గొంతెండుతున్న …మన్యం

వేల కోట్లు అందుబాటులో ఉంటున్నా వేలాది మంది సిబ్బంది ఉన్నా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఒకవైపు రహదారి సౌకర్యాలు లేక అనునిత్యం డోలీ కష్టాలు వెంటా డుతుండగా,మరోవైపు స్వచ్ఛమైన తాగునీటికి కూడా గిరిజనులు నోచుకోలేకపోతున్నారు.నీటికోసం కేం ద్రం నుంచి,రాష్ట్రంనుంచి భారీగానిధులు కేటా యిం పులు జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పనులు మాత్రం జరగడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి గిరిజన ప్రారతాల్లో అభివృద్ధికి పెద్ద మొత్తంలోనే ఏటా నిధుల కేటాయింపులు జరుగు తున్నాయి. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటిడిఏ)ల ద్వారా పనులకు నిధులు కేటాయిస్తున్నారు.విద్య, వైద్యం,ఆరోగ్యం,రోడ్లు,తాగునీరు,వ్యవసాయం వరటి అనేక రంగాలకు ఈ నిధులను కేటాయిస్తు న్నారు. ఇదే సమయంలో కేంద్రం నుంచి కూడా పలు రంగా లకు నిధులు వస్తున్నాయి.ఇందులోనే తాగునీటి అవసరాలకు కూడా నిధులు సమకూరుతున్నాయి. అయితే ఈనిధులను మాత్రం సక్రమంగా ఖర్చు చేయ లేకపోతుండడంతో అనేక మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు ఇప్పటికే ఊట నీటికి, చెరువుల్లో నీటికి,వాగుల్లో ప్రవహించే నీటికే పరిమితమవుతు న్నారు.దీనివల్ల అనేక వ్యాధులు కూడా ప్రబలుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.తాజాగాఈ ఏడాది రాష్ట్రం లోని 9,934 గిరిజన ప్రారతాల్లో తాగునీటి కోసం 1,290కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈమొత్తం పనులను జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా చేయా లనిప్రతిపాదిరచారు.ఈ నిధులతో మొత్తం 12, 838 పనులను గుర్తిరచి పనులు ప్రారంభించారు. అయితే వాటిని పూర్తి చేయడంలో మాత్రం ఆశించిన ఫలి తాలు రావడం లేదు.ఇప్పటివరకు 5,718 పను లను మాత్రమే పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో 2,582 పనులు పలుస్థాయిలోఉండగా, 4,5 38 పనులను ఇంకాప్రారంభించడమే జరగలేదు. ఇక మొత్తం నిధుల్లో కేవలం 218కోట్ల రూపాయ లను మాత్రమే ఖర్చు చేయగలిగారు.
నీటివనరుల గుర్తింపులో అలసత్వం
గిరిజన ప్రాంతాల్లో తాగునీటిని అందించేందుకు ముందుగా నీటి వనరులను గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఈప్రక్రియలో అలసత్వం, జాప్యం చోటుచేసు కుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఉన్న వనరుల నుంచి నీటిని స్వచ్ఛంగా మార్చడం కూడా సక్రమంగా సాగడం లేదను భావన వ్యక్తమవుతోంది. పనులపై వారానికి ఒకసారి సమీక్ష చేయాలని గతంలోనే నిర్ణ యించినప్పటికీ అది కూడా అమలు కావడం లేదని తెలుస్తోరది.
అల్లూరి జిల్లా పాడేరు ప్రాంతంలో..
మన్యంలోని అధిక సంఖ్యలో గిరిజన గ్రామాల్లోని జనం తాగునీటికి అల్లాడిపోతున్నారు. ఎండాకాలం రాకుండానే నీటి సమస్య పెరుగుతుంది.కానీ గిరిజ నుల దాహం కేకలు పాలకులకు వినిపించని పరిస్థితి నెలకొంది.దీంతో గిరి పల్లెల్లోని జనానికి నీటి కష్టాలు కొనసాగుతున్నాయి. పాడేరు ఏజెన్సీ వ్యాప్తంగా 244 గ్రామ పంచాయతీల పరిధిలో 3,803గ్రామాల్లో లక్షా 55 వేల 756 గిరిజన కుటుంబాలున్నాయి. వాటిలో 2,025 గ్రామాల్లో పూర్తిగా,1,778 గ్రామాల్లో పాక్షిక తాగునీటి సదుపాయాలున్నాయని అధికారుల రికార్డులు చెబుతున్నాయి. అలాగే ఏజెన్సీలో ప్రస్తుతం అన్ని గ్రామాలకు ఏదో రకమైన తాగునీటి సదుపా యం ఉందనేది అధికారుల వాదన. కాగా ఇప్పటికీ సగానికిపైగా పల్లెల్లో తాగునీటి కోసం గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారనేది జగమెరిగిన సత్యం. వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ వంటివి కాగితాలకే పరిమిత మవ్వగా, నిధులు సక్రమంగా విడుదల కాని పరిస్థితు ల్లో జల్‌ జీవన్‌ మిషన్‌ వంటివి ఆచరణలోకి రాని దుస్థితి ఏర్పడిరది.దీంతో అన్ని విధాలా గిరిజనానికి తాగునీటి కష్టాలు తప్పడంలేదు.ఇవే కాకుండా సోలార్‌ ఆధారంగా పని చేసే నీటి పథకాల పరిస్థితి మరీదారు ణం.వాటికి చిన్నపాటి మరమ్మతులు వచ్చినా పట్టిం చుకున్న దాఖలాలు లేవు.దీంతో అనేక గ్రామాల్లో తాగునీటి పథకాలున్నా వాటి నిర్వహణపై పాలకులు శ్రద్ధచూపని కారణంగా నిరుపయోగంగా మారుతు న్నాయి. ఫలితంగా గిరిజనులు ఊటగెడ్డలపై ఆధారప డాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది.
మన్యం వాసులకు ఊటగెడ్డ నీరే ఆధారం
ఏజెన్సీలోని గిరిజన పల్లెలకు పక్కాగా రక్షిత నీటిని అందించని కారణంగా అధిక సంఖ్యలోని గిరిజన పల్లెల్లో ఊటగెడ్డలే ప్రధాన తాగునీటి వనరులుగా ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికా రుల బాధ్యతా రాహిత్యం, పంచాయతీల్లో పాలన పడకేయడం వంటి కారణాలతో గిరిజనులకు గుక్కెడు నీరు దొరకని దుస్థితి కొనసాగుతున్నది. ముఖ్యంగా ఏజెన్సీలో మత్స్యగెడ్డను ఆనుకుని ఉన్న ముంచం గిపుట్టు, పెదబయలు, డుంబ్రిగుడ, జి.మాడుగుల మండలాల్లోని గిరిజన పల్లెల్లో స్థితి మరీ దారుణం. మత్స్యగెడ్డ తీరంలోని చెలమలు చేసుకుని నీటిని పట్టుకుంటున్నారు.ఇతర మండలాల్లో పంట పొలా లకు సమీపంలోని ఊటగెడ్డలను ఆశ్రయిస్తు న్నారు. పెదబయలు మండలం బొడ్డగొంది, లింగేటి, పన్నెడ, గుల్లెలు, హుకుంపేట మండలం తీగలవలస పంచాయతీ పంతెలచింత, ముంచంగిపుట్టు మండలం చీపురుగొంది, దొరగూడ, డెంగాగుడ, కర్లాపొదర్‌ గ్రామాల్లోని గిరిజనులు దూర ప్రాంతంలోని ఊట గడ్డల నుంచే నీటిని మోసుకువస్తున్నారు. ఇలా ఏజెన్సీ లో వందల సంఖ్యలో గిరి పల్లెల్లో దాహం కేకలు వేస్తున్నా పాలకులకు అవేవీ వినిపించకపోవడం గమనార్హం.
పార్వతీపురం మన్యం జిల్లాలో
ఇంటింటికీ కుళాయిలు వేసి..తాగునీటి కష్టాలు తీరు స్తామని ప్రభుత్వాలు గుప్పిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్ధితి భిన్నంగా ఉంది.పది రోజులుగా పార్వతీపురం మం డలంలోని 65గ్రామాలకు తాగునీరురాక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో శ్మశానాల్లో ఉన్నబోర్లు,ఊరి చివరనున్న పాడైన బావుల నీటితో గొంతు తడుపుకొంటున్నారు. మక్కువ మండ లండి.శిర్లాంలోని సువర్ణముఖి నది నుంచి పార్వతీపు రం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుంది.ఇక్కడ ఇన్‌ఫిల్టర్‌ బావుల్లో మోటార్లు పదిరోజులు క్రితం పాడువడంతో 65 గ్రామాలకు సరఫరా ఆగిపోయింది.నర్శిపురం, బొండ పిల్లి ఎమ్మార్‌నగరం,డోకిశీల,ములగ తదితర గ్రామాల ప్రజలు ఒకటి,రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బోర్లు,బావులకు వెళ్లాల్సిన పరిస్థితి.-జి.ఎన్‌.వి.సతీష్‌