పెసా చట్టంపై అవగాహన సదస్సు

షెడ్యూల్డ్‌ ప్రాంతంలో గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందా లంటే పెసా చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. సమత,గిరిమిత్ర సంస్థల ఆధ్వర్యంలో అక్టోబర్‌ 8వతేదీన నర్సీపట్నం ఎన్‌జీజీఎస్‌ భవనంలో పెసా చట్టం-1996పై సమీక్ష,అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏపి ఆదివాసీ హక్కుల సంఘం అధ్యక్షులు ఎన్‌. కళ్యాణ్‌ మాట్లాడుతూ గిరిజనలకు రాజ్యాంగం కల్పించిన రక్షణ చట్టాలు గ్రామసభల అమలపై పెసా చట్టాలను నేటి గిరిజన యువత అవగా హన చేసుకొని,స్థానిక వనరులు దోపిడికి గురి కాకుండా పరిరక్షించుకోవాలన్నారు.పెసా కమిటీ సభ్యులు బత్తుల కృష్ణ మాట్లాడుతూ గిరిజన వనరులు పరిరక్షణ,గిరిజన పల్లెల ప్రగతి చెందాలంటే పెసా చట్టం ద్వారా గ్రామ సభలు సంపూర్ణంగా అవగాహన చేసుకోవా లన్నారు.అనకాపల్లి జిల్లా గిరిజన సంఘం అధ్యక్షులు ఎస్‌.జనార్దన్‌ ప్రతి యువత గ్రామసభల నిర్వహణ,బాధ్యతలు తెలుసుకుని గిరిజన గ్రామభివృద్ధికి తోడ్పాడాలని పిలుపు నిచ్చారు.సమత సభ్యులు పెద్దమల్లాపురం)లోతా సుబ్బారావు మాట్లాడుతూ సమత చేస్తున్న రాజ్యాంగ పోరాటాల ఫలితమే నేడు గిరిజన వనరుల పరిరక్షణ అన్నారు.గిరిమిత్ర కార్యదర్శి బి.గంగరాజు అధ్యక్షతన జరిగిన అవగాహన సమావేశంలో అనకాపల్లి జిల్లా బిఎస్పి పార్టీ అధ్యక్షులు బి.నాగరాజు,వికాసవాణి కార్యదర్శి జగ్గారావు,ప్రగతి శిలా కార్యదర్శి శ్రీను మాట్లాడుతూ పెసా చట్టం అమల్లోకి వచ్చి సుమారు 32 సంవత్సరాలు అవుతున్నా నేటికీ షెడ్యూల్డ్‌ ఏరియాలో సంపూర్ణంగా అమలు కావడం లేదని అన్నారు.దీనివల్ల ఎన్నో గిరిజన కుటుంబాలు భూములు అన్యాక్రాంతమవుతూ దోపిడీదారుల గుప్పెట్లో నలిగిపోతున్నారని పేర్కొన్నారు.బి.బాలరాజు,వినియోగదారుల మండల్‌ చింతపల్లి మండల అధ్యక్షులు పి.చిట్టిబాబు,సమత డైరెక్టర్‌ సుశాంత్‌ ప్రాణాగ్రహీ,కో-ఆర్డినేటర్లు కే.సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ గ్రామసభ ప్రతిష్టతను,దాని ఫలితాలను వివరించారు.జీ.సైమన్‌ మాట్లాడుతూ పెసాచట్టం, గ్రామసభ ప్రాధాన్యత పై తమ తమ అభిప్రాయాలను వెల్లడిరచారు.పెసా చట్టంలో పొందు పరిచిన కమిటీలు నిర్వహణ,బాధ్యతలు,అన్యా క్రాంత మవుతున్న భూములు పరిరక్షణ, సంతల కోసం గ్రామసభల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవా లనే అంశాలను వివరించారు.ఈ సమావేశం లో సమత పరిశోధన విద్యార్థులు,గిరిజన యువకులు పాల్గొన్నారు. అనంతరం ‘పల్లె ప్రగతికి పట్టాభిషేకం పెసా చట్టం-996’అనే పుస్తకానీ ఆవిష్కరించారు. – (బి.గంగరాజు)

దేశంలో జమిలి ఎన్నికల సంకేతాలు

జమిలి ఎన్నికల విషయంలో మరో అడుగు పడిరది. ఈ మధ్యనే, సార్వత్రక ఎన్నికలకు కాస్తంత ముందు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని కమిటీ ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించిన నివేదికను కేంద్రమంత్రివర్గం ఆమోదించింది. లోక్‌సభలో సొంతబలం గట్టిగా ఉన్న తొలి రెండు పర్యా యాల్లో ఈదిశగా సాగించిన ప్రయత్నా లను, ఇప్పుడు సరిపడా స్వశక్తి లేని దశలో కూడా ముందుకు తీసుకుపోవాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. జమిలితో దేశా నికి ఎంతో మంచిది అంటూ బీజేపీ పెద్దలు పట్టువీడ కుండా పోరాడుతున్న తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
దేశంలో జమిలి ఎన్నికల సంకే తాల సందడి మరోసారి బలంగా తెరపైకి వచ్చింది.అకస్మాత్తుగా పార్లమెంట్‌ ప్రత్యేక సమా వేశాల ప్రకటన, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో జమిలీ ఎన్నికల సాధ్యా సాధ్యాలపై కమిటీ వేశారన్న సమాచారంతో.. ఎక్కడ చూసినా ఇదే విషయంపై చర్చ సాగు తోంది. ఇప్పటికే తెలంగాణపై కర్ణాటకలో కాం గ్రెస్‌ గెలుపు ప్రభావం ఉంది. వచ్చే ఎన్నికలో మధ్యప్రదేశ్‌,రాజస్థాన్‌,ఛత్తీస్‌గఢ్‌, తెలం గాణలో కాంగ్రెస్‌ గెలిస్తే మరింత ప్రభావం చూపే అవ కాశం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ లు, దేశవ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు తగిన సిఫారసులు చేయాలంటూ గత మోదీ ప్రభుత్వం కోవింద్‌ కమిటీని కోరింది.ఈ నేపథ్యంలో చర్చలు నిర్వహించిన కమిటీ.. తన సిఫారసు లను గత లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది.తొలుత లోక్‌సభ, అసెంబ్లీలకు ఒక విడుతలో ఎన్నికలు నిర్వహించడం,తదుపరి వంద రోజులలోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం ద్వారా జమిలి సాధ్యపడుతుందని కోవింద్‌ కమిటీ పేర్కొన్నది.జమిలి ఎన్నికలు నిర్వహిం చాలంటే రాజ్యాంగంలో పలు కీలక సవరణలు చేయాల్సి ఉంటుంది.తొలివిడుతలో లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించ డానికి రాజ్యాంగ సవరణలు అవసరమైనప్పటికీ.. పార్లమెంటు ఆమోదం పొందితే రాష్ట్రాల ర్యాటి ఫికేషన్‌ అవసరం ఉండదు. అయితే..వంద రోజు ల తర్వాత నిర్వహించే స్థానిక ఎన్నికలకు మాత్రం కనీసం సగం రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
ఏమిటీ జమిలి ఎన్నికలు?
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు,లోక్‌ సభకు,స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలను నిర్వ హించడమే జమిలి ఎన్నికలప్రధాన ఉద్దేశం. గతం లో జరిగినా..ఆ తర్వాత వాస్తవానికి మన దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కొత్తదేమీ కాదు.1952 లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని, 1967 వరకు లోక్‌సభకు,రాష్ట్రాల అసెంబ్లీలకు చాలా వరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతర కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడక పోవడం,గడువుకు ముందే పలురాష్ట్రాల శాసన సభలను బర్తరఫ్‌ చేయడం తదితర కారణాల తో జమిలి ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్‌సభ,అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరు పడం మొదలైంది.
ప్రక్రియ పెద్దదే
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే చాలా రాష్ట్రాలు చట్టసభలను గడువు కంటే ముందే రద్దు చేయాల్సి ఉంటుంది. మరికొన్నింటి కాలవ్య వధిని పొడిగించాల్సిన అవసరమూ ఉండొచ్చు. కాబట్టి, జమిలి ఎన్నికలను నిర్వహించాలంటే దానికి సంబంధించిన బిల్లు తొలుత పార్లమెంట్‌ ఆమోదం పొందాల్సి ఉంటుంది. జమిలి ఎన్నిక లు జరుగాలంటే దాదాపు 18రాజ్యాంగ సవర ణలు,ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని కోవింద్‌ కమిటీ తాజా నివేదికలో స్పష్టం చేసింది. ముఖ్యంగా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356,ఆర్టికల్‌ 324, ఆర్టికల్‌ 83(2),ఆర్టికల్‌172(1),ఆర్టికల్‌ 83కు సంబంధించి పలు సవరణలు అవసరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడు తు న్నారు.
రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ సిఫార్సులు
జమిలి ఎన్నికల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నాయక త్వంలో ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ 18 వేల పేజీల నివేదికను రాష్ట్రపతికి సమర్పిం చింది.దేశంలో47రాజకీయ పార్టీలలో 32 పార్టీలు జమిలి ఎన్నికలకు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది.ఈకమిటీ 2029నాటికి రాజ్యాం గంలో 5ఆర్టికల్స్‌ సవరణ చేసి జమిలి ఎన్నికలు నిర్వ హించవచ్చని తెలిపింది.7దేశాలలో జమిలి ఎన్ని కల గురించి అధ్యయనం చేశామని పేర్కొంది. కానీ స్వీడన్‌,జర్మనీ,బెల్జియం వంటి దేశాలలో అమ లులో ఉన్న నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం గురించి కమిటీ పేర్కొనలేదు.కోవింద్‌ కమిటీ 10కీలక సిఫా ర్సులు చేసింది.తొలి దశలో లోక్‌సభ, శాసన సభలకు ఒకేసారిఎన్నికలు నిర్వహించాలని, రెండో దశలో కార్పొరేషన్లకు, మునిసిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు,పంచాయతీరాజ్‌ సంస్థలకు ఎన్ని కలు నిర్వహించాలని పేర్కొంది.స్థానిక సంస్థల ఎన్నికలు లోక్‌సభ,అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 100రోజుల్లోగా పూర్తి చేయాలని చెప్పింది. జాతీ య ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘాలతో కలిసి ఒకే ఫొటో గుర్తింపు కార్డును జారీ చేయాలని పేర్కొంది.
రాజ్యాంగ సవరణలు
జమిలి ఎన్నికలు అమలులోకి రావటానికి కనీసం 6 రాజ్యాంగ సవరణలు చేయవలసి ఉంటుందని రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ పేర్కొన్నది. దేశంలో వివిధ ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులు, మార్గద ర్శకాలను నిర్దేశించిన 1951ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయడంతో పాటు కనీసం 6కీలక రాజ్యాంగ సవరణలు చేయవలసి ఉం టుంది.లోక్‌సభ,రాజ్యసభ కాలపరిమితిని నిర్ణ యించే 83వఆర్టికల్‌,రాష్ట్రాల శాసనసభల కాల పరిమితిని నిర్ణయించే 172వ ఆర్టికల్‌,ఎన్నికల కమిషన్‌ అధికారాలకు సంబంధించిన 324వ ఆర్టికల్‌ సవరణ చేయాలి.వీటితో పాటు స్థానిక సంస్థలకు సంబంధించిన ఆర్టికల్‌243-కె, 243-జడ్‌.ఏలను కూడా సవరించవలసి ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే రాజ్యాంగ సవరణలను రాజ్య సభ, లోక్‌సభ లలో 2 బై 3వ వంతు మెజారిటీతో ఆమోదించాలి. ప్రస్తుతం రెండు సభలలో బిజెపికి ఉన్న బలంతో అది సాధ్యం కాదు. ఇతర పార్టీల మద్దతు కూడగట్టవలసి ఉంటుంది. దీనితో పాటు స్థానిక సంస్థల రాజ్యాంగ సవరణలకు సగం రాష్ట్రాల శాసనసభలు కూడా ఆమోదించాలి. బిజెపి మిత్రపక్షాలు అంగీకరిస్తేనే ఇది సాధ్యమౌ తుంది. – (కె.యస్‌.లక్ష్మణరావు)

అడవి తల్లి వేదన..అరణ్య రోధన

అడవంటే జ్ఞాన నిలయం.తపోభూమి. అడ వంటే ఆరోగ్య ప్రదాయిని. ఔషధుల ఖని. ఒక్క మాటలో చెప్పాలంటే అడవి భారతీయ ఆత్మ. జీవితాన్ని నాలుగు భాగాలు చేసుకుంటే అందులో ఒక భాగానికి వానప్రస్థాశ్రమం అన్న పేరు పెట్టి, అడవిలో తమని తాము భాగం చేసుకున్నారు భారతీయులు. ఈ అద్భుత చింతనను గతం గూటిలోకి నెట్టడం సరికాదు. ఇప్పుడు అడవులకు మనిషి చేస్తున్న చేటును ఆపాలంటే ఆ భావన ఉపయోగపడు తుందని ఆశిద్దాం. అడవిని రక్షించుకోవాలన్న నినాదం ఈ క్షణం నుంచి ప్రతి గుండె లయ కావాలి. లేదంటే రేపన్నరోజు ఆ గుండె కొట్టుకోవడం కష్టమవు తుంది. అడవి లుప్తమైతే మంచి గాలి ఉండదు. అడవి నరికితే భూమి ధ్వంసమవుతుంది. చెట్లు నరికితే పర్యావరణం నాశనమవుతుంది. వీటన్నిటికి స్పందిం చేది నీ గుండె, నా గుండె, మనందరి గుండెలు. అడవిని రక్షించుకోవడం ధార్మిక విషయమే కాదు. శాస్త్రబద్ధం కూడా. కాని వనాల మీద భారతీయులు పెంచుకున్న భావనకు వేళ్లు విజ్ఞానశాస్త్రంలో ఉన్నాయి.
ప్రపంచ జనాభాను బాధిస్తున్న దాదాపు ఎనభై శాతానికి పైగా జబ్బులకు ఔషధాలను అంది స్తున్న ఆఅడవితల్లి ఇప్పుడు రక్తకన్నీటిని కారుస్తున్నది..ప్రతీ యేటా ప్రపంచ అటవీ సంరక్షణ దినోత్సవాన్ని ఘనంగా జరిపే ఐక్యరాజ్య సమితి ఈసంవత్సరం కూడా ‘’ఫారెస్ట్‌ అండ్‌ ఎనర్జీ(అడవి మరియు శక్తి)’’ నినాదంతో పర్యావరణ ప్రాధాన్యతపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా ప్రణాళికలను రూపొందించింది. అయినప్పటికీ,ప్రకృతి మాతపై జరుగుతున్న ఘోర కలి ఆగట్లేదు. డెబైÄ్భయేండ్ల క్రితం 250కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభాకు ఎటువంటి రక్షణను అందించిందో, ప్రస్తుతమున్న ఎనిమిది వందల కోట్ల జనులకు అదే ప్రేమను పంచుతున్న ఆ అడవికి మాన వుడు చేస్తున్న గాయం వర్ణనాతీతం! తనను ఎంతగా నాశనం చేస్తున్నా..ఆఅడవితల్లి తన బిడ్డలకు జీవ వాయువులను అందిస్తూ, వర్షాలు కురిసేలా చేస్తూ, ఆకలితీర్చే అమ్మగా తన ఒడిలో ఇప్పటికీ సమస్త ప్రాణికోటిని కంటికి రెప్పల సాకుతూనే ఉన్నది.
అగ్ర రాజ్యాలే ఆజ్యం పోస్తున్నాయి
1990 నుంచి ఇప్పటి వరకు సగానికి సగం వర్షాధార అడవులు కేవలం అగ్ర దేశాల కార్యకలాపాల వల్లనే నాశనమయ్యాయని తెలిస్తే ఆశ్చర్యం కలక్కమానదు..అటవీ పరిరక్షణ సమితి,ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం..భూమిపై 30శాతం అడవులు ఉం డాలి.కానీ ఏటావీటి విస్తీర్ణం గణనీయంగా పడిపోతున్నది. ప్రతీ సెకనుకి ఒకటిన్నర ఎకరం అడవి నరకబడుతుందంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. పర్యావరణవేత్తలు చెప్పే దాన్ని బట్టి..వాతావరణంలోకి విడుదల య్యే ఒక క్లోరిన్‌ పరమాణువు, భూమికి కవచంలా ఉన్న ఓజోన్‌ పొరలోని లక్ష అణువులను విచ్ఛి న్నం చేయగలదు! అడవులను క్రమక్రమంగా క్షీణింపజేస్తూ..రోజుకి కొన్నిలక్షల లీటర్ల క్లోరిన్‌ సంబంధ ఉదారాలను అగ్రదేశాలు వాతావర ణంలోకి వదులుతున్నాయని, ఇదిలాగే జరిగితే రానున్న శతాబ్ద కాలంలో భూమిపై ఒక్కటంటే ఒక్క వర్షాధార అడవి కూడా మిగలదని హార్వర్డ్‌,కొలంబియా విశ్వ విద్యాలయాల పర్యావరణ విభాగానికి చెందిన నిపుణుల పరిశోధనల్లో వెల్లడ వ్వడం యావత్‌ ప్రపం చాన్ని నిశ్చేష్టులను చేస్తున్నది.
అడవుల ప్రాధాన్యం తెలుసా ?
అభివద్ధి ముసుగులో అగ్రరాజ్యాలు అవలం భిస్తున్న పారిశ్రామిక వింత పోకడలు ప్రకతి మాత ఒంటిని తునాతునకలు చేస్తున్నది. అడవులను విచక్షణా రహితంగా నరకడం వల్ల కార్బన్‌ డైయాక్సైడ్‌ నియంత్రణ కుంటు పడి, వాతావరణంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపు తున్నది. సాధా రణంగా సముద్రాలు 25శాతం కార్బన్‌ డైయాక్సైడ్‌ను పీల్చుకుం టాయి.ఇవి నీటిలోని వివిధ మూలకాలతో కలిసి కార్బాలిక్‌ యాసిడ్‌ వంటి పదార్ధాలను ఏర్పరుస్తాయి.ఈ విధంగా గడచిన 250 సంవత్సరాల్లో సము ద్రజలాల ఆమ్లత్వం 30శాతం పెరిగిందని, దీనికి కారణం..అడవులశాతం తగ్గడమే నని,ఇది ఇలాగే కొనసాగితే,2100 సంవత్స రం నాటికి సముద్రజలాల ఆమ్లత్వం 150 శాతం వరకు పెరిగి..సముద్రాన్నే ఆవాసంగా ఏర్పరచుకున్న లక్షలాది సముద్ర జీవులు మృత్యువాత పడటం ఖాయమని బయో డైవర్సి టీ రిపోర్టులు కుండబద్దలు కొట్టాయి. ఇక,అడవుల్లో చెలరేగే అగ్ని ప్రమాదాలు పర్యా వరణానికి, జంతువులకే గాక మానవుల్లో సైతం వివిధ శ్వాసకోశ వ్యాధులు,అస్తమా, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వంటి రోగాలకు పెను ముప్పుగా దాపురిస్తున్నాయి. ఉదాహరణకు.. 2015ఆగష్టు నెలలో ఇండోనేషియా అటవీ ప్రాంతంలో సంభవించిన ఘోరఅగ్ని ప్రమా దంలో వేలకు వేల అరుదైన వ క్షాలు, జీవ జాలం కలిగిన సుమారు 2.6మిలియన్‌ హెక్టార్ల అటవీ ప్రాంతం అగ్నికి ఆహు తవ్వగా..సుమారు 1,00,300 మంది ప్రజలు వివిధ శ్వాసకోశ వ్యాధులతో అసువులు బాసా రని తేలింది.అడవులను నరకడంవల్ల ఓజోన్‌ పొర క్షీణించి సూర్యుడినుంచి అతినీల లోహిత కిరణాలు నేరుగా భూమికి చేరుకోవడవల్ల మానవుల్లో వివిధ రకాల క్యాన్సర్లకు కారణ మవుతాయనే విషయం కూడా తెలిసిందే !
అడవులను విచక్షణారహితంగా నరుకుతూ..ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తవుతున్న సుమారు 70శాతం కాగితాన్ని వినియోగించు కుంటూ ..రానున్న ఇరవై యేండ్లలో 28వేల జీవజాతుల మనుగడనే ప్రశ్నార్ధకంచేస్తున్న అమెరికా,ఐరోపా వంటి అగ్రదేశాలే జరుగు తున్న విపత్కర పరిణామానికి జవాబుదారీతనం వహించాలి.పర్యావరణ ప్రేమికులు,అభివృద్ధి చెందుతున్న దేశాల అధినేతలు అగ్రరాజ్యాల మెడలు వంచి అడవితల్లి మెడలో పచ్చల తోర ణం అలంకరించే అవసరం ఎంతైనా ఉంది.
అడవులు ఆశ్చర్యకర అంశాలు
ప్రపంచ వ్యాప్తంగా సుమారు 160కోట్ల మంది ప్రజలకు అడవే జీవనాధారం!భూమిపై ప్రతి నిమిషం..ఇరవై ఫుట్‌ బాల్‌ స్టేడియం విస్తీర్ణ మంతా అటవీ ప్రాంతం కనుమరుగవుతు న్నది.ప్రపంచ జనాభాలో 5శాతం కూడా లేని అమెరికన్లు, ముప్పై శాతంకి పైగా కాగితాన్ని వినియోగిస్తున్నారు.ప్రపంచ దేశాలతో పోలిస్తే కేవలం అమెరికా,ఐరోపా దేశాలే 12రెట్లు ఎక్కువ అడవిని పారిశ్రామికీకరణ పేరుతో నాశనం చేస్తున్నాయి.
చెట్టును కూల్చడమంటే హత్యతో సమానం. ఒక అడవిని నిర్మూలించడమంటే ఒక జాతి మీద జరిగిన సామూహిక హననం కాదా! చెట్టుకు అనుభూతులుంటాయి. చెట్టుకు వ్యక్తీకరణలుంటాయి. వైర్లెస్‌ సిగ్నలింగ్‌, మైక్రోవేవ్‌ ఆప్టిక్స్‌ శాస్త్రవేత్త సర్‌ జగదీశ్‌ చంద్రబోస్‌ వంటి మహా శాస్త్రవేత్త చెప్పిన అద్భుత సత్యమిది. చెట్టుకు అనుభూతులు ఉంటాయని ఆయన నిరూపించారు.లండన్‌ రాయల్‌ సొసైటీలో 1901లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో రుజువు చేశారు.జంతువులకు వలెనే మొక్కలకీ నాడీ వ్యవస్థ ఉంటుందని చెప్పారాయన.వాటికి హాని జరిగితే మౌనంగా రోదిస్తాయి కూడా.వాటిని నిర్మూలించుకోవడం అంటే మానవాళి తనను తాను నిర్మూలిం చుకోవడమే.
పచ్చదనం మీద కక్ష
అడవులు స్వచ్ఛమైన గాలినిస్తాయి. వాతావ రణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తాయి.పర్యా వరణ సమతుల్యాన్ని కాపాడతాయి. ఉపాధిని స్తాయి. జీవజాలానికి ఆశ్రయమిస్తాయి. సకాలంలో వానలు కురిపిస్తాయి.భూగర్భ జలాల పరిరక్షణ,కర్బన ఉద్గారాల తగ్గింపు, వాతావరణ మార్పుల నియంత్రణలో అడవులు విశేషమైన పాత్ర పోషిస్తాయి.కానీ రానురాను ఆధునికత, అభివృద్ధి, ప్రజావసరాలు, పట్టణీ కరణ పేరుతో విచక్షణా రహితంగా వనాల నరికివేత సాగిపోతోంది. ఇది ఏఒక్క దేశా నికో,రాష్ట్రానికో పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా కళ్లకు కడుతున్న దుష్పరిణామం. పచ్చదనం మీద మనిషి కక్ష కట్టినట్టే వ్యవహరి స్తున్నాడు.దీనివల్ల కలిగే అనర్థాలు విపరీతంగా ఉంటున్నాయి. వాయు కాలుష్యం పెరిగిపో తోంది. స్వచ్ఛమైన గాలి కరవవుతోంది. వన్య ప్రాణులు ఆహారం కోసం వనాలు వదలి పల్లెలు,పట్టణాలకు తరలుతున్నాయి. పంటలను ధ్వంసం చేస్తున్నాయి.ప్రజలను భయపెడు తున్నాయి. దాడులు చేస్తున్నాయి.రుతుపవ నాలు క్రమం తప్పుతున్నాయి.వర్షాలకు విఘాతం కలుగుతోంది. అయితే కుంభవృష్టి, లేకపోతే అనావృష్టితో యావత్‌ భూ మండలం తల్లడిల్లుతోంది.విశ్వవ్యాప్తంగా అడవుల క్షీణత మానవాళి మనుగడను ముప్పులోకి నెడుతోంది. చెట్లు తరిగేకొద్దీ కరవులు,తుపాన్లు,వరదలు, వాతావరణ మార్పులు చోటుచేసుకుంటు న్నాయి.ఇవి ప్రజలకు సవాళ్లను విసురుతు న్నాయి.
ఏటా నాశనమయ్యే అడవి ఎంతో తెలుసా?
ఐక్య రాజ్య సమితి అంచనా ప్రకారం ఏటా దాదాపు కోటీ ఇరవై లక్షల హెక్టార్ల అటవీ విస్తీర్ణం హరించుకుపోతోంది.వనాలక్షీణత, జలవనరులతో పాటు వాతావరణ మార్పులపై, జీవనోపాధులపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపు తోంది.12నుంచి 20శాతం వరకు కర్బన ఉద్గారాలకు అడవుల క్షీణతే కారణం.ఈపరి స్థితిని అధిగమించేందుకు 2012 నవంబరులో ఐక్యరాజ్య సమితి నడుంబిగించింది.
కాపాడలేకపోతున్న ‘కంపా’
కానీ అడవుల రక్షణ కాగితాల మీదే విస్తరి స్తున్నది. అనేక దేశాలు అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని మొక్కుబడిగా నిర్వహిస్తుండటంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. పాలకు లలో చిత్తశుద్ధి లేక వనాల నరికివేతకు అడ్డుకట్ట పడటం లేదు.కొత్తగా వనాల పెంప కం తూతూ మంత్రంగా సాగుతోంది. మొక్కలు నాటేందుకు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తు న్నామని పాలకులు గొప్పలు చెప్పుకుంటు న్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ మేరకు ఫలితాలు కనపడటం లేదన్నది చేదు నిజం.జలాశ యాలు,వివిధ ప్రాజెక్టులు,రహదారుల నిర్మాణం,విస్తరణ,ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు ఏటా పెద్దయెత్తున వనాలను వినియోగిస్తుండటంతో అవి కుచించుకు పోతున్నాయి.ఈపరిస్థితిని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం‘కంపా’పథ కాన్ని తెరపైకి తీసుకువచ్చింది.కాంపన్సేటరీ అఫారెస్టేషన్‌ మేనేజ్‌మెంట్‌,ప్లానింగ్‌ అథారిటీ (ప్రత్యమ్నాయ వనీకరణ నిధి ప్రణాళిక సంఘం)కి సంక్షిప్త రూపమే ‘కంపా’.కోల్పో యిన అటవీ భూమి మేరకు ప్రత్యామ్నాయంగా అడవులను పెంచడం ఈ పథకం ప్రధాన ఉద్దే శం.దీనికింద 27రాష్ట్రాలకు కేంద్రం 2019లో రమారమి రూ.47వేలకోట్లు మంజూరు చేసింది.ఈ నిధులను ప్రత్యమ్నాయ అటవీ పెంపకం, వన్యప్రాణుల సంరక్షణ,అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ తదితరాలకు వెచ్చించాల్సి ఉంటుంది. అటవీ భూములను పారిశ్రామిక అవసరాలకు బదలాయిస్తే,ఆ మే రకు అడవుల పెంపకం చేపట్టాలన్న ఆలోచన తో ‘కంపా’ పథకం రూపుదిద్దుకుంది.పథకం లక్ష్యాలు సమున్నతమే.కానీ ఆచరణ అంతంత మాత్రం.వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపం,కాగితాలపై లెక్కలు, క్షేత్ర స్థాయిలో లోపాల కారణంగా అడవుల పెంప కం కార్యక్రమం నత్తనడకన నడుస్తోంది. వనాల విస్తీర్ణం తగ్గడానికి పోడు వ్యవసాయం కూడా కొంతవరకు కారణం.అభివృద్ధి పేరుతో విచక్షణారహితంగా అడవులను ధ్వంసం చేయడం,నదీగమనాలను మళ్లించడం,నీటి వనరులను విచ్చలవిడిగా వాడటం వైపరీ త్యాలకు దారితీస్తోంది.కొండలను,గుహలను తొలచి, భారీ సొరంగాలను తవ్వి విద్యుత్‌ ప్రాజెక్టులను నిర్మిస్తుండటంతో ప్రకృతి సమతుల్యం దెబ్బతిని అనర్థాలు చోటుచేసు కుంటున్నాయి.ఇటీవలి ఉత్తరాఖండ్‌ వరదలకు ఇదే కారణం.అడవులు జీవ వైవిధ్యానికి మారుపేరుగా నిలుస్తాయి.ఇక్కడ అనేక రకాల జంతుజాలాలు మనుగడ సాగిస్తాయి. దాదాపు అరవై వేల చెట్ల జాతులు ఉన్నయాని అంచనా. ఈ వైవిధ్యమే మానవాళికి మేలు చేస్తుంది.– (గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌)

చిన్నారుల చిదిమేసిన కలుషిత ఆహారం

అనాథాశ్రమంలో ఫుడ్‌పాయిజన్‌.. ముగ్గురు చిన్నారులు మృతి
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన పాఠశాల విద్యార్థుల్లో ముగ్గురు మృతి చెందారు. రెండు రోజుల క్రితం అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని అనాథాశ్రయంలో సమోసా తిన్న విద్యార్థులంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చిన్నారులను వెంటనే ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందజేస్తున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో సోమవారం ఉదయం ముగ్గురు చిన్నారు చనిపోయారని తెలిసింది.. మృతి చెందిన విద్యార్థులు భవాని,జాషువా, శ్రద్ధగా గుర్తించారు. మృతులు ముగ్గురు కొయ్యూరు మండలానికి చెందిన వారు. జరిగిన ఘటనపై డిప్యూటీ డీఈఓ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. చిన్నారులను వెంటనే ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందజేస్తున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో సోమవారం ఉదయం ముగ్గురు చిన్నారు చనిపోయారని తెలిసింది.. మృతి చెందిన విద్యార్థులు భవాని, జాషువా, శ్రద్ధగా గుర్తించారు. మృతులు ముగ్గురు కొయ్యూరు మండలానికి చెందిన వారు. జరిగిన ఘటనపై డిప్యూటీ డీఈఓ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.
రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శ.
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందు తున్న చిన్నారులను రాష్ట్ర హోం మంత్రి వంగల పూడి అనిత, స్థానిక ఎంపీ శ్రీభరత్‌, ఉత్తర ఎమ్మెల్సీ విష్ణుకుమార్‌ రాజు,తెదేపా జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ,భాజపా నేత మాధవ్‌ ఇతర నేతలు, అధికారు లతో కలిసి పరామర్శించారు.వారి ఆరోగ్య పరిస్థి తిని తెలుసుకున్నారు. బాధితులతో మాట్లాడి వారి లో మనోధైర్యం నింపారు.ఆమె వెంట జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేంధిర ప్రసాద్‌, కేజీహెచ్‌ సూపరెం టెండెంట్‌ కె.శివానంద,ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌ ఇతర అధికారులు.అస్వస్థతకుగురైన పిల్లలకు కేజీ హెచ్లో మెరుగైన వైద్యం బాధితులను జిల్లాకలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ పరామర్శించించారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాస పట్నం అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన చిన్నారులకు కేజీహెచ్లో మెరుగై న వైద్యం అందుతోందని, వైద్యులు అన్ని రకాలుగా పర్యవేక్షిస్తున్నారని విశాఖపట్టణం జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేంధిర ప్రసాద్‌ తెలిపారు. అనకాపల్లి ఏరియా ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం చిన్నారులను కేజీహెచ్‌కు తీసు కురాగా కలెక్టర్‌ వెళ్లి పరామర్శించారు.చిన్నా రులతో,వారి తల్లిదం డ్రులతో మాట్లాడారు. వారి లో మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు. మొ త్తం14మంది పిల్లలు అనకాపల్లి నుంచి వచ్చారని వారందరికీ ప్రస్తుతం పిల్లల వార్డులో వైద్య నిపు ణుల పర్యవేక్షణలో మెరుగైన వైద్యం అందుతోం దని పేర్కొన్నారు.అందరి పరిస్థితీ బాగానే ఉందని భయపడాల్సిన పని లేదని అన్నారు.
ఆదమరిస్తే ఆహారమే విషం..
అభం..శుభం తెలియని ముగ్గురు గిరిజన బిడ్డలు కలుషిత ఆహారం తిని ప్రాణాలు పొగొట్టుకున్నారు. మరో 35మందికి పైగా పిల్లలు త్రీవ అస్వస్థతకు గురై ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసప ట్నంలో ఇటీవల జరిగిన ఈవిషాద ఘటన రాష్ట్రం లో కలకలం రేపుతోంది.ఈనేపథ్యంలో సంబంధిత యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.అయితే కేవలం వసతి గృహాల్లోనే కాదు.. నగరంలోని చాలా హోటళ్లు,బేకరీలు,ఇతర ఫాస్టు ఫడ్‌ సెంట్రల్లో కలుషిత ఆహారాలు,తినబండారాలు యధ్ఛేగా విక్రయాలు సాగుతున్నాయి.దీనిపై ఫుడ్‌ సెప్టీ యంత్రాంగం తూతూ మంత్రంగా చోదాలు చేస్తూ చోధ్యం చేస్తోంది.
ఆకలి రుచి ఎరగదు..నిద్ర సుఖమెరగ దంటారు పెద్దలు.మహానగరంలోని సిటిజన్ల ఉరకులు పరు గుల జీవితంలో సమయానికి దొరికింది.ఏది పడితే అదితినేస్తున్నారు.వాటిలో ఫాస్ట్‌ ఫుడ్‌తోపాటు అనేక రకాల ఆహార పదార్ధాలు ఉంటున్నాయి.అయితే కొన్ని ఆహారపు అలవాట్లవల్ల కొన్నిసార్లు అనా రోగ్యం బారిన పడే అవకాశం లేకపోలేదు. శరీరా నికి పడని ఆహారం తీసుకోవడం వల్ల ఫుడ్‌ పాయి జనింగ్‌ అయ్యే ప్రమాదం ఉంది.ఈ క్రమంలో వాంతులు,విరేచనాలు,కడుపునొప్పి,మంట, గ్యాస్ట్రి క్‌ సమస్యలు లాంటివి తలెత్తుతున్నాయి. అంతే కాకుండా కొన్ని సమయాల్లో ప్రాణా పయస్థితికి తీసుకువస్తూన్నాయి.
ఆకర్షణ వెనుక..విషాదం..
నగరంలో నోరూరించే వాసన,ఆకర్షించే రంగులు. ఇంకేముంది చికెన్‌,మటన్‌,చేపలు కనిపిస్తే చాలు లొట్టలేసుకుంటూ తింటాం.బిర్యానీ ప్రేమికులు ఇంకాస్త ఎక్కువగా ఆరగిస్తున్నారు.కానీ హోటల్‌ ల్లో తిన్నపాపానికి పొద్దున్నే ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది.రోజురొజుకూ నగరంలో ఫుడ్‌ పాయిజి నింగ్‌(విషాహారం)కేసులు నమోదువుతూనే ఉన్నా యి. కానీ కొన్ని భయటపడుతున్నాయి. మరి కొన్ని మామూళ్లు చాటును దాగిపోతున్నాయి. హోటళ్ల లో వాడుతున్న నాసిరకం ఆహారం పదార్ధాల ముడి సరుకులు,అపరిశుభ్ర వాతావరణం,సరైన నీళ్లు వాడకపోవడం,ఎక్కువరోజులు నిల్వ ఉంచిన పదార్ధాలు వండటం వంటి కారణాలతో ఫుడ్‌ పాయిజనింగ్‌ కేసులు తీవ్రమవుతున్నాయి.
విషాహారానికి ప్రధాన కారణాలు ఇవే..
ఆహార పదార్ధాలను సరిగా శుభ్రం చేయకుండా వినియోగించడం.సరైన మోతాదులో ఉడికించక పోవడం.మాసాహారాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం,వాడిన నూనెలు మళ్లీమళ్లీ వినియోగిం చడం,ఆకర్షణకోసం రకరకాలరంగులు వేసి వడ్డిం చడం,బాగాచల్లారిపోయిన పదార్ధాలను వడ్డిం చడం,ఎక్కువ రోజులునిల్వ ఉంచిన చీజ్‌, బటర్‌ లలో బ్యాక్టీరియా ఉండటం,కలుషిత నీళ్లు వాడడం ద్వారా ఎక్కువ బ్యాక్టీరియావచ్చే అవకాశం ఉంది.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి…
మాంసాహారం గానీ,కూరగాయలుగానీ ఎక్కువ సేపు ఉడికించి తినాలి.వీలైనంత వరకూ నిల్వ ఉంచకుండా ఏరోజు ఆహారం ఆరోజే తినాలి.కాచి చల్లార్చిని నీళ్లును తాగడం మంచిది.ఒకసారి వేడిచేసిన నూనెను మళ్లీమళ్లీ వాడకుండా చూసు కోవాలి.ప్రధానంగా మాంసాహారం అప్పటికప్పుడు తినడం మంచిది.పురుగు మందుల వాడకం ఎక్కువైన నేపథ్యంలో ఆకుకూరలుగానీ, కూరగా యలు గానీ వేడినీటిలో ఉప్పువేసి ఆరగంట సేపు నానబెట్టాక వండటం మంచిది.వాంతులు, విరేచ నాలు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించగానే ఓఆర్‌ఎస్‌(ఓరల్‌ రీ హైడ్రేషన్‌ సొల్యూషన్‌)ఫౌడర్‌ నీళ్లలో కలిపి తాగాలి.కాచి చల్లార్చిన నీళ్లు ఎక్కువ మోతాదులో తీసుకోవడం,కొబ్బరినీళ్లు,మజ్జిగ వంటివి తీసుకోవాలి.
నియంణ్ర ఎక్కడా..?
స్ట్రీట్‌ ఫుడ్‌,బీచ్‌ రోడ్డు ఫుడ్‌.. హోటళ్ల లో వండుతున్న ఆహారంపై నియంత్రణే లేదు. ప్రధానంగా మాసాహారం,చికెన్‌,మటన్‌,చేపలు, రొయ్యలు వంటి పదార్ధాలు నాలుగైదు రోజులు కూడా నిల్వ ఉంచి వినియోగదారులకు పెడుతు న్నారు.దీనివల్ల వినియోగదారుడు త్రీవంగా నష్టపో తున్నారు.చిన్నచిన్న బడ్డీకొట్టు అటుంచితే ఓ మోస్తరు మెస్‌లు,రెస్టారెంట్‌లకు కూడా లైసెన్సులు లేని పరిస్థితి.ఏళ్లతరబడి ఇన్‌స్పెక్టర్లు చూసీ చూడ నట్లు వెళుతున్నారు.ఫిర్యాదులు వచ్చినా పట్టించు కోలేదు.ఇక రోడ్లమీద,బీచ్‌లుఎదురుగా అమ్మే ఆహారం కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది.గతేడాది అక్టో బర్‌లో మూలగాఢ గ్రామానికి చెందిన 13మంది యవకులు గాజువాక సమీపంలో ఓహోట్‌లో మండీ బిర్యానీ తిని ఫుడ్‌ పాయిజన్‌కు గురై తీవ్ర అస్వస్థతకు గురైనఘటన అప్పట్లో కలకలం రేపింది.ఎక్కడో ఒకదిక్కున ఫుడ్‌ పాయిజనింగ్‌ కేసులు బయట పడితేనే తప్పా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌,ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తూన్నారే తప్పా.క్రమంగా తనిఖీలు చేసిన దాఖలాలు కన్పించలేదనే విమర్శలు వినిపి స్తున్నాయి.
నగర హోటళ్లుల్లో దారుణాలు..
కైలాసపట్నం ఫుడ్‌ పాయిజనింగ్‌ ఘటనతో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌,ఫుడ్‌ సేఫ్టీ అధికార యంత్రాంగం నగరంలో చేపడుతున్న మెరుపు దాడుల్లో దిగ్భ్రాంతి కలిగించే అంశాలు వెలుగు లోకి వచ్చాయి.ఆర్కే బీచ్‌లోని మత్స్యదర్శినివద్ద ఉన్న ఓహోటల్‌లో నాణ్యత లేని ఆహారం విని యోగదారులకు రోజుల తరబడి నిల్వ ఉంచిన బిర్యానీ,చికెన్‌,మటన్‌,చేప కూరలు నిల్వ ఉంచిన ఆహార పదార్ధాలను వడ్డిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.డాబాగార్డెన్స్‌ దగ్గర ఉన్న ఓమెస్‌లో చికెన్‌,ఫిష్‌కర్రీతో పాటు వెజ్‌ కర్రీలు కూడా రెండు, మూడు రోజుల కిందట వండి ఫ్రీజర్లు,ఫ్రిజ్‌లో నిల్వ ఉంచినట్లు గుర్తించారు.అంతేకాదు ముందు రోజు వండిన అన్నాన్ని వినియోగదారు లకువడ్డిం చేందుకు రెడీచేసే సమయంలో తనిఖీలు చేప ట్టారు. ఈపదార్థాలు రంగు,రుచి కోసం కూరల్లో కొన్నిరకాల పౌడర్లను కలుపుతున్నట్లు గుర్తించారు. ఇలా పాడైపోయిన పదార్థాలను విక్రయిస్తున్నం దుకు హోటల్‌కురూ.పది వేలు జరిమానా విధిం చారు.- (జి.ఎ.సునీల్‌ కుమార్‌)

ఉసురు తీస్తున్న ఫార్మా కంపెనీలు

విశాఖలోని అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో ఇటీవల పేలుడు సంభవించి 17మంది మృతిచెందిన నేపథ్యంలో రాష్ట్రం లోని అత్యధిక ఫార్మా పరిశ్రమలున్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆ కంపెనీల్లో పనిచేసే కార్మికుల భద్రతపై ఆందోళన నెలకొంది. ఉమ్మడిజిల్లాలోని చౌటుప్పల్‌,బీబీనగర్‌, భువనగిరి,బొమ్మల రామారం,భూదాన్‌ పోచంపల్లి, త్రిపురారం,మిర్యాలగూడ మండలాల్లో సుమారు 100వరకు ఫార్మా పరిశ్రమలు ఉన్నాయి.10వరకు భారీ కంపెనీలు ఉండగా..వీటిల్లోనే సుమారు 30వేల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు.మిగిలిని వాటిలో సుమారు 20వేల వరకు ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు. వేల మందికి ఉపాధి ఇచ్చే కంపెనీల్లో సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం కనిపిస్తోంది.నైపుణ్యం గల కార్మికులు పనిచేయాల్సి ఉండగా..ఉత్తర్‌ప్రదేశ్‌,బీహర్‌, జార్ఖండ్‌ లాంటి తదితర రాష్ట్రాల నుంచి తక్కువ వేతనంతో పనిచేసే వారిని కార్మికు లుగా నియమించుకుంటున్నారు. కంపెనీల్లో పిర్యాదుల చెద్దామంటే స్థానికులకు సంబం ధిత ఫ్యాక్టరీస్‌,పీసీబీ అధికారులు అందు బాటులో ఉండటం లేదు. ఏకంగా జిల్లా ఉన్నతాధికారులు నిర్వహించే సమీక్ష సమావేశాల్లోనూ వీరు పాల్గోనడం లేదు.
ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమలే ఉసురు తీస్తు న్నాయి. ఫార్మా కంపెనీల్లోకార్మికులకు రక్షణ కరువు అవుతోంది. యాజమాన్యాలు కార్మికుల భద్రతను గాలికి వదిలేస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి.దీంతో ఏటా కార్మికులు మృత్యువాత పడుతున్నారు.ఫార్మా కంపెనీల్లో నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ఉండాలి.ఎక్కడా ఆదిశగా చర్యలు చేపట్టడం లేదు.తక్కువ ఖర్చుతో అధిక లాభాలు గడిరచాలనే దురాలో చనతో సబ్‌ కాంట్రాక్టర్లకు పరిశ్రమల నిర్వ హణ అప్పగిస్తున్నారు. సబ్‌ కాంట్రాక్టర్లు నైపుణ్యం లేని వారిని తక్కువ వేతనాలతో నియమించడంతో తరుచు ప్రమాదాలు సంభవి స్తున్నాయనే విమర్శలు బలంగా ఉన్నాయి. భద్రత గురించి ప్రశ్నించే కార్మికుల్ని యాజమా న్యాలు నిర్ధాక్ష్యణ్యంగా విధుల నుంచి తొలిగి స్తున్నాయి. దీంతో కార్మికులు భయపడి బిక్కుబిక్కుమంటు ఉద్యోగాలు చేయాల్సిన దుస్థితి దాపురించింది. ఫార్మా కంపెనీలు ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికుల భద్రతపై చూపడంలేదనేది బహిరంగ రహస్యం. కార్మికులకు భద్రతా పరికరాలు సక్రమంగా ఇవ్వడం లేదు. ఫ్యాక్టరీ ఇన్స్‌పెక్టర్లు, కార్మిక శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి లోపాలను సరిచేయాల్సి ఉన్నప్ప టికీ ఫార్మా కంపెనీల్లో ఇదంతా మొక్కుబడి తంతుగా మారుతోంది.
కంట్రోల్‌ కాని రియాక్టర్లు
ఫార్మా కంపెనీల్లో రియాక్టర్లలో హై టెం పరేచ్‌లో ద్రవకాలను మరిగించాల్సి ఉం టుంది. నిపుణులైన ఉద్యోగులు లేకపోవడం వల్ల తరుచు ప్రమాదాలు సంభవిస్తున్నాయనే ఆరోణపణలు ఉన్నాయి. రియాక్టర్లు పేలిన ప్పుడు కంట్రోల్‌ చేయాలంటే నిపుణులు ఉం డాలి అత్యధిక శాతం కంపెనీల్లో అరకొర నాలెడ్జి ఉన్న వారే ఉండటంతో ప్రమాద సమయాల్లో రియాక్టర్లను కంట్రోల్‌ చేయడం కష్టంగా మారుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.పైప్‌లైన్‌ లీకేజీ కార ణంగా పలు సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. వ్యర్థ రసాయనాలు వెళ్ళే పైల్‌లైన్‌ సక్రమంగా ఉండేలా చూసుకోవా ల్సిన బాధ్యత కంపెనీ యాజమాన్యాలతో పాటు అధికారులు పర్యవేక్షించాలి. వ్యర్థ రసాయనాలను శుద్ధి చ?టటసి పైల్‌లైన్‌ గుండా బయటకు పంపాల్సి ఉన్నప్పటికీ పలు కంపెనీలు ఈదిశగా చర్యలు చేపట్టడం లేదని తెలుస్తోంది.అనకాపల్లి జిల్లా అచ్యుతా పురం సెజ్‌ లోని సాహితీ ల్యాబ్‌ లో రియా క్టర్‌ భారీ పేలుడు కారణంగా ఇద్దరు కార్మి కులు అక్కడికక్కడే మృత్యువాత పడగా ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది.ల్యాబ్‌ లో కెమికల్స్‌ మరిగించే క్రమంలో వ్యాపిం చిన మంటలే ప్రమాదానికి కారణంగా -గునపర్తి సైమన్‌

తెలుగు రాష్ట్రాల్లో వరదల విలయం.

ఊహకందని విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు పెను విధ్వంసం సృష్టించాయి.ఇటు ఏపీలో బుడమేరు విజయవాడ,అటు తెలం గాణలో మున్నేరు ఖమ్మం ముంపు ప్రాంతాల వాసులను కోలుకోలేని దెబ్బ తీసింది.బుడమేరు ఉప్పొంగి ప్రవహించడంతో సింగ్‌నగర్‌ జలదిగ్బంధంలో చిక్కుకుంది.నిద్ర లేచేసరికి తరుముకొచ్చిన వరద..పుట్టెడు శోకాన్ని మిగి ల్చింది.కొందరు ఇళ్లపైకి ఎక్కి, సాయంకోసం హాహాకారాలు చేస్తున్నారు. మరికొందరు బంధువుల గృహాలు, పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. మున్నేరు శాంతించిన తర్వాత స్వగృ హాలకు చేరుకుని,ఆనవాళ్లు కోల్పోయిన ఇళ్లు,రూపరేఖలు మారిన కాలనీలను చూసి కన్నీరుమున్నీర వుతున్నారు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని పలువురు బాధితులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వర్షాలు కాస్త తగ్గినా వరద ప్రభావం మాత్రం తగ్గలేదు.పలు ప్రాంతాలు ఇంకా నీటిలో చిక్కుకుని ఉన్నాయి. ముమ్మరంగా సహాయక చర్యలు కొనసా గుతున్నాయి.విజయవాడ, ఖమ్మం,మహబూబాబాద్‌ ప్రాంతాల్లో వరద తీవ్రత చాలా ఎక్కువగా కనిపిం చింది.ఎటూ చూసినా రోడ్లపై పొంగుతున్న వాగులు, బురద ముంచెత్తిన నివాసాలు,అనేక గ్రామాల్లో కుప్ప కూలిన ఇళ్లు..కట్టుబట్టలతో రోడ్లపైకి చేరిన బతుకులు..వరద నీటి నుంచి ఇప్పడిప్పుడే బయటపడుతున్న బస్తీలు.. కాలనీలు.. పొలాల్లో మట్టి,ఇసుక మేటలు..ఛిద్రమైన రహదారులు.. మృత్యువాత పడిన పశువులే కన్పిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జనజీవనానికి ఆటంకంగా మారాయి.అటు ఆంధ్రప్రదేశ్‌,ఇటు తెలంగాణలో వానలతో ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు.ఏర్లు,నదులకు భారీగా వరద నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.బుడమేరు వరద ఉధృతితో విజయ వాడ జలదిగ్బంధంలో చిక్కుకుంది.భారీ వర్షాలు..వరదలతో రెండు తెలుగు రాష్ట్రాలు జనజీవనం కకావికలమైంది.ఏపీలో బుడమేరు వరద నుంచి విజయవాడ తేరుకోక ముందే.. కృష్ణా నదికి వరద పొటెత్తింది.తెలంగానలో కురిసిన భారీవర్షాల ప్రభావంతో ప్రకాశం బ్యారేజీ వద్ద11.43లక్షల క్యూసెక్కుల వరద ముంచెత్తింది.ఉమ్మడి గుంటూరు,కృష్ణా జిల్లాలో కృష్ణానది ఇరువైపులా లంక గ్రామాలు జల దిగ్బందంలోకి చేరాయి.అక్కడి ప్రజలను అధికారులు హూటాహుటిన ఖాళీచేయించి, పునరావాస కేంద్రాలకు తరలించారు.గుం టూరు జిల్లా పరిధిలో 18లంకగ్రామాలకు రాకపోకలు నిలిచాయి.విద్యుత్తు సరఫరా స్తంభించింది.మహిళలు,గర్భిణులు,వృద్దులు సహా వైద్యసాయం అవసరమైన వారిని పడవల్లో తరలించారు.రెండు విద్యుత్‌ సబ్‌స్టేషన్లు నీటి మునిగాయి.ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలవల్ల మొత్తం19మంది మరణించినట్లు అధికారిక సమాచారం.వీరిలోఎన్టీఆర్‌ జిల్లాలో ఎనిమిదిమంది మరణించగా,గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మిగిలిన వారు మరణిం చారు.తెలంగాణలో వరదలవల్ల ఇప్పటి వరకు 9మంది మరణించినట్లు అధికారిక సమా చారం.విజయవాడ నగరం వరుసగా రెండో రోజు కూడా నీటిలోనే ఉంది.బుడమేరు వరద ఈనగరాన్ని అతలాకుతలం చేసింది. నగరం లోని చాలాకాలనీల్లో ఒకఅడుగు నుంచి నాలుగు అడుగుల వరకు నీరునిలిచి పోయిం ది.అనేక ప్రభుత్వ శాఖలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.సింగ్‌ నగర్‌ ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైంది. పలుచోట్ల ఆహారం,ఇతర అత్యవసర పదార్థాలను బోట్లు,ట్రాక్టర్ల ద్వారా సిబ్బంది అందిస్తున్నారు.చాలా మంది ఆవాన నీటిలోనే నానుతూ,వరదప్రభావం లేనిప్రాం తాల్లోని తమకు తెలిసిన వారిఇళ్లకు వెళ్లే ప్రయత్నం చేశారు.కృష్ణా,గుంటూరు జిల్లాల్లోని పలు ప్రదేశాల్లో ప్రవాహంలో ఇరుక్కున్న వారిని సహాయక బృందాలు రక్షించాయి.కోస్తాలోని మిగిలిన జిల్లాల్లో కూడా వరద,వర్షాల ప్రభావం తీవ్రంగా కనిపించింది.రాయల సీమలో వరద ప్రభావం కాస్త తక్కువగా ఉంది.
నేనున్నాననే..భరోసా..
వరద ప్రభావిత ప్రాంతాల్లో మోకాలి లోతు నీటిలో ఏపీసీఎం నారా చంద్రబాబునాయుడు ముంపు ప్రాంతాలు,పునరవాస కేంద్రాలు పర్యటిస్తూ బాధితులను పరామర్శిస్తున్నారు. సహాయక కార్యక్రమాలు స్వయంగా పర్య వేక్షిస్తున్నారు.బుల్‌డోజర్‌,బందరు పోర్టు నుంచి తెప్పించిన భారీ యంత్రంపై ఎక్కి,వరదలో పర్యటించారు.తనకు కొద్దిగా సమయం ఇవ్వాలని,పరిస్థితులు చక్కదిద్దుతామని బాధితులకు విజ్ఞప్తి చేశారు.ప్రతి డివిజన్‌కు ఓఐఏఎస్‌ అధికారిని ఇన్‌చార్జిగా నియ మించారు.మంత్రులందరూ విజయవాడలోనే మకం వేసి పునరావాస కార్యక్రమాలు వేగవంతం చేశారు.ఆహారం,మంచినీటి సరఫరాకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడు తున్నారు.ప్రాణనష్టం లేకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు.హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదులు అందిన వేంటనే సిబ్బందిని ఆయా ప్రాంతాలకు పంపిస్తున్నారు.దాదాపు 10వేల మందిని పునరావాస శిబిరాలకు తరలించారు.ఆక్షయ పాత్రసంస్థ ద్వారా లక్షమందికి ఆహారం అందించారు.హోటల్స్‌ అసోసియేషన్‌ వారు మరో లక్షమందికి భోజనాలు సమకూర్చారు. పవర్‌బోట్లు పలు ప్రాంతాల్లో తిరుగుతూ బాధి తులను సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నారు.
పంట నష్టం
కరకట్ట లోపల వ్యవసాయం,ఉద్యాన పంటలన్నీ కృష్ణార్పణమయ్యాయి.ఒక్కటి చేతికొచ్చే పరిస్థితి లేదు.అరటి,కంద,పసుపు,చామ,కూరగాయ పంటలన్నీ నీటమునిగాయి.ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణయ్య కరకట్ట అంచులను తాకుతూ ప్రవహిస్తోంది.తెనాలి,రేపల్లి నియోజ కవర్గాల్లో కరకట్ట బలహీనంగా ఉన్న ప్రాంతా లో మట్టి,ఇసుక బస్తాలు వేసి,ఎత్తు పెంచి నీరు పొర్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
వీడని వరద..
బుడమేరు ఉధృతికి నీట మునిగిన సింగ్‌నగర్‌ ప్రాంతంలో వరద కష్టాలు కొనసాగుతున్నాయి. ఐదారు అడుగుల ఎత్తున నీరు నిలవడంతో స్థానికులు బయటకు రాలేకపోతున్నారు. పడవ లు ఏర్పాటు చేసి కొందరిని పునరావాస కేంద్రాలకు తరలించినా,అధికశాతం మంది ఇంకా పైఅంతస్తుల్లో బిక్కుబిక్కుమంటూ జీవిస్తు న్నారు.ప్రధాన రహదారుల వెంబడి ఉన్న వారికి ఆహారం,తాగునీరు అందుతున్నా,లోపలి ప్రాంతాల్లోని వారు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు.బయటకు రావాలంటే పడవలు కూడా లేవు.విద్యుత్తు లేదు.తాగునీరు నిండుకుందన వాపోతున్నారు.
డ్రోన్ల ద్వారా ఆహారం,తాగునీరు..
బాధితుల్లో ఎక్కువ మందికి సురక్షితంగా ఆహారాన్ని అందించేందుకు డ్రోన్లను వినియోగించారు.మునిగిన ప్రాంతాలు,బహుళ అంతస్తుల భవనాలపైకి డ్రోన్ల ద్వారా ఆహార పొట్టాలు పంపించారు.పెట్టుబడులు,మౌళిక వసతులశాఖ కార్యదర్శి సురేష్‌కుమార్‌ ఈ డ్రోన్‌ పని విధానాన్ని ఎన్జీఆర్‌ కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబుకు ప్రయోగాత్మకంగా చూపించారు.డ్రోన్ల్‌ ద్వారా 8`10కిలోల బరువున ఆహారం,మందులు,తాగునీటిని సరఫరా చేయొచ్చని సూచించారు.దీంతో వీలైనన్ని ఫుడ్‌ డెవవరీ డ్రోన్లను సిద్దం చేసుకుని లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన బాధితు లకు అందజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.ఆ వెంటనే సింగ్‌నగర్‌, గొల్లపూడిలోని బాధితులకు ఆహార పొట్లాలు, తాగునీటి ప్యాకెట్లును అధికారులు సరఫరా చేశారు.ఈ ప్రయోగం విజయవంతం కావ డంతో మున్ముందు మరిన్ని చోట్ల వినియో గించాలని అనుకుంటున్నారు.
కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి..
వరద సహాయక చర్యలపై మంత్రి లోకేష్‌ విజయవాడలోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి నిరంతరం సమీక్షించారు.వరద సహాయక చర్యల్లో పెద్దఎత్తున పాల్గొన్నాలని తేదేపా శ్రేణులకు పిలుపు నిచ్చారు.ముంపు ప్రాంతాల్లో హెలీకాప్టర్ల ద్వారా 7,220కిలోల ఆహారం,తాగునీరు మందులు జారవిడి చారు.వరద ప్రాంతాల్లోని ప్రజలకు పండ్లు సరఫరాకు మార్కెట్‌ంగ్‌శాఖ చర్యలు చేప ట్టింది.1.10లక్షల యాపిల్స్‌,90వేల అరటి పండ్లు సేకరించి ముంపు ప్రాంతాలకు పంపారు.రానున్న రెండు రోజుల్లో 2.5లక్షల అరటి పండ్లను పంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
కన్నీటి విపత్తు!
భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19 మంది మృతి చెందారు. ఎన్టీఆర్‌ జిల్లాలో 9 మంది మృత్యువాత పడగా, గుంటూరు జిల్లాలో ఏడుగురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు మరణించారు.విజయవాడ మొగల్రాజుపురంలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు, విజయవాడ రూరల్‌, జీ కొండూరు, రెడ్డిగూడెం, పైడూరుపాడులో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు.గుంటూరు జిల్లా.. పెదకాకాని మండలంలో ఇద్దరు సహా ఒక టీచర్‌, ఇద్దరు విద్యార్థులు కారులో కొట్టుకుపోయి మృతి చెందారు. ఒక యువ కుడు కొండవీటివాగులో పడి ప్రాణాలు కోల్పోయాడు. మంగళగిరిలో వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయారు.ప్రకాశం జిల్లాలో ముగ్గురు చిన్నారులు ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు. గుంటూరు-నందివెలుగు రోడ్డులో వరదనీటిలో గుర్తుతెలియనివ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు.విజయవాడలో 275 రైళ్లు రద్దు అయ్యాయి.149 రైళ్లను దారి మళ్లించారు.
4.68 లక్షల ఎకరాల్లో పంట మునక
వర్షాలు, వరదలకారణంగా 4,31,355 ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 37,397 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేశారు.3,18,220 ఎకరాల్లో వరి, 64,782ఎకరాల్లో పత్తి, 28,085 ఎకరాల్లో మొక్కజొన్న,6,477 ఎకరాల్లో మినుము,6,167ఎకరాల్లో కంది, 2,610 ఎకరాల్లో పెసర,1,945 ఎకరాల్లో వేరుశనగ,5,012ఎకరాల్లో ఇతర పంటలు ముంపుబారిన పడ్డాయని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.ప్రాథమిక అంచనా ప్రకారం 20జిల్లాల్లో 365 మండలాలు వర్షాలు, వరదల ప్రభావానికి గురి కాగా, 2,475 గ్రామాల్లో 2లక్షల మంది రైతులకు నష్టం జరిగినట్లు భావిస్తున్నామని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.
జల దిగ్బంధం..
తెలంగాణలో వరద తీవ్రంగా ఉంది. మహబూబాబాద్‌, ఖమ్మం పరిసరాల్లో అనేక జనావాసాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఖమ్మం నగరానికి, మహబూబాబాద్‌ పట్టణా నికిచాలా వైపుల నుంచి రాకపోకలు ఆగిపో యాయి.మున్నేరు వాగు వరదతో ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి కృష్ణా జిల్లాలు ప్రభావితం అయ్యాయి. పాలేరు దగ్గర ఒక కుటుంబం వరదల్లో చిక్కుకుపోయింది. యంత్రాంగం ప్రయత్నించినప్పటికీ వారిని కాపాడలేక పోయారు.ఖమ్మం పరిధిలోని భక్తరామదాసు ఎత్తిపోతల పథకంపంపు హౌసులు మునిగి పోయాయి.నల్లగొండ, సూర్యాపేట, మహ బూబ్‌నగర్‌, కొత్తగూడెం జిల్లాలపై కూడా వరద ప్రభావం ఎక్కువగా కనిపించింది. తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లో చాలా చోట్ల వరద, వర్షం ప్రభావంతో జన జీవనానికి ఇబ్బంది కలిగింది.చాలాచోట్ల కాలనీలు,బస్తీలు,ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాలు నీట మునిగాయి.అనేక చోట్ల హాస్టళ్లు జలదిగ్బంధమైపోవడంతో,ఆనీటిలో నుంచే విద్యార్థులు సామాన్లతో బయటకు వచ్చేశారు.తెలంగాణ ప్రభుత్వం సిబ్బందికి సెలవులు రద్దు చేసింది. పాలేరులో వరదలో చిక్కుకున్న ఒక కుటుంబాన్ని కాపాడలేక పోయినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.అన్ని ప్రయత్నాలూ చేసినప్పటికీ వాతావరణం అనుకూలించక రక్షించుకోలేక పోయినట్టు చెప్పిన ఆయన, ఆ ఘటనను గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి వర్షాలపై సమీక్ష నిర్వహించారు. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్టుగా ఉండాలి. కలెక్టరేట్లలో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో వ్యవస్థను సన్నద్ధంగా ఉంచుకోవాలి.వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం రూ.4లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచుతున్నాం.ప్రజలకు జరిగిన నష్టంపై తక్షణమే అధికారులు స్పందించాలి. ఈ వరద లను జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకో వాలని కేంద్రాన్ని కోరుతూ లేఖ రాస్తాం. ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం,మహబూబాబాద్‌, సూర్యాపేట జిల్లాలకు తక్షణ సాయంగా రూ.5కోట్ల చొప్పున ఇస్తాం’’ అని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.
లక్షల ఎకరాల్లో పంట నష్టం
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ,హోం మంత్రి అమిత్‌ షా మాట్లాడారు. తగిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.రాష్ట్ర బృందాలకు సహాయంగా కేంద్ర బృందాలను పంపమని ఆదేశాలు జారీచేశారు.ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు కూడా వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. రెండు రాష్ట్రాల్లో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ముఖ్యంగా వరినాట్లు వేసిన సమయం కావడంతో ఆరైతులు బాగా నష్టపోయారు.ఇతర వాణిజ్యపంటలకూ పెద్ద ఎత్తున నష్టం వచ్చింది. ఇక అరటి వంటి పండ్ల తోటలు, కూరగాయల పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయి.
200 గేదెలు కొట్టుకుపోయాయి
చెరువులు, వాగులకు గండ్లు పడిన చోట పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. ముఖ్యంగా కట్ట తెగిన చోట ప్రవాహ ఉధృతికి భవనాలు కొట్టుకుపోయాయి.ముందు జాగ్రత్త చర్యగా బడులకు సెలవులు ప్రకటించారు.చాలా చోట్ల ఇళ్ల డాబాలపైకి ఎక్కి కూర్చుని సమయం గడిపారు ముంపు బాధితులు.గుంటూరు జిల్లా తుళ్లూరు దగ్గర 200 గేదెలు కొట్టుకు పోయాయి. పలు చోట్ల లంక గ్రామాల్లో బాధి తులను కాపాడారు సహాయ సిబ్బంది.కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజ్‌ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.విజయవాడలో సహాయ చర్యల్లో హెలికాప్టర్లు వాడనున్నట్టు విపత్తు శాఖ ప్రకటించింది.ఇవాళ, రేపు కూడా రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓమోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
కొట్టుకుపోయిన రోడ్లు, ధ్వంసమైన రైల్వే ట్రాకులు
భారీ వర్షానికి రవాణా వ్యవస్థ కూడా స్తంభిం చింది.ముఖ్యంగా విజయవాడ,ఉత్తర దక్షిణ భారతాలను కలిపే ప్రధాన నగరం కావడంతో ఆ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.పలుచోట్ల హైవేలపై నీరు రావడంతో ట్రాఫిక్‌ ఆగిపో యింది.కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ఇక రైల్వే ట్రాకుపై నీరు చేరడంతో,పెద్ద ఎత్తున రైళ్ల మళ్లింపుతో పాటు కొన్ని రైళ్లు రద్ద య్యాయి.వరంగల్‌ దగ్గర్లోని కేసముద్రం దగ్గర ట్రాక్‌ కింద ఉన్న నిర్మాణం మొత్తం కొట్టుకు పోయింది.అనేక చోట్ల వంతెనలపై నీరు పొంగి ప్రవహించింది.తాళ్లు, క్రేన్లు, ప్రోక్లెయినర్ల సహాయంతో ప్రజలు, నీరున్న ప్రదేశాలను దాటాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.విజయవాడ -హైదరాబాద్‌ హైవేపై కూడా రాకపోకలకు ఆటంకం ఏర్పడిరది.పలుచోట్ల రైలు ప్రయాణి కులను బస్సుల్లో తరలించారు.విజయవాడ శివార్లలో రైలు ప్రయాణికులను స్టేషన్‌ బయటకు తీసుకురావడం కూడా కష్టమైంది. రైళ్లు నిలిచిపోయినచోట ఆహార పదార్థాలు అందించారు.వందకు పైగా రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. రెండు రాష్ట్రాల ఆర్టీసీలూ పెద్ద ఎత్తున బస్సులను ఆపివేశాయి.
తెలంగాణలో వర్ష బీభత్సం: ఉప్పొంగిన మున్నేరు, రైళ్లు రద్దు
తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.జనజీవనం స్తంభించింది.రోడ్లు కొట్టుకుపోయి ఏపి, తెలంగాణ మధ్య రాకపోక లకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది.పలుచోట్ల రైల్వే ట్రాక్‌లకు నష్టం కలగడంతో అధికారులు రైళ్లను దారిమళ్లించారు.భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 9మంది చనిపోయినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ తెలిపారు.ఖమ్మం జిల్లాలో మున్నేరు వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్లను రంగంలోకి దించుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుండి హెలికాప్టర్‌ను రప్పిం చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్త పరిస్థితులపై సీఎం రేవంత్‌ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు.పునరావాస,రక్షణ చర్యలపై సీనియర్‌ మంత్రులతో ఫోన్‌లో మాట్లాడి సూచనలు చేశారు.రెవెన్యూ, పోలీస్‌, పంచాయతిరాజ్‌,వైద్య ఆరోగ్యశాఖ వంటి అత్యవసర శాఖల ఉద్యోగుల సెలవులను రద్దు చేసి రంగంలోకి దించాలని, జిల్లాల్లో ఎప్పటి కప్పుడు పరిస్థితులను సమీక్షించి చర్యలు తీసు కోవాలని టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్లను ఆదేశిం చారు సీఎం.ఎంపీ,ఎమ్మెల్యేలు నియోజక వర్గాల్లోనే ఉండి పరిస్థితులను సమీక్షించాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.
జలదిగ్బంధంలో ఖమ్మం,మహబూబాబాద్‌
భారీ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉమ్మడి ఖమ్మం,వరంగల్‌ జిల్లాలపై పడిరది.ఖమ్మం పట్టణంలో మున్నేరు ఉధృతికి పలు కాలనీలు జలమయం అయ్యాయి. ప్రకాశ్‌ నగర్‌ వద్ద మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. మహబూ బాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూ సపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో వరద ప్రవా హానికి రైల్వే పట్టాలకింద కంకర కొట్టుకు పోయింది.ట్రాక్‌ దెబ్బతినడంతో ఆరూట్‌లో రైళ్ల ను నిలిపివేశారు.మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌ లో నిలిపివేసిన మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ ప్రయా ణీకులకు స్వచ్ఛంద సంస్థలు,పోలీసులు ఆహారపదార్ధాలు,నీరు అందించారు. ప్రస్తుతం ట్రాక్‌ పునరుద్ధరణ పనులు సాగుతు న్నాయి. ఏపీ, తెలంగాణలో ఏర్పడ్డ పరిస్థితులపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌ కుమార్‌ సికింద్రా బాద్‌ రైల్‌ నిలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వరద నీటిలో ఖమ్మం పట్టణం..
ఖమ్మం పట్టణాన్ని ఊహించని వరద చుట్టు ముట్టింది.మున్నేరు నది ఉధృతంగా పారు తోంది. ప్రస్తుతం 27.5అడుగుల ఎత్తులో మున్నేరు ప్రవహిస్తోంది.దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.పట్టణంలోని సగం కాలనీలు నీట మునిగాయి.ప్రకాశ్‌నగర్‌ ప్రాం తం జలదిగ్బంధంలో ఉంది. ప్రకాశ్‌ నగర్‌ బ్రిడ్జిపై తొమ్మిది మంది ఉదయం నుండి చిక్కుకుపోయారు.వారిని రక్షించేందుకు హెలి కాప్టర్‌ను రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే చీకటి పడటంలో బ్రిడ్జిపైన చిక్కుకున్న వారి భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ‘‘ఖమ్మం పట్టణం గతంలో ఎన్నడూ చూడని వరద ఇది.సగం కాలనీలు మునిగిపోయాయి. నీరు చేరని ప్రదేశం అంటూ లేదు. పట్టణం నడిబొడ్డున 5అడుగుల నీరు ప్రవహిస్తోంది. వరద అంచనా,సహాయక చర్యల్లో అధికారులు విఫలం అయ్యారు. జిల్లా నుండి ముగ్గురు మంత్రులు ఉన్నా సమయానికి హెలికాప్టర్‌ను రప్పించ లేకపోయారు’’అని తన వివరాలు వెల్లడిరచడానికి ఇష్టపడని చెప్పారు.‘‘మున్నే రుకు ప్రొటెక్షన్‌వాల్‌ నిర్మాణ పనులు నత్తనడక కొనసాగుతున్నాయి.నాలాల కబ్జా, మున్నేరు వరద ఒత్తిడితో నీరు బయటికి పోవడం లేదు.’’ అని ఆయన అన్నారు.
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పరిస్థితి
మహబూబాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది.నెక్కొండ మండలం వెంకటాపురం సమీపంలో40 మంది ప్రయాణీ కులతో ఉన్న ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకు పోగా,అధికారులు వారిని సురక్షితంగా బయ టకు తీసుకువచ్చారు.రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయకచర్యల్లో పాల్గొంటున్నారు.మరోవైపు భారీ వర్షాలతో తెలంగాణ ప్రాజెక్టుల్లోకి భారీ వరద చేరు తోంది.మేడిగడ్డ బరాజ్‌ కు 1.57లక్షల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తోంది.శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ లు 53వేల ఇన్‌ ఫ్లో వస్తుండగా ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం 80.5 టీఎంసీలకు గాను 63టీఎంసీలకు నిల్వ చేరింది.– (గునపర్తి సైమన్‌)

విభజిత ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణపదేళ్ల అభివృద్ధి..

రెండు రాష్ట్రాల అర్థికా భివృద్ధి,తలసరి ఆదాయం,ఆర్థికాభి వృద్ధిలో వివిధ జిల్లాలు,రంగాల అభివృద్ధి మధ్య వ్యత్యా సాలు,అభివృద్ధి కేంద్రీకరణ లేదా వికేం ద్రీకర ణ వైపుగా సాగుతున్నదా?ఆర్థిక వ్యవస్థలో సృష్టించబడుతున్న సంపద సమాజంలో ఉన్న అత్యధిక మంది శ్రమ జీవులకు పంపిణీ అవు తున్నదా? లేదా?వంటి కొన్ని విషయాలకు పరిమితమౌతుంది.గత దశాబ్ద కాలంలో ఆంధ్ర ప్రదేశ్‌,తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఆర్థిక వృద్ధి కనిపిస్తున్నది.ఆంధ్ర రాష్ట్రస్థూల ఉత్పతి (జిఎస్‌డిపి) అభివృద్ధి రేటు రాష్ట్ర విభజన అనంతరం టిడిపి ప్రభుత్వ ఐదేళ్ళ (2014-19)కాలంలో స్థిర ధరల్లో సగటున 9.03 శాతం అభివృద్ధి రేటు నమోదయ్యింది.ఆ తరు వాత అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్‌ సిపి ప్రభుత్వ కాలంలో అనగా 2019-24లో సగ టున 5.36శాతం చొప్పున వృద్ధి రేటు సాధిం చింది.నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం తొలి ఐదేళ్ళలో సగటున 9.03శాతం చొప్పున, ఆ తరువాత 2019-24మధ్య కాలంలో సగ టున4.66 శాతం వృద్ధిరేటు సాధించింది.గత దశాబ్ద కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో సగటున 7.34శాతం, తెలంగాణలో 6.98 శాతం వృద్ధి రేటు ఉంది.రెండు రాష్ట్రాల స్థూల ఉత్పత్తి (ఎస్‌ జిడిపి) విలువను ప్రస్తుత ధరల్లో పరిశీలిస్తే ఆంధ్ర రాష్ట్రంలో 2014-15లో రూ.5,24, 976కోట్లు ఉండగా 2023-24కి రూ.15, 40,000 కోట్లకు పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇదే కాలంలో రూ.5,05, 849 కోట్ల నుండి రూ.14,49,708 కోట్లకు పెరి గింది. దేశ జిడిపి లో ఆంధ్రరాష్ట్ర జిఎస్‌ డిపి ర్యాంకు చూస్తే 2014-15లో 8వర్యాంకు ఉండగా 2023-24లో కూడా ఇదే ర్యాంకు ఉంది. తెలంగాణ రాష్ట్రం కూడా 9వ ర్యాం కులో కొనసాగుతుంది.ఉదారవాద ఆర్థిక విధా నాలను దేశంలో ప్రవేశపెట్టిన తరువాత పాల కులు స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయాల పెరు గుదల మీద కేంద్రీకరిస్తున్నారు.వృద్ధి రేటు పెరి గితే ఆటోమేటిక్‌గా ప్రజల మధ్య అసమాన తలు తగ్గుతాయని, ఉపాధి అవకాశాలు పెరు గుతాయని భ్రమ కల్పిస్తున్నారు.వాస్తవంగా ఈ దశాబ్ద కాలంలో రెండు రాష్ట్రాలలో వృద్ధిరేటు బాగా పెరుగుతున్నా సంపద కేంద్రీకరణ, అస మానతలు తగ్గకపోగా తీవ్రంగా కొనసాగుతు న్నాయి. జిల్లాలు,వివిధ రంగాల మధ్య సంపద కేంద్రీకరణ, అసమానతలు రెండు రాష్ట్రాలలో చూడొచ్చు.ఆంధ్ర రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2021-22లో ఉమ్మడి (విభజన జిల్లాల సమాచారం అందుబాటులో లేకపోవడం వలన) 13 జిల్లా ల్లో కృష్ణా (14శాతం), విశాఖపట్నం (12 శాతం),తూర్పు గోదావరి (11శాతం),పశ్చిమ గోదావరి (10శాతం) జిల్లాల వాటా 47 శాతం ఉంది.శ్రీకాకుళం (4 శాతం),విజయ నగరం (4శాతం) జిల్లాలు అట్టడుగునే ఉన్నా యి.మిగిలిన గుంటూరు,ప్రకాశం,నెల్లూరు, చిత్తూరు,కడప,అనంతపురం,కర్నూలు జిల్లాలు రాష్ట్ర జిఎస్‌డిపిలో 5నుండి8శాతం మధ్య వాటాతో గత పదేళ్ళ నుండి కొనసాగు తున్నా యి.ఆంధ్ర రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వ్యవ సాయ, పారిశ్రామిక, సేవా రంగాల వాటాలను పరిశీ లిస్తే వ్యవసాయ రంగం వాటా రాష్ట్ర జిఎస్‌ డిపిలో2014-24 మధ్య 30.39 నుండి 36.1శాతానికి పెరుగుతూ వ్యవసాయ రాష్ట్రం గా మారుతున్నది. పారిశ్రామిక రంగం వాటా 25.17నుండి23.36 శాతానికి,సేవా రంగం వాటా44.61నుండి 40.45శాతానికి దిగ జారింది.జిడిపిలో వ్యవసాయ రంగం వాటా పెరుగుతుందంటే వ్యవసాయం మీద ఆధార పడిన ప్రజల ఆదాయాలు పెరుగుతున్నట్లుగా భావిస్తే అది పొరపాటు.వాస్తవంగా రైతాంగ ఆదాయం క్షీణిస్తున్నది.వ్యవసాయ రంగంలో ఆహార పంటల మీద 80శాతం ప్రజలు ఆధార పడి ఉంటారు.కానీ వ్యవసాయ రంగంలో ఆహార పంటల నుండి 2022-23లో కేవలం 12.31శాతం ఆదాయం మాత్రమే సమకూ రింది.పౌల్ట్రీ,పశు సంబంధిత,రొయ్యలు,చేపల నుండి ఆదాయం పెరుగుతూ నేడు 57.35 శాతానికి చేరింది.ఉద్యానవనాలను కూడా కలుపుకుంటే 85.44శాతానికి పెరుగుతుంది. అంటే వ్యవసాయ రంగంలో కేవలం కొద్ది మంది ఆధారపడిన రొయ్యలు,చేపలు,పౌల్ట్రీ, మాంసం వంటి వాటి నుండి అత్యధిక ఆదా యం వస్తున్నది.ఈ మార్పులు వ్యవసాయ రంగంలో కొద్దిమంది చేతుల్లో సంపద పోగుపడుతున్నట్లు,ఉపాధి తగ్గిపోతున్నట్లు తెలియజేస్తున్నాయి. గడిచిన తొమ్మిదేళ్ళలో ఆంధ్ర రాష్ట్రంలో జిల్లాల స్థూల ఉత్పత్తి విలు వను పరిశీలిస్తే చేపలు,రొయ్యలు,పౌల్ట్రీ ఎక్కువ గా ఉన్న జిల్లాల్లో వ్యవసాయం నుండి ఎక్కువ ఆదాయం వస్తున్నది.ఉదాహరణకు పశ్చిమ గోదావరి జిల్లాలో 56.8శాతానికి వ్యవసాయ రంగం నుండి ఆదాయం వస్తున్నది. అలాగే విజయనగరం,విశాఖ,తూర్పుగోదావరి,కృష్ణా, ప్రకాశం,నెల్లూరు జిల్లాల్లో కూడా ఈధోరణి మనకి కన్పిస్తున్నది. ఈ జిల్లాల స్థూల ఉత్పత్తి లో వ్యవసాయ రంగం నుండి 40శాతం పైన ఆదాయం వస్తున్నది.జిల్లాల స్థూల ఉత్పత్తి విలువలో పారిశ్రామిక రంగం వాటాను పరిశీ లిస్తే చాలా ఆందోళనకర పరిస్థితి కొనసాగు తున్నది. గత పదేళ్ళలో పెట్టుబడుల సదస్సులు పెట్టినా పారిశ్రామిక అభివృద్ధి కని పించడం లేదు. ప్రభుత్వ పెట్టుబడులు లేకుం డా పోయా యి. ఫలితంగా 2014-22 మధ్య కాలంలో 9 జిల్లాల్లో ఆ జిల్లాల స్థూల ఉత్పత్తిలో పారి శ్రామిక రంగం వాటా క్షీణిస్తూ వస్తున్నది. విశాఖపట్నం జిల్లాలో సైతం ఈకాలంలో 36.3నుండి 33.4శాతానికి పడిపోయింది. విజయనగరం,పశ్చిమగోదావరి,కృష్ణా, ప్రకా శం,అనంతపురం,కర్నూలులో 2021-22 నాటికి పారిశ్రామిక రంగం వాటా ఆయా జిల్లాల స్థూల ఉత్పత్తిలో 20శాతం లోపుగానే ఉంది.పశ్చిమ గోదావరి జిల్లాలో కేవలం 16.1 శాతంలోనే నేటికి కొనసాగుతుంది. సేవా రం గంలో పరిస్థితి కూడా పారిశ్రామిక రంగం వలే తొమ్మిది జిల్లాల్లో దాని వాటా తగ్గుతూ వస్తున్నది. పశ్చిమ గోదావరి జిల్లాలో 2014-22 మధ్య కాలంలో31.5నుండి 27.1శాతా నికి, కృష్ణాలో 52.2నుండి 43.3శాతానికి, నెల్లూరులో 38.6నుండి 32.9శాతానికి, చిత్తూరులో43.2 నుండి37.4శాతానికి సేవా రంగం వాటా దిగజారింది. విజయనగరం, గుంటూరు,ప్రకాశం,కర్నూలు జిల్లాల్లో సేవా రంగం వాటా గత తొమ్మిదేళ్ళలో ఎదుగు బొదుగు లేకుండా ఉంది. కేవలం విశాఖపట్నం జిల్లాలో మాత్రమే 50నుండి52.6శాతానికి పెరిగింది. ఇక తెలంగాణలో చూస్తే 2014-23మధ్య కాలంలో రాష్ట్ర జిడిపిలో వ్యవసాయ రంగం వాటా 19శాతం చుట్టూ కొనసాగు తుండగా,పారిశ్రామిక రంగంవాటా 19.2 శాతం నుండి17.3 శాతానికి తగ్గింది. పారి శ్రామిక రంగలో ముఖ్యమైన తయారీ రంగం చూస్తే రాష్ట్ర జిడిపిలో 11శాతం వాటాకి పడి పోయింది. కేవలం సేవారం గం వాటా మాత్ర మే 61.3 శాతం నుండి 62.9శాతానికి స్వల్పంగా పెరిగింది.23శాతం వాటాతో రియ ల్‌ ఎస్టేట్‌ తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నది.ఐటి రంగంపై ఆధారపడి ఈ స్పెక్యులేటివ్‌ బూమ్‌ కొనసాగుతున్నది. ఆంధ్ర రాష్ట్రం వలే తెలంగాణలో కూడా వ్యవ సాయ రంగంలో ఆహార పంటల నుండి వచ్చే ఆదాయం కంటే పౌల్ట్రీ, మాంసం, పశుసంపద నుండి వచ్చే ఆదాయం గణనీయంగా పెరుగు తున్నది.2022-23 సంవత్సరంలో వివిధ రకాల పంటల నుండి రూ.1,08,269 కోట్లు రాగా, పౌల్ట్రీ, మాంసం, పశుసంబంధిత ఆదా యం రూ.95,955 కోట్ల ఆదాయం వచ్చింది. జిల్లాల స్థూల ఉత్పత్తి పురోగతిని చూస్తే తెలం గాణ రాష్ట్రంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో వలే జిల్లాల మధ్య అసమానతలు, సంపద కేంద్రీక రణ పెరుగుతున్నట్లు తెలుస్తు న్నది. 2022-23 లెక్కలను పరిశీలిస్తే రంగా రెడ్డి,హైద రాబాద్‌,మల్కాజ్‌గిరి మూడు జిల్లాలు కలిపి 43.72శాతం రాష్ట్ర జిడిపిలో భాగస్వామ్యం ఉన్నాయి.మిగిలిన 30 జిల్లాల్లో 6వేల నుండి 15వేలకోట్ల రూపాయల లోపు 10 జిల్లాలు,15 వేల నుండి 25వేలకోట్ల రూపాయలలోపు 12 జిల్లాలు,25వేల నుండి 55 వేలకోట్ల రూపా యల లోపు 5జిల్లాలు రాష్ట్ర జిడిపిలో వాటాతో ఉన్నాయి. దీనినిబట్టి తెలం గాణలో జరుగుతు న్న అసమాన అభివృద్ధిని అర్ధం చేసుకోవచ్చు. తలసరి ఆదాయం చూస్తే రెండు రాష్ట్రాలు దేశ తలసరి ఆదాయం సగటు కంటే ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి ర్యాంకులో ఉండగా ఆంధ్ర రాష్ట్రం మాత్రం 16వ ర్యాంకులో ఉంది.తెలంగాణలో తలసరి ఆదాయం రూ.1,24, 104 నుండి రూ.3,08,732కు, ఆంధ్ర రాష్ట్రంలో రూ.93, 903 నుండి రూ.2,42, 479కు గత దశాబ్ద కాలంలో పెరిగింది. కానీ తలసరి ఆదాయం లో తెలంగాణ,ఆంధ్రా రెండిరటిలోను జిల్లాల మధ్య అసమానతలు పెరుగుతూ వస్తున్నాయి. తెలంగాణలో 2022-23లో మొత్తం 33 జిల్లా ల్లో కేవలం రెండు జిల్లాలు మాత్రమే రాష్ట్ర తల సరి ఆదాయ సగటు కంటే ఎక్కువ ఆదాయం తో ఉన్నాయి. రంగారెడ్డి రూ.7,58,102, హైదరాబాద్‌ రూ.4,02,941 తలసరి ఆదా యం ఉండగా, సంగారెడ్డి జిల్లా రాష్ట్ర సగటుకి కొంచెం తక్కువగా అనగా రూ.3,01,870గా ఉంది. మిగిలిన 30 జిల్లాలు రాష్ట్ర సగటు తల సరి ఆదాయానికి చాలా దూరంలో దిగువన ఉన్నాయి.ఆంధ్ర రాష్ట్రంలో 2021-22లో తల సరి ఆదాయం రూ.1,92,587గా ఉండగా మొత్తం ఉమ్మడి 13జిల్లాలో 5జిల్లాలు అనగా కృష్ణా (రూ.2,88,551), విశాఖపట్నం (రూ.2,64,225), పశ్చిమ గోదావరి (రూ.2,33,898), నెల్లూరు (రూ.2,12,216), తూర్పు గోదావరి (రూ.1,97,894), జిల్లాలు మాత్రమే రాష్ట్ర తలసరి ఆదాయం సగటుకి ఎగువ భాగాన ఉన్నాయి. ఈ జిల్లాల్లో కూడా కేవలం కొన్ని మండలాల్లో మాత్రమే అత్యధిక తలసరి ఆదా యం ఉంది. మిగిలిన ఏడు జిల్లాలు రాష్ట్ర సగటుకు దిగువ స్థాయిలో ఉన్నాయి. ఎప్పటి లాగే విజయనగరం (రూ.1,28,194), శ్రీకాకు ళం (రూ.1,28,820) జిల్లాలు 12,13 ర్యాంకులతో అట్టడుగునే పదేళ్ళ నుండి కొనసాగుతున్నాయి.రెండు రాష్ట్రాల్లో పాలకులు అనుసరిస్తున్న ఈఉదారవాద కార్పొరేట్‌ ఆర్థిక నమూనా వల్ల గడిచిన దశాబ్ద కాలంలో రెండు రాష్ట్రాల్లో పెరుగుతున్న స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయ అంకెలు వాస్తవాన్ని మరుగున పరుస్తున్నాయి. భవిష్యత్‌లో ఉభయ రాష్ట్రాల్లో ఆర్థిక అసమానతలు మరింత తీవ్రం కానున్నాయి. వ్యాసకర్త: జీవీఎంసీ కార్పొరేటర్‌ (ప్రజాశక్తి సౌజన్యంతో..) డా.బి.గంగారావు

నూట మూడేళ్ల జాతీయ పతాకం

దేశ భిన్నత్వంలోని ఏకత్వం, సమతా స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం.. మన మూడు రంగుల మువ్వన్నెల జాతీయపతాకం. స్వాతంత్య్ర పోరాటంలో సమరయోధుల భుజాలపై నిలిచి.. భారతీయుల ప్రతాపానికి నిదర్శనంగా నిలిచింది. ఇంతటి మహోన్నత పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య మన తెలుగుబిడ్డే అవడం.. మరింత సంతోషాన్నిచ్చే విషయం. కోట్లాది హృదయాలను ఏకంచేసిన ఆ 3 రంగుల పతాకం..నేటితో నూటమూడు సంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కథనం.
-డాక్టర్‌ దేవులపల్లి పద్మజ
రెపరెపలాడే మన త్రివర్ణ పతాకాన్ని చూస్తే.. దేశభక్తి ఉప్పొంగుతోంది. సమైక్యతారాగం నినదిస్తుంది. స్వాతంత్య్ర ఉద్యమంలో ఎన్నో మహోన్నత పోరాటాలకు ప్రతీకగా నిలిచిన ఆ జెండా రూపొందించి..నేటితో నూట మూడేళ్లు పూర్తయ్యాయి. 1921 మార్చి 31న విజయవాడలో జాతిపిత మహాత్మాగాంధీ ఆదేశాల మేరకు..పింగళి వెంకయ్య కేవలం మూడు గంటల్లోనే పతాకాన్ని రూపొందిచడం విశేషం. నగరంలోని విక్టోరియా జూబ్‌లీ మ్యూజియం సమావేశ మందిరంలో గాంధీ సమక్షంలో సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలోనే మహాత్మడు.. పింగళికి పతాక రూపకల్పన బాధ్యతలు అప్పగించారు. ఆయన తన అధ్యాపకుడు అయిన ఈరంకి వెంకట శాస్త్రి సహకారంతో కేవలం మూడు గంటల్లోనే పతాకాన్ని తయారుచేశారు.
ఎరుపు,ఆకుపచ్చ రంగులతో పాటు చరఖా అందులో ఉంది. ఆతర్వాత జరిగిన మరో సమావేశంలో గాంధీ..ఎరుపు రంగు హిందు వులకు,ఆకుపచ్చ ముస్లింలకు, తెలుపు ఇతర మతాలకు ఉండేలా పతాకన్ని మార్చాలని సూచించగా…ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు మధ్యలో రాట్నంతో జాతీయపతాకాన్ని సిద్ధం చేశారు.1931లో కరాచీలో జరిగిన కాంగ్రెస్‌ మహాసభల్లో ఈ మార్పును కాంగ్రెస్‌ జాతీయ మహాసభ ఆమోదించింది.
బీజం పడిరది అప్పుడే…
పతాక రూపకల్పనకు బీజం 1906లోనే పడిరది. 1906లో కోల్‌కతాలో 22వ అఖిల భారత కాంగ్రెస్‌ మహాసభలు నిర్వహించగా…. ప్రారంభానికి ముందు బ్రిటీష్‌ వారి పతాకమైన యూనియన్‌ జాక్‌కు గౌరవ వందనం చేయాల్సి రావడంతో పింగళి కలత చెందారు. ఈ క్షణం లోనే మనకు ప్రత్యేక జెండా ఎందుకు ఉండ కూడదనే ప్రశ్న ఆయన మదిలో మెదిలింది. ఆ సభలోనే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా..ఆయనను కాంగ్రెస్‌ విషయ నిర్ణయ సమితి సభ్యుడిగా నియమించారు. తర్వాత పతాక ఆవశ్యకతను వివరిస్తూ వెంకయ్య దేశవ్యాప్తంగా పర్యటించారు.ఆతర్వాత జాతీయ పతాకానికి,పార్టీ జెండాకు వ్యత్యాసం ఉండా లని..1947జులై 22న ప్రకటించిన ప్రకారం జాతీయపతాకంలో కాషాయం,తెలుపు, ముదు రు ఆకుపచ్చ రంగుల పట్టీలతో..మధ్యలో నీలిరంగులో అశోకచక్రాన్ని ముద్రించారు. వెంకయ్య తన 19వ సంవత్సర వయ స్సులో దేశం విదేశే పరిపాలనలో నలిగిపో వటం భరించలేక సైన్యంలో చేరిబోయర్‌ యుద్ధంలో ఉత్సాహంగా ల్గొన్నారు. దక్షిణాఫ్రికాలో ఉండ గానే మహాత్మాగాంధీని కలవటం జరిగింది. వారి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం అర్ధ శతాబ్దంపాటు నిలిచింది.అప్పటినుంచి జాతీయజెండా ఎలావుండాలనే సమస్యనే ప్రధానంగా దేశంలో ప్రచారం ప్రారంభిం చాడు.1913నుండి ప్రతి కాంగ్రేసు సమావేశానికి హాజరై, నాయకులందరితోనూ జాతీయపతాక రూపకల్పనపై చర్చలు జరిపేవారు. 1916లో ‘‘భారతదేశానికి జాతీయజెండా‘‘ అనే పుస్తకాన్ని ఆంగ్లంలో వ్రాసి ప్రచురించారు.ఈ గ్రంధానికి అప్పటి వైస్రాయ్‌ కార్యనిర్వాహక సభ్యుడ్కెన కేంద్ర మంత్రి సర్‌ బి.యన్‌. శర్మ ఉత్తేజకరమైన ముందు మాట వ్రాసారు.
త్రివర్ణపతాకావిష్కరణ :- 1906లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రేసు సమా వేశంలో పింగళి తయారుచేసిన జాతీయ జెండానే ఎగురవేశారు.1919లో జలంధర్‌ వాస్తవ్యుడ్కెన లాలా హన్స్‌ రాజ్‌ మన జాతీయ పతాకంపై రాట్నం చిహ్నం వుంటే బాగుంటుం దని సూచించగా గాంధీ దానిని సమర్ధించారు. 1921లోభారత కాంగ్రేసు సమావేశాలు బెజ వాడలో జరిగాయి. గాంధీజీ వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం,ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్య రాట్నంగల ఒకజెం డాను చిత్రించమని కోరగా,ఒక జెండాను సమ కూర్చారు పింగళిగారు.అనంతరం వచ్చిన ఆలోచనల మేరకు సత్యం,అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపురంగు కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడగా, వెంకయ్య ఆ జెం డాలో అదనంగా తెలుపురంగును చేర్చి, నేటి మన త్రివర్ణ పతాకాన్ని రూపొందించి దేశానికి కానుకగా ఇచ్చాడు.మన తెలుగువారి చేత,మన తెలుగుదేశంలోనే,భారత దేశానికి త్రివర్ణ పతాక రూపకల్పన చేయబడి దేశమంతా విజయకే తనం ఎగురవేయబడుతోంది.మధ్యనున్న రాట్నం గ్రామ జీవనాన్ని,రైతు,కార్మిక త్యా గాన్ని తెలియచేస్తుంది.కార్మిక,కర్షకులపై ఆధార పడిన భారతదేశం సత్యము మరియు అహిం సలను ఆచరించడంతో సుభిక్షంగా ఉంటుందనే ఆశయ చిహ్మమే త్రివర్ణపతాకం.1947 జూల్కె 22వ తేదీన జరిగిన సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ, మును పటి త్రివర్ణ పతాకంలోని రాట్నం స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా అమర్చారు. చిహ్నం మార్పు తప్పితే, వెంకయ్య రూపొందిం చిన జెండాకు,నేటి జెండాకు తేడా ఏమీలేదు. అశోకుని ధర్మచక్రం మన సంస్కృతికి సంకేతం. ఈ పతాక రూపకల్పనకు పింగళి ఎంతో కృషి చేశారు. ఒకజాతికి,ఆ జాతి నిర్వ హించే ఉద్యమానికి ఒక పతాకం అవసరమన్న గొప్ప వాస్తవం వెంకయ్యకు 1906లోనే కలి గిన ఆలోచన. దానికి కారణం కలకత్తాలో జరిగిన కాంగ్రేసు సభలు.పింగళి 1918 మొదలు 1921వరకు ఎంతో పరిశోధన చేసి 30దేశాల పతాకాలను సేకరించారు. వాటిపై అవగాహన కలిగిన తరువాత 1918 మొదలు 1921వరుకు జరిగిన సభలలో పతాక విష యం ప్రస్థావన తెస్తూనే ఉన్నారు. పతాకానికి చెడుని విధ్వంసం చేసి ఉత్తేజాన్ని కలిగించే శక్తి ఉన్నది.బ్రిటిష్‌ వారు వారి జెండా యూనియన్‌ జాక్‌ను, ఎగురవేయగా అది వారికి అనంత మైన ప్రేరణను ఇచ్చేది. అదే విధంగా మన త్రివర్ణపతాకం కూడా భారతీయులకు స్ఫూర్తి నింపాలని 22 జూల్కె 1947న జాతీయ పతా కంగా భారతజాతి స్వీకరించింది.అందుకే పింగళి వెంకయ్యను,జెండా వెంకయ్య అని కూడా పిలిచేవారు. ఈ పతాక రూపకల్పనకు మేడమ్‌ బ్కెకాజీ కామా,అనిబిసెంటు,సిస్టర్‌ నివేదిత కూడా ప్రయత్నించారు.కానీ సఫలం కాలేదు.దీక్షాతత్పరుల్కెన పింగళి వెంకయ్యని ఆ వరం వరించింది.యంగ్‌ ఇండియా పత్రికలో గాంధీజీ వ్రాసిన ‘‘మన జాతీయ పతాకం‘‘శీర్షికలో పింగళి వెంకయ్య తపన, కృషి, దీక్ష, పతాక రూపకల్పనలో వారు తీసుకున్న శ్రద్ధ గూర్చి వివరంగా వ్రాసారు. పతాక రూపశిల్పి వెంకయ్యను,పత్తి వెంకయ్య, డ్కెమండ్‌ వెంకయ్య, జపాను వెంకయ్య,జెండా వెంకయ్య అను వివిధ నామాలతో పిలుస్తూ గౌరవించుకునేవారు మన భారతీయులు. అన్య దేశాలలో పతాక రూపకర్తలకు స్వర్ణ విగ్రహా విష్కరణలతో కృతజ్ఞతలు తెలియచేస్తారు. వారు కేవలం పతాక రూపకర్తలేకాదు, వారు భారతసైనికులుగా రక్షణ విభాగంలో పని చేసారు. విద్యారంగంలో అధ్యాపకులుగా సేవలందించారు.శాస్త్రవేత్తగా పరిశోధనలు చేశారు. వ్యవసాయదారుడుగా పత్తి పండిర చారు.రచయితగా అనేక రచనలు చేశారు. అభ్రకంపై పరిశోధనలు చేసి వజ్ర కరూరు, హంపీలలో ఖనిజాలు,వజ్రాల గురించి ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను తెలియచేస్తూ ‘‘వజ్రపు తల్లిరాయి‘‘ అనే గ్రంధం వ్రాసి ప్రచురించారు. స్వాతంత్య్ర భారత దేశంలో ఖనిజ పరిశోధక శాఖ సలహాదా రునిగా 1960 వరకు సేవలు అందించారు. విధ్యార్థులలో దేశభక్తి కలిగిస్తూ, గుర్రపుస్వారీ, వ్యాయామం,సైనిక శిక్షణ ఇచ్చేవారు. చ్కెనా జాతీయ నాయకుడ్కెన ‘‘సన్‌ యత్‌ సేన్‌‘‘జీవిత చరిత్ర వ్రాసారు.మనకు అనేక సేవలు అందిం చిన ఆ మహాత్ముడు 4జూలై 1963లో శాశ్వ తంగా దూరమైపోయారు. అయితే ఆయన తెలియచేసిన తన చివరికోరిక ‘‘నాఅంత్యదశ సమీపించింది.నేను చనిపోయిన తరువాత త్రివర్ణపతాకాన్ని నాభౌతిక కాయంపై కప్పండి.శ్మశానానికి చేరిన తరువాత,ఆపతాకం తీసి అక్కడ ఉన్న రావిచెట్టుకు కట్టండి.ఇది నా తుది కోరిక‘‘ అని తెలియచేసారు. జాతీయ పతాకం ఎగురుతున్నంతవరకు గౌరవంగా స్మరించుకోవలసిన పింగళి వెంకయ్య నిస్వార్థ దేశభక్తులు.నిరాడంబరమైన జీవితం గడిపిన మహా మనీషి. ఆయనను ప్రజలు సదా స్మరించుకోవలసిన అవసరాన్ని తెలియచేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హైదరాబాదు ట్యాంకు బండుపై వారి కాంస్యవిగ్రహాన్ని ప్రతిష్టింపచేసి వారి దర్శన భాగ్యం నిత్యం ప్రజలకు కలిగిం చారు.పింగళిగారి స్మృత్యర్థం విజయవాడ లో3ఫిబ్రవరి 2008న తిరంగా పరుగును నిర్వహించారు. సుమారు లక్షమంది ఈ పరు గులో స్వచ్ఛందంగా పాల్గొన్నారు.మన దేశ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకి వందనాలర్పిస్తూ,దేశ ప్రజలకు 77వ స్వాతం త్య్రదినోత్సవ శుభాకాంక్షలు.
వ్యాసకర్త :ప్రముఖ సాహితి సాహితి రత్న,విశాఖపట్టణం,ఫోను 9849692414

రాజకీయ తీర్పులు తర్వాత రాజ్యాంగ తీర్పులు

లోక్‌సభకూ ఎ.పి తో సహా నాలుగు శాసనసభలకూ ఎన్నికలు ముగిసి కొత్త ప్రభు త్వాలు కొలువు తీరాయి.అప్రతిహతంగా సాగి పోతుందను కున్న నరేంద్ర మోడీ హవాకు బ్రేకులు వేశారు ఓటర్లు. మిశ్రమ కూటమిగానే ఆయన అధికారం చేపట్ట వలసి వచ్చింది. మోడీ సర్కారు ఏకపక్ష పోకడలకు ఇకనైనా కొంత పగ్గాలు పడతా యని ప్రజాస్వామిక లౌకిక వాదులు ఎదురు చూస్తున్నారు. ప్రజా న్యాయ స్థానంలో పరిస్థితి ఇదైతే రాజ్యాంగ న్యాయస్థానాల్లో అంటే న్యాయ వ్యవస్థలో ఏమైనా మార్పులు రావడా నికి ఇది దారితీస్తుందా అనే చర్చ న్యాయవర్గాల్లో సాగుతున్నది. ఎందుకంటే సంపూర్ణమైన ఆధిక్యత లేదంటే అంతకు మించిన సంఖ్యాబలం కలిగిన ఏక పార్టీ ప్రభుత్వాలు వున్నప్పుడు న్యాయవ్యవస్థ ఒకింత ఆలోచించి అడుగు వేస్తుందనేది ఇన్నేళ్ల అనుభవం. నిజానికి రాజ్యాంగం న్యాయ వ్యవస్థకు పూర్తి స్వయంప్రతిపత్తి ఇచ్చినప్పటికీ రాజకీయ వాస్తవాలు దృష్టిలో పెట్టుకుని ఇలా జరుగుతుంటుందని అంటుంటారు.
వివాదాలు, ఆరోపణలు
రాజ్యాంగ సంబంధమైన అంశా లలో కూడా సుప్రీం కోర్టు తీర్పులు, ఆదేశాలు, ఆలస్యాలు రకరకాల వ్యాఖ్యలకు విమర్శలకు దారితీశాయి.తెలుగు రాష్ట్రాలలోనూ వేర్వేరు ప్రభుత్వాలు,ముఖ్యమంత్రులు తమ తమ అను కూలతలను బట్టి కోర్టులపై వ్యాఖ్యలు చేయడం తెలిసిన విషయమే.కేరళ,పశ్చిమబెంగాల్‌, కర్ణా టక,ఢల్లీి,మహారాష్ట్ర,గుజరాత్‌,ఉత్తరప్రదేశ్‌, తమి ళనాడు వంటి రాష్ట్రాలలోనూ కోర్టులపై వివాదా స్పద సన్నివేశాలు చూశాం. 1991-1996 మధ్య కాంగ్రెస్‌ మెజార్టీ కోల్పోయిన పరిస్థితి. తర్వాత యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం వున్నప్పుడే న్యాయ వ్యవస్థ క్రియాశీలత వంటి పదాలు ఎక్కువగా వాడుకలోకి వచ్చాయి. మాజీ ప్రధాని పి.వి.నర సింహారావును కూడా విచారించిన ఘట్టం అప్పుడే చూశాం. మళ్లీ 2004-14మధ్య మన్మోహన్‌ సింగ్‌ హయాంలో మరీ ముఖ్యంగా మలి దఫా పాలనలో 2జి స్ప్రెక్ట్రం,బొగ్గు గనుల వేలం,కామన్‌వెల్త్‌ క్రీడ లు ప్రతిదీ సుప్రీం కోర్టు ముందుకు రావడం దేశ రాజకీయాలపై ఎంతో ప్రభావం చూపింది. అదే మోడీ హయాంలో రాఫెల్‌ కుంభకోణం వంటివి కూడా కోర్టులలో తేలిపోయాయి. అయోధ్య తీర్పు, శబరిమల వివాదం,కాశ్మీర్‌ 370అధికరణం ప్రతి పత్తి, పౌరసత్వ సవరణ చట్టం, ఇవిఎంలు, ఎన్ని కల బాండ్లు ఇంకా అనేక అంశాల్లో అత్యున్నత న్యాయస్థానం తీరు అసంతృప్తి మిగిల్చింది. రాజ కీయ నేతలు,మీడియా ప్రముఖులు,సామాజిక కార్యకర్తలు, ఆఖరుకు ముఖ్యమంత్రుల వంటి వారిపై కేసులలోనూ భిన్న ప్రమాణాలు పాటించ డం ప్రశ్నార్థకమైంది.సుప్రీంకోర్టు ప్రధాన నాయ మూర్తులు,ఇతర న్యాయమూర్తులు కూడా పదవు లలో పునరావాసం పొందిన తీరు మరో వివాద మైంది.ఈ నేపథ్యంలో బిజెపికి స్వంతంగా మెజార్టీ లేని ప్రస్తుత పరిస్థితి న్యాయవ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?ఇది ఇప్పుడు, అనేక మంది ని ఆలోచింపచేస్తున్న అంశం. సుప్రీంకోర్టు న్యాయ మూర్తిగా పనిచేసిన జస్టిస్‌ సంజరు కిషన్‌ కౌల్‌ స్వయంగా ఈ మాటన్నారు. బలమైన కార్యని ర్వాహక వర్గం (ఎగ్జిక్యూటివ్‌) వుంటే న్యాయ వ్యవస్థ గట్టి వైఖరితీసుకోవడానికి కాస్త తటపటా యిస్తుందని ఆయన అన్నారు.
సిజెఐ చంద్రచూడ్‌ వ్యాఖ్యలు
సిజెఐ చంద్రచూడ్‌ పదవీ కాలం ఈ నవంబర్‌ నెలతో ముగుస్తుంది.ఇటీవలి కాలంలో అత్యధిక కాలం పదవిలో వుంటున్న సిజెఐ ఆయనే. స్వలింగ వివాహాల వంటి సామా జి కాంశాల్లో సంచలన తీర్పులకు ఆధ్వర్యం వహించిన సిజెఐ చంద్రచూడ్‌ రాజకీయ రాజ్యాంగ అంశాల్లో ఒక విధంగా%ౌ%మిశ్రమ వ్యాఖ్యలే మూటకట్టుకున్నారు. ఎన్నికల బాండ్లపై వెలువడిన తీర్పు ఇటీవలి కాలంలో ప్రత్యేకించి చెప్పుకోవాలి. నవంబర్‌ రెండవ వారంలో పదవీ విరమణ చేసే ముందు ఆయన ఆరు రాజ్యాంగ సమస్యలపైతీర్పులు ఇవ్వాల్సి వుంటుంది. సిజెఐ తో కూడిన రాజ్యాంగ ధర్మాసనాల ముందున్న తీర్పులు వాయిదా పడితే మళ్లీ కొత్త వారు రావ డం,వీటిని పునర్వ్యవస్థీకరించడం పెద్ద ప్రక్రియ. ఆలస్యానికి దారితీయొచ్చు. అందుకే వేగంగా పూర్తి చేస్తుంటారు.
ఎస్‌.సి, ఎస్‌.టి మైనార్టీ ప్రతిపత్తి
రాజ్యాంగం 16వ అధికరణం కింద వున్న ఎస్‌.సి, ఎస్‌.టి రిజర్వేషన్లలో వర్గీక రణ ఉప వర్గీకరణ చెల్లుతుందా అనే అంశాన్ని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఫిబ్రవరిలో విచా రించింది.2010లో పంజాబ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు 2004 ఎ.పి వర్గీకరణ అంశంలో ఇచ్చిన తీర్పుతర్వాత పంజాబ్‌ విధా నం అమలు కాకుండా పోయింది. అయితే ఈ విధంగా కొట్టివేయడం ఇందిరా సహానీ కేసులో 1992లో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుకు విరుద్ధమని పంజాబ్‌ వాదిస్తున్నది. ఆ కేసు తర్వాత చిన్నయ్య కేసులో సుప్రీం కోర్టు ఉప వర్గీకరణ కుదరదని చెప్పింది. ఇప్పుడు దీనిపై తుది తీర్పు వెలువడవలసి వుంది.
ప్రతిష్టాత్మక అలీగఢ్‌ ముస్లిం యూని వర్సిటీ (ఎ.ఎం.యు) రాజ్యాంగం 30వ అధిక రణం ప్రకారం మైనార్టీ సంస్థ కిందకు వస్తుందా లేదా అనే అంశంలోనూ సుప్రీంకోర్టు తీర్పు వెలు వరించాల్సి వుంది.2006లో అలహాబాద్‌ హైకోర్టు మైనార్టీ ప్రతిపత్తి కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పును ఎ.ఎం.యు సుప్రీంలో సవాలు చేసింది. తమ మైనార్టీ ప్రతిపత్తికి ముప్పు తెచ్చేలా ఎ.ఎం.యు చట్టానికి చేసిన వివిధ సవరణలు చెల్లవని వాదిం చింది. అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రంజన్‌ గొగోరు సిజెఐగా వుండ గా ఈ కేసును ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మా సనానికి అప్పగించారు.ఫిబ్రవరిలో ఈ కేసు విచా రణ ముగించిన ధర్మాసనం తీర్పు రిజర్వులో వుంచింది.ఈకేసులో తీర్పు దేశవ్యాపితంగా మైనార్టీ సంస్థల హక్కులకు సంబంధించి చాలా ప్రభావం చూపనుంది.
ఆస్తుల పున:పంపిణీ తప్పా?
మూడో కేసుకు మరింత కీలకమైన రాజకీయ ప్రాధాన్యత వుంది. నిజానికి ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో దాన్ని వివాదాస్పదం చేశారు కూడా. సంపద పున:పంపిణీ జరగాలన్న రాజ్యాంగ నిర్దేశాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఒక దశలో మతం రంగు కూడా పులిమా రు. వాస్తవం ఏమంటే రాజ్యాంగం 39వ అధికర ణం సమాజ భౌతిక వనరులను సమిష్టి ప్రయో జనం కోసం ఉపయోగించాలని చెబుతున్నది. సమాజ భౌతిక వనరులను ఉమ్మడి ప్రయోజనం కోసం పున:పంపిణీ చేయాలని ఈ అధికరణం(బి) పేర్కొంటున్నది. అయితే వ్యక్తిగత ఆస్తిని సమాజా నికి చెందిన భౌతిక సంపదగా పరిగణించవచ్చునా అనే అంశంపై సుప్రీంకోర్టులో అనేక కేసులు దాఖలయ్యాయి. ముంబయిలోని ఆస్తియజమా నుల సంఘం పేరుతో20 వేలమంది భూయజ మానులు 1991లో మొదటి పిటిషన్‌ వేశారు. కొన్ని ఆస్తులను తీసుకోవచ్చునని మహారాష్ట్ర శాసనసభ చేసిన సవరణను వారు సవాల్‌ చేశారు. ఇదిలా వుండగానే 2019లో మళ్లీ మహారాష్ట్ర ప్రభుత్వమే గృహ చట్టానికి సవరణ చేస్తూ నిర్ణీత గడువు లోపల ఆస్తి యజమానులు గనక ఆస్తిని పునరుద్ధరించకపోతే ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకోవచ్చని నిర్ణయించింది.ఈ సవరణవల్ల నివాస గృహ సముదాయాలను హస్తగతం చేసు కోవడానికి మహారాష్ట్ర భవన మరమ్మతులు పునరు ద్ధరణ బోర్డుకు నిర్నిబంధమైన అధికారాలు సంక్రమిస్తాయంటూ వారు ఆరోపించారు. ప్రైవేటు ఆస్తులు నిజంగా39(ఎ) అధికరణం కింద పున: పంపిణీ చేయడానికి అవకాశం వుంటుందా అనే అంశంపై ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాల్సి వుంది. ఇక్కడ మౌలికమైన అంశం ఏమంటే రాజ్యాంగం సంక్షేమరాజ్య భావనలో ఆర్థిక అసమానతల తొలగింపు కీలకాంశం. మోడీ వంటి వారు మాత్రం ఇదేదో వ్యక్తి గత ఆస్తి హక్కుకు భంగకరమన్నట్టు ప్రచారం చేసి అదరగొట్టడానికి ప్రయత్నించారు. మన దేశంలో కూడా ఇటీవలి వరకూ ఈ సంపద పన్ను, వారసత్వ ఆస్తి పన్ను వుండేవి. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ముంబయి కేసుకే గాక దేశ విధానాలకే గీటురాయి కానుంది.
గనులు, ఆల్కహాలు
ఇక మిగిలిన రెండు రాజ్యాంగ కేసులు రాష్ట్ర కేంద్ర హక్కులకు ఆదాయాలకు సంబంధిం చినవి.పారిశ్రామిక ఆల్కహాలు,మద్యపానం ఆల్క హాలు పరిధి గురించిన చర్చ ఇది. పారిశ్రామిక ఆల్కహాలుపై నియంత్రణ ఎవరిదనేది ప్రశ్న, ఇవి రెండూ స్పిరిట్‌ నుంచే తయారవుతాయి. మరిన్ని రసాయన ప్రక్రియల తర్వాత అది పారిశ్రామిక ఆల్కహాలుగా మారుతుంది. ఏడవ షెడ్యూలులో ఈ రెంటినీ వుంచడం పరస్పర విరుద్ధ వ్యాఖ్యానా లకు దారితీస్తున్నది. ప్రజా క్షేమం రీత్యా పరిశ్ర మలపై నియంత్రణ కలిగివుండే హక్కు కేంద్రానికి వుంది. మరోవైపున ప్రజల ఆరోగ్యానికి భంగం కలిగించే విష పదార్థాలను నియంత్రణ రాష్ట్ర అధికారంగా వుంది.దాంతో ఎవరు అదుపు చేయా లనేదానిపై వివాదం కొనసాగుతున్నది. సిజెఐ చంద్రచూడ్‌ ధర్మాసనం దీన్ని విచారించి తేల్చ వలసి వుంది.గనుల నుంచి లోహాల తవ్వకంపై చెల్లించే రాయల్టీ పన్ను కిందకు వస్తుందా అనేది కూడా25 ఏళ్ల కాలంగా వివాదంగా వుంది.గనులు లోహాల చట్టం సెక్షన్‌9 వాటిని తవ్వుకునేవారు కేంద్రానికి రాయల్టీ చెల్లించాలని నిర్దేశిస్తుంది. దాన్ని గనక పన్నుగా పరిగణించేట్టయితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అదనపు పన్ను విధించవచ్చు. 1963లో తమిళనాడు ప్రభుత్వం ఇండియా సిమెంట్స్‌పై రాయల్టీగాక అదనపు పన్ను విధించడంతో ఈ వివాదం మొదలైంది. దాని మీద వరసగా విచారణలు జరిపిన అనంతరం 1989లో సుప్రీంకోర్టు రాయల్టీ ఒక పన్ను అని నిర్ధారించింది. ఈ నిర్ణయం గనుల కాంట్రాక్టర్లకు పారిశ్రామిక వేత్తలకు మింగుడు పడలేదు.వారు అనేక హైకోర్టులలోనూ సుప్రీం లోనూ సవాలు చేయగా అదేదో అనుకోకుండా జరిగిన అచ్చు తప్పు వంటిదని అభిప్రాయం వెలిబుచ్చాయి. అదనపు పన్నును గురించి మాత్రమే కోర్టు పరిశీ లించింది తప్ప రాయల్టీని ఉద్దేశించి తీర్పు చెప్ప లేదని వివిధ కోర్టులు వ్యాఖ్యానించాయి. ఇది పన్ను అని తేలిస్తే రాష్ట్రాలు దాన్ని పెంచి ఆదాయం పెంచుకోవడానికి వీలవుతుంది. అసలే వనరుల కొరతతో ఇబ్బంది పడే రాష్ట్ర ప్రభుత్వాలకు కాస్త వెసులుబాటు దక్కుతుంది. కొంతకాలం కిందట దీనిపై విచారణ జరిపిన తొమ్మిది మంది ధర్మాస నం తీర్పు రిజర్వు చేసి వుంచింది.
మరింత జఠిలం
వీటన్నిటిపై ప్రజాస్వామిక పరిష్కా రాలు వస్తాయా అని ఎదురు చూస్తుంటే పులి మీద పుట్రలా కొత్త వివాదాలు బయలుదేరాయి. ఢల్లీి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను లిక్కర్‌ కేసులో కింద కోర్టు బెయిలుపై విడుదల చేస్తే ఢల్లీి హైకోర్టు విడుదల ఆపింది. కానీ పోస్కో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎడియూరప్పను అరెస్టు చేయాలని కింద కోర్టు ఉత్తర్వులిస్తే మాజీ ముఖ్య మంత్రి విషయంలో అలా ఎలా చెప్తారని హైకోర్టు ఆపేసింది. ఈ ద్వంద్వ నీతిని న్యాయ నిపుణులు తీవ్రంగా ప్రశ్నించారు. లోక్‌సభ ఫలితాలు వచ్చా కనే ఢల్లీి లెఫ్టినెంట్‌ గవర్నర్‌%ౌ%ప్రముఖ రచ యిత్రి అరుంధతీ రారుపై రాజద్రోహ నేరారోపణ విచారణ జరపాలని అనుమతినివ్వడం కూడా నిరసనకు గురైంది. నేర చట్టాలను ఇష్టానుసారం మార్చి అమలుకోసం హడావుడి పడటం కూడా ఆక్షేపణకు దారి తీస్తున్నది. అందుకే రానున్న రోజుల్లో ఈ అంశాలు దేశంలో మరింత చర్చనీయం కానున్నాయి. కార్యాచరణకూ దారితీస్తాయి.
(వ్యాసకర్త : సీనియర్‌ పాత్రికేయులు ప్రజాశక్తి సౌజన్యంతో..)

కొత్త న్యాయ చట్టాలు`మార్పులు ఇవే

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌.అత్యధిక జనాభా ఉన్న దేశం కూడా.అలాంటి దేశంలో న్యాయవ్యవస్థ కూడా అత్యంత పక్బడందీగా ఉండాలి.కానీ,మన దేశంలో ఇంరా శతాబ్ద కాలంనాటి బ్రిటీష్‌ చట్టాలే దిక్కయ్యాయి.తాము న్యాయవ్యవస్థను ప్రక్షాళన చేస్తామని చెప్పిన..భాజపా ప్రభుత్వం అనుకు న్నట్లుగానే గతేడాది ఆగస్టులో 3న్యాయ చట్టాలను తీసుకొచ్చి మార్పునకు నాంది పలికింది.కీలకమైన ఐపీసీ, సీఆర్‌పీసీ,ఐఈఏ లాంటి పాత చట్టాలకు పాతరేస్తూ న్యాయ సంహిత,నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలను తీసు కొచ్చింది. వీటికి లోక్‌సభ ఆమోదం కూడా లభించడంతో..జూలై1నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్నాయి. మరి,ఆ కొత్త చట్టాలు ఏంటీ? ముఖ్యంగా జీరో ఎఫ్‌ఐఆర్‌,దేశద్రోహం చట్టాలు లాంటి చట్టాల్లో వచ్చిన మార్పులేంటి పరిశీలిద్దాం.-(గునపర్తి సైమన్‌)
బ్రిటీష్‌ కాలంనాటి చట్టాలకు తెరప డిరది.భారత న్యాయవ్యవస్థలో మూడు కొత్త నేర చట్టాలు భారతీయ న్యాయ సంహిత,భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం జూలైనెల నుంచి అమల్లోకి వచ్చాయి.భారత శిక్షా స్మృతి(ఐపీసీ) కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ (సీఆర్‌పీసీ),భారత సాక్ష్యాధర చట్టాల చరిత్ర గత నెలాఖరు అర్ధరాత్రితో ముగిసింది.కొత్త చట్టాలతో జీరో ఎఫ్‌ఐఆర్‌,ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం,ఎస్‌ఎంఎస్‌ వంటి ఎలక్ట్రానిక్‌ పద్దతిలో సమన్లు పంపడం,హేయమైన నేరాలకు సంబంధించిన క్రైమ్‌ సీన్లను తప్పనిసరి వీడియోల్లో బంధించడం వంటి ఆధునిక పద్దతులను న్యాయవ్యవస్థలో రానున్నాయి.ఆనాటిచట్టాల మా దిరిగా శిక్షకాకుండా,న్యాయం అందిం చేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్రహోం మంత్రి అమిత్‌ షా వెల్లడిరచారు.చట్టాల పేరు మాత్రమే కాదు.. వాటి సవరణలు పూర్తి భారతీయ ఆత్మతో రూపొం దించారు. కొత్త చట్టాలు రాజకీయ,ఆర్ధిక, సామాజిక న్యాయాన్నీ అందించనున్నాయి.
ా భారతీయ శిక్షాస్మృతిలోని రాజద్రోహాన్ని ఇప్పుడు దేశద్రోహంగా మార్చారు. కులం, మతం వంటి కారణాలతో సామూహిక దాడు లు,హత్యకు పాల్పడితే ఐపీసీ ప్రకారం ఏడేళ్ల శిక్షపడుతుంది.దీనిప్పుడు యూవజ్జీవంగా మార్చారు.హేయమైన నేరాలకు సంబంధిం చిన క్రైమ్‌సీన్ల వీడియో చిత్రీకరణ తప్పనిసరి చేశారు.
ా నకిలీనోట్ల తయారీ,వాటి స్మగ్లింగ్‌ ఉగ్రవాదం పరిధిలోకి వస్తుంది.విదేశాల్లో మన ఆస్తులు ధ్వంసాన్ని ఉగ్రవాదంగా నిర్వహించారు. డిమాండ్ల సాధనకు వ్యక్తులను బంధించడం, కిడ్నాప్‌ చేయడాన్ని ఉగ్రవాదం పరిధిలోకి చేర్చారు.
ా మహిళలు,పిల్లలపై నేరాలపై కొత్త అధ్యా యాన్ని జోడిరచారు.పిల్లల్ని కొనడం, అమ్మ డం,ఘోరమైన నేరంగా మార్చారు.మైనర్‌పై సామూహిక అత్యాచారానికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు నిబంధన తెచ్చారు.పెళ్లి చేసుకుం టానన్న తప్పుడు వాగ్ధానాలతో లైంగిక సంబం ధాలు పెట్టుకుని మహిళలను వదిలేయడం వంటి కేసులకు కొత్తనిబంధన పెట్టారు. మహి ళలు,పిల్లలపై నేరాల్లో బాధితులకు అన్ని ఆస్పత్రుల్లో ప్రధమ చికిత్స లేదా ఉచిత వైద్యం అందించాలి. మహిళలు,15ఏళ్లలోపు, 60ఏళ్లు పైబడిన వ్యక్తులు,వికలాంగులు, తీవ్రమైన అనారో గ్యంతో బాధపడుతున్న వారు ఇంటినుంచే పోలీసు సాయం పొంద వచ్చు.కోర్టు అనుమతి లేకుండా లైకింక దాడి గురించి ప్రచురిస్తే రెండేళ్ల జైలు శిక్ష,జరి మానా నిబంధనన చేర్చారు.
ా కొత్త చట్టాల ప్రకారం ఫిర్యాదుల నుంచి సమన్లదాకా అన్నీ ఆన్‌లైన్‌లో జరగను న్నాయి.పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లే పనిలేకుండా ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.ఎస్‌ఎంఎస్‌ ద్వారా కూడా సమన్లు పంపవచ్చు.పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్‌ స్టేషన్‌లో అయినా ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసే జీరో ఎఫ్‌ఐఆర్‌ విధానం ప్రవేశపెట్టారు. అరెస్టయిన వ్యక్తి కుటుంబా నికి,స్నేహితులకు సమాచారాన్ని పంచుకునే వీలు కల్పించడంతో పాటు వివరాలను పోలీస్‌స్టేషన్‌లో ప్రదర్శి స్తారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్‌ చట్టాలు ఆదివారం అర్ధరాత్రి (జులై1,2024) నుంచి అమల్లోకి వచ్చాయి. ఇంతకుముందున్న ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ),కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ (సీఆర్‌ పీసీ),ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్టుల స్థానంలో వీటిని తీసుచ్చారు.
తొలుత 2023ఆగస్టులో వీటికి సంబంధించిన బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అనం తరం వీటిని పార్లమెంట్‌ స్టాండిరగ్‌ కమిటీకి పం పించగా,కమిటీ సూచించిన మార్పులను చేర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆబిల్లులను వెనక్కి తీసు కుంది.మార్పులు చేర్పుల తరువాత పార్లమెంటులో దీనిపైచర్చ జరిగి ఆమోదం దక్కింది. దాంతో ఆ బిల్లులు చట్టరూపం దాల్చాయి.
ఈ కొత్త చట్టాలతో భారత న్యాయవ్యవస్థ, నేర విచారణ విధానాలలో కొత్త మార్పులు వస్తున్నాయి. జీరో ఎఫ్‌ఐఆర్‌,పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండా ఆన్‌ లైన్‌లో ఫిర్యాదు చేయగలిగే అవకాశం, ఎలక్ట్రానిక్‌ మోడ్‌లో సమన్ల జారీ వంటి మార్పులను ఈ కొత్త చట్టాలు తీసుకొచ్చాయి. డిజిటల్‌ పోలీస్‌ సిటిజన్‌ సర్వీసెస్‌ కింద క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ అండ్‌ సిస్టమ్స్‌ ద్వారా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండానే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయొచ్చు.
ఏమేం మారుతున్నాయి?
క్రిమినల్‌ కేసులకు సంబంధించి మొదటి విచారణ జరిగిన 60రోజుల్లోపు చార్జ్‌షీట్‌ దాఖలు చేయాలి. క్రిమినల్‌ కేసులలో విచారణ పూర్తయిన 45 రోజు లలోగా తీర్పు వెలువడాలి. కొత్త చట్టాలలో రాజ ద్రోహం అనే పదాన్ని తొలగించారు. అదే సమ యంలో దేశ సార్వభౌమత్వం,సమగ్రతలకు భంగం కలిగించే కార్యకలాపాలను శిక్షార్హమైన జాబితాలో చేర్చారు. చిన్నారులపై సామూహిక అత్యాచారానికి మరణశిక్ష చిన్నారులపై సామూహిక అత్యాచా రానికి పాల్పడేవారికి గరిష్ఠంగా మరణ శిక్ష విధిం చేలా కొత్త చట్టాలలో నిబంధన ఉంది.మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించి కొత్త చట్టాలలో ప్రత్యేక అధ్యాయాన్ని కేటాయించారు.
మైనర్లను కొనడం,అమ్మడం కూడా నేరమే.
పెళ్లి పేరుతో లైంగిక దోపిడీకి పదేళ్ల జైలు శిక్ష మహిళలను, బాలికలను పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక దోపిడీకి పాల్పడితే గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష విధించడానికి ఈ కొత్త చట్టాలు వీలు కల్పిస్తున్నాయి.
అలాగే కులం, మతం, జెండర్‌ వంటి కారణాలతో మూక దాడులకు పాల్పడితే యావజ్జీవ కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది.
90 రోజుల వరకు పోలీస్‌ రిమాండ్‌
గతంలో కంటే ఎక్కువ రోజులు పోలీస్‌ రిమాండ్‌ విధించే అవకాశాన్ని కొత్త చట్టాలు కల్పిస్తున్నాయి. 60నుంచి 90రోజుల వరకు రిమాండ్‌ విధిం చొచ్చు.
అయితే, కేసు విచారణకు ముందు ఇలా సుదీర్ఘ కాలం పోలీస్‌ రిమాండ్‌కు అవకాశం కల్పిం చడంపై కొందరు న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవన్నీ ‘ఉగ్రవాదం’ పరిధిలోకే..
ఉగ్రవాద కార్యకలాపాల గురించి తొలిసారి భారతీయ న్యాయ సంహిత (ఇండియన్‌ జ్యుడీషి యల్‌ కోడ్‌)లో ప్రవేశపెట్టారు. గతంలో వీటికి నిర్దిష్ట చట్టాలు ఉండేవి. ఇప్పుడు ఆర్థిక భద్రతకు ముప్పు కలిగించడం కూడా ఉగ్రవాద కార్యకలా పాల పరిధిలోకే తెచ్చారు.
నకిలీ నోట్ల తయారీ, నోట్ల స్మగ్లింగ్‌కు పాల్పడుతూ ఆర్థిక స్థిరత్వానికి హాని కలిగించడం ఉగ్రవాద చట్టం కిందకు వస్తుంది.
ఇప్పుడు,భారత్‌లో ప్రభుత్వం వద్ద తమ డిమాండ్లను నెరవేర్చుకోవడం కోసం వ్యక్తులను నిర్బంధించడం లేదా కిడ్నాప్‌ చేయడం వంటివి కూడా ఉగ్రవాద కార్యకలాపాల కిందకే వస్తాయి.
బాధితుడు ఇకపై నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ ద్వారా జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేయొచ్చు.
జీరో ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం ఎవరైనా పోలీస్‌ స్టేషన్‌ పరిధితో సంబంధం లేకుండా ఎక్కడైనా ఫిర్యాదు చేయొచ్చు.
అరెస్ట్‌ అయిన బాధితుడు ఆ విషయాన్ని తన స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులకు తన పరిస్థితి తెలియజేసే వీలుంటుంది. దీనివల్ల బాధితుడికి తక్షణసాయం లభించే వీలుంటుంది.
అరెస్ట్‌ వివరాలను స్థానిక పోలీస్‌ స్టేషన్‌తోపాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ బహిరంగంగా ప్రదర్శిస్తారు. దీనివల్ల బాధితుల కుటుంబ సభ్యులు, స్నేహితులకు ముఖ్యమైన సమాచారం తెలిసే వీలుంటుంది.
హేయమైన నేరాల్లో వీడియోగ్రఫీ తప్పనిసరి. దీనివల్ల దర్యాప్తులో నాణ్యత పెరిగే అవకాశం ఉంది.
మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో దర్యాప్తు రెండు నెలల్లోనే పూర్తికావాలి. బాధిత మహిళలు, చిన్నారులకు ఉచితంగా ప్రాథమిక చికిత్స, వైద్య చికిత్స అందించాల్సి ఉంటుంది.
సమన్లను ఇకపై నేరుగా వెళ్లి ఇవ్వాల్సిన పనిలేదు. ఆన్‌లైన్‌లో పంపించవచ్చు.
మహిళలపై నేరాల విషయంలో బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా మేజిస్ట్రేట్‌ ఎదుట నమోదు చేయాలి. వారు లేని పక్షంలో మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరచాలి.
బాధితులతోపాటు నిందితులకు కూడా ఎఫ్‌ఐఆర్‌ కాపీ నకలును ఉచితంగా అందిస్తారు. పోలీస్‌ రిపోర్ట్‌, చార్జిషీట్‌, స్టేట్‌మెంట్లు, ఇతర డాక్యుమెంట్లను రెండువారాల్లో పొందొచ్చు.
కేసు విచారణలో అనవసర ఆలస్యాన్ని నివారించేందుకు కోర్టులు గరిష్ఠంగా రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేయాలి.
సాక్షుల రక్షణ పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలుచేయాలి.
అత్యాచార కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి.
మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారితోపాటు 15 ఏళ్లలోపు పిల్లలు,60ఏళ్లకు మించి వయసున్నవారు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. వారు తాము నివసిస్తున్న చోటే పోలీసుల సాయం పొందొచ్చు.

1 2 3 4 11