947 మధ్య కాలం: స్వాతంత్య్ర పోరాటం కొనసాగుతున్న కాలంలో జరిగిన తిరుగుబాట్లు.
  • బ్రిటిష్‌ కాలంలో జరిగిన ప్రముఖ గిరిజన తిరుగుబాట్లు
  • రంపా తిరుగుబాటు (ఆంధ్రా)
  • 1766లో నిజాం రాజు రంపా ప్రాంతాన్ని తూర్పు ఇండి యా కంపెనీకి ఇచ్చాడు. కంపెనీ అధికారుల మితిమీరిన జోక్యానికి వ్యతిరేకంగా 1802-03లో రామభూపతి నాయకత్వంలో కోయలు, కొండరెడ్లు తదితర గిరిజన తెగలు పోరాటం సాగించాయి. 1813లో బ్రిటిషర్లు రామభూపతిని ఈ ప్రాంతానికి అధిపతిగా అంగీకరిం చడంతో పోరాటాన్ని నిలిపేశారు. కానీ, ఆతర్వాత రామభూపతి కుమారుడు బ్రిటిష్‌ అధికారుల ప్రోద్బలంతో గిరిజనులపై అనేక రకాల పన్నులు విధించడంతో వారు తమ్మన్నదొర నాయకత్వంలో 1879లో మళ్లీ తిరుగుబాటు చేశారు. ఇదివిశాఖ, భద్రాచలం, రేకపల్లి, చోడ వరం మొదలైన ప్రాంతాలకు విస్తరించింది. 1880లో సైనిక బలంతో ఈ తిరుగుబాటు బలవంతంగా అణచివేశారు.
  • ఖోండుల తిరుగుబాటు (ఒడిశా)
  • ఖోండులు మొదటిసారిగా 1817లో తిరుగుబాటు లేవదీ శారు. తర్వాత 1830లో చినోయిదొర, 1850లో చక్రబోయి దొర, 1857లో సురేంద్రసాయి నాయకత్వంలో కంపెనీ అధికారులకు వ్యతి రేకంగా పోరాటం సాగించారు. 1894లో కొండసవరలు విదేశీ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాట్లన్నింటినీ సైనికబలంతో అణచివేశారు.
  • కోల్‌ తిరుగుబాటు
  • ఛోటా నాగపూర్‌ ప్రాంతంలో కోల్‌ గిరిజన తెగకు చెందిన వారు నివసించేవారు. బ్రిటిష్‌ పాలకులు గిరిజనేతర రైతులను గిరిజన ప్రాంతాల్లో స్థిరపడేలా ప్రోత్సహించడంతో భూ యజమానులతో కౌలు సంబంధాలు మొదలయ్యాయి. దీంతో ద్రవ్య విధానం కూడా ప్రారంభ మైంది. వడ్డీ వ్యాపారుల ఆగడాలు, దోపిడీలు మొదలయ్యాయి. కోల్‌ గిరిజన ప్రముఖులు హిందువులుగా మారడంతో గిరిజనుల్లో అశాంతి అధికమైంది. గిరిజనులు వారిభూముల్లో వారే కట్టు బానిసలుగా మారారు. ప్రభుత్వ, గ ృహ అవసరాల్లోనూ శ్రమ దోపిడీ ఎక్కువైంది. వీటికి నిరసనగా కోల్‌లు 1831-32లో తిరుగుబాటు చేశారు.
  • సంతాల్‌ల తిరుగుబాటు
  • ఈ తిరుగుబాటు బిహార్‌,బెంగాల్‌,ఒడిశా ప్రాంతాల్లో సంభ వించింది. దీన్ని గొప్ప తిరుగుబాటుగా పేర్కొంటారు. దీనికి ప్రముఖ కారణం కార్‌నవాలీస్‌ ప్రవేశపెట్టిన శాశ్వత శిస్తువిధానం. దీనికి వ్యతి రేకంగా సంతాల్‌లు 1811,1823,1829లో తిరుగుబాట్లు చేశారు. 1854లో కన్హూ,సిద్ధుఅనే గిరిజన సోదరుల నాయకత్వంలో ఈ తిరుగు బాటు మరోసారి చెలరేగింది. వీరు జమీందార్ల భూముల ఆక్రమణకు ప్రయత్నించారు. 1855జూన్‌లో ఈ సోదరుల నాయకత్వంలో సంతా ల్‌ల కోసం ప్రత్యేక రాజ్యం ఏర్పాటుకు ర్యాలీనిర్వహించారు. ఈ పోరాటంలో 15,000 నుంచి 25,000 సంతాల్‌లు బ్రిటిష్‌ సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయారు.1856 ఫిబ్రవరిలో కన్హూ కూడా సైన్యం చేతిలో మరణించాడు. 1885 జూలైలో బ్రిటిష్‌ ప్రభుత్వం మార్షల్‌ లా విధించి ఉద్యమాన్ని బలవంతంగా అణచివేసింది.
  • బస్తర్‌ తిరుగుబాటు (ఛత్తీస్‌గఢ్‌)
  • బస్తర్‌ ప్రాంతంలో మురియా, మరియా, హాల్భా మొదలైన గోండు తెగలు జీవించేవారు. బ్రిటిషర్ల రాకతో బనియాలు, రోహిల్లాలు మొదలైన వడ్డీ వ్యాపారులు ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. వీరు గోండుల భూములు ఆక్రమించుకోవడం, వెట్టిచాకిరీ చేయించడం, స్త్రీలను వేధించడం మొదలైన ఆక ృత్యాలకు ఒడిగట్టారు. దీంతో గిరిజనులు 1880లో తిరుగుబాటు చేశారు. బ్రిటిష్‌ ప్రభుత్వం1891 నాటికి ఈ తిరుగుబాటును అణచివేసింది.
  • ముండాల తిరుగుబాటు (బిహార్‌)
  • ఛోటా నాగపూర్‌ ప్రాంతంలో నివసించే మరోగిరిజన తెగ ముండాలు. తెగలో అంతర్యుద్ధాల కారణంగా వీరి భూమిలో కొంత భాగం సమీప హిందూ రాజుల పాలనలోకి వెళ్లింది. దీంతో అనేక మంది గిరిజన నాయకులు హిందూ మతం స్వీకరించారు. క్రమంగా అధికసంఖ్యలో గిరిజనేతరులు స్థిరపడటంతో వీళ్ల పరిస్థితి దిగజా రింది. క్రైస్తవ మిషనరీల ప్రచారంతో ఆమతాన్ని స్వీకరిస్తే తమ పరిస్థితి మెరుగవుతుందని భావించి ముండాలు అధిక సంఖ్యలో మతమార్పిడి చేసుకున్నారు. అయినా ఎలాంటి మార్పు రాలేదు. చివరకు 1895లో బిర్సా ముండా నాయకత్వంలో తమ ప్రాంతాల్లో స్థిరపడ్డ గిరిజనేతరు లందరినీ తరిమివేయాలని తిరుగుబాటు ప్రారంభించారు. బిర్సా ముండాను 1895లో నిర్బంధించగా తెగ ప్రజలు విడిపించుకున్నారు. 1899 నాటికి తిరుగుబాటు తీవ్ర స్థాయికి చేరింది. 1900లో బిర్సా ముండాను మళ్లీ నిర్బంధించారు. కారాగారంలో హింసించడంతో ఇతడు మరణించాడు. దీంతో క్రమంగా ఈ ఉద్యమం బలహీనమైంది.
  • గోండుల తిరుగుబాటు (తెలంగాణ)
  • తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో ‘కొమరం భీం’ నాయక త్వంలో ఈ తిరుగుబాటు జరిగింది. ఈయన 1901 అక్టోబర్‌ 22న ఆదిలాబాద్‌ జిల్లాలో ‘జోడెఘాట్‌’ ప్రాంతంలో జన్మించారు. నిరక్షరాస్యుడైనప్పటికీ ఆప్రాంతంలో గోండు, కొలాం మొదలైన గిరిజన తెగలను ఏకం చేసి నిజాం పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిపారు. జోడెఘాట్‌పై దాడికి ప్రయత్నించిన నిజాం సైన్యాన్ని సంప్రదాయ ఆయుధాలతోనే ఎదుర్కొన్నారు. ‘జల్‌, జంగల్‌, జమీన్‌ (నీరు, అటవీ, భూమి) మనవే’ అనే నినాదంతో గిరిజనులను చైతన్యపరిచారు. భగత్‌సింగ్‌, అల్లూరి సీతారామరాజు ప్రభావంతో ఈ ఉద్యమాన్ని నడిపించారు. నిజాం ప్రభుత్వం ఈయణ్ని బంధించ డానికి స్థానిక తాలుక్‌దార్‌ ‘అబ్దుల్‌ సత్తార్‌’ను నియమించింది. ఆయన విఫలం చెందడంతో నిజాం సైన్యమే ప్రత్యక్ష దాడికి దిగింది.
  • 1940 అక్టోబర్‌ 8న జరిగిన దాడిలో ‘కొమరం భీం’ వీర మరణం పొందారు. ఈయణ్ని సైన్యానికి కుర్థం పటేల్‌ చూపించాడు. ‘కొమరం భీం’ను నిజాం పాలకుల నుంచి తెలంగాణ ప్రజల స్వాతంత్య్రానికి ప్రయత్నిం చిన మొదటి వ్యక్తిగా అభివర్ణిస్తారు. కమ్యూనిస్ట్‌ నాయకులు ‘పుచ్చలపల్లి సుందరయ్య’ ఈయన జీవిత చరిత్రను రచించారు. గోండులు ఈయణ్ని దేవుడిగా ఆరాధిస్తారు.
  • తానాభగత్‌ ఉద్యమం (బిహార్‌, 1914)
  • ఛోటా నాగపూర్‌ ప్రాంతంలో ఓర్గాన్‌ అనే ఆదిమవాసులు నివసించేవారు. వీరు పెద్ద ఎత్తున హిందూ సంస్క ృతీకరణ కోసం పేరు చివరన భగత్‌ అనే పదాన్ని చేర్చుకొని తమ స్థాయి మార్చుకునే ప్రయత్నం చేశారు. ఇతరప్రాంతాల గిరిజనేతరులు అక్కడ చేరి తమకు అన్యాయం చేస్తున్నారని వారిని తరిమేసేందుకు ఉద్యమించారు.
  • మన్యం తిరుగుబాటు (ఆంధ్ర,1922-24)
  • మద్రాసు రెసిడెన్సీలో ఆంధ్రా ఏజెన్సీ ప్రాంతం 19,287 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉండేది. ఇందులో గంజాం, విశాఖపట్నం, గోదావరి ప్రాంతాలు ఉండేవి. బ్రిటిష్‌ ప్రభుత్వం 1882లో మద్రాస్‌ అటవీ చట్టం చేసి పోడు వ్యవసాయంపై అనేక ఆంక్షలు విధించింది. ఇక్కడి గిరిజన తెగల్లో కోయలు, కొండరెడ్లు అధిక సంఖ్యలో ఉండే వారు. బ్రిటిష్‌ అధికారుల సహాయంతో స్థానిక నేతలు దుశ్చర్యలకు పాల్పడ్డారు. దీంతో విసిగిపోయిన గిరిజనులను అల్లూరి సీతారామ రాజు సమైక్యపరిచి తిరుగుబాటు లేవదీశారు. గెరిల్లా పోరాట పద్ధతి లో ఈ తిరుగుబాటు సాగింది. పోలీస్‌ స్టేషన్లపై దాడి చేసి ఆయు ధాలను సేకరించేవారు. సీతారామరాజు అనుచరులతో మొదట చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారు. తర్వాత అడ్డతీగల, రాజ ఒమ్మంగి, కృష్ణదేవిపేట మొదలైన పోలీసు స్టేషన్లపై దాడి చేశారు.ఈ తిరుగుబాటును అణచివేసేందుకు మద్రాసు ప్రభుత్వం ‘రూథర్‌ ఫర్డ్‌’ను పంపించింది. సీతారామరాజు ముఖ్య అనుచరుడైన గొంముల్లు దొరను 1923 సెప్టెంబర్‌లో నిర్బంధించారు. మరో అనుచరుడు ‘అగ్గిరాజు’ను కాల్చి చంపారు.
  • దీంతో ఈ ఉద్యమం ముఖ్య నాయకు లను కోల్పోయింది. చివరకు 1924 మే7న సీతారామరాజును కాల్చి చంపడంతో ఈ ఉద్యమం అంతరించిపోయింది.
  • కొండ సవరలు తిరుగుబాటు (1943, ఒడిశా)
  • కోరాపుట్‌ జిల్లాలో గిరిజనులు తమకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా లక్ష్మణ్‌ నాయక్‌ నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. ప్రభుత్వం అతణ్ని నిర్బంధించి 1943లో బెరంపూర్‌ జైలులోఉరి తీసింది. దీంతో ఈ తిరుగుబాటు ఆగి పోయింది.
  • వర్లీ తిరుగుబాటు (1944) (మహారాష్ట్ర)
  • మహారాష్ట్రలోని థానే జిల్లాలో వర్లీ ఆదిమ తెగలు నివసిం చేవి. పంటకోతల సమయంలో కూలీ రోజుకు 12 అణాలు ఇవ్వాలనే డిమాండ్‌తో ఈ తిరుగుబాటు మొదలైంది. 1945లో కిసాన్‌సభ ఇచ్చిన పిలుపుతో భూస్వాముల భూములు దున్నవద్దని, వెట్టిచాకిరీ చేయొద్దని, అత్యాచారాలను ప్రతిఘటించాలనే లక్ష్యాలతో వీరు తిరుగుబాటును కొనసాగించారు. 1946లో వర్లీ మహాసభ జరిగింది. చివరకు వ్యాపారులు, భూస్వాములు రాజీకి వచ్చారు. వర్లీ గిరిజనులు డిమాండ్‌ చేసినదాని కంటే ఎక్కువ కూలీ సాధించుకున్నారు. ఈ తిరుగుబాటు ఘన విజయం సాధించింది.
  • ఛోటా నాగపూర్‌ పీఠభూమి ప్రాంతాలు
  • ా జార్ఖండ్‌ (అధిక భాగం)
  • ా ఒడిశా
  • ా పశ్చిమ బెంగాల్‌
  • ా ఛత్తీస్‌గఢ్‌
  • ా బిహార్‌
  • గిరిజనోద్యమాలకు కారణాలు
  • । గిరిజన ప్రాంతాలను బ్రిటిష్‌ సామ్రాజ్యంలో కలిపేందుకు ప్రయత్నించడం. దీనివల్ల తరతరాలుగా అనుభవిస్తున్న అటవీ సంపద, భూములపై గిరిజనులకు అధికారంకోల్పోయే పరిస్థితి తలెత్తింది. గిరిజనుల భూములను ఆక్రమించి, వారిని కట్టుబానిసలుగా మార్చడం.
  • । గిరిజనుల సంస్కృతి, ఆచారాల్లో జోక్యం చేసుకోవడం.
  • । వస్తు మార్పిడి స్థానంలో ద్రవ్య మార్పిడి విధానం చోటు చేసుకోవటంతో వడ్డీ వ్యాపారుల అక్రమాలు.
  • । గిరిజనుల స్వేచ్ఛ, స్వాతంత్య్రం, హక్కులను హరించడం.
  • । అటవీ నియంత్రణ చట్టం-1865, భారత అటవీ చట్టం- 1878, భారత అటవీ చట్టం-1927 మొదలైన వాటిలో గిరిజనుల హక్కులను గుర్తించకపోవడం.
  • । స్వాతంత్య్రానంతరం అభివ ృద్ధి పేరుతో పరిశ్రమలు, ఆనకట్టల నిర్మాణం చేపట్టడంతో గిరిజనులు తమ ఆవాసాలు కోల్పోవడం. వారికి సరైన పునరావాసం కల్పించకపోవడం.- సకరణ : థింసా రీసెర్చ్‌ టీమ్‌

ఎన్నికల శాసనుడు..శేష జీవితంలో సేవకుడు

ప్రజాస్వామ్య భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ సులువుగా జరుగుతున్నదంటే మాజీ భారతఎన్నికల అధికారి టి.ఎన్‌.శేషన్‌ చలువే అని ఒప్పుకోక తప్పదు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం లోని ఎన్నికల వ్యవస్థలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి ఆయన. దేశం లో10వ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిగా, గొప్ప పరిపాలనాధ్యక్షుడిగా టి.ఎన్‌.శేషన్‌ పేరు గడిర చారు. కేరళలో పుట్టిన శేషన్‌ ఐఏఎస్‌ హోదాతో వివిధశాఖల్లో పదవులు నిర్వహించారు. తమిళ నాడులోనే ఎక్కువగా ప్రజాసేవలందించిన శేషన్‌ అక్కడే స్థిర పడ్డారు. భారత ఎన్నికల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్న సందర్భంలో ఓటు హక్కు కలిగిన భారతీయులందరూ చైతన్యం తో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందుకోసం భారత ప్రభుత్వం ఓటర్లను చైతన్య పరచాలనే 2016 నుంచి ‘జనవరి 25’ను జాతీయ ఓటర్ల దినోత్సవం’గా నిర్వహిస్తోంది. శేషన్‌ చేసిన ఎన్నికల సంస్కరణలను తెలంగాణ ప్రభుత్వం పదోతరగతి సాంఫీుక శాస్త్రంలో ‘భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ’ పాఠంలో చేర్చారు. కేరళ రాష్ట్రం పాలక్కాడ జిల్లా తిరునెల్లు గ్రామంలో జన్మించిన తిరునెల్లు నారాయణ అయ్యర్‌ శేషన్‌ ఐఏఎస్‌ సర్వీసులో తమిళనాడులోని కోయంబత్తూరు, దిండి గల్‌ జిల్లాల్లో సహాయ కలెక్టర్‌గా, మధురై కలెక్టర్‌గా, రవాణా శాఖ డైరెక్టర్‌గా, వ్యవసాయ, కార్మికశాఖల కార్యదర్శిగా పదవులు నిర్వహించారు. 10వ ఎన్ని కల ప్రధానాధికారిగా 1990 నుంచి 1996 వరకు పని చేశారు. దక్షిణ భారతదేశం నుంచి ఆర్థిక సంస్కరణలతో ప్రధానమంత్రి పి.వి. నరసిం హారావు పేరు ప్రఖ్యాతలు గడిరచగా, మరో ప్రక్క ఎన్నికల సంస్కరణలతో తనదైన శైలిలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన వ్యక్తి శేషన్‌. శేషన్‌ తన విధులలో ముఖ్యంగా ఎన్నికల సంఘం నిర్ణయాలలో నిక్కచ్చి గా వ్యవహిరిస్తూ, మీడియాను సైతం దూరంలో ఉంచేవారు. శేషన్‌ ప్రవేశపెట్టిన సంస్కరణలతోనే ఎన్నికల వ్యవస్థలో పలుమార్పులు చోటు చేసుకు న్నాయి. 1991 మధ్య జరిగిన సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా ‘ఓటరు గుర్తింపు కార్డు’ ప్రవేశ పెట్టారు. ఓటరు కనీస అర్హత వయస్సు 21 సంవ త్సరాల నుంచి 18 సంవత్సరాలకు కుదించారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చును పరిమితం చేశారు. ఒక అభ్యర్థి రెండు నియోజక వర్గాల కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయరాదు. కులం పేరుతో ఓట్లను అభ్యర్థించడం నిషేధం. పోలింగ్‌ కేంద్రాల్లోకి ఓటర్లను తరలిం చడం, ప్రభుత్వ యంత్రాంగం సాయం పొందటం చట్ట విరుద్ధం. పోలింగ్‌ సమయంలో ఇతరులు పోలింగ్‌ బూతుకు 200 మీటర్ల దూరంలో ఉండాలి. గుమిగూడి ఉండటం నేరం. పోలీసులు 144 సెక్షన్‌ విధించాలి. ఒక వ్యక్తి ఏదైనా నేరంలో కనీసం 2 సంవత్సరాలు శిక్ష అనుభవిస్తే ఆరు సంవత్సరాల పాటు పోటీకి అనర్హులు.
పోటీలో ఉన్న అభ్యర్థి మరణిస్తే ఎన్నిక వాయిదా వేయాలి. కాని రద్దు చేయకూడదు. ప్రచా రం పూర్తి అయిన తర్వాత 48గంటల వరకు మద్యం అమ్మకాలు నిషేధించాలి.ఎన్నికల సంఘం చరిత్రలో శేషన్‌ హయాం ఓస్వర్ణయుగం. ఎన్నికల్లో పారదర్శకత కోసం చేసిన క ృషికిగానూ, 1996లో ఆయన ‘రామన్‌మెగ్‌సేసే’ అవార్డు అందుకున్నారు. సీఈసీగా ఉద్యోగ విరమణ చేసిన తర్వాత 1997 రాష్ట్రపతి ఎన్నికల్లో కేఆర్‌ నారాయణ్‌పై పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన వార్తల్లో కనిపించని అజ్ఞాత వ్యక్తిగా మిగిలారు. శేషన్‌ పుట్ట పర్తి సాయిబాబాకు వీరభక్తుడు. సాయిబాబా శివై క్యం పొందినప్పటి నుండి తీవ్ర విచారానికి గుర య్యారు తన స్వగ్రామంలో సొంత ఇల్లు ఉన్నప్ప టికీ తమను సంరక్షించే వారసులు (పిల్లలు) లేక పోవడంతో తన ఆలోచనా ద ృక్పధం సేవా గుణంపై కదిలింది. తన శేషజీవితంలోనూ పేదల, అనాధల, వృద్ధుల బాధలు తిలకిస్తూ, వారికి తోచిన సహాయం చేస్తున్నారు. అందుకోసం సహచరిణి జయలక్ష్మీశేషన్‌తో కలిసి చెన్నైలోని ‘గురుకులం’ అనే వ ృద్ధాశ్రమంలో గడుపుతున్నారు. అసాధారణ ప్రతిభ కలిగిన శేషన్‌ సామాన్య వ్యక్తిగా ఆశ్రమం లోని తోటివారి కష్టాలను వింటూ, వారికి చేతనైన సాయం అందిస్తున్నారు, ఆదుకుంటున్నారు. శేషన్‌ తన పింఛను డబ్బుల్లో కొంత ఇతర సామాజిక సేవలకు వెచ్చించడం విశేషం.
7989134271

ఆదివాసీ దీనావస్థ

గిరిజన జీవితం అడవికే అంకితం. అడవిపైనే వారి బతుకు ఆధారపడి ఉంటుంది. అక్కడే భూములను సాగుచేసుకుంటారు. భూసారం క్షీణిస్తే మరోచోట అడవిని కొట్టి కొత్తగా భూములు సాగులోకి తెస్తారు. దీనినే పోడు వ్యవసాయం అంటారు. ప్రభుత్వం కొన్ని విధా నాలతో అటవీ శాఖ సిబ్బందిచే దాడులు చేయించడంతో దాదాపుగా పోడు వ్యవసాయం తగ్గిపోయింది. ఉన్న భూముల్లోనే సంప్రదాయ వ్యవసాయం సాగిం చడం పరిపాటిగా వస్తోంది. కానీ ఆవ్యవసాయం చేసుకోడానికి కూడా ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. వారు ఎక్కడ నివాసాలు ఏర్పరుచుకుని సాగు చేసుకొంటే అక్కడకు వెళ్లి వారి గూడే లను కూల్చివేసి పంటలను ధ్వంసం చేస్తుంటారు.
అటవీ సిబ్బంది ఆగ డాలకు అడ్డూఅదుపు ఉండదు. అడ్డు వచ్చిన వారిపై కేసులు పెడతారు. నిలదీసిన వారిని మహిళలు, పిల్లలు, వృద్ధులు అని చూడ కుండా లాఠీలతో దౌర్జన్యానికి దిగుతుం టారు. విశాఖ ఏజెన్సీలో అత్యాచారాలకు పాల్పడిన సంఘటనలు కూడా జరిగాయి. తెలం గాణలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం లవ్వాల అటవీ ప్రాంతంలో అదే జరిగింది. అటవీశాఖ సిబ్బంది ట్రాక్టర్లు, బుల్‌డోజర్లు తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేసింది. చట్టం తమ చేతిలో ఉన్నంత మాత్రాన ఈ విధంగా పశుబలం ప్రదర్శించడం మానవత్వమా?అదివాసీల హక్కులను ఉక్కుపాదంతో తొక్కివేసే హక్కు ఎవరిచ్చారు? తెలంగాణ రాష్ట్రం వస్తే తమ సమస్యలు తీరుతాయని, బంగారు తెలంగాణ సాక్షాత్కరి స్తుందని కలలు కన్న పీడిత తాడిత గిరిజనానికి ప్రభుత్వం ఇచ్చిన ప్రతిఫలం ఇదేనా? గత పదేళ్లుగా పోడు వ్యవసాయం చేసుకొంటూ పోట్టపో షించుకొంటున్న గుత్తికోయల కుటుంబాలపై అటవీ శాఖ దాడులు జరిపివారి గుడెసెలను కూల్చివేయడం, గిరిజన మహిళలను చెట్టుకు కట్టివేయడం, అడ్డువచ్చిన వారిని లాఠీలతో చావమోదడం ఈబీభత్సకాండ దాదాపు రెండు గంటలపాటు సాగడం గిరిజన ప్రజల్లో నెత్తురును ఉడికిస్తోంది. అడవిని నమ్ముకునిజీవిస్తున్న అడవిపుత్రులపై దమనకాండ విభ్రాంతి గొల్పింది. లవ్వాల అటవీ ప్రాంతం శనివారం మధ్యాహ్నం గొత్తికోయలు, అటవీ సిబ్బంది మధ్య రణరంగంగా మారింది. ఆప్రాంతం ఖాళీ చేయాలని మరోచోట నివాసం కల్పిస్తా మని రెండు నెలలుగా చెబు తున్నా నోటీసులు జారీచేస్తున్నా మొండి కెత్తడంతో దాడులకు పూను కోవలసి వచ్చిందని అటవీశాఖ సమర్థించు కుంటోంది.అయినా ఇంత దారుణంగా మూకుమ్మడిగా దౌర్జన్యానికి పాల్పడడం వారిని నిరాశ్రయులు చేయడం,పంటలను ధ్వంసం చేయ డం కేవలం బలదర్పమే తప్ప గిరిజనులకు మేలు చేయడానికి కానే కాదని విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. కొంతకాలంగా అడవ్ఞల్లోని గొత్తికోయ గూడేలను అటవీశాఖ బలవంతంగా ఖాళీచేయిస్తోంది.గత కొన్నాళ్లుగా గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరు నాగారం ప్రాంతా ల్లో ఈ విధంగా తరచుగా దాడులు జరుగుతున్నాయి. ఆదాడులన్ని టికన్నా ఈదాడి చాలా ఘోరం.
దాదాపు 125 కోట్ల జనాభా గల భారతదేశంలో గిరిజన, దళిత తెగలకుసంబంధించి రాజ్యాంగంలోని అయిదు, ఆరు షెడ్యూలు అంశాలను పొందుపరిచినా ఆదివాసీలకు తగిన న్యాయం జరగడం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పరిశ్రమలు, డ్యామ్‌ల నిర్మాణం, గనుల తవ్వకం,నగరీకరణ కారణం గా గిరిజనులు నిరాశ్రయులవు తున్నారు. ఆదివాసీలకు స్వయంపాలన కల్పించాలని కొన్నేళ్లుగా కొన సాగుతున్న డిమాండ్‌ నెరవే రకపోగా లాఠీలనురaుళిపించి మహిళలను చెట్లకు కట్టివేసి గూండాగిరి సాగించడం ఎంతవరకున్యాయం? ఐక్యరాజ్యసమితి ఆదివాసీల వారసత్వపు హక్కులు, అటవీవనరులు, ఇతర సమస్యలపై 1982 ఆగస్టు9న జెనీవాలో సదస్సు నిర్వహిం చింది. ఆదివాసీల సమస్యలపై చర్చించింది. అంతేకాదు ఒక కమి టీని నియమించి1992 నుంచి పదేళ్లపాటు అధ్యయనం జరిపిం చింది. సమితి అంచనా ప్రకారం ప్రపంచంలో 100 దేశాల్లో ఐదువేల తెగలకు చెందిన 50కోట్ల ఆదివాసీలు ఉన్నారని, భారతదేశంలో 461 ఆదివాసీ తెగలున్నాయని తేల్చిచెప్పింది. ఈ తెగల్లో 92 శాతం మంది ఆదివాసీలున్నా సమితి తీర్మానించిన విధానాలకు విరుద్ధంగా అత్యంత అమానుష విధ్వంసకాండకొనసాగుతోంది.ఆదివాసీలకు స్వయంపాలన హక్కు, స్వేచ్ఛహక్కు, మానవహక్కుల సంరక్షణ, సంస్క ృతి సంప్రదాయాల జీవన విధాన సంరక్షణ హక్కు, విద్య,వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన తదితర హక్కులపై సమితి సదస్సులో తీర్మానించినా ఎంతవరకు ప్రభుత్వాలు వీటిని ఆచరణలోఉంచుతు న్నాయో చెప్ప లేని పరిస్థితి కొనసాగుతోంది. కొన్ని యుగాల నుంచి సామ్రాజ్యవాదవిధానంపై బీర్సాముండా,గుండాదార్‌కాసు, సిద్ధు, కొమరం భీం,రాంజీనోండు తదితర విప్లవయోధుల పోరాట ఫలితం గానే రాజ్యాంగంలో 5,6వ షెడ్యూలుఏర్పాటయింది.
అయినా ఏంలాభం? ఈచట్టాలన్నీ చట్టుబండలవుతున్నా యి. అభివ ృద్ధి పథకాల పేరుతో ఆదివాసీలను అణచివేస్తున్నారు. సహజ వనరులు, ఖనిజ సంపద కార్పొరేట్‌ వర్గాల వరమవుతున్నాయి. స్వయం స్వాతంత్య్రంతో అడవ్ఞలే తమ ఆధారమని జీవిస్తున్న ఆది వాసీల ఉనికికే ముప్పు ఏర్పడుతోంది. ఆదివాసీలపై దౌర్జన్యాలు, ఆదివాసీ మహిళలపై అత్యాచారాలు సాగుతున్నా పాలకవర్గాలు మౌనం పాటిస్తున్నాయి. మావోయిస్టులకు అండదండలు అందిస్తు న్నారన్న నేరారోపణతో సాయుధ బలగాలు దారుణాలకుపాల్పడు తున్నాయి. ప్రభుత్వాలు మారినా ఆదివాసీలపై హింసలు ఆగడం లేదు. ఆంధ్రలోని విశాఖ మన్యంలో ఆదివాసీలపై మావోయిస్టుల ముద్రవేసిహింసించే సంఘటనలు ఎన్నోజరిగాయి.శ్రీకాకుళంలో కన్నె ధార కొండగ్రానైట్‌ మాఫియా చేతిలో ఆదివాసీలు బందీలైపోతున్న ఉదంతాలు ఎదురవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు వల్ల మూడు లక్షలమంది ఆదివాసీలు అడ్రసు లేకుండా పోతున్నారు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో కొత్త గూడెంలో విమానాశ్రయం నిర్మిస్తే 1600 ఎకరాల భూమి అవసర మని 1/70, పీసా చట్టాలకు వ్యతిరేకంగా బలవంతంగా భూమిని సేకరిస్తున్నారు. తెలంగాణలో హరితహారం పేరుతో అటవీభూము ల్లో అంగుళం భూమయినా ఆదివాసీలకు దక్కకుండా 2006 అటవీహక్కుల చట్టాన్ని అపహాస్యం చేస్తూ మొక్కలు నాటుతున్నారు. ఇలాంటి అన్యాయాలు అక్రమాలు ఎదిరి స్తున్న వారికి సంకెళ్లు వేస్తున్నారు. సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ గనుల కారణంగా ఉత్తర తెలంగాణ లోని ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 124 గ్రామాలు కనుమరుగయ్యాయి. ఏజెన్సీలో స్వేచ్చగా పోడువ్యవసా యం, పండ్లతోటలు, కూరగాయలు,పండిరచుకుంటూ అభివృద్ధిచెం దుతున్న ఆదివాసీల జీవనం ఈఓపెన్‌ కాస్ట్‌ గనుల వల్ల చిన్నాభిన్న మయింది. ఈ విధంగా నిర్వాసితులైనవారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతున్నా వాస్తవానికి అవన్నీ మొక్కుబడి వ్యవహారంగానే మిగిలిపోతోంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని గిరిజన మండలమైన తిర్యాణిలోని గోలేటి, కైరిగూర్‌, ఓపెన్‌ కాస్టు గనుల కింద నిర్వాసితులైన గిరిజనుల కోసం పునరావాస కాలనీ ఏర్పాటైనా అక్కడ నీరు,విద్యుత్‌, తదితర కనీస సదుపాయాలు లేవుసరికదా ఉపాధిలేక ఎవరూ అక్కడ ఉండడం లేదు. ఇక ఆదివాసీ ప్రాంతాల్లో మహిళల పరిస్థితి మరీ దారుణం. 2006 ఆగస్టు 20న విశాఖ జిల్లాలో కొండతెగకు చెందిన వారిని వాకపల్లిలో గ్రేహౌండ్స్‌ దళాలు అత్యాచారం చేస్తే ఇంతవరకు నింది తులకు శిక్షపడలేదు. వాకపల్లి ఆదివాసి అత్యాచార బాధితులు ఈ వ్యవస్థపై నమ్మకం పోయి నాగరిక సమాజానికి దూరంగా అడవిలోనే దుర్భర జీవితం గడుపుతున్నారు. ఆదిలాబాద్‌ నుంచి శ్రీకాకుళం వరకు ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీ మహి ళలపై ఎన్నో వేధింపులు, లైంగిక హింసలు సాగుతున్నా పాలక వర్గం పట్టించుకోవడం లేదు. తెలంగాణ జిల్లాల్లో ఇటుక బట్టీలు తయారు చేసే వారిలో 90శాతం ఆదివాసీ మహిళలే ఉన్నారు. చత్తీస్‌గఢ్‌,ఒడిశా,మహారాష్ట్రల నుండి వీరిని రప్పించి ఈపనులు చేయిస్తున్నారు. తక్కువ వేతనం ఇస్తున్నారు. ఎదురు తిరిగితే ఇబ్బందులు సృష్టిస్తున్నారు. నిరక్షరాస్యులైన అమా యకపు ఆదివాసీలు తమ బాధలు ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. చెప్పినా న్యాయం జరగదన్న అభిప్రాయం వీరిలో బలంగా నాటుకు పోయింది.
సమాజంలో ఆదివాసీలవేతన అరణ్యరోదనగా మారింది. రాజ్యాంగంలో ని అయిదు, ఆరు షెడ్యూల్‌లోని నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తేఆదివాసీల స్థితిగతులు, కొంతవరకయినా మెరుగుపడతాయి. షెడ్యూల్‌ ప్రాంత ఆదివాసీస్థితిని సమీక్షించి ప్రత్యే కించి చర్యలు చేపట్టే అధికారాలు గవర్నర్‌కు, రాష్ట్రపతికి ఉన్నాయి.- పి.వెంకటేశం

అభివృద్ధి పేరుతో అప్పులు ఎవరి కోసం?

ఆర్థికాభివృద్ధికి లోటులేదు. మన వనరులు ఆదాయం ఆంద్రోళ్లుకొల్లగొట్టారని మనకు తిప్పలు.. ఇలా తెలంగాణ గూర్చి గొప్పలు చెప్పారు. నిజమే తెలంగాణ గూర్చి కేసీఆర్‌ చెప్పిందంతా నిజమే. అయితే, తెలంగాణ వచ్చిన తర్వాత రెండు లక్షల కోట్లకు అప్పు ఎలా పెరిగింది? ఆదాయం తగ్గిందిలేదు. పైగా పెరిగింది. హైదరాబాద్‌ ఆదాయం నలుబది శాతం మద్యం ఆదాయం, ఇరువై శాతం ఉంటుంది. అప్పుల భారతాన్ని, ఈ అప్పుల రాష్ట్రాన్ని ఆ ఊబి నుంచి ఎవరు బయటపడేస్తారు? లక్షల కోట్ల అప్పు ఎలా తీరుస్తారు? ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేసినట్టు? ఏ అభివృద్ధి పేరుతో ఎవరు తిన్నట్టు? ఎన్నో వనరులున్న భారతదేశ అభివ ృద్ధికి అప్పులు అవసరమా? అప్పులు చేసి అభివృద్ధి చేయాలా? లక్షల కోట్ల అప్పులున్న దేశాన్ని అభివ ృద్ధి చెందిన దేశంగా ఎలా శ్లాఘించగలం? అన్నీ ప్రశ్నలే..?
అభివృద్ధి పేరుతో జరిగిన లక్షల కోట్ల అప్పు కనిపిస్తోంది తప్ప అభివ ృద్ధి కనిపిస్తుందా? ఎక్కడ కనిపిస్తుంది? ఎవరి అభివ ృద్ధి కనిపిస్తుంది? ఇన్నిన్ని కోట్ల అప్పు చేస్తే మిగిలిందేమిటీ? పేదలపాలిట కన్నీళ్లు.. మరి ఇన్ని లక్షల కోట్ల అప్పు ఎవరికొరకు చేసారు? ఎందుకు చేసారు? అప్పుమూలంగా ఎవరు లాభపడ్డారు? అభివృద్ధి కనిపించదు. అప్పు కనిపిస్తుంది ఎందుకు?
అప్పు నిజం.. అభివ ృద్ధి అబద్ధం. ఇదీ మనదేశస్థితి… ఇదీ మన తెలంగాణ స్థితి. అన్నీ ఉండి అప్పులు చేసి.. అభివృద్ధి చేస్తామని గొప్పలు చేప్పుకోవటం ఇప్పటి ప్రభుత్వాలకు అలవాటయ్యింది. ఈ అభివ ృద్ధికి అప్పు చేసామంటే ఒక అర్థముంది. ఆ అభివృద్ధి కనిపించాలి. ఈ ప్రాజెక్టుకు అక్కడి నుంచి ఇక్కడి నుంచి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చామంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. అన్నీ ఉండి సరిపోయే ఆదాయముండి లక్షల కోట్లు అప్పు చూపిస్తే ప్రజలేమనుకుంటారు? అభివృద్ధి పేరుతో అప్పు తెచ్చి.. తమ ఆస్తులు పెంచుకున్నారని.. కోట్ల రూపాయలు దోచుకొని, దాచుకున్నారని భావిస్తారు. వాస్తవం కూడా ఇదే!
పాలకుల మీద రాజకీయ నాయకుల మీద నిందలు వేయటం సరదాకాదు. నిజానికి ప్రజలు పాలకులు, రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా, ఆదర్శంగా, కడిగిన ముత్యంలా ఉండాలని భావిస్తారు. ‘’మేము ఓటువేసి గెలిపించాం కానీ దొంగైతేలిండు అని చెప్పుకోవటం ప్రజలకు కూడా అవమానమే. అభివృద్ధి పేరుతో జరుగుతున్న వేల కోట్ల అవినీతి గూర్చి నేను రాయటం, మీరు చెప్పటం కాదు, ‘రాజకీయ పక్షాలే ఒకరి నొకరు ‘నీవు దొంగ నీవు దొంగ’ అని తిట్టుకుం టున్నాయి. రాళ్లు వేసుకుంటున్నాయి. దేశంలోని అత్యున్నత నేర పరిశోధనా సంస్థ సీబీఐలోని ప్రధమ ద్వితీయ అధికారులే ఒకరినొకరు అవినీతి పరులని ఆడిపోసుకుంటున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భావం జరిగే సమయానికి తెలంగాణ రాష్ట్రం అప్పు యాబదివేల కోట్లు. మన రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్‌ పరిపాలనలో ఏడాది క్రితం తేలిన తెలంగాణ రాష్ట్ర అప్పు రెండు లక్షల కోట్లు.. ఇప్పుడు పత్రికల కథనాల ప్రకారం రెండు లక్షల ముప్పది వేల కోట్ల అప్పు… ఇంత అప్పు తెలంగాణ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చేసిన అప్పు అభివ ృద్ధిలో కనిపించాలి. కనిపిస్తుందా? రెండు లక్షల ముప్పదివేల కోట్లు అంటే మామూలు మాట కాదు. ఎందుకు చేసినట్టు? తెలంగాణలో ఏఅభవృద్ధి కనిపిస్తుంది? అప్పులతో కూడిన అభివృద్ధి సంత ృప్తికలిగించదు. అభివృద్ధి కనిపించినా కొంత సంత ృప్తి కనిపిస్తుందేమో.‘అభివృద్దే’ కనిపించక పోతే…ఏ రాష్ట్రానికి ఎంత అప్పు ఉందో తెలియదు కానీ, నూతన తెలంగాణ రాష్ట్ర అప్పు రెండు లక్షల ముప్పదివేల కోట్లు. తెలంగాణ రాష్ట్ర జనాభా ఎంత? నాలుకోట్లని కొందరంటారు. మనిషికి.. అంటే తలకు ఎంత అప్పు? అరువదివేల అప్పు.. భయం వేయటం లేదూ..? తెలంగాణ కొత్త రాష్ట్రాన్ని తెచ్చుకొని.. మన రాష్ట్రాన్ని మనం పాలిస్తున్న తృప్తిలో రెండు లక్షల ముప్పదివేల కోట్ల అప్పు పెంచుకున్నాం. అవసరమా? అవసరమైన అప్పుగా భావించాలా? ఈ లెక్కలు ఇలా ఉండగా.. భారతదేశ అప్పు 50 లక్షల కోట్లు అని ఎక్కడో చదివింది జ్ఞాపకమొచ్చింది. నిజమా? అబద్దమా? లెక్క తేలటానికి అవకాశం లేదు. రకరకాల అప్పులుంటాయి కాబట్టి లెక్క తేలటం కష్టం.. సమాచార హక్కు క్రింద ఈ లెక్కలు యివ్వకపోవచ్చు.. రాష్ట్రాలు సంస్థలు.. స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగం కాబట్టి లెక్క కష్టమే.. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ‘పరిశ్రమల’ పేరుతో ఉపాధి పేరుతో బిచ్చగాళ్లలాగా ప్రపంచం చుట్టూ తిరుగుతూ ఉంది. ఎవరిచ్చారు అధికారం? అప్పుల పేరుతో అభివ ృద్ధి పేరుతో ఎవరు దోచుకున్నారు? ఎవరు సంపన్నులయ్యారు? అప్పులు లక్షల కోట్లు కనిపిస్తున్నాయి. ప్రజలు నిరుపేదలుగా ఉన్నారు. ఎవరు అభివృద్ధి చెందినట్టు? రాఫెల్‌ అవినీతిలో 30వేల కోట్ల అవినీతి ఉందని దేశం సంపద అనిల్‌ అంబానీ జేబులోకి వెళ్లిందని కాంగ్రెస్‌ నేత రాహూల్‌ లెక్కలతో చెపుతున్నారు. బడా వ్యాపారులు బ్యాంకులను ముంచిన సొమ్ము పన్నెండు లక్షల కోట్లు. ఇట్టి డబ్బు ఏదో రూపంలో ప్రభుత్వం బ్యాంకులకు యివ్వాలి. ఒకవేళ బ్యాంకులను నింపకపోతే.. బ్యాంకులు దివాలా తీస్తాయి. బ్యాంకులకు నింపాలంటే ఎలా? ఘనమైన భారత సర్కారు అప్పు చేయవల్సిందే… లేకపోతే పన్నులు పెంచాలి.. లేకపోతే పెట్రోల్‌ డిజీల్‌పై మరో పది ఇరువది దోచుకోవాలి.. ఇదే భారతదేశ అభివృద్ధి. ఇన్ని లక్షల కోట్ల అప్పు ఎందుకయింది? దేశంలో ఉన్న 80శాతం పేద ప్రజలు, శ్రమజీవులు బాగుపడ్డారా? దేశం ప్రధాన ఉత్పత్తి, జీవనాధారం వ్యవసాయం. రైతులు బాగుపడ్డారా? ఇప్పటికీ దేశవ్యాప్తంగా వేల మంది రైతులు అప్పులతో మరి ఆత్మహత్య చేసుకుంటున్నారు.ఏఅభివృద్ధికి ఈ అప్పులు? భారతదేశం ఎన్నో వనరులున్న దేశం.. ఎన్నో సంపదలున్న విశాల భారతదేశం. మానవశక్తి విపరీతంగా ఉన్న దేశం. డెబ్బది ఏండ్ల స్వాతంత్య్రంలో యాబది కోట్ల లక్షల అప్పు చేసిన ఘనత మన ప్రజాస్వామ్య పరిపాలకులది. ఆంగ్లేయ పాలకులు దేశ సంపదను దోచుకొని ఇంగ్లాడు పంపిస్తే.. మన స్వాతంత్య్ర ప్రజాస్వామ్య పాలకులు లక్షల కోట్లు అప్పులు చేసి అభివ ృద్ధి పేరుతో కార్పొరేట్‌ సామ్రాజ్యాన్ని విపరీతంగా పెంచారు. ఆర్థిక అసమానతలకు తెరదీసారు.
నిజానికి భారతదేశానికి 50 లక్షల కోట్లు అప్పు ఎందుకయ్యిందో అర్థం కాదు. ఏ అభివృద్ధి జరిగిందో అర్థం కాదు. ఉద్యోగాల కల్పన లేదు. కొత్త నిర్మాణాలు లేవు. ఎవరితో యుద్ధం లేదు. అందరూ జీతాలు రెట్టింపు చేసుకోవటం తప్ప కొత్త ఉద్యోగాలు లేవు. ఆదాయం విషయంలో గతం కంటే రెట్టింపు కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి రకరకాల ఆదాయం పెరిగింది. పెట్రోల్‌ డీజిల్‌ రెట్టింపు రేట్ల అమ్మకం ద్వారా లక్షల కోట్ల ఆదాయం పెరిగింది. పైగా కొత్తగా బొగ్గు, మైనింగ్‌ ద్వారా, ఇంటర్నెట్‌ సేవల మూలంగా లక్షల కోట్ల ఆదాయం పెరిగింది. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పన్నుల చట్టం జీఎస్‌టీ ఆదాయం ఉండనే ఉంది! మరి ఈ ఆదాయమంతా ఏమైనట్టు? లక్షల కోట్ల అప్పులు ఎందుకు అయినట్టు? ప్రతి ఏటా ఇరువది లక్షల పైన బడ్జెట్‌? ఎవరు తింటున్నట్టు? తెలంగాణ ఉద్యమంలో ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పదేపదే అన్నారు. తెలంగాణకు వనరులు న్నాయి. నదులున్నాయి. పచ్చని పొలాలున్నాయి. ఆర్థికాభివృద్ధికి లోటులేదు. మన వనరులు ఆదాయం ఆంద్రోళ్లుకొల్లగొట్టారని మనకు తిప్పలు.. ఇలా తెలంగాణ గూర్చి గొప్పలు చెప్పారు. నిజమే తెలంగాణ గూర్చి కేసీఆర్‌ చెప్పిందంతా నిజమే. అయితే, తెలంగాణ వచ్చిన తర్వాత రెండు లక్షల కోట్లకు అప్పు ఎలా పెరిగింది? ఆదాయం తగ్గిందిలేదు. పైగా పెరిగింది. హైదరాబాద్‌ ఆదాయం నలుబది శాతం మద్యం ఆదాయం, ఇరువై శాతం ఉంటుంది. లక్షకోట్లు కేంద్రం నుంచి ఇచ్చామని అమిత్‌షా అన్నారు. రెండు లక్షల కోట్లకు అప్పు ఎందుకు పెరిగినట్టు?ఎవరు బోంచేసినట్టు?- – సిహెచ్‌.మధు

అడవిపై ఆదివాసీకి హక్కు ఎక్కడ?

అడవిని చట్టబద్దంగా పొందవలసిన ఆదివాసీలనూ వారి హక్కులనూ కాల రాశారు. అడవిపై ఆదివాసీల హక్కులు పూర్తి కాలరాయడంతో అనేక పరిణామాలు సంభవించాయి. అడవిలో ఉండే ఆదివాసీలను ఆక్రమణదారులుగా గుర్తించారు. అడవిలో జీవించటం, జీవనాధారాన్ని పొందటం నేరపూరిత చర్యగా భావించారు. దీనితో ఆదివాసీలలో అభద్రతా భావం మొదలైంది! ఏజెన్సీలో ఈ విధంగా జరుగుతుండటంతో పోషకార లోపంతో, ఆకలి చావులతో ఆదివాసీలు చనిపోవడం నిత్యక ృత్యం అయింది. దీనితో నిర్వాసితం అనేది ఆదివాసీల జీవితంలో ఒక భాగం అయిపోయింది. దాదాపుగా 60శాతం పైగా షెడ్యూల్డ్‌ ప్రాంత భూములు అటవీశాఖ ఆధీనంలో ఉన్నాయి. జీవనాధారానికి కొద్ది భూభాగం మాత్రమే ఆదివాసీలకి దక్కింది. ఏజెన్సీలో 50శాతం పైగా భూములు ఆదివాసేతరుల చేతిలో ఉన్నాయి.వూకె రామకృష్ణ దొర
తరతరాలుగా ఆదివాసీలు అడవులతో మమే కం అయిపోయి అవినాభావ సంబంధంలో జీవనాన్ని గడుపుతున్నారు. అడవుల నుండి పండ్లు, దుంపలు, మూలికలు ఇతర ఆహార పదార్థాలను సమకూర్చుకుంటున్నారు. ఆదివాసీలు ఆర్థిక వ్యవస్థ అంతా అడవులపైనే ఆధారపడి ఉంటుంది. కేవలం ఆర్థిక వ్యవస్థే కాదు సామాజిక, సాంస్క ృతిక, సంప్రదాయ మత జీవనాలు కూడా అడవులతోనే ముడిపడి ఉంటాయి.
ఆదిమకాలం నుంచి అడవులను ఆదివాసీలు యథేచ్ఛగా ఉపయోగించుకుంటున్నారు. ఆదివాసీ ప్రాంతాలలోకి బ్రిటీషు వారి ప్రవేశంతో సమస్యలు తలెత్తాయి. బ్రిటీషు పాలకులు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి భూమికి శిస్తు వసూలు చేయడం ప్రారంభించారు. వనరులను తమ ఆదాయన్ని పెంచే సాధనాలుగా గుర్తించి అడవులనూ అమ్ముకోవచ్చు అనుకున్నారు.
అందుకనే ఆదివాసీలనూ అడవి నుంచి తరిమి వాటిని తమ సొంత ఆస్తిగా మార్చుకోవడానికి అటవీ హక్కుల విధానాలనూ రూపొందించి అడవులపై తన అధికార పరిధిని పెంచుకుంటూ దోపిడి చేయటం ప్రారంభించారు. అనాదిగా అడవులు తమకి చెందినవని భావిస్తున్న ఆదివాసీల పట్ల అటవీ విధానాలు ఆశనిపాతాలయ్యాయి. అడవికి ఆదివాసికి మధ్య అగాధాన్ని పెంచాయి.
1894లో మొదటిసారిగా బ్రిటీషు ప్రభు త్వం అటవీ హక్కుల విధానాన్ని ప్రకటించింది. దీనితో అటవీ శాఖ వెలుగులోకి వచ్చింది. అప్పటి నుండి క్రమంగా ఆదివాసీలపై ప్రభుత్వ అధికారం మొదలయ్యింది. భారతదేశ స్వాతంత్య్ర అనంతరం ప్రభుత్వం 1952లో నూతన అటవీ విధానాన్ని తీసుకవచ్చింది. దీనిలో ఆదివాసుల హక్కులు రాయితీల స్థానానికి దిగజారిపోయాయి.
1894 అటవీ విధానానికి భిన్నంగా 1952 అటవీ విధానంలో మొత్తం అటవీప్రాంతానికి ఒకేపద్ధతి అవలంభించారు. ఈచట్టంతో అడవి భూమిని వ్యవసాయ భూమిగా మార్చడం అంగీకరించారు. పచ్చిక బయళ్ళనూ అడవుల్లో పశువులకూ ఉచితంగా మేపుకునే స్వేచ్ఛనూ ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చారు.
1952లో జాతీయ అటవీ విధానం అడవులనూ వ్యాపారానికి వాడుకునేందుకు అనువైన పరిస్థితిని రూపొందించింది. ఈ విధానమే ఆదివాసీలను అడవికి పరాయివాళ్ళను చేసింది. పారిశ్రామిక అవసరాలకు అడవులను నరకకుండా ఆపలేకపోయారు. 1980లో అటవీ సంరక్షణ చట్టం తీసుకవచ్చారు. ఈచట్టం ఆదివాసుల జీవనాన్ని భవిష్యత్‌నూ మరింత ప్రమాదంలోకి నెట్టింది.
భారత అటవీ సంరక్షణ చట్టం ద్వారా మానవ సంచారం లేకుండా ఉండే అటవీ ప్రాంతాలుగా అడవిని పునర్నిర్వించడం జరిగింది. అడవిలో ఉండే ఆదివాసీలను ఆక్రమణదారులుగా గుర్తించారు. చట్టబద్ధంగా పొందవల్సిన అటవీ ప్రాంత ఆదివాసీల హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయి. అడవిని రిజర్వ్‌ చేసే క్రమంలో ఆదివాసీ గ్రామాలు, భూములు రిజర్వులలో కలిసిపోయాయి.
అటవీశాఖ ఏకపక్షంగా, గిరిజన సంక్షేమ శాఖ, రెవిన్యూ శాఖల మధ్య సమన్వయంతో భూములు సర్వే చేయకుండానే అనేక సాగుభూములనూ ‘రిజర్వ్‌’ గా నోటీపై చేసింది. అటవీ చట్టం ప్రకారం ఆదివాసీలు తమ సొంత భూమిలోనే ఆక్రమణదారులుగా గుర్తించబడ్డారు. అడవి, ఆదివాసులకి మధ్య మరింత దూరం పెరిగింది.
ఆదివాసీ ప్రజలకు అడవికి ఉన్న సంబంధాన్ని వారి సంప్రదాయ హక్కులనూ, అవసరాలనూ కాపాడాలని 1908లో భారత అటవీ విధానం గుర్తిం చింది. దానికి అనుగుణంగా 1990 సెప్టెంబర్‌ 18న కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ: 13-1/90 ఎఫ్‌పి 1,2,3,4,5 అనే సర్క్యులర్స్‌ జారీ చేసింది. అవి ఇప్పటి వరకు అమలు జరుగలేదు.
1996లో పంచాయితీరాజ్‌ షెడ్యూల్‌ ప్రాంతాల విస్తరణ చట్టం ద్వారా ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాల్లోని అటవీ వనరులపై ఆదివాసీలకే అధికారం ఉంటుందని అంగీకరించింది. అయితే ప్రభుత్వమే దానిని ఉల్లఘించి నిర్లక్ష్యం చేసింది. 1947లో అధికార మార్పిడి జరిగిన తరువాత రిజర్వు ఫారెస్ట్‌గా వర్గీకరించేటప్పుడు ఆదివాసుల భూములనూ, ఉమ్మడి భూముల్ని హక్కుల్ని నిర్ధారించకుండానే సెటిల్‌ చేయకుండానే అడవులుగా ప్రకటించారు. ఆదివాసీల సెటిల్‌మెంట్‌ హక్కుల గురించి పట్టించుకోలేదు. 1952 నాటి జాతీయ అటవీ విధానంను భారత ప్రభుత్వం సవరించి 1980 అటవీ సంరక్షణ చట్టం ద్వారా అడవి హక్కులపై భారత ప్రభుత్వానికి పూర్తి ఆదిపత్యం వచ్చింది. ఎవరైతే వ్యాపార పరంగా అడవులను ఆదివాసీలనూ దోచుకున్నారో ఆవర్గాల నుండి వచ్చిన వారే అడవి రక్షకులుగా మారి అడవులనూ భక్షించారు.
అడవిని చట్టబద్దంగా పొందవలసిన ఆదివాసీలనూ వారి హక్కులనూ కాల రాశారు. అడవిపై ఆదివాసీల హక్కులు పూర్తి కాలరాయడంతో అనేక పరి ణామాలు సంభవించాయి. అడవిలో ఉండే ఆదివాసీలను ఆక్రమణదారులుగా గుర్తించారు. అడవిలో జీవించటం, జీవనాధారాన్ని పొందటం నేరపూరిత చర్యగా భావించారు.
దీనితో ఆదివాసీలలో అభద్రతా భావం మొదలైంది! ఏజెన్సీలో ఈ విధంగా జరుగుతుండటంతో పోషకార లోపంతో, ఆకలి చావులతో ఆదివాసీలు చనిపోవడం నిత్యక ృత్యం అయింది. దీనితో నిర్వాసితం అనేది ఆదివాసీల జీవితంలో ఒక భాగం అయిపోయింది.
దాదాపుగా 60శాతం పైగా షెడ్యూల్డ్‌ ప్రాంత భూములు అటవీశాఖ ఆధీనంలో ఉన్నాయి. జీవనాధారానికి కొద్ది భూభాగం మాత్రమే ఆదివాసీలకి దక్కింది. ఏజెన్సీలో 50శాతం పైగా భూములు ఆదివాసేతరుల చేతిలోఉన్నాయి.
రచయిత : తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ రచయితల సంఘం అధ్యక్షుడు, 9866073866

మహనీయ.. ‘స్వామి వివేకానంద’

‘‘స్వామి వివేకానంద ప్రసంగాలను, రచనలు నేను క్షుణ్ణంగా చదివాను, ఆ తరువాత నా దేశభక్తి వేయి రెట్లు అయింది. యువకుల్లారా! ఆయన రచనల చదవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను’’ అని మహాత్మాగాంధి అన్నారు. వివేకానందుడు రామకృష్ణ మఠం స్థాపించి ‘‘పేదలకు, వెనుకబడ్డ వారికి సేవ చేయడం దీని ప్రధానోద్దేశాలలో ఒకటి‘ అని ఉద్భోదించి భారతీయ యువతకు దిశానిర్దేశం చేశారు. భారతదేశాన్ని పురోగమింప చేయడానికి సంఘ సంస్కరణలు అవసరమని సమాజ నేతలు అనేకులు నొక్కివక్కాణించిన సమయంలో, భారతదేశ పతనానికి ఉన్నత వర్గం వారు పేదలను బహిష్కరించడము, దోపిడీకి గురిచేయడమూ మొదటి కారణమని ఘోషించిన మొదటి నేత స్వామి’’ – డా. దేవులపల్లి పద్మజ
ఉన్నతమైన ఆశయాలు ఏదో ఒకరోజు సర్వజనాంగీకారాన్ని పొందుతాయి. కారణం ఆ భావనలు, ఆశయాలు ప్రతి కార్యరంగంలోనూ, ప్రతీఆలోచనా విధానంలోనూ ఉత్తేజం కలిగించేవి కాబట్టి. కాషాయాంబరాలు ధరించి, పద్మాసనస్థులై, ఒకదాని మీదమరొకటిగా కరకమలాలను ఒడిలో ఉంచుకుని, అర్థనిమీలనేత్రులై ధ్యానమగ్నులై వివేకమంతమైన ఆనందం అనుభవించే స్వామి వివేకానంద లోకానికి ప్రకాశానిచ్చే ఒకజగద్గురువు. సామాజికసృహతో కూడిన ఆధ్యాత్మికతను ప్రజలకు ఉపదేశించడం, ఇంద్రియాతీత విష యాలను వివేకించటం ద్వారా ఆధ్యా త్మికసౌధాన్ని నిర్మించడం, ఆసౌ ధంలో చైతన్యమూర్తులుగా జనులను విరా జిల్లింప చేయటంస్వామి వివే కానంద అపురూప ఆశయం. విశ్వాసంతో నిరంతరాభ్యాసాన్ని చేస్తూ, మనసు పొరలలో నిభిఢీకృతమైన కొత్త విష యాలను అనుభవిస్తూ, క్రొంగొత్త శక్తులు వశీకరింపచేసుకుంటూ ఊహాతీత వ్యక్తిత్వాన్ని వికసింపచేసు కోవటానికి దివ్య ప్రేరణ స్వామి వివే కానంద. 1863వ సం.లో కలకత్తా నగరంలో జన్మించిన స్వామి వివే కానంద ఆరేళ్ళ ప్రాయంనుంచే అంత ర్ముఖ అన్వేషణలో మనసు లగ్నం చేసి ధ్యానంలో నిమగ్నుడై ఉండేవారు. జ్యోతిర్మయ ప్రకాశంలో జీవిస్తూ చిరుప్రాయంలోనే సృజనాత్మకత, ఆత్మ ప్రతిష్ట, ఆత్మప్రేరణలో దివ్యదర్శనాలు అనుభవించారు. ప్రకృతితో తాదాత్మ్యం చెంది ఆ చైతన్యంలో విరాజిల్లే అంతర్ముఖ చైతన్య స్వరూపుడు.‘‘నేను భగవంతుడిని నిన్ను చూస్తునంత స్పష్టంగా చూశాను, మతం అనేది అనుభూతి పొందవలసిన సత్యం, లోకాన్ని మనం అర్దం చేసు కోవటంకన్నా అనేక రెట్లు లోతుగా గ్రహించవలసిన విషయం’’ అని ప్రవచించే శ్రీరామకృష్ణ పరమహంస దివ్య సాన్నిధ్యంలో ఙ్ఞాన,కర్మ,భక్తి,యోగ మార్గాలలో కానరాని వెలుగు ఆస్వాదించి వారివచనాలను విపులీకరించి లోకాన్ని ఆశ్చర్యచకితులను చేసారు. పశుప్రాయులుగా జీవిస్తున్న వారిని మానవ స్థాయికి ఎదగచేయడమే ప్రధాన ధ్యేయంగా లోకాన్ని ఉద్ధరించిన మనీషి స్వామి వివేకానంద. చికాగోలో జరిగిన స్వామి ప్రసంగం బాహ్యంగా ఎగసిన ఉత్సాహ పుటలలోనే కాక, ఉద్వేగ ప్రవాహాలలోనే కాక, నరనరాల్లోకి చొచ్చుకుని పోయిన నూతన కాంతి పుంజం. దానిని గురించి ఒక్క మాటలో చెప్పటానికో, వ్రాయటానికో కుదిరేది కాదు. చికాగో ప్రసంగం స్వామి వివేకానందకు అమెరికాలో గుర్తింపు రావడమే కాదు, సాక్షాత్తు భారత దేశం కూడా గర్వించేలా చేసింది. అమెరికాలో ఎగసిన ఒక అల భారతదేశంలో సహస్ర తరంగాలను ఉత్పన్నం చేసింది. ‘‘నేను ఎవరిని? ఆసియా వాసినా? ఐరోపా వాసినా? అమెరికా వాసినా? ఈ వ్యక్తిత్వాల వింత సమ్మేళనాన్ని నాలో అనుభూతి చెందుతున్నాను’’ అనేవారు స్వామి. ప్రతి మతంలోని, ప్రతి సిద్ధాంతంలోని మంచిని గ్రహించి హృదయంలో దీప్తిస్తున్న ఆత్మజ్యోతిని అవలోకనం చేసుకుంటే సర్వమత ఏకత్వాన్ని దర్శించవచ్చని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి శ్రీవివేకానంద. హిందూమతాన్ని కించపరిస్తే సహించేవారు కాదు. దానిని తీవ్రంగా ప్రతిఘటించి హిందూ మత ఔన్నత్యాన్ని చాటిచెప్పేవారు. జీవితంలో అన్ని విషయాలపైన కఠోర నియమం, నిఘా అవసరం అని చెప్పే వారు. ‘‘ఆహార నియంత్రణ ముఖ్యంగా పాటించాలి. ఆహార నియం త్రణ లేకుండా మనస్సుని నియంత్రించటం సాధ్యం కాదు. అవసరం కన్నా ఎక్కువ తినడం అనేక హానులకు దారితీస్తుంది. మితిమీరి తినడం వలన మనశ్శరీరాలు చెడిపోతాయి’’ అనేవారు. ప్రేమ తత్వా న్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని సడలనీయవద్దని గట్టిగా ప్రభోదించేవాడు. మతం అనేది సిద్ధాంత రాద్ధాంతములతో లేదు అది ఆచరణలే ఆధ్యాత్మికులుగా పరిణతి చెందడంలో మాత్రమే వుంది అని విశ్వసిం చేవారు. వివేకానందను విదేశాలలో అనేకులు కుమారునిగా, సోదరు నిగా భావించారని మనం తెలుసుకున్నప్పుడు మనకు ఆయన పరిణతి కనిపిస్తుంది. భారతదేశంలో ఇటువంటి బాంధవ్యాలు కొత్త కాదు. విదేశాలలో ఇటువంటివి ఉత్పన్నమైనప్పుడు ఆయన వైఖరి విశిష్టత అర్థం అవుతుంది. జాతిమౌఢ్య, వర్ణ మౌఢ్యం విలయతాండవం చేసే రోజులలో అప్పట్లో బానిస దేశంగా పరిగణించే భారతదేశం నుండి వెళ్ళి అసంఖ్యాక మనసులను దోచుకోవడం గమనార్హం. అహిం సలో నెలకొనివున్న వ్యక్తి సాన్నిధ్యంలో వైరాలకు చోటులేదు. సత్య నిష్టుని సాన్నిహిత్యంలో అసత్యం నశించిపోతుంది. అందుకే అన్ని ఎల్లలను అతిక్రమించిన స్వామి వివేకానంద ఆత్మఙ్ఞానంలో సుప్రతి ష్టులై ఉండగా ఎలాంటి వివక్షత తలెత్తడం సాధ్యంకాదు. వివేకానంద ఆధ్యాత్మిక శక్తి గురించి విన్న విదేశీయులు ఆయనతో సన్నిహితంగా మెలగటానికి మక్కువ చూపేవారు. తాను జన్మించిన కుటుంబాన్ని పరిత్యజించి ప్రపంచమనే పెద్ద కుటుంబాన్ని స్వీకరించారు. భారత దేశం కూడా తక్కిన దేశాలతో పాటు అభివృద్ధి పొందగోరితే పేదలు, పామరులు పురోగనమం చెందాలి. అందుకే పేదలకు కూడా విద్య గరపమని ఆయన నొక్కి వక్కాణించారు. భారతదేశపు గౌరవ మర్యాద లను విదేశాలలో ఇనుమడిరపచేయటానికి అహర్నిశలు కృషి చేశారు. అప్పటికే ప్రచారంలోవున్న భారత వ్యతిరేకతను తొలగించటానికి నడుం బిగించారు. భారతీయ ఆధ్యాత్మికతలోని వివిధ పరిణామాలు ఆయన ఉపన్యాసాలలో ప్రధానాంశాలు అయినప్పటికి, ప్రతి ప్రసంగంలోనూ మన వాస్తవిక చిత్రాన్ని ఆవిష్కరించేవారు. మతాల మధ్య వ్యత్యాసాలు ఉండపచ్చు కాని వాటి మధ్యగల సామాన్య మౌలికతను గుర్తించమని చెప్పేవారు. హైందవుల శాంతి కాముకత్వాన్ని తన అహింసా తత్వం తో వెల్లడిచేసేవారు. శక్తివంతమైన ఈభారతదేశం ప్రపంచాన్ని జయి స్తుంది. అందుకే ‘‘ఓ భారతమా! నీ ఆధ్యాత్మికతతో ప్రపంచాన్ని జయించు!’’ అంటూ స్వామి సింహనాదం చేసేవారు. ప్రశాంతత, పవిత్రత, త్యాగశీలత, సౌభ్రాతృత్వాల సందేశాలను వివరించి సహన రహిత చెవిటి చెవులలో ప్రతిధ్యనులు ఉద్భవింపచేయటంలో విజ యం సాధించారు. దుస్తరమైన అద్వైతాన్ని కళాత్మకమైనదిగానూ, సజీవమైనదిగానూ వర్ణించారు. భయం కలిగించే యోగ సంప్రదా యాలను అత్యంతశాస్త్రీయంగానూ, ఆచరణ యోగ్యంగానూ వివరించే మానసిక శాస్త్రంగా వివరించేవారు. సత్యమనేది మతానికి ఆపాదిం చటం మూర్ఖత్వం అని చెప్పేవారు. విదేశాలలో ధీరగంభీరత్వంతో ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని సత్యంవైపు అడుగులు వేసారు. మనలో నిద్రాణమైవున్న శక్తిని తట్టిలేపిన మహనీయుడు. ‘‘మన జాతీయ ఆత్మ న్యూనతాభావ జాఢ్యాన్ని వదిలించుకునేలా చేసిన వ్యక్తి వివేకానంద’’ అని రాజాజీ పేర్కొన్నారు. వివేకానందుని లేఖలు భారతీయులలో దాగివున్న శక్తిని వెలువరించి చింతనను జాగృతం చేసాయి. లేఖల మూలంగానే తమ భారతీయ మహత్కార్యాన్ని ప్రారం భించారు. భగవదనుగ్రహం వలన పావనత సంతరించుకున్న మనస్సులలో ఉద్భవించిన చింతనలే లోకాన్ని కదిలించి వేస్తాయ నటంలో అతిశయోక్తిలేదు. వివేకానందుడు నిరంతరం మననం చేసు కునే కఠోపనిషత్తులోని శ్లోకం
న తత్ర సూర్యోభాతి న చంద్రతారకం
నేమా విద్యుతో భాంతి కుతో2యమగ్నిః !
తమేవ భాంతమనుభాతి సర్వం
తస్వభాసా సర్వమిదం విభాతి !!
‘‘అక్కడ సూర్యుడు ప్రకాశించడు. చంద్ర తారకలు అసలే ప్రకాశించవు. మెరుపులు కూడా మెరవవు. ఇక ఈఅగ్ని మాట ఎందుకు! ఆత్మ ప్రకాశిస్తూ ఉంటే అన్నీ దానిని అనుసరించి ప్రకాశిస్తాయి. దాని వెలుగుతోనే ఇదంతా వెలిగింపబడుతున్నది.’’
‘‘స్వామి వివేకానంద ప్రసంగాలను, రచనలు నేను క్షుణ్ణంగా చదివాను, ఆతరువాత నాదేశభక్తి వేయి రెట్లు అయింది. యువకు ల్లారా! ఆయన రచనల చదవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను’’ అని మహాత్మాగాంధి అన్నారు. వివేకానందుడు రామకృష్ణ మఠం స్థాపించి ‘‘పేదలకు, వెనుకబడ్డ వారికి సేవ చేయడం దీని ప్రధానోద్దేశాలలో ఒకటి‘ అని ఉద్భోదించి భారతీయ యువతకు దిశానిర్దేశం చేశారు. భారతదేశాన్ని పురోగమింప చేయడానికి సంఘ సంస్కరణలు అవసరమని సమాజ నేతలు అనేకులు నొక్కివక్కాణించిన సమయంలో, భారతదేశ పతనానికి ఉన్నత వర్గం వారు పేదలను బహిష్కరించడము, దోపిడీకి గురిచేయడమూ మొదటి కారణమని ఘోషించిన మొదటి నేత స్వామి. తన 33 ఏళ్ళ వయసులోనే మరణించి భారతదేశాన్నే కాకుండా యావత్తు ప్రపంచాన్ని అనాధలుగా మార్చివేశారు. మనలో ధైర్యం సడలి, దౌర్భల్యం ఆవహిస్తే ‘‘నేను ధీరుణ్ణి, వీరుణ్ణి, కామినీ కాంచనాలను నిర్జించిన శ్రీరామకృష్ణుల శిష్యుణ్ణి నేను’’ అనే భావనలు మనసులో నింపుకుంటే సమస్త దౌర్భల్యాలు, అధైర్యము మటుమాయమయుతాయి అని సర్వులకు ప్రభోదించేవారు. శ్రీవివేకానందుని జన్మదినం పురస్కరించుకుని భారతప్రభుత్వం ‘‘జాతీయ యువజన దినోత్సవం’’గా ప్రకటించింది. ‘‘జనన మరణాలు సహజం, కాని నా భావనలు మావవాళికి కొంతవరకైనా అందించగలిగితే నా జీవితం వ్యర్థం కాలేదనుకుంటాను’’ అన్న స్వామి వివేకానందుని జీవితం ప్రతిఒక్కరికి ఆదర్శప్రాయం, సర్వదా ఆచరణీయం. రచయిత :ఆంధ్రాయూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఫోను. 9849692414

1 2