చట్టం అందరికీ సమానమే అయితే..
“ ఒక యువతి తన కుటుంబానికి అండగా నిలవాలని,తన కాళ్లపై తాను నిలబడాలని నర్సుగా ఉద్యోగంలో చేరింది. రోగులకు సేవ చేయాల్సిన చేతులు…చివరకు ఓమానవ మృగం చేతిలో చిదిమెయ్యబడిన ఆదివాసి యువతి ఊకే శిరీష సంఘటన సమాజాన్ని కలచివేసింది.” తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న 21ఏళ్ల ఊకే శిరీష హత్యాచారం,హత్య ఘటన ఇప్పుడు కేవలం ఒకకుటుంబం విషాదం కాదు.ఉద్యోగ ప్రదేశాల్లో మహిళల భద్రత, ప్రైవేట్ ఆసుపత్రుల బాధ్యత,పోలీసు దర్యాప్తు, ఆదివాసీ మహిళలకు న్యాయం వంటి అనేక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.కుటుంబ సభ్యులు,బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..ఊకే శిరీష తండ్రి మరణంతో తల్లి రేక్కాడితేనే డొక్కాడే నిరుపేద కుటుం బం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న తన తల్లికి చేయూతనిచ్చేందుకు ప్రైమ్ కేర్ ఆసుపత్రిలో సుమారు ఏడు నెలలుగా నర్సు గా పనిచేస్తూ,ఆసుపత్రికి సమీపంలోని సిబ్బంది వసతి గృహంలో ఉంటున్నారు. విధులు ముగించుకుని గదికి వెళ్లిన ఆమె రాత్రి నిద్రిస్తున్న సమయంలో మాట వేసి ఓ మానవ మృగం వేటలో అత్యాచారం హత్య గావించబడిన సంఘటన తీవ్ర విషాదాన్ని మిగిలించింది.తోటి ఉద్యోగి గదికి వెళ్లి చూడగా మిగతాజీవిగా రక్తపు మడుగులలో శవమై కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తులో భాగంగా సీసీటీవీ పుట్టే జులు,క్లూజ్ టీం,డాగ్స్ స్కాడ్ తదితర ఆధారాల ఆధారంగా ఒకవ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా ఈ కేసులో అత్యాచారం,హత్య చేసినట్లుగా నేరా న్ని అంగీకరించడంతో అరెస్టు చేసిన పోలీ సులు వివిధ కోణాలలో దర్యాప్తుచేస్తున్నట్లుగా ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది.
చట్టం ముందు అందరూ సమానమే కదా?
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 స్పష్టంగా ‘చట్టం ముందు సమానత్వం, చట్టాల సమాన రక్షణ’ ప్రతివ్యక్తికీ ఉం టుందని చెబుతోంది.అదే రాజ్యాం గంలోని ఆర్టికల్ 15కులం,లింగం వంటి అంశాల ఆధారంగా వివక్షను నిషేధిస్తుంది.
అయితే ప్రశ్న ఒక్కటే
చట్టం అనే పుస్తకంలో అందరికీ సమా నంగా ఉండటం మాత్రమే సరిపో తుందా..?ఆచట్టం అమలులోనూ అదే సమానత్వం కనిపించకూడదా..?ఒక ప్రముఖ కేసు దేశవ్యాప్తంగా ప్రకం పనలు సృష్టిస్తే చట్టాల్లో మార్పులు, ప్రత్యేక చర్యలు, వేగవంతమైన దర్యాప్తు, ప్రజా చర్చలు జరుగుతాయి.అలాంటి ఘటనల నుంచి పాఠాలు నేర్చుకోవడం అవసరమే.కానీ అదే సమయంలో సమాజంలోని అట్టడుగు వర్గానికి చెందిన ఒక ఆదివాసి యువతి హింసకు హత్యాచారానికి హత్యకు గురై నప్పుడు ప్రభుత్వం,పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అంతే తీవ్రతతో స్పందిస్తున్నాయా అనే ప్రశ్నకు ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన సమాధానం రావాలి. ఇది ఎవరి బాధను మరొకరి బాధతో పోల్చడం కాదు.
ప్రతి మహిళ ప్రాణం సమానమే.ప్రతి బాధితురాలి గౌరవం సమానమే.ప్రతి కుటుంబానికి న్యాయం పొందే హక్కు సమానమే. ఒక నేరానికి కులం లేదా తెగ కారణం కాకపోయినా, బాధితురాలు సామాజికంగా వెనుకబడిన వర్గానికి చెంది నప్పుడు ఆమె కుటుంబానికి న్యాయం అందే ప్రక్రియలో ప్రత్యేక సామాజిక, ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉం టుంది. అందుకే భారతదేశంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సభ్యులపై జరిగే కొన్ని నేరాలకు ప్రత్యేక రక్షణ కల్పించేందుకు Act,1989 అమలులో ఉంది.ఈ చట్టం ప్రత్యేక న్యాయస్థానాలు,బాధితులు మరియు సాక్షుల హక్కులు,ఉపశ మనం,పునరావాసం వంటి అంశాలను కూడా కలిగి ఉంది. అయితే ఊకే శిరీష కేసులో ఈ ప్రత్యేక చట్టంలోని ఏ నిబంధనలు వర్తిస్తాయో అన్నది కేసు వాస్తవాలు,దర్యాప్తు ఆధారాలు, న్యాయపరమైన నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి కేవలం ఆమె ఆదివాసీ యువతి అన్న కారణంతో ఏదైనా నిర్దిష్ట చట్టాన్ని వర్తింపజేయాలని ముందుగానే తేల్చడం కాకుండా,దర్యాప్తు అధికారులు అన్ని వర్తించే చట్టపరమైన కోణాలను పరిశీలించాలి.
కొత్త క్రిమినల్ చట్టాలు ఏమి చెబుతున్నాయి?
2024 జూలై 1నుంచి భారతీయ న్యాయ సంహిత (దీచీS),భారతీయ నాగరిక సురక్షా సంహిత (దీచీSS),భారతీయ సాక్ష్య అధినియమం అమల్లోకి వచ్చాయి. మహిళలు,పిల్లలపై నేరాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ కఠినమైన శిక్షా నిబంధ నలు ఉన్నాయి. అత్యాచారం,సామూహిక అత్యాచారం వంటి నేరాలకు తీవ్రమైన శిక్షలు నిర్దేశించబడ్డాయి.ప్రభుత్వమే కొత్త చట్టాల లక్ష్యాల్లో దర్యాప్తులో పారదర్శకత, డిజిటల్ ఆధారాల శాస్త్రీయ సేకరణ, వేగవంతమైన న్యాయ ప్రక్రియ వంటి అంశాలను ప్రస్తావిస్తోంది. వ-Saksష్ట్రya వంటి వ్యవస్థల ద్వారా డిజిటల్ సాక్ష్యాలను భద్రపరచే చర్యలు కూడా చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.అందువల్ల ఊకే శిరీష కేసులో కూడా ఆధారాల సేకరణ,ఫోరెన్సిక్ పరీక్షలు,సీసీటీవీ ఫుటేజీ,డిజిటల్ ఆధా రాలు,సాక్షుల వాంగ్మూలాలు తదితర అంశాలను శాస్త్రీయంగా,ఎలాంటి రాజకీ య లేదా సామాజిక ఒత్తిడికి తలొగ్గకుండా పరిశీలించాలని సమాజం కోరుకుంటుంది.
ఆసుపత్రి యాజమాన్యం బాధ్యత ఏమిటి..?
ఇక్కడ మరో కీలక ప్రశ్న ఉద్యోగ ప్రదేశ భద్రతపై.ఒక యువతి రాత్రివేళల వరకు విధులు నిర్వహించే ఆసుపత్రిలో పని చేస్తుంటే, ఆమెకు సురక్షితమైన వసతి, ప్రవేశ నియంత్రణ,సీసీటీవీ,అత్యవసర సంప్రదింపు వ్యవస్థ,భద్రతా సిబ్బంది, ఫిర్యా దు వ్యవస్థ వంటి రక్షణ చర్యలు ఉన్నా యా..?ఉద్యోగం ఇచ్చిన సంస్థకు జీతం చెల్లించే బాధ్యత మాత్రమే కాదు సురక్షిత మైన పని వాతావరణం కల్పించే బాధ్యత కూడా ఉంది.అందువల్ల ఊకే శిరీష పని చేసిన ఆసుపత్రి,సిబ్బంది వసతిగృహం, భద్రతా ఏర్పాట్లు, ప్రవేశ నిష్క్రమణ విధానం,సీసీటీవీ నిర్వహణ తదితర అంశాలపై సమగ్ర విచారణ జరగాలి. ఏదైనా నిర్లక్ష్యం తేలితే,అది ఎవరిదైనా సరే, చట్టప్రకారం బాధ్యత నిర్ణయించాలి.
న్యాయం అంటే కేవలం నిందితుడికి శిక్ష కాదు
శిరీష కుటుంబానికి న్యాయం అంటే నింది తుడిని అరెస్టు చేయడం మాత్రమే కాదు న్యాయం అంటే దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలి. సాక్ష్యాలను ఎలాంటి లోపం లేకుండా సేకరించాలి.కుటుంబానికి కేసు పురోగతిపై సమాచారం ఇవ్వాలి.బాధిత కుటుంబానికి చట్టబద్ధమైన పరిహారం, పునరావాస సహాయం అందించాలి. సాక్షులకు రక్షణ కల్పించాలి.విచారణ వేగంగా,న్యాయబద్ధంగా జరగాలి.ఆసుపత్రి యాజమాన్యం లేదా ఇతరుల నిర్లక్ష్యం ఉం టే దానిపైనా చర్యలు తీసుకోవాలి.నింది తుడు దోషిగా తేలితే చట్టం నిర్దేశించిన అత్యంత కఠినమైన శిక్ష అమలు చేయాలి. S్పు/ST అత్యాచార నిరోధక చట్టం కింద ప్రభుత్వం బాధితులకు న్యాయం,న్యాయ సహాయం,పునరావాసం,భద్రత వంటి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతలను కూడా చట్టం నిర్దేశిస్తుంది.ఉద్యోగ ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు వాస్తవంగా అమలవుతున్నాయా? ఇవన్నీ అడగడం న్యాయవ్యవస్థను ప్రశ్నిం చడం కాదు. న్యాయవ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత బలపరచాలని కోరడం.ఎవరి కుమార్తె అయినా..ఆమె ప్రాణం విలువైనదే ఊకే శిరీష ఒక పేరు మాత్రమే కాదు. ఆమె ఒక కుటుంబానికి కుమార్తె.ఎవరికో అక్క లేదా చెల్లెలు.
ఒక కుటుంబ భవిష్యత్తుకు ఆశ.
సమాజానికి సేవ చేయాలనుకున్న ఒక నర్సు.ఆమె ఆదివాసీ యువతి కావడం వల్ల ఆమె ప్రాణానికి విలువ తగ్గదు. అదే విధంగా మరే మహిళ ప్రాణానికి కూడా విలువ తగ్గదు.న్యాయం ఎవరి కులం, వర్గం,ఆర్థిక స్థితి,రాజకీయ పరిచయాలను చూసి మారకూడదు.చట్టం సమానమైతే.. న్యాయం కూడా సమానంగా కనిపించాలి. చట్టం అందరికీ ఒకటే అని చెప్పడం సులభం.కానీ ఆచట్టం ఒకపేద కుటుంబం తలుపు తట్టినప్పుడు కూడా అదే శక్తితో పనిచేస్తుందా..?ఒక ఆదివాసీ కుటుంబం న్యాయం కోసం పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు తిరిగినప్పుడు కూడా అదే స్పందన ఉంటుందా..? ఒక సాధారణ యువతి హత్యకు గురైనప్పుడు కూడా సమాజం అదే స్థాయిలో ప్రశ్నిస్తుందా..?
ఇవే ప్రజాస్వామ్యానికి అసలు పరీక్షలు.
ప్రభుత్వం ఈ కేసును ప్రాధాన్యతగా తీసు కొని త్వరితగతిన దర్యాప్తు నిర్వహించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించి విచారణ పూర్తి చేయాలి.ప్రజలలో పూర్తి విశ్వాసం కలిగేలా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపే అంశం పరిశీలించాలి. నిందితుడికి చట్టం అనుమతితో అత్యంత కఠినమైన శిక్ష విధించాలి.న్యాయం ఆలస్యమైతే న్యాయం నిరాకరించినట్టే అన్న భావన ప్రజల్లో కలగకూడదు.ఊకే శిరీష కేసులో ప్రభు త్వం,పోలీసు శాఖ,వైద్య,ఫోరెన్సిక్ అధికా రులు,న్యాయవ్యవస్థ తమ తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలి.దర్యాప్తు పారదర్శ కంగా సాగాలి.దోషి ఎవరో ఆధారాలతో నిర్ధారించాలి.నిర్దోషిపై అన్యాయం జరగ కూడదు.దోషి ఎలాంటి ప్రభావంతో తప్పించుకోకూడదు అదే నిజమైన న్యాయం.
చివరగా సమాజం అడుగుతున్న ప్రశ్న ఒక్కటే ్య“చట్టం అందరికీ సమానమే అయితే..న్యాయం కూడా అందరికీ సమా నంగా కనిపించాలి కదా..?”ఊకే శిరీషకు న్యాయం జరిగే వరకు ఈ ప్రశ్నకు సమా జం సమాధానం కోరుతూనే ఉంటుంది. – డాక్టర్ సాగబోయిన పాపారావు
