మహనీయ.. ‘స్వామి వివేకానంద’

‘‘స్వామి వివేకానంద ప్రసంగాలను, రచనలు నేను క్షుణ్ణంగా చదివాను, ఆ తరువాత నా దేశభక్తి వేయి రెట్లు అయింది. యువకుల్లారా! ఆయన రచనల చదవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను’’ అని మహాత్మాగాంధి అన్నారు. వివేకానందుడు రామకృష్ణ మఠం స్థాపించి ‘‘పేదలకు, వెనుకబడ్డ వారికి సేవ చేయడం దీని ప్రధానోద్దేశాలలో ఒకటి‘ అని ఉద్భోదించి భారతీయ యువతకు దిశానిర్దేశం చేశారు. భారతదేశాన్ని పురోగమింప చేయడానికి సంఘ సంస్కరణలు అవసరమని సమాజ నేతలు అనేకులు నొక్కివక్కాణించిన సమయంలో, భారతదేశ పతనానికి ఉన్నత వర్గం వారు పేదలను బహిష్కరించడము, దోపిడీకి గురిచేయడమూ మొదటి కారణమని ఘోషించిన మొదటి నేత స్వామి’’ – డా. దేవులపల్లి పద్మజ
ఉన్నతమైన ఆశయాలు ఏదో ఒకరోజు సర్వజనాంగీకారాన్ని పొందుతాయి. కారణం ఆ భావనలు, ఆశయాలు ప్రతి కార్యరంగంలోనూ, ప్రతీఆలోచనా విధానంలోనూ ఉత్తేజం కలిగించేవి కాబట్టి. కాషాయాంబరాలు ధరించి, పద్మాసనస్థులై, ఒకదాని మీదమరొకటిగా కరకమలాలను ఒడిలో ఉంచుకుని, అర్థనిమీలనేత్రులై ధ్యానమగ్నులై వివేకమంతమైన ఆనందం అనుభవించే స్వామి వివేకానంద లోకానికి ప్రకాశానిచ్చే ఒకజగద్గురువు. సామాజికసృహతో కూడిన ఆధ్యాత్మికతను ప్రజలకు ఉపదేశించడం, ఇంద్రియాతీత విష యాలను వివేకించటం ద్వారా ఆధ్యా త్మికసౌధాన్ని నిర్మించడం, ఆసౌ ధంలో చైతన్యమూర్తులుగా జనులను విరా జిల్లింప చేయటంస్వామి వివే కానంద అపురూప ఆశయం. విశ్వాసంతో నిరంతరాభ్యాసాన్ని చేస్తూ, మనసు పొరలలో నిభిఢీకృతమైన కొత్త విష యాలను అనుభవిస్తూ, క్రొంగొత్త శక్తులు వశీకరింపచేసుకుంటూ ఊహాతీత వ్యక్తిత్వాన్ని వికసింపచేసు కోవటానికి దివ్య ప్రేరణ స్వామి వివే కానంద. 1863వ సం.లో కలకత్తా నగరంలో జన్మించిన స్వామి వివే కానంద ఆరేళ్ళ ప్రాయంనుంచే అంత ర్ముఖ అన్వేషణలో మనసు లగ్నం చేసి ధ్యానంలో నిమగ్నుడై ఉండేవారు. జ్యోతిర్మయ ప్రకాశంలో జీవిస్తూ చిరుప్రాయంలోనే సృజనాత్మకత, ఆత్మ ప్రతిష్ట, ఆత్మప్రేరణలో దివ్యదర్శనాలు అనుభవించారు. ప్రకృతితో తాదాత్మ్యం చెంది ఆ చైతన్యంలో విరాజిల్లే అంతర్ముఖ చైతన్య స్వరూపుడు.‘‘నేను భగవంతుడిని నిన్ను చూస్తునంత స్పష్టంగా చూశాను, మతం అనేది అనుభూతి పొందవలసిన సత్యం, లోకాన్ని మనం అర్దం చేసు కోవటంకన్నా అనేక రెట్లు లోతుగా గ్రహించవలసిన విషయం’’ అని ప్రవచించే శ్రీరామకృష్ణ పరమహంస దివ్య సాన్నిధ్యంలో ఙ్ఞాన,కర్మ,భక్తి,యోగ మార్గాలలో కానరాని వెలుగు ఆస్వాదించి వారివచనాలను విపులీకరించి లోకాన్ని ఆశ్చర్యచకితులను చేసారు. పశుప్రాయులుగా జీవిస్తున్న వారిని మానవ స్థాయికి ఎదగచేయడమే ప్రధాన ధ్యేయంగా లోకాన్ని ఉద్ధరించిన మనీషి స్వామి వివేకానంద. చికాగోలో జరిగిన స్వామి ప్రసంగం బాహ్యంగా ఎగసిన ఉత్సాహ పుటలలోనే కాక, ఉద్వేగ ప్రవాహాలలోనే కాక, నరనరాల్లోకి చొచ్చుకుని పోయిన నూతన కాంతి పుంజం. దానిని గురించి ఒక్క మాటలో చెప్పటానికో, వ్రాయటానికో కుదిరేది కాదు. చికాగో ప్రసంగం స్వామి వివేకానందకు అమెరికాలో గుర్తింపు రావడమే కాదు, సాక్షాత్తు భారత దేశం కూడా గర్వించేలా చేసింది. అమెరికాలో ఎగసిన ఒక అల భారతదేశంలో సహస్ర తరంగాలను ఉత్పన్నం చేసింది. ‘‘నేను ఎవరిని? ఆసియా వాసినా? ఐరోపా వాసినా? అమెరికా వాసినా? ఈ వ్యక్తిత్వాల వింత సమ్మేళనాన్ని నాలో అనుభూతి చెందుతున్నాను’’ అనేవారు స్వామి. ప్రతి మతంలోని, ప్రతి సిద్ధాంతంలోని మంచిని గ్రహించి హృదయంలో దీప్తిస్తున్న ఆత్మజ్యోతిని అవలోకనం చేసుకుంటే సర్వమత ఏకత్వాన్ని దర్శించవచ్చని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి శ్రీవివేకానంద. హిందూమతాన్ని కించపరిస్తే సహించేవారు కాదు. దానిని తీవ్రంగా ప్రతిఘటించి హిందూ మత ఔన్నత్యాన్ని చాటిచెప్పేవారు. జీవితంలో అన్ని విషయాలపైన కఠోర నియమం, నిఘా అవసరం అని చెప్పే వారు. ‘‘ఆహార నియంత్రణ ముఖ్యంగా పాటించాలి. ఆహార నియం త్రణ లేకుండా మనస్సుని నియంత్రించటం సాధ్యం కాదు. అవసరం కన్నా ఎక్కువ తినడం అనేక హానులకు దారితీస్తుంది. మితిమీరి తినడం వలన మనశ్శరీరాలు చెడిపోతాయి’’ అనేవారు. ప్రేమ తత్వా న్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని సడలనీయవద్దని గట్టిగా ప్రభోదించేవాడు. మతం అనేది సిద్ధాంత రాద్ధాంతములతో లేదు అది ఆచరణలే ఆధ్యాత్మికులుగా పరిణతి చెందడంలో మాత్రమే వుంది అని విశ్వసిం చేవారు. వివేకానందను విదేశాలలో అనేకులు కుమారునిగా, సోదరు నిగా భావించారని మనం తెలుసుకున్నప్పుడు మనకు ఆయన పరిణతి కనిపిస్తుంది. భారతదేశంలో ఇటువంటి బాంధవ్యాలు కొత్త కాదు. విదేశాలలో ఇటువంటివి ఉత్పన్నమైనప్పుడు ఆయన వైఖరి విశిష్టత అర్థం అవుతుంది. జాతిమౌఢ్య, వర్ణ మౌఢ్యం విలయతాండవం చేసే రోజులలో అప్పట్లో బానిస దేశంగా పరిగణించే భారతదేశం నుండి వెళ్ళి అసంఖ్యాక మనసులను దోచుకోవడం గమనార్హం. అహిం సలో నెలకొనివున్న వ్యక్తి సాన్నిధ్యంలో వైరాలకు చోటులేదు. సత్య నిష్టుని సాన్నిహిత్యంలో అసత్యం నశించిపోతుంది. అందుకే అన్ని ఎల్లలను అతిక్రమించిన స్వామి వివేకానంద ఆత్మఙ్ఞానంలో సుప్రతి ష్టులై ఉండగా ఎలాంటి వివక్షత తలెత్తడం సాధ్యంకాదు. వివేకానంద ఆధ్యాత్మిక శక్తి గురించి విన్న విదేశీయులు ఆయనతో సన్నిహితంగా మెలగటానికి మక్కువ చూపేవారు. తాను జన్మించిన కుటుంబాన్ని పరిత్యజించి ప్రపంచమనే పెద్ద కుటుంబాన్ని స్వీకరించారు. భారత దేశం కూడా తక్కిన దేశాలతో పాటు అభివృద్ధి పొందగోరితే పేదలు, పామరులు పురోగనమం చెందాలి. అందుకే పేదలకు కూడా విద్య గరపమని ఆయన నొక్కి వక్కాణించారు. భారతదేశపు గౌరవ మర్యాద లను విదేశాలలో ఇనుమడిరపచేయటానికి అహర్నిశలు కృషి చేశారు. అప్పటికే ప్రచారంలోవున్న భారత వ్యతిరేకతను తొలగించటానికి నడుం బిగించారు. భారతీయ ఆధ్యాత్మికతలోని వివిధ పరిణామాలు ఆయన ఉపన్యాసాలలో ప్రధానాంశాలు అయినప్పటికి, ప్రతి ప్రసంగంలోనూ మన వాస్తవిక చిత్రాన్ని ఆవిష్కరించేవారు. మతాల మధ్య వ్యత్యాసాలు ఉండపచ్చు కాని వాటి మధ్యగల సామాన్య మౌలికతను గుర్తించమని చెప్పేవారు. హైందవుల శాంతి కాముకత్వాన్ని తన అహింసా తత్వం తో వెల్లడిచేసేవారు. శక్తివంతమైన ఈభారతదేశం ప్రపంచాన్ని జయి స్తుంది. అందుకే ‘‘ఓ భారతమా! నీ ఆధ్యాత్మికతతో ప్రపంచాన్ని జయించు!’’ అంటూ స్వామి సింహనాదం చేసేవారు. ప్రశాంతత, పవిత్రత, త్యాగశీలత, సౌభ్రాతృత్వాల సందేశాలను వివరించి సహన రహిత చెవిటి చెవులలో ప్రతిధ్యనులు ఉద్భవింపచేయటంలో విజ యం సాధించారు. దుస్తరమైన అద్వైతాన్ని కళాత్మకమైనదిగానూ, సజీవమైనదిగానూ వర్ణించారు. భయం కలిగించే యోగ సంప్రదా యాలను అత్యంతశాస్త్రీయంగానూ, ఆచరణ యోగ్యంగానూ వివరించే మానసిక శాస్త్రంగా వివరించేవారు. సత్యమనేది మతానికి ఆపాదిం చటం మూర్ఖత్వం అని చెప్పేవారు. విదేశాలలో ధీరగంభీరత్వంతో ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని సత్యంవైపు అడుగులు వేసారు. మనలో నిద్రాణమైవున్న శక్తిని తట్టిలేపిన మహనీయుడు. ‘‘మన జాతీయ ఆత్మ న్యూనతాభావ జాఢ్యాన్ని వదిలించుకునేలా చేసిన వ్యక్తి వివేకానంద’’ అని రాజాజీ పేర్కొన్నారు. వివేకానందుని లేఖలు భారతీయులలో దాగివున్న శక్తిని వెలువరించి చింతనను జాగృతం చేసాయి. లేఖల మూలంగానే తమ భారతీయ మహత్కార్యాన్ని ప్రారం భించారు. భగవదనుగ్రహం వలన పావనత సంతరించుకున్న మనస్సులలో ఉద్భవించిన చింతనలే లోకాన్ని కదిలించి వేస్తాయ నటంలో అతిశయోక్తిలేదు. వివేకానందుడు నిరంతరం మననం చేసు కునే కఠోపనిషత్తులోని శ్లోకం
న తత్ర సూర్యోభాతి న చంద్రతారకం
నేమా విద్యుతో భాంతి కుతో2యమగ్నిః !
తమేవ భాంతమనుభాతి సర్వం
తస్వభాసా సర్వమిదం విభాతి !!
‘‘అక్కడ సూర్యుడు ప్రకాశించడు. చంద్ర తారకలు అసలే ప్రకాశించవు. మెరుపులు కూడా మెరవవు. ఇక ఈఅగ్ని మాట ఎందుకు! ఆత్మ ప్రకాశిస్తూ ఉంటే అన్నీ దానిని అనుసరించి ప్రకాశిస్తాయి. దాని వెలుగుతోనే ఇదంతా వెలిగింపబడుతున్నది.’’
‘‘స్వామి వివేకానంద ప్రసంగాలను, రచనలు నేను క్షుణ్ణంగా చదివాను, ఆతరువాత నాదేశభక్తి వేయి రెట్లు అయింది. యువకు ల్లారా! ఆయన రచనల చదవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను’’ అని మహాత్మాగాంధి అన్నారు. వివేకానందుడు రామకృష్ణ మఠం స్థాపించి ‘‘పేదలకు, వెనుకబడ్డ వారికి సేవ చేయడం దీని ప్రధానోద్దేశాలలో ఒకటి‘ అని ఉద్భోదించి భారతీయ యువతకు దిశానిర్దేశం చేశారు. భారతదేశాన్ని పురోగమింప చేయడానికి సంఘ సంస్కరణలు అవసరమని సమాజ నేతలు అనేకులు నొక్కివక్కాణించిన సమయంలో, భారతదేశ పతనానికి ఉన్నత వర్గం వారు పేదలను బహిష్కరించడము, దోపిడీకి గురిచేయడమూ మొదటి కారణమని ఘోషించిన మొదటి నేత స్వామి. తన 33 ఏళ్ళ వయసులోనే మరణించి భారతదేశాన్నే కాకుండా యావత్తు ప్రపంచాన్ని అనాధలుగా మార్చివేశారు. మనలో ధైర్యం సడలి, దౌర్భల్యం ఆవహిస్తే ‘‘నేను ధీరుణ్ణి, వీరుణ్ణి, కామినీ కాంచనాలను నిర్జించిన శ్రీరామకృష్ణుల శిష్యుణ్ణి నేను’’ అనే భావనలు మనసులో నింపుకుంటే సమస్త దౌర్భల్యాలు, అధైర్యము మటుమాయమయుతాయి అని సర్వులకు ప్రభోదించేవారు. శ్రీవివేకానందుని జన్మదినం పురస్కరించుకుని భారతప్రభుత్వం ‘‘జాతీయ యువజన దినోత్సవం’’గా ప్రకటించింది. ‘‘జనన మరణాలు సహజం, కాని నా భావనలు మావవాళికి కొంతవరకైనా అందించగలిగితే నా జీవితం వ్యర్థం కాలేదనుకుంటాను’’ అన్న స్వామి వివేకానందుని జీవితం ప్రతిఒక్కరికి ఆదర్శప్రాయం, సర్వదా ఆచరణీయం. రచయిత :ఆంధ్రాయూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఫోను. 9849692414